Bhadradri
-
మావోయిస్టుల కొత్త చీఫ్ ఎవరు?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయి స్టు పార్టీ సుప్రీం కమాండర్, కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోవడంతో, ఆ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే అంశంపై ఆ పార్టీ వర్గాలు, సానుభూతిపరుల్లో చర్చ మొదలైంది. మరోవైపు పార్టీకి కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో ఎవరు రావచ్చనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నట్టు సమాచారం. కేంద్ర కమిటీయే కీలకం.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 2004లో ఏర్పాటైనప్పుడు కేంద్ర కమిటీలో 32 మంది సభ్యులు ఉండేవారు. అయితే వరుస ఎన్కౌంటర్లు, సహజ మరణాల నేపథ్యంలో ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలోనే నంబాల కేవశరావు, ప్రయాగ్ మాంఝీ, చలపతి వంటి కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 17 మంది సభ్యులే ఉన్నట్టు సమాచారం.2004 నుంచి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అనారోగ్య కారణాలతో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోగానే సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) బాధ్యతలు చూస్తున్న నంబాల కేశవరావు పార్టీ చీఫ్గా 2018 నవంబర్లో బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఎన్కౌంటర్లో చనిపోవడంతో గత సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రస్తుతం సీఎంసీ కమాండర్గా ఉన్న తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీకి ఈ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. పదేళ్ల కిందట కూడా ఒకసారి పార్టీ చీఫ్ పదవికి తిరుపతి పేరు తెరపైకి వచి్చంది. అయితే కార్యరూపం దాల్చలేదు. ఈసారి తెలుగేతర వ్యక్తి? మరోవైపు కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా పలు బాధ్యతలు నిర్వహిస్తున్న మల్లోజుల వేణుగోపాల్ (మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు) పేరు కూడా విని్పస్తోంది. పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నందున మిలిటరీ విభాగం కంటే పొలిట్బ్యూరో సభ్యులకే అవకాశం ఇచ్చేందుకు ఆస్కారం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వరుసగా రెండుసార్లు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకే అవకాశం దక్కినందున ఈసారి తెలుగేతర నేతలకు అవకాశం ఇవ్వవచ్చని, పశ్చిమ బెంగాల్కు చెందిన రాజా పేరును పరిశీలనలోకి తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హిడ్మాకు సీఎంసీ బాధ్యతలు! గడిచిన దశాబ్ద కాలంగా మావోయిస్టు పార్టీకి ఆదివాసీలు.. అందునా మహిళలే దన్నుగా నిలుస్తూ వస్తున్నారు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత జరుగుతున్న భారీ ఎన్కౌంటర్లు అన్నింట్లోనూ మహిళా మావోయిస్టులే ఎక్కువగా చనిపోతున్నారు. మావోయిస్టు ఉద్యమంలో మహిళల పోషిస్తున్న భూమికను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ రీజనల్ బ్యూరోలో ఉన్న మాధవి అలియాస్ సుజాతకు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించవచ్చని, అదే సమయంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ వన్ కమాండర్గా ఉన్న మడావి హిడ్మాకు సీఎంసీ బా«ధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. సమష్టి నాయకత్వం! పీపుల్స్ వార్ పార్టీలో కొండపల్లి సీతారామయ్య తిరుగులేని విధంగా ఏకఛత్రాధిపత్యం చూపారు. దీన్ని ఇతర పార్టీ నేతలు నిరసించారు. కొండపల్లి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి గతాన్నికి భిన్నంగా ఉమ్మడి నాయకత్వం వైపు మొగ్గు చూపారు. అందువల్లే సెంట్రల్ కమిటీ, సెంట్రల్ రీజనల్ బ్యూరో, పొలిటికల్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్ వంటివి ఏర్పాడ్డాయి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సమష్టి నాయకత్వం వైపు మొగ్గు చూపవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి కమిటీకి ఒకరికి మించి నాయకులు ఉండే విధానం అవలంబించవచ్చని అంటున్నారు. -
జాతీయవాదాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమే..
ఖమ్మంవన్టౌన్: జాతీయవాదాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇటీవల నగరంలో జాతీయవాదుల నేతృత్వాన నిర్వహించిన తిరంగా యాత్రను కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఘటనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు నేతృత్వాన జిల్లా నేతలు కరీంనగర్లోని బండి సంజయ్ క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించగా.. ఆయన స్పందించారు.ఇలాంటి దేశద్రోహకర చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. బండి సంజయ్ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర నాయకులు సన్నే ఉదయప్రతాప్, రమేష్, నున్నా రవికుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
రామయ్య సేవలో మాజీ స్పీకర్
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి గురువారం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే బీఆర్ఎస్ నేత ఎనుగుల రాకేష్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. డివిజన్ నాయకులు మానె రామకృష్ణ, మండల కన్వీనర్ సునీల్ పాల్గొన్నారు. ట్రాలీ ఆటో డ్రైవర్పై కేసు నమోదు పాల్వంచరూరల్: ట్రాలీ ఆటో డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటనలో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. ఈ నెల 19న రాత్రి మండల పరిధి లక్ష్మీదేవిపల్లి బీసీఎం జాతీయ ప్రధాన రహదారి పక్కన మెకానిక్ షాపువద్ద ద్విచక్ర వాహనానికి మరమ్మతులు చేస్తున్న ఆసీఫ్, దంతలబోరు గ్రామానికి చెందిన పోలేబోయిన రాజారావు, చెరుకు శ్రీనులను పాల్వంచ వైపు వస్తున్న ట్రాలీ ఆటో ఢీకొంది. దీంతో ముగ్గురికి తీవ్రగాయలు కాగా ఖమ్మంకు తరలించారు. పోలేబోయిన వీర్రాజు ఫిర్యాదు మేరకు ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా లింగపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ కంచర్ల కృష్ణయ్యపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. పందెంరాయుళ్లపై.. దమ్మపేట: కోడి పందేలు నిర్వహిస్తున్న పందెంరాయుళ్లపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దిబ్బగూడెం గ్రామ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సాయికిషోర్రెడ్డి, తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. దీంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు కోడి పుంజులు, రూ.2,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పురుగుల మందు తాగి కారు డ్రైవర్ ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: పురుగుల మందు తాగి ఓ కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. పట్టణంలోని దండాబత్తుల వారి వీధికి చెందిన వరికూటి వెంకన్నబాబు(37) కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గడిచిన కొద్ది రోజులుగా ఖాళీగా ఉండడంతో కుటుంబపోషణ భారంగా మారడంతో మనస్తాపానికి గురై గురువారం తెల్ల వారుజామున ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెంకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం కలరు. కాగా, మృతుడి అన్నయ్య సత్యనారాయణ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. టేకులపల్లిలో ఏసీబీ దాడులు? టేకులపల్లి: టేకులపల్లి మండలంలో ఏసీబీ అధికారులు మండలానికి చెందిన అధికారిని పట్టుకునేందుకు రెండు సార్లు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మండలంలో పని చేస్తున్న మండల అధికారిపై అవినీతి ఆరోపణలు, ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు గత వారంలో ఒక రోజు, ఈ వారంలో ఒకసారి ఆ అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ప్రయత్నించగా ముందే పసిగట్టిన తప్పించుకున్నట్లు సమాచారం. అంతగా మండలంలో అవినీతికి పాల్పడుతున్న మండల అధికారి ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు శాఖలకు చెందిన అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యాన తాజాగా టేకులపల్లి ఉదంతం వెలుగులోకి రావడంతో మండలంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామపంచాయతీ రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపాన గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారేపల్లి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన బానోత్ లాల్సింగ్, ఇల్లెందు మండలం జింకలతండా గ్రామానికి చెందిన బానోత్ సుప్రజ ఇరువురు బైక్పై కొత్తగూడెం నుంచి ఇల్లెందుకు వస్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యులు ఖమ్మంకు సిఫారసు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సరస్వతీ నమస్తుభ్యం..
● పుష్కరాలకు జిల్లా నుంచి తరలివెళ్తున్న భక్తులు ● నదీస్నానం పుణ్యఫలమని నమ్మకం ● ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం ఇల్లెందురూరల్ : సరస్వతీ పురష్కరాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈనెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తోంది. ఈ త్రివేణీ సంగమంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తుండగా.. ఇక్కడ స్నానమాచరించిన భక్తులు పక్కనే ఉన్న ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. నదీ స్నానాలకు ప్రాముఖ్యం సరస్వతీ పుష్కరాల్లో నదీ స్నానాలకు భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు. పుష్కరస్నానం పుణ్యఫలమని, చదవుల తల్లిగా విరాజిల్లుతున్న సరస్వతీ నదిలో స్నానమాచరిస్తే సకల విద్యలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. కాళేశ్వరంలో స్నాన ఘట్టాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్నానానంతరం భక్తులు నదీ తీరంలో సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజలు చేయడంతో పాటు పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. వివిధ మార్గాల్లో పయనం.. జిల్లాలోని అన్ని ప్రాంతాల భక్తులు నిత్యం పుష్కరాలకు వెళ్తున్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గంలో ఇల్లెందు, మహబూబాబాద్, నర్సంపేట, వరంగల్, పరకాల, భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. లేదంటే రైలులో ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాళేశ్వరం వెళ్లొచ్చు. ట్రావెల్స్ చార్జీల మోత.. జిల్లా నుంచి కాళేశ్వరానికి నేరుగా బస్సుల సౌకర్యం అంతగా లేకపోవడంతో భక్తులు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. కొందరు భక్తులు పుష్కరాలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, లక్నవరం, రామప్ప, వరంగల్ వేయి స్థంబాల గుడి, భద్రకాళి అమ్మవారి దేవాలయం వంటి క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, సెలవులు కావడం, ఇప్పుడే పుష్కరాలు రావడంతో ప్రైవేట్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ధరల మోత మోగుతోంది. దక్షిణ కాశీ దర్శనం ఆనందాన్నిచ్చింది దక్షిణ కాశీగా పేరెన్నికగన్న కాళేశ్వరం దర్శనం ఆనందాన్నిచ్చింది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమ పవిత్ర భూమిని ప్రత్యక్షంగా వీక్షిండం, పుష్కరస్నానం ఆచరించడంతో ధన్యులమయ్యాం. యమలింగం, శివలింగం దర్శనం మరింత సంతృప్తినిచ్చింది. – పొద్దుటూరి స్వప్న, కొమరారం, ఇల్లెందు మండలం పుష్కరాలకు వెళ్లడం సంతృప్తినిచ్చింది గోదావరి, కృష్ణ పుష్కరాలకు గతంలో వెళ్లాం. కానీ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లడం మరింత సంతృప్తినిచ్చింది. మూడు నదుల సంగమ ప్రదేశాన్ని దర్శించడం, ఆ పుణ్య ప్రదేశంలో కుటుంబ సమేతంగా స్నానమాచరించడం అదృష్టంగా భావిస్తున్నాం. – పుల్లఖండం మమత, పోలారం, ఇల్లెందు మండలం -
భాగ్యరెడ్డివర్మ చిరస్మరణీయుడు
సూపర్బజార్(కొత్తగూడెం): దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త ఎంవీ భాగ్యరెడ్డివర్మ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కొనియాడారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో భాగ్యరెడ్డివర్మ 137వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ కేంద్రంగా దళిత పాఠశాలలు స్థాపించారని, బాల్యవివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించారని పేర్కొన్నారు. మద్యపాన నిషేధం, గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, షెడ్యూల్ కులాల సంక్షేమాధికారి అనసూర్య, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఏఓ రామకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రహదారుల వెంట ఇంకుడు గుంతలు నిర్మించాలిరహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. జల్ సంచయ్ జన్భాగీ దారి కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీరు నేలలోకి ఇంకి భూగర్భజల మట్టం పెరుగుతుందని అన్నారు. రోడ్ల పక్కన వర్షపునీరు నిలిచేందుకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇంకుడు గుంతలు తవ్వించాలని అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో చుక్క వర్షపు నీరు కూడా వృథా కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలో జిల్లా ద్వితీయస్థానంలో ఉందని, అధిక సంఖ్యలో నిర్మాణాలు చేపట్టి ప్రథమస్థానంలో నిలపాలని సూచించారు. 26 నుంచి శిక్షణ తరగతులుచుంచుపల్లి: లైసెన్స్డ్ సర్వేయర్ అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి జూలై 26 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కొత్తగూడెం మైనింగ్ కళాశాలలో శిక్షణ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. 426 మంది అభ్యర్థులకు 50 పని దినాల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఉదయం 9 గంటలకు క్షేత్రస్థాయిలో శిక్షణ, 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు థియరీ, ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. శిక్షణ కోసం అవసరమైన ప్రొజెక్టర్లు, బోర్డులు తదితర అన్ని పరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భూభారతి చట్టం అమలులో సర్వేయర్ల పాత్ర కీలకమని, అభ్యర్థులకు చట్టంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మైనింగ్ ఏడీ శ్రీనివాస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ డి.శ్రీనివాస్, మైనింగ్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఏసీబీ’తో భయం.. భయం
● సింగరేణిలో తొలిసారిగా చిక్కిన కార్మికుడు ● మిగతావారిపై ఆరా తీస్తున్న అధికారులు ● లోతుగా విచారిస్తే మరింతమంది వెలుగులోకి.. ● మున్సిపాలిటీల్లో కూడా పెరిగిపోతున్న అవినీతి ఆరోపణలు కొత్తగూడెంఅర్బన్: అత్యాశ, ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు ప్రభుత్వ అధికారులు ఏసీబీ వలకు చిక్కి జైలుపాలవుతున్నారు. కొందరు లంచం తీసుకుంటుండగా, మరికొందరు అవినీతి ఆరోపణలకు గురై సాక్ష్యాధారాలతో దొరుకుతుండటంతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. జిల్లాలో గడిచిన 16 నెలల కాలంలో ఏసీబీ అధికారులు 19 కేసులు నమోదు చేశారు. 27 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం జిల్లాలో లంచం అడగాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు వణుకు పుడుతుందనే చెప్పుకోవచ్చు. కానీ సింగరేణి, మున్సిపాలిటీల్లో అవినీతి పెచ్చుమీరుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో ఈ నెల 6న ఏసీబీ దాడులు నిర్వహించింది. వర్క్షాపులో డ్రైవర్గా పని చేస్తున్న వ్యక్తి దగ్గర రూ.50 లక్షలు, 100 ఫైళ్లు ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు కార్మికుడి ఇంట్లో సోదాలు చేసి ఆధారాలతో సహా పట్టుకుని కేసు నమోదు చేశారు. సింగరేణిలో మొదటిసారి దాడులు నిర్వహించిన సమయంలో సింగరేణి ఆస్పత్రిలో హడావిడి చేశారుకానీ నిందితులను పట్టుకోలేకపోయారు. రెండోసారి దాడుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. కార్మికుల బదిలీలు, మెడికల్ అనిఫిట్లు, ఇతర సమస్యల పరిష్కారానికి లంచం తీసుకుంటున్నవారు ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. వివరాలన్నీ సేకరించే పనిలో ఉన్న వారు మరోసారి దాడులు చేస్తే ఏళ్ల తరబడిగా దందాలు చేస్తున్న వారు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొంతకాలంగా సింగరేణి ఆస్పత్రి సమీపంలోని హోటళ్లను అడ్డాగా చేసుకుని కొందరు బదిలీలు, మెడికల్ అన్ఫిట్ దందాలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి అడ్డాలు జిల్లా కేంద్రంలో అనేకం ఉన్నాయని, పక్కా సమాచారంతో దాడులు చేస్తే అక్రమార్కులకు చెక్ పెట్టవచ్చని పలువురు పేర్కొంటున్నారు. కొందరు కార్మిక సంఘ నాయకులు కూడా దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి విజిలెన్స్ దాడులు చేస్తే మేలు సింగరేణి మెడికల్ బోర్డులో అన్ఫిట్ చేయిస్తామని, బదిలీ చేయిస్తామని, ఉద్యోగాలకు ఎంపికై న వారిని వైద్య పరీక్షల్లో ఫిట్ చేయిస్తామని ఎవరైనా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సింగరేణి అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ ఆచరణలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో దందా యథాతథంగా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కార్మికుల బదిలీలు, అన్ఫిట్ తదితర విషయాల్లో లంచం తీసుకునేవారి వివరాలతో సింగరేణి విజిలెన్స్కు ఫిర్యాదు చేస్తే రూ.10 వేలు పారితోషికం అందజేస్తామని రెండు వారాల కిందట అధికారులు ప్రకటించారు. దందా యథేచ్ఛగా సాగుతున్నా ఇప్పటివరకు ఫిర్యాదులు రాలేదని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఆధారాలు ఉన్న కూడా తమ పనులు పూర్తయితే చాలు అనుకునే వారు వందల సంఖ్యలో ఉన్నారు. విజిలెన్స్ అధికారులను ఆశ్రయిస్తే వారి పనితోపాటు, వారు కూడా బయటపడే అవకాశం ఉందని కొందరు జంకుతున్నారు. అయితే విజిలెన్స్ అధికారులే అడ్డాలపై దృష్టి సారించి దాడులు చేస్తే అవినీతిపరులు దొరుకుతారని పలువురు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీలో ఇద్దరితో బోణీ... జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు ఉండగా, పాల్వంచ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో సూపర్వైజర్, అసిస్టెంట్ ఇద్దరూ ఏసీబీకి పట్టుబడ్డారు. మిగతా మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తే మున్సిపాలిటీల్లోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది చిక్కే అవకాశముంటుంది. ప్రస్తుతం కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేట మూడు మున్సిపాలిటీలకు కూడా ఒక్కరే కమిషనర్ ఉండటంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో ఏసీబీ నిఘా పెడితే అవినీతిపరులకు చెక్ పెట్టవచ్చని ఆయా మున్సిపాలిటీల ప్రజలు పేర్కొంటున్నారు. -
కల్వర్టును ఢీ కొట్టిన కంటైనర్..
బూర్గంపాడు: ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించే క్రమంలో కల్వర్టును ఢీ కొట్టిన ఘటనలో కంటైనర్ లారీ డ్రైవర్ మృతిచెందాడు. గురువారం సారపాకలో జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు ఇలా తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరెడ గ్రామానికి చెందిన ఐతరాజు నరేశ్(35) కంటైనర్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈనేపథ్యాన గురువారం కంటైనర్లో పేలుడు పదార్థాల లోడ్తో ఒడిశా వెళ్తున్న క్రమంలో సారపాక సంత సమీపాన ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించే క్రమంలో పక్కనే ఉన్న కల్వర్టును వేగంగా ఢీ కొట్టాడు. దీంతో నరేష్కు తీవ్ర గాయాలతో క్యాబిన్లో ఇరుక్కుపోగా స్థానికులు, 108 సిబ్బంది శ్రమించి బయటకు తీశాక భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్థారించగా.. ఘటనా స్థలాన్ని పాల్వంచ డీఎస్పీ సతీష్, సీఐ సతీష్ పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రైవర్ మృతి -
నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
పినపాక: నాటుసార విక్రయించడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ శాఖ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి దుగినేపల్లి గ్రామానికి చెందిన భూఖ్య రామారావు జానంపేటలో నాటు సారా విక్రయించడానికి వెళ్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతని వద్ద ఎనిమిది లీటర్ల నాటు సారాతో పాటు ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. నాటు సారా విక్రయించిన, తయారు చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనిఖీల్లో సిబ్బంది పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రి డయాలసిస్ కేంద్రం సీజ్ కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అవకతవకలు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలడంతో ఆస్పత్రి కేంద్రంలోని డయాలసిస్ కేంద్రాన్ని సీజ్ చేసినట్లు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ తేజశ్రీ వెల్లడించారు. గురువారం ఆస్పత్రిని తనిఖీ చేసి సీజ్ చేశామన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద తప్పనిసరిగా ప్రమాణాలు పాటించి సౌకర్యాలు కల్పించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ నాగభూషణం, డిప్యూటీ డెమో ఎండీ.ఫైజామోహిఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
‘పచ్చిరొట్ట’పై పునరాలోచన!
గతేడాది రూ.1,116.. ఈ ఏడాది రూ.2,137 గతేడాది 30 కిలోల జీలుగు విత్తనాల బస్తా ధర ప్రభుత్వ రాయితీ పోగా రూ.1,116 ఉండగా, ఈ ఏడాది ఆ ధర రూ. 2,137.50కు పెరిగింది. గతేడాది కిలో జీలుగుల ధర రూ.93 ఉండగా, ప్రభుత్వం రూ.55.80 సబ్సిడీ ఇవ్వగా రైతులు రూ. 37.20 చెల్లించారు. ఈ ఏడాది కిలో జీలుగు ధర రూ.142.50కు పెరిగింది. ఇందులో ప్రభుత్వ రాయితీ రూ 71.25 పోగా రైతులు కూడా రూ.71.25 చెల్లించాలి. గతేడాది పోల్చితే ధర రూ.34 పెరిగింది. 30 కిలోల జీలుగు బస్తాకు రూ.1,020 అదనంగా పెరిగినట్లయింది. గతేడాది ప్రభుత్వం 60శాతం రాయితీ ఇవ్వగా ఈ ఏడాది రాయితీని 10 శాతం తగ్గించి 50శాతానికి కుదించింది.బూర్గంపాడు: పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ విధానాలను అవలంబించేందుకు ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాల సాగును ప్రోత్సహిస్తోంది. జిల్లాలో రైతులు మాగాణి భూముల్లో పచ్చిరొట్ట విత్తనాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పచ్చిరొట్ట విత్తన ధరలను ప్రభుత్వం అమాంతం పెంచింది. గతేడాదితో పోలిస్తే రేటు రెట్టింపయింది. గతంలో 60 శాతం మేర ఉన్న రాయితీని 50 శాతానికి తగ్గించింది. విత్తన ధర పెంపు, సబ్సిడీ తగ్గింపుతో రైతులపై ఆర్థికభారం పెరిగింది. జీలుగు వినియోగమే ఎక్కువ జిల్లాలో ఏటా రైతులు పచ్చిరొట్ట సాగుకు ఎక్కువగా జీలుగులనే వినియోగిస్తున్నారు. కొన్నిచోట్ల జనుము సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పీఏసీఎస్ల ద్వారా జీలుగు విత్తనాలను సరఫరా చేయనుండగా, ఈ ఏడాది జిల్లాకు 5 వేల క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి. గతేడాది సుమారు 6 వేల క్వింటాళ్లకు పైగా రైతులకు అందించారు. విత్తనాల రాశి తగ్గడం, ధర పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 30 కిలోల సంచి రెండు ఎకరాల సాగుకు సరిపోనుండగా, ఒక ఎకర సాగుకు రూ.1,100 వరకు ఖర్చవుతుంది. దుక్కికి మరో రూ.2 వేలు ఖర్చు చేయాలి. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేయాలా? వద్దా అని రైతులు ఆలోచిస్తున్నారు. విత్తన ధర పెంపు, రాయితీ తగ్గింపుతో రైతుల ఆందోళన 30 కేజీల జీలుగు బస్తా కొనాలంటే రూ.1,020 అదనపుభారం భూసారం కోసం పచ్చిరొట్ట సాగు చేయాలన్నా కష్టమే.. ఐదు వేల క్వింటాళ్లు సిద్ధం జిల్లాలో ఐదు వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధంగా ఉంచాం. మండల వ్యవసాయశాఖ అధికారుల రికై ్వర్మెంట్ ప్రకారం ఇంకా విత్తనాలు తెప్పిస్తాం. రైతులు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసి భూసారాన్ని పరిరక్షించుకోవాలి. –బాబూరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారిరాయితీ పెంచి ధర తగ్గించాలి జీలుగు విత్తనాల ధరలు రెట్టింపు చేయటం రైతులకు ఇబ్బందే. ఽవిత్తన ధరలు పెరిగితే ప్రభుత్వం రాయితీ పెంచాలి. అట్లకాకుండా ధరలు పెరిగినప్పుడు, రాయితీ తగ్గించటం సరికాదు. ఇప్పటికై నా రాయితీ పెంచి ధర తగ్గించాలి. –ఊడుగుల సత్యం, రైతు, గొమ్మూరు -
‘బీమా’తో కుటుంబానికి ఆర్థిక భరోసా
బూర్గంపాడు: కుటుంబ ఆర్థిక భరోసాకు జీవిత బీమా తప్పనిసరని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నాగరాజు అన్నారు. గురువారం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని తమ బ్యాంకులో జీవిత బీమా చేసి ప్రమాదవశాత్తు, సహజ మరణాలు పొందిన తొమ్మిది మంది కుటుంబాలకు రూ.36 లక్షల విలువైన చెక్కులను అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆర్థిక లబ్ధి చేకూరే బీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంక్ మేనేజర్ ఆర్.నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సునీల్కుమార్, రమేష్రెడ్డి, ఉదయ్కుమార్, రామకృష్ణ, సాయి కృష్ణ, పాషా, ఐకేపీ ఏపీఎం నాగార్జున, ఎస్బీఐ బిజనెస్ డెవలప్మెంట్ మేనేజర్ నందు, గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు. జనావాసాల్లోకి దుప్పి.. అశ్వారావుపేటరూరల్: అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన ఓ చుక్కల దుప్పి అశ్వారావుపేట పట్టణంలో హల్చల్ చేసింది. గురువారం మధ్యాహ్న సమయంలో అటవీ ప్రాంతం నుంచి పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వీధిలో ఉన్న జనవాసాల్లోకి వచ్చింది. గమనించిన స్థానికులు సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయడంతో ఆందోళనకు గురై పరుగులు తీసింది. దీంతో బీఎస్ఆర్ నగర్ మీదుగా ఇందిరా కాలనీ నుంచి అల్లిగూడెం గ్రామం వైపు వెళ్లింది. సమాచారం అందుకున్న స్థానిక ఫారెస్టు రేంజర్ మురళి ఆధ్వర్యాన దుప్పిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది అటవీ సిబ్బందికి చిక్కకుండా అల్లిగూడెం సమీపంలో గల వ్యవసాయ క్షేత్రాలను దాటుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దాదాపు గంటపాటు పట్టణంలోని ఇళ్లల్లోకి వెళ్లి దుప్పి హల్చల్ చేయడంతో స్థానికులు చూసేందుకు పోటీ పడ్డారు. రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికకొత్తగూడెంఅర్బన్: ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మంచిర్యాల జిల్లాలో జరగనున్న టైసన్ కప్ ఓపెన్ రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ మేరకు గురువారం బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్యాట్రన్ ఝెర్రా కామేష్ వివరాలు వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారుల్లో సబ్ జూనియర్స్ విభాగంలో గోనెల నిశాంత్ కుమార్, దాసరి హేమంత్, రాచకట్ల వినయ్, బొల్లోజు మహేశ్, ఆముదాల విజయ్ భాగ్యేష్, జూనియర్స్ విభాగంలో జిజుల అజిత్, గోనెల అక్షయ్ కుమార్ ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ వై.శివసుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు షమీవుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ రాజా, ధనుంజయ్, సుహాష్ అద్వైత్, నున్న శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకే నష్టపరిహారం అశ్వారావుపేటరూరల్: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద నిర్మించే కాలువ నిర్మాణాల్లో సాగు భూములను కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ నిర్ణయించిన నష్ట పరిహారం మేరకే చెల్లిస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జె.కార్తీక్ తెలిపారు. గురువారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గ్రామసభను నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రాజెక్టుకు సంబంధించిన కాలువ నిర్మాణాలకు అవసరమైన భూములను సేకరిస్తున్నామని, ఎమైనా అభ్యంతరాలు ఉంటే వెల్లడించాలని చెప్పారు. ప్రాజెక్టు ద్వారా అశ్వారావుపేట మండలంలో సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నష్టపోతున్న రైతులు సహకరించాలని కోరారు. ఈ గ్రామసభలో మున్సిపాలిటీ కమిషనర్ సుజాత, డీటీ రామకృష్ణ, ఇరిగేషన్ డీఈ కృష్ణ, ఏఈఈ కేఎన్బీ కృష్ణ, ఆర్ఐలు తాటి కృష్ణ, పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం స్వామివారి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పార్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. ఇద్దరు అర్చకులకు నోటీసులు జారీభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రధానార్చకులకు ఆలయ ఈఓ ఎల్.రమాదేవి గురువారం నోటీసులు జారీ చేశారు. రామాలయంలోని అభయాంజనేయ స్వామివారికి హనుమాన్ జయంతి సందర్భంగా తమలపాకార్చనను నిర్వహించడంలో అర్చకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో ప్రధానార్చకులు విష్ణు, కిరణ్ కుమారాచార్యులును వివరణ కోరగా తమలపాకార్చన నిర్వహించలేదని సమాధానం చెప్పారు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారికి నోటీసులు జారీ చేశారు. సింగిల్విండోలో హెచ్టీ సర్వీసుల మంజూరువిద్యుత్ ఎస్ఈ మహేందర్ సూపర్బజార్(కొత్తగూడెం): వినియోగదారులకు హెచ్టీ 11 కేవీ, 33 కేవీలతోపాటు అంతకంటే ఎక్కువ ఓల్టేజీ సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు విద్యుత్ ఎస్ఈ జి.మహేందర్ తెలిపారు. ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించారు. సర్కిల్ కార్యాలయంలో హెచ్టీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సింగిల్ విండో విధానంతో వినియోగదారులు టీజీ ఎన్పీడీసీఎల్ పోర్టల్లో అవసరమైన పత్రాలతో హెచ్టీ దరఖాస్తులు (టీజీ ఐపాస్లో నమోదుకాని) నమోదు చేసుకోవాలని, ఆ తర్వాత కొత్త అప్లికేషన్ నంబరు వస్తుందని వివరించారు. విద్యుత్ సిబ్బంది ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్ను సందర్శిస్తారని తెలిపారు. లోపాలుంటే రెండురోజులలోపు రిమార్క్ వివరాలను వినియోగదారునికి ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలిజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి భాస్కర్నాయక్అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కర్నాయక్ సూచించారు. మండలంలోని ఎర్రగుంట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి మాట్లాడారు. శస్త్రచికిత్సలు లేకుండా సహజ ప్రసవాలు జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని కోరారు. తమకు ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని 104 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేయగా, తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ తన్మయ్, ఆరోగ్య సిబ్బంది ఎస్తేరు రాణి, ప్రకాష్రావు, హారిక, ప్రసాదరావు, కళ్యాణ్, లక్ష్మి, శరత్ పాల్గొన్నారు. -
గిరిజన సొసైటీలను సద్వినియోగం చేసుకోవాలి
ఐటీడీఏ పీఓ రాహుల్భద్రాచలం: పీసా యాక్ట్ ప్రకారం గిరిజన మహిళల కోసం కేటాయించిన ఇసుక సొసైటీలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న మహిళా సొసైటీల సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న గిరిజన మహిళలు కాంట్రాక్టర్లను, బినామీలను నమ్మి మోసపొవద్దని సూచించారు. మహిళలందరూ ఐక్యంగా ఉండి గోదావరిలో ఇసుక వెలికితీత, నిర్వహణ బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసా స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయక్, ఏడీ మైన్స్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్ష, మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు రెండో సంవత్సరం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 కేంద్రాల్లో మొదటి సంవత్సరం పరీక్షకు జనరల్ కోర్సు విద్యార్థులు 1,359 మందికి 1,217 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 188 మందికి 163 హాజరయ్యారు. రెండు విభాగాల్లో 113 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి జనరల్ కోర్సు 432 మందికి 404 మంది విద్యార్థులు హాజరు కాగా, 28 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 64 మందికి 54 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దీంతోపాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశలు మెడికల్ కిట్లతో విధులు నిర్వహించారు. కొత్తగూడెంలో కొన్ని కేంద్రాల పేర్లు సరిగ్గా తెలియక కొందరు విద్యార్థులు మరో కేంద్రానికి వెళ్లి.. చివరి నిమిషంలో ఉరుకులు, పరుగులు తీశారు. -
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి
కొత్తగూడెంఅర్బన్: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహానీయుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి అని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ కొనియడారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో భాగ్యరెడ్డి జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు రెహమాన్ భాగ్యరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాల ఫలితంగా వర్మ బిరుదు పొందిన ఆయన అణగారిన, దళితుల అభివృద్ధికి, విద్యాసంస్థలు నెలకొల్పి వారి జీవితాల్లో విద్యతో వెలుగులు నింపారని కొనియాడారు. జగన్ మిత్ర మండలిని స్థాపించి దళితుల చైతన్యం కోసం పాటుపడ్డారని, దేవదాసి, జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి వారి కోసం కృషి చేసిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ లాల్బాబు, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎంటీఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంకుడుగుంతలతోనే నీటి సంరక్షణ
మణుగూరు రూరల్: ఇంకుడు గుంతల ఏర్పాటుతోనే నీటి సంరక్షణ, భూగర్భ జలాలను పెంపొందించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళి తెలిపారు. గురువారం మండల పరిధిలోని లంకమల్లారం, సమితిసింగారం, గుట్టమల్లారం, ముత్యాలమ్మనగర్గ్రామపంచాయతర్ల్ ఇంకుడుగుంతలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నీటి వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటింటికి ఇంకుడుగుంతలు తప్సనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, బోరు బావి, చేతిపంపుల వద్ద కూడా వీటిని ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత లేకుండా ఉంటుందన్నారు. నేల స్వభావాన్ని, పరిసరాలను బట్టి ఈ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీడీఓ తేళ్లూరి శ్రీనివాసరావు, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఫలరాజు ఫలించేలా..
యాజమాన్య పద్ధతితో అధిక లాభాలు ● నేల సారవంతానికి దుక్కులు అవసరం ● కొమ్మ కత్తిరింపులతో తెగుళ్ల నివారణ ● వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ వైరా: దేశంలో పండించే పండ్ల తోటల్లో ప్రధానమైనది, ఫలరాజుగా పేరుగాంచినది మామిడి. అయితే దీని సాగు విస్తీర్ణం దేశంలో మొత్తం 35శాతం ఉండగా.. 22,58,130 హెక్టార్లలో విస్తరించి ఉంది. రాష్ట్రంలో 1,15,990 హెక్టార్లు, జిల్లాలో 13,674 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. సాధారణంగా మామిడి రైతులు పూత, కాత దశలో మాత్రమే మామిడి తోటలపై దృష్టి సారించి చెట్టుకు కావాల్సిన ఎరువులు అందిస్తుంటారు. దీని వలన సరైన పోషకాలు అందక పూత సకాలంలో రాకపోవడం, వచ్చిన పూత, పిందె సరిగా నిలవక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యాన అధిక దిగుబడులు సాధించేందుకు కోత అనంతరం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ సూచిస్తున్నారు. కొమ్మ కత్తిరింపులు.. ● మామిడి కాయ కోత అనంతరం కాయ తొడిమలున్న కొమ్మలు, ఎండిన కొమ్మలు, తెగులు సోకిన, విరిగిన కొమ్మలు, చెట్ల లోపల గాలి, వెలుతురు ప్రవేశానికి అడ్డుగా ఉన్న కొమ్మలను కత్తిరించాలి. ● పూత కాడల నుంచి వెనుకకు 15 సెంటీ మీటర్లు వరకు కత్తిరిస్తే నవంబర్, డిసెంబర్లలో కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి, అవే వచ్చే రుతువులో పుష్పిస్తాయి. ● ప్రతీ రెమ్మ చివరి నుంచి 3–5 చిగుర్లు వస్తే ఆరోగ్యంగా ఉన్న రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి. ● కత్తిరింపులతో కొంత మేర తెగుళ్లు తగ్గే అవకాశం ఉండగా.. కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డ్ఫేస్ట్ పూయాలి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటికి కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. దుక్కి దున్నడం.. తొలకరిలో అనగా జూన్, జూలై మాసాలలో రైతాంగం చెట్ల మధ్యన దున్నాలి. దీని వలన కోశస్థ దశలో ఉన్న పురుగులు, కలుపు నివారించబడడడంతో పాటు నేల గుల్లబారి, వేర్లకు గాలి బాగా చేరి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా నేలకు వర్షపు నీటిని పట్టి ఉంటే గుణం పెరిగి నేల సారవంతమవుతంది. మూడవ దుక్కి అక్టోబర్లో చేపడినట్లయితే నేలలో తేమ ఆరిపోయి సకాలంలో పూత రావడానికి దోహదపడుతుంది. దున్నేటప్పుడు చెట్టు నుంచి 1–5 మీటర్ల దూరంలో దున్నడం ఉత్తమం. -
డీఎస్పీ సేవలకు గుర్తింపు
కొత్తగూడెంఅర్బన్: పొక్సో కేసులో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కేసుల పరిష్కారానికి కృషి చేసిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్కు గుర్తింపు లభించింది. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్కు ప్రశంసాపత్రం లభించగా.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో గురువారం డీఎస్పీని అభినందించారు. -
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి. కీలక నేతలే టార్గెట్గా ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్లైన్గా విధించడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు. దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి. క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు. తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’ దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్హంట్ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా.. 1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు. 2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్లను వాడుతున్నారు. 3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు. ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి. -
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్వార్ 7వ కాంగ్రెస్లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్గా..పీపుల్స్వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది. -
క్రీడలతో ఆనందం, ఆరోగ్యం
సుజాతనగర్: క్రీడలతో ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. వేపలగడ్డలో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో బ్యాడ్మింటన్ స్టేడియం నిర్మించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా బ్యాడ్మింటన్ ఆటపై మక్కువ పెరుగుతుందని అన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధనే ముఖ్యమని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, స్టేడియం నిర్వాహకులు చెరుకుమల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముందుగానే తొలకరి..
● ఉపరితల ఆవర్తనంతో వర్షాలు ● వారంలోగా రుతుపవనాలు వస్తాయంటున్న వాతావరణ శాఖ ● వానాకాలం పంటల సాగుకు రైతుల సమాయత్తంబూర్గంపాడు: ఈ ఏడాది తొలకరి ముందుగానే పలకరిస్తోంది. మే నెలలో కురిసిన అకాల వర్షాలతో భూములు పదునయ్యాయి. గత మూడు రోజులుగా ఉపరితల ఆవర్తనంతో జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో రుతుపవనాలు కూడా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఈ కార్తెలో సాధారణంగా ఎండల తీవ్రత పెరుగుతుంది. అయితే ఉపరితల ద్రోణి ప్రభావం, రుతుపవనాలు ముందస్తుగా వస్తాయనే సమాచారంతో ఈ ఏడాది ముందుగానే పంటలు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పదునెక్కిన భూములు.. ఇటీవలి వర్షాలతో భూములు పదునెక్కగా వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచే పత్తితో పాటు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, పిల్లి పెసర, పెసర పంటలు కూడా సాగు చేస్తారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో జూన్ రెండో వారంలో వరి నార్లు పోస్తారు. వర్షాలు కురుస్తుండడం, రుతుపవనాలు ముందుగానే వస్తాయనే వాతావరణశాఖ సూచనలతో పంటల సాగు పనులు ప్రారంభించారు. గత సీజన్లో సాగు చేసిన పత్తి, మిరప వ్యర్థాలను తొలగించి భూములు శుభ్రం చేస్తున్నారు. వరి మాగాణుల గట్లు సరిచేసుకుంటున్నారు. పశువుల ఎరువు, చెరువు మట్టిని పొలాల్లో తోలుకుంటున్నారు. చేలలో నీటి గుంతలు, పంట కాల్వలు తవ్వుతున్నారు. మరోవైపున పెట్టుబడి ఖర్చులకు డబ్బులు సమకూర్చుకుంటున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలను వేసుకుంటున్నారు. ఏ భూముల్లో ఏ విత్తనాలు వేయాలి, ఏ కంపెనీ విత్తనాలు తీసుకోవాలనే చర్చ రైతుల్లో సాగుతోంది. మరో వారం రోజుల్లో సాగు పనులు ముమ్మరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళంశ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి విశాఖపట్టణానికి చెందిన గవిరెడ్డి కస్తూరి నాయుడు దంపతులు రూ.1,00,016, కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం పైడికొండల పాలెం గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీయదత్త దంపతలు రూ.2.50 లక్షలు ఆలయ ఈఓ రమాదేవికి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ లింగాల సాయిబాబు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కలిసి నడిస్తేనే పార్టీ బలపడుతుందిడీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య కొత్తగూడెంఅర్బన్: నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి నడిస్తేనే పార్టీ బలపడుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. కొత్తగూడెంలో బుధవారం జరిగిన పార్టీ సంస్థాగత సభకు జిల్లా అబ్జర్వర్లు శ్రవణ్కుమార్రెడ్డి, ప్రమోద్కుమార్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాలు, ఏ, బీ బ్లాక్ల అధ్యక్ష పదవులకు ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తికొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడిఝెట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 27 వరకు పరీక్షలు జరగనుండగా మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆదివారంతో సహా ప్రతీ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం వారికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 7,635 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సమయానుకూలంగా బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచుతున్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. -
ఆయిల్పామ్ సాగుతో లాభాలు
టేకులపల్లి : పామాయిల్ సాగుతో అనేక లాభాలు ఉన్నాయని ఉద్యాన శాఖ జిల్లా అధికారి జె.కిశోర్కుమార్, వ్యవసాయ శాఖ ఏడీఏ జి.లాల్చంద్ అన్నారు. మండలంలోని చింతోనిచెలకలో ఉద్యాన, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఎకరానికి 57 పామాయిల్ మొక్కలు వేయాలని, డ్రిప్ పరికరాల కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తామని చెప్పారు. మూడేళ్లపాటు ఎకరానికి రూ.4200 చొప్పున రైతుల ఖాతాలల్ల జమ చేస్తామన్నారు. పామాయిల్ గెలలు 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తాయని, నికర ఆదాయం ఉంటుందని వివరించారు. పామాయిల్లో అంతర పంటగా మునగ సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ అన్నపూర్ణ, హెచ్ఓ స్రవంతి, ఏఈఓ రెహనా, ఇరిగేషన్ మేనేజర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన శాఖాధికారి కిశోర్కుమార్ -
విద్యారంగ అభివృద్ధికి తోడ్పడాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాయకత్వ లక్షణాల పెంపుదలతో పాటు విద్యారంగాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరాచారి అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో హెచ్ఎంలకు జరుగుతున్న వృత్యంతర శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి మాట్లాడారు. విద్యారంగ డిజిటలీకరణ వైపుగా రాష్ట్రం ముందుకు సాగుతోందని, మార్పులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుని నాయకత్వ పటిమతో పని చేయాలని సూచించారు. ఐదు రోజుల శిక్షణలో రిసోర్స్ పర్సన్లు చెప్పే అంశాలను శ్రద్ధగా విని నోట్స్ రాసుకోవాలని, పాఠశాలకు వెళ్లిన తర్వాత వాటిని సరైన రీతిలో ఆచరించాలని అన్నారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్ర సమన్వయకర్త, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, రిసోర్స్పర్సన్లు ఆనందకుమార్, మీరా సాహెబ్, విజయబాబు, బాబూలాల్ పాల్గొన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభం.. 2025 – 26 విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ తెలిపారు. పాఠశాలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు 5,08,400 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 4,01,875 పుస్తకాలు వచ్చాయని వివరించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి -
భూ సేకరణ వేగవంతం చేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం సూపర్బజార్(కొత్తగూడెం): సీతారామ కెనాల్ ఎత్తిపోతల పథకానికి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన ఇరిగేషన్, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో గ్రామసభల నిర్వహణ పూర్తి చేయాలని చెప్పారు. కాల్వల ఏర్పాటుతో రైతులకు భూమి విలువ పెరుగుతుందన్నారు. ఇరిగేషన్ అధికారులు, సర్వేయర్లు సమన్వయంతో భూసేకరణ చేయాలని సూచించారు. సర్వేయర్లకు అధునాతన యంత్రపరికరాలు, ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. సర్వేలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని, తద్వారా నీటి నిల్వలు పెంచుకోవచ్చని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెరువులు, కాల్వల వెంట సుబాబుల్, తంగేడు, తాటి మొక్కలు నాటేలా అవగాహనా కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కాశయ్య, సుమ, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈలు అర్జునరావు, సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి చుంచుపల్లి: మండలంలోని రామాంజనేయ కాలనీ, వెంకటేశ్వర కాలనీల సమగ్రాభివృద్ధికి శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఈ రెండు గ్రామాల్లో పర్యటించారు. డ్రెయినేజీలు, రహదారులు, ఖాళీ స్థలాలను పరిశీలించి ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రెండు గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపునకు సిద్ధంగా ఉన్నామని, వసతుల కల్పనకు తక్షణమే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం తదితర పథకాల్లో ఈ గ్రామాలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ సుభాషిని, ఎంపీఓ సత్యనారాయణ, స్థానిక నాయకులు జేబీ శౌరి, దుర్గేష్ తదితరులు ఉన్నారు. -
ఆయుర్వేదం.. అందని వైద్యం
● బాధితులకు సకాలంలో అందని మందులు ● వారంలో మూడు రోజులే వస్తున్న డాక్టర్లు ● జిల్లాలో 12 వైద్యశాలలు, వెల్నెస్ సెంటర్లు ● అంతటా ఇదే పరిస్థితి.. ఇల్లెందు: ఆధునిక వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా నేటికీ కొందరు ఆయుర్వేద, యునానీ, హోమియో మందులపైనే ఆధారపడుతున్నారు. అయితే సిబ్బంది కొరత, ఉన్నవారూ అంతంతమాత్రంగానే పని చేస్తుండడంతో బాధితులకు సకాలంలో మందులు అందడం లేదు. జిల్లాలో 12 ఆయుర్వేద, యునానీ, హోమియో ఆస్పత్రులు ఉండగా, డాక్టర్లు వారంలో మూడు రోజులే వైద్యశాలకు వస్తుంటారు. అప్పుడు కూడా పేషెంట్లకు సరైన చికిత్స అందడం లేదు. ఎస్ఎన్ఓలే దిక్కు.. జిల్లాలో 12 ఆస్పత్రులకు అనుబంధంగా వెల్నెస్ సెంటర్లు నెలకొల్పారు. ఈ వైద్యశాలల్లో నలుగురే డాక్టర్లు ఉన్నారు. వీరంతా ప్రతీ గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే వస్తుంటారు. అతి తక్కువ మంది ఉన్న ఫార్మసిస్టులు, స్వీపర్ కం నర్సింగ్ ఆర్డర్లీ(ఎస్ఎన్ఓ)లు మాత్రమే బాధితులకు మందులు ఇస్తుంటారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు ఔట్సోర్సింగ్ పద్ధతిన డీపీఎంలను నియమించినా వారూ అంతంతమాత్రంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్నిచోట్ల ఆస్పత్రుల తాళాలు తీసే దిక్కే లేదు. లోపాలు అనేకం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలన వికేంద్రీకరణపై మొగ్గు చూపిన ప్రభుత్వం.. ఆయుర్వేద, యునానీ, హోమియో వైద్యశాలలను మాత్రం విస్మరించింది. వీటికి జిల్లా స్థాయిలో అధికారులు లేరు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు వరంగల్ కేంద్రంగా రీజినల్ డైరెక్టర్(ఆర్డీ) పర్యవేక్షిస్తున్నారు. అలా కాకుండా ప్రతీ జిల్లాకు పాలనాపరంగా అధికారిని నియమించడంతో పాటు సిబ్బంది సంఖ్య పెంచాలని, నిత్యం ప్రజలకు వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు. ‘ఇల్నెస్’ సెంటర్లుగా.. జిల్లాలో 12 ఆయుర్వేద, హోమియో, యునానీ వైద్యశాలలకు అనుబంధంగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసినా వాటిని తెరిచే నాథుడు లేక అవి ఇల్నెస్ సెంటర్లుగా మారాయి. జిల్లాలో రొంపేడు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వాపురం, కరకగూడెం, నాగుపల్లిలో ఆయుర్వేద ఆస్పత్రులు, ఇల్లెందు, అశ్వారావుపేట, ఆర్ కొత్తగూడెంలో హోమియో, భద్రాచలం, పాపకొల్లులో యునానీ ఆస్పత్రులు ఉండగా అన్నింటికీ కలిపి నలుగురే డాక్టర్లు ఉన్నారు. ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆస్పత్రిని అందుబాటులో ఉంచాలి.. ఇల్లెందులోని హోమియో వైద్యశాలను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలి. రెగ్యులర్ డాక్టర్, ఫార్మసిస్ట్, స్వీపర్ను నియమించాలి. సరిపడా మందులు నిల్వ ఉంచాలి. అధిరారుల పర్యవేక్షణ నిరంతరం ఉండేలా చూడాలి. – మునిగంటి శివ, ఇల్లెందు ఇన్చార్జ్గా విధులు నిర్వహిస్తున్నా ఇల్లెందు ప్రభుత్వ హోమియో వైద్యశాలలో గత కొంత కాలంగా ఇన్చార్జ్గా సేవలు అందిస్తున్నా. గార్లలో రెగ్యులర్ డాక్టర్గా రెండు చోట్లా పని చేయడంతో వారానికి మూడు రోజులే రావాల్సి వస్తోంది. త్వరలో డాక్టర్ పోస్టులు భర్తీ అవుతాయి. కొన్ని రకాల మందులు తక్కువ ఉన్నాయి. – డాక్టర్ జ్యోతి, ప్రభుత్వ హోమియో వైద్యశాల, ఇల్లెందుతీవ్రంగా మందుల కొరత.. జిల్లా వ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ఆయుర్వేద వైద్యం పొందే మార్గం ఉన్నా అటు డాక్టర్లు, ఇటు మందులు అందుబాటులో లేక ప్రజల్లో ఆదరణ తగ్గింది. కొందరు ఆయుర్వేద వైద్యం, మందులపై నమ్మకంతో ఆస్పత్రిఇ వస్తున్నా వారికి సకాలంలో చికిత్స అందకపోగా మందుల కొరతా వేధిస్తోంది. డాక్టర్లు లేకపోవడంతో మందులకు ఇండెంట్ పెట్టే వారు కూడా ఉండడం లేదు. -
సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి
చుంచుపల్లి: ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేస్తూ విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. బుధవారం ఆయన చుంచుపల్లి పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చేలా బాధ్యతగా మెలగాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో–ఆర్డినేషన్ సెంటర్ను సందర్శించారు. ఇప్పటివరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ నేరాల వివరాలు, వాటి పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లాలోని పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం పాటిస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్, ఎస్సై ఉమ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్ రాజు -
సులభంగా.. వేగంగా..
● భూ భారతి చట్టంతో సమస్యలకు పరిష్కారం ● పైలట్ ప్రాజెక్ట్గా సుజాతనగర్ మండలం ఎంపిక ● రెవెన్యూ సదస్సుల్లో 2,835 దరఖాస్తులు..సుజాతనగర్: భూ భారతి చట్టం అమలుకు జిల్లాలో సుజాతనగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా, రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన లభించింది. పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు సులభతరం చేయడంతోపాటు తహసీల్దార్, ఆర్డీఓలకు అధికారాలు కల్పించడంతో సమస్యలు వేగవంతంగా పరిష్కారం కానున్నాయి. సుజాతనగర్ మండలంలో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆయా సదస్సులో భూ సమస్యలపై 2,835 దరఖాస్తులు అధికారులకు అందాయి. సాదాబైనామా, అసైన్డ్ భూములు, పాసు పుస్తకాల జారీ, పోడు భూములు, గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనుగోలు చేయడం వంటి సమస్యలపై పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అర్జీలను ఆన్లైన్చేసి, విచారణ త్వరితగతిన పూర్తిచేసి పరిష్కరించనున్నట్లు తెలుస్తోంది. సాదాబైనామా అర్జీలే ఎక్కువ.. మొత్తం 2,835 దరఖాస్తుల్లో సాదాబైనామా 1,240, వారసత్వం 118, ఫామ్ కే 103, పెండింగ్ మ్యుటేషన్ 3, పాసు పుస్తకాలపై 314, డీఎస్ పెండింగ్ 12 దరఖాస్తులతోపాటు, పోడు భూములు, అసైన్డ్ ల్యాండ్ అన్యాక్రాంతం, ఇతరత్రా కోర్టు కేసులకు సంబందించిన దరఖాస్తులు కూడా వచ్చాయి. వీటిలో ప్రస్తుతం వారసత్వం భూములు, గిరిజనులు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్కు సిద్ధంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నారు. డిప్యూటీ తహసీల్దార్, గిర్దావర్, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్లతో మూడు బృందాలుగా అధికారులు ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి భౌగోళిక హద్దులను ఏర్పాటు చేయనున్నారు. రైతులకు ప్రయోజనం ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పుడు సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రతీ సమస్య సీసీఎల్ఏ వరకు వెళ్లే పరిస్థితి ఉండేది. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదు. దీంతో రైతులు చేసేదేమి లేక ఇబ్బందులకు గురయ్యారు. ధరణి స్థానంలో వచ్చిన భూ భారతి చట్టంతో సులభంగా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉండటంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా త్వరలోనే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. సుజాతనగర్ మండల స్వరూపం విస్తీర్ణం 24,927.18 ఎకరాలు అటవీ భూమి 7,535.25 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ 558.13 ఎకరాలు ప్రభుత్వ భూమి 2,241.28 ఎకరాలు రెవెన్యూ గ్రామాలు 6 గ్రామ పంచాయతీలు 20పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేశా.. మా తాత కాకటి పుల్లయ్య ద్వా రా మా నాన్న వెంకయ్యకు వా రసత్వంగా 444 సర్వే నంబర్లో 2 ఎకరాల భూమి వచ్చింది. ఈ భూమిని గత 50 ఏళ్లుగా మా నాన్నే సాగు చేస్తున్నాడు. పాసు పుస్తకం లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు పొందలేకపోతున్నాం. ఇటీవల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాస్ బుక్ కోసం దరఖాస్తు చేశాను. –కాకటి సునీల్ కుమార్, సింగభూపాలెం సమస్యలకు పరిష్కారం మండలంలో మొత్తం 2,835 దరఖాస్తులు రాగా, మూడు బృందాలుగా దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. వారసత్వం, గిరిజనులు కొనుగోలు చేసి రిజి స్ట్రేషన్కు సిద్ధంగా ఉన్న భూ సమస్యలకు ప్రస్తుతం పరిష్కారం లభించనుంది. ప్రభుత్వ అనుమతి అనంతరం సాదాబైనామా దరఖాస్తులను విచారిస్తాం. –వనం కృష్ణప్రసాద్, తహసీల్దార్, సుజాతనగర్ -
సదస్సులు లేవు.. చైతన్యం లేదు..
వైరారూరల్: పంటల సాగులో అవలంబించాల్సిన విధానాలు, విత్తనాల ఎంపిక జాగ్రత్తలు, సాగుకు ముందు చేయించాల్సిన భూపరీక్షలు ఇలా పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉమ్మడి ఆంధ్రపదేశ్గా ఉన్నప్పడు రైతు చైతన్య యాత్రలు నిర్వహించేవారు. తెలంగాణ ఏర్పడాక బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ పేరుతో రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఏటా వానాకాలం సాగుకు ముందు ఏప్రిల్, మే నెలల్లో అవగాహన సదస్సులను నిర్వహించేది. కానీ గత రెండేళ్ల నుండి ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ ఏటా సదస్సుల ఊసెత్తడం లేదు. దీంతోఆధునిక విధానాలపై అవగాహన లేక, ఏళ్లుగా ఒకే పంట సాగు చేస్తూ, అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతూ రైతులు నష్టపోవడం అనవాయితీగా మారింది. అవగాహనలేమితో నష్టాలు గ్రామాల వారీగా రైతుల వద్దకు వెళ్లి సాగులో మెళకువలపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాక నష్టాలు తగ్గే అవకాశముంది. గతంలో సదస్సులు నిర్వహించినప్పుడు వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్లి వివిధ అంశాలపై అవగాహన కల్పించడమే కాక రైతుల నుంచి సంతకాలు సేకరించేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు సమన్వయ సమితిల జాడ లేకపోగా, అవగాహన సదస్సుల విషయాన్నే మరిచిపోయారు. ఈ ఏడాది ‘రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ పేరిట సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ నిర్దేశిత ప్రాంతాల్లోనే ఏర్పాటుచేస్తుండడంతో రైతులకు సలహాలు అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఊసే లేని ‘మన తెలంగాణ– మన వ్యవసాయం’ రెండేళ్ల క్రితం వరకు ఏప్రిల్, మేలో అవగాహన సదస్సులు ఈసారి మండలానికొక సదస్సుతో సరి -
డయాగ్నస్టిక్ సెంటర్ సీజ్
మణుగూరు రూరల్: మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ రక్త పరీక్షా కేంద్రాలను డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చైతన్య, డీఈఎంఓ డాక్టర్ ఫయాజ్ మోహినుద్దీన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, రికార్డులను పరిశీ లించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించి నిర్వహిస్తున్న ఎస్వీ డయాగస్టిక్ సెంటర్ను సీజ్ చేశారు. హెల్త్ ఎడ్యుకేటర్ సీహెచ్ శ్రీనివాస్ లీలా, ఎండీ సాధిక్ తదితరులు పాల్గొన్నారు ‘సీతారామ’ భూసేకరణకు గ్రామసభలుఅశ్వారావుపేటరూరల్: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ నంబరు–7, 8వ డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణాల కోసం గ్రామసభలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం, నారంవారిగూడెం,అశ్వారావుపేట, జమ్మిగూడెం, మద్దికొండ, 23న ఆసుపాక, వేదాంతపురం, తిరుమలకుంట, గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, గ్రామ పంచాయతీ కార్యాలయం, 24న రామన్నగూడెం, అనంతారం, కన్నాయిగూడెం, నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలను నిర్వహిస్తామని తెలిపారు. సభల్లో మొత్తం 848.28 ఎకరాల భూసేకరణకు సంబంధించి ఆయా రైతులతోపాటు, పీసా గ్రామసభలకు కార్యదర్శులు, పీసా కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు, గ్రామపెద్దలు హాజరు కావాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం జిల్లా కోర్టులో పది మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజ మల్లు బుధవారం తీర్పుచెప్పారు. కొత్తగూడెం వన్ టౌన్ పరిధి, లక్ష్మీదేవిపల్లి ఏరియా, పాల్వంచ ఏరియాలలో పోలీసులు తనిఖీలు చేపట్టి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పది మందిని పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి వారికి జరిమానా విధించారు. టీజీఆర్జేసీలో చాణక్యకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్చుంచుపల్లి/సింగరేణి(కొత్తగూడెం): రాష్ట్రంలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన టీజీఆర్జేసీ పరీక్షలో రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి బొమ్మిశెట్టి చాణక్య అభినవ ఎంఈసీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. కాగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ర్యాంకు సాధించినట్టు విద్యార్థి చాణక్య తెలిపాడు. పీవీకే–5 గనిలో గ్యాస్ లీక్గోడలు నిర్మించటంతో తప్పిన ప్రమాదం సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్ గనిలో మంగళవారం 16 రేస్ 72 లెవల్ వద్ద గ్యాస్ విడుదలగా, విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. గనిలో గ్యాస్ను గుర్తించే మానిటరింగ్ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి గని మేనేజర్ ప్రసాద్కు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమై రెండు రోజులుగా గ్యాస్లీకేజీ అవుతున్న ఏరియాలో గోడలు నిర్మించి గ్యాస్ లీకేజీని అరికట్టారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ విషయమై గని మేనేజర్ను వివరణ కోరగా.. పాత గని కావడంతో జియాలజికల్ సమస్యలు తలెత్తాయని, భయపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యంపార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి పాల్వంచరూరల్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. వర్తక సంఘం భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో గాంధీనగర్, శ్రీనగర్ ఏరియాల నుంచి కేతిని కుమారి, ఎర్రంశెట్టి రాజేశ్వర్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు పార్టీ లో చేరాయి. ఈ సందర్భగా ఆయన మాట్లాడు తూ బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలోనాయకులు రాపాకరమేష్, కళ్లెంవిజయరెడ్డి,భూక్య రవి, వెంకటేశ్వరరావు, రంజిత్కుమార్, నాగరాజు పాల్గొన్నారు. -
ప్రతిభావంతులకు ప్రశంసా పత్రాలు
దమ్మపేట: పదోతరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరి చిన దమ్మపేట మండలానికి చెందిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ధనసరి సీతక్క, శాఖ కార్యదర్శి శరత్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. బుధవారం హైదరాబాద్లోని కొమురం భీమ్ భవన్లో గిరి జన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అకాడమిక్ సక్సెస్ మీట్(2024–25)ను ఘనంగా నిర్వహించారు. 575, 569 మార్కులతో గిరిజన ఆశ్రమ పాఠశాల పరిధిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన అంకంపాలెం బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వాడే మౌనిక, స్రవంతిలకు గోల్డ్ మెడళ్లను అందజేశారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలను కూడా మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. ఏటీడీఓ చంద్రమోహన్, హెచ్ఎంలు శారద, చంద్రకళ, వార్డెన్ నాగమణి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన అంకంపాలెం విద్యార్థినులు -
తారుప్లాంట్లో అగ్నిప్రమాదం
బూర్గంపాడు: మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామంలో ఉన్న తారుప్లాంట్లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తారు ప్లాంట్ నుంచి దట్టమైన పొగతో మంటలు వ్యాపించటంతో ఆ ప్రాంతమంతా చీకటిగా మారింది. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ప్లాంట్లో పనిచేసే కార్మికుల సమాచారంతో భద్రాచలం నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. భద్రాచలం ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, ఫైర్మెన్లు కిరణ్, యాకుబ్, వెంకట్రామిరెడ్డి మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ఆర్టిజన్లకు బదిలీల భయం
● కేటీపీఎస్లో అరకొర వేతనాలతో పనిచేస్తున్న కార్మికులు ● పర్మనెంట్ చేశాకే బదిలీ చేయాలని డిమాండ్ పాల్వంచ: కేటీపీఎస్ కర్మాగారంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు బదిలీల భయం పట్టుకుంది. ఇప్పటికే టీజీ జెన్కో పరిధిలోని పలు కర్మాగారాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాలతోపాటు, ఏఈ నుంచి ఎస్ఈ వరకు బదిలీలు జరిగాయి. కొత్తగా ఏర్పాటైన వైటీపీఎస్, బీటీపీఎస్లలో ఉద్యోగ, కార్మికులు అవసరం ఉండటంతో అక్కడికే ఎక్కువ మందిని బదిలీలు చేశారు. ఈ క్రమంలో కేటీపీఎస్లో అదనంగా ఉన్న ఆర్టిజన్లకు సైతం స్థానచలనం కలిగించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీలు సరికాదంటున్న కార్మికులు ఆర్టిజన్ కార్మికులు గ్రేడ్–1, 2 ,3, 4లుగా ఉన్నారు. స్కిల్ ఆధారంగా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. వీరు గతంలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసిన క్రమంలో స్కిల్ను బట్టి ఆయా కంపెనీలు పనికి తగిన వేతనం ఇచ్చేవి. గత ప్రభుత్వం వీరిని ఆర్టిజన్లుగా తీసుకోవడం, కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. తర్వాత కాలంలో పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకుంటారనే ఆశలో ఆర్టిజన్లు ఉన్నారు. కానీ పదేళ్లు గడుస్తున్నా ఉద్యోగుల మాదిరిగా వీరికి జెన్కో యాజమాన్యం సౌకర్యాలు కల్పించడంలేదు. పైగా అదనంగా ఉన్నారనే నెపంతో యాజమాన్యం ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలనే యోచన సరికాదనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నామని ఆర్టిజన్లు వాపోతున్నారు. ఉద్యోగులుగా తీసుకోవాలి ఇప్పటివరకు ఇతర కేడర్లలో అత్యధికంగా పదోన్నతులతోనే బదిలీలు చేపట్టారు. ఆర్టిజన్లు కేటీపీఎస్ 7వ దశలో 600 మంది, కేటీపీఎస్ 5,6 దశల్లో సుమారు 1,400 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. విద్యుత్ సంస్థలన్నింటిలో కలిపి సుమారు 24 వేల మంది ఉన్నారు. బదిలీ చేసే ముందు తమను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగులకు కల్పి స్తున్న సౌకర్యాలన్నీ తమకు కల్పించాలని ఆర్టిజన్లు కోరుతున్నారు. లేనిపక్షంలో బదిలీ యోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నిందితుడికి రిమాండ్
పాల్వంచ: వివాహిత ఆత్మహత్య కేసులో నిందితుడు, టీఎస్పీఎస్ కానిస్టేబుల్ నాగరాజును పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సుజాతనగర్ మండల కేంద్రానికి చెందిన బత్తుల వీరయ్య భార్య త్రివేణి(32)ని మరిది కానిస్టేబుల్ నాగరాజు వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్తాపం చెందింది. పాల్వంచలోని వికలాంగుల కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి శివ ఇంటికి వచ్చి సోమవారం చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు త్రివేణి ఆత్మహత్యకు కారణమైన మరిదిని అరెస్ట్ చేశారు. పశువులు స్వాధీనంటేకులపల్లి: టేకులపల్లి నుంచి పండితాపురం సంతకు అక్రమంగా తరలిస్తున్న పశువులను బుధవారం టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. తావుర్యాతండా పంచాయతీ ఈర్యాతండా వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు బొలెరో ట్రాలీలో తరలిస్తున్న ఏడు పశువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మునీర్, తేజవత్ ప్రసాద్, హైమద్లను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. పశువులను పాల్వంచ గోశాలకు తరలించామని ఎస్ఐ రాజేందర్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జూలూరుపాడు: మండలంలోని గుండెపుడి ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ బాదావత్ రవి కథనం ప్రకారం.. గుండెపుడి గ్రామ పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన పద్దం చిన్న నరసింహారావు(35), కల్తి కార్తీక్లు బైక్పై మంగళవారం రాత్రి జూలూరుపాడు వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా గుండెపుడి ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డుపై అడ్డుగా వచ్చిన గేదెలను బైక్ ఢీకొట్టింది. దీంతో పద్దం చిన్న నరసింహారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తీక్కు గాయాలయ్యాయి. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో ఎస్అండ్పీ గార్డు..ఇల్లెందు: పట్టణంలోని స్ట్రట్ఫిట్ బస్తీకి చెందిన సింగరేణి సెక్యూరిటీ గార్డు బి.రాజ్కుమార్(40) బుధవారం గుండె పోటుతో మృతిచెందాడు. ఉదయం విధుల నిమిత్తం ఆఫీస్కు వెళ్లిన ఆయనకు చెమటలు వచ్చి అస్వస్థత చెందడంతో సింగరేణి ఆస్పత్రికి వెళ్లాలని తోటి సిబ్బంది సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తానని చెప్పి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరిన కొద్ది సమయానికే మృతి చెందా డు. సహచర గార్డులు, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కర్ణాటకలో చోరీ.. వైరాలో రికవరీవైరా: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన చోరీకి సంబంధించి నిందితుడు వైరాలో పట్టుబడగా సొత్తు రికవరీ చేసి అక్కడి పోలీసులకు అప్పగించారు. ఈఏడాది ఫిబ్రవరి 12వ తేదీన వైరా లీలా సుందరయ్యనగర్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇక్కడ దొంగతనం చేసిన వారే అదే నెల 22 తేదీన కర్ణాటక రాష్ట్రంలోని చల్లెకిరే పోలీస్ స్టేషన్ పరిధిలోనూ చోరీకి పాల్పడ్డారు. ఈమేరకు వైరా సీఐ నూనావత్ సాగర్నాయక్ ఆధ్వర్యాన చేపట్టిన విచారణలో నిందితులు పట్టుబడగా వారి నుంచి బంగారాన్ని రికవరీ చేశారు. అందులో కర్ణాటకలో నమోదైన కేసుకు సంబంధించి 12తులాల బంగారు ఆభరణాలు, కారును చొల్లకిలే ఏఎస్ఐ రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ వసంత్కుమార్కు వైరాలో సీఐ సాగర్ బుధవారం అందజేశారు. -
అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలి
ములకలపల్లి: అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇవ్వాలని తెలంగాణా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలపరిధిలోని మాదారం గ్రామంలో తెలంగాణా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మండల సదస్సులో మాట్లాడారు. సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అన్నవరపు కనకయ్య, తెలంగాణా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండబోయిన వెంకటేశ్వర్లు, పార్టీ ములకలపల్లి, పాల్వంచ మండలాల కార్యదర్శులు ముదిగొండ రాంబాబు, పాకాల వెంకట్రావు, ఊకంటి రవికుమార్, మాలోతు రావూజా, నిమ్మల మధు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ -
ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: విద్యార్థులు విద్యతో పాటు ఇతర రంగాల్లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాణించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని కేజీబీవీలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి పీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించటం ద్వారా ఉన్నత విద్య సులభతరం అవుతందన్నారు. క్యాంపుల ద్వారా నేర్చుకున్న అంశాలను నిత్య జీవన శైలిలో అమలు పర్చాలని సూచించారు, కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వరచారి, ఎంఈఓ రమ,కొత్తగూడెం జీసీడీఓఅన్నామణి,విద్యార్థినులు పాల్గొన్నారు. దుమ్ముగూడెంలో.. దుమ్ముగూడెం: గిరిజన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొని అంతర్జాతీయస్థాయిలో రాణించడానికి అన్ని సౌకర్యాలతో కూడిన క్రీడా ప్రాంగణాలు అవసరమని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మంగళవారం మండలంలోని ములకపాడు, ములకనపల్లిలో నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణం, కమ్యూనిటీ హాల్, ఇండోర్ స్టేడియాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. పోలీస్ శిక్షణ తీసుకునే విద్యార్థులకు 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ నిర్మించాలన్నారు. రూ.10 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ త్వరితిగతిన పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ చంద్రశేఖర్, టీఏ శ్రీనివాస్, ఏఈ రవి తదితరులు పాల్గొన్నారు. -
కుమార్తెకు ఓణీల ఫంక్షన్ చేసి..
మరుసటిరోజు గుండెపోటుతో తండ్రి మృతి జూలూరుపాడు: తన కుమార్తెకు ఓణిల ఫంక్షన్ చేసిన తండ్రి మరుసటిరోజే గుండెపోటుతో మృతిచెందిన విషాద ఘటన మండలంలోని అనంతారంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్కం వెంకటేశ్వర్లు (55) ఓ ప్రైవేట్ బస్సుడ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం తన చిన్న కుమార్తె నాగపంచమి ఓణీల ఫంక్షన్ చేశారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో వెంకటేశ్వర్లు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య బాపమ్మ, ఇద్దరు కుమార్తెలు నాగప్రసన్న, నాగపంచమి ఉన్నారు. అనారోగ్యంతో బాలింత మృతిజూలూరుపాడు: మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన బాలింత సిద్ధెల శ్రావణి (21) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. రెండేళ్ల కిందట కాకర్ల గ్రామానికి చెందిన సిద్ధెల కిశోర్కు కల్లూరు మండలం చినకోరుకొండకు చెందిన శ్రావణితో వివాహమైంది. అనంతరం గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. నెల రోజుల కిందట ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, శ్రావణి పది రోజులుగా జ్వరంతోపాటు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో అక్కడ ఆసుపత్రిలో చేరింది. అయినా తగ్గకపోవడంతో భర్త కిశోర్ ఆమెను కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శ్రావణి మంగళవారం మృతిచెందింది. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య గుండాల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లి ఎస్ఐ సోమేశ్వర్ కథనం ప్రకారం.. కాచనపల్లి గ్రామానికి చెందిన పరిషక లక్ష్మయ్య (45 )సోమవారం సాయంత్రం మద్యం తాగి రావడంతో భార్య మందలించింది. మనస్తాపానికి గురై గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బైక్ను ఢీకొన్న కారు జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ సమీపంలో తల్లాడ – కొత్తగూడెం ప్రధాన రహదారిపై బైక్ను కారు ఢీకొన్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం పూసుగూడెంనకు చెందిన ధరావత్ ప్రవీణ్ బైక్పై ఖమ్మం నుంచి పాల్వంచ వెళ్తున్నాడు. వినోభానగర్ గ్రామం దాటిన తరువాత ఎదురుగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టడంతో ప్రవీణ్కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తప్పులు సరిదిద్దుకోండి
చండ్రుగొండ: ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో లబ్ధిదారుల పేర్లల్లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని జిల్లా హౌజింగ్ పీడీ శంకర్ సూచించారు. మండలంలోని బెండాలపాడు గ్రామంలో మంగళవారం ఆయన ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల జాబితాను పరిశీలించి మాట్లాడారు. తప్పులున్న వారి జాబితాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, ఆయన ఆదేశాల మేరకు వాటిని సరిదిద్దుతామని వెల్లడించారు. ఆయన వెంట దిశ కమిటీ సభ్యుడు బొర్రా సురేశ్, పంచాయతీ కార్యదర్శి రోహిత్, ఏఈలు రాము, వినయ్ తదితరులు పాల్గొన్నారు. సరళమైన పద్ధతిలో బోధించాలి పాల్వంచ: ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్ట్లో మెళకువలు నేర్చుకుని, సరళమైన పద్ధతిలో విద్యార్థులకు బోధించాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక కొమ్ముగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, సబ్జెక్ట్లను పూర్తిగా అవగాహన చేసుకుని, విద్యార్థులు అవపోసన పట్టే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్ ఎస్.సైదులు, డీఆర్పీలు సంపత్, ప్రభుసింగ్, అపక శంకర్, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. అత్యవసర సర్వీసులపై అవగాహన తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం సీహెచ్సీకి ఇటీవల 108, 102 నియోనేటల్ అంబులెన్స్ సేవలు మంజూరయ్యాయి. ఆయా వాహనాల్లో ఉన్న అత్యాధునిక పరికరాల వినియోగంపై అత్యవసర సేవల ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సీహెచ్సీకి మంగళవారం వచ్చిన ఆయన అంబులెన్స్ల్లోని సౌకర్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృపా ఉషశ్రీ ఉద్యోగులు దుర్గాప్రసాద్, శ్రీనివాస్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగి మృతదేహం లభ్యం సుజాతనగర్: మండలంలోని డేగలమడుగు సమీప పంట పొలాల్లో ఓ మృతదేహం ఉందనే సమాచారంతో పోలీసులు మంగళవారం విచారణ చేపట్టారు. ఈమేరకు పాల్వంచ టీచర్స్ కాలనీకి చెందిన పోస్టల్ విశ్రాంత ఉద్యోగి షేక్ ఖాసిం(61)గా గుర్తించారు. కాగా, డేగలమడుగు వాసులకు సోమవారం కనిపించిన ఆయన మంగళవారం మధ్యాహ్నానికి మృతదేహంగా మారాడు. ఖాసిం మరణంపై ఎలాంటి అనుమానం లేదని, అనారోగ్యంతో మృతి చెందాడని ఆయన కుమార్తె షేక్ మౌలాబీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.రమాదేవి తెలిపారు. దాడులకు పాల్పడడం హేయమైన చర్యఖమ్మంమామిళ్లగూడెం: ఆపరేషన్ సిందూర్ విజయవంతం సందర్భంగా సైనికుల త్యాగా లు, కేంద్ర ప్రభుత్వ ఘనతను కీర్తిస్తూ ఖమ్మంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తుంటే విచ్ఛిన్నం చేసేలా కొందరు దాడులకు పాల్పడటం గర్హనీయమని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిష్టను పెంచిన జవాన్ల వీరోచిత పోరాటాన్ని కొనియాడుతూ చేపట్టిన ర్యాలీకి మద్దతు తెలపాల్సింది పోయి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బాధాకరమని తెలి పారు. ఈమేరకు జాతీయవాదులపై దాడి చేసిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈసమావేశంలో నాయకులు నున్నా రవికుమార్, ఈ.వీ.రమేష్, సన్నే ఉదయ్ప్రతాప్, అల్లిక అంజయ్య, నంబూరి రామలింగేశ్వరరావు, రవిరాథోడ్, బెనర్జీ, నల్లగట్టు ప్రవీణ్కుమార్, ధనియాకుల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శిథిలావస్థలో సీఎంపీఎఫ్ కార్యాలయం
● 1985లో నిర్మాణం ● పర్యవేక్షణ కరువు.. నాణ్యతా లోపం.. ● క్వార్టర్లదీ అదే పరిస్థితి సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని సీఎంపీఎఫ్ (కొత్తగూడెం రీజియన్) భవనం శిథిలావస్థకు చేరింది. 1985లో సీఎంపీఎఫ్ సెంట్రల్ కార్యాలయం వారు కేటాయించిన నిధులతో సింగరేణిి యాజమాన్యం కాంట్రాక్టర్ ద్వారా నిర్మించిన ఈ భవనాన్ని 1987లో ఆనాటి సీఎంపీఎఫ్ కమిషనర్ శంకర్ ప్రసాద్ ప్రారంభించారు. 40 ఏళ్లకే పూర్తి శిథిలావస్థకు చేరిందంటే కాంట్రాక్టర్ కట్టిన నాణ్యత ఇట్టే అర్థం అవుతుంది. అంతే కాకుండా సివిల్ అధికారుల పర్యవేక్షణ, అధికారుల నిబద్ధత గురించి కార్మికులు గుసగుసలాడుతున్నారు. రీజియన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల భవిష్యనిధి అంటే సుమారు 20 వేల మంది కార్మికుల భవితవ్యం ఈ కార్యాలయంలో ఉంటుంది. కార్పొరేట్ ఏరియాకు కూతవేటు దూరంలోనే సివిల్ జీఎంలతోపాటు, ఇతర ఉన్నతాధికారులు ఉండే కార్యాలయ నిర్మాణం ఈవిధంగా ఉందంటే ఇతర ఏరియాలలో కాంట్రాక్టర్లు నిర్మించి భవనాల తీరు ఏవిధంగా ఉంటుందో, ఎంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో అర్థం అవుతంందని కార్మికులు చర్చించుకుంటున్నారు. పెచ్చులు ఊడి పడుతున్న స్లాబ్.. భవనంలో స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయి. ఎప్పడు ఏం జరుగుతుందోనని భయాందోళనలతో ఉద్యోగులు ఇటీవల పక్కనే ఉన్న మరో కార్యాలయంలోకి మారారు. అయినా సింగరేణి అఽధికారులు పట్టించుకోవటం లేదు. ఇదిలా ఉండగా, సీఎంపీఎఫ్ కార్యాలయం వెనక సింగరేణి కాంట్రక్టర్లు నిర్మించిన క్వార్టర్లు కూడా ఇదే పరిస్థితి. ఇటీవల కాలంలో మరమ్మతులు చేశారు. అయినా మార్పు లేదని, ఉద్యోగులు గమనించి బయట కిరాయికి ఉంటున్నారు. క్వార్టర్లు ఉండి ఉద్యోగులు బయట కిరాయికి ఉండటం గర్హనీయం. ఈ భవనం, క్వార్టర్ల కోసం సుమారు 40 ఏళ్ల క్రితం ఆనాటి ఎస్టేట్స్ అధికారులకు సుమారు 5 ఏకరాల స్థలాన్ని లీజ్కు లీజుకు ఇచ్చింది. కార్మికుల భవిష్యనిధి వివరాలు, సీఎంపీఎఫ్ పేరిట వసూలు అవుతున్న కోట్లాది రుపాయల లెక్కలు ఉండే కార్యాలయం, క్వార్టర్ల మెయింటునెన్స్ను కంపెనీ పట్టించుకోకపోవటం విచారకమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కార్పొరేట్ ఆధికారులు సీఎంపీఎఫ్ కార్యాలయం, క్వార్టర్లపై దృష్టి సారించి మరమ్మతులు చేయించి, ఉద్యోగులకు ఇవ్వాలని లేదంటే పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ క్వార్టర్ల స్థలం కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని కార్మికులు అంటున్నారు. -
పత్తి సాగుకు సై !
దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు ● ఉమ్మడి జిల్లాలో 4.27 లక్షల ఎకరాల్లో సాగు అంచనా ● 9 లక్షలకు పైగా విత్తన ప్యాకెట్ల అవసరం ● త్వరలోనే డీలర్లతో భేటీ, విక్రయాలకు అనుమతి ఖమ్మంవ్యవసాయం: పత్తి సాగుకు సమయం సమీపిస్తోంది. కొద్దిరోజులుగా అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు దుక్కులు దున్నే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 27వ తేదీ నాటికి దేశంలోకి ఆ తర్వాత, కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. తొలకరి వర్షాలు కురవగానే రైతులు పత్తి సాగుపై దృష్టి సారించనుండడంతో అవసరమైన ఏర్పాట్లకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. పెరిగిన విత్తన ధరలు ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోని 2.13 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2.14 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ ప్రణాళికలో పేర్కొంది. ఎకరాకు 450 గ్రాములవి రెండు విత్తన ప్యాకెట్లను వినియోగిస్తారు. ఉమ్మడి జిల్లా రైతులకు అవసరమైనవే కాక అదనంగా కలిపి 10.10 లక్షల మేర ప్యాకెట్లను సమకూర్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ విత్తన కంపెనీల నుంచి ఖమ్మం జిల్లా డీలర్లు 36,279 ప్యాకెట్లు, భద్రాద్రి జిల్లా డీలర్లు 1.83 లక్షల ప్యాకెట్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడి నేలలకు అనుకూలమైన నూజివీడు, తులసి, యూఎస్, రాశి, ఆశ, డాక్టర్ బెంట్, నీరజ, అంకూర్, కావేరి తదితర కంపెనీ విత్తనాలను అమ్మేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, గత ఏడాది 450 గ్రాముల విత్తన ప్యాకెట్ ధర రూ.864 ఉండగా, ఈ ఏడాది రూ.37 పెంచి రూ.901గా నిర్ణయించారు. త్వరలోనే డీలర్లతో సమావేశం పత్తి సీజన్ సమీపిస్తున్న వేళ విత్తన విక్రయాలపై డీలర్లతో సమావేశం నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. నాణ్యమైన విత్తనాల విక్రయం, ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిజిస్టర్ల నిర్వహణ, ధరలు, బ్లాక్ మార్కెట్ను అరికట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో విత్తన విక్రయాలకు ఇచ్చే అనుమతులపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటు నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టేలా మండలాలు, డివిజన్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసే ఈ బృందాల్లో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను సభ్యులుగా నియమిస్తారు. జిల్లాస్థాయి బృందాల్లో ఏడీఏ, డీఎస్పీ లేదా సీఐ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారి, డివిజన్స్థాయి కమిటీలో ఏడీఏ, ఎంఈఓ, మండలస్థాయి కమిటీలో ఏఓ, ఎస్ఐలు, రెవెన్యూ సిబ్బంది ఉంటారు. అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలు అమ్మే దళారులు.. అక్రమాలకు పాల్పడే డీలర్లపై నిఘా వేసి రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటారు. ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు ప్రణాళిక జిల్లా సాగు (ఎకరాల్లో)్ఞ విత్తనాలు (ప్యాకెట్లు) అందుబాటులో ఉన్నవి ఖమ్మం 2.13లక్షలు 4.82 లక్షలు 37 వేలు భద్రాద్రి 2.14లక్షలు 4.84 లక్షలు 1.83లక్షలు త్వరలోనే భేటీ, అనుమతులు పత్తి సాగు చేసే రైతులకు అవసరమైన విత్తనాలు సమకూర్చనున్నాం. లైసెన్స్డ్ డీలర్ల వద్ద అందుబాటులోకి తీసుకొస్తాం. అయితే, ఇంకా విత్తన విక్రయాలకు అనుమతులు ఇవ్వలేదు. త్వరలోనే డీలర్లతో సమావేశం నిర్వహించి విక్రయాలకు చర్యలు తీసుకుంటాం. అలాగే, నకిలీ విత్తన విక్రయాలను సమర్థవంతంగా నిలువరించేలా టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తాం. –ధనసరి పుల్లయ్య, ఖమ్మం డీఏఓ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చండ్రుగొండకు చెందిన ఎస్కే మౌలాన (70) అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో ఉంటున్నాడు. మధ్యాహ్నం తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో సత్తుపల్లి నుంచి బొగ్గులోడుతో కొత్తగూడెం వైపు వెళ్తున టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మౌలానా అక్కడికక్కడే మృతిచెందగా.. వేగంగా వెళ్తున్న టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబీకులు, స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నాగరాజు తెలిపారు. మృతుడికి భార్య, ఏడుగురు పిల్లలు ఉన్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు భద్రాచలంఅర్బన్: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మంగళవారం తీర్పునిచ్చారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ ముదిగొండ రామకృష్ణ 2022 ఏప్రిల్ 22న ఓ గర్భిణికి సిజేరియన్ చేస్తున్న సందర్భంలో ముద్దాయి గుర్రం లాల్ఖాన్ సదరు మహిళతో అవమానకరంగా ప్రవర్తించాడని భద్రాచలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయగా పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి శివనాయక్ మంగళవారం పైవిధంగా తీర్పునిచ్చారు. అక్రమంగా మట్టి తవ్వుతున్న జేసీబీ సీజ్ దమ్మపేట: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న జేసీబీని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని అప్పారావుపేట శివారులో మంగళవారం అనుమతులు లేకుండా జేసీబీ యంత్రంతో మట్టిని తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. గ్రామస్తులు తవ్వకాలను అడ్డుకుని, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ఐ భిక్షం జేసీబీని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. -
కాంగ్రెస్ను పటిష్టపర్చాల్సి ఉంది..
ఇల్లెందు/మణుగూరుటౌన్: దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని, గ్రామస్థాయి నుంచి పటిష్టపర్చాలని, ఇలాంటి తరుణంలో కాంగ్రెస్కు పూర్తిస్థాయి కార్యకర్తలు అవసరమని టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ పి.శ్రావణ్కుమార్రెడ్డి, ప్రదాన కార్యదర్శి ప్రమోద్కుమార్ వెల్లడించారు. మంగళవారం పట్టణంలోని ఐతా ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సంస్థాగత కమిటీల పదవులకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, దేశంలో అధికారం సాధించి, రాహుల్ను ప్రధానిని చేసేందుకు ప్రతీ కార్యకర్త పోరాడాలని కోరారు. అందుకోసం ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి సూచనలతో గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పటిష్టం చేయాల్సి ఉందన్నారు. 2017 పూర్వం నుంచి పార్టీ లో ఉన్న వారికి పదవులు వస్తాయని, దరఖాస్తులు పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య, ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు. డానియేల్, పులి సైదులు, దేవానాయక్, రవికుమార్, జిల్లా కిసాన్ కమిటీ అధ్యక్షులు ఏలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, మణుగూరులోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా.. శ్రావణ్కుమార్రెడ్డి, ప్రమోద్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఏ, బీ బ్లాక్ అధ్యక్షుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రావణ్కుమార్రెడ్డి -
వైభవంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి మంగళవారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. మంగళవారం సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలను గావించారు. రాంబంటుకు పట్టువస్త్రాలు.. కొండగట్టు అంజన్నకు కానుకలు సమర్పించిన భద్రగిరి ఈఓ భద్రాచలం: కొండగట్టు అంజన్న స్వామికి భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అధికారులు మంగళవారం పట్టువస్త్రాలను సమర్పించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భద్రగిరి రామయ్య తరఫున పట్టువస్త్రాలను, కానుకలను సమర్పించటం కొన్నేళ్లుగా వస్తున్న సంప్రదాయం. ఈ నెల 22న హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, వైదిక సిబ్బంది కొండగట్టు చేరుకుని పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీసీకి కార్మికులే మూలస్తంభం రీజినల్ మేనేజర్ సరిరామ్ మణుగూరు టౌన్: టీజీఎస్ ఆర్టీసీ సంస్థకు కార్మికులే మూలస్తంభమని, అభివృద్ధిలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు కీలకపాత్ర పోషిస్తున్నారని ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ అన్నారు. మంగళవారం మణుగూరు డిపోలో రీజినల్స్థాయి ప్రగతి చక్ర అవార్డులను ప్రదానం చేశారు. డ్రైవర్ కేటగిరీలో 10 మందికి, కండక్టర్ కేటగిరీలో ఏడుగురు, టీ డ్రైవర్ కేటగిరీలో ముగ్గురు, మెకానికల్ కేటగిరీలో ముగ్గురు, పీహెచ్బీ డ్రైవర్ కేటగిరీలో ఐదుగురికి, ఉత్తమ బస్టాండ్గా ఖమ్మం కొత్త బస్టాండ్కు, మొత్తం 29 ప్రగతి చక్ర అవార్డులను అందజేసి మాట్లాడారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, పర్సనల్ ఆఫీసర్ రామకృష్ణ, అకౌంట్ ఆఫీసర్ బాలస్వామి, డిపోల డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. స్కూల్ బస్సులు ఫిట్గా ఉండాలిజిల్లా రవాణా అధికారి వెంకటరమణ కొత్తగూడెంఅర్బన్: త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యాసంస్థల బస్సులు ఫిట్నెస్తో ఉండాలని జిల్లా రవాణాశాఖ అధికారి సూచించారు. జిల్లా రవాణా కార్యాలయంలో స్కూల్ బస్సుల డ్రైవర్లకు బస్సుల ఫిట్నెస్, రహదారి భద్రతపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి డ్రైవర్ వాహనం నడిపే ముందు ఫిట్నెస్ చెక్ చేసుకోవాలని, ప్రతీ వాహనానికి అటెండెంట్ ఉండాలని చెప్పారు. స్కూల్ యాజమాన్యాలు, డ్రైవర్లు బాధ్యతగా ఉండాలని కోరారు. అనంతరం పాటించాల్సిన జాగ్రత్తల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ బస్సుల డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. -
జల రవాణాపై దృష్టి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదిలో జల రవాణాకు గల అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల ప్రకటించారు. ఇది కార్యరూపం దాల్చితే జిల్లాలో ఉపాధి, వాణిజ్య రంగాలు మెరుగుపడే అవకాశం ఉంది. గతంలో రాజమండ్రి, భద్రాచలం మీదుగా.. కాకినాడ పోర్టు నుంచి బొగ్గును రైలు మార్గంలో తెలంగాణకు తీసుకొస్తుండగా తెలంగాణ బియ్యాన్ని రోడ్డు మార్గంలో భద్రాద్రి జిల్లా మీదుగానే కాకినాడకు తరలిస్తున్నారు. గోదావరిలో జలరవాణా అందుబాటులోకి వస్తే కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రి మీదుగా తెలంగాణలోని భద్రాచలం వరకు సరుకు రవాణాకు అవకాశం ఉంది. గతంలో కాకినాడ – రాజమండ్రి – భద్రాచలం – చర్ల – కాళేశ్వరం (సిరోంచ, మహారాష్ట్ర)ల మధ్య బ్రిటీష్ / నిజాం జమానాలో జల రవాణా నిర్విరామంగా జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్డు మార్గాలు విరివిగా అందుబాటులోకి రావడంతో క్రమంగా జలరవాణా కనుమరుగైంది. బరాజ్ల అండతో గోదావరిలో ఏడాది పొడవునా ఏపీలోని వీఆర్పురం మండలం పోచవరం నుంచి రాజమండ్రి వరకు పడవలు తిరిగేంత నీటి మట్టం ఉంటుంది. ఈ స్ట్రెచ్లో పర్యాటకప్రాంతమైన పాపికొండలకు బోట్లు నిత్యం నడుస్తూనే ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, రాజమండ్రి – భద్రాచలం – దుమ్ముగూడెం ఆనకట్ట వరకు జల రవాణాకు అనుకూలమైన నీటిమట్టం ఉండే అవకాశముంది. ఆ పైన సీతమ్మ సాగర్ (నిర్మాణంలో ఉంది), సమ్మక్క సాగర్ బరాజ్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మి, పార్వతి, సరస్వతి బరాజ్లు ఉన్నాయి. వీటికిపైన మంచిర్యాల – గోదావరిఖని వంటి పారిశ్రామిక ప్రాంతాల నడుమ శ్రీపాదసాగర్ బరాజ్ ఉంది. దీంతో జలరవాణాకు కావాల్సినంత నీటి మట్టం గోదావరిలో అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాటర్ వేస్ జలరవాణా అభివృద్ధిపై కేంద్రం నుంచి గతంలో అనేక ప్రకటనలు వచ్చాయి. 2008లో యూపీఏ హయాంలో నేషనల్ వాటర్ వేస్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో వాటర్ వేస్–4లో భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు 171 కి.మీ జల రవాణా మార్గాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం రోడ్, రైల్, రివర్ (ఆర్ఆర్ఆర్) ట్రాన్స్పోర్ట్ పేరుతో ఇదే పథకానికి కొత్త రూపు ఇచ్చింది. ఇందులో మహారాష్ట్రలో నాసిక్ నుంచి బంగాళాఖాతం వరకు గోదావరిలో జలరవాణాకు గల అవకాశాలు పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీస్ సర్వీసెస్ (వాప్కోస్) ఆధ్వర్యంలో పలుమార్లు సర్వేలు కూడా జరిగాయి. ప్రతికూలతలు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్ల భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సీతమ్మసాగర్ బరాజ్కు ఇంకా అనుమతులు రాలేదు. వీటిపై స్పష్టత వచ్చాకే జల రవాణాపై అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది. లేదంటే యూపీఏ, ఎన్డీఏ సర్కార్ల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటనలు, సర్వేలతో సరిపెట్టే అవకాశముంది. ఒక వేళ ఎగువ ప్రాంతాలను మినహాయించి కాకినాడ – రాజమండ్రి – భద్రాచలం వరకే జలరవాణాకు గల అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటే కొంతమేరకు అడుగులు ముందుకు పడే అవకాశముంది. అయినా భద్రాచలంలో స్థల లభ్యతతోపాటు భద్రాచలం – మల్కన్గిరి రైల్వేలైనులో పాండురంగాపురం – సారపాక సెక్షన్ల మధ్య రైలు మార్గాన్ని త్వరితగతిన నిర్మించాల్సి ఉంటుంది. గోదావరిలో జలరవాణా మొదలైతే తెలంగాణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరింత కీలకంగా మారే అవకాశముంది. స్థానికులకు వ్యాపార, ఉపాధి రంగాల్లో అవకాశాలు మరింతగా మెరుగవుతాయి.జలమార్గంపై అధ్యయనం చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటన గతంలో గోదావరిలో రాజమండ్రి– భద్రాచలం– సిరోంచల మధ్య రవాణా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనూ రాజమండ్రి–భద్రాచలం స్ట్రెచ్చవక రవాణా రోడ్డు, రైలు మార్గాలతో పోల్చితే జలరవాణా చవక. అందువల్లే సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో దూసుకుపోతుంటాయి. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం లోటుగా ఉంది. దీంతో రాష్ట్ర విభజన తర్వాత డ్రైపోర్టులు అభివృద్ధి చేయాలని నిర్ణయించినా.. ఆశించిన పురోగతి రాలేదు. దీంతో జలరవాణాకు గల అవకాశాలను పరిశీలించే పనిలో ప్రభుత్వం ఉంది. ఇతర దేశాల నుంచి చౌకగా లభించే బొగ్గును కాకినాడ నుంచి తెలంగాణలో ఉన్న విద్యుత్ సంస్థలకు సరఫరా చేయడం, తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి జలరవాణా ఉపయోగపడుతుందని అంచనా వేశారు. కృష్ణా నదిలో జలరవాణా అందుబాటులోకి వస్తే దాని తీర ప్రాంతంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు మేలు జరుగుతుందనే అంచనాలున్నాయి. -
సర్వే సమస్యకు చెక్ పెట్టేలా..
● నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వ చర్యలు ● భూభారతి చట్టం అమలుతో పెరగనున్న అవసరాలు ● లైసెన్స్డ్ సర్వేయర్లుగా గుర్తింపుతో యువతకు ఉపాధి ● ఉమ్మడి జిల్లాలో 1,073 మంది నుంచి దరఖాస్తులు చుంచుపల్లి: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో సర్వే మ్యాప్ను తప్పనిసరి చేసింది. ప్రతీ వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూ నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టంలో ప్రత్యేక క్లాజ్ను పొందుపర్చింది. ఈ నేపథ్యంలో సర్వేయర్ల అవసరం పెరగనుండగా, శిక్షణ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు కొంత మేర ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి 17 వరకు మీ సేవా కేంద్రాల దరఖాస్తులు స్వీకరించగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,073 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 647 దరఖాస్తులు రాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 426 మంది దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ భూ సర్వేపై శిక్షణ ఇచ్చి, లైసెన్స్డ్ సర్వేయర్లుగా గుర్తించనున్నారు. వీరు భూమి రిజిస్ట్రేషన్కు ముందు స్కెచ్ తయారు చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం ప్రభుత్వ సర్వేయర్లు పూర్తిస్థాయిలో పరిశీలించాక సంబంధిత జిల్లా అధికారి ఆమోదముద్ర వేస్తారు. ఉమ్మడి జిల్లాలోని 44 మండలాల్లో ప్రస్తుతం 37 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీనివల్ల భూముల సర్వేకు నెలల తరబడి రైతులు కార్యాలయాల చుట్టు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేయనుండటంతో సర్వేల్లో జాప్యం తగ్గే అవకాశం ఉంటుంది. 50 రోజులపాటు శిక్షణ దరఖాస్తులను పరిశీలించాక అభ్యర్థులను ఎంపిక చేసి, ఈ నెల 26 నుంచి 50 రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నిజాం పాలనలో మాత్రమే సెత్వార్ పేరిట సర్వే నిర్వహించారు. ఆ సమయంలో రెవెన్యూ గ్రామాల వారీగా పట్టాదారుల సమాచారంతో ఖాస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. రెవెన్యూశాఖ దానినే ప్రామాణికంగా పరిగణిస్తూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాస్రా పహాణీ ఆధారంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. వీటి శాశ్వత పరిష్కారానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 26 నుంచి శిక్షణ.. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,073 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 50 రోజులపాటు మూడు దశల్లో అవగాహన కల్పిస్తాం. – శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉమ్మడి జిల్లాలో వచ్చిన దరఖాస్తులు కేటగిరీ ఖమ్మం భద్రాద్రి మొత్తం ఓసీ 26 05 31బీసీ 232 69 301ఎస్సీ 182 73 255ఎస్టీ 207 279 486మొత్తం 647 426 1,073 -
‘నకిలీ’లతో జాగ్రత్త!
● విత్తన కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి ● ఆఫర్లు, మాయమాటలను నమ్మి మోసపోవద్దు ● రశీదులు, ఖాళీ ప్యాకెట్లు భద్రపరుచుకోవాలి ● జూన్ నుంచి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం రైతు సంఘాల నాయకులు ఏం కోరుతున్నారంటే.. ● నకిలీ విత్తనాల ఉత్పత్తి, నియంత్రణకు కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. ● మార్కెట్లో నాణ్యమైన విత్తనాలు మాత్ర మే విక్రయించేలా చర్యలు తీసుకోవాలి. ● తనిఖీలు చేపట్టేందుకు రెగ్యులేటరీ సంస్థలు ఏర్పాటు చేయాలి. విత్తన కంపెనీలు, పంపిణీదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ● నకిలీ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై క్షేత్రస్థాయిలో అవగాహనా సదస్సులు జరపాలి. ● గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలో విత్తన విక్రయాలకు అనుమతి పొందిన కంపెనీలు, డీలర్ల వివరాలను, ఏయే కంపెనీ విత్తనాలు ఎంత ధర అనే విషయాలను రైతులందరికీ తెలిసేలా గ్రామాల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలి. బూర్గంపాడు/పాల్వంచరూరల్/చర్ల: జూన్ నుంచి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభంకానుడటంతో రైతులు వానాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఆరుగాలం శ్రమించినా ఫలితం దక్కాలంటే రైతులు ఆది నుంచే అప్రమత్తంగా ఉండాలి. దుక్కులు దున్నడం దగ్గర నుంచి పంట దిగుబడి చేతికి వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు పాటించాలి. విత్తన ఎంపికలో అప్రమత్తంగా లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ఊరు, పేరులేని విత్తనాలను అంటగడతారు.. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో నాణ్యత లేని, ఊరుపేరు లేని వరి, పత్తి, మిర్చి విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. అధిక దిగుబడి ఇస్తుందంటూ, కొత్తరకం అంటూ మాయమాటలతో మభ్యపెడుతున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించి ఏటా రైతులను మోసం చేస్తున్నారు. తక్కువ ధరలు, ఆఫర్లు అంటు కొందరు డీలర్లు నాణ్యతలేని విత్తనాలను విక్రయిస్తున్నారు. గతంలో పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోయారు. గతేడాది కోడిపుంజుల వాగు గ్రామ రైతులకు పాల్వంచలోని విత్తన వ్యాపారి నకిలీ వరి విత్తనాలు విక్రయించాడు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చేయగా సంబంధిత కంపెనీ నష్టపరిహారం చెల్లించింది. చండ్రుగొండ, సుజాతనగర్ మండలాల్లో కూడా నాణ్యత లోపం కలిగిన వరి విత్తనాలు విక్రయించారు. పాండురంగాపురంలో నకిలీ మిర్చి, పత్తి విత్తనాలు కొనుగోలుచేసి పలువురు రైతులు దగాపడ్డారు. సూరారం, జగన్నాథపురం, కోడిపుంజుల వాగులో నాణ్యతలేని వరి విత్తనాలను కొనుగోలుచేసి మోస పోయారు. బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లలో నకిలీ విత్తనాలు.. నిషేధిత గ్లైసిల్, బీటీ, బీటీ–3తో పాటుగా అనుమతులులేని కొన్ని కంపెనీల పత్తి విత్తనాలు గతంలో జిల్లాలో విక్రయించారు. గుంటూరు, మాచర్ల ప్రాంతాల నుంచి, జిన్నింగ్ మిల్లుల నుంచి నకిలీ విత్తనాలు తెప్పించి, బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లలో నింపి విక్రయించారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన గడువు ముగిసిన విత్తనాలు కూడా కొత్తగా ప్యాకింగ్ చేసి విక్రయించిన ఘటనలు ఉన్నాయి. గతంలో నకిలీ విత్తనాలు విక్రయించిన పలువురు వ్యాపారులు జైలు పాలయ్యారు. విత్తనం కొనే ముందు... రైతులు వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలి. సీల్ చేసిన బస్తాలను ధ్రువీకరణ(ట్యాగ్) ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. విత్తన బస్తాపై ప్యాకెట్లపై గడువు తేది, రకం పేరు, లాట్ నంబర్లు చూసుకోవాలి. కొనుగోలు బిల్లుతోపాటు విత్తన రకం, గడువు తేదీ ఉండేలా డీలర్ సంతకంతో కూడిన రశీదు మాత్రమే తీసుకోవాలి. కొనుగోలు చేసిన రైతు సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి. అవగాహన కల్పిస్తున్నాం విత్తన కొనుగోళ్లపై ప్రతి మంగళవారం రైతువేదికల్లో అవగాహన కల్పిస్తున్నాం. రశీదులు, ప్యాకెట్లను భద్రపరుచుకోవాలి. అనుమతి ఉన్న దుకాణాల్లో మాత్రమే కొనాలి. గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు బుక్ చేసేవారికి దూరంగా ఉండాలి. 450 గ్రాముల బ్రాండెడ్ విత్తన ప్యాకెట్ ధర రూ. 901గా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుమించి ఎక్కువ ధర చెల్లించవద్దు. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. – బాబూరావు, వ్యవసాయశాఖ జిల్లా అధికారి -
వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
● బూర్గంపాడు సీహెచ్సీలో ఆకస్మిక తనిఖీ ● పనితీరు మారకపోతే బదిలీ చేస్తామని హెచ్చరిక బూర్గంపాడు : ‘ఆస్పత్రిలో వైద్యసేవలు అందించేందుకు సూపరింటెండెంట్, వైద్యులు, స్టాఫ్ నర్స్లు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండరు. అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లెందు ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతుంటే బూర్గంపాడులో గుండు సున్న. ఇదే లాస్ట్ వార్నింగ్. మార్పురాకపోతే దూర ప్రాంతాలకు బదిలీ చేస్తాం. ప్రజలు కలెక్టరేట్కు రాకుంటే, నేనే ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటా. డెలివరీ కేసుల సంఖ్య పెంచేలా మీరు ఎందుకు గ్రామాలకు వెళ్లడంలేదు. బూర్గంపాడు సీహెచ్సీ మ్యూజియంలా మారింది. ప్రజలు రావడంలేదని చెబుతున్నారు. మరి ఆస్పత్రిని మూసేద్దామా’ అంటూ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు 20 ప్రసవాలు చేయాలని లక్ష్యం నిర్దేశించారు. మంగళవారం ఆయన బూర్గంపాడు సీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఆస్పత్రిలో ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే అందరినీ బదిలీ చేస్తామని హెచ్చరించారు. అనంతరం బూర్గంపాడులోని తెలంగాణ గురుకుల పాఠశాల(బాలికలు)ను కలెక్టర్ తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రహరీల నిర్మాణం, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల ఆదరణ పొందాలి మణుగూరు టౌన్: ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించి, ప్రజల ఆదరణ పొందాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం ఆస్పత్రిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, బాధితులను చులకన భావంతో చూడొద్దని చెప్పారు. అనంతరం మున్సిపాలిటీలోని రాజుపేట, విఠల్రావునగర్ ఏరియాల్లో పర్యటించారు. సింగరేణి హద్దులను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బొగ్గు, ఇసుక లారీలతో దుమ్ము, ధూళి వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తంగా చేయగా, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా నిర్మించుకోలేని పరిస్థితి ఉందని, ఈ రెండు గ్రామాలను సింగరేణి మణుగూరు ఓసీ విస్తరణలో తీసుకుని మరోచోట పునరావాసం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర నాయకుడు అయోధ్య, డీసీహెచ్ఎస్ రవిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీల్, వైద్యుడు గౌరీ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇక ఆటలు ఆడుకోవచ్చు..
● భద్రాద్రిలో క్రీడా మైదానం ఏర్పాటుకు అడుగులు ● ఐటీడీఏ పీఓ చొరవతో స్థల సేకరణ ● తీరనున్న క్రీడాకారుల కళ భద్రాచలంటౌన్: భారత మహిళా క్రికెట్ జట్టులో స్థానం సాధించిన గొంగడి త్రిష భద్రాద్రిలో తొలుత శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. కానీ, ఇక్కడ క్రీడామైదానం లేకపోవడం క్రీడాకారులకు ఎంతో లోటు. క్రీడాకారులు శిక్షణ పొందాలన్నా.. పోటీలు నిర్వహించాలన్నా.. స్థానికంగా ఉన్న జూనియర్ కళాశాల క్రీడా మైదానమే పెద్ద దిక్కు. ఈ విషయాన్ని స్థానిక క్రీడాకారులు, యువకులు అనేక సార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ప్రతిఫలం దక్కలేదు. ఇటీవల ఐటీడీఏ పీఓ పట్టణంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. క్రీడా మైదానానికి కేటాయించేలా సర్వే చేసి పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చి నూతన హంగులతో క్రీడా మైదానం అందుబాటులో రావాలని క్రీడాకారులు ఆకాంక్షిస్తున్నారు. మెగా టోర్నీలకు వేదికగా.. ఏటా నిర్వహించే భద్రాద్రి కప్తో పాటు జాతీయస్థాయిలో నిర్వహించే నెహ్రూకప్నకు భద్రాద్రి ఆతిథ్యం ఇస్తోంది. కానీ, సరైన మైదానం లేక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్నే సర్దుకోవాల్సి వస్తోంది. ఐటీడీఏ తరఫున నిర్వహించే క్రీడాపోటీలు సైతం ఇక్కడే నిర్వహిస్తారు. అయితే, ఇదే మైదానాన్ని ఇతర కార్యక్రమాలకు కూడా అద్దెకు ఇవ్వడంతో తిరిగి క్రీడలు నిర్వహించే సమయంలో అసౌకర్యంగా ఉంటోంది. దీంతో క్రీడాకారులు, క్రీడాభిమానుల ఏళ్లుగా విన్నవిస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఐదెకరాల్లో ప్రణాళిక పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీలో ఉన్న 5 ఎకరాల్లో స్టేడియం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ భూమి క్రీడా మైదానానికి కేటాయించేలా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను పీఓ రాహుల్ ఆదేశించారు. ఆయనే స్వయంగా వెళ్లి సదరు ప్రాంతాన్ని రెవెన్యూ అధికారలతో కలిసి పరిశీలించారు. కాగా, ఈ భూమి గతంలో పంచాయతీకి అప్పగించారు. ప్రస్తుతం ఈ భూమిని మైదానం ఏర్పాటుకు కేటాయించారు కాబట్టి తిరిగి పంచాయతీ అధికారుల నుంచి తీసుకోవాలి. ఈ ప్రక్రియను వేగంగా పూర్తయితే స్టేడియం పనులకు అడుగులు పడతాయి. యువతను ప్రోత్సహించేందుకే.. భద్రాచలంలో క్రీడలపై ఆసక్తి ఉన్న యువతను ప్రొత్సహించేందుకే స్టేడియం ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆటలు ఆడుకోవడానికి సరైన క్రీడా ప్రాంగణాలు లేవు. సుందరయ్యనగర్లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమినిలో స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించాను. –బి.రాహుల్, ఐటీడీఏ పీఓ, భద్రాచలం సరైన మైదానం లేక ఇబ్బందులు భద్రాచలం పట్టణంలో ఏళ్లుగా సరైన క్రీడా మైదానం లేదు. ప్రతీ సారి ఇక్కడి క్రీడాకారులు జానియర్ కళాశాల క్రీడా మైదానంలోనే పోటీలతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూర్తిస్థాయి మైదానం ఏర్పాటుకు అడుగులు పడడం శుభ పరిణామం. –నగేశ్, భద్రాచలం మైదానం అవసరం ఉంది భద్రాచలం పట్టణంతో పాటు సరిహద్దు మండలాల క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి పూర్తిస్థాయి వసతులతో క్రీడా మైదానం అవసరం ఉంది. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు పీఓ స్టేడియం ఏర్పాటుకు చొరవ తీసుకోవడం హర్షనీయం. –కుప్పాల చరణ్ తేజ, క్రికెట్ కోచ్, భద్రాచలం -
సీతారాంపురంలో విషాదం
అశ్వాపురం: మండలంలోని సీతారాంపురం గ్రామంలో విషాదం నెలకొన్నది. గ్రామానికి చెందిన కొందరు బంధువులు మేడారం సమ్మక్క – సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు ఈ నెల 17న ఒక ట్రాక్టర్, ఒక ఆటోలో మేడారం వెళ్లారు. ఈ నెల 18న తిరుగుపయనమయ్యారు. తాడ్వాయి వద్ద మంచినీరు తాగేందుకు ట్రాక్టర్ రహదారి వెంబడి ఆపారు. ఈ క్రమంలో వెనుక వచ్చిన ఇసుక లారీ ట్రాక్టర్ను ఢీకొట్టడంతో నూప దుర్గ (38), చెట్టిపల్లి సీతమ్మ (40) మృతి చెందారు. ట్రాక్టర్లోని మిగతావారంతా గాయపడగా వారిని ములుగు, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు తరలించారు. కాగా, గాయపడిన వారిలో చెట్టిపల్లి ముత్తమ్మ, చెట్టిపల్లి సునీత, మోడియం సమ్మయ్య, మోడియం రాకేశ్, మణుగూరు మండలం కూనవరానికి చెందిన వెల్లుబోయిన శంకర్, ఏపీ రాష్ట్రం కుక్కునూరు మండలం కమ్మరిగూడెంనకు చెందిన గొల్ల జంపన్న ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీతారాంపురం గ్రామానికి చెందిన కోండ్రు శ్రీను, నూప నరసింహ, చెట్టిపల్లి శ్రీకృష్ణ, ఈసం జీవన్, మొడియం వినయ్, సుజాత ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు చెట్టిపల్లి సింధు, చెట్టిపల్లి విష్ణు, కారం వంశీ, సౌందర్యను డిశ్చార్జ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు, గాయాలపాలైన వారంతా నిరుపేదలే. క్షతగాత్రుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంబులెన్స్కు చెల్లించేందుకు సైతం డబ్బు లేకపోవడంతో పలువురు సామాజిక మాధ్యమాల్లో విరాళాలు సేకరించి అందజేశారు. కాగా, ప్రమాదంపై మంత్రి సీతక్క, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేడారం వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి -
గిరిజన భూములతో వ్యాపారం?
● తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభానికి విక్రయం ● నిబంధనలకు విరుద్ధంగా భూబదిలీలు ● గిరిజనులకు అందని భూహక్కు పత్రాలు దమ్మపేట: జిల్లాలోని దమ్మపేట సహా పలు గిరిజన గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములతో గిరిజనేతరులు అక్రమ భూవ్యాపారం చేస్తున్నారు. తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు, నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు కాకపోగా.. గిరిజనేతర భూవ్యాపారులు అసైన్డ్ భూములను కారుచౌకగా కొనుగోలు చేసి, అడ్డదారిన పీఓడీ చట్టం ద్వారా.. నిబంధనలకు విరుద్ధంగా హక్కు పత్రాలు సృష్టించి.. ఆపై లాభానికి అమ్ముతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మండలంలోని నల్లకుంట, గుర్వాయిగూడెం, గండుగులపల్లి, అఖినేపల్లి, ముష్టిబండ తదితర గిరిజన గ్రామాల్లోనే కాక ఇతర చోట్ల కూడా ఈ దందా సాగుతున్నట్లు తెలిసింది. గిరిజన ప్రాంతాల్లోని అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన పలువురు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004లో జారీ చేసిన జీఓ 1045 ద్వారా అధికారులను మచ్చిక చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా పట్టా భూములుగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమాల వెనుక దమ్మపేట తహసీల్లో కాంట్రాక్టు ఉద్యోగిగా గతంలో పనిచేసిన వ్యక్తి ప్రమేయం ఉందని చెబుతున్నారు. సుమారు 300 ఎకరాలకు పైగా ఈ వ్యాపారం సాగిందని చర్చ నడుస్తోంది. ఈ కారణంగా గిరిజన గ్రామాల్లో వ్యవసాయ భూముల విస్తీర్ణానికి మించి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు కాగా, అర్హులైన గిరిజనులకు మాత్రం పుస్తకాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. అయితే, కొత్తగా అమల్లోకి వచ్చిన ‘భూ భారతి’తోనైనా తమకు న్యాయం జరుగుతుందేమోనని గిరిజనులు ఆశతో ఉన్నారు. వ్యాపారం ఇలా.. 1970–80 దశకాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు, రాజకీయ బాధితుల కోసం ఇచ్చిన జీఓ 1045ను ఆసరాగా చేసుకుని గిరిజనుల నుంచి ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు చెల్లించి కొంటున్నారు. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలు చెల్లిస్తున్నట్లు సమాచారం. కాగా, మండలంలోని నల్లకుంట సర్వే నంబర్ 273లో గిరిజనేతరుడు ఐదెకరాల భూమిని అక్రమ మార్గంలో పట్టా చేయించినట్టు తెలిసింది. అదే సర్వే నంబర్లో ఐదెకరాల అసైన్డ్ భూమిని ఓ వ్యక్తి నుంచి ఎకరాకు రూ.16 లక్షలు చొప్పున కొనుగోలు చేసిన వ్యక్తులు, పట్టా చేయించాక ఎకరం రూ.31లక్షలకు విక్రయించారు. అఖినేపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 290లో ఐదెకరాల ప్రభుత్వ భూమిని వారసత్వం పేరుతో ధరణిలో పట్టా భూమిగా మార్చి, ఇప్పుడు రూ.16 లక్షలు ఎకరం చొప్పున విక్రయించారనే ప్రచారం జరుగుతోంది. -
అర్హత లేని వారితో పనిచేయిస్తే చర్యలు
కొత్తగూడెంఅర్బన్: అర్హత లేని వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పనిచేయిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ హెచ్చరించారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అంతటా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని అమలు చేస్తున్నామని, మినహాయింపు లేకుండా ప్రతి ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో అగ్నిమాపక భద్రతా ఆడిట్లు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎస్.జయలక్ష్మి, డాక్టర్ ఆర్పీ చైతన్య, డాక్టర్ మధువరుణ్, పుల్లారెడ్డి, తేజశ్రీ, డిప్యూటీ డెమో ఫైజ్మోహియుద్దీన్ పాల్గొన్నారు. విలువలు కలిగిన రాజకీయ వేత్త సుందరయ్య సింగరేణి(కొత్తగూడెం): విలువలు కలిగిన రాజకీయాలకు సుందరయ్య నిలువెత్తు నిదర్శనమని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం మంచికంటిభవన్లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని, ఆయన భూస్వామ్య కుటుంబంలో పుట్టి కూడా చిన్ననాటి నుంచి, అంటరానితనం, కులవివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుందరయ్య చేసిన త్యాగాలను పలువురు సీపీఎం నాయకులు వివరించారు. 1008 బ్రహ్మసూత్ర శివలింగాల ప్రతిష్ఠాపన దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం గ్రామంలోని శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ చిన్న అరుణాచల ఆలయంలో సోమవారం బ్రహ్మసూత్ర శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆలయ వ్యవస్థాపకుడు శివనాగస్వామి ఆధ్వర్యంలో చిన్న అరుణాచలం క్షేత్రంలో వైశాఖ మాసం పంచమితి సోమవారం శ్రవణ నక్షత్రంలో 1008 బ్రహ్మసూత్ర శివలింగాలను 9 అడుగుల బాణలింగాన్ని వేదమంత్రోచ్చరణల మధ్య ప్రతిష్ఠించారు. ఇద్దరిపై దాడి ఇల్లెందు: ముగ్గురు యువకులు కలిసి మరో ఇద్దరిపై దాడి చేసిన ఘటన ఆజాద్నగర్లో సోమవారం చోటుచేసుకుంది. ఆజాద్నగర్లో జరుగుతున్న ఓ ఫంక్షన్కు ఆదివారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన ఖాదర్పాషా బైక్పై వచ్చాడు. అక్కడి ముత్యాలమ్మ గుడి వద్ద బైక్ నిలిపి భోజనం చేసి తిరిగి రాగా.. అదే ఏరియాకు చెందిన ఆర్.వంశీ, మధు, సందీప్ బైక్ ఇవ్వమని కోరారు. తాను వెళ్లాల్సి ఉందని వారించటంతో మాటామాటా పెరిగి ఖాదర్పాషాపై చేయి చేసుకున్నారు. ఖాదర్పాషా మిత్రుడు ఎస్.వంశీ అడ్డురాగా అతనిపై కూడా దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ బి.సూర్య తెలిపారు. పిడుగుపాటుతో రైతు మృతి మరో రైతుకు గాయాలు ఇల్లెందురూరల్: ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో ఓ రైతు మృతి చెందగా, ఆయన సోదరుడైన మరో రైతుకు గాయాలయ్యాయి. ఇల్లెందు మండలం కట్టుగూడెం గ్రామానికి చెందిన సోదరులు పరిటాల పుల్లయ్య (40), వెంకన్న తమ పొలం వద్ద పది రోజులుగా బావి తవ్విస్తున్నారు. మధ్యలో మేడారం వన దేవతల దర్శనానికి వెళ్లిరాగా, సోమవారం పనులు తిరిగి ప్రారంభించారు. పని చేయిస్తుండగా వర్షం మొదలుకావడంతో పుల్లయ్య సమీపంలోని చెట్టు కిందకు వెళ్లి తన సోదరుడు వెంకన్నను కూడా పిలిచాడు. వెంకన్న చెట్టు కిందకు వెళ్తుండగానే పిడుగు పడడంతో పుల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపానికి చేరిన వెంకన్న షాక్తో కింద పడ్డాడు. కాగా, మృతుడికి భార్య లలిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వృద్ధురాలి ఆత్మహత్య
అశ్వాపురం: మండల కేంద్రానికి చెందిన సారంగి సరోజిని (60) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ.. మతిస్థిమితం కోల్పోయింది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు అశ్వాపురం పీహెచ్సీకి తరలించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మధుప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిది వేధింపులతో వదిన.. పాల్వంచ: మరిది వేధింపులు తాళలేక వదిన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. సుజాతనగర్ మండల కేంద్రానికి చెందిన బత్తుల వీరయ్యకు త్రివేణి(32)తో గతంలో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కొంతకాలంగా త్రివేణి మరిది అయిన టీఎస్పీఎస్ కానిస్టేబుల్ బత్తుల నాగరాజు వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె పర్సనల్ ఫొటోలను బంధువులు, తెలిసిన వారికి ఫోన్లో పంపిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై నాలుగు రోజుల కిందట పాల్వంచ వికలాంగుల కాలనీలో ఉంటున్న తండ్రి శివ ఇంటికి వచ్చింది. సోమవారం పైపోర్షన్కు వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సుమన్ తెలిపారు. విద్యుదాఘాతంతో మూడు పశువులు మృతి చండ్రుగొండ: మండలంలోని సత్యనారాయణపురం శివారు రైల్వేలైన్ సమీపంలో విద్యుదాఘాతానికి గురై మూడు పశువులు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగుచూసింది. బాధిత రైతుల కథనం ప్రకారం.. గానుగపాడు వాసి వెంకన్నకు చెందిన రెండు పాడిగేదెలు, సత్యనారాయణపురంవాసి భాగ్యరాజుకు చెందిన దుక్కిటెద్దు ఆదివారం మేతకు వెళ్లాయి. రైల్వేలైన్ సమీపంలో త్రీఫేస్ విద్యుత్ వైరు కిందపడి ఉండటంతో విద్యుదాఘాతానికి గురై మూడు పశువులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. ఒక్కో పశువు విలువ రూ.లక్ష ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. కాగా, గాలిదుమారం, పిడుగుపాటుకు గానుగపాడు, సత్యనారాయణపురం మధ్య విద్యుత్లైన్ ఇన్సులేటర్లు ఫెయిల్ అయి తీగలు కిద్దపడ్డాయని, ఒక్కో పశువుకు శాఖ తరఫున రూ.40 వేలు పరిహారం అందిస్తామని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ నష్టం
ఇల్లెందు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణం దగ్ధమైంది. ఇలెందు మొయిన్రోడ్లోని శ్రీ ఆదిత్యసాయి ఎంటర్ప్రైజెస్లో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. దుకాణంలోని ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు.. సుమారు రూ.2.70 కోట్ల సరుకు కాలిపోయినట్లు అంచనా. అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, సోమవారం ఏఓ సతీశ్ దుకాణాన్ని పరిశీలించి రికార్డుల ఆధారంగా నష్టంపై అంచనా వేశారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, అగ్నిమాపకశాఖ అధికారి నవీన్, డీఎస్పీ చంద్రభాను, సీఐ సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఏడీఈ కోటేశ్వరరావు పరిశీలించి వివరాలు ఆరా తీశారు. దుకాణంలోని 80 శాతం సరుకు అగ్నికి ఆహుతైందని యజమాని ప్రొద్దుటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఫర్టిలైజర్ షాప్లో రూ.కోట్ల విలువైన సామగ్రి దగ్ధం -
కేర్ టేకర్గా చేరి రూ.11.49లక్షలు స్వాహా
ఖమ్మంక్రైం: ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడిన ఓ వ్యక్తి రిటైర్డ్ ఉద్యోగి వద్ద కేర్ టేకర్గా చేరి ఆయనకు తెలియకుండా ఖాతా నుంచి రూ.11.49 లక్షలు స్వాహా చేశాడు. ఈమేరకు నిందితుడిని సోమవారం ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. మధిర మండలం నిదానపురానికి చెందిన గుండా వెంకటేశ్వరరెడ్డి ఖమ్మం హోమ్ కేర్ సర్వీస్లో కేర్ టేకర్గా ఉద్యోగం చేస్తున్నాడు. గత నాలుగైదేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఆయన గత మార్చిలో ఖమ్మంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి గాదె కేశవరావు వద్ద కేర్ టేకర్గా చేరాడు. యజమానిని నమ్మిస్తూ ఆయన ఫోన్లోని గూగుల్ పే ద్వారా బెట్టింగ్ యాప్ల్లోకి డబ్బు డిపాజిట్ చేయడం మొదలుపెట్టాడు. రెండు వారాల పాటు వరుసగా రూ.11.49 లక్షల డిపాజిట్ చేయగా, లాభాలు రాకపోవడంతో ఉద్యోగం మానేశాడు. కొన్నాళ్ల తర్వాత గుర్తించిన కేశవరావు ఈ విషయమై చేసిన ఫిర్యాదుతో వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కోర్టులో హాజరుపర్చగా, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ను, ఎస్సైలు రంజిత్కుమార్,విజయ్కుమార్, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
భద్రాచలంటౌన్: గిరిజన, ఆదివాసీల సమస్యలు పరిష్కరించడమే కాక అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించాక మాట్లాడారు. పోడు భూముల, వ్యక్తిగత, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాలు, పట్టా భూములకు రైతుబంధు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక సాయం, ట్రైకార్ రుణాలు, గిరి వికాసం ద్వారా సోలార్ విద్యుత్ కనెక్షన్లు తదితర అంశాలపై వినతులు రాగా పరిష్కారంపై ఉద్యోగులకు పీఓ సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఆర్సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల ఉద్యోగులు రవీంద్రనాథ్, భాస్కరన్, వేణు, లక్ష్మీనారాయణ, మనిధర్, ఉదయ్కుమార్, సమ్మయ్య, ఆదినారాయణ, నారాయణరావు, చైతన్య, హరికృష్ణ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఈతకు వెళ్లిన బాలుడికి షాక్
ఆస్పత్రికి తరలించేలోగా మృతి కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్నగర్ వద్ద మొర్రేడు వాగులో ఈతకు వెళ్లిన బాలుడు.. అక్కడే మోటార్కు అమర్చిన విద్యుత్వైరు తాకి.. షాక్కు గురై మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కొత్తగూడెం మున్సిపాలిటీ న్యూగొల్లగూడెంనకు చెందిన టిల్లు (15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో మొర్రేడువాగులో ఈతకు వెళ్లాడు. వాగులో మోటారుకు అమర్చిన విద్యుత్ తీగ షాక్ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు టిల్లును కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టిల్లు మృతదేహాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా సందర్శించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అశ్వాపురం: మండలంలోని బీజీకొత్తూరు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బూర్గంపాడు మండలం బుడ్డగూడెం గ్రామానికి చెందిన సోడె శ్రీకాంత్ (26) బైక్పై మణుగూరు మండలం పగిడేరులో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. బీజీ కొత్తూరు వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ట్రాక్టర్ రోడ్డుపైకి వస్తూ బైక్ను ఢీకొనడంతో శ్రీకాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి 108లో తరలిస్తుండగా మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మధుప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అర్చకులు గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించాక స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యాన్నదానానికి విరాళం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి వరంగల్కు చెందిన వీరస్వామి–విమల దంపతులు సోమవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. అలాగే, కొత్తగూడెంకు చెందిన బాబు–కమలమ్మ దంపతులు రూ.50 వేల విలువైన 600 గ్రాముల వెండి అభిషేకం జల్లెడను ఈఓ ఎల్.రమాదేవికి అందజేశారు. బ్లాస్టింగ్ టెక్నాలజీలో డాక్టరేట్ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని ప్రాజెక్ట్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్.వెంకటరమణ ఓసీల్లో నిర్వహించే బ్లాస్టింగ్ టెక్నాలజీలో డాక్టరేట్ సాధించారు. బ్లాస్టింగ్ సమయాన ఇబ్బందులను తగ్గించే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు నాగపూర్ నిట్ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటరమణను సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, డైరెక్టర్లు అభినందించగా, సీపీపీ జీఎం సాయిబాబు, ఏజీఎం గోనే శ్రీకాంత్ తదితరులు సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఓసీల్లో బ్లాస్టింగ్ సమయాన పెద్ద శబ్దంతోపాటు దుమ్ము, ధూళి వచ్చేవని తెలిపారు. కానీ అలా రాకుండా అనుసరించాల్సిన విధానాలపై వెంకటరమణ పరిశోధనలు చేయడం అభినందనీయమని వెల్లడించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు కొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఈనెల 22నుంచి 27వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొత్తం 7,635 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 24 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు నడిపించాలని, పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ఎండల నేపథ్యాన కేంద్రాల్లో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి సీహెచ్.వెంకటేశ్వరరావుతో పాటు వివిధ శాఖల అధికారులు సులోచనరాణి, జయలక్ష్మి, సీహెచ్.శ్రీనివాస్, చిన్న యాకయ్య, అహ్మద్, రమణారావు తదితరులు పాల్గొన్నారు. వాహనాల పన్ను వసూళ్లపై దృష్టికొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని వాహనాలకు నిర్దేశించిన పన్నులు వసూలు చేయడంపై ఉద్యోగులు దృష్టిసారించాలని రవాణా శాఖ వరంగల్ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం సూచించారు. కొత్తగూడెం రవాణా శాఖ కార్యాలయాన్ని సోమవారం తనిఖీ చేసిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు నిర్ణీత సమయంలో పన్నులు చెల్లించేలా అవగాహన కల్పించాలని, లేనిపక్షంలో జరిమానా విధించాలని తెలిపారు. అలాగే, విద్యాసంత్సరం ప్రారంభం కానున్నందున విద్యాసంస్థలు బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేయాలని సూచించారు. జిల్లా రవాణా అధికారి వెంకటరమణ, కొత్తగూడెం ఎంవీఐలు మనోహర్, నిర్మలారెడ్డి, వెంకటపుల్ల య్య తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి రెస్క్యూ స్టేషన్లో ఎస్పీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా 4 ఇంక్లైన్లోని రెస్క్యూ స్టేషన్ను ఎస్పీ రోహిత్రాజు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు రెస్క్యూ ఆపరేషన్లలో విని యోగించే పరికరాలు, తీసుకునే జాగ్రత్తలు, ఇప్పటివరకు చేసిన ఆపరేషన్ల వివరాలను ఇన్చార్జ్ అనంతరామయ్య వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో సింగరేని ఉద్యోగులు చేపట్టే రెస్క్యూ ఆపరేషన్లు పలువురి ప్రాణాలను నిలబెడుతున్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రహమాన్, సీఐలు రమేష్కుమార్, చెన్నూరు శ్రీనివాస్, సింగరేణి అధికారులు కోటిరెడ్డి, తావురియా, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ రెహమాన్తో పాటు వివిధ విభాగాల ఉద్యోగులు చెన్నూరు శ్రీనివాస్, కోటిరెడ్డి, తావురియా, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. -
నమ్మాలి.. ఇది పంట కాలువే..
వానాకాలం పంటల సీజన్ సమీపిస్తోంది. మరో పక్షం దాటితే దుక్కులు దున్నడం, విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. కానీ అధికారులు మాత్రం పంట కాల్వలను బాగు చేయడంపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి ఏడు కి.మీ. పొడవైన కుడి కాల్వలో పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడివిని తలపిస్తోంది. అందులో నుంచి ప్రాజెక్టు నీళ్ల మాటేమిటో కానీ నీటిధార కూడా ముందుకు వెళ్లే పరిస్థితి కానరావడం లేదు. అలాగే, రాళ్లవాగుకు చెందిన కాల్వ సైతం కారెగట్టు వద్ద ఇలాగే మూసుకుపోయింది. ఎండాకాలంలో నీటి సరఫరా లేనప్పుడు స్పందించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని.. ఇకనైనా స్పందిస్తే వానలు మొదలయ్యేనాటికి కాల్వలు బాగవుతాయని రైతులు చెబుతున్నారు. – పాల్వంచరూరల్ -
పాత స్టాక్కు కొత్త ధర!
● అమల్లోకి పెరిగిన మద్యం ధరలు ● ఇదే అదునుగా పాత స్టాక్కూ పెంచిన వ్యాపారులువైరా: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మద్యం ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, వైన్స్, బార్లలో ఇప్పటికే స్టాక్ ఉన్న మద్యాన్ని నిబంధనల ప్రకారం పాత ధరలకే అమ్మాలి. కానీ అధికారులెవరూ ఈ దిశగా దృష్టి సారించకపోవడంతో పాత స్టాక్ను సైతం వ్యాపారులు కొత్త ధరతో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల్లో ఇదే తంతు కొనసాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచడంతో మద్యం వ్యాపారులకు కాసులు పంట పండినట్లయింది. క్వార్టర్పై రూ.10, ఫుల్ బాటిల్పై రూ.40 మేర ధర పెంచగా, ఆ ప్రకారమే పాత స్టాక్ను సైతం విక్రయించారు. ఉమ్మడి జిల్లాలోని వైన్స్, బార్లకు మద్యం సరఫరా చేసే వైరాలోని ఐఎంఎల్ డిపోలోనే సుమారు లక్ష కేసుల మద్యం పాత స్టాక్ ఉందని అధికారులే చెబుతున్నారు. కొన్నింటికి మినహాయింపు ప్రభుత్వం మద్యం ధరలు పెంచినప్పటికీ చీప్ లిక్కర్ జాబితాలో ఉన్న కొన్నింటిని మినహాయించింది. డైమండ్ విస్కీ, కేకే, డౌన్డౌన్, గుడ్వన్, డెక్కన్బ్లూ, యునైటెడ్ గోల్డు, బీకే, సన్హార్ట్స్, మెగాసిటీ బ్రాండ్ల మద్యానికి పాత ధరలే అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, బ్రీజర్ కంపెనీలో కాన్బెర్రీ ధరలోనూ మార్పు చేయలేదు. బ్రాండెడ్ మద్యం ధరలే పెంచడంతో ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మే నెలలో 17వ తేదీ వరకు రూ.237 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది రూ.95 కోట్ల మద్యమే అమ్ముడైంది. మరో పది రోజుల్లో గత ఏడాది కంటే ఎక్కువ అమ్మకాలు చేపట్టాలని ఎకై ్సజ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆలస్యంగా అమ్మకాలు ప్రభుత్వం పెంచిన మద్యం ధరలు సోమవారం అమల్లోకి రాగా వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి మధ్యాహ్నం వరకు లారీలు బయటకు కదల్లేదు. కొత్త ధరలతో బిల్లింగ్ చేసేలా స్టాఫ్వేర్లో మార్పులు చేయడంతో ఆలస్యమైందని తెలిసింది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత డిపోలో అమ్మకాలు మొదలుకాగా, ఒకేరోజు రూ.12 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లారని సమాచారం.మందుబాబులకు ముందే కిక్కు పాల్వంచరూరల్: మద్యంపై పెంచిన ధరలు అమల్లోకి రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని భావించిన మందుబాబులకు ఆ ఆనందం దక్కలేదు. పాల్వంచ మండలం పెద్దమ్మగుడి ఆలయం సమీపంలోని వైన్స్లో పాత స్టాక్నే కొత్త ధరకు అమ్మడంతో వాగ్వాదం జరిగింది. ఈ విషయమై పలువురు ఎకై ్సజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓ బ్రాండ్ మద్యం క్వార్టర్ ధర రూ.180 ఉంటే పెరిగిన ధరతో కలిపి రూ.190కు, హాఫ్, పుల్ బాటిళ్లు కూడా అలాగే అమ్మారని తెలిసింది. ఈవిషయమై ఎకై ్సజ్ సీఐ ప్రసాద్గౌడ్ను వివరణ కోరగా షాపుల్లో ఉన్న పాత స్టాక్ను ధర పెంచి అమ్మితే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రామా... వసతి కష్టాలు కనుమా..
భద్రాచలంలో గుట్టపై శిథిలమైన సత్రాలు, కాటేజీలు ● పునఃనిర్మాణం చేస్తేనే కష్టాల నుంచి ఉపశమనం ● వసతి ఇక్కట్లు తీర్చాలని భక్తుల విన్నపాలు రంగనాయకుల గుట్టపై శిథిలావస్థలో ఉన్న టీటీడీ సత్రం (ఇన్సెట్) పూర్తిగా శిథిలమైన అన్నవరం సత్రందక్షిణ అయోధ్యగా భావించే భద్రాచలానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు వసతి కష్టాలు తీరడం లేదు. ప్రధాన ఉత్సవాల సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. ఆ సమయంలో కాస్త హడావుడి చేసే అధికారులు ఆతర్వాత పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో శాశ్వత పరిష్కారం లభించడం లేదు. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యాన ఇప్పటినుంచే వసతి గదుల నిర్మాణానికి ప్రణాళికాయుతంగా ముందుకు సాగితే ఇక్కట్లు తీరనున్నాయి. – భద్రాచలంటీటీటీ, అన్నవరం సత్రాలు.. గతంలో భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఏళ్ల తరబడి టీటీడీ, అన్నవరం ఆలయ పరిధిలోని సత్రాలు ఆసరాగా నిలిచాయి. అయితే, అవన్నీ 1950, 1960 నాటి కట్టడాలు కావడంతో పూర్తిగా శిథిలమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా సీఆర్ఓ కార్యాలయం వెనుక మారుతి సదనం పేరుతో వసతి గదుల నిర్మాణం చేపట్టి దేవస్థానానికి అప్పగించింది. కానీ పైన ఉన్న టీటీడీ సత్రం, అన్నవరం సత్రం మాత్రం మరమ్మతులకు నోచుకోలేదు. వీటి స్థానంలో బహుళ అంతస్తులతో కూడిన భవనాలు నిర్మిస్తే ఉత్సవాల సమయంతో పాటు వారాంతాలు, సెలవు దినాల్లో భక్తులకు తక్కువ ఖర్చుతో వసతి సమకూరుతుంది. గోదావరి పుష్కరాలే లక్ష్యంగా... గోదావరి పుష్కరాలకు తెలంగాణ భక్తులు అత్యధికంగా భద్రాచలానికే వస్తారు. 2015లో గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. 2027లో సైతం ఇంతకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యాన భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యాన ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. అభయాంజనేయస్వామి ఆలయం వద్ద, సూపర్ బజార్ సెంటర్, అంబసత్రం వైపు ఉన్న దేవస్థానం భూముల్లో వసతి గదుల నిర్మాణానికి అవకాశముంది. ఇక ఆంధ్ర ప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లోనూ షిర్డీ, తిరుపతి మాదిరి నిర్మాణాలు చేపడితే మేలు జరుగుతుంది. ఆ దిశగా దేవస్థానం అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్నాయి కానీ లేనట్టే... దశాబ్దాల క్రితం భద్రాచలం రంగనాయకుల గుట్టపైన వసతి గదులతో కూడిన సత్రాలు ఉండేవి. వీఐపీల కోసం ఒకటి, రెండు సత్రాలు ఉండగా.. కాలక్రమంలో ఆలయం చుట్టుపక్కల ప్రైవేట్ లాడ్జీలతో పాటు దేవస్థానం వసతి గదులను సైతం నిర్మాణమయ్యాయి. దీంతో రంగనాయకుల గుట్టపై వీవీఐపీల కోసం కాటేజీలను నిర్మించారు. గుట్టపై 28కు పైగా కాటేజీలు ఉండగా, పర్యవేక్షణ లేకపోవడంతో అవి వాడకంలో లేకుండా పోయాయి. ప్రస్తుతం పది కాటేజీలు ఉపయోగంలో ఉండగా వీటిలో సగానికి పైగా ప్రైవేట్ యాజమాన్య పరిధిలోనే ఉన్నాయి. మరో రెండింటిని దాతల సాయంతో నిర్మిస్తున్నారు. అయితే, వినియోగంలో లేని కాటేజీలకు మరమ్మతులు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో శిథిలమైన వాటి స్థానంలో బహుళ అంతస్తుల వసతి గదుల నిర్మాణానికి అవకాశమున్నా ఆ దిశగా ఎవరూ దృష్టి సారించడం లేదు. గదుల నిర్మాణానికి ప్రణాళిక దేవస్థానానికి చెందిన ఖాళీ భూముల్లో వసతి గదుల నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నాం. పట్టణంలోని స్థలాల్లోనే కాక పురుషోత్తపట్నంలోని ఆలయ భూముల్లోనూ పుష్కరాల దృష్ట్యా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాం. వీటిని ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. అంతేకాక గుట్టపై కాటేజీలను వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. – ఎల్.రమాదేవి, ఈఓ, రామాలయం -
వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్కొత్తగూడెంఅర్బన్: ప్రతీ సోమవారం ప్రజావాణి(గీవెన్స్ డే)లో అందే ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి నివసిస్తున్న తోట భార్గవి తల్లి నుండి సంక్రమించిన భూమి సాగును సోదరులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసింది. ● పినపాక మండలం కరకగూడెం జీపీ పరిధిలోని చోప్పాలా, నర్సాపురం గ్రామస్తులు రోడ్డు సౌకర్యం కోసం విన్నవించారు. ● అశ్వాపురం మండలం మొండికుంటకు చెందిన నోముల లక్ష్మి 2024 వరదల్లో ఇల్లు కొట్టుకుపోయినందున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● లక్ష్మీదేవిపల్లి మండలం బోరింగ్ తండాకు నూనావత్ జగన్మోహన్దాస్ రోడ్డు విస్తరణలో తాను కిరాణా షాప్ను కోల్పోయినందున న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ● బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరకు చెందిన జివాజి రమాదేవి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● ములకలపల్లి మండలంలో జరుగుతున్న సీతారామ ప్యాకేజ్–3 పనులకు సంబంధించి విలువైన రాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నందున చర్యలు తీసుకోవాలని కొత్తూరు గ్రామానికి చెందిన ఆంగోతు సుధాకర్ ఫిర్యాదు చేశారు. పూడికతీత పనులకు రూ.167.7 లక్షలు కొత్తగూడెంఅర్బన్: సింగరేణి మణుగూరు ఏరియా ఆధ్వర్యాన చెరువుల పూడికతీతకు గాను రూ.167.7లక్షలు కేటాయించారు. ఈ నిధులతో మణుగూరులోని కోడిపుంజుల వాగు, సమితి సింగారం చెరువు, పొడ పొట్రాల చెరువు, ఎర్ర లక్ష్మయ్య కుంట పూడికతీత పనులు చేపడుతారు. తద్వారా వర్షాకాలం ఎక్కువ నీటి నిల్వకు అవకాశం ఏర్పడుతుందని, సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఈమేరకు నిధుల కేటాయింపు పత్రాలను కలెక్టర్ పాటిల్కు సోమవారం సింగరేణి అధికారులు అందజేశారు. సీపీఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
పాలకులం కాదు.. మేం సేవకులం
● కాకతీయ వారసుడు కమల్చంద్ బంజ్దేవ్ ● వైభవంగా శ్రీ ఆత్మలింగేశ్వరాలయం పునఃప్రతిష్ఠ పాల్వంచ: కాకతీయ రాజుల వంశీయులమైనా తాము పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగానే ముందుకు సాగుతున్నామని బస్తర్ మహారాజు, కాకతీయుల వారసుడు కమల్చంద్ బంజ్దేవ్ తెలిపారు. పాత పాల్వంచలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలంలో వెలసిన శ్రీ ఆత్మలింగేశ్వరాలయం శిథిలావస్థకు చేరడంతో అభివృద్ధి చేశారు. ఈమేరకు ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు ఆధ్వర్యాన సోమవారం ప్రతిష్ఠా మహా కుంభాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆత్మలింగేశ్వర స్వామితో పాటు ఇతర దేవతామూర్తులు, మహానంది మండపం, ధ్వజస్థంభం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో కమల్ చంద్ బంజ్దేవ్ ముఖ్య అతిథిగా పాల్గొని హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ మహా స్వామి సమక్షాన ప్రతిష్ఠ చేశారు. అనంతరం బంజ్దేవ్ మాట్లాడుతూ శిఽథిలావస్థలో ఉన్న ఆలయ నికి పూర్వవైభవం తీసుకొచ్చిన శ్రీనిసరావును, పూజారులు, భక్తులను అభినందించారు. పునఃప్రతిష్ఠాపన ద్వారా ఆలయ చరిత్రను పరమశివుడే తిరిగి రాసినట్లయిందని తెలిపారు. ప్రతిష్టాపనాచార్య జక్కి కృష్ణవధాని, ప్రధాన అర్చకులు జితేందర్ శర్మ, బీజేపీ నాయకుడు తాండ్ర వినోద్ రావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్తో పాటు వివిధ పార్టీల నాయకులు వనమా రాఘవేందర్రావు, కొత్వాల శ్రీనివాసరావు, నాగ సీతారాములు, మండే వీరహన్మంతరావు, వల్లపు యాకయ్య, యల్లావుల కోటేశ్వరరావు, వెంకన్న, నాగర్జున, కృష్ణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సమానత్వం కోసం పోరాడేది ఎర్రజెండానే..
సుందరయ్య వర్ధంతి సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతల్లాడ: సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాడేది ఎర్ర జెండా మాత్రమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టం చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లిలో సోమవారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో కుల, మత విద్వేషాలు పెరుగుతుండగా, ఇందుకు పాలకులు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. పాలకుల విధానాలతో విద్య, వైద్యం కూడా ఖరీదు కాగా, పేదలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యాయని తెలిపారు. అసమానతను నిర్మూలించేలా ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య వేసిన బాట నేటికీ ఆదర్శనంగా నిలు స్తోందని తెలిపారు. ఆయన చూపిన బాటలో కమ్యూనిస్టులు నడుస్తూ పాలకపక్షాల ప్రజావ్యతి రేక విధానాలపై ఉద్యమించాలని జాన్వెస్లీ సూచించారు. తొలుత కుర్నవల్లిలో ర్యాలీ నిర్వహించగా, సీపీఎం నాయకులు మాచర్ల భారతి, శీలం సత్యనారాయణరెడ్డి, కల్యాణం వెంకటేశ్వరరావు, తాతా భాస్కర్రావు, చలమాల విఠల్, ఫకీరమ్మ, రామలింగేశ్వరరావు, కట్టా దర్గయ్య పాల్గొన్నారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.శ్రీకనకదుర్గమ్మకు విశేష పూజలుపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మ అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన దర్బార్లో ఆదివాసీ గిరిజనలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని పేర్కొన్నారు. కిన్నెరసానిలో జలవిహారంపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు కిన్నెరసాని ప్రాజెక్ట్కు తరలివచ్చారు. డ్యామ్పై నుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 560 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.30,820 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.13,300 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కిన్నెరసానిని సందర్శించిన 6వ బెటాలియన్ కమాండెంట్చాతకొండ ఆరో బెటాలియన్కు చెందిన కమాండెంట్ శివప్రసాద్రెడ్డి కుటుంబ సభ్యులతో కిన్నెరసానిని సందర్శించారు. జలాశయాన్ని వీక్షించి బోటు షికారు చేశారు. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రశాంతంసుజాతనగర్: మండల పరిధిలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. 120 మందికిగాను 118 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. -
మద్యం ధరలకు రెక్కలు
● క్వార్టర్పై రూ. 10, ఫుల్ బాటిల్కు రూ.40 పెంపు ● నేటి నుంచి అమలుకు రంగం సిద్ధంవైరా: మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గత నవంబర్లో బీరు ధరలు పెంచిన సర్కార్.. ఆరు నెలలకే లిక్కర్ ధరలు కూడా పెంచడంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లు పెట్టినట్టయింది. పెరిగిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. చీప్ లిక్కర్ నుంచి అన్ని రకాల మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. క్వార్టర్ (180 ఎంఎల్) సీసాపై రూ.10 పెంచగా, హాఫ్ బాటిల్కు రూ. 20, ఫుల్ బాటిల్పై రూ.40 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం కూడా ఒకటి. గతంలో బీర్ల ధర రూ. 20 నుంచి రూ. 40 వరకు పెంచడంతో ఈ ఏడాది గతంలో ఏన్నాడూ లేనంతగా బీర్ల అమ్మకాలు సగానికి పైగా తగ్గాయి. మళ్లీ అన్ని బ్రాండ్ల లిక్కర్ రేట్లు పెంచడంతో అమ్మకాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.నేడు మద్యం డిపోలో బిల్లింగ్ ఆలస్యం..ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మద్యం సరఫరా అయ్యే వైరాలోని మద్యం డిపోలో వ్యాపారులు బిల్లింగ్ కోసం వస్తుంటారు. పెరిగిన ధరల జాబితా ఆన్లైన్లో ఆప్డేట్ అయ్యేందుకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం తర్వాత సర్వర్లో మార్పులు చేసి పూర్తి స్థాయిలో ధరల జాబితాను వ్యాపారులకు అందించే అవకాశం ఉంటుందని డిపో అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో పెంచిన ధరల జాబితా చక్కర్లు కొడుతోంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయంతో మద్యం ప్రియులపై ధరల పిడుగు పడిందని చెప్పొచ్చు. -
నిరీక్షణకు ఇక తెర..
● నేర పరిశోధనలో కీలకంగా ఫోరెన్సిక్.. ● వేగవంతమవుతున్న పోస్ట్మార్టం ● 15 నెలల్లో 1,218 శవ పరీక్షలు ● అందులో 20 శాతం అనాథ శవాలేసకాలంలో నివేదికలు అందజేస్తున్నాం శవ పరీక్షలు ఏరోజుకారోజు నిర్వహిస్తున్నాం. రాత్రి పూట కూడా పోస్టుమార్టం చేస్తున్నాం. పోలీసు కేసుల విచారణకు అవసరమైన రిపోర్టులు సకాలంలో అందజేస్తున్నాం. మార్చురీ వద్దే కార్యాలయం ఏర్పాటు చేసి నిత్యం అందుబాటులో ఉంటున్నాం. సాధ్యమైనంత వరకు ఇక్కడే శవ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అత్యవసరమైన వాటికి హైదరాబాద్కు శాంపిళ్లు పంపిస్తున్నాం. భవిష్యత్లో అన్ని పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తాం. – రాథోడ్ వినాయక్, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కొంతకాలంగా శవ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయి. ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చాక పోస్టుమార్టం నిర్వహణ, రిపోర్టులు వేగవంతంగా రావడం పోలీసుల నేరపరిశోధనకు ఉపయుక్తంగా మారాయి. సంబంధిత వ్యక్తి ఎలా, ఎప్పుడు మరణించాడనేది తేల్చేందుకు పోస్ట్మార్టం నిర్వహిస్తారు. పోలీసులు పంచనామా నిర్వహించి ఫోరెన్సిక్ వైద్యునికి రిక్వెస్ట్ లెటర్ పెట్టిన తర్వాత శవ పరీక్ష చేస్తారు. ఆ తర్వాత వైద్యుడు ఇచ్చే రిపోర్ట్ను బట్టి పోలీసులు విచారణ చేపడతారు. గతంలో శవ పరీక్షకు చాలా ఇబ్బందులు ఉండేవి. పోలీసులు పంచనామా సిద్ధం చేసి మార్చురీకి వచ్చినా పోస్టుమార్టానికి వైద్యుడు రావడం ఆలస్యమయ్యేది. దీంతో పోలీసులు, మృతుల బంధువులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. అంతేకాక క్రిటికల్ కేసుల్లో మృతికి కారణాలను గుర్తిస్తూ రూపొందించే రిపోర్టులు ఆలస్యంగా వచ్చేవి. కొన్ని వరంగల్, మరికొన్ని హైదరాబాద్ పంపించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్ధితి లేదు. కీలకమైన శవ పరీక్షలే హైదరాబాద్లో చేయిస్తున్నారు తప్ప మిగితావి ఖమ్మంలోనే నిర్వహిస్తున్నారు. ఘోషిస్తున్న అనాథ శవాల ఆత్మలు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీలో గత 15 నెలల్లో 1,218 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. 2024లో 995, ఈ మూడు నెలల కాలంలో 223 శవపరీక్షలు జరిగాయి. జిల్లాలో హత్యలు, ఆత్మహత్యలు, రైలు, రోడ్డు ప్రమాదాలు, అనుమానిత మరణాలకు సంబంధించిన బాడీలకు ఇక్కడే పోస్టుమార్టం నిర్వహిస్తారు. అలా వచ్చే మృతదేహాల్లో 20 శాతానికి పైగా అనాథ శవాలే ఉంటున్నాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడి నుంచో వచ్చి జిల్లాలో మృతి చెందే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యాచకులు, పనుల కోసం వచ్చే వారు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందేవారు, ట్రైన్ నుంచి పడి మృతి చెందే వారు ఎక్కువగా ఉంటున్నారు. వారిని గుర్తు పట్టడం కష్టం అవుతుండగా కొద్ది రోజులు వేచి చూసి పోలీసులు, ఆస్పత్రి అధికారుల నిర్ణయంతో అనాథ శవాలుగా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈ శవాల దహనానికి జిల్లాలో ప్రభుత్వ పరంగా ఎలాంటి వ్యవస్థ లేదు. దీంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.శవ పరీక్ష కీలకం.. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లిన తర్వాత ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు దీనిపై సబ్జెక్ట్ ఉంటుంది. ఫోరెన్సిక్ విభాగంలో ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్లను నియమించారు. దీంతో పోస్టుమార్టం నిర్వహణలో ఇబ్బందులు తొలగిపోయాయి. బాధిత కుటంబాలకు సకాలంలో సేవలు అందుతుండగా, పోలీసులకు సైతం రిపోస్టులు సమయానికి వస్తున్నాయి. కాగా నేరపరిశోధనలో పోస్టుమార్టం రిపోర్టు కీలకం. మృతికి దారి తీసిన ఘటనలను నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా హత్య, ఆత్మహత్య, హత్యాచారం, ప్రమాదం, అనుమానాస్పద మరణాలు సంభవించినప్పుడు క్రిమినల్ కేసుల పరిష్కారానికి శవ పరీక్షలు కీలకంగా నిలుస్తాయి. గతంలో పోస్ట్మార్టం ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగగా ఫోరెన్సిక్ వైద్యుడి రాకతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. మార్చురీ వద్ద ఫోరెన్సిక్ విభాగం ఏర్పాటుతో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటుండగా నిరీక్షణకు తెరపడింది. -
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి
ఐటీడీఏ పీఓ రాహుల్భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో ఆదివారం జరిగిన ప్రపంచ ప్రదర్శనశాల దినోత్సవం, కోయ వీరగాథ చక్రం ప్రదర్శన డాక్యుమెంటేషన్ ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ గూడేలలో గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలను మొక్కవోని ధైర్యంతో ఎదిరించిన సమ్మక్క సారలమ్మలు, కాకతీయులను ఎదిరించి వీరమరణం పొందిన ఆదివాసుల ఇలవేల్పులు బాపనమ్మ చంద్రపాల వారసులు, రుద్రమదేవి పరిపాలన కాలంలో వాడిన ఆయుధాలు, వారి చరిత్రను వీరగాథలుగా మలిచి నేటితరం గిరిజనులకు తెలియపరచడం అభినందనీయమన్నారు. ఆదివాసీ కళలు, ఆచార వ్యవహారాలు అంతరించిపోకుండా, ఖండాంతరాలకు తెలిసే విధంగా గిరిజన మ్యూజియంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. మ్యూజియం సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. అనంతరం కోయ సంస్కృతీ సంప్రదాయాలకు చెందిన బుక్లెట్ను ఆవిష్కరించి, కులపతులను పీఓ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమల్ రావు, బండ్ల మునీశ్వరరావు, గొర్రె బాపనయ్య, బండ్ల చుక్కమ్మ, గొర్రె సత్యం, రాంబాబు, వీరాస్వామి, గిరిజనులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘తితిక్ష’
ఖమ్మంగాంధీచౌక్: గంజాయి మత్తులో తూగుతూ రాక్షసుడిగా వ్యవహరిస్తున్న కొడుకును తల్లి హత్య చేసిన ఇతివృత్తంగా రూపొందించిన ‘తితిక్ష’ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్ కళాకారులు ఈ నాటికను ప్రదర్శించారు. ముందుగా హైదరాబాద్ దాశరథి థియేటర్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సహకారంతో నాన్న ఉత్తరం, నా ఆడపిల్ల లఘు చిత్రాలను ప్రదర్శించారు. ముళ్లపూడి ఈశ్వరి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నెలనెలా వెన్నెల నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన సభలో నాటిక ప్రదర్శకులకు పారితోషికం అందించారు. ఈ సందర్భంగా దాతలు న్యాయవాది జాబిశెట్టి పాపారావు, కొండపల్లి జగన్మోహన్ రావు, వంగవీటి నవీన్ మాట్లాడుతూ.. రంగస్థల కళాకారులను ప్రోత్సహిస్తూ నెల నెలా వెన్నెల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో ఇలాంటి నాటికలు ప్రదర్శించటం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్ రావు, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ, మార్తి కొండల్రావు, నందిగామ కృష్ణ, శానం వీరబాబు, జి.రవీందర్ పాల్గొన్నారు. -
పనులు ఎన్ని రోజులండి?
రెండేళ్లుగా సాగుతున్న అమృత్ పథకం పనులు ● ధర గిట్టుబాటుకాక కొన్నింటిని నిలిపివేసిన కాంట్రాక్టర్ ● బీడీసీఆర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల అవస్థలు కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2023లో కొత్తగూడెం రైల్వే స్టేషన్ను ఎంపిక చేసి రూ. 25.41 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఇప్పటివరకు 50 శాతం వరకు పనులు జరిగాయి. టెక్నికల్ సమస్యలతోపాటు ధర గిట్టుబాటు కాలేదని కాంట్రాక్టర్లు వెనకాడటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ భద్రాచలం ఆలయానికి సమీపంలో ఉండటంతో భక్తులు, ప్రయాణికులు ఇక్కడి నుంచి వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తారు. అమృత్ పథకంతో రైల్వే స్టేషన్లో సౌకర్యాలు మెరుగుపడతాయని భావించిన ప్రయాణికులకు నిరాశ ఎదురవుతోంది. రెండేళ్లుగా పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులకు తప్పనిపాట్లు భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనులు మూడు విభాగాలుగా జరుగుతున్నాయి. బిల్డింగ్ వర్క్, ఫుట్ఓవర్ బ్రిడ్జి, షీట్ వర్క్స్, స్టేషన్ ముఖద్వారం, ప్రవేశద్వారం, ఆలయ అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. అయితే రేటు గిట్టుబాటు కాకపోవడంతో ఆలయ పనులను సంబంధిత కాంట్రాక్టర్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో స్టేషన్ ముఖద్వారం, ప్రవేశ ద్వారం పనులు కూడా నిలిచిపోయాయి. స్టేషన్లో వెయిటింగ్ హాల్ బిల్డింగ్ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. కానీ బాత్రూంలకు, రాకపోకలకు సంబంధించిన డోర్లు ఏర్పాటు చేయలేదు. విద్యుదీకరణ, వెయిటింగ్ రూములు, ఎస్కలేటర్, లిఫ్ట్ తదితర పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్లాట్ఫామ్ ఉపరితలం, పైకప్పులను అధునాతన షీట్లతో నిర్మించే పనుల్లో కూడా ఆలస్యమవుతున్నాయి. దీంతో సీట్లన్నీ ప్లాట్ఫాంపైనే ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో అక్కడక్కడా జరిపిన తవ్వకాలు అడ్డుగా ఉన్నాయి. స్టేషన్ ముఖద్వారం దగ్గర కూడా అపరిశుభ్రత నెలకొంది. ప్రయాణికుల కుర్చీలు, బల్లల దగ్గర పైకప్పు లేకపోవడంతో ఎండ, వానకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో వర్షం వస్తే ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్ల దగ్గర తలదాచుకుంటున్నారు. రైల్వే అధికారులు స్పందించి అభివృద్ధి, ఆధునికీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కూర్చోవాలన్నా ఇబ్బందే.. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి డోర్నకల్కు వెళ్తున్నాం. మధ్యాహ్నం రైలు వచ్చేందుకు సమయం ఉండటంతో వేచి చూస్తున్నాం. స్టేషన్లో కూర్చునేందుకు నీడ కూడా లేదు. వెయిటింగ్ హాల్ పనులు కూడా ఇంకా పూర్తికాలేదు. రైలు వచ్చే వరకు ఎక్కడ వేచి ఉండాలో తెలియడం లేదు. – ఈర్య, సుజాతనగర్త్వరగా పూర్తిచేయాలి భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు నత్తనడకన జరుగుతున్నాయి. స్టేషన్లో ఎక్కడ చూసినా పనులకు సంబంధించిన సామగ్రి ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరముంది. – మారోని, కొత్తగూడెం -
ఆదివాసీ సమాజంపై రాజకీయ కుట్రలు
ఇల్లెందు: రాజకీయ కుట్రలకు ఆదివాసీ సమాజం బలవుతోందని తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు మైపతి అరుణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాగర్జన సభలో మాట్లాడారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల గొంతు కోసిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తామని చెప్పడంలేదన్నారు. రాజకీయ పార్టీల కుట్రలను ఛేదించేందుకు ఆదివాసీలు అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పొదెం వీరయ్య, తాటి వెంకటేశ్వర్లు వంటివారు ఒక్కసారి కూడా శాసనసభలో ప్రశ్నించలేదని ఆరోపించారు. ఆధార్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జేజే రాంబాబు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించామని, కేసు పెండింగ్లో ఉందని తెలిపారు. అంతకుముందు కొత్త బస్టాండ్ సెంటర్లో కొమరం భీం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణంలో ఆదివాసీ వేషధారణలతో కళా ప్రదర్శన నిర్వహించారు. సభలో కళాకారులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈసం సుధాకర్, నాయకులు కల్తీ సత్యనారాయణ, మెట్ల పాపయ్య, తెల్లం వెంకటేశ్వర్లు, జనార్దన్, పోలెబోయిన వెంకటేశ్వర్లు, చుంచు రామకృష్ణ, పొడియం బాలరాజు, బుగ్గ రామనాధం, జోగ రాంబ్రహ్మం పాల్గొన్నారు.తుడుందెబ్బ నేత మైపతి అరుణ్కుమార్ -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశా రు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచ నం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించాలిసూపర్బజార్(కొత్తగూడెం): విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్ల కోసం రూపొందించిన బ్రోచర్ను శనివారం ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలకు నాణ్యమైన బోధన అందించాలన్నారు. స్కూళ్లలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
పోడు భూములిక పచ్చగా..
గిరిజన రైతుల కోసం ‘ఇందిర గిరి జల వికాసం’ ● రాష్ట్రంలోనే భద్రాచలం ఐటీడీఏకు ఎక్కువగా.. ● ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా 1.96 లక్షల ఎకరాలు లక్ష్యం ● పైలట్ ప్రాజెక్ట్గా చండ్రుగొండ మండలం ఎంపిక భద్రాచలం: గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సారవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పోడు భూములకు విద్యుత్ సరఫరా లేక, అటవీ శాఖ అనుమతులు రాక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న గిరిజనులకు ‘సౌర నీరు’ అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. రాష్ట్రంలో పట్టాలు కలిగిన పోడు భూముల హక్కుదారులకు ‘ఇందిర గిరి జల వికాసం’ పేరిట కొత్త పథకాన్ని చేపట్టగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలో అధికారికంగా ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని చండ్రుగొండ మండలంలోని పలు గ్రామాలను ఎంపిక చేశారు. అయితే రాష్ట్రం మొత్తం మీద ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న భద్రాచలం ఐటీడీఏకే అత్యధిక నిధులు కేటాయించడంతో జిల్లాలోని అనేక మంది గిరిజనులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. పోడు భూములు సాగులోకి తెచ్చేందుకే.. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అనేక ఏళ్లుగా పోడు భూముల ఆధారంగానే ఎంతోమంది గిరిజనులు జీవిస్తున్నారు. వీరికి దివంగత నేత వైఎస్సార్ హయాంలో హక్కు పత్రాలు అందజేశారు. ఆ తర్వాత కూడా కొంతమందికి హక్కు పత్రాలు అందాయి. అయితే ఈ భూములకు సాగు నీరు లేక గిరిజన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఉచిత విద్యుత్ అందజేయాలంటే ఆర్థిక భారంతో పాటు అటవీ శాఖ క్లియరెన్స్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సోలార్ విద్యుత్ ద్వారా పంప్సెట్లను అందించాలని నిర్ణయించింది. తద్వారా వచ్చే ఐదేళ్లలో పోడు సాగుదారులందరికీ సోలార్ పంప్ సెట్లకు రూ.6 లక్షల చొప్పున నిధులు విడుదల చేయనుంది. పథకం అమలు ఇలా.. ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించింది. రెండున్నర ఎకరాల పొలం ఉన్న రైతును సింగిల్ యూనిట్గా గుర్తించింది. అంతకంటే తక్కువగా ఉన్న రైతులను గ్రూప్గా ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించి రైతులను గుర్తించాలి. జిల్లా స్థాయిలో ఈనెల 30 నాటికి సర్వే, ఇతర పనుల టెండర్లు ఖరారు చేసి, జూన్ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు ప్రారంభించేలా షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 26 నుంచి మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరు బావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు, ఇతర పనులు పూర్తి చేయాలి. జిల్లా స్థాయిలో పథకం అమలుకు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. భద్రాచలం ఐటీడీఏకు భారీగా.. రాష్ట్రంలో 2025 – 26 నుంచి 2029 – 30 వరకు ఆరు లక్షల ఎకరాలను జల వికాసం పథకంలోకి తీసుకురానున్నారు. అందులో జిల్లాలోనే అత్యధికంగా 1.96 లక్షల ఎకరాల భూమి సాగులోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించడం విశేషం. కాగా, ఈ పథకానికి భద్రాచలం ఐటీడీఏ పరిఽధిలోని చండ్రుగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇప్పటికే బెండాలపాడు, రాయికంపాడు తదితర గ్రామాల్లో సోలార్ పంప్సెట్లు అమర్చి ట్రయల్ రన్ నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఈ పథకం ప్రారంభమయ్యాక జిల్లాలో మొదలు పెట్టనున్నారు.రానున్న ఐదేళ్లలో జిల్లాకు కేటాయింపులు ఇలా.. సంవత్సరం రైతులు పోడు ఎకరాలు 2025 – 26 2,921 8,046 2026 – 27 14,856 46,988 2027 – 28 14,856 46,988 2028 – 29 14,856 46,988 2029 – 30 14,856 46,988మొత్తం 62,347 1,96,000గిరిజన పోడు రైతులకు పూర్తి సబ్సిడీ పోడు హక్కు పత్రాలున్న భూముల్లో సాగు చేస్తున్న గిరిజన రైతులకు పూర్తి సబ్సిడీతో ఈ పథకం అమలు జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలు ప్రకటించింది. ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టుగా చండ్రుగొండ మండలంలో ట్రయల్ రన్ నిర్వహించాం. – డేవిడ్ రాజ్, ఐటీడీఏ ఏపీఓ జనరల్ -
జిల్లా.. సహజ వనరుల ఖిల్లా
● ప్రజాస్వామ్యానికి ప్రతీకగా భద్రాద్రి.. ● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి ● అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలుసూపర్బజార్(కొత్తగూడెం): సహజ వనరులకు నిలయంగా జిల్లా నిలుస్తోందని, రాజకీయ భావజాలంతో ప్రజాస్వామ్యానికి ప్రతీకగా గుర్తింపు పొందిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఐడీఓసీ, పాల్వంచ శ్రీనివాసకాలనీ, పాండురంగాపురంలో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్లు, ఎస్ఈ, డీఈ కార్యాలయాల నిర్మాణాలకు శనివారం కలెక్టరేట్లో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరిక మేరకు కేటీపీఎస్లో నూతన విద్యుత్ స్టేషన్ నిర్మాణానికి అన్ని రకాలా అధ్యయనం చేసి 15 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. గోదావరిపై నుంచి నౌకాయానానికి అవకాశాలను పరిశీలిస్తామని, తద్వారా రవాణా వ్యయం తగ్గుతుందని అన్నారు. నిరుద్యోగ యువత కోసం రూ.900 కోట్లతో రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన జిల్లా అయినా దేశానికి విద్యుత్ వెలుగులు నింపిన చరిత్ర ఉందన్నారు. సీతారామ ప్రాజెక్ట్తో జిల్లా సస్యశ్యామలం అవుతుందని, భద్రాద్రి రామ య్య చుట్టూ జాతీయ రహదారులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జలగం వెంగళరావు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేశారని, అలాంటి అవకాశం ఇప్పుడు భట్టి విక్రమార్కకు వచ్చిందని అన్నారు. నియోజకవర్గంలో అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం భట్టి తదితరులు కలెక్టరేట్లోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను పరిశీలించి వ్యాపారం ఎలా సాగుతోందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కిన్నెరసాని బ్రిడ్జి ప్రారంభం.. పాల్వంచరూరల్ : రాజాపురం–యానంబైల్ మధ్య కిన్నెరసాని వాగుపై నిర్మించిన బ్రిడ్జిని మంత్రి తుమ్మల, ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆతర్వాత బూడిద వాగుపై బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, అటవీ అభివృద్ధి, గిడ్డంగుల సంస్థల చైర్మన్లు పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, సింగరేణి సీఎండీ బలరాంనాయక్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, ఆర్అండ్బీ ఈఈ వి.వెంకటేశ్వర్లు, డీఈ ఐ.నాగేశ్వరరావు, ఎంపీడీఓ విజయభాస్కర్రెడ్డి, నాయకులు ఎడవల్లి కృష్ణ, యర్రంశెట్టి ముత్తయ్య, సాబిర్పాషా, విశ్వనాదం, పూర్ణచందర్రావు, మధు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాగా, సోములగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రంపై దృష్టి పెట్టాలని స్థానిక రైతులు మంత్రి తుమ్మలను కోరారు. -
అనారోగ్యంతో టీచర్ మృతి
ఇల్లెందు: పట్టణంలోని మొహల్లా నెంబర్–16 ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయుడు బి. నగేష్(45) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య రాధ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన నగేష్ ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. మృతి పట్ల టీఎస్ యూటీఎఫ్, ఏటీఎఫ్, టీపీటీఎస్, పీఆర్టీయూ సంఘాల నాయకులు రాంబాబు, వెంకటేశ్వర్లు, కబ్బాకుల రవి, మోకాళ్ల శ్రీనివాస్, వెంకట్రాం, సర్వేశ్వరరావు తదితరులు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చికిత్స పొందుతున్న ఆటోడ్రైవర్..పాల్వంచరూరల్: పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సీతానగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ గుగులోత్ సాయిమహేందర్నాయక్(33) గత నెల 21న ఇంటి వద్ద పురుగుల మందుతాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉండగా, కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. అనంతరం ఈ నెల 14న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..● మరొకరికి తీవ్ర గాయాలు ఇల్లెందురూరల్: మండలంలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ అశోక్నగర్ సమీపంలో శనివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మా మిడిగుండాల గ్రామపంచాయతీ మేడికుంట గ్రామానికి చెందిన తెల్లం రామ్మూర్తి (35), చింత రవి భవన నిర్మాణ పనులు చేసేందుకు బైక్పై మసివాగు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో అశోక్నగర్ మూలమలుపు వద్ద బైక్ను చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలై రామ్మూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చింత రవికి కూడా తీవ్రంగా గాయాలు కావడంతో 108 వాహనంలో ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం సిఫారసు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతుడు రామ్మూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యుదాఘాతంతో ఐదు పశువులు మృతిజూలూరుపాడు: విద్యుదాఘాతంతో ఐదు పశువులు మృత్యవాత పడ్డాయి. రెండు రోజుల క్రితం ఈదురు గాలులతో కూడిన వర్షానికి మండలంలోని సురారం గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగిపడింది. శనివారం ఉదయం మేతకు వెళ్లిన రెండు దుక్కిటెద్దులు, మూడు పాడి పశువులు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. సుమారు రూ. 3 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత, సురారానికి చెందిన రైతులు బానోత్ వెంకటేశ్వర్లు, ఉడుతల వెంకన్న, తేజావత్ సూర్య, మందెరకల నాగేశ్వరరావు, జూలూరి లక్ష్మి వాపోయారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. విద్యుత్ ఏఈ సతీష్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని ఏఈ తెలిపారు. అనంతరం జూలూరుపాడు పశువైద్యాధికారి సాయిరాం సందీప్ మృత్యువాతకు గురైన పశువులకు పోస్ట్మార్టం నిర్వహించారు. -
మత్స్యకారులకు ముగిసిన శిక్షణ
కూసుమంచి: పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో పది జిల్లాల మత్స్యకారులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ శనివారం ముగిసింది. ‘జలాశయాల్లో మత్స్య అభివృద్ధి – యాజమాన్య పద్ధతులు’ అనే అంశంపై ఇచ్చిన శిక్షణకు ఖమ్మం, నిజామాబాద్, హనుమకొండ, సూర్యాపేట, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మత్స్యకారులు పాల్గొన్నారు. కాగా, ముగింపు సమావేశంలో సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి బి.నాగులునాయక్ మా ట్లాడుతూ.. శిక్షణను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని మత్స్య అభివృద్ధి సాధించాలని, తద్వారా రాష్ట్రాన్ని ఆక్వా హబ్గా మార్చాలని సూచించారు. చేపల పెంపకంతో పాటు మార్కెటింగ్ కూడా కీలకమైనందున మెళకువలు నేర్చుకోవాలని పేర్కొ న్నారు. మత్స్యపరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్తో పాటు శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, నాగరాజు మాట్లాడగా శిక్షణలో పాల్గొన్న వారికి నైపుణ్య సర్టిఫికెట్లు అందజేశారు. ఇసుక లారీ సీజ్ పాల్వంచరూరల్: మండల పరిధిలోని నాగారం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న ఇసుక లారీని పోలీసులు పాల్వంచలోని దమ్మపేట సెంటర్లో శనివారం రాత్రి పట్టుకున్నారు. ఇసుక తరలింపునకు అనుమతులు, ఆధారాలు లేకపోవడంతో లారీని సీజ్ చేసినట్లు వెల్లడించారు. -
విద్యావ్యవస్థ సమర్థవంతంగా కొనసాగాలి
ఖమ్మంసహకారనగర్: విద్యావ్యవస్థను సమర్థవంతంగా కొనసాగేలా అందరూ కృషి చేయాలని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (సైట్) డైరెక్టర్ విజయలక్ష్మీబాయి సూచించారు. ఖమ్మంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఎంఈఓలు వారి పరిధి పాఠశాలల్లో బోధన నాణ్యత పెంచేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతీనెల ఉపాధ్యాయుల సమీక్షలు నిర్వహించి, ప్రణాళికపై సూచనలు చేయాలని తెలిపారు. ఆ తర్వాత బడిబాట, పాఠ్యపుస్తకాల సరఫరా, ఏకరూప దుస్తులు సిద్ధం చేయడంపై సూచనలు చేసిన ఆమె శిక్షణలో ప్రతభ కబబర్చిన ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, అకడమిక్ మానిటరింగ్ అధికారి రవికుమార్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ రాజశేఖర్, ఎంఈఓలు పాల్గొన్నారు. కాగా, పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి చేయడమే కాక విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సమకూర్చాలని, అన్ని పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పించాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయికి వినతిపత్రం అందజేశారు. ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండు యాదగిరి, ఎస్కే మన్సూర్, నాయకులు పోతగాని వెంకన్న, పాశం శ్రీనివాస్, రామకృష్ణ, రాజు, పెనుగొండ ఉపేందర్రావు పాల్గొన్నారు. సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయి -
వైల్డ్లైఫ్ చెక్పోస్టు తనిఖీ
పాల్వంచరూరల్: యానంబైల్ రేంజ్ కిన్నెరసానిలోని వైల్డ్లైఫ్ చెక్పోస్టులో ఇన్చార్జి ఎఫ్డీఓ కృష్ణమాచారి శనివారం తనిఖీ చేశారు. పర్యాట కులకు విక్రయించే టోపీలు, టీషర్టులను పరి శీలించారు. అనంతరం మొండికట్ట బీట్లో ఫారెస్ట్ ప్లాంటేషన్ను సందర్శించారు. వైల్డ్లైఫ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీర్ పార్కు వద్ద రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. నేడు మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ రాత పరీక్షసింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో ఖాళీగా ఉన్న మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (ఇంటర్నల్), ఈ–2 గ్రేడ్ 30 పోస్టులకు, జూనియర్ ఆఫీసర్ ఈ–గ్రేడ్–1 రెండు పోస్టులకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించనున్నట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులతోనే ఈ పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొంది. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో నేడు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపింది. సూపర్బజార్ ఎండీగా మురళీధర్సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సూపర్బజార్ ఎండీగా ఎ.జె.మురళీధర్ను నియమిస్తూ యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎండీ నికోలస్ను రిక్రూట్మెంట్ సెల్ జీఎంగా నియమించగా, ఆ స్థానంలో ఈఈ సెల్ హెచ్ఓడీగా ఉన్న మురళీధర్కు అవకాశం కల్పించారు. కాంటాల జాప్యంపై రైతు ఆగ్రహం నేలకొండపల్లి: ధాన్యం కాంటాల్లో జాప్యం జరుగుతుండడంతో ఓ రైతు రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించేందుకు యత్నించాడు. మండల కేంద్రంలోని మార్కెట్లో ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ కేంద్రానికి 50 రోజుల కిందట తాతా హనుమంతరావు ధాన్యం తీసుకొచ్చాడు. ఇప్పటివరకు కాంటా వేయకపోగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండడంతో శనివారం ఆయన బోదులబండ – నేలకొండపల్లి రహదారిపై ధాన్యం బస్తాలను వేసి నిప్పంటించేందుకు యత్నించాడు. దీంతో సహచర రైతులు అడ్డుకోగా, తహసీల్దార్ వెంకటేశ్వర్లు చేరుకుని నచ్చజెప్పారు. త్వరగా కాంటా వేయిస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. విధి నిర్వహణలో ఐటీసీ కార్మికుడికి గుండెపోటు చికిత్స పొందుతూ మృతిబూర్గంపాడు: సారపాక ఐటీసీ పీఎస్పీడీలో విధులు నిర్వహిస్తున్న పర్మనెంట్ కార్మికుడు శనివారం గుండెపోటుతో మృతిచెందాడు. బూర్గంపాడుకు చెందిన ఎండీ షంషుద్దీన్(40) శనివారం ఉదయం విధులకు హాజరై గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. అతనిన్ని చికిత్స నిమిత్తం ఐటీసీ డిస్పెన్సరీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు సందర్శించి నివాళులర్పించారు. విధులకు వెళ్లిన భర్త విగతజీవిగా ఇంటికి చేరటంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు గుండెలావిసేలా రోదిస్తున్నారు. క్రీడాకారుడిగా గుర్తింపు సాధించిన షంషుద్దీన్ మృతితో బూర్గంపాడులో విషాదం అలుముకుంది. స్థానికంగా క్రికెట్ టోర్నమెంట్ల నిర్వహణలో ఆయన కీలకంగా పనిచేసేవారు. మృతిపట్ల మిత్రులు, క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో బదిలీలుదుమ్ముగూడెం: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 179 మంది కానిస్టేబుళ్లు, 15 మంది హెడ్ కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ రోహిత్రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా స్టేషన్లలో వారు విధులు నిర్వహించబట్టి సుదీర్ఘకాలం అయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దుమ్ముగూడెం స్టేషన్లో ముగ్గురు హెడ్కానిస్టేబుళ్లు, తొమ్మిది మంది కానిస్టేబుళ్లను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. -
‘సీతారామ’ పనుల్లో భారీగా అవినీతి
ములకలపల్లి: సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో అవినీతి వరద ప్రవహిస్తోందని బీజేపీ జిల్లా అద్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మండల పరిధిలోని 48.30 కి.మీ. వద్ద ప్రధాన కాలువపై సూపర్ పాసేజ్ పిల్లర్ కూలిన ప్రదేశాన్ని శనివారం బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.20వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ ట్రయల్ రన్కే పిల్లర్ కూలిపోవడం పనుల్లోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు. ప్రధాన కాలువ గైడ్వాల్కు పలుచోట్ల బీటలువారడం, లైనింగ్ విరిగిపోయి ప్రధాన కాలువ తెగిపోవడం అఽధికారుల ఉదాసీన త, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు. సమగ్ర విచారణ చేపట్టి అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల అధ్యక్షులు గుగులోత్ శంకర్నాయక్, జుబ్బూరి రమేశ్, తంగెళ్ల ఆంజనేయులు, బాణోత్ మల్లేశ్, బాణోతు సుధారాణి, తేజావత్ పార్వతి, సూర్యం, రవికుమార్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలిఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని మర్రిగూడెం, అబ్బుగూడెం గ్రామాల్లో శనివారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కాంటాలు అయినా ఎగుమతి లేక, లారీలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో పరిస్థితి చూడాలని పేర్కొన్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన మామిడి రెమల్య కుంటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జుబ్బురి రమేష్, దేవిబాల కిరణ్శర్మ, జటంగి కృష్ణ, మొగిలి రామకృష్ణ, శ్రీను పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి -
వ్యవసాయ కళాశాలను సందర్శించిన డీలర్ల బృందం
అశ్వారావుపేటరూరల్: శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలను శనివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన దేశి డీలర్ల బృదంసందర్శించింది. ఎరువులు, పురుగు మందులషాపుల యజమానులకు 45 రోజుల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్(దేశి) కోర్సు నిర్వహిస్తున్నారు. శిక్షణలో డీలర్లు కళాశాలను సందర్శించారు. కళాశాలలోని వివిధ రకాల కూరగాయల పంటలతోపాటు మునగ, మామిడి, కొబ్బరి, ఆయిల్పామ్ పంటల యాజమాన్యం, సాగు పద్ధతులు, వర్మీ కంపోస్టు, తేనెటీగల పెంపకంపై శాస్త్రవేత్తలు వారికి వివరించారు. కళాశాలలో నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మోడల్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ నీలిమ, డాక్టర్ ఎన్.చరిత, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
మట్టి తవ్వకాల్లో జేసీబీ బోల్తా
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామ శివారు పట్టా భూమిలో అనధికారికంగా చేపట్టిన మట్టి తవ్వకం పనుల్లో శనివారం జేసీబీ బోల్తా పడింది. కొమరారం గ్రామానికి చెందిన పాష తన సొంత పొలంలో చేపల పెంపకం పేరుతో సుమారు రెండు గుంటల విస్తీర్ణంలో మొరం తవ్వకం ప్రారంభించాడు. మట్టి తవ్వకాలు మరీ లోతుగా ఉండటం కారణంగా జేసీబీ తవ్వకం పనుల కోసం లోనికి దిగుతుండగా అదుపు తప్పి పల్టీకొట్టింది. డ్రైవర్ ప్రమాదాన్ని ముందే గుర్తించి దూకడం ద్వారా క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాదంలో జేసీబీ కొంత మేర ధ్వంసమైంది. -
నిబంధనలు బేఖాతర్!
● భద్రాచలంలో అక్రమంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు ● నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులుభద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు కడుతున్నారు. వంద, రెండొందల గజాల్లో రెండు, మూడు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదు. నోటీసులు ఇచ్చేందుకు కూడా జాప్యం చేస్తున్నారు. మొదటి అంతస్తు నిర్మాణంలో ఉన్నప్పుడు ఫిర్యాదు అందితే మూడు అంతస్తు నిర్మించేటప్పుడు స్పందిస్తున్నారు. పాఠశాల, షాపింగ్ కాంప్లెక్సుల భవనాలు కూడా అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు. జీ+2 వరకే అనుమతి.. భద్రాచలంలోని 19 వార్డుల్లో 36 వేల కుటుంబాలు ఉన్నాయి. 80 వేల మంది జనాభా నివసిస్తున్నారు. దక్షిణ భారత అయోధ్యగా పేరొందిన ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో క్రమంగా ఇళ్ల నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల 36 ఇళ్ల నిర్మాణానికి గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వారు అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ నిబంధనల మేరకు పట్టణంలో 300 చ.మీలోపు జీ+2 అంతస్తుల వరకే ఇళ్ల నిర్మాణాలకే అనుమతి ఉంది. కానీ పలువురు జీ+3, జీ+4, జీ+5 వరకు నిర్మిస్తున్నారు.అధికారులు యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో యజమానులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరుకు వీధుల్లోనూకనీసం దారి లేకుండా నిర్మిస్తున్నారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో అక్రమనిర్మాణాలు అంతస్తులు దాటిపోతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. -
ఎస్సెస్సీ ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి ప్రతిభ చాటిన విద్యార్థినీ, విద్యార్థులకు మిత్రా ఫౌండేషన్ ఆధ్వర్యాన రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ బహుమతులు అందజేసి అభినందించారు. మొదటి బహుమతి రూ.25 వేలతో పాటు ల్యాప్టాప్ను పచావ వెన్నెల, మాఘం యశ్వంత్ రూ.25 వేలు, చింతోజు సాయి రూ.15 వేలు అందుకోగా, తిరుమలదాసు మాధురి, రామిశెట్టి ఉమ, ఆవుల శ్రీమన్య, గోడ లక్ష్మి, పుచ్చకాయల భవ్య, చందా భావనకు రూ.10 వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించటం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. తొలి ఐదు స్థానాల్లో నిలిచిన ఐదుగురు విద్యార్థులను ఢిల్లీకి విమానంలో మూడు రోజుల యాత్రకు తీసుకెళ్తామని తెలిపారు. మిత్ర ఫౌండేషన్ డైరెక్టర్లు రంగా శ్రీనివాస్, పోలవరపు శ్రీనివాస్, చారుగుండ్ల రవికుమార్, చెరుకూరి యుగంధర్, నాగసాయి నగేశ్, ప్రసేన్, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ బాధ్యులు పాల్గొన్నారు. మొదటి ఐదుగురికి విమానయానం కూడా.. -
పత్తి కాంటాల్లో మోసం
సుజాతనగర్: పత్తి కాంటాల్లో మోసానికి పాల్పడుతున్న చిరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుజాతనగర్ పోలీస్స్టేషన్లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఎస్కే అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. సుజాతనగర్ మండలంలోని సర్వారం, జూలూరుపాడు మండలంలోని కొమ్ముగూడెం, చుంచుపల్లికి చెందిన పలువురు చిరు వ్యాపారులు తమ ట్రాలీ వాహనాల్లో గ్రామాల్లో తిరుగుతూ పత్తి కొనుగోలు చేస్తున్నారు. వీరు జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన పత్తి వ్యాపారులు కేశపూర్ణ వెంకట కృష్ణారావు, సుజాతనగర్ మండలం కోమటపల్లి గ్రామానికి చెందిన మూడు భీమ్లాలకు విక్రయిస్తున్నారు. అయితే మార్కెట్లో గుమస్తాగా పనిచేసే భూక్యా అర్జున్, ధర్మ కాంటా వే బ్రిడ్జి ఆపరేటర్లు గోతం సతీష్, అక్కినపల్లి రాజేష్లతో చిరువ్యాపారులు చేతులు కలిపి తెచ్చిన పత్తి కంటే అదనంగా వే బిల్లులు చూపిస్తూ వ్యాపారుల నుంచి నగదు తీసుకుంటున్నారు. మూడు, నాలుగు నెలలుగా ఈ దందా సాగుతోంది. క్రమంగా నష్టం వస్తుండటంతో గమనించిన వ్యాపారులు వెంకట కృష్ణారావు, భీమ్లాలు ఈ నెల 8న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టగా 268.95 క్వింటాళ్ల పత్తిని అదనంగా చూపించి చిరువ్యాపారులు, ఆపరేటర్లు సుమారు రూ. 17 లక్షలను కాజేసినట్లు తేలింది. ఈ ఘటనలో 26 మంది చిరువ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 18 ట్రాలీ వాహనాలు సీజ్ చేయడంతో పాటు రూ.13.18 లక్షలను రికవరీ చేశారు. కాగా వే బ్రిడ్జి ఆపరేటర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఎం.రమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.26 మంది చిరు వ్యాపారులు అరెస్ట్ -
ట్రాన్స్ఫార్మర్ మీద పడిన యువకుడు మృతి
భద్రాచలంఅర్బన్: ప్రమాదశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మీదపడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలం, జగన్నాథపురం గ్రామానికి చెందిన వంశీ (23) సామ్రాట్ లాడ్జి పక్కన గదిలో ఉంటున్నా డు. పనిమీద బయటకు రాగా లాడ్జికి చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ యువకుడిపై పడటంతో మృతిచెందాడు. స్థానికులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. కాగా, పలువురు రాజకీయ నాయకులు, పలు కుల సంఘాల నాయకులు సదరు లాడ్జి ఎదుట వంశీ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకోగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ సద్దుమణిగాక వంశీ మృతదేహాన్ని ఏరి యా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదవశాత్తు వంశీ మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విద్యుదాఘాతంతో వివాహిత..అశ్వారావుపేటరూరల్: విద్యుదాఘాతానికి గురై ఓ వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ యయాతి రాజు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని వినాయకపురం కాలనీలో వేల్పుల కిశోర్, రూప (25)తోపాటు మూడేళ్ల బాలుడు, ఏడాది వయస్సు ఉన్న కుమార్తె ఉంటున్నా రు. మధ్యాహ్నం సమయంలో కుమార్తెను పడుకోబెట్టి.. తడి బట్టలను ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డుకు కట్టిన దండెం (ఐరన్ తీగ)పై ఆరేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురైంది. చేతికి గాయాలు కాగా, అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో కుటుంబీకులు ఆటోలో అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యు లు మధ్యలోనే మృతిచెందిందని, పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి భర్త కిశోర్ ఫిర్యాదుతో మృతదేహానికి పోస్టుమార్టం జరిపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, సర్వీస్ వైరు ఐరన్ రేకుల రాపిడికి గురి కావడంతో విద్యుత్ సరఫరా అయిందని పోలీసులు తెలిపారు. కాల్వలో పడి వ్యక్తి.. అశ్వాపురం: మండలంలోని చింతిర్యాలగూడెం గ్రామంలో రహదారి వెంబడి మురుగు కాలువలో పడి శుక్రవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన పాయం కామరాజు (32) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతూ.. ఇంట్లోంచి బయటకు వచ్చాడు. రహదారి వెంబడి మురుగుకాలువలో పడి మృతి చెందాడు. ఎస్ఐ మధుప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మనుమరాలిని నృత్య శిక్షణకు తీసుకెళ్తూ..
● బొలెరో వాహనం ఢీకొని తాత మృతి ● బాలిక కాళ్లకు తీవ్రగాయాలు పాల్వంచరూరల్: మనమరాలిని నృత్య తరగతులకు తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మండల పరిధిలోని పునుకుల సమీపంలో చోటుచేసుకుంది. మనుమరాలి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థాని కుల కథనం ప్రకారం... మండల పరిధిలోని పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన నీరుడు రామారావు (63) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆరోతరగతి చదువుతున్న తన మనుమరాలు తులసి వేసవి సెలవులు కావడంతో పాల్వంచలో క్లాసికల్ నృత్యం నేర్చుకుంటోంది. దీంతో శుక్రవారం మనుమరాలిని తీసుకుని ద్విచక్రవాహనంపై పాల్వంచకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పునుకుల సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే పాల్వంచ నుంచి కిన్నెరసాని వైపు వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రామారావుకు తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు. నాట్యం నేర్చుకుంటున్న మనుమరాలి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. బాలికను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా రు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. మృతుడికి భార్య ముత్తమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం రామారావు పెద్ద కుమారుడు చిరంజీవి కూడా ట్రాక్టర్, ఆటో ఢీకొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు తండ్రి కూడా అదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడు. మృతదేహం వద్ద కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా చిన్నకుమారుడు అప్పారావు అమెరికాలో ఉంటుండగా, ఆయన వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
వర్షానికి తడిసిన ధాన్యం
సుజాతనగర్: మండలంలో శుక్రవారం తెల్లవారు జామున కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసింది. వారం రోజుల కింద కురిసిన వర్షానికి నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. రాత్రి సమయంలో వర్షం కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించక పోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని, తూకంలో ఆలస్యం జరుగుతోందని వాపోతున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు 4 వేల వరకు ఉండగా..1500 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో ఉంది. అధికారులు స్పందించి త్వరగా ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించాలని కోరుతున్నారు. పాల్వంచలో.. పాల్వంచరూరల్: మండలంలోని కారెగట్టు ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిందని, వర్షం కురిసినప్పుడల్లా ధాన్యం ఆరబెట్టుకోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం రెండు లోడ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. కాగా, మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, లారీలు రాకపోవడంతో కొనుగోలులో జాప్యం జరుగుతోందని నిర్వాహకులు రవి తెలిపారు. -
విలువైన రాయి.. తరలిపోయి..
● ‘సీతారామ’ రాళ్ల తరలింపు.. ● పట్టించుకోని అధికారులు ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐపీ) ప్రధాన కాల్వ తవ్వకంలో బయటపడిన పెద్ద రాళ్లు (హార్డ్ రాక్) మాయమవుతున్నాయి. క్రషింగ్కు అనుగుణంగా ఉన్న విలువైన రాళ్లను భారీ వాహనాలతో ముక్కలుగా పగులగొట్టి టిప్పర్లలో బయటకు తరలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని కొత్తూరు శివారులోని సీతారామ ప్రధాన కాల్వపై వంతెన నిర్మించారు. ఈ ప్రదేశంలో కాల్వ తవ్వే సమయంలో క్రషర్లో వినియోగించేందుకు అనువైన గట్టి రాయి బయటపడింది. కాల్వ నిర్మాణం కోసం రాయిని బయట వేశారు. అయితే, పట్టపగలే భారీ జేసీబీ సాయంతో రాయిని వెలికితీసి, ముక్కలుగా మార్చి, టిప్పర్లలో తరలిస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాతో విలువైన రాళ్లగుట్ట క్రమేపీ కరిగిపోతోంది. సంబంధితశాఖ అధికారులు దృష్టిసారించి రాయిని కాపాడాలని పలువురు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనలపై ఇరిగేషన్ శాఖ ఏఈ నరేశ్ను వివరణ కోరగా.. కాల్వ ఒడ్డున ఉన్న రాళ్లను క్రషింగ్ చేసి, తిరిగి సీతారామ ప్రాజెక్ట్ పనులకే వినియోగిస్తామని తెలిపారు. ఎంత రాయి తరలిస్తే, అంతమేరకు మార్కెట్ రేటుకు అనుగుణంగా రివకరీ చేస్తామని చెప్పారు. -
సీఈఓపై మొక్కుబడిగా విచారణ!
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట సహకార సంఘంలో సీఈఓగా పనిచేస్తున్న మానేపల్లి విజయబాబు ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో దోపిడీ చేయడం, రైస్మిల్లర్లతో లాలూచీ పడుతు న్నట్లు సొసైటీ డైరెక్టర్ బత్తిన పార్థసారథి ఆధ్వర్యంలో ఇటివల డీసీఓ ఖుర్షీద్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై స్పందించిన డీసీఓ విచారణకు ఆదేశించి, ప్రత్యేకాధికారిగా వీరేశంబాబును నియమించారు. ఆయన శుక్రవారం అశ్వారావుపేటలోని సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ విచారణకు ఫిర్యాదుదారుడు బత్తిన పార్థసారథితోపాటు కొందరు రైతులు హాజరయ్యారు. ఫిర్యా దులోని అంశాలను పక్కన పెట్టి, కేవలం ధాన్యం కేంద్రాల్లో ఉన్న ఇక్కట్లు, ఇప్పటిదాకా ధాన్యం కొనుగోలు చేయకపోడం వంటి అంశాలపై విచారణ చేపట్టారు. కనీసం ధాన్యం కేంద్రాల వద్దకు కూడా వెళ్లకుండా, అక్కడికి వచ్చిన రైతులతోనే మాట్లాడి విచారణను ముగించడం అను మానాల కు తావిస్తోంది. దీంతో ఫిర్యాదుదారుడు అసంతృప్తి వ్యక్తం చేసి, మరోసారి విచారణాధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందించారు. ఇదే అంశాలపై సొసైటీ రిజిస్ట్రార్, జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పార్థసారథి తెలిపా రు. కాగా, విచారణాధికారి మాట్లాడుతూ.. ఫిర్యా దు చేసిన సొసైటీ డైరెకర్లు, రైతులు పూర్తిస్థాయిలో హాజరు కాలేదని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని చెప్పారు. సొసైటీ డైరెక్టర్ల అసంతృప్తి -
ఇప్పుడు ప్రారంభిస్తేనే మేలు
భద్రాచలమే కీలకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి గోదావరి పుష్కరాలంటే ఆంధ్రకు రాజమండ్రి, తెలంగాణకు భద్రాచలం కేంద్ర స్థానంగా ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయనప్పటికీ భద్రాచలం ప్రధాన కేంద్రంగానే ఉంది. కొత్తగా ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలు గోదావరి పుష్కరాల్లో ప్రముఖంగా నిలిచాయి. తిరిగి గోదావరికి 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు, భద్రాచలం పట్టణం, ఏడాది పొడవునా ఇక్కడ జరిగే కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని పుష్కర ఏర్పాట్ల యాక్షన్ ప్లాన్ రెడీ చేయాల్సిన అవసరముంది. లేకపోతే 2015 తరహాలోనే పైపనులే చేపడితే మరోసారి భద్రాద్రి నష్టపోక తప్పదు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి తీరం వెంబడి కాళేశ్వరంలో కనుల పండువగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి పుష్కరాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వీటితో కాళేశ్వరంలో కొత్తగా సరస్వతి మాత విగ్రహం, స్నానఘట్టాలు, నదీ తీరం వెంబడి కొత్త రోడ్లు, టెంట్ సిటీలు వెలిశాయి. ఇదే తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంలో నెలకొన్న స్థల సమస్య, రోజురోజుకూ పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని గోదావరి పుష్కరాలకు యాక్షన్ ప్లాన్ ముందుగానే సిద్ధం చేయాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే 2015 పరిస్థితే పునరావృతం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. వన్నె తెచ్చిన పుష్కరాల పనులు ఈ శతాబ్దంలో 2003, 2015లలో గోదావరికి పుష్కరాలు వచ్చాయి. ముఖ్యంగా 2003 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన కరకట్ట, స్నానఘట్టాలు భద్రాచలం రూపు రేఖలను మార్చివేశాయి. కరకట్ట నిర్మాణంతో భద్రాచలం పట్టణానికి గతంలో పోల్చితే వరదల నుంచి భద్రత కలిగింది. విశాలమైన స్నానఘట్టాలు వచ్చాయి. మహిళలు బట్టలు మార్చుకునే గదులు, కల్యాణకట్టలు అందుబాటులోకి వచ్చాయి. గోదావరి మాతకు విగ్రహం, రామాయణ ఇతివృత్తం తెలిపేలా శిల్పాలను ఏర్పాటు చేశారు. దీంతో భద్రాచలానికి కొత్త శోభ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో జరిగిన పుష్కరాలకు చెప్పుకోతగ్గ పనులేవీ భద్రాచలంలో జరగలేదు. గతంలో ఉన్న వాటినే మరికొంత మెరుగు పరిచారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటుకావడం, ఇక్కడ స్థల సమస్యలు వంటి అంశాలు అప్పుడు పుష్కర పనులకు అడ్డం పడ్డాయి. కీలక అంశాలు రాష్ట్ర విభజన కారణంగా భద్రాచలం క్షేత్రంలో స్థల సమస్య ఏర్పడింది. దీంతోపాటు ఏటా జూలైలో వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకుని నేటి ట్రెండ్కు తగ్గట్టుగా టెంట్ సిటీ, స్మార్ట్ సిటీలను ఎక్కడ నిర్మించాలనే అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రస్తుతం భద్రాచలంలో సామాన్య భక్తుల పుష్కర ఘాట్, బూర్గంపాడు మండలం మోతె దగ్గర వీఐపీ ఘాట్లు ఉన్నాయి. రాబోయే రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్య రాకుండా కొత్త ఘాట్లను నిర్మించాలి. వాహనాల పార్కింగ్, రాకపోకలపైనా అధ్యయనం చేయాల్సి ఉంది. వీటితో పాటు ఏడాది పొడవునా భద్రాచలం వచ్చే భక్తులకు ఉపయోగపడేలా డార్మిటరీలు, లాకర్లు, సామూహిక స్నానాల గదులు, టాయిలెట్ల నిర్మాణాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. నదీ తీరంలో సాంస్కృతి కార్యక్రమాలు జరిగేలా అంఫీ థియేటర్, కరకట్ట పైకి సులువుగా ఎక్కి దిగేలా లిఫ్టులు, అదనపు ర్యాంపులు, ఐకానిక్ వంతెన తదితర నిర్మాణాలు వంటివి రాబోయే పుష్కర పనుల్లో కీలకంగా మారనున్నాయి.కాళేశ్వరంలో వైభవంగా సరస్వతి పుష్కరాలు 2027 జూలైలో గోదావరికి పుష్కరాలు రాష్ట్ర విభజనతో భద్రగిరిలో మారిన పరిస్థితులు కార్యాచరణ సిద్ధం చేయాలని కోరుతున్న భక్తులు -
హైపర్.. టెన్షన్
అధిక రక్తపోటుతో అనర్థాలెన్నో.. ● యుక్త వయస్సులోనే గురవుతున్న యువకులు ● ఆధునిక జీవన శైలితో పెరుగుతున్న బాధితులు ● ముందస్తు జాగ్రత్తలతో నివారణ సాధ్యమే.. ● నేడు వరల్డ్ హైపర్ టెన్షన్ డే భద్రాచలంఅర్బన్: ఆధునిక జీవనశైలితో రక్తపోటు (బీపీ) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలామందికి బీపీ ఉందన్న విషయం తెలుసుకునేలోపే దీని వల్ల కలిగే అనర్థాలతో శరీరంలోని పలు అవయవాలు దెబ్బతింటున్నాయి. 120/80 ఉంటే సాధారణ బీపీగా లెక్కిస్తారు. ఇటీవల చిన్న వయస్సులోనే దీని బారిన పడుతున్నవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతోంది. ప్రజలకు అవగాహన కలిగించానికి వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ (డబ్ల్యూహెచ్ఎల్) సంస్థ 2005 నుంచి ఏటా మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే నిర్వహిస్తోంది. సైలెంట్ కిల్లర్.. శరీరంలో రక్తాన్ని అన్ని రక్తనాళాలకు గుండె ఒత్తిడి చేసి (ప్రెజర్) పంపిస్తోంది. అధిక వేగంతో రక్తాన్ని ప్రసరింపజేసే శక్తినే బ్లడ్ ప్రెజర్గా పేర్కొంటారు. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్గా కూడా వైద్యులు పిలుస్తారు. చాలామందికి రక్తపోటు లక్షణాలు ఉన్నట్లు కూడా తెలియకపోవడం వల్ల ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి కుప్పకూలి పోతారు. తలనొప్పి, అలసట అనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలి. బీపీ చెకప్ చేయించుకోవాలి. పైరెండు లక్షణాలతో పాటు ముక్కు నుంచి రక్తం కారడం, ఊపిరి తీసుకోలేకపోవడం, చూపు సక్రమంగా కనిపించక పోవడం, చాతి నొప్పి వంటి లక్షణాలు బీపీ సోకిన వారిలో కనిపిస్తాయి. కారణాలు.. అధిక రక్తపోటు సాధారణంగా వయస్సు మళ్లిన వారికి, కొందరికి జన్యుపరమైన కారణాలతో వస్తుంది. ధూమపానం, మద్యపానం, ఊబకాయం, పనిచేయకుండా ఒకేచోట గంటల తరబడి ఉండటం, హైపోథెరాయిడ్, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సరిపడా నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మూత్ర పిండాల జబ్బు ద్వారా వస్తుంది. రోజువారి ఆహారంలో ఉప్పు, పచ్చళ్లు ఎక్కువగా తినడం, ప్యాక్ చేసి, నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడం ద్వారా బీపీ బారినపడుతున్నారు. జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్టు, నెఫ్రాలజిస్టు వైద్యుల వద్దకు చికిత్స కోసం వెళ్లేవారిలో ఎక్కువ శాతం మంది అధిక రక్తపోటు బాధితులే. బీపీతో గుండెకు చేటు.. అధిక రక్తపోటు గుండెకు చేటు. చికిత్స కోసం వచ్చేవారిలో 30 శాతం మంది బీపీ వల్ల గుండెపోటుకు గురైన వారే. అధిక రక్తపోటుతో బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కంటి సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమ వుతా యి. ప్రతి ఒక్కరూ బీపీపై అవగాహన పెంచుకోవాలి. –డాక్టర్ సాయితేజరెడ్డి, కార్డియాలజిస్ట్,భద్రాచలంఇంటింటికీ వెళ్లి బాధితుల గుర్తింపు.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎన్సీడీ కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ వైద్యసిబ్బంది ద్వారా పరీక్షలు చేయించి బాధితులను గుర్తించి, చికిత్స అందిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 30 ఏళ్లు పైబడి ఉన్న 6,23,444 ఉన్న వారికి ఎన్సీడీ ఆధ్వర్యంలో పరీక్షలు చేయాల్సి ఉంది. నేటి వరకు 30 ఏళ్లు దాటిన 4,88,761 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో 87,463 మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్న ట్లు జిల్లా వైద్య అధికారులు నిర్ధారించారు. స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లోనే వారికి ఉచితంగా మందులు అందిస్తున్నారు.ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం.. ఆధునిక జీవనశైలి వల్ల వయస్సుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆహారంలో ఐదు గ్రాములకు మించి ఉప్పు తీసుకోవద్దు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. సొంత వైద్యం కాకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. –డాక్టర్ రమేశ్చంద్ర, సీనియర్ జనరల్ ఫిజీషియన్ -
తీరని వేతన వెతలు
● విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులకు అరకొర జీతాలు ● ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాలు పెంచని ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లాలో 230 మంది స్పాట్ బిల్లింగ్ కార్మికులుఇల్లెందు: విద్యుత్ శాఖలోని మీటర్ రీడింగ్ కార్మికులు(స్పాట్ బిల్లర్) అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్నారు. వచ్చే వేతనమే తక్కువగా ఉంటే అది కూడా రెండు, మూడు నెలలోకోసారి ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వేలమందికి పైగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 230 మంది మీటర్ రీడింగ్ కార్మికులు పని చేస్తున్నారు. పట్టణాల్లో ఇద్దరు, ముగ్గురు, మండలానికి ఒక్కరు చొప్పున ఉన్నారు. వీరంతా ప్రతీ నెలా 1వ తేదీ నుంచి 12వ తేదీ లోపు మీటర్ రీడింగ్ తీసి బిల్లులు ఇస్తారు. ఇందుకోసం ఒక్కో విద్యుత్ కనెక్షన్కు రూ. 3.85 కమీషన్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి కనీసంగా 3 వేల కనెక్షన్లు కేటాయిస్తున్నారు. స్పాట్ బిల్లింగ్ కార్మికులు కేటగిరీ–1 మీటర్ రీడింగ్ తీస్తుండగా విద్యుత్ సంస్థ ఉద్యోగులు కేటగిరీ–2 నుంచి కేటగిరీ–10 వరకు రీడింగ్ తీస్తున్నారు. స్పాట్బిల్లింగ్ కార్మికులు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 2,42,705 మీటర్ల నుంచి రీడింగ్ తీసి బిల్లులు జారీ చేస్తున్నారు. పనికి తగిన ప్రతిఫలం అందక.. స్పాట్ బిల్లింగ్ కార్మికులకు శ్రమకు తగిన ప్రతిఫలం అందడంలేదు. నెల మొత్తం కష్టపడితే రూ.16 వేల వరకు వచ్చే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాలు పెరగడంలేదు. కమీషన్ పద్ధతిలో కాకుండా కన్సల్టెన్సీ పద్ధతిలో వేతనం ఇవ్వాలని, లేకపోతే ఆర్టిజన్లుగా గుర్తించాలని స్పాట్ బిల్లర్లు కోరుతున్నారు. ప్రతీ నెల 30 పని దినాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం, ఉద్యోగ భద్రత కల్పించాలని, సబ్ స్టేషన్లో ఆపరేటర్ పోస్టుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక ఏళ్లుగా సమ్మెలు, ఆందోళనలు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఖమ్మంలో ఎమ్మెల్సీ కోదండరాంను సైతం కలిసి వినతి పత్రం అందజేశారు. కార్మికులను ఆదుకోవాలి 15 ఏళ్లుగా పని చేస్తున్న స్పాట్ బిల్లింగ్ కార్మికులను విద్యుత్ సంస్థ, ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతీ నెలా వేతనం అందేలా చూడాలి. ఆర్టిజన్లుగా గుర్తించాలి. కనీసం నెలకు రూ. 20 వేలు వేతనం చెల్లించాలి. – కిరణ్, స్పాట్ బిల్లింగ్ కార్మికుడు, ఇల్లెందుప్రభుత్వం చొరవ చూపాలి స్పాట్ బిల్లింగ్ కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. సమ్మె చేస్తే ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తోంది. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. శాశ్వత పరిష్కారం చూపాలి. –గుమ్మడి వెంకటేశ్వర్లు, స్పాట్ బిల్లింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు -
మరో థర్మల్ కేంద్రం వచ్చేనా!
పాల్వంచ: రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న పాల్వంచ కేటీపీఎస్లో మరో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక్కడ కాలం చెల్లిన 720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ ఓఅండ్ఎం( పాతప్లాంట్)ను తొలగించారు. ఇందులో పనిచేసే సుమారు రెండు వేల మంది ఉద్యోగ, కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ క్రమంలో వారు కుటుంబాలతో సహా వెళ్లిపోవడంతో పాల్వంచ పట్టణంపై తీవ్ర ప్రభావం పడింది. వర్తక, వాణిజ్య, ఉపాధి, రియల్ ఎస్టేట్ రంగాలు దెబ్బతిని అభివృద్ధి కుంటుపడుతోంది. పాల్వంచ కళతప్పింది. ఇక్కడి భౌగోళిక వనరుల దృష్ట్యా మరో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (కేటీపీఎస్ 8వ దశ) నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. శనివారం పాల్వంచలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టి సారించి పాల్వంచకు పూర్వవైభవం తెచ్చేలా కృషి చేయాలని విన్నవిస్తున్నారు. అందుబాటులో వనరులు కాలం చెల్లింన కేటీపీఎస్ ఓఅండ్ఎం(పాత ప్లాంట్) కర్మాగారాన్ని 2018 సంవత్సరంలో మూసివేశారు. అనంతరం పాత ప్లాంట్లోని నిర్మాణాలన్నింటినీ తొలగించారు. ఈ క్రమంలో అక్కడ వందలాది ఎకరాల స్థలం ఖాళీ ఏర్పడింది. కేటీపీఎస్ ఏ, బీ, ఇంటర్మీడియట్ కాలనీలు చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఆ క్వార్టర్లను తొలగించి అపార్ట్మెంట్లు నిర్మించాలని యాజమాన్యం యోచిస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే ఆయా కాలనీల్లో సైతం స్థలం మిగిలే అవకాశం ఉంది. కేటీపీఎస్ విస్తరణకు ఈ స్థలాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. తద్వారా సౌకర్యాలు మరింతగా మెరుగుపడనున్నాయి. ఇక కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి పుష్కలంగా నీరు , కొత్తగూడెం, మణుగూరుల నుంచి రైల్వే మార్గాల ద్వారా సింగరేణి బొగ్గు సరఫరా అవుతోంది. పాత యాష్ పాండ్లు, నీటి నిల్వ ప్రాంతాలను కూడా సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చుతో మరో విద్యుత్ కేంద్రం నిర్మించవచ్చు. రెండు వేల మంది ఉద్యోగులు బదిలీ ఓఅండ్ఎం మూసివేయడంతో సుమారు రెండు వేల మంది ఉద్యోగులు ఇతర కర్మాగారాలకు బదిలీలు, డిప్యూటేషన్లపై వెళ్లారు. కేటీపీఎస్లో నూతన కర్మాగారం నిర్మించి ఆ ఉద్యోగులను ఇక్కడికి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు సైతం కోరుతున్నాయి. ప్రస్తుతం కేటీపీఎస్ 5,6 దశల్లో 1000 మెగావాట్లు, 7వ దశలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వచ్చే పదేళ్ల తర్వాత 5,6 దశల కర్మాగారాలు సైతం కాలంచెల్లి మూసివేయాల్సి వస్తుంది. అప్పటిలోగా కొత్త కర్మాగారం అందుబాటులో తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. నూతన కలెక్టరేట్ సమీపంలోని స్థలంలో సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని జెన్కో యాజమాన్యం యోచించింది. సర్వే కూడా పూర్తి చేసింది. నిర్మాణ పనులు మాత్రం ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో నేడు పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి పాల్వంచ పట్టణాభివృద్ధిపై ప్రకటనలు చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం తొలగింపుతో కళతప్పిన పాల్వంచ కొత్త కర్మాగారం ఏర్పాటుకు భౌగోళిక వనరులు పుష్కలం నేడు పాల్వంచలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన -
డెంగీ నివారణకు సహకారం అవసరం
కొత్తగూడెంఅర్బన్: డెంగీ ప్రమాదాన్ని తగ్గించేందుకు అందరి సహకారం అవసరమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి భాస్కర్నాయక్ తెలిపారు. శుక్రవారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించగా.. ఆయన మాట్లాడారు. డెంగీ నివారణ, నియంత్రణ గురించి అవగాహన పెంచడానికి ఏటా మే 16న జాతీయ డెంగీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది ‘చెక్, క్లీన్ అండ్ క్లియర్’అనే థీమ్ను పౌరులు పాటించాలని, నీటిని తనిఖీ చేయాలని, దోమ ల లార్వాలను నాశనం చేయాలని, నిల్వ చేసిన నీటిని కవర్ (మూ) చేయాలని తెలిపారు. అనంతరం ప్రోగ్రామ్ ఆఫీసర్ (మలేరియా) డాక్టర్ పి.స్పందన మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎస్.జయలక్ష్మి, యూపీహెచ్సీ నుంచి వైద్య అధికారులు, పారామెడికల్ సిబ్బంది, కుమారస్వామి, జేతు నగేశ్, చేతన్ తదితరులు పాల్గొన్నారు. చీడపీడల నివారణపై అవగాహన టేకులపల్లి: రైతులు అధికంగా యూరియా వా డటం వల్ల చీడపీడలు పెరిగి పెట్టుబడి ఖర్చు పెరుగుతుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ నవీన్కుమార్, శ్రీనివాస్రావు, ఇల్లెందు ఏడీఏ లాల్చంద్ అన్నారు. శుక్రవా రం బేతంపూడిలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదాత అవగాహన’కార్యక్రమంలో భాగంగా వారు రైతులకు అవగాహన కల్పించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరం మేరకు రసాయనాలను వాడాలని, పచ్చిరొట్ట పైర్లు వేసుకుని నేలలో కర్బన శాతాన్ని పెంచుకోవాలని తెలిపారు. ఆరు తడి ద్వారా వరి సాగు చేయాలని, కంది, పెసర, మినుము పంటలను సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుందని చెప్పారు. ఉద్యానవన శాఖలో శాశ్వత పందిళ్లు, మల్చింగ్ పేపర్ వేసుకోవడానికి, పామాయిల్కు 50 శాతం సబ్సిడీ పొందే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో ఏఓ అన్నపూర్ణ, హెచ్ఓ స్రవంతి, ఏఈఓలు ప్రవీణ్, రమేశ్, శ్రావణి, భాగ్యశ్రీ, రైతులు పాల్గొన్నారు. ఆదనపు షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి శ్రీగోకులరామంలో గోవులశాలకు అదనంగా మరో రెండు షెడ్లు నిర్మించేందుకు ఈఓ ఎల్.రమాదేవి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దేవస్థానానికి చెందిన ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న గోశాలకు మరో రెండు షెడ్లను నిర్మించేందుకు ప్రవాస భారతీయులు సూదిరెడ్డి రామకృష్ణారెడ్డి – శాంత, సత్యనారాయణ రెడ్డి – విజయ దంపతులు విరాళం అందజేయగా.. దాతల కుటుంబ సభ్యులతో కలిసి ఈఓ రమాదేవి భూమి పూజ చేశారు. కొబ్బరి చెట్లపై పిడుగులు చింతకాని/కామేపల్లి: చింతకాని మండలంలోని జగన్నాధపురంలోని ఆలస్యం వెంకయ్య ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై శుక్రవారం తెల్లవారుజామున పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో చెట్టుపై 20 నిమిషాల పాటు మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వెంకయ్య ఇంట్లో అద్దెకు ఉంటున్న కోలేటి రాంచందర్రావు గృహంలోని ఎలక్ట్రానిక్స్ సామగ్రి, వైరింగ్ పూర్తిగా కాలిపోయింది. అలాగే, కామేపల్లి మండలం తాళ్లగూడెంలోని బండారి రామయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపైనా పిడుగు పడింది. అయితే, అంతసేపు రామయ్య ఆరు బయటే నిద్రించగా, వర్షం వస్తుండడంతో లోపలకు వెళ్లాడు. అదే సమయాన పిడుగు పడడంతో ప్రమాదం తప్పినట్లయింది. -
వృద్ధురాలు అదృశ్యం
చింతకాని/కొణిజర్ల: ఆస్పత్రికి బయలుదేరిన వృద్ధురాలు కానరాకుండా పోయిన ఘటన ఇది. చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన బొగ్గుల కాశమ్మ(65) గురువారం ఉదయం ఆటోలో కొణిజర్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ వైద్యుడు లేకపోవడంతో బయటకు వచ్చింది. తొలుత ఆమె పెద్దగోపతి గ్రామీణ వికాస బ్యాంకులో రూ.5వేలు విత్డ్రా చేసినట్లు తెలియగా, ఆతర్వాత ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆమె కుమారుడు సీతారాంరెడ్డి శుక్రవారం కొణిజర్ల, చింతకాని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వాహనం ఢీకొని వ్యక్తి మృతి తల్లాడ: మండలంలోని మిట్టపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని రామానుజవరానికి చెందిన దర్శనాల వెంకటేశ్వర్లు(60) మూడు రోజులుగా మధ్యం సేవిస్తూ తిరుగుతున్నాడు. మిట్టపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన ఓ షాపులో మద్యం తాగి నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన అల్లుడు బీరెల్లి రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి.. వేంసూరు: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని లింగపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంపల్లి ఈశ్వరాచారి(42) ఇంటి మందు ఉన్న కార్పెంటర్ షెడ్లో పడి ఉన్న విద్యుత్ వైర్ను సరిచేస్తున్నాడు. ఈక్రమంలో షాక్కు గురి కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈశ్వరాచారి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు. వడదెబ్బతో బాలిక.. రఘునాథపాలె: వడదెబ్బ బారిన పడిన విద్యార్థిని మృతి చెందింది. రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన గ్రామీణ వైద్యుడు కస్తాల రాంబాబు – రాణి దంపతుల చిన్న కుమార్తె శరణ్య(14) ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవుల నేపథ్యాన కొత్తగూడెంలోని బంధువులు ఇంటికి వెళ్లగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటర్లో చేర్చేందుకు సిద్ధమవుతుండగా వడదెబ్బతో కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య సత్తుపల్లిరూరల్: బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన చీకటి దీప్తి(28) గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. ఈ నెల 14న ఆమెను తల్లిదండ్రులు మందలించారనే మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన కలుపు మందు తాగింది. కాసేపటికి గుర్తించిన కుటుంబీకులు సత్తుపల్లికి, అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళంరామాలయంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన భక్తురాలు సీహెచ్ సరస్వతి రూ.2 లక్షల చెక్కును ఆలయ ఈఓ ఎల్.రమాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు.పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి అర్చకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు అర్చకులు పంచామృతంతో అభిషేకపూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలు, కుంకుమ పూజ, గణపతి హోమం నిర్వహించారు. గిరిజన గురుకుల కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం సీట్ల్లు భర్తీ అయ్యాయని పీఓ బి.రాహుల్ తెలిపారు. గురుకులాల్లో బాలికలకు 737సీట్లు ఉండగా, భద్రాచలంలోని గురుకుల కాలేజీలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన విద్యార్థినుల్లో 737మందికి మెరిట్ ఆధారంగా వారు కోరుకున్న కాలేజీల్లో సీట్లు కేటాయించామని పీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓలు అరుణకుమారి, పద్మావతి, ప్రిన్సిపాళ్లు చైతన్య, నాగేంద్రమ్మ, రాణి, ఓ.మాధవి, సంధ్యారాణి, మాధవీలత, ఓ.పుల్లమ్మ పాల్గొన్నారు. -
బొట్టూబొట్టు ఒడిసిపట్టేలా..
సూపర్బజార్(కొత్తగూడెం): రాబోయే వర్షాకాలంలో ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టేలా ఇంకుడు గుంతలు, ఫామ్పాండ్స్ నిర్మాణానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. భూగర్భ జలాల పెంపునకు కృషి చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, హాస్టళ్లలో కచ్చితంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని, ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇచ్చేముందు ఇంకుడు గుంతల నిర్మాణాలు తప్పనిసరి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటిస్తూ ఇంకుడుగుంతల ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అధికారుల సమష్టి కృషితో నిర్వహిస్తున్న భగీరథ ప్రయత్నాలు దేశంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలచేలా పరుగులు పెడుతోంది. వ్యవసాయ శాఖ లక్ష్యం 34,629 ఫామ్పాండ్స్ సాగు భూముల్లో ప్రతి పదెకరాలకు ఒక ఫామ్పాండ్ చొప్పున జిల్లావ్యాప్తంగా 34,629 ఫామ్పాండ్స్ నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే 600 ఫామ్పాండ్స్ నిర్మాణాలకు మార్కింగ్ను కూడా పూర్తి చేశారు. ఒకవైపు ఇంకుడు గుంతలు, మరోవైపు ఫామ్పాండ్స్ నిర్మాణాలు జిల్లాలో ఊపందుకోనున్నాయి. కలెక్టర్ స్వయంగా పలుగు, పార పట్టి నిర్మాణ పనులు ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఎస్పీ రోహిత్రాజు కూడా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతీ పోలీస్స్టేషన్లో, పోలీస్ కార్యాలయాలలో ఇంకుడుగుంతలు నిర్మించాలని ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు భగీరథ ప్రయత్నం ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ నిర్మాణాలకు కార్యాచరణ కలెక్టర్ చొరవతో సమష్టిగా కృషి చేస్తున్న అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రారంభం‘ఉపాధి’లో నీటి కుంటలు..పాల్వంచరూరల్: ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా నీటి కుంటలను నిర్మిస్తుందని మండల వ్యవసాయాధికారి శంకర్ అన్నారు. మండల పరిధిలోని రాజాపురంలో ఓ రైతు నిర్మిస్తున్న నీటికుంటను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు తమ పంట పొలాల్లో నీటి కుంటలు నిర్మించుకోవాలని అన్నారు. 15 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేపట్టాలని సూచించారు. నీటి ఎద్దడి వచ్చినప్పుడు కుంటలోని నీరు పంటలకు ఉపయోగపడుతుందని, చేపలను పెంచుకునే అవకాశం కూడా ఉంటుందని వివరించారు. -
ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి
పాల్వంచ: పాల్వంచ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం టీజీ జెన్కో గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీనివాస కాలనీలో రూ.1.96 కోట్లతో, పాండురంగాపురంలో రూ. 2.63 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్లు, సోములగూడెంలో రూ.4 కోట్లతో చేపట్టనున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు, రూ.9.70 కోట్లతో రాజాపురం వద్ద నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. త్వరలో కొత్తగూడెం క్రాస్ రోడ్లో జూ పార్క్, సుజాతనగర్లో జూనియర్ కళాశాల రానున్నాయని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కె.సుజాత, డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ సతీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, నాగసీతారాములు, కనగాల అనంతరాములు, నూకల రంగారావు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఆదివాసీల అభివృద్ధికి తోడ్పాటునందించాలి
చండ్రుగొండ : ఆదివాసీలు చేపట్టిన బ్యాంబో క్లస్టర్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని బ్యాంబో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (బెంగళూరు) సీఈఓ నేజుజార్జ్ ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కోరారు. మండలంలోని బెండాలపాడు గ్రామశివారులోని బ్యాంబో క్లస్టర్ను శుక్రవారం కలెక్టర్, బెంగళూరు బృందంతో కలిసి సందర్శించారు. వెదురుతో చేస్తున్న ఉత్పత్తులను వారికి చూపించి, క్లస్టర్ అభివృద్ధికి కావాల్సిన సదుపాయాలు, తదితర అంశాలపై చర్చించారు. తగిన సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఫౌండేషన్ ప్రతినిధి దివ్య, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, క్లస్టర్ డైరెక్టర్ బొర్రా సురేష్, గ్రామస్తులు రాము, తేజావత్ బాబు, రామకృష్ణ, రమేష్ పాల్గొన్నారు. చివరిగింజ వరకూ ధాన్యం కొనుగోళ్లు సూపర్బజార్(కొత్తగూడెం): ఎలాంటి అవాంతరాలు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 34,300 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రానున్న పదిరోజుల్లో మిగిలిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. మిల్లర్లను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, డీఎస్ఓ రుక్మిణి, పౌరసరఫరాల శాఖ డీఎం త్రినాథ్బాబు, డీఏఓ బాబూరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మండలంలోని ముత్యాలంపాడు క్రాస్రోడ్ గ్రామానికి చెందిన బోడ భద్రు(47) ఈ నెల 13న రాత్రి చుక్కాలబోడులో ఓ శుభకార్యానికి వెళ్లి బైక్పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మంగళితండా సమీపంలో గేదెలను బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఖమ్మం, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య తార, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో..● రూ.4.61లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు భద్రాచలంఅర్బన్: పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన మండలోజు భార్గవి అనే యువతి వద్ద డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాడు భారీగా నగదు కాజేశాడు. వివరాలు ఇలా.. గత ఏడాది డిసెంబర్ 27న యువతికి ఓ వ్యక్తి వాట్సప్ వీడియో కాల్ చేశాడు. నీ ఐడీ ప్రూఫ్స్ తో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని, డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పి భయపెట్టాడు. ఆమె నుంచి డిసెంబర్ 27 నుంచి 2025 జనవరి 1వ తేదీ వరకు పలు దఫాలుగా వివిధ అకౌంట్ నంబర్లకు రూ. 4.61 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రూ. 84,634 నగదు హోల్డ్లో పెట్టారు. బాధితురాలు గురువారం మళ్లీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులకు గాయాలుటేకులపల్లి: బైక్ అదుపు తప్పి కింద పడి తండ్రీ కొడుకులు గాయపడ్డ ఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథపాలేనికి చెందిన కె.వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు రమేష్ బైక్పై మణుగూరులో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో సాయపేట దాటిన తర్వాత మూలమలుపు సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అదే సమయంలో ఇల్లెందు నుంచి టేకులపల్లికి విధులకు వస్తున్న విద్యుత్ ఏఈ హట్కర్ దేవా గమనించి క్షతగాత్రులను ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆస్పత్రిలోలో చేర్పించారు. -
‘సీతారామ’ పరిహారం చెల్లించాలి
దమ్మపేట: సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కోరుతూ జూలూరుపాడు మండల పరిధిలోని రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. గురువారం మండలంలోని గండుగులపల్లి నివాసంలో మంత్రి తుమ్మలను, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జూలూరుపాడు మండలంలో సీతారామ ప్రాజెక్టు కాలువకు భూములు ఇచ్చిన రైతులు మంత్రిని కలిసి తమకు పరిహారం ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తుమ్మల సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిహారం సకాలంలో అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, కే.వి.సత్యనారాయణ, దొడ్డా ప్రసాద్, మన్నెం అప్పారావు పాల్గొన్నారు.మంత్రి తుమ్మల వద్ద రైతుల ఆవేదన -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదన, హారతి సమర్పించిన అర్చకులు ఆ తర్వాత మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు.పోలీస్స్టేషన్లలో ఇంకుడుగుంతలు నిర్మించాలిఎస్పీ రోహిత్రాజు కొత్తగూడెంటౌన్: జిల్లాలోని ప్రతీ పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్మిస్తున్న ఇంకుడుగుంత పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరుగుతాయని, భవిష్యత్లో నీటి కొరత సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. వర్షపు నీటిని ఆదా చేసుకునేందుకు ప్రజలు కూడా ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించాలని కోరారు. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. గిరిజన కళాశాలల్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్ను గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలల్లో వివిధ కోర్సులకు గాను 810 సీట్లు ఉండగా, 450 సీట్లలో బాలురకు ప్రవేశాలకు కల్పించామని తెలిపారు. మిగిలిన సీట్ల భర్తీకి త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. అలాగే, బాలికల ప్రవేశాల కోసం శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు దేవదాస్, సీతారాం, వీరస్వామి, సత్యనారాయణ, భాస్కర్, హరికృష్ణ, పద్మావతి, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. విధుల్లో చేరిన 108 ప్రోగ్రాం మేనేజర్ఖమ్మంవైద్యవిభాగం/కొత్తగూడెంఅర్బన్ : ఈఎంఆర్ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్గా శివకుమార్ నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 108(అత్యవసర సేవలు), 102(అమ్మ ఒడి), 1962(పశు సంచార) సేవలను పర్యవేక్షించనుండగా, గతంలో ప్రోగ్రాం మేనేజర్గా ఉన్న భూమా నాగేందర్ హైదరాబాద్ క్లస్టర్కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వరంగల్ నుంచి వచ్చిన శివకుమార్ గురువారం విధుల్లో చేరారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై పలు సూచనలు చేశారు. తహసీల్దార్ల బదిలీలుసూపర్బజార్(కొత్తగూడెం) : రాష్ట్రవ్యాప్తంగా పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కొందరిని ఇతర జిల్లాలకు కేటాయించారు. ఇదే సమయాన ఇతర జిల్లాలకు చెందిన కొందరిని జిల్లాకు బదిలీ చేశారు. వీరు నిర్దేశిత జిల్లాల్లో రిపోర్ట్ చేశాక కలెక్టర్లు పోస్టింగ్ ఇస్తారు. జిల్లా నుంచి బదిలీ అయిన వారిలో ఎం.రమాదేవి ఖమ్మం జిల్లాకు, సీహెచ్.నరేష్, జి.వివేక్, ఎం.ఇమ్మానియేల్, ఎన్.నాగభవానీ మహబూబాబాద్ జిల్లాకు వెళ్లారు. కాగా, హన్మకొండ జిల్లా నుంచి ఆర్.అనంత రామకృష్ణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ఎల్.వీరభద్రం, ఖమ్మం జిల్లా నుంచి జి.ప్రతాప్, మహబూబాబాద్ జిల్లా నుంచి బి.భగవాన్రెడ్డి భద్రాద్రి జిల్లాకు రానున్నారు. -
మాడ వీధులకు వీడని మూఢం
● భూ సేకరణ పూర్తయితేనే పనులు ముందుకు ● స్థలం ఇచ్చేందుకు ఏడుగురి నిరాకరణ ● ఈ అడ్డంకి తొలగితేనే సాగనున్న విస్తరణ ● మాస్టర్ ప్లాన్ ప్రకటన కోసం ఎదురుచూపులుభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి తొలి అడుగు పడినా.. ముందుకు సాగడం లేదు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం రూ.60.20 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు భూసేకరణ, ఇళ్లు, దుకాణాల తొలగిస్తే నిర్వాసితులకు అందించే పరిహారం కోసం శ్రీరామనవమికి ముందు రూ.35 కోట్లు విడుదల కాగా, సుమారు 40 కుటుంబాలకు అందజేశారు. నవమి రోజే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తారని భావించినా అది జరగలేదు. దీనిపై ఆలయ అధికారులకు సీఎం స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. భూ సేకరణ పూర్తయితేనే పనులు ముందుకు సాగే పరిస్థితి నెలకొంది. ఈనెలలో సేకరణ పూర్తయితేనే.. నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయగానే రెవెన్యూ అధికారులు భూ సేకరణ పూర్తి చేసి దేవస్థానానికి అప్పగించాల్సి ఉంది. అయితే శ్రీరామనవమి సందర్భంగా తమ వ్యాపారం దెబ్బతింటుందని, ఆ తర్వాతే తాము ఖాళీ చేస్తామని ఆయా షాపుల వారు రెవెన్యూ అధికారులను, ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. దీంతో అప్పుడు సేకరణ పనులు ఆపేశారు. నవమి వేడుకలు పూర్తయ్యాక అధికారులు మళ్లీ భూ స్వాధీనానికి వెళ్లగా.. ఈనెల 22న హనుమాన్ జయంతి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మాలధారులతో భద్రగిరి రద్దీగా ఉంటుందని, ఈ సమయంలోనే వ్యాపారాలు అధికంగా జరుగుతాయి కాబట్టి మరోమారు వాయిదా వేయాలని వారు వేడుకుంటున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు పునరాలోచనలో పడ్డారు. కాగా, భూమి ఇవ్వడానికి నిరాకరించిన వారిపై కోర్టును ఆశ్రయించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారికి అందజేయాల్సిన నష్టపరిహారాన్ని కోర్డుకు సరెండర్ చేసి, భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మాస్టర్ప్లాన్ అమలు చేయాలి.. మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం రూ.60.20 కోట్లు ప్రకటించగా, నిర్వాసితులకు పరిహారంగా రూ.35 కోట్లు విడుదల చేసింది. మరో రూ.25.20 కోట్లతో మాడ వీధుల విస్తరణ చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే ఆలయ అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. కాగా నవమి ముందు ప్రభుత్వం ఆలయ అభివృద్ది నమూనాలు విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్కు మరికొన్ని అదనపు వసతులను కల్పించేలా ఈ నమూనాలు రూపొందించారు. అయితే మాడ వీధుల విస్తరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. మాస్టర్ ప్లాన్ అమలుకూ తగిన నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు. నిరాకరించిన వారితో చర్చిస్తాం.. ఏడు కుటుంబాల వరకు నష్టపరిహారం చెక్కులు తీసుకోలేదు. వారితో మళ్లీ చర్చలు జరిపి సానుకూలంగా భూ సేకరణకు కృషి చేస్తాం. అయినా వినకుంటే నిబంధనల ప్రకారం నష్టపరిహారాన్ని కోర్టుకు అందజేసి భూ సేకరణను పూర్తి చేస్తాం. వీలైనంత త్వరలో ఆలయానికి భూములు అందజేస్తాం. – కొల్లు దామోదర్ రావు, ఆర్డీఓ, భద్రాచలంకొన్ని కుటుంబాల నిరాకరణ.. భద్రాచలంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు ముందే 40 నిర్వాసిత కుటుంబాలకు రూ.34,45,86,000 అందించినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. అయితే ఇటీవల సస్పెన్షన్కు గురైన ఓ ప్రధానార్చకుడితో పాటు మరో ఆరు కుటుంబాల వారు స్థలాలు ఇచ్చేందుకు, నష్టపరిహారం స్వీకరణకు నిరాకరించారని చెబుతున్నారు. వీరు గతంలో కూడా మాడ వీధుల విస్తరణలో పరిహారం స్వీకరణకు నిరాకరించారు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కంటే అధికంగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ, ఆలయ అధికారులు తీసుకునే చర్యలపైనే పనులు ఆధారపడి ఉంటాయి. -
గిరిజన సంస్కృతిని పరిరక్షించాలి
ములకలపల్లి : గిరిజన సంస్కృతిని పరిరక్షించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. మండల పరిధిలోని రాజీవ్నగర్లో గురువారం నిర్వహించిన భూమి పండుగ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీలు ఏ కార్యం తలపెట్టినా గ్రామదేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం స్థానిక యువకులతో కలసి బాణం సంధించారు. ఆ తర్వాత పాత గుండాలపాడు గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. 35 ఏళ్ల క్రితం అప్పటి పీఓ జేసీ శర్మ తమ గ్రామాన్ని సందర్శించారని, మళ్లీ ఇప్పడు రాహుల్ రావడం ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డును పూర్తి చేయాలని, ఐటీడీఏ ద్వారా వ్యవసాయ మోటార్లు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో భద్రాచలం గిరిజన మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి, గ్రామపెద్దలు తుర్రం శ్రీను, మాజీ ఎంపీటీసీ నూపా సరోజిని తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
నెట్జీరో నెరవేరేనా?
టార్గెట్ నెట్జీరో.. సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలో విస్తరించగా 18 ఓపెన్కాస్ట్, 22 భూగర్భ గనులు ఉన్నాయి. సుమారు 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. గనుల అవసరాలకు తోడు కార్మికుల సంక్షేమం కోసం సంస్థ భారీగా విద్యుత్ను వినియోగిస్తోంది. ప్రతీ ఏడాది వేర్వేరు అవసరాల నిమిత్తం 715 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వాడుతోంది. అయితే అంతే మొత్తంలో సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసి కాలుష్య నియంత్రణలో నెట్జీరో సంస్థగా నిలవాలని దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తొలి విడతలో సంస్థ పరిఽధిలోని అన్ని ఏరియాల్లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను సిద్ధం చేసింది. తద్వారా 450 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సంస్థ ఆదా చేసినట్టయింది. నెట్జీరో రికార్డు దిశగా అడుగులు వేస్తూ మరో 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల స్థాపనకు రెండేళ్ల కిందటే ప్లాన్ సిద్ధం చేసింది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బహుముఖంగా విస్తరించిడంపై దృష్టి సారించిన సింగరేణి.. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్, సోలార్ విద్యుత్ రంగంలోకి వచ్చింది. త్వరలో రేర్ ఎర్త్ మినరల్స్ విభాగంలోనూ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే నలుదిశలా విస్తరించే క్రమంలో ముందుగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో సంస్థ వెనకబడటం విమర్శలకు తావిస్తోంది. 2023లోనే టెండర్లకు పిలుపు.. కొత్తగా ఎనిమిది సోలార్ పవర్ ప్లాంట్లను వేర్వేరు ఏరియాల్లో నిర్మించాలని సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం స్థల సేకరణ కూడా పూర్తి చేయడంతో పాటు ప్లాంట్ల నిర్మాణానికి రూ.1,348 కోట్లు కేటాయించింది. ఈ మేరకు 2023 ఆగస్టులో టెండర్లు ఆహ్వానించింది. సెప్టెంబర్లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించి, టెండర్లలో పాల్గొనే ఏజెన్సీల సందేహాలను నివృత్తి చేసింది. 2024 సెప్టెంబర్ నాటికి 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయి విద్యుదుత్పత్తి ప్రారంభించాలని అప్పటి సీఎండీ ఎన్.శ్రీధర్ టెండర్లలో పాల్గొన్న సంస్థలను కోరారు. అయితే నిర్దేశిత గడువు దాటి ఎనిమిది నెలలు పూర్తి కావొస్తున్నా పనులు ఒక కొలిక్కి రాలేదు. కేవలం మందమర్రిలో 67.50 మెగావాట్ల ప్లాంట్ పనులు ప్రారంభించడం గమనార్హం. లక్ష్యానికి దూరంగా.. దశదిశలా విస్తరించే క్రమంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో సింగరేణి వెనుకబడిపోతోందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత 72 మిలియన్ టన్నుల లక్ష్యానికి మూడు మిలియన్ టన్నులు తక్కువగా ఉత్పత్తి అయింది. నైనీ (ఒడిశా), ఇల్లెందు (రొంపేడు), కొత్తగూడెం (పీవీకే మెగా ఓసీ)లో కొత్త గనులు అందుబాటులోకి రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు సోలార్ పవర్ విషయంలోనూ అదే జరిగింది. నిర్దేశించిన గడువులోగా సెకండ్ ఫేస్ పనులు పూర్తయితే సింగరేణికి ప్రతీ ఏడాది విద్యుత్ బిల్లుల రూపంలో దాదాపుగా రూ. 290 కోట్లు ఆదా అయ్యేవి. అలాగే నెట్జీరో సాధించిన సంస్థగా దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కేది. కానీ ఈ రెండూ సాధ్యం కాలేదు. ఇవి ఇలా ఉండగానే రాజస్థాన్తో ఒప్పందం, జియోథర్మల్ పవర్ ప్లాంట్, పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్, రేర్ ఎర్త్ మినరల్స్, విండ్ పవర్ అంటూ కొత్త రాగాలను ఆలపించడంపై విమర్శలు వస్తున్నాయి.2023లో యాక్షన్ ప్లాన్ ప్రారంభించిన సింగరేణి 2024 కల్లా 532 మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం గడువు పూర్తయినా 300 మెగావాట్లు దాటని వైనం టెండర్ల దశలోనే మగ్గుతున్న కొత్త పవర్ ప్లాంట్లు సోలార్ పవర్ రెండో దశ వివరాలు సోలార్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం స్థలం ఏరియా (మెగావాట్లలో) (ఎకరాల్లో) మందమర్రి 67.50 240రామగుండం–3 37 166శ్రీరాంపూర్ 27.50 96కొత్తగూడెం 32.50 130జైపూర్ 37.50 130ఇల్లెందు 15 55భూపాలపల్లి 10 45రామగుండం – 1 5 13 -
తిరోగమన విధానాలతో ప్రజా వ్యతిరేకత
● అందాల పోటీలతో కాంగ్రెస్ పరువు గంగపాలైంది ● బీఆర్ఎస్ నాయకుడు రాకేష్రెడ్డి సూపర్బజార్(కొత్తగూడెం): అందాల పోటీలను ఆర్భాటంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ పరువు గంగ పాలైందని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్రెడి అన్నారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తిరోగమన విధానాలు అవలంబిస్తూ ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారని విమర్శించారు. అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ మహిళల కాళ్లను ఓరుగల్లు ఆడబిడ్డలతో కడిగించారని ఆరోపించారు. ఇందిరాగాంధీ, సోనియా అమ్మలైతే కాళ్లు కడిగిన ఆడబిడ్డలు ఎవరని ప్రశ్నించారు. పోటీలకు వచ్చిన వారిని అతిథులుగా చూడాలే తప్ప దేవకన్యలుగా కాదన్నారు. ఇది రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారక్క నడయాడిన నేలని, ప్రతీ ఆడబిడ్డలో ఆ పౌరుషం, తెగింపు ఉంటాయని అన్నారు. కాళ్లుకడిగిన ఆడపడుచుల కాళ్లను రేవంతరెడ్డి కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకోవాలని సూచించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలుచేయడం లేదని ధ్వజమెత్తారు. సింగరేణి కార్మికులను కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, ప్రతి కార్మికుడికి 250 గజాల స్థలం ఇస్తామన్న కాంగ్రెస్ వాగ్దానం నేటికీ అమలు కాలేదని అన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, నాయకులు తొగరు రాజశేఖర్, సింధూ తపస్వి, ప్రసాద్, పురుషోత్తం, మురళి తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతి దరఖాస్తులపై
కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూపర్బజార్(కొత్తగూడెం) : భూ భారతి చట్టం కింద రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1,679 భూభారతి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, నూతన ఆర్ఓఆర్ చట్టం నిబంధనలకు అనుగుణంగా పరిష్కంచాలని అన్నారు. రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధ్యాయుల బాధ్యత కీలకం.. పాల్వంచ: ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. స్థానిక కేజీబీవీలో జరుగుతున్న ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. భవిత కేంద్రాల్లో మౌలిక వసతలు కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి, అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, సీఎంఓ సైదులు, హెచ్ఎం మధురవాణి, మంగమ్మ, తులసీ పాల్గొన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం.. జూలూరుపాడు: రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పాటిల్ అన్నారు. గురువారం ఆయన మాచినేనిపేటతండా, నర్సాపురం, జూలూ రుపాడులో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించారు. ఉపాధి కూలీలతో కలిసి పని చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కష్టపడి పని చేయడం తనకెంతో ఇష్టమని, టీవీ, సెల్ఫోన్ల ముందు కూర్చోకుండా యువత పని చేయాలని సూచించారు. గోపాతండాలో బానోత్ చోక్లీ సాగు చేసిన మునగ తోటను పరిశీలించి సాగు ఎలా ఉంది.. కొనుగోలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. మునగకాయలు కొనుగోలు చేసేందుకు పొలం వద్దకే వస్తున్నారని రైతు చెప్పగా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. రైతులంతా మునగ సాగు చేయాలని, ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని చెప్పారు. మండలంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు వేగవంతంగా సాగుతుండగా అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రాలేదని స్థానికులు కలెక్టర్ దృష్టికి తేగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరాయంగా సాగుతుందని, అర్హులందరికీ ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, ఎంపీఓ తులసీరామ్, ఏఓ దీపక్ ఆనంద్, ఎంఈఓ బానోత్ జుంకీలాల్ పాల్గొన్నారు. వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి కొత్తగూడెంటౌన్: లక్ష్మీదేవిపల్లి మండలం ఎస్ఆర్ ప్ర భుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్న వేసవి ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్ సందర్శించారు. నిరంతర సాధనతో ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామరెడ్డి, కోచ్లు ఎండీ అబ్ధుల్ నబీ, ఇమామ్, బిస్వజిత్ కృష్ణ పాల్గొన్నారు. ఉపాధి పనుల పరిశీలన.. చండ్రుగొండ : మండలంలోని మంగయ్యబంజర్, పోకలగూడెం, రావికంపాడు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్.. ఉపాధి పనులను పరిశీలించారు. పలుగు, పార పట్టి మట్టిపనులు చేస్తూ కూలీల్లో ఉత్సాహం నింపారు. మంగయ్యబంజర్లో ఫాంపాండ్ పనులను, పోకలగూడెంలో పంటచేల మధ్య నిర్మాణ దశలో ఉన్న రోడ్డు పనులను పరిశీలించారు. రావికంపాడులో పశువుల షెడ్, మునగతోట, ఇంకుడు గుంలలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బయ్యారపు అశోక్, టెక్నికల్ ఈసీ రాజు, ఏఓ నవీన్, ఎంపీఓ ఖాన్, ఏపీఓ శ్రీను పాల్గొన్నారు. చండ్రుగొండ : ఉపాధి కూలీతో మాట్లాడుతున్న కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ఆర్టీసీ బస్సులో ఘర్షణ
అశ్వాపురం: ఆర్టీసీ మణుగూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సులో ఇద్దరు మహిళలు ఘర్షణ పడిన పంచాయతీ పోలీస్స్టేషన్కు చేరింది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలకు సీటు విషయంలో గొడవ జరిగింది. ఒకరు ఆపిన సీటులో మరొకరు కూర్చోవటంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. తోటి ప్రయాణికులు వారించిన గొడవ సద్దుమణగకపోవడంతో బస్సును అశ్వాపురం పోలీస్స్టేషన్ వద్ద ఆపి, విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సీఐ అశోక్రెడ్డి ఇద్దరు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వేర్వేరు బస్సుల్లో పంపించేశారు. ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీ బోల్తాఅశ్వారావుపేటరూరల్: ధాన్యం లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి ధాన్యం బస్తాల లోడుతో విశాఖపట్నానికి వెళ్తున్న లారీ అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం కాలనీ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కీనర్ సురక్షితంగా బయటపడగా, లారీ ముందు భాగం ధ్వంసమైంది. పేకాటరాయుళ్లు అరెస్ట్అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెంలో మిషన్ భగీరథ పంప్హౌస్ వద్ద పేకాటస్థావరంపై గురువారం పోలీసులు దాడి చేశారు. 10 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. రూ.20 వేల నగదు, 9 సెల్ఫోన్లు స్వాఽధీనం చేసుకున్నారు. నిందితుల్లో కొత్తగూడెం హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్న మండలానికి చెందిన కానిస్టేబుల్ పాయం సత్యనారాయణ కూడా ఉన్నాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్రెడ్డి తెలిపారు. దాడి ఘటనలో నలుగురి అరెస్ట్పాల్వంచ: బైక్పై వెళ్తున్న వ్యక్తులను బెదిరించి, దాడి చేసి డబ్బులు లాక్కున్న వ్యక్తులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ సతీష్ కుమార్ కథనం ప్రకారం.. ఈ నెల 12వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో పాల్వంచకు చెందిన తిరుమల రాజు, అతని బావ మంగయ్య కలిసి బైక్పై శేఖరం బంజర వెళుతున్నారు. ఈక్రమంలో ముగ్గురు వ్యక్తులు ఊరి చివర రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న రోడ్డుపై ఆటోను అడ్డంగా పెట్టారు. బైక్ నిలపడంతో రాజు, మంగయ్యలను కొట్టి సెల్ ఫోన్, రూ.5 వేల నగదు బలవంతంగా లాక్కుని పారిపోయారు. కాగా ఆటో వెనుక సోగ్గాడు అని రాసి ఉండటాన్ని గమనించిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శేఖరం బంజరకు చెందిన బానోతు కిషోర్, బానోతు కుమార్, భూక్యా పవన్లను అరెస్ట్ చేశారు. సమావేశంలో సీఐ సతీష్, ఎస్ఐ సుమన్, సిబ్బంది పాల్గొన్నారు. -
లాజిస్టిక్స్ నిర్వహణపై శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: జిల్లా వైద్యా, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కుటుంబ నియంత్రణ లాజిస్టిక్స్ నిర్వహణ, సమాచార వ్యవస్థపై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 12 ముఖ్యమైన కుటుంబ నియంత్రణ వస్తువులను సమర్థవంతంగా నిర్వహించే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఎఫ్పీ, ఎల్ఎంఐఎస్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డాక్టర్లు చైతన్య, సుకృత, మధువరన్, తేజశ్రీ, ఫైజాయాజుద్దీన్, ఫార్మసిస్టులు తదితరులు పాల్గొన్నారు. మర్రిగూడెం హెచ్ఎంపై విచారణ ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్పై డీఈఓ వెంకటేశ్వరాచారి విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా టేకులపల్లి ఎంఈవో జగన్కు బాధ్యతలు అప్పగించారు. మర్రిగూడెం పాఠశాలలో ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధాయుడు రమేష్ విధులకు సక్రమంగా హాజరుకాలేదని, పాఠశాలకు మంజూరైన నిధులను దుర్వినియోగం చేశారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నేతలు, స్థానికులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఈఓ ఆదేశాలతో టేకులపల్లి ఎంఈఓ గురువారం విచారణ ప్రారంభించారు. మహిళా సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నికచుంచుపల్లి: మహిళా సమాఖ్య జిల్లా నూతన పాలకవర్గాన్ని గురువారం కొత్తగూడెంలో ఎన్నుకున్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షురాలు ఎస్.ఉషారాణి, కార్యదర్శి వి.నాగమణి, కోశాధికారి వి.మమత ఉద్యోగ విరమణ పొందారు. వారి స్థానంలో అధ్యక్షురాలిగా ఎస్.సుజాత, కార్యదర్శిగా కె.సునీత, కోశాధికారిగా కె.సౌజన్య ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ విద్యాచందన మాట్లాడుతూ బ్యాంక్ లింకేజ్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపారని అభినందించారు. అదనపు డీఆర్డీఓ, డీపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు. పది జిల్లాల మత్స్యకారులకు శిక్షణ కూసుమంచి: పాలేరులోని పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటే శిక్షణ గురువారం ప్రారంభమైంది. ‘జలాశయాల్లో మత్స్య అభివృద్ధి – యాజమాన్య పద్ధతులు’ అంశంపై ఇస్తున్న ఈ శిక్షణకు ఖమ్మం, నిజామాబాద్, హనుమకొండ, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సిరిసిల్ల జిల్లాల మత్స్యకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిరోజు మత్స్యశాఖ నేషనల్ ఫెసిలిటేటర్ బి.లవకుమార్ మాట్లాడుతూ శిక్షణను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా మత్స్య సంపదలో రాష్ట్రాన్ని ముందు నిలపాలని సూచించారు. చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పరిశోధనా కేంద్రం పూర్వ, ప్రస్తుత ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ జి.విద్యాసాగర్రెడ్డి, డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడగా మత్స్య శాస్త్రవేత్తలు రవీందర్, గణేష్ పాల్గొన్నారు. వడదెబ్బతో ఒకరి మృతి కామేపల్లి: కామేపల్లి ఇరిగేషన్ సబ్డివిజన్లో లష్కర్గా విధులు నిర్వర్తిస్తున్న బండి రాజమ్మ (60) వడదెబ్బతో మృతి చెందింది. ఇటీవల ఆమె అస్వస్థతకు గురి కాగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందిందని కుటుంబీకులు వెల్లడించారు. ఇరిగేషన్ డీఈఈ శంకర్, ఏఈఈ శ్యామ్, ఉద్యోగులు పలువురు ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు. -
ఆయిల్పామ్ సాగుతో ఆదాయం
దమ్మపేట : స్థిర ఆదాయం ఆయిల్పామ్ పంటతోనే సాధ్యమని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జే కిషోర్ అన్నారు. గురువారం మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో మహిళా రైతులు దొడ్డా శిరీష, దొడ్డా అన్నపూర్ణల వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ మొక్కలు నాటే కార్యక్రమంలో డీహెచ్ఎస్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట సాగుకు ప్రభుత్వం మొదటి నాలుగు సంవత్సరాలపాటు రాయితీ, సబ్సిడీ కల్పిస్తోందని తెలిపారు. తోటలో మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలు సాగు చేసుకోవచ్చని, నాలుగో సంవత్సరం నుంచి 35 సంవత్సరాల వరకు పామాయిల్పై ఆదాయం పొందవచ్చని అన్నారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట పామాయిల్ నర్సరీ ఇన్చార్జి రాధాకృష్ణ, ఆయిల్ ఫెడ్ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నృసింహస్వామికి చక్రస్నానం.. శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీయోగానంద లక్ష్మీ నృసింహ స్వామివారి బ్రహ్మహోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి పవిత్ర గౌతమీ నదిలో చక్ర స్నానం కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి మేళతాళాలు, మహిళా భక్తుల కోలాట నృత్యాల నడుమ గోదావరి తీరానికి తీసుకెళ్లి నదీ జలాలతో చక్ర స్నానం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హజరై ఈ వేడుకను తిలకించి పులకించారు. -
వ్యవసాయాధారిత ఉత్పత్తులు తయారు చేయాలి
అశ్వారావుపేటరూరల్: రైతులు వ్యవసాయంపైనే ఆధార పడకుండా, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను కూడా తయారీ చేసి ఆదాయం పొందాలని శాస్త్రవేత్తలు డాక్టర్ మధుసూధన్రెడ్డి, డాక్టర్ పావని, డాక్టర్ కృష్ణతేజ సూచించారు. గురువారం మండలంలోని బచ్చువారిగూడెం గ్రామంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో వారు మాట్లాడారు. రైతులు తమ ధరను తామే నిర్ణయించాలంటే ఒక్క వ్యవసాయంపైనే ఆధారపడితే సరిపోదని, విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా తయారీ చేయాలన్నారు. పొలంలో ఉండే ప్రతి కీటకం హాని కలిగించేది కాదని, మిత్ర పురుగులు కుడా ఉంటాయని వివరించారు. అనంతరం ప్రచార పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ శివరాం ప్రసాద్, హెచ్ఓ వేణుమాధవ్, ఏఈఓలు ఎన్.రవీందర్, సతీష్, షకీరాభాను, కార్యదర్శి మెహరాజ్ ఉద్దీన్, రైతులు పాల్గొన్నారు. -
సులభం.. సత్వరం
● స్లాట్ బుకింగ్తో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి ● పైలట్గా ఉమ్మడి జిల్లాలో మూడుచోట్ల అమలు ● త్వరలోనే అన్ని కార్యాలయాల్లో విధానంఖమ్మంమయూరిసెంటర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ తక్కువ సమయంలో పూర్తవుతోంది. స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వెళ్తే 15 నిమిషాల్లో పని పూర్తవుతుండగా, మరో పది నిమిషాల్లో దస్తావేజులు ఇస్తున్నారు. దీంతో రోజంతా పడిగాపులు కాయాల్సిన ఇబ్బందులు తప్పాయి. ఈవిధానంతో క్రయ విక్రయదారుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఉద్యోగుల నుంచి సానుకూలత వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం ఆర్ఓ కార్యాలయం, కొత్తగూడెం, కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమలవుతుండగా.. త్వరలోనే అన్ని కార్యాలయాల్లోనూ అమలుకు సిద్ధమవుతున్నారు. గంటల కొద్దీ వేచి ఉండి.. గతంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం రోజంతా క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సి వచ్చేది. దీంతో ఇద్దరికీ సమయం కుదరక పలుమార్లు వాయిదా వేసుకునేవారు. మరోవైపు కార్యాలయాల్లోనూ రద్దీ ఉండేది. ఒకే సమయాన పెద్దసంఖ్యలో జనం వస్తుండడంతో కార్యాలయ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఒక్కోసారి డాక్యుమెంట్లన్నీ పూర్తిగా పరిశీలించేందుకు సమయం దొరికేది కాదు. కానీ ఇప్పుడు స్లాట్ బుకింగ్తో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. చిన్నచిన్న సమస్యలతో.. పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి జిల్లాలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలుచేస్తోంది. తొలిసారి కావడంతో చిన్నచిన్న సమస్యలు ఎదురవుతున్నా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాత కంప్యూటర్లు, సర్వర్లను మార్చడంపై దృష్టి సారించిన నేపథ్యాన ఈ నెలాఖరు నాటికి సమస్యలన్నీ తీరతాయని చెబుతున్నారు. అన్ని కార్యాలయాల్లో.. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్తో మంచి మంచి ఫలితాలు వచ్చినందున విధానాన్ని త్వరలోనే అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25కార్యాలయాల్లో అమలు చేయగా.. ఇటీవల రెండో దశలో మరో 25 కార్యాలయాలు ఎంపిక చేశారు. ఈనెల 1 నుంచే అన్ని చోట్లా ఈ విధానాన్ని అమలు చేయాలని భావించినా సాంకేతిక కారణాలతో జూన్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏప్రిల్ 10 నుండి ఇప్పటివరకు స్లాట్ విధానంలో జరిగిన రిజిస్ట్రేషన్లు కార్యాలయం డాక్యుమెంట్లు ఆదాయం ఖమ్మం ఆర్ఓ 1,164 రూ.10.21 కోట్లు కొత్తగూడెం 698 రూ.2.41 కోట్లు కూసుమంచి 530 రూ.97 లక్షలు -
బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ పరిశీలన
గనిని సందర్శించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, గనుల్లో ఉపయోగిస్తున్న కంటిన్యూస్ మైనర్, ఎల్హెచ్డీ యంత్రాల పనితీరును అటవీ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. కొత్తగూడెంలోని పీవీకే –5 ఇంక్లెయిన్ గనిని గురువారం వారు సందర్శించారు. ఏరియాకు వచ్చిన అధికారుల బృందానికి జీఎం ఎం.శాలేంరాజు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం గని అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన వివరాలు, యంత్రాల పనితీరును తెలియజేశారు. ఆ తర్వాత అధికారులు మ్యాన్రైడింగ్ ద్వారా గనిలోకి దిగి పంపింగ్ స్టేషన్, సబ్స్టేషన్ ప్రాంతాలను వీక్షించారు. అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సెంట్రల్) డాక్టర్ వి.ఆర్.జెన్సర్ ఆధ్వర్యంలో డాక్టర్ త్రినాథ్కుమార్, సీసీఎఫ్ డి.భీమానాయక్, ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, కొత్తగూడెం డివిజనల్ అటవీ అధికారి కోటేశ్వరరావు తదితరులు పర్యటించారు. -
ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టాలి
సుజాతనగర్: ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టాలని, అందుకోసం ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతను నిర్మించుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జలశక్తి అభియాన్లో భాగంగా సర్వారం గ్రామ పంచాయతీ, హలావత్ తండాలో పలువురు నిరిస్తున్న ఇంకుడుగుంతల పనులను బుధవారం ఆయన పరిశీలించారు. పలుగు పార పట్టి ఇంకుడు గుంత తవ్వారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల నిర్మాణానికి వేసవి కాలమే సరైన సమయమని అన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని తెలిపారు. పనులు ఎలా సాగుతున్నాయంటూ పంచాయతీ కార్యదర్శి సతీష్ను అడిగి తెలుసుకున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలకు ముందుకొచ్చిన యువకులను కలెక్టర్ అభినందించారు. -
జిల్లాకు రిక్తహస్తమే..!
పేరుకే నిధులు.. భద్రాచలం రోడ్ మీదుగా సర్వే నిర్వహించిన రైల్వే లైన్లలో ఒకటైన కొండపల్లి – కొత్తగూడెం (125 కి.మీ) రైల్వేలైన్ నిర్మాణ అంచనా వ్యయం రూ.997 కోట్లు కాగా ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.10 లక్షలు కేటాయించారు. డోర్నకల్ నుంచి భద్రాచలంరోడ్ వరకు ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్ను డబ్లింగ్ చేసేందుకు రూ.770 కోట్లు అవసరం అవుతుండగా ఈ బడ్జెట్లో కేటాయింపులేమీ చూపలేదు. అయితే సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలో పోచారం, గాంధీపురం రైల్వే సేష్టన్ల అభివృద్ధికి దాదాపు రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: 2025 – 26 రైల్వేబడ్జెట్లో జిల్లాకు మొండిచేయే ఎదురైంది. గత మార్చిలో బడ్జెట్ ప్రకటించగా కేటాయింపులకు సంబంధించిన పింక్బుక్ వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. ప్రతీ ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.కోట్లలో ఉంటే కేటాయింపులు మాత్రం రూ.లక్షలకే పరిమితమయ్యాయి. నామ్కే వాస్తే నిధులు.. భద్రాచలంరోడ్ – కొవ్వూరు రైల్వే లైన్ నిడివి 151 కి.మీ. ఈ మార్గంలో రైల్వేలైన్ నిర్మించాలని మూడు దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ప్రస్తుత బడ్జెట్లో ఆమోదం లభించినా నిధుల కేటాయింపు అంతంతగానే మారింది. ఈ మార్గంలో ట్రాక్ నిర్మాణానికి రూ.1,444 కోట్లు అవసరం కాగా ఈ బడ్జెట్లో కేవలం రూ. 95 లక్షలు కేటాయించారు. ఈ లైన్తో పాటు కొత్తగా భద్రాచలం (పాండురంగాపురం) – మల్కన్గిరి, కిరండోల్ – కొత్తగూడెం, మణుగూరు – రామగుండం రైల్వే లైన్ల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన రైల్వే శాఖ.. ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మార్గాలకు కూడా ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారనే ఆశలు అడియాశలే అయ్యాయి. మణుగూరుకు మొండిచేయి.. మణుగూరు – రామగుండం రైల్వే లైన్ నిడివి 200 కి.మీ. కాగా నిర్మాణ వ్యయం రూ.2,911 కోట్లుగా అంచనా వేశారు. ఈ లైన్కు ప్రస్తుత బడ్జెట్లో కంటి తుడుపు చర్యగా కేవలం రూ.73 లక్షలు కేటాయించారు. రామగుండం సమీపంలోని రాఘవాపురం వద్ద మొదలయ్యే ఈ రైలు మార్గం మంథని – భూపాలపల్లి – మేడారం – తాడ్వాయి – రామానుజపురం మీదుగా మణుగూరు వరకు నిర్మించాల్సి ఉంది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ ట్రాక్ నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు జరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకూ రిక్తహస్తమే ఎదురైంది. రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో మొండిచేయి అంచనాలు రూ.కోట్లలో.. కేటాయింపులు రూ.లక్షల్లో మణుగూరు – రామగుండం లైన్పై శీతకన్ను పత్తాలేని మల్కన్గిరి – కిరండోల్ మార్గాలు కొవ్వూరు, కొండపల్లి లైన్లకూ అరకొర విదిలింపులే.. కొత్త రైల్వే లైన్ నిర్మాణ వ్యయం బడ్జెట్ కేటాయింపులు భద్రాచలంరోడ్– కొవ్వూరు రూ.1,444 కోట్లు రూ. 95 లక్షలు కొత్తగూడెం – కొండపల్లి రూ. 997 కోట్లు రూ.10 లక్షలు మణుగూరు – రామగుండం రూ. 2,911 కోట్లు రూ.73 లక్షలు భద్రాచలంరోడ్ – డోర్నకల్ రూ. 770 కోట్లు కేటాయింపుల్లేవు (డబ్లింగ్) -
సెల్ టవరెక్కిన యువకుడు
జూలూరుపాడు: భూ వివాదంలో న్యాయం చేయాలని ఓ యువకుడు బుధవారం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. మండలంలోని వెంగన్నపాలెం గ్రామానికి చెందిన మోటపోతుల కుటుంబీకులకు, దేవరకొండ కుటుంబీకుల మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం ఉంది. మండల కేంద్రం సమీపంలో తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కన 69/ఆ సర్వే నంబర్లో ఐదెకరాల వ్యవసాయ భూమి విషయమై ఇరుపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. కాగా తమకు కోర్టు స్టే ఆర్డర్ వచ్చిందంటూ బుధవారం మోటపోతుల కుటుంబీకులు భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు సిద్ధపడగా, దేవకొండ కుటుంబీకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని కోర్టు స్టే ఆర్డర్ ఉందని, ఫెన్సింగ్ పనులను అడ్డుకోరాదని దేవరకొండ కుటుంబీకులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ క్రమంలో మనస్తాపం చెంది దేవరకొండ నరసింహారావు అనే యువకుడు వెంగన్నపాలెంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. ఈ సందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ తన తాత దేవరకొండ చిన్న బ్రహ్మయ్య పేరున ఉన్న భూమిని మోటపోతుల ఆగయ్యకు కౌలు నిమిత్తం ఇచ్చామని, ఆగయ్య కుటుంబీకులు అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆరోపించాడు. భూ వివాదంలో న్యాయం చేయాలని నిరసన -
అయన్నపాలెంలో భూ వివాదం
చండ్రుగొండ: మండలంలోని అయన్నపాలెం గ్రామంలో భూ వివాదం నెలకొంది. ప్రభుత్వ భూమిలో ఇటీవల నిర్మించిన రేకులషెడ్డును తొలగించేందుకు అధికారులు బుధవారం ప్రయత్నించగా బాధిత కుటుంబాలు అడ్డుకున్నాయి. అయన్నపాలెం గ్రామశివారులో ఎకరన్నర భూమి అదే గ్రామానికి చెందిన బొప్పి నాగరాజు, బొప్పి కాసులు ఆధీనంలో ఉంది. ఆ భూమిలో కొన్నేళ్లుగా ఇటుకబట్టీలు ఏర్పాటు చేశారు. పాత రేకులషెడ్లతోపాటు కొత్తగా మరో రేకులషెడ్డు వేశారు.ప్రభుత్వ కళాశాల నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా తహసీల్దార్ సంధ్యారాణిసదరు భూమి ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. తాజాగా పోలీసులతోపాటు రెవెన్యూ సిబ్బంది రేకులషెడ్డు తొలగించేందుకు ప్రయత్నింగా దళిత కుటుంబాలు అడ్డుకున్నాయి. తాతముత్తాల నుంచి ఆ భూమి ఆధారంగా జీవనం సాగిస్తున్నామని ప్రాధేయపడటంతో తహసీల్దార్ సంధ్యారాణితోపాటు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగారు. షెడ్డు నిర్మాణాన్ని తొలగించేందుకు అధికారుల ప్రయత్నం -
స్వర్ణోత్సవాల లోగో ఆవిష్కరణ
సింగరేణి(కొత్తగూడెం) : మందమర్రి ఏరియాలో సింగరేణి పాఠశాల ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో స్వర్ణోత్సవాల లోగోను సీఎండీ ఎన్. బలరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందమర్రిలో 1975లో పాఠశాల ఏర్పాటు చేశామని, ఈజూన్తో 50 ఏళ్లు పూర్తవుతుందని తెలిపారు. ఈ పాఠశాలలో సంవత్సరానికి 300 మంది చొప్పున విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని బయటకి వెళ్తున్నారని, వారంతా నేడు వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాలకు నేటి నుంచి ప్రత్యేక బస్సులు
చుంచుపల్లి: సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కొత్తగూడెం డిపో నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డీఎం దేవేందర్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నుంచి ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు కొత్తగూడెం బస్టాండ్ నుంచి బయలుదేరి.. ఇల్లెందు, మాహబూబాబాద్, నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, మహదేవపూర్ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు కాళేశ్వరం చేరుకుంటుందని, తిరిగి అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి అదే మార్గంలో కొత్తగూడెం వస్తుందని వివరించారు. ఈ ఎక్స్ప్రెస్ బస్సులో పెద్దలకు చార్జీ రూ. 580, పిల్లలకు రూ.300గా నిర్ణయించామని, ముందుగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు డిపో మేనేజర్ కొత్తగూడెం 99592 25959, బస్టాండ్ ఎంకై ్వరీ 99592 25982, రిజర్వేషన్ కౌంటర్, 99592 25981 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతకు ఐటీసీ ప్రథమ్ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కోర్సుల వారీగా పది రోజుల నుంచి 45 రోజులపాటు శిక్షణ ఉంటుందని, బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, టైలరింగ్ శిక్షణ కోసం పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పుట్టగొడుగుల పెంపకం శిక్షణకు ఏడో తరగతి, ఆపైన, జ్యూట్ బ్యాగ్ల తయారీకి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని వెల్లడించారు. భద్రాచలం, ఖమ్మం వైటీసీల్లో శిక్షణ ఇవ్వడమే కాక ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామని పీఓ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ జిరాక్స్, ఆధార్, రేషన్ కార్డు/ఉపాధి హామీ బుక్, బ్యాంకు పాస్ బుక్, రెండు ఫొటోలతో ఈనెల 21న ఐటీడీఏలోని వైటీసీలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 63026 08905, 81438 40906 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు. నేటితో ముగియనున్న వేసవి శిబిరంపాల్వంచరూరల్ : ఆళ్లపల్లిలోని బాలికల క్రీడా పాఠశాలలో ఈనెల 1న ప్రారంభించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం గురువారంతో ముగియనుందని ఐటీడీఏ క్రీడా శాఖాధికారి గోపాల్రావు తెలిపారు. ప్రత్యేక కోచ్లను నియమించి 72 మంది బాలురు, 72 మంది బాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇప్పించామని పేర్కొన్నారు. కాగా, ప్రతి సంవత్సరం పాల్వంచ మండలం కిన్నెరసానిలోని క్రీడా పాఠశాలలో నెల రోజుల పాటు ఈ శిబిరాలు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది మాత్రం 15 రోజులకే పరిమితం చేశారు. ఉపాధ్యాయ శిక్షణను పరిశీలించిన ఆర్జేడీ ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ) సత్యనారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజ రు, శిక్షణపై ఆరా తీశారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ మార్పులకు అనుగుణంగా శిక్షణ లో నేర్చుకున్న అంశాల ద్వారా బోధించాల్సి ఉంటుందని తెలిపారు. ఖమ్మం డీఈఓ ఎస్.సత్యనారా యణ, ఏఎంఓ రవికుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సీహెచ్.రామకృష్ణ, కోర్సు కోఆర్డినేటర్ శైలజలక్ష్మి పాల్గొన్నారు. కాగా, ఖాళీగా ఉన్న గెజిటె డ్ ప్రధానోపాధ్యాయుల పోస్టుల్లో ఎఫ్ఏసీ హెచ్ఎంలుగా నియమించిన స్కూల్ అసిస్టెంట్లకు ర్యాటిఫికేషన్ ఆర్డర్లు ఇవ్వాలని ఆర్జేడీకి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు కట్టా శేఖర్రావు, పి.వెంకటేశ్వరరెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్, రత్నకుమార్, డి.రవికుమార్, లింగం సతీష్, టి.వెంకన్న, శాంతారెడ్డి, మహేష్, రవికిరణ్, సుబ్బారావు పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కనులపండువగా దొంగల దోపు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మహోత్సవాల్లో భాగంగా బుధవారం దొంగల దోపు వేడుక కనులపండువగా సాగింది. ముందుగా ఆలయంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మహిళా భక్తుల కోలాటాల నడుమ ఆలయం నుంచి గోదావరి తీరానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత నదిలో తెప్పోత్సవం గావించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సన్నాలకే జై..
● బోనస్ నేపథ్యాన రైతుల మొగ్గు ● విదేశీ ఎగుమతులకూ ఇవే సరి ● డిమాండ్ ఆధారంగా విత్తనాలు అందుబాటులోకి...ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలో ప్రధాన పంట వరి కాగా.. రైతులు కొన్నేళ్ల క్రితం వరకు ఎక్కువగా దొడ్డు రకాలనే సాగు చేసేవారు. కొందరు మాత్రమే సన్న రకాలకు మొగ్గు చూపేవారు. సన్న రకాల కన్నా దొడ్డు రకాలు కొంతమేర అధిక దిగుబడి ఇవ్వడం, ధరలో పెద్ద తేడా లేకపోవడం, త్వరగా చేతికి రావడం ఇందుకు కారణమయ్యేది. కానీ కాలక్రమంలో సన్న రకాలకు డిమాండ్ పెరగడం, ధర ఎక్కువగా ఉండడంతో రైతులు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుండడం.. నీటి వసతి పెరగడంతో గత ఏడాది ఖరీఫ్, యాసంగిలో రైతులు ఎక్కువగా సన్న రకాలే సాగు చేశారు. అంతేకాక వచ్చే ఖరీఫ్లోనూ అటే మొగ్గు చూపుతుండడంతో విత్తనాభివృద్ది సంస్థ, ప్రైవేట్ వ్యాపారులు ఆయా రకాల విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. విదేశీ ఎగుమతులకు ప్రాధాన్యత తెలంగాణలోని పలు జిల్లాల్లో సాగయ్యే వరికి విదేశాల్లో డిమాండ్ ఉంది. ఇప్పటికే పిలిప్పీన్స్తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వియత్నాం, ఇండోనేషియా దేశాలతోనూ ఒప్పందం కుదిరే అవకాశమున్నందున ఎగుమతికి అనువైన రకాలను సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రకాలను సుమారు 2.50 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలనేది లక్ష్యం కాగా, ఉమ్మడి నల్ల గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అందుబాటులో అనేక రకాలు ప్రభుత్వ లక్ష్యం, రైతులకు బోనస్, ధర లభిస్తున్న నేపథ్యాన సన్నరకాల విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడంపై యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో సన్న రకానికి సంబంధించి ఎక్కువగా బీపీటీ 5204(సాంబమసూరి) సాగు చేస్తారు. ఇది కాక వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అనేక రకాల విత్తనాలను ప్రవేశపెట్టగా, ప్రైవేట్ కంపెనీ లూ విక్రయిస్తున్నాయి. ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా, వరంగల్ సోనా, పూజ, చింటు, జిలకర సన్నాలు, జగిత్యాల సాంబ, నెల్లూరు సాంబ, ఐఆర్ 64, ఎంటీయూ 1010, వరంగల్ కాటన్ దొర సన్నాలు, సురేఖ, మసూరి వంటి రకాలు అందుబాటులోకి వచ్చాయి. విత్తనాభివృద్ది సంస్థ సిద్ధం ఖమ్మం జిల్లాలో 3లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మెజార్టీ రైతులు సన్నాలపై మొగ్గు చూపుతున్నందున తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఖమ్మం యూనిట్లో బీపీటీ 5204 రకం 3,400 క్వింటాళ్లు, కేఎన్ఎం 1638 రకం 200 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశారు. ఏటా వ్యవసాయ శాఖ ఇచ్చే ఇండెంట్ ఆధారంగా విత్తనాలు సమకూరుస్తుండగా, ఈసారి పూర్తిగా సన్న రకాలే అందుబాటులో ఉంచాలని సూచించినట్లు తెలిసింది. దీంతో మిగతా విత్తనాలు సేకరించడంలో నిమగ్నమయ్యారు. బీపీటీ 5204 వంటి రకాలు 25 కిలోల బస్తా విత్తనాలు ధర రూ.1,075 ఉండగా, ప్రైవేట్ కంపెనీలవైతే డిమాండ్ ఆధారంగా రూ.1,200 వరకు ఉంటోంది. త్వరలోనే సరఫరా ప్రభుత్వం నిర్దేశించిన సన్న వరి రకాల విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే బీపీటీ 5204(సాంబమసూరి), కేఎన్ఎం 1638 విత్తనాలు ఉన్నాయి. ఇంకొన్ని త్వరలోనే జిల్లాకు చేరుకుంటాయి. ఆపై పీఏసీఎస్లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా చేస్తాం. – ఎన్.బిక్షం, ప్రాంతీయ మేనేజర్, విత్తనాభివృద్ధి సంస్థదొడ్డు రకాలకు చెల్లుచీటీ? వరిలో దొడ్డు రకాలకు కాలం చెల్లినట్లేనని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇస్తుండడమే కాక రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు కూడా ఇదే బియ్యం సరఫరా చేస్తున్న నేపథ్యాన రైతులు సన్న రకాలే సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఈనేపథ్యాన తక్కువ కాలపరిమితి కలిగి, అధిక దిగుబడి ఇచ్చే దొడ్డు రకాలైన ఎంటీయూ 1001 తదితరాల సాగు గణనీయంగా తగ్గముఖం పడుతోంది. -
సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెంచాలి
కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఉత్తమ బోధన అందిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఈ తరగతులు ఉపకరిస్తాయని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, మౌలిక భాష, గణిత అభివృద్ధి కార్యక్రమాలను ఏఐ ఆధారంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన వివరాలు డీఈఓకు తెలియజేస్తే పనులు చేపడతామని చెప్పారు. ఉపాధ్యాయులు శక్తివంతులని, పిల్లలకు నాణ్యమైన విద్యనందించడం వారికే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి, అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు.. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందిస్తామని కలెక్టర్ పాటిల్ చెప్పారు. కొత్తగూడెంలోని పాఠ్యపుస్తకాల గోడౌన్ను పరిశీలించాక మాట్లాడారు. ఇప్పటికే 70 శాతం పుస్తకాలు జిల్లాకు చేరాయని, మిగిలినవి ఈనెల 25 లోపు వస్తాయని, ఆ వెంటనే మండలాలకు సరఫరా చేస్తామని తెలిపారు. అక్కడి నుంచి పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకెళ్లాలని సూచించారు. ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచన -
విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి
దమ్మపేట: విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అంకంపాలెం గ్రామ శివారులో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని అంకంపాలెం గ్రామానికి చెందిన గిరిజన రైతు కొర్సా పుల్లయ్య అనే వ్యక్తికి చెందిన ఎద్దు అదే గ్రామ శివారులో బుధవారం ఉదయం మేతకు వెళ్లింది. ఈ క్రమంలో తక్కువ ఎత్తులోనున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మేత మేస్తుండగా విద్యాదాఘాతానికి గురై మృతి చెందింది. రూ.60 వేలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు.ఆటో బోల్తా, ఎనిమిది మందికి గాయాలుతల్లాడ: తల్లాడ–సత్తుపల్లి జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పలువురు ఆటోలో తల్లాడ మండలం మిట్టపల్లిలో బంధువుల ఇంట కర్మకు హాజరై తిరిగి వెళ్తున్నారు. తల్లాడ మండలం అంజనాపురం వద్ద గేదె అడ్డు రావడంతో ఆటో ముందు బైక్పై వెళ్తున్న వ్యక్తి ఒక్కసారి బ్రేక్ వేయగా కింద పడ్డాడు. ఆ వెంటనే ఆటో డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేయగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న గొర్రెముచ్చు అరుణ, మాలోచి ఆరోగ్యమ్మ, గొర్రెముచ్చు మౌనిక, మణెమ్మ, సిరి, జాన్సీ, గుత్తికొండ జ్ఞాన సుందరికి కాళ్లు, చేతులు, తలకు గాయాలయ్యాయి. అలాగే, బైక్పై వెళ్తున్న మట్టగాని గురుపాదం కూడా గాయపడగా క్షతగాత్రులను 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురిపై కేసు నమోదుజూలూరుపాడు: అక్రమంగా ఇసుక తోలకాలు జరుపుతున్న ఆరుగురు వ్యక్తులపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ బాదావత్ రవికథనం ప్రకారం.. భేతాళపాడు గ్రామ సమీపంలోని పెద్దవాగులోని ఇసుకను మూడు ట్రాక్టర్లలోలోడు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ యజమానులు ఆంగోత్ సక్రు, కోరం నాయయ్య, బల్లెం రంగయ్య, డ్రైవర్లు బానోత్ బిక్కు, బానోత్ నిఖిల్, సోడె వెంకన్నలపై కేసు నమోదు చేశారు. సైబర్ కేసు నమోదుదుమ్ముగూడెం: మండలంలోని పైడాకులమడుగు గ్రామానికి చెందిన యువతి అకౌంట్లోని నగదు మాయం కావడంపై పోలీసులు బుధవారం సైబర్ కేసు నమోదు చేశారు. ఎస్ఐ గణేష్ కథనం ప్రకా రం... పైడాకులమడుగు గ్రామానికి చెందిన గొంది దీవెనకు లక్ష్మీనగరం ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ నుంచి గతేడాది జనవరి 30న రూ.76 వేల నగదును సైబర్ నేరస్తులు దొంగిలించారు. బాధితురాలు ఇటీవల బ్యాలెన్స్ చెక్ చేసుకోగా ఈ విషయం వెలుగుచూసింది. దీంతో సైబర్ పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సైబ ర్ పోలీసులు కేసును స్థానిక పోలీస్స్టేషన్కు బదిలీ చేయగా, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పశువులు స్వాధీనంఇల్లెందురూరల్: భారీ కంటైనర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 18 పశువులను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని సుభాష్నగర్ గ్రామపంచాయతీ లలితాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామం నుంచి పశువులను హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు హైదరాబాద్కు చెందిన మోహిష్ ఖురేషీ, సూర్యపేటకు చెందిన గుగులోత్ భానుప్రకాష్, బానోత్ లాల్సింగ్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. పట్టుబడిన గోవులను పాల్వంచ గోశాలకు తరలించామని పేర్కొన్నారు. -
కొబ్బరి తోటలో చిరుతపులి సంచారం !
అశ్వారావుపేటరూరల్: ఓ కొబ్బరి తోటలో చిరుత పులి సంచరించినట్లు బుధవారం ఉదయం ప్రచారం జరిగింది. దీంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేటమాలపల్లి నుంచి నందమూరినగర్కు వెళ్లే మార్గమధ్యలో జూపల్లి వెంకట రామారావుకు కొబ్బరి తోట ఉంది. తోట వద్దకు వెళ్లిన రైతుకు కొద్ది దూరంలో చిరుత పులి మాదిరిగా ఓ జంతువు కనిపించింది. దీంతో రైతు స్థానికులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు రేంజర్ మురళీకృష్ణ తన సిబ్బందితో కలిసి కొబ్బరి తోటతోపాటు, చుట్టు పక్కల దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు చిరుత పులి పాదముద్రల కోసం విస్తృతంగా గాలించారు. కానీ ఆయా ప్రదేశాల్లో ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదు. దీంతో చిరుత పులి సంచారంలో వాస్తవం లేదని, పాదముద్రలు, ఇతర ఆధారాలు లభ్యం కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేంజర్ తెలిపారు. ఆనవాళ్లు లభ్యం కాలేదన్న ఫారెస్టు రేంజర్ -
అంగన్వాడీ సిబ్బంది సేవలు ప్రశంసనీయం
కొత్తగూడెంఅర్బన్: అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయినుల సేవలు ప్రశంసనీయమని జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా అన్నారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన సీడీపీఓ కనకదుర్గ, హెడ్ మాస్టర్ మేకల జ్యోతి రాణి, రేగళ్ల అంగన్వాడీ టీచర్ రమాదేవిలను ఐసీడీఎస్ లక్ష్మీదేవిపల్లి సెక్టార్ –1 ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడారు. పాల్వంచ సీడీపీఓ లక్ష్మీప్రసన్న, సూపర్ వైజర్ ఓ.రమాదేవి, అంగన్వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. అవసరానికి మించి ఎరువులు వాడొద్దుసత్తుపల్లిరూరల్: సాగు చేసే పంటలు, భూసా రం ఆధారంగా అధికారులు, శాస్త్రవేత్తల సిఫా రసు మేరకు ఎరువులు ఉపయోగించాలని, అంతకు మించి వాడితే ఫలితం ఉండకపోగా ఖర్చు పెరుగుతుందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్కుమార్ అన్నారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా గంగారం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట మార్పిడి చేయడంతో పాటు పంట అవశేషాలను కలియదున్నితే భూసారం పెరుగుతుందన్నారు. సెల్ ఫోన్లు రికవరీకొత్తగూడెంఅర్బన్: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 150 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బుధవారం బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్రాజు మాట్లాడుతూ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో గత రెండు నెలల వ్యవధిలో పోగొట్టుకున్న 150 మంది ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. గడిచిన ఐదు నెలల్లో మొత్తం 743 మొబైల్ ఫోన్లను కనిపెట్టి బాధితులకు అందించామన్నారు. రికవరీ చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రాము, ఎస్సై సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడిఅశ్వారావుపేటరూరల్: మండల పరిధిలోని నారంవారిగూడెం కాలనీ గ్రామ శివారులో ఓ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బుధవారం పోలీసులు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. రూ.3100 నగదు, రెండు బైక్లు, రెండు సెల్ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదుదమ్మపేట: మండల పరిధిలోని బాలరాజుగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వ్యక్తులపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. దమ్మపేట, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారయ్యాడు. రూ.17,500 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. కాగా పేకాటరాయుళ్లలో మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు. సీఐల బదిలీ, పోస్టింగ్ ఖమ్మం క్రైం: పోలీసు శాఖలోని మల్టీజోన్–1 పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా కరీంనగర్ పీటీసీలో ఆన్ డ్యూటీపై ఉన్న జి.శ్రీకాంత్గౌడ్ను ఖమ్మం ట్రాఫిక్ సీఐగా కేటాయించారు. అలాగే, ఖమ్మం టాస్క్ఫోర్ సీఐగా వెయింటింగ్లో ఉన బి.బాలాజీని నియమించారు. అంతేకాకుండా కొత్తగూడెం టుటౌన్ సీఐగా వెయిటింగ్లో ఉన్న డి.ప్రతాప్ను నియమించారు. ఈ స్థానంలో ఉన్న టి.రమేష్కుమార్ను ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. -
జేసీబీ, లారీ సీజ్
ములకలపల్లి: అనుమతుల్లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు బుధవారం సీజ్ చేశారు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని వీకే. రామవరం శివారు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో తెల్లవారుజామున దాడులు నిర్వహించి జేసీబీ, లారీని సీజ్ చేశారు. వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించి, కేసు దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు. గూడ్స్ రైలు ఢీకొని అడవి దున్న మృతిఅశ్వాపురం: అశ్వాపురం రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లోని కంపార్ట్మెంట్ నంబర్ 159 పరిధి మండలంలోని జగ్గారం గ్రామంలో షెడ్యూల్–1 జాతికి చెందిన సుమారు ఐదేళ్ల వయసు కలిగిన అడవి దున్న మంగళవారం రాత్రి రైల్వే ట్రాక్ దాటుతూ గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందింది. ఎఫ్ఆర్ఓ రమేష్, ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పశువైద్యాధికారి రుబీనా ఫర్హీన్ పోస్టుమార్టం నిర్వహించగా, రైల్వే అధికారులు పంచనామా నిర్వహించారు. పశువుల వాహనం బోల్తాభద్రాచలంఅర్బన్: అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న వాహనాన్ని బుధవారం ఉదయం 4 గంటల సమయంలో కరకట్టపై నిలిపి ఉంచగా, ప్రమాదవశాత్తు అక్కడి నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఓ ఆవు మృతి చెందింది. మరో ఆవు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు పడిపోయిన వాహనాన్ని లేపి పశువులను రక్షించారు. -
భారీ వర్షం.. పిడుగుపాటు
● మణుగూరులో తడిసిన ధాన్యం ● బచ్చువారిగూడెంలో గృహోపకరణాలు దగ్ధంఅశ్వారావుపేటరూరల్: పలు గ్రామాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షం కురిసింది. ఓ గ్రామంలో పిడుగుపడటంతో ఇంట్లో ఉండే గృహాపకరణాలు దగ్ధమయ్యాయి. మండల పరిధిలోని బచ్చువారిగూడెం, గుమ్మడవల్లి, కొత్తురు, మామిళ్లవారిగూడెం, కొత్త మామిళ్లవారిగూడెం, తిరుమలకుంట, తిరుమలకుంట కాలనీతోపాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. బచ్చువారిగూడెం పంచాయతీ కార్యాలయ భవనంపై పిడుగుపడింది. దీంతో జీపీ భవనంలో ముందు భాగం కొంతమేర ధ్వంసం కాగా, పైన ఉన్న సోలార్ పరికరాలతోపాటు లోపల ఉన్న స్విచ్ బోర్డులు, వైర్లు మొత్తం కాలిపోయాయి. గ్రామంలోని టీవీలు, ఫ్యాన్లు, బల్బులు, కూలర్లు, ఫ్రిజ్లు కాలిపోయాయి. కాగా అశ్వారావుపేట, అచ్యుతాపురం, ఊట్లపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంపై రైతులు ఉరుకులు, పరుగులతో పట్టాలు కప్పారు. నీట మునిగిన ధాన్యం మణుగూరు టౌన్: భారీ వర్షంతో కల్లాల్లోకి వరద నీరు చేరి ధాన్యం తడిసింది. మండలంలో పలు చోట్ల కల్లాల్లో ఎండబోసిన ధాన్యంపై పట్టాలు కప్పినా తడిసిపోవడంతో రైతులు మనోవేదన చెందుతున్నారు. రోడ్లపై వరద నీరు చేరి ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. -
ప్రతీ రైతు పొలంలో నీటి కుంట నిర్మించుకోవాలి
జూలూరుపాడు: ప్రతి రైతు వ్యవసాయ భూమిలో నీటి కుంట నిర్మించుకోవాలని అదనపు కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని వీరభద్రాపురం, పడమటనర్సాపురం గ్రామాల్లో పర్యటించారు. వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటల నిర్మాణం కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి, మాట్లాడారు. పొలాల్లో నీటి కుంటలు నిర్మించుకుంటే భూగర్భ జలాల అభివృద్ధితోపాటు, చేపల పెంపకం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ఆస్పత్రులు, రహదారులు వెంట, ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటికుంటలు, ఇంకుడు గుంతల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కరుణాకర్రెడ్డి, ఎంపీఓ తులసీరామ్, ఈజీఎస్ ఏపీఓ రవికుమార్, జీపీ సెక్రటరీలు, ఉపాధి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
భద్రాచలంఅర్బన్: విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై ఓ యువతి మృతిచెందిన ఘ టన పట్టణంలోని సీతారాంనగర్కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. ఏపీలోని బాపట్ల జిల్లా, చింతగుంపల్లి గ్రామానికి చెందిన దేవయ్య, గ్లోరి (25) దంపతులు మూడు వారాల కిందట భద్రాచలం వచ్చి సుందరయ్యనగర్లో ఉంటూ ఓవ్యక్తికి చెందిన బిల్డింగ్ పని (తాపీ) చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి అంతస్తులోని కొన్ని వస్తువులను తీసుకురావాలని దేవయ్య చెప్పడంతో.. గ్లోరిపైకి వెళ్లి వస్తువులు తెస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురైంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గ్లోరి, దేవయ్యలకు 12ఏళ్ల కిందట వివాహం కాగా, ముగ్గురు మగ పిల్లలున్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి..టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. టేకులపల్లిలోని ఏ–కాలనీ సకృతండాకు చెందిన భూక్య లక్ష్మణ్ (35) బోడు విద్యుత్ సబ్స్టేషన్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 7న విధులు ముగించుకుని తన ద్విచక్రవాహనంపై వస్తుండగా పశువులు అడ్డురావడంతో కిందపడ్డాడు. ఆయన్ను కొత్తగూడెం ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి భద్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాలీ బోల్తా పడి 13 మందికి గాయాలు పాల్వంచరూరల్: ట్రాలీ బోల్తాపడి 13 మంది గాయపడిన ఘటన మంగళవా రం చోటుచేసుకుంది. మణుగూరు సమీపంలో మోకాళ్ల నొప్పులకు నాటు మందులు ఇస్తున్నారని.. చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన 13 మంది ట్రాలీ ఆటోలో బయలుదేరారు. పాల్వంచ మండలం జగన్నాథపురం శివారులో బీసీయం జాతీయ రహదారిపై వాహనం బ్రేక్లు ఫైయిల్ కావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని 13మంది గాయపడగా పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో మహబూబీ అనే మహిళను మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రాలీ వాహనం బోల్తా.. కలర్ డబ్బాల లోడుతో వెళ్తున్న ట్రాలీ వాహనం బోల్తాపడిన ఘటన మండలంలోని కేశవాపురం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న వాహనం కేశవాపురం శివారులోని సీతానాగారంకాలనీ సమీపంలో బీసీయం జాతీయ రహదారిపై బోల్తాపడింది. వాహనంలో ఉన్న కలర్ డబ్బాలు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. -
ఐదెకరాల్లో సాగు చేసిన పంట దగ్ధం
గుండాల: ప్రమాదవశాత్తు మొక్కజొన్న కంకుల రాశికి నిప్పంటుకుని ఐదెకరాల్లో సాగు చేసిన పంట దగ్ధమైన ఘటన మండలంలోని నర్సాపురం తండాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. నర్సాపురం తండాకు చెందిన మాలోత్ హేమ యాసంగిలో ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల కంకులు కోసి మిల్లర్లో పట్టించేందుకు కల్లంలో ఆరబోశాడు. కాగా, మంగళవారం తెల్లవారుజామున పక్క చేనులో కోసిన మొక్కజొన్న కొయ్యలను రైతు కాల్చుతుండగా ఆ మంటలు హేమ ఆరోబోసిన రాశికి అంటుకుని కంకులు కాలిపోయాయి. ఉదయాన్నే అక్కడికి వెళ్లిన కుటుంబసభ్యులు కాలిపోయిన కంకులను చూసి బోరున విలపించారు. కంకులతో పాటు కోసేందుకు సిద్ధంగా ఉన్న చేను, సాగునీటి కోసం అమర్చిన పైపులు సైతం కాలిపోయాయి. దీంతో రూ. 1.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని, అధికారులు తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.రూ.1.50 లక్షల విలువైన మొక్కజొన్న అగ్నికి ఆహుతి -
నల్లగొండ జిల్లా రైతుల క్షేత్ర సందర్శన
అశ్వారావుపేటరూరల్: నల్లగొండ జిల్లాకు చెందిన రైతుల బృందం మంగళవారం అశ్వారావుపేటలో పర్యటించింది. నాబార్డు, ఇంటిగ్రేటేడ్ గ్రామీణాభివృద్ధి సొసైటీ ద్వారా 50 మంది రైతుల బృందం ముందుగా మండలంలోని నారంవారిగూడెం వద్ద గల ఆయిల్ఫెడ్ కార్యాలయం, నర్సరీలు, పామాయిల్ ఫ్యాక్టరీ, పలువురు రైతులకు చెందిన పామాయిల్ క్షేత్రాలను సందర్శించారు. అనంతరం స్థానిక వ్యవసాయ కళాశాలను సందర్శించగా, ఆయా రైతులకు కళాశాల శాస్త్రవేత్తలు.. ఆయిల్పాంలో నీటి యాజమాన్యం, ఆయిల్పాం సాగులో రైతులు పాటించాల్సిన పద్ధతులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో కళా శాల శాస్త్రవేత్తలు డాక్టర్ నీలిమా, డాక్టర్ లక్ష్మ ణ్, డాక్టర్ చరిత, తేజస్విని, శ్రావిక, అనూష, రైతుల బృందం పాల్గొన్నారు.రీ వెరిఫికేషన్లో అదనపు మార్కులుకొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి, రీ వెరిఫికేషన్లో మరో రెండు మార్కులు సాధించిన విద్యార్థిని కె.హాసినిని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్ మాచవరపు కోటేశ్వరరావు అభి నందించారు. మంగళవారం కళాశాలలో జరిగి న కార్యక్రమంలో విద్యార్థినికి పుష్పగుచ్ఛం అందించారు. హాసినికి ఇంటర్మీడియ ట్ ద్వి తీయ సంవత్సరంలో 1000 మార్కులకు 994 మార్కులు వచ్చాయని, రీ వెరిఫికేషన్లో మరో రెండు మార్కులు రాగా.. మొత్తం 996 మా ర్కులు సాధించిందని చెప్పారు.స్పీడ్బోటు సిద్ధంపాల్వంచరూరల్: కిన్నెరసాని జలాశయంలో టూరిజం డెలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న బోట్లు మూడు ఆదివారం దెబ్బతిన్న విషయం విదితమే. సదరు బోట్లకు మరమ్మతులు చేసేందుకు హైదరాబాద్ నుంచి మెకానిక్లు వచ్చారు. స్పీడ్ బోటును సిద్ధం చేశారు. పెద్ద బోటుకు సైతం మరమ్మతులు చేపట్టారు.సరస్వతి నది పుష్కరాలకు ప్రత్యేక బస్సులు● 15 నుంచి 26 వరకు సర్వీసులుఖమ్మంమయూరిసెంటర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించనున్నట్లు ఆర్సీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎ.సరిరామ్ తెలిపారు. తొలుత ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుంచి ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుపుతామని వెల్లడించారు. ఖమ్మం నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరే సర్వీస్ మధ్యాహ్నం 12 గంటలకు కాళేశ్వరం చేరుకోనుండగా, తిరిగి సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతుందని తెలిపారు. ఇందులో పెద్దలకు రూ.480, పిల్లలకు రూ.260 చార్జీ ఉంటుందని పేర్కొ న్నారు. కొత్తగూడెం నుంచి ఉదయం 6 గంటలకు, కాళేశ్వరం నుంచి సాయంత్రం 4.30 గంటలకు బస్సు బయలుదేరుతుందని, ఇందులో పెద్దలకు రూ.580, పిల్లలకు రూ.300 చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే, మణుగూరులో ఉదయం 6 గంటలకు, తిరిగి కాళేశ్వరం నుంచి 3.30 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. కాగా, కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తులు డిపోల్లో సంప్రదిస్తే బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్ఎం తెలిపారు.రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ మృతిపాల్వంచ: అనారోగ్య సమస్యలతో రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ తాళ్లూరి జాన్రత్నం (80) పట్టణంలోని కాంట్రాక్టర్స్కాలనీలోని తన నివాసంలో మంగళవారం మృతి చెందారు. దేశం కో సం అనేక ప్రాంతాల్లో ఆర్మీ లో కీలక విధులు నిర్వహించారు. పంజాబ్, జమ్మూకశ్మీర్, మీజోరాం, రాజస్థాన్, మణిపూర్, త్రిపుర వంటి అనేక ప్రాంతాల్లో ఆర్మీలో 30 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం పాల్వంచలోని ఎన్ఎండీసీ కర్మాగారంలో 9 ఏళ్లపాటు సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వర్తించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు కాగా అనిల్ అనే కుమారుడు సైతం ఆర్మీలో విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యారు. జాన్రత్నం మృతదేహాన్ని ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు ఎస్డీ ఖలీద్, భాస్కర్రావు, టి.షడ్రక్, డీకే ప్రసాద్, కె.శేషుబాబు, పట్టణ ప్రముఖులు పలువురు సందర్శించి నివాళులర్పించారు. -
● ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాలు ● పలు అంశాలపై చిన్నారులకు శిక్షణ ● ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు
నేర్పిస్తున్న అంశాలు.. శిబిరాలకు హాజరయ్యే చిన్నారులకు విద్యా శాఖ నిర్దేశించిన విధంగా పలు అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. 8 గంటలకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామంపై తర్ఫీదునిస్తున్నారు. అనంతరం అత్యధికంగా విద్యార్థులకు ఇష్టమైన క్రికెట్ ఆటతోపాటు వి ద్యార్థుల్లో విజ్ఞానం పెంచే చెస్, క్యా రమ్స్, వైకుంఠపాళి వంటి ఆటలపై శిక్షణ ఇస్తున్నారు. ఇంతేకాకుండా చిత్రలేఖనం, మట్టితో, కాగితాలతో బొమ్మల తయారీ, భరతనాట్యం, క్లాసికల్ డాన్స్, మార్షల్ ఆర్ట్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తూ మాల్గుడి కథలను చిన్నారులకు వినిపిస్తూ గ్రామీణ జీవన సౌందర్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంతేకాకుండా విద్యార్థుల చేత సైన్స్ ప్రయోగాలు చేయిస్తూ సైన్స్ పరికరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆసక్తిగా.. ఆలోచింపజేసివిగా.. శిబిరంలో ఆటపాటలతోపాటు విజ్ఞానం పెంచుకునేలా పలు అంశాలపై చిన్నారులకు శిక్షణ ఇస్తున్నా రు. యోగా, మెడిటేషన్ చేయిస్తూ వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. చెస్, క్యారమ్స్, వైకుంఠపాళి ఆటల్లో పోటీతత్వం అలవడేలా తర్ఫీదు ఇవ్వడం ఆకట్టుకుంటోంది. స్థానికంగా సేకరించిన మట్టి, కాగితాలతో బొమ్మలను తయారు చేయించి వారిలో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాన్ని వెలికితీస్తున్నారు. చివరగా పాఠ శాల ఆవరణలో చిన్నారుల చేత మొక్కలు నాటించి వాటి ఆలనపాలన ఎలా చూడాలో శిక్షణ ఇస్తున్నా రు. తద్వారా ఇంటి పరిసరాల్లో ఖాళీ స్థలాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. -
కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కొత్తగూడెంఅర్బన్/పాల్వంచరూరల్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి, పాల్వంచ మండలం రెడ్డిగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌరసరఫర శాఖ అధికారులతో కలిసి సందర్శించి, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. తాగునీరు, టెంట్, తూకపు, తేమ యంత్రాలు, గన్ని బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యంను కేటాయించిన మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అనంతరం అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అటవీ భూమి ఆక్రమణకు అడ్డుకట్ట
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం రేంజ్ పరిధి ములకలపల్లి రిజర్వ్ ఫారెస్ట్లోని పర్ణశాల సౌత్లోని 17 హెక్టార్ల అటవీ భూమిని గడ్డోరగట్ట గ్రామస్తులు ఆక్రమించడానికి యత్నించగా ఎఫ్డీఓ సుజాత ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం అడ్డుకున్నా రు. ఈ 17 హెక్టార్ల భూమిలో 2023–24లో అటవీశాఖ మారుజాతి మొక్కల ప్లాంటేషన్ చేసింది. ఆ భూమిలోకి గడ్డోరగట్ట గ్రామస్తులు చొరబడి మొక్కలను కాలుస్తుండగా గతంలోనే వారిపై కేసు నమో దు కాగా.. ప్రస్తుతం కేసు హైకోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 12న ప్లాంటేషన్ లోపలకి మళ్లీ అక్రమంగా ప్రవేశించి మొక్కలను నరికి పెద్ద చెట్లను కాలుస్తుండగా అటవీశాఖ సిబ్బంది అడ్డుకుని విషయాన్ని ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీఓ సూచించారు. మంగళవారం ప్లాంటేషన్లోకి గ్రామస్తులు రాగా అటవీశాఖ సిబ్బంది అడ్డుకున్నారు. ఎఫ్డీఓ మాట్లాడు తూ.. అటవీశాఖ ప్లాంటేషన్లోకి అక్రమంగా ప్రవేశించి చెట్ల నరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పీవీ కాలనీలో దొంగల బీభత్సం
మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో కార్మిక కుటుంబాలు నివసించే క్వార్టర్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకకాలంలో ఏడు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. కార్మిక కుటుంబాలు, పోలీసుల కథనం ప్రకారం.. ఎంసీ క్వార్టర్ 316లో నివసించే నాజర్పాషా బంధువుల ఇంటికి వెళ్లి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి బీరువాల్లో ఉన్న రూ.5 వేల నగదు, 10 తులాల వెండి అపహరించారు. దగ్గరలో ఉన్న మరో క్వార్టర్ 304లో కల్యాణపు రవికుమార్ 12న నైట్షిఫ్ట్ డ్యూటీకి వెళ్లి 13న వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి, బీరువాలోని ఆరు గ్రాముల బంగారం, రూ.10 వేల నగదు చోరీకిగురైంది. మరో మూడు చోట్ల దొంగతనానికి యత్నించగా, అక్కడ ఇంట్లో నగదు, బంగారం లేకపోవడంతో స్వల్ప నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మేడా ప్రసాద్ ఘటనా స్థలాలను సందర్శించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 3న రాత్రి సుందరయ్యనగర్లోని రెండు ఇళ్లల్లో, 12న రాత్రి మరో చోట చోరీ జరగడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇకనైనా పోలీసులు గస్తీని మరింత పెంచాలని కోరుతున్నారు. బంగారం, నగదు అపహరణ -
టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం
● రాష్ట్రంలో 57వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం ● ‘వికాసం’ ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలు ● బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మోసం చేసింది ● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క టేకులపల్లి : రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్రోడ్లో రూ.1.15 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్స్టేషన్ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కోయగూడెంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని, ఆత్మగౌరవంతో బతకొచ్చని ఆశించిన యువతను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన తాము సుమారు 57వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించామని తెలిపారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి సాధించేలా రూ.9వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. బయ్యారం చెరువు, తులారం ప్రాజెక్టు నీటి కోసం మహబూబాబాద్, ఇల్లెందు ఎమ్మెల్యేలు వినతిపత్రాలు ఇచ్చారని, సర్వే నిర్వహించి నీటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మాళోతు రాందాస్ నాయక్, ఎస్పీ రోహిత్రాజు, ఆర్డీఓ మధు, అదనపు కలెక్టర్ విద్యాచందన, విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్, ఈఈ వెంకటేశ్వర్లు, డీఈలు నందయ్య, రంగస్వామి, ఏడీఈలు యాసిన్, హేమచంద్రబాబు, ఏఈ లు పి.బుజ్జికన్నయ్య, దేవా, కె వేణు, రాజేష్, నాయకులు కోరం సురేందర్, మడత వెంకట్గౌడ్, ఏలూరి కోటేశ్వరరావు, భూక్య దేవా, బానోత్ సుజాత, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలి
ఇల్లెందు : బొగ్గు ఉత్పత్తిలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సింగరేణి సీఎండీ బలరామ్ సూచించారు. మంగళవారం ఆయన ఇల్లెందులో ఏరియాలోని పూసపల్లి ఓసీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక జీఎం కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. పూసపల్లి ఓసీ పనులు త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని అన్నారు. ప్రణాళికాయుతంగా పని చేస్తూ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు, కె.వెంకటేశ్వర్లు,ఎల్.సూర్యనారాయణ, ఏరియా జీఎం వీసం కృష్ణయ్య, అధికారులు రామస్వామి, కృష్ణమోహన్, మోహన్రావు, రవికుమార్ పాల్గొన్నారు. కాగా, పూసపల్లి ఓసీని త్వరగా ప్రారంభించాలని కోరుతూ గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి నజీర్అహ్మద్ ఆధ్వర్యంలో సీఎండీకి వినతిపత్రం అందజేశారు. సీనియర్ల సలహాలు పాటించాలిభద్రాచలంటౌన్: ఐటీడీఏ పరిధిలో హాస్టల్ సంక్షేమాధికారులుగా బాధ్యతలు చేపట్టిన వారు విధి నిర్వహణలో సీనియర్ల సలహాలు పాటిస్తూ పని చేయాలని పీఓ బి.రాహుల్ అన్నారు. ఎంపికై న అభ్యర్థులకు మంగళవారం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలని, బాలికలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ఎవరు సెలవులు పెట్టొద్దని, పిల్లల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ పాల్గొన్నారు. -
దరఖాస్తుల పరిశీలన వేగంగా సాగాలి
సూపర్బజార్(కొత్తగూడెం): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితాను రూపొందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వారీగా విభజించాలని అన్నారు. అర్హుల జాబితాలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరుపత్రాలు అందజేసేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లకు గాను మొదటి విడతలో మండలానికి ఒక గ్రామపంచాయతీని ఎంపిక చేశామని, మిగిలిన పంచాయతీల్లో అర్హుల జాబితా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ‘జల్ సంచయ్ జెన్ భాగీధారి’ పథకం కింద జిల్లాలో భారీగా ఇంకుడుగుంతల నిర్మాణం చేపడుతున్నామని, ఈ విషయంలో జిల్లా దేశంలోనే మొదటి స్థానానికి చేరువలో ఉందని వివరించారు. ప్రథమ స్థానం పొందిన జిల్లాకు రూ.2 కోట్ల బహుమానం వస్తుందని తెలిపారు. టీబీ బాధితులకు పోషకాహార కిట్లు జిల్లాలోని 1,030మంది టీబీ బాధితులకు గ్రా న్యూల్ ఇండియా లిమిటెడ్ ఔషధ సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ పాటిల్, సంస్థ ఈడీ చిగురుపాటి ఉమ చేతుల మీదుగా పోషకాహార కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ.. 2025 నాటికి టీబీనీ నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఈ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ మేనేజర్ అల్లం అవినాష్, డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మీ, పుల్లారెడ్డి, మధువరన్, హరీష్ పాల్గొన్నారు.అధికారులకు కలెక్టర్ ఆదేశం -
‘దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు’
భద్రాద్రి కొతగూడెం జిల్లా. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధి అవకాశాన్ని ఎంచుకొని ఎదగడానికి రాజీవ్ యువ వికాసం పథకం వరం లాంటిదన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. భద్రాద్రి కొతగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఈ మేరకు మాట్లాడారు. ‘పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎలాంటి భృతి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. తెలంగాణ రాష్ట్ర యువత నిరాశా నిసృహల్లో పది ఏండ్లు గడిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 52,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. మిగిలిన ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. నిరుద్యోగ యువత తలెత్తుకొనేలా రాజివ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చాం. భారతదేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదు. జూన్ రెండవ తేదీ కల్లా యువజన వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరు లెటర్లు అందజేస్తాం. అవగాహన లేని కొన్ని సోషల్ మీడియా సిబిల్ స్కోర్ విషయంలో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. సిబిల్ స్కోర్ కు రాజివ్ యువ వికాస్ పథకానికి ఎలాంటి సంబంధం లేదు’ అని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. -
నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ఉపాధ్యాయులకు ఈ నెల 13 నుంచి 30 తేదీ వరకు మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. సోమవారం శిక్షణ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని 4,159 మంది ఉపాధ్యాయులకు విడతకు ఐదు రోజుల చొప్పున జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన 48 మంది ఉపాధ్యాయులతో ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. శిక్షణకు వచ్చే ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించామని, అందరూ ఉదయం 9:30 గంటలలోపే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా హాజరు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ జిల్లా కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. సింగరేణి క్రికెట్ టోర్నీ విజేత బెల్లంపల్లిసింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని జయశంకర్ గ్రౌండ్లో మూడు రోజులపాటు జరిగిన సింగరేణి ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నీలో బెల్లంపల్లి రీజియన్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో కొత్తగూడెం జట్టుపై విజయం సాధించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణ రావు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళా విభాగంలో కొత్తగూడెం జట్టు విజేతగా నిలవగా, బెల్లంపల్లి టీమ్ రన్నర్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో జీఎంలు ఎం.శాలేంరాజు, మనోహర్తోపాటు కోటిరెడ్డి, పాలడుగు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు 25 శాతం రాయితీతో ఈనెల 31వరకు అవకాశం ఖమ్మంమయూరిసెంటర్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు పొడిగించింది. ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు ఈనెల 3తో ముగియగా.. మరోసారి పెంచుతూ ప్రభుత్వ కార్యదర్శి కె.ఇలంబర్తి పేరిట సోమవారం ప్రకటన విడుదలైంది. దీంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 25శాతం రాయితీ పొందేందుకు మరో అవకాశం లభించింది. తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల నుండి ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పౌర రక్షణ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి ఖమ్మం రాపర్తినగర్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన పౌర రక్షణ వలంటీర్లుగా నమోదుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నందున యువ త సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ యు వక కేంద్రం ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్.అన్వేష్ సూచించారు. అత్యవసర పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశమున్నందున యువత ముందుకు రావాలని సూచించారు. ప్రథమ చికిత్స, అత్యవసర సంరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు ప్రతిస్పందన, పునరావాస ప్రయత్నాల్లో తోడ్పాటులో యువతకు అవకాశం ఇవ్వున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వివరాల కోసం htpps// mybharat. gov. in లేదా 94913 83832 నంబర్లో సంప్రదించాలని డీడీ ఓ ప్రకటనలో సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలుఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కల్తి సమ్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గుండాల నుంచి బైక్పై ఇల్లెందుకు వస్తుండగా సమ్మయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురిపై కేసు నమోదుకరకగూడెం: తంబోలా ఆడుతున్న ఐదుగురిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండల కేంద్రంలో తంబోలా ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారయ్యారు. ఐదు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారిని కూడా పట్టుకుంటామని కరకగూడెం ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. -
నాలుగో తరగతి ఉద్యోగుల కమిటీ ఎన్నిక
సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కంభంపాటి రమణ(పాలిటెక్నిక్), సహ అధ్యక్షుడిగా ఓ హరిబాబు(ఐసీడీఎస్), ఉపాధ్యక్షులుగా జి చంద్రశేఖర్(డీసీఓ ఆఫీస్), ఈ నవీన్ (డీటీఓ ఆఫీస్), కార్యదర్శిగా కె.దినేష్ (ఏఎస్డబ్ల్యూఓ ఆఫీస్), సంయుక్త కార్యదర్శులుగా ధనలక్ష్మి(డీసీఓ ఆఫీస్), కృష్ణ(ఆర్అండ్బీ), కోశాధికారిగా వి.నరేందర్(ఇరిగేషన్), కార్యనిర్వాహక కార్యదర్శిగా వి సుధాకర్(డీపీఓ ఆఫీస్), ప్రచార కార్యదర్శిగా కె.వెంకటేష్(ఉద్యానశాఖ), ఆఫీస్ కార్యదర్శిగా డి.రాము(డీపీఆర్ఓ ఆఫీస్), కార్యవర్గ సభ్యులుగా సీహెచ్ కవిత (డీఎస్డీఓ ఆఫీస్), ఎస్.జయమ్మ(కొత్తగూడెం ఐటీఐ), విజయ(ల్యాండ్ సర్వే కార్యాలయం) ఎన్నికయ్యారు. సమావేశానికి కేంద్ర సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి ఖాదర్బిన్ హసన్, సహ అధ్యక్షుడు బి.రాజేందర్, కార్యదర్శి కె.కృష్ణవేణి, కోశాధికారి కె.ధన్రాజ్ హాజరయ్యారు. ఈ కమిటీ మూ డేళ్లపాటు కొనసాగుతుందని నాయకులు తెలిపా రు. అనంతరం అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ను కలిసి నూతన కమిటీ వివరాలను వివరించారు. -
అందరి చూపూ ఖమ్మం వైపే..
● ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేస్తున్న ముగ్గురు మంత్రులు ● ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి ● రూ.2.40 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం అశ్వారావుపేటరూరల్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారంతా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపే చూస్తున్నారని, ఇక్కడి ముగ్గురు మంత్రులు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అందుకు కారణమని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి అశ్వారావుపేట, దట్టమైన అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పర్యటించారు. తొలుత మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెంలో రూ. 1.32 కోట్లు, ఎమ్మెల్యే దత్తత గ్రామమైన చెన్నాపురంలో రూ.1.07 కోట్లతో నిర్మించిన 25 సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం కావడిగుండ్ల, చెన్నాపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా అభివృద్ధి చేయడమే తన అజెండా అని అన్నారు. నియోజకవర్గంలో రూ.97 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. త్వరలోనే దత్తత గ్రామాన్ని సోలార్ గ్రామంగా మార్చుతానని, ప్రణాళికలు రూపొందించాలని ఎంపీడీఓ, ఐకేపీ అధికారులకు సూచించారు. పిల్లలను విద్యకు దూరం చేయవద్దని, బడి మానేస్తే తిరిగి చేర్పించాలని లేని పక్షంలో మీ గ్రామంలో అభివృద్ధి నిలిపేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు వనం కృష్ణ ప్రసాద్, డాక్టర్ ప్రదీప్ కుమార్, ప్రవీణ్కుమార్, శ్రీధర్, అక్షిత, ప్రకాశ్, సీఐ నాగరాజు, ఎస్సై య యాతి రాజు, సొసైటీ చైర్మన్ సీహెచ్ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, తుమ్మా రాంబాబు, సుంకవల్లి వీరభద్రరావు, అల్లాడి రామారావు, మిండా హరి, నార్లపాటి దివాకర్, కర్నాటి శ్రీను పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలిబాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆది నారాయణ అన్నారు. సోమవారం అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకల్లో కేక్ కట్ చేసి పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సుల సేవలకు వెలకట్టలేమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, తుమ్మా రాంబాబు, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండ్ డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ విజయ్కుమార్, స్టాప్ నర్సు ప్రమీలరాణి, వీరాకుమారి, సుజాత, స్వరూప, సిబ్బంది పాల్గొన్నారు. -
గాయపడ్డ బాలుడికి చికిత్స
భద్రాచలంఅర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా డొంకరాయికి చెందిన బాలు డు సృజన్ రెడ్డికి భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 8న బైక్ ఆవును ఢీకొన్న ఘటనలో బాలుడు ఎడమ కన్ను పైభాగంలో తీవ్ర గాయాలయ్యా యి. దీంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకురాగా, డాక్టర్లు కుట్లు వేసి చికిత్స అంది స్తున్నారు. బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు సీజ్బూర్గంపాడు: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. కిన్నెరసాని నుంచి ఇసుక తరలిస్తుండగా సంజీవరెడ్డిపాలెం గ్రామం వద్ద పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ట్రాక్టర్ యజమానులపై, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వరకట్న వేధింపుల కేసు నమోదుపాల్వంచరూరల్: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్త, మామలపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన మోత్కూరి మాధవికి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల గ్రామానికి చెందిన రమణాచారితో 2014లో వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. కొంతకాలంగా భర్తతోపాటు అత్త అనసూర్య, మామ వెంకటేశ్వర్లు అదనపు కట్నం వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ధాన్యం దిగుమతిలో ఆలస్యం
ఇల్లెందు: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యంతో లారీలు మిల్లుల వద్దకు వస్తుండగా గోదాంల్లో స్థలం లేదని, సరిపడా హమాలీలు లేరంటూ దిగుమతిలో జాప్యం జరుగుతోంది. దీంతో రోజుల తరబడి ఆలస్యం జరుగుతుండగా తాము నష్టపోతున్నామని లారీల యజమానులు వాపోతున్నారు. ఇల్లెందు సుభాష్నగర్లోని ఓ బాయిల్డ్ రైస్ మిల్లు వద్ద సోమవారం 30 లారీల మేర నిలిచిపోయాయి. ఒకేసారి ఎక్కువ లారీలు రావడంతో తగినంత మంది హమాలీలు లేక దిగుమతిలో జాప్యం జరి గింది. అంతేకాక మిల్లుల్లో స్థలభావం మరో కారణంగా చెబుతున్నారు. అయితే, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్లో గోదాం ఉన్నా ఉన్నతాధికారుల అనుమతి లేనిదే అక్కడకు పంపించే పరిస్థితి లేదు. కాగా, లారీ ఒక రోజు ఆగితే సుమారు రూ.8వేల వరకు నష్టం వస్తోందని యజమానులు వాపోతున్నారు. అంతేకాకడ్రైవర్లు, క్లీనర్లు తిండి, నీటికి ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై ఇల్లెందు సివిల్ సప్లయీస్ డీటీ యాకూబ్ పాషాను వివరణ కోరగా.. ఇల్లెందు మిల్లులో స్థలం కొరత, ఇతర సమస్యలతో పాటు మార్కెట్ గోదాంను ఉపయోగించుకునే అంశాన్ని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మిల్లు ఎదుట లారీల బారులు -
ఇసుక నిల్వలకు అడ్డాగా గోదావరి వరదకట్ట
సమ్మెకు జాతీయ కార్మిక సంఘాల మద్దతుసింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 20న జరిగే సమ్మెకు అన్ని జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని అఖిల పక్ష నాయకులు పేర్కొన్నారు. సోమవారం రుద్రంపూర్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సీఐటీయూ, ఇఫ్టూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. చర్ల: గోదావరి కరకట్ట పైనుంచి సాగునీటి కోసం తాము పైపులు ఏర్పాటు చేసుకుంటే అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ఇప్పుడు నది నుంచిడీసిల్టింగ్ పేరిట లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తీస్తూ కరకట్టపై డంపింగ్ చేస్తుంటే చర్యలు తీసుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. మండలంలోని కుదునూరు సమీపానగోదావరి నదిలో ఇటీవల రెండు ఇసుకక్వారీలు ప్రాంభమయ్యాయి. ఒకటి సొసైటీక్వారీ కాగా మరొకటి డీసిల్టింగ్ పేరిటప్రారంభమైంది. ఈ క్వారీల నుంచి పెద్దఎత్తున ఇసుకను భారీ యంత్రాలతో తవ్వుతూఒడ్డుకు చేరుస్తున్నారు. నిల్వ చేయడానికిరైతుల భూములను లీజుకు తీసుకున్నా,గోదావరి వరద కట్టను కూడా యార్డుగామార్చుకుని వందలాది లారీల ఇసుకను నిల్వచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లక్రితం సీతమ్మసాగర్ వరద కరకట్ట పనులు చేపట్టిన సమయంలో కంటెపల్లి, కుదునూరుగ్రామాలకు చెందిన రైతులు గోదావరి నుంచిమోటార్ల ద్వారా పంటలకు నీటి కోసం కరకట్టపైనుంచి తాత్కాలికంగా ప్లాస్టిక్ పైపులు ఏర్పాటుచేస్తే అధికారులు అభ్యంతరం తెలిపారు. కానీ ఇప్పుడు ఇసుక డంప్పై పట్టించుకోకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ కొత్తగూడెం ఎస్ఈ శ్రీనివాసరెడ్డిని వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం -
అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు
● ఉమ్మడి జిల్లాలో 4,422 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం ● 50 శాతం మేర సబ్సిడీతో విక్రయం ● పీఏసీఎస్లు, ఆగ్రో రైతుసేవా కేంద్రాల ద్వారా అమ్మకం ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఖమ్మం ప్రాంతీయ కార్యాలయం నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో రైతులు దుక్కులు చేస్తున్నారు. ఈ నేపథ్యాన భూసారం పెంపునకు పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు చల్లి ఆపై కలియదున్నడం ఆనవాయితీ. ఈక్రమంలోనే వ్యవసాయ శాఖ జీలుగు, పిల్లి పెసర, జనుము తదితర పచ్చిరొట్ట పైర్ల పెంకానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు అనుగుణంగా విత్తనాభివృద్ది సంస్థ విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. వ్యవసాయ శాఖ ఇండెంట్ ఆధారంగా.. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖ నుంచి అందిన ఇండెంట్ ఆధారంగా పచ్చిరొట్ట విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సమకూరుస్తోంది. ఖమ్మం జిల్లాలో జీలుగు 14వేల క్వింటాళ్లు, జనుము 1,500 క్వింటాళ్లు, పిల్లిపెసర 150 క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో జీలుగు 5వేల క్వింటాళ్లు, జనుము 400 క్వింటాళ్లు, పిల్లి పెసర 50 క్వింటాళ్లకు కావాలని నివేదిక ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు జీలుగు 3,252 క్వింటాళ్లు, జనుము 1,170 క్వింటాళ్లు కలిపి 4,422 క్వింటాళ్ల విత్తనాలు తెప్పించారు. సబ్సిడీతో విక్రయాలు సహజసిద్ధమైన ఎరువు లభించేలా పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. విత్తనాలపై 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తోంది. కిలో రూ.142.75 ధర ఉన్న జీలుగు విత్తనాలను రూ.71.25కు, రూ.125.50 ధర ఉన్న జనుము విత్తనాలను రూ.62.75కు, రూ.205.50 ధర ఉన్న పిల్లి పెసర విత్తనాలను రూ.102.50కు విక్రయిస్తారు. ఖమ్మం జిల్లాలోని 75 పీఏసీఎస్లు, 13 ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, రెండు టీజీఎస్డీఎల్, ఒక ట్రేడర్తో పాటు భద్రాద్రి జిల్లాలో 20 పీఏసీఎస్లు, ఏడు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ఒక ట్రేడర్ ద్వారా విత్తనాలను విక్రయానికి ఏర్పాట్లు చేశారు. విత్తనాల బ్యాగ్ పరిమాణం, ధరలు విత్తనంబ్యాగ్ (కిలోల్లో) ధర (రూ.ల్లో) జీలుగు 30 2,137.50 జనుము 40 2,510.00 పిల్లి పెసర 20 2,055.00 విత్తనాలు సిద్ధం.. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఇచ్చిన ఇండెంట్ ఆధారంగా పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తెప్పిస్తున్నాం. ఇప్పటికే చేరకున్న జీలుగు, జనుము విత్తనాలను నిర్దేశిత కేంద్రాలకు పంపించాం. 50 శాతం సబ్సిడీపై విక్రయించేలా పర్యవేక్షించనున్నాం. – ఎన్ బిక్షం, విత్తనాభివృద్ధి సంస్థ ప్రాంతీయ మేనేజర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా -
సాగులో మెళకువలపై అవగాహన
వైరారూరల్: ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగామండలంలోని ఖానాపురం రైతు వేదికలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈసందర్బంగా వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ మాట్లాడుతు యూరియా వాడకం తగ్గింపు, తద్వారానేల ఆరోగ్య పరిరక్షణపై వివరించారు. అనంతరం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి.చైతన్య, వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ వివిధ అంశాలపై మాట్లాడారు.ఏఓ మయాన్ మంజుఖాన్, తల్లాడ వెటర్నరీ వైద్యులు అనాస్, విత్తన అభివృద్ధి అధికారి అక్షిత, ఏఈఓలు సపావత్ సైదులు, ఆలూరి వాసంతి, వెంపటి కీర్తి, మేడా రాజేష్, పరిటాల వెంకటనర్సయ్యతో పాటు నల్లమల వెంకటేశ్వరరావు, షేక్ రఫీ, షేక్ లాల్ మహ్మద్, తుమ్మల రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.