
ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రతిభావంతులు
జనగామ రూరల్: ప్రభుత్వ బడుల్లోనే ఉపాధ్యాయుల కృషితో ప్రతిభావంతులైన విద్యార్థులు తయారవుతారని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులను పీఆర్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ గార్డెన్లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మూడో స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్నారు. సీఎంతో చర్చించి పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ త్వరలో వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఏబీవీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకరాజు మాట్లాడుతూ కార్పొరేట్ కంటే ధీటుగా స్థానిక కాలేజీలు ఉత్తమ విద్యనందిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి