
హామీలను పక్కన బెట్టి అందాల పోటీలా?
● సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
జనగామ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన బెట్టి, అందాల పోటీలతో ఊరేగుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జనగామరూరల్, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు రూ.20.46 లక్షల విలువైన సీ ఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 10ఏళ్లలో బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో తాగు, సాగునీరు, రైతుబంధు, బీమా, పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ పోయాయని, అందాల పోటీల పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరో పించారు. జనగామ ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులను కాకుండా నీలిమ ఆస్పత్రికి రోజుకు సుమారు 350 మంది వరకు ఆరోగ్య పరీక్షల కోసం వెళ్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ ఆరోగ్య సేవలు అందిస్తూ కాపాడుకుంటామన్నారు. బడ్జెట్ లేదని బదనాం చేస్తూ కేసీఆర్ను ఇబ్బందులకు గురిచేయడమే తప్ప, ఒక్క ఎకరానికి సాగునీరు అందించేదిలేదన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జము న లింగయ్య, రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, మాజీ ఎంపీపీ మేకల కలింగరా జు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి, అ నిల్రెడ్డి, జూకంటి శ్రీశైలం, గంగం సతీష్రెడ్డి, ము స్త్యాల దయాకర్, సందీప్ తదితరులు ఉన్నారు.