స్వర్ణోత్సవాల లోగో ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

స్వర్ణోత్సవాల లోగో ఆవిష్కరణ

May 15 2025 12:07 AM | Updated on May 15 2025 12:07 AM

స్వర్ణోత్సవాల లోగో ఆవిష్కరణ

స్వర్ణోత్సవాల లోగో ఆవిష్కరణ

సింగరేణి(కొత్తగూడెం) : మందమర్రి ఏరియాలో సింగరేణి పాఠశాల ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో స్వర్ణోత్సవాల లోగోను సీఎండీ ఎన్‌. బలరామ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందమర్రిలో 1975లో పాఠశాల ఏర్పాటు చేశామని, ఈజూన్‌తో 50 ఏళ్లు పూర్తవుతుందని తెలిపారు. ఈ పాఠశాలలో సంవత్సరానికి 300 మంది చొప్పున విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని బయటకి వెళ్తున్నారని, వారంతా నేడు వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్‌.వి. సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఎడ్యుకేషన్‌ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement