సేఫేనా..? | - | Sakshi
Sakshi News home page

సేఫేనా..?

Jun 6 2025 6:25 AM | Updated on Jun 6 2025 6:25 AM

సేఫేన

సేఫేనా..?

శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2025
హోటల్‌ ఫుడ్‌

పట్టణంలోని

ఓ బేకరీ నిర్వహణ ఇలా..

పట్టణంలో అధ్వానంగా హోటళ్ల నిర్వహణ

మురికి కూపాలను తలపిస్తున్న కిచెన్‌ షెడ్లు

నిల్వ చేసిన చికెన్‌, మటన్‌ విక్రయాలు

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ కరువు

జనగామ:

హోటల్‌కు వెళ్లి ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ టిఫిన్లు లాగిస్తున్నారా.. అయితే ఒకటికి రెండు సార్లు చూసుకుని తినండి.. చట్నీలో బల్లి, బొద్దింక ఇంకా ఏమైనా రావచ్చు.. జంతు అవశేషాలు కనిపిస్తే నిర్వాహకులు సింపుల్‌గా కొట్టి పారేస్తారు. నిలదీస్తే దబాయిస్తారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌ నుంచి టిఫిన్‌తోపాటు తీసుకెళ్లిన చట్నీలో బల్లి అవశేషాలు కనిపించగా అడిగిన విని యోగదారుడికి ‘కొత్తిమీట కట్ట, ఆకు కూర’ అయి ఉండొచన్నారు. గట్టిగా నిలదీస్తే దబాయించారు. సోమవారం పట్టణంలో జరిగిన ఘటన హోటళ్లకు నిర్వహణకు అద్దం పడుతోంది.

ప్రజల ఆరోగ్యం గాలికి..

పట్టణంలోని హోటళ్ల నిర్వాహకులకు సంపాదనే లక్ష్యంగా మారింది. ప్రజల ఆరోగ్య భద్రతను గాలికి వదిలేశారు. ఆహార పదార్థాలు, తిను బండారాల తయారీలో నిబంధనలు పాటించకుండా కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. టేస్టీ కోసం బిర్యానీలో రంగులు, ఫాస్ట్‌ఫుడ్‌లో హానికరమైన లిక్విడ్స్‌ కలుపుతూ కొత్త రోగాలకు కారకులవుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కిచెన్‌ షెడ్లు మురికి కూపాలను తలపిస్తున్నాయి. వడ, మిర్చి, దోష, పూరీ తదితర పిండి వంటల తయారీ ముడికి సరుకును అపరిశుభ్రత వాతావరణంలో ఉంచుతున్నారు. బల్లులు, బొద్దింకలు, ఇతర క్రిమి కీటకాలు సంచరిస్తున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసిన చికెన్‌, మటన్‌ కర్రీలను వినియోగదారులకు అంటగడుతున్నారు. కుళ్లిన వంటకాలు, జంతు అవశేషాలు, అపరిశుభ్రత కని పించిన కస్టమర్లు ఫిర్యాదు చేస్తే కనీస చర్యలు ఉండడం లేదు. ప్రత్యేకంగా ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వచ్చి ఎంతో కొంత జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు. ల్యాబ్‌కు పంపిస్తామని శాంపిళ్ల పేరిట సేకరిస్తున్న ఆ పదార్థాలకు సంబంధించిన రిపోర్టుల జాడే ఉండడం లేదు. గతంలో నెహ్రూపార్కు ఏరియాలోని రాఘవేంద్ర టిఫిన్‌ సెంటర్‌, సాయిక్రిష్ణ హోటల్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, దాబాలు, రెస్టారెంట్లు తదితర వాటిలో కుళ్లిన మాసం వంటకాలు, జంతు అవశేషాలతో చట్నీ బయటపడడంతో జరిమానా మినహా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల మోర్‌ సూపర్‌ మార్కెట్‌లో కాలం చెల్లిన బలవర్థకమైన ఆహార ప దార్థాలు విక్రయించగా జరిమానాతో సరిపుచ్చారు.

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో అధ్వానం

జిల్లా కేంద్రంలోని పలు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో విక్రయిస్తున్న చికెన్‌ ఎంత వరకు సేఫ్‌ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చికెన్‌ సెంటర్ల వద్ద కటింగ్‌ చేసే సమయంలో పడేసే వేస్టేజ్‌ను తీసుకు వచ్చి ఫ్రైడ్‌రైస్‌, నూడిల్స్‌ తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రాత్రి మిగిలిన వంట కాన్ని రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి మరుసటి రోజు వేడి చేసి అమ్ముతున్నారు.

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

హోటళ్ల నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే చర్యలు కఠినంగా ఉంటాయి. సోమవారం చట్నీలో బల్లి అవశేషాలు వచ్చిన సాయిక్రిష్ణ హోట ల్‌కు గతంలోనూ రూ.5వేల జరిమానా వేశాం. ప్రస్తుతం కస్టమర్‌ ఫిర్యాదుతో ల్యాబ్‌కు పంపించి రెండు రోజులు హోటల్‌ను సీజ్‌ చేశాం. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం అయితే హోటల్‌ శాశ్వతంగా మూసివేస్తాం. ఈ మేరకు యజమానితో లిఖిత పూర్వకంగా తీసుకున్నాం.

– చేవూరి కృష్ణమూర్తి,

గెజిటెడ్‌ ఫుడ్‌సేఫ్టీ అధికారి, వరంగల్‌

న్యూస్‌రీల్‌

ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌లు ఉన్నాయా..?

పట్టణంలో చాలా హోటళ్లకు ట్రేడ్‌ లైసెన్స్‌లు, ఫుడ్‌ సేఫ్టీ అనుమతులు లేవని తెలుస్తున్నది. కనీసం ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌ లేని హోటళ్లపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆహార భద్రత అధికారులు వచ్చి తనిఖీ చేసిన దాఖలాలూ కనిపించవు. ఒక వేళ ఎవరైనా వినియోగదారులు ఫిర్యాదు చేస్తే మొక్కుబడిగా వచ్చి జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు.

సేఫేనా..?1
1/5

సేఫేనా..?

సేఫేనా..?2
2/5

సేఫేనా..?

సేఫేనా..?3
3/5

సేఫేనా..?

సేఫేనా..?4
4/5

సేఫేనా..?

సేఫేనా..?5
5/5

సేఫేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement