స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి వంద రోజుల ప్రత్యేక ప్రణాళికతో పని చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్గౌడ్ తెలిపారు. వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అంశాలపై మున్సిపాలిటీ పరిధిలోని ఘన్పూర్లో సోమవారం ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్యాలయంలో కమిషనర్ విలేకర్లతో మాట్లాడుతూ.. వివరాలు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాలు, ఇంటిపన్నుల వసూళ్లు తదితర అంశాలపై వంద రోజుల ప్రత్యేక యాక్షన్ప్లాన్ తయారు చేశామన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, వార్డుల వారీగా డ్రెయినేజీలను శుభ్రం చేయడం, డ్రెయినేజీలు లేనిచోట్ల నిర్మాణాలు చేపట్టడం, పిచ్చిమొక్కలు తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు నల్లాల ద్వారా సక్రమంగా నీరు అందించేలా ప్రత్యేక చొరవతో పనిచేస్తామన్నారు. పైప్లైన్ల మరమ్మతులు, లీకేజీలను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. వీధిదీపాల సక్రమ నిర్వహణతోపాటు ఏమైనా సమస్యలుంటే పరిష్కరించే దిశగా పనిచేస్తామన్నారు. ప్రజల నుంచి వంద శాతం ఇంటిపన్నులు వసూలు చేస్తామని, భువన్యాప్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలోని ఇళ్లు, స్థలాలను జియో ట్యాగ్ చేయనున్నట్లు తెలిపారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, క్లీన్ అండ్ గ్రీన్పై దృష్టి సారిస్తామని తెలిపారు.
కమిషనర్ రవీందర్గౌడ్