breaking news
china
-
భారత్కు ‘బంగ్లా’ దౌత్య ద్రోహం.. పాక్, చైనాలతో జతకట్టి..
న్యూఢిల్లీ: పాకిస్తాన్-చైనా నేతృత్వంలోని కొత్త ప్రాంతీయ కూటమిలో చేరేందుకు బంగ్లాదేశ్ అమితమైన ఆసక్తి చూపిస్తున్నదనే వార్తలు ఇటీవలి కాలంలో విరివిగా వినిపిస్తున్నాయి. ఇది దక్షిణాసియాలో కీలక వ్యూహాత్మక మార్పును సూచిస్తున్నది. భారతదేశం లేకుండా, పాకిస్తాన్తో కలిసి ప్రాంతీయ కూటమిలో చేరడం బంగ్లాదేశ్కు వ్యూహాత్మకంగా సాధ్యమే అని బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఢాకా, బీజింగ్, ఇస్లామాబాద్లతో కూడిన కొత్త త్రైపాక్షిక సమూహంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సూచన చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది.యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారధ్యంలో..2024ఆగస్టులో షేక్ హసీనా పదవీచ్యుతి అనంతరం పాకిస్తాన్-బంగ్లాదేశ్ సంబంధాలు వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాల రంగాలలో విస్తరిస్తూ వస్తున్నాయి. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారధ్యంలో ఈ రెండు దేశాల మధ్య సహకారం పెరుగుతోంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం.. న్యూఢిల్లీ, బీజింగ్, వాషింగ్టన్లను నొప్పించకుండా సమతుల్య సంబంధాలను చాకచక్యంగా కొనసాగించింది. నాడు భారతదేశం ఒక కీలక భాగస్వామిగా ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితులలో ఢాకా.. ఇస్లామాబాద్, బీజింగ్ వైపు మొగ్గు చూపుతూ, భారత్తో సమతుల్య భాగస్వామ్యాన్ని కోల్పోయింది.చైనాలోని కున్మింగ్లో మంతనాలుఈ ప్రాంతీయ కూటమి చర్చలు గత ఏడాది నుండి వేగం అందుకున్నాయి. గత జూన్లో చైనా, బంగ్లాదేశ్,పాకిస్తాన్లు చైనాలోని కున్మింగ్లో తమ మొదటి అధికారిక త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, మౌలిక సదుపాయాలు , రుణ నిర్వహణలో సహకారాన్ని పెంపొందించేందుకు మూడు పక్షాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. మరోవైపు పాకిస్తాన్ తాజాగా భారతదేశాన్ని మినహాయించి, చైనాను భాగస్వామిగా చేర్చుకుంటూ, విస్తృతమైన దక్షిణాసియా కూటమిని ప్రతిపాదిస్తున్నది. ఈ నేపధ్యంలో ఇస్లామాబాద్- బీజింగ్ మధ్య ఈ అంశంపై చర్చలు జరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.‘త్రైపాక్షిక సంబంధం’తో కొత్త చిక్కులు?భారతదేశం కీలక సభ్యురాలిగా ఉన్న సార్క్ (SAARC) స్థానంలో కొత్త ప్రాంతీయ కూటమిని సృష్టించేందుకు పాకిస్తాన్- చైనాలు పనిచేస్తున్నాయనే వార్తలు కూడా కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యూహాత్మక కూటమి ఏర్పాటు దక్షిణాసియాలో చైనాకు పెరుగుతున్న ఆధిపత్యాన్ని స్పష్టంగా సూచిస్తున్నది. భారతదేశాన్ని మినహాయించి, చైనాను భాగస్వామిగా చేర్చుకుంటూ పాకిస్తాన్ ప్రతిపాదిస్తున్న ఈ కూటమి, కొత్త భౌగోళిక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.ఈ అభివృద్ధి చెందుతున్న త్రైపాక్షిక సంబంధం (బంగ్లాదేశ్-చైనా-పాకిస్తాన్) ప్రాంతీయ దౌత్యానికి, భవిష్యత్తులో దక్షిణాసియా కూటమికి చిక్కులను తీసుకువచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: Tamil Nadu: విజయ్-రంగస్వామి మెగా ప్లాన్.. -
‘సోషల్’స్వరాలు మూగబోయిన దేశాలు
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు.. జీవితంలో ఒక అంతర్భాగం. Facebook, Instagram, YouTube, X (గతంలో Twitter) తదితర ప్లాట్ఫారమ్లు కుటుంబ సభ్యుల ఫోటోలను పంచుకోవడం మొదలు.. సామాజిక ఉద్యమాలను నిర్వహించడం వరకు నెరవేరుస్తూ.. ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల పౌరులకు ఈ డిజిటల్ స్వేచ్ఛ అందుబాటులో లేదు. పలు దేశాలు జాతీయ భద్రత, నైతికత తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, సామాజిక నెట్వర్క్లపై కఠినమైన నిబంధనలను విధించడం లేదా పూర్తి నిషేధాలను కొనసాగించడం చేస్తున్నాయి. ఏఏ దేశాలు ఈ తరహా వైఖరిని కలిగివున్నాయి? ఎటువంటి చర్యలు చేపట్టాయనే వివరాల్లోకి వెళితే..చైనాలో ‘గ్రేట్ ఫైర్వాల్’ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఇంటర్నెట్ నియంత్రణలను అమలు చేస్తున్న దేశం చైనా. ‘గ్రేట్ ఫైర్వాల్’ విధానంతో Facebook, X, Instagram, YouTube వంటి ప్రధాన అంతర్జాతీయ ప్లాట్ఫారమ్లను చైనా పూర్తిగా బ్లాక్ చేసింది. దేశీయ ప్రత్యామ్నాయాలు (WeChat, Weibo వంటివి) ఉన్నప్పటికీ, అవి ప్రభుత్వ పర్యవేక్షణ, సెన్సార్షిప్కు లోబడి ఉంటాయి. జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వం పేరుతో ఈ ఆంక్షలను విధిస్తోంది. ఫైర్వాల్ను దాటేందుకు వీపీఎన్లను వాడటం సాంకేతికంగా చట్టవిరుద్ధం. ఫలితంగా జరిమానాలు లేదా నిర్బంధంలాంటి శిక్షలు ఉంటాయి.ఉత్తర కొరియా.. బాహ్య కమ్యూనికేషన్కు దూరం ప్రపంచ ఇంటర్నెట్ యాక్సెస్పై ఉత్తర కొరియా పూర్తి నిషేధం విధించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఏవీ ఈ దేశంలో అందుబాటులో లేవు. పౌరులకు విదేశీ వార్తలు లేదా బాహ్య కమ్యూనికేషన్కు ఎలాంటి యాక్సెస్ ఉండదు. దేశీయ కమ్యూనికేషన్ కోసం ప్రభుత్వం ఆమోదించిన కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వీటిలో కఠినంగా నియంత్రించిన ఇంటర్నెట్ను మాత్రమే ఉపయోగిస్తారు. బాహ్య ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేసే స్థానికులకు కఠిన శిక్షలు ఉంటాయి.ఇరాన్.. కానరాని అంతర్జాతీయ సోషల్ మీడియాఇరాన్ దేశం పలు అంతర్జాతీయ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది. Facebook, YouTube, X వంటివాటికి చాలా పరిమితమైన యాక్సెస్ ఉంటుంది. 2022 సామూహిక నిరసనల తర్వాత Instagramను కూడా నిషేధించారు. టెలిగ్రామ్, వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్లపై తరచూ నిబంధనలను విధిస్తుంటారు. ప్రజా నైతికత, జాతీయ భద్రత, నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించేందుకు ఈ ఆంక్షలు అవసరమని ప్రభుత్వం తెలిపింది. అయితే బ్లాక్ చేసిన ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేసేందుకు ఇరానియన్లు వీపీఎన్లపై ఆధాపడుతుంటారు. అటువంటి సందర్భాల్లో వారికి ప్రభుత్వం జరిమానాలు వడ్డిస్తుంటుంది. వీపీఎన్ అంటే ‘వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్’. దీని ద్వారా ఇంటర్నెట్ను రహస్యంగా వినియోగిస్తుంటారు.