
కేజీబీవీల్లో విద్యార్థినుల నమోదు పెంచాలి●
● అదనపు కలెక్టర్ పింకేష్కుమార్
జనగామ రూరల్: కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో విద్యార్థినుల నమోదు పెంచాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బుధవారం డీఈఓ భోజన్నతో కలిసి కలెక్టరేట్ నుంచి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో మాట్లాడారు. కేజీబీవీల్లో భద్రతతో కూడిన విద్య, నాణ్య మైన భోజనం, వసతులు కల్పిస్తున్న విషయాన్ని బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రణాళికతో ‘బడిబాట’ నిర్వహించాలని చెప్పారు. ఇంటర్ ఫలితాల గురించి తెలుసుకున్న కలెక్టర్.. పదో తరగతి పాసైన విద్యార్థినులు కేజీబీ వీలోనే ఇంటర్లో వివిధ కోర్సులు తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో బాలికల అభివృద్ధి అధికారి గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.