
డీఎస్పీ సేవలకు గుర్తింపు
కొత్తగూడెంఅర్బన్: పొక్సో కేసులో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కేసుల పరిష్కారానికి కృషి చేసిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్కు గుర్తింపు లభించింది. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్కు ప్రశంసాపత్రం లభించగా.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో గురువారం డీఎస్పీని అభినందించారు.