
బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ పరిశీలన
గనిని సందర్శించిన
అటవీ శాఖ ఉన్నతాధికారులు
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, గనుల్లో ఉపయోగిస్తున్న కంటిన్యూస్ మైనర్, ఎల్హెచ్డీ యంత్రాల పనితీరును అటవీ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. కొత్తగూడెంలోని పీవీకే –5 ఇంక్లెయిన్ గనిని గురువారం వారు సందర్శించారు. ఏరియాకు వచ్చిన అధికారుల బృందానికి జీఎం ఎం.శాలేంరాజు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం గని అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన వివరాలు, యంత్రాల పనితీరును తెలియజేశారు. ఆ తర్వాత అధికారులు మ్యాన్రైడింగ్ ద్వారా గనిలోకి దిగి పంపింగ్ స్టేషన్, సబ్స్టేషన్ ప్రాంతాలను వీక్షించారు. అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సెంట్రల్) డాక్టర్ వి.ఆర్.జెన్సర్ ఆధ్వర్యంలో డాక్టర్ త్రినాథ్కుమార్, సీసీఎఫ్ డి.భీమానాయక్, ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, కొత్తగూడెం డివిజనల్ అటవీ అధికారి కోటేశ్వరరావు తదితరులు పర్యటించారు.