
నంబర్
నగదు చెల్లింపుల్లో...
రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల్లో జనగామ ముందంజ
జనగామ: ధాన్యం కొనుగోళ్ల నగదు చెల్లింపులో జిల్లా రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలుస్తోంది. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన జిల్లాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్లో రైతుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయిస్తూ.. అన్నదాతలకు పూర్తి భరోసా కల్పించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పీఏసీఎస్, ఐకేపీ సెంటర్లు 276 (దొడ్డు, సన్నరకం) ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత నెల 19వ తేదీ వరకు వందశాతం సెంటర్లు ప్రారంభం కాగా.. కొనుగోళ్లు పట్టాలెక్కాయి. యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి కరువు నేపధ్యంలో 25 శాతం మేర పంట దిగుబడి తగ్గినట్లు అంచనా వేశారు. జిల్లాలో ప్రభుత్వ సెంటర్లు ప్రారంభం కాకముందు జనగామ వ్యవసాయ మార్కెట్తో పాటు మండల కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారం జోరుగా సాగింది. జనగామ ఏఎంసీలో 20 రోజులు పాటు రికార్డు స్థాయిలో ధాన్యం సరుకు వచ్చింది. ఒకదశలో సరకు అంచనాలకు మంచి దాటి పోవడంతో కొనుగోలు భారంగా మారింది. ప్రభుత్వ సెంటర్లను ప్రారంభించడంతో మార్కెట్కు వచ్చే సరుకు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. క్వింటా ధాన్యం ఏ గ్రేడు రూ.2,320 మద్దతు ధర ఉండడంతో.. మెజార్టీ రైతులు తమ సరుకును కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తున్నారు. ముందస్తుగా అధికారులు వేసుకున్న అంచనాలకు మించి సెంటర్లకు ధాన్యం వచ్చినప్పటికీ.. కొనుగోళ్లలో ఎక్కడా కూడా అవాంతరాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నేటికి ధాన్యం కోతలు జరుగుతుండడంతో మరో 15 రోజుల పాటు ధాన్యం వచ్చే అవకాశం ఉంది.
వికారాబాద్ జిల్లా చివరిస్థానం..
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల నగదు చెల్లింపుల్లో జిల్లా 82.24 శాతంతో మొదటి స్థానంలో నిలువగా, రెండో స్థానంలో పెద్దపల్లి జిల్లా 81.63, మూడవ స్థానంలో ఖమ్మం 78.65, నాలుగవ స్థానంలో నిజామాబాద్ 74.37, వికారాబాద్ జిల్లా 65శాతంతో చిట్ట చివర స్థానంలో నిలిచింది.
ఓపీఎంఎస్లో ఎప్పటికప్పుడు..
జిల్లాలో ప్రభుత్వ ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో ఇప్పటి వరకు 16,192 మంది రైతుల వద్ద సన్న, దొడ్డు రకం ధాన్యం 80,990 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు గాను రూ.192.63 కోట్లు రైతులకు నగదు రావాల్సి ఉండగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.127.84 కోట్ల మేర వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇంకా రూ.64.79 కోట్లు రావాల్సి ఉంది. సెంటర్ల వారీగా కొనుగోలు చేసిన ధాన్యంలో 75,518 మెట్రిక్ టన్నుల సరుకు రైస్ మిల్లుకు తరలించగా, ఇంకా 11,030 మెట్రిక్ టన్నుల సరుకు సెంటర్లలో ఉంది. సన్న ధాన్యం 10,186 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేయగా, అసలు నగదు బ్యాంకులో జమ కాగా, రూ.500 బోనస్ రావాల్సి ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్లో వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఆన్లైన్ చేయడంతో రైతులకు వచ్చే నగదును త్వరగా బ్యాంకులో జమ చేయగలిగారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు వివరాలు
80వేల మెట్రిక్ టన్నుల
సన్న,దొడ్డు ధాన్యం
కొనుగోలు
రైతుల ఖాతాల్లో రూ.127 కోట్లు జమ
కొనుగోళ్లపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
సంతోషంలో అన్నదాతలు

నంబర్

నంబర్