
సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు తీవ్ర ప్ర భావం చూపుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా తరచూ తీవ్రమైన వడగాల్పులు, కరువు, వరదలు, తుపాన్లు తదితర విపత్కర పరిస్థితులకు దారితీస్తున్నది. ఇవి మానవ ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థపై వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించ డం, పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం, ఇంధన సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరం. – డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్, సామాజిక వేత్త
పర్యావరణ రక్షకులుగా ఉందాం..
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ముందు తరాలకు ఇవ్వాల్సింది ఆస్థిపాస్తులనే కాదు.. స్వచ్ఛమైన పర్యావరణాన్నికూడా. అందుకు మనమంతా పర్యావరణ స్పృహ కలిగి ఉండాలి. మన పిల్లల్లోనూ పర్యావరణంపై అవగాన పెంచాలి. నీరు, నేల, కాలుష్యం కాకుండా చూడాలి. – త్రిపురారి పద్మ, సాహితీవేత్త, రచయిత్రి
●

సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి