అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం

Jun 2 2025 1:27 AM | Updated on Jun 2 2025 1:27 AM

అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం

అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం

జనగామ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సమీకృత కలెక్టరేట్‌ ప్రాంగణంలో సర్వం సిద్ధం చేశారు. ఆదివారం డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, ఏఎస్పీ పండేరి చేతన్‌నితిన్‌తో కలిసి కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు చెందిన పలు శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య హాజరు కానున్నారు. ఉదయం 9.45 గంటలకు వేడుకల ప్రాంగణానికి చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివా ళులర్పిస్తారు. 10 నుంచి 10.10 గంటల లోపు జాతీ య జెండాను ఆవిష్కరించిన తర్వాత, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 10.10 నుంచి 10.30 గంటల వరకు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బీర్ల అయిలయ్య ప్రసంగించనున్నారు. అనంతరం పలు సాంసృతిక కార్యక్రమాలు, బహుమతులు అందజేస్తారు.

ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు ఉత్తర్వుల కాపీలు..

జూన్‌ 2 పురస్కరించుకుని నేడు (సోమవారం) ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వుల కాపీలను అతిథుల చేతులు మీదుగా అందిస్తారని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా తెలి పారు. జనగామ నియోజకవర్గానికి సంబంధించి సాయిరాం ఫంక్షన్‌ హాల్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలోని పాలకుర్తి రోడ్డు సిరిపురం గార్డెన్‌, పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని దశరథ గార్డెన్‌లో అతిథుల చేతులమీదుగా ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వు కాపీలను అందిస్తారన్నారు.

ముఖ్యఅతిథిగా హాజరు కానున్న ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement