నిర్ణీత సమయంలో లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత సమయంలో లక్ష్యాలు సాధించాలి

Jun 6 2025 6:13 AM | Updated on Jun 6 2025 6:13 AM

నిర్ణీత సమయంలో లక్ష్యాలు సాధించాలి

నిర్ణీత సమయంలో లక్ష్యాలు సాధించాలి

జనగామ రూరల్‌: నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వనమహోత్స వం, జలశక్తి అభియాన్‌, సీజనల్‌ వ్యాధులు తది తర అంశాలపై సంబంధిత అధికారులతో ఏర్పా టు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ పింకేష్‌ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వనమహోత్సవంపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని చెప్పారు. జీపీలు, హాస్టళ్లు, స్కూళ్లు, గ్రంథాలయాలు, పీహెచ్‌సీలు, పశువైద్య కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు, రైతు వేదికలు, అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. ‘బడిబాట’ నిర్వహించే గ్రామ సభల్లో వనమహోత్సవం ఆవశ్యకతతో పాటు జాతీయ కుటుంబ లబ్ధి పథకంపై వివరించాలని చెప్పారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడానికి సోక్‌ పిట్‌, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా వంటి వ్యాధులు ప్రభల కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటిలో క్లోరినేషన్‌ చేయాలని, దోమల నివారణకు మురికివాడల్లో ఫాగింగ్‌ చేయించాలని చెప్పారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ మాధురి షా, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, ఆయా శాఖల జిల్లా అధికారులు మల్లి కార్జునరావు, రామారావునాయక్‌, రాధాకిషన్‌, శ్రీధర్‌, రవీందర్‌, అనిత పాల్గొన్నారు.

‘భూ భారతి’ చట్టం రైతులకు వరం

జఫర్‌గఢ్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘భూ భారతి’ చట్టం రైతులకు వరం లాంటిదని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. కోనాయిచలంలో గురువారం నిర్వహించిన భూ భారతి గ్రామ సభను ఆయన సందర్శించారు. ఆర్డీఓ డీఎస్‌ వెంకన్న, తహసీల్దార్‌ శంకరయ్య, డిప్యూటీ తహసీ ల్దార్‌ అనిల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

జఫర్‌గఢ్‌: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేసినట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. లబ్ధిదారులు కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించా రు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గురువారం పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడు తూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇందిర మ్మ రాజ్యంలో పేదలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని చెప్పారు. ఆర్డీఓ డీఎస్‌ వెంకన్న, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లావణ్య శిరీష్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నూకల ఐలయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ తీగల కర్ణాకర్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement