జిల్లా కోర్టులో అవతరణ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా కోర్టులో అవతరణ వేడుకలు

Jun 3 2025 5:31 AM | Updated on Jun 3 2025 5:31 AM

జిల్ల

జిల్లా కోర్టులో అవతరణ వేడుకలు

జనగామ రూరల్‌: జిల్లా కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌ జడ్జి సుచరిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెండో తరగతి మెజిస్ట్రేట్‌ వెంకట్రాంనర్సయ్య, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రం సీజ్‌

బచ్చన్నపేట : మండల కేంద్రంలోని ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి విద్యాకర్‌ రెడ్డి, ఎంఆర్‌ఐ వంశీకృష్ణ సోమవారం సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆగ్రోస్‌ యజమాని కామిడి శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సబ్సిడీపై అందించే జీలుగ విత్తనాలను అడ్డదారిన ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించాడని తెలిపారు. జీలుగ విత్తనాలను తొర్రూరు వద్ద అక్కడి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఆగ్రోస్‌ కేంద్రంలోని జీలుగ విత్తనాలను పీఏసీఎస్‌ గోదాములకు తరలించి ఆగ్రోస్‌ సేవా కేంద్రం, గోదామును సీజ్‌ చేశామన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా మనోహర్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ కాలే జీ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న హిస్టరీ విభా గం ప్రొఫెసర్‌ టి.మనోహర్‌కు వర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రిజిస్ట్రార్‌ రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది లా ఉండగా.. హనుమకొండలోని యూనివర్సి టీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న ఆచార్య ఎస్‌.జ్యోతికి ఆ కాలేజీ సమీ పాన ఉన్న వర్సిటీ మహిళా పీజీ కాలేజీ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రిజిస్ట్రార్‌ రామచంద్రం ఉత్తర్వులు ఇచ్చారు.

ప్రాంగణ నియామకాలు

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని డీఎస్‌కే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఫ్రంట్‌ అండ్‌ డెవలపర్లుగా ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన ఆరుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు అందులో డి.సత్యారెడ్డి, ఎం.సాయిపవన్‌, ఎస్‌.అరవింద్‌, టి.పుష్కరాణి, ఎం.మనస్విని, ఎ.వర్షిత ఎంపికై పట్లు కొత్తగూడెం కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జగన్‌మోహన్‌రాజు కేయూలో తెలిపారు. ఒక్కొక్కరికి వార్షిక వేతనం రూ.6లక్షలు ఉంటుందని, తొలుత మూడునెలలపాటు శిక్షణ కూడా ఇస్తారని, అనంతరం హైటెక్‌ సిటీలోని డీఎస్‌కే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పూర్తిస్థాయిలో పనిచేయాల్సింటుందన్నారు. ఆయా విద్యార్థులకు నియమాక పత్రాలను సోమవారం యూనివర్సిటీలో కేయూ వీసీ ప్రొఫెసర్‌ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.రామచంద్రం, ఆ కాలేజీ ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.రాము, కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్‌ చిర్ర రాజు పాల్గొన్నారు.

నియామకం

కేయూ క్యాంపస్‌ : హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రొఫెసర్‌ నర్సింహాచారి నియమితులయ్యారు. వీసీ ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్‌ పి.వరలక్ష్మి నుంచి నర్సింహాచారి బాధ్యతలను స్వీకరించనున్నారు.

జిల్లా కోర్టులో  అవతరణ వేడుకలు
1
1/1

జిల్లా కోర్టులో అవతరణ వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement