ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

May 7 2025 12:42 AM | Updated on May 7 2025 12:42 AM

ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

జనగామ: ప్రమాదాలపై అప్రమత్తంగా ఉంటూ పనులు చేస్తే అన్నింట్లో సక్సెస్‌ సాధించవచ్చని డీసీపీ రాజమహేంద్రనాయక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని యశ్వంతాపూర్‌ సత్యసాయి కన్వెన్షన్‌ హాల్‌లో ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ టి.వేణుమాధవ్‌ అధ్యక్షతన జరిగిన విద్యుత్‌ భద్రతా వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో డీసీపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. మొబైల్‌ ఫోన్‌లో వచ్చే ఆన్‌లైన్‌ యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ద్విచక్రవాహనంపై వెళ్లే సమయంలో హెల్మెట్‌, కారులో సీటు బెల్ట్‌ తప్పనిసరి అన్నారు. ఎన్‌పీడీసీఎల్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ సదర్‌లాల్‌ మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా సంస్థ ఇచ్చిన సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌, కల్నల్‌ భిక్షపతి, మోటివేటర్‌ స్వప్న, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజనల్‌ ఇంజనీర్లు లక్ష్మీనారాయణరెడ్డి, రాంబాబు, టెక్నికల్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ గణేష్‌, ఏఆర్‌టీ డీఈ విజయ్‌, సీనియర్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌ జయరాజు, జిల్లా ఏడీఈ, ఏఏఓ, ఏఈ, సబ్‌ ఇంజనీర్లు తదితరులు ఉన్నారు.

విద్యుత్‌ భద్రతా వారోత్సవాల్లో

డీసీపీ రాజమహేంద్రనాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement