
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి
● సీపీ సన్ప్రీత్సింగ్
వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులను గురువారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సన్ప్రీత్సింగ్ ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలను అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో ఎస్సైలు యుగేందర్, రాజశేఖర్రెడ్డి, కృష్ణారావు, ఎలిషా, ఏఎస్సై కుమారస్వామి, హెడ్కానిస్టేబుల్ రాంరెడ్డి ఉన్నారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ సుదీర్ఘంగా కాలంగా పోలీస్ శాఖకు అందించిన సేవలు మరిచిపోమని తెలిపారు. భవిష్యత్లో శాఖాపరమైన సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ఏసీపీలు సురేంద్ర, నాగయ్య, అంతయ్య, ఆర్ఐలు స్పర్జన్రాజ్, సతీష్, శ్రీధర్, ఏఓ రామకృష్ణస్వామి, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్ తదితరులు ఉన్నారు.
నీటిని ఒడిసి పట్టాలి
● డీపీఓ స్వరూపారాణి
బచ్చన్నపేట: గ్రామాల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చే నీటిని ఒడిసి పట్టాలని అందుకు.. ఇంకుడు గుంతలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి అన్నారు. గురువారం మండలంలోని నారాయణపురంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులు శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటిని భూమిలో ఇంకేలా చూస్తే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అలాగే గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని అందుకు గ్రామస్తులు తడి, పొడి చెత్తను వేరు చేసి జీపీ ట్రాక్టర్లలో వేసేలా చూడాలన్నారు. నర్సరీల్లో వంద శాతం మొక్కలు రక్షించాలని, పార్కులలో కూడా మొక్కల్ని రక్షించాలన్నారు. గ్రామాల్లో అన్ని రకాల పన్నులు వసూలు చేస్తూ వాటి నిర్వాహణ రికార్డులను సక్రమంగా రాయాలని పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు.