గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025

May 1 2025 1:11 AM | Updated on May 1 2025 1:11 AM

గురువ

గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025

ఫలితాల నమోదు ఇలా..

జిల్లాలో మొత్తం 180 పాఠశాలలు ఉండగా.. అందులో ఎయిడెడ్‌ 93.2 శాతం, జెడ్పీ 98.11, సర్కారు స్కూళ్లు 98.80, ఆశ్రమ, మోడల్‌ 98.98, కేజీబీవీలు 99.07, ప్రైవేట్‌ 99.28, సోషల్‌ వెల్ఫేర్‌ 99.32, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 99.34, బీసీ వెల్ఫేర్‌, రెసిడెన్షియల్‌, మైనార్టీ పాఠశాలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. వంద శాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ స్కూళ్లు 127 ఉన్నాయి.

‘పది’ ఫలితాల్లో 98.81శాతం ఉత్తీర్ణత

రాష్ట్రంలో జిల్లాకు మూడో స్థానం

గత ఏడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత

వంద శాతం సాధించిన పాఠశాలలు 127

జనగామ రూరల్‌: పదో తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు హవా కొనసాగించారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా 98.81 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌, పాఠశాలలు, మైనార్టీ, కస్తూర్బాగాంధీ, సాంఘిక సంక్షేమ, మహాత్మాజ్యోతిబా పూలే, బీసీ వెల్ఫేర్‌, ఆశ్రమ, ఎయిడెడ్‌, మోడ ల్‌, గిరిజన పాఠశాలలు మొత్తం 180 ఉండగా.. 6,234 మంది టెన్త్‌ విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,160 మంది ఉత్తీర్ణత సాధించగా.. వీరిలో బాలు రు 2,948, బాలికలు 3,212 ఉన్నారు. 2018–19 విద్యాసంవత్సరం 97 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకుని రాష్ట్రంలో ముందంజలో ఉన్న జిల్లా గత ఏడాది 98.16 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా.. ఈసారి 3వ స్థానంలో నిలిచింది.

కలెక్టర్‌ కృషితో మెరుగైన స్థానం

పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లాను ఉత్తమంగా నిలపాలనే కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా సంకల్పం నెరవేరింది. పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ‘విజయోస్తు’ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేసే ప్రక్రియ ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, గురుకులాల్లో ఉదయం, సాయంత్రం సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థుల ను పరీక్షలకు సన్నద్ధం చేశారు.

జెడ్పీ విద్యార్థుల ప్రతిభ

టెన్త్‌ ఫలితాల్లో పట్టణంలోని ధర్మకంచ విద్యార్థులు ప్రతిభ చాటారు. మొత్తం 53 మంది విద్యార్థులకు 52 మంది ఉత్తీర్ణత సాధించారు. అవదూ త దీక్షిత 575, ఎస్‌.వెంకటేష్‌ 562, కె.ఐశ్వర్య 550 మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలిచారు.

మైనారిటీ బాలుర జోరు

జనగామ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎండీ.ఫిరోజ్‌ 564, కె.హర్షవర్ధన్‌ 563, జమీల్‌ 558, టి.వర్షిత్‌ 552, ఎం.చందు 549 మార్కులు సాధించారు. అలాగే 16 మంది విద్యార్థులకు 500లకు పైన మార్కులు వచ్చినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ కర్రె కుమారస్వామి తెలిపారు.

మెరిసిన ఎంజేపీ విద్యార్థులు

మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొత్తం 73 మంది విద్యార్థుల కు 73 మంది 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. కె.శ్రీజ 580, బి.సింధు 574, ఎన్‌.వర్షిత 570, ఎన్‌.భువనేశ్వరీ 570, బిందుశ్రీ 569, మార్కులు తెచ్చుకున్నారని ఎస్‌ఓ ఎం.అనిత తెలిపారు.

సోషల్‌ వెల్ఫేర్‌ ప్రభంజనం

జిల్లాలో అయిదు సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలు ఉండగా.. జఫర్‌గఢ్‌, నర్మెట, పాలకుర్తి గురుకులాలు 100 శాతం, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ 98 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైనట్లు సమన్వయ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఎం.తరుణ్‌ 573, పి.హేమ 571, బి.శ్రావణి 571, కె.నరేష్‌ 568, డి.శశాంక్‌ 550 మార్కులు సాధించినట్లు వివరించారు.

సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు

పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. గడిచిన మూడు నెలల నుంచి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశారు. సమష్టిగా నిరంతర కృషి చేయడంతో మంచి ఫలితాలు సాధించాం. భవిషత్‌లో మొదటి స్థానం లక్ష్యంగా కృషి చేస్తాం. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు అభినందనలు.

– రిజ్వాన్‌ బాషా, కలెక్టర్‌

గత ఎనిమిదేళ్లలో జిల్లాలో పదోతరగతి

ఉత్తీర్ణత వివరాలు శాతంలో..

సంవత్సరం బాలికలు బాలురు మొత్తం

2016–17 93.98 93.13 93.56

2017–18 88.50 88.27 88.38

2018–19 97.51 96.59 97.15

2019–20, 2021 కరోనాతో 100 శాతం ఉత్తీర్ణత

2021–22 96.01 93.39 94.72

2022–23 91.17 92.58 91.90

2023–24 98.68 97.59 98.16

2024–25 99.20 98.40 98.81

అవదూత దీక్షిత/575

గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 20251
1/3

గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025

గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 20252
2/3

గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025

గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 20253
3/3

గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement