
కుల గణనపై ఫలించిన రాహుల్గాంధీ పోరాటం
జనగామ: దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటం ఫలించిందని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధినేత రాహుల్, సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచిపెట్టారు. అనంతనం శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. కుల గణనతో పాటు జనగణనను వేగవంతం చేయాలన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏడాదిన్నర పాలనలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, ప్రకాశ్ యాదవ్, బన్సీ నాయక్, మోటే శ్రీనివాస్, సుధగాని కృష్ణ, తుపాకుల రాములు, మిద్దెపాక స్టాలిన్, మంతపురి ప్రకాశ్, భూష పర్వతాలు, మధు, అర్షద్, అశోక్ పాల్గొన్నారు.