
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025
జనగామ: రేషన్ సన్నబియ్యం పంపిణీలో కొత్త చికొచ్చి పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిరుపేదలకు అందించే సన్నబియ్యం పంపిణీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం సీజన్ నేపథ్యంలో ఈనెల నుంచి ఒకేసారి మూడు నెలల కోటాను అందిస్తున్నారు. గతంలో ఒక్క వేలి ముద్రతో ఐదు నిమిషాల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ ముగిసేది. మూడు నెలల బియ్యం ఇచ్చే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వేర్వేరుగా వేలి ముద్ర తీసుకుని కాంటా వేయడంతో తీవ్ర జాప్యానికి కారణమైంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి బియ్యం పంపిణీ పూర్తి చేసేసరికి అరగంటకు పైగా సమయం పడుతుంది. ఈ సమస్యతో జిల్లాలో మొదటి రోజు ఎక్కడా 10 శాతం బియ్యం పంపిణీ కాలేదు.
సమస్య ఎక్కడంటే..
రేషన్ లబ్ధిదారులకు జూన్ మాసం నుంచి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం ఒకేసారి ఇస్తున్నారు. కేంద్రం 5 కిలోలు, రాష్ట్రంలో కిలో చొప్పున ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యం అందిస్తోంది. మూడు నెలల కోటాకు సంబంధించి రేషన్ డీలర్లు లబ్ధిదారుడి నుంచి నెలవారి చొప్పున కేంద్రం, రాష్ట్రం అందించే బియ్యానికి సంబంధించి వేర్వేరుగా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆరు సార్లు తీసుకోవాలి. ఇదే సమయంలో ఈ–పాస్ మిషన్లో సాంకేతిక లోపం, పదిహేను నిమిషా లకు ఒకసారి లాగ్అవుట్ కావడంతో డీలర్లకు బి య్యం పంపిణీ కత్తిమీద సాములా మారిపోయింది. లింగాలఘణపురం మండలంలోని ఓ రేషన్ షాపు లో ఆదివారం ఉదయం 7 గంటలకు బియ్యం పంపిణీ ప్రారంభించగా...మధ్యాహ్నం 3 గంటల వర కు 20 మందికి పంపిణీ చేయలేకపోయారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షించి ఓపిక లేక వెళ్లిపోతే, డీలర్లు సైతం దుకాణాలను మూసి వేశారు. చిల్పూరు మండల పరిధిలో 9 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్లో సాంకేతిక లోపంతో పంపిణీ నేటికి (సోమవారం) వాయిదా వేశా రు. ఈ పాస్లో 3.2 వెర్షన్ ఎలక్ట్రానిక్ కాంటాకు బ్లూటూత్ కనెక్షన్తో సమస్య తీవ్రమవుతోంది. ఈ వెర్షన్తో పాటు కాంటాకు బ్లూటూత్ అనుసంధానాన్ని తొలగించాలని మెజార్టీ డీలర్లు కోరుతున్నారు.
రేషన్ షాపులకు చేరుకున్న సరుకు
జిల్లాలో 335 రేషన్ దుకాణాలు ఉండగా, మూడు నెలల సన్నబియ్యం కోటా 90,140 క్వింటాళ్లు కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 175 షాపులకు 24,336 క్వింటాళ్ల సన్నబియ్యం పంపించగా, ఇంకా 165 దుకాణాలకు 65,810 క్వింటాళ్ల సరుకు పోవాల్సి ఉంది.
ఆరుసార్లు వేలిముద్ర వేశా..
రేషన్ బియ్యం తీసుకెళ్తామని తండా నుంచి మండల కేంద్రానికి వస్తే బియ్యం తీసుకునేందుకు రెండు గంటల సమయం పట్టింది. నెలకు 30 కిలోల చొప్పున 3 నెలలకు సంబంధించి 90 కిలోల బియ్యం తీసుకునేందుకు ఆరుసార్లు వేలిముద్ర వేశా.
– గుగులోత్ స్వామి,
గుమ్ముల బండ తండా, కొడకండ్ల
ఇబ్బందిగా ఉంది..
ప్రభుత్వం చేపట్టిన రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ రేషన్ డీలర్లకు తలనొప్పిగా మారింది. నూతన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ సమస్యగా ఉంది. మూడు నెలల బియ్యానికి కేంద్ర ప్రభుత్వానికి మూడుసార్లు, రాష్ట్ర ప్రభుత్వానికి మూడు సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మాదిరిగా ఇలాంటి పద్ధతులను డీలర్లకు చెప్పడం బాధాకరం.
– గట్టు మొగిళిగౌడ్, డీలర్ల సంఘం
డివిజన్ అధ్యక్షుడు, స్టేషన్ఘన్పూర్
అరగంట సమయం పడుతుంది..
ఒకేసారి మూడునెలల బియ్యం ఇవ్వడంతో ఒక్కొక్క కార్డు హోల్డ ర్కు అరగంటకు పైగా సమయం పడుతోంది. కేంద్రం అందించే ఐదు కిలోలు, రాష్ట్రం ఇచ్చే ఒక కిలో బియ్యానికి వేర్వేరుగా వేలిముద్ర తీసుకుంటున్నాం. పైగా బియ్యం పంపిణీ చేసే సమయంలో యాప్ మోరాయిస్తుంది.
– వల్లాల ప్రసన్న, రేషన్ డీలర్,
గోపాల్నగర్, బచ్చన్నపేట
●
న్యూస్రీల్

సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025