సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి

Dec 28 2025 8:29 AM | Updated on Dec 28 2025 8:29 AM

సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి

సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి

జనగామ: సమాచార హక్కు చట్టంపై అధికారులకు అవగాహన ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని స మావేశం హాలులో మర్రి చెన్నారెడ్డి మానవ వనరు ల అభివృద్ధి సంస్థ వరంగల్‌, రీజినల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల అధికారులకు ఆర్‌టీఐ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కుచట్టం పౌరులకు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం పొందే హ క్కును కలిగి ఉందన్నారు. ప్రతీ కార్యాలయంలో పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌, అప్పీలేట్‌ అథారిటీలు ద రఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. రీ జినల్‌ ట్రైనింగ్‌ మేనేజర్‌ మార్గం కుమారస్వామి, ట్రైనర్‌ మోహన క్రిష్ణ, జిల్లా కో ఆర్డినేటర్లు ఆర్‌టీఐపై అవగాహన కలిగించారు.

అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement