సోమేశ్వరాలయంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

సోమేశ్వరాలయంలో భక్తుల సందడి

May 8 2025 9:07 AM | Updated on May 8 2025 9:07 AM

సోమేశ

సోమేశ్వరాలయంలో భక్తుల సందడి

పాలకుర్తి టౌన్‌: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, కొడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

హుండీ ఆదాయం రూ.97,143

వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ. 97,143 వచ్చినట్లు ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు 48 రోజుల ఆదాయాన్ని బుధవారం ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప్పలమ్మ టెంపుల్‌ ఈఓ కేకే రాములు పర్యవేక్షణలో లెక్కించారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

బెట్టింగ్‌లకు దూరంగా

ఉండాలి: ఎమ్మెల్యే

జనగామ రూరల్‌: యువత క్రికెట్‌ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్టిన్‌ గ్రౌండ్‌లో ఎర్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎర్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత ఆటలతో ఉత్సాహంగా ఉంటారన్నారు. ప్రస్తుతం సమాజాన్ని డ్రగ్స్‌, గంజాయి, బెట్టింగ్‌లు పట్టి పీడిస్తున్నాయని యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్‌ యాప్స్‌ పాల్పడొద్దన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలు, ప్రవర్తనపై శ్రద్ధ పెట్టాలన్నారు.

మార్కెట్‌ సిబ్బందికి డ్రెస్‌కోడ్‌

జనగామ/జనగామ రూరల్‌: జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ పాటించి విధులకు హాజరు కావాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌ సూచించారు. బుధవారం సెక్యూరిటీ గార్డులకు నూతన యూనిఫామ్స్‌ను అందజేశారు. వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులు, ప్రజలకు కమిటీ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. మార్కెట్‌కి భవిష్యత్‌లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఏఎంసీకి లాభాలు వచ్చే విధంగా ప్రణాళికలు తయారుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సూపర్‌వైజర్లు బోట్ల శ్రీనివాస్‌, డైరెక్టర్లు బోట్ల నర్సింహారావు, బంద కుమార్‌, పర్శ సిద్దేశ్‌, అడ్తి అసోసియేషన్‌ అధ్యక్షుడు మాశెట్టి వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.

క్యాడ్‌, క్యామ్‌ ల్యాబ్‌

ఎంతో ఉపయోగకరం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సి టీలోని ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజిలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఏర్పాటుచేసిన కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌(క్యాడ్‌) అండ్‌ కంప్యూటర్‌ ఎయిడెడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌(క్యామ్‌) ల్యాబ్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. ల్యాబ్‌ను బుధవారం రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రంతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక డిజైన్‌ ప్లానింగ్‌తో ఏర్పాటుచేసి ల్యాబ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌తో పాటు బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణ మాట్లాడుతూ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ రెండు విడతల్లో అందించిన కంప్యూటర్లతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు మనిషా, సాబూ, పద్మజ, రమణి, ముత్యం వంశీలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధిపతి డాక్టర్‌ సీహెచ్‌.రాధిక, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ బి.నేతాజీ, లైబ్రరీ అసిస్టెంట్‌ డాక్టర్‌ ఎస్‌.సుజాత పాల్గొన్నారు.

సోమేశ్వరాలయంలో  భక్తుల సందడి1
1/3

సోమేశ్వరాలయంలో భక్తుల సందడి

సోమేశ్వరాలయంలో  భక్తుల సందడి2
2/3

సోమేశ్వరాలయంలో భక్తుల సందడి

సోమేశ్వరాలయంలో  భక్తుల సందడి3
3/3

సోమేశ్వరాలయంలో భక్తుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement