శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

May 27 2025 1:02 AM | Updated on May 27 2025 1:02 AM

శిక్ష

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

జనగామ: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భూ భారతి భూమి హక్కుల రికార్డు చట్టం–2025ను అమల్లోకి తీసుకొచ్చినట్లు రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ పేర్కొన్నారు. సోమవారం జనగామ మండలం య శ్వంతాపూర్‌ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల 50 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రాంభించారు. అనంతరం శిక్షణ తీసుకుంటున్న సర్వేయర్లకు మెటీరియల్‌ను అందించి మాట్లాడారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లుగా శిక్షణ పొందేందుకు ఐటీఐ, సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసిన 225 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. వీరికి 50 రోజుల పాటు అనుభవజ్ఞులైన సర్వేయర్లతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. భూమి హద్దులు, రెవెన్యూ చట్టాలు, హక్కులు, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. భూముల లావాదేవీలు జరిగిన సమయంలో సర్వే చేసి, హద్దులను నక్షాలో పొందుపరిచిన తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. దీంతో తగాదాలకు అవకాశం ఉండదన్నారు. సర్వేయర్లు శిక్షణను సద్విని యోగం చేసుకుని, రైతులు, ప్రజలకు న్యాయం చేసే విధంగా అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ధ్రువీకరణ పత్రం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే డిపార్టుమెంట్‌ ఏడీ మన్యంకొండ అధికారులు ఉన్నారు.

సోమేశ్వరాలయంలో పూజలు

పాలకుర్తి టౌన్‌: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వైశాఖ మాసం చివరి అమవాస్య కావడంతో సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కొడె మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా ఈఓ సల్వాది మోహన్‌బాబు ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

29న వైద్యుల పోస్టుల

నియామకానికి ఇంటర్వ్యూలు

జనగామ: జిల్లాలోని వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 29న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీసీహెచ్‌ఎస్‌ వీరాంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో అర్హత కలిగిన ముగ్గురు వైద్యులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో గైనకాలజిస్టు, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ పోస్టులకు అర్హత, అనుభవం కలిసిన అభ్యర్థులు ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్‌లోని రెండవ అంతస్తు, రూమ్‌ నంబర్‌–16లో జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

సప్లిమెంటరీ పరీక్షలకు

103 మంది గైర్హాజరు

జనగామ రూరల్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 103 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్‌ తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షలో మొదటి సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ మొత్తం 1,111 విద్యార్థులకు గాను 1,033 మంది హాజరు కాగా 78 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం రెండో సంవత్సరం జరిగిన పరీక్షకు మొత్తం 417 గాను 392 విద్యార్థులు హాజరు కాగా 25 మంది గైర్హాజరయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌గఢ్‌, జనగామ పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ సందర్శించగా కొడకండ్ల, దేవరుప్పుల పరీక్ష కేంద్రాలను డీఐఈఓ, డెక్‌ సభ్యులు సందర్శించారు.

టీచర్ల శిక్షణ శిబిరం మార్పు

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో మంగళవారం(నేడు) నుంచి 31 వరకు నిర్వహించనున్న ఉన్నత పాఠశాలల టీచర్లకు శిక్షణకు సంబంధించి శిబిరాన్ని హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట వద్ద గ్రీన్‌వుడ్‌ పాఠశాలకు మార్చినట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉపాధ్యాయులకు, అలాగే ఉమ్మడి జిల్లాలోని భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు తొ లుత పెద్దపెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో శిక్షణ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అని వార్యకారణాలతో శిక్షణ వేదిక మార్చినట్లు పే ర్కొన్న డీఈఓ.. ఈ విషయాన్ని సంబంధిత ఉపాధ్యాయులు గమనించాలని కోరారు.

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి1
1/1

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement