సంక్షేమం.. అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం.. అభివృద్ధి

Jun 3 2025 5:31 AM | Updated on Jun 3 2025 5:31 AM

సంక్ష

సంక్షేమం.. అభివృద్ధి

మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2025
‘ఇందిరమ్మ’ ప్రొసీడింగ్స్‌ పంపిణీలో గందరగోళం

IIలోu

జనగామ: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమం.. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, రైతులు, పేదలకు భరోసా కల్పిస్తున్నట్లు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్లు పింకేష్‌ కుమార్‌, రోహిత్‌ సింగ్‌, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, ఏసీపీ పండేరి చేతన్‌ నితిన్‌తో కలిసి కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా.. విప్‌కు స్వాగతం పలికారు. విప్‌ అయిలయ్య అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన తర్వాత, జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర వీరుల త్యాగఫలితమే ప్రత్యేక రాష్ట్రమన్నారు.

సంక్షేమ పథకాల జాతర

పేద కుటుంబాల్లో విద్యా వెలుగుల నింపాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్‌లో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. బాలిక విద్యను బలోపేతం చేసేందుకు జిల్లాలోని 12 కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఇంటర్‌ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో రూ.9.25 కోట్లతో 320 పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 కోట్ల 4లక్షల92వేల85వేల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ ఉచిత ప్రయాణం చేశారని, దీని ద్వారా సంస్థకు రూ.97.80 కోట్ల మేర ఆదాయం సమకూరిందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 76,403 మంది మహిళా కుటుంబాలకు రూ.500 కే సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నట్లు తెలిపారు. ఉచిత విద్యుత్‌ సరఫరాతో 91,669 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, ఇప్పటి వరకు 1,42,763 జీరో బిల్లులు జారీ చేశామన్నారు. పంట రుణమాఫీ ద్వారా 59,718 రైతులకు రూ.523 కోట్ల 89 లక్షల మేర రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ కోసం మండలాల పరిధిలో 12 పైలట్‌ గ్రామాలను ఎంపిక చేసి 71 6, ఫేస్‌–2లో 5,308 గృహాలు మంజూరైనట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు డబ్బులు చెల్లించడంలో జనగామ జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించాలనే ఉద్దేశంతో తొలిసారిగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కులగణన సర్వేను చేపట్టిన ఘనత తమకే దక్కుతుందన్నారు. జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు ద్వారా 2,355 మంది రైతులకు రూ.3.87కోట్ల రాయితీ అందించినట్లు చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు పథకంలో రూ.2,743 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 2,94,000 ఎకరాల ఆయకట్టు లక్ష్యం ఉండగా, ప్రస్తుతం లక్ష 50వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామన్నారు.

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

జిల్లా మెడికల్‌ కళాశాల సొంతభవన పనులు 60 శాతం పూర్తయ్యాయని అన్నారు. వైద్యారోగ్య శాఖను బలోపేతం చేసే క్రమంలోనే ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన 58 మంది నర్సింగ్‌ ఆఫీసర్లు, 18 మంది వైద్యుల నియామకం చేపట్టిందన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ స్కీంలో 40 మంది నిరుద్యోగులకు మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, నర్సింగ్‌ ఆఫీసర్ల నియామకం జరిగిందన్నారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ట్రాన్సెండర్లకు ప్రత్యేకంగా ట్రా్‌న్స్‌ క్లినిక్‌ ఏర్పాటు చేశామన్నారు.

మహిళాభివృద్ధికి పెద్దపీట

మహిళల ఆర్థిక బలోపేతానికి జిల్లాలో ఇప్పటి వరకు 1,28,583 గ్రామీణ మహిళలతో 11,249 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో నంబర్‌ వన్‌గా నిలిచామన్నారు. బ్యాంక్‌ లింకేజీ, సీ్త్ర నిధి ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 9,278 సంఘాలకు రూ.476 కోట్లు లక్ష్యం నిర్ధేశించగా, 5,277 సంఘాలకు రూ.485 కోట్ల మేర బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇవ్వగా, 8,997 స్వయం సహాయక సంఘాలకు రూ.25.43కోట్ల వడ్డీని తిరిగి చెల్లించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జనగామ ఏఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాంబాబు, ఆర్డీఓ గోపీరామ్‌, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

రైతులు.. పేద కుటుంబాలకు

ప్రభుత్వ భరోసా

తెలంగాణ రైజింగ్‌–2047

లక్ష్యాలకు ప్రాధాన్యం

మహిళాశక్తి క్యాంటీన్లతో ఆర్థికాభివృద్ధి

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

జిల్లాలో అంబరాన్నంటిన ఆవిర్భావ సంబురాలు

భూ భారతితో రైతులకు అండ

భూ సంబంధిత సమస్యలకు శాశ్వతంగా చెక్‌ పెట్టాగలనే సంకల్పంతో భూ భారతిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికి చేసి ఊరూరా రెవెన్యూ సదస్సులను నిర్వహించగా, 1902 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. నేటి నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

– మరిన్ని ఫొటోలు II, IIIలో u

సంక్షేమం.. అభివృద్ధి 1
1/5

సంక్షేమం.. అభివృద్ధి

సంక్షేమం.. అభివృద్ధి 2
2/5

సంక్షేమం.. అభివృద్ధి

సంక్షేమం.. అభివృద్ధి 3
3/5

సంక్షేమం.. అభివృద్ధి

సంక్షేమం.. అభివృద్ధి 4
4/5

సంక్షేమం.. అభివృద్ధి

సంక్షేమం.. అభివృద్ధి 5
5/5

సంక్షేమం.. అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement