
కడియం శ్రీహరిది గోబెల్స్ ప్రచారమే
చిల్పూరు: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అబివృద్ధి చేసింది తానేనంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. మండల కేంద్రంలో గురువారం మండల ఇన్చార్జ్ మాలోతు రమేశ్నాయక్ అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 15 ఏళ్లలో కడియం శ్రీహరిని ప్రజలు మర్చిపోయారని, అందుకు మాజీ సీఎం కేసీఆర్ చేసిన అబివృద్ధే కారణమన్నారు. ప్రస్తుతం ఏసమావేశంలో మాట్లాడినా తానే అబివృద్ధి చేశానని చెప్పుకుంటున్న కడియం చిల్పూరుగుట్ట కింద సమావేశం పెడదామని.. ప్రజలే తీర్పు చెబుతారని అందుకు సిద్ధమా? అని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో తాను ఎంతో అబివృద్ధి చేశానని అందుకు నిదర్శనం శిలాఫలకాలే అన్నారు. కార్యక్రమంలో నాయకులు కేశిరెడ్డి మనోజ్రెడ్డి, రాకేశ్రెడ్డి, జనగాం యాదగిరి, నారగోని రాజు, రవిచంద్ర, రంగు హరీశ్, అరూరి రవిచంద్ర, రైతు వెంకన్న, వెంకటస్వామి, పోలు రమ తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య