తుర్క్మెనిస్తాన్.. నిత్యం పర్యవేక్షణ తుర్క్మెనిస్తాన్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ యాక్సెస్కు అనేక పరిమితులున్నాయి. Facebook, వాట్సాప్, X వంటి ప్లాట్ఫారమ్లను తరచూ బ్లాక్ చేస్తుంటారు. అలాగే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రొవైడర్ల ద్వారా ఫిల్టరింగ్తో పర్యవేక్షిస్తుంటారు. వీపీఎన్ల ద్వారా బ్లాక్ చేసిన ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేయడం సర్వసాధారణం అయినప్పటికీ, ఇది జరిమానాలకు దారితీసే అవకాశం ఉంది.ఆఫ్ఘనిస్తాన్.. ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు పెరిగాయి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిత్యం నిఘా ఉంటుంది. కొన్ని ప్రావిన్సులలో అధికారులు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. నైతిక లేదా మతపరమైన పాలనా నియమాలకు విరుద్ధమైన కంటెంట్పై పూర్తి నిషేధం అమలులో ఉంది.టర్కీ.. జాతీయ విలువల కోసం.. దేశంలో రాజకీయ అశాంతి, నిరసనలు, భద్రతా సంక్షోభాల సమయంలో టర్కీ.. సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం విధిస్తుంటుంది. ఉగ్రవాద దాడులు, రాజకీయ ప్రదర్శనల సమయంలో వాట్సాప్, యూట్యూబ్, ‘ఎక్స్’ లాంటి ప్లాట్ఫారమ్లను కొన్ని రోజుల పాటు బ్లాక్ చేశారు. భద్రత, తప్పుడు సమాచారం నివారణ లేదా జాతీయ విలువలను కాపాడేందుకు ఇలా చేశామని అధికారులు తెలిపారు. టర్కీ చట్టాల ప్రకారం ఈ ప్లాట్ఫారమ్లు దేశంలో తమ ప్రతినిధులను నియమించాలి. స్థానికంగానే డేటాను నిల్వ చేయాల్సి ఉంటుంది.మయన్మార్.. తిరుగుబాటు తర్వాత.. 2021 ప్రారంభంలో జరిగిన తిరుగుబాటు తరువాత, మయన్మార్ సైనిక పాలన నిరసనలు లేదా అశాంతియుత కాలంలో సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లపై (ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మొదలైనవి) నిషేధం విధించింది. ఈ నిషేధం.. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకేనని ప్రభుత్వం తెలిపింది. రష్యా.. వీడియో కాలింగ్పై నిషేధంరష్యాలో సోషల్ మీడియాపై నిషేధాలు తక్కువే అయినప్పటికీ, పలు పరిమితులు ఉన్నాయి. చట్ట అమలుకు సహకరించడం లేదనే ఆరోపణలతో WhatsApp, టెలిగ్రామ్ వంటి విదేశీ మెసేజింగ్ యాప్లలోని వాయిస్ లేదా వీడియో కాలింగ్ ఫీచర్లు పరిమితం చేశారు. ఆయా ప్లాట్ఫారాలు స్థానిక కార్యాలయాలను తెరవాలని, తీవ్రవాద కంటెంట్ను నియంత్రించాలని రష్యా డిమాండ్ చేస్తున్నది.నేపాల్.. పునరాలోచనసోషల్ మీడియా కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో విఫలం కావడంతో Facebook, Instagram, YouTube, ‘ఎక్స్’ తో సహా 26 ప్రధాన ప్లాట్ఫారమ్లపై నిషేధాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం నిరసనలకు దారితీసింది. దీంతో ఈ నిషేధాన్ని కొద్ది రోజుల్లోనే ఎత్తివేశారు. అయితే ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తున్నదని సమాచారం.ఇది కూడా చదవండి: వణికిస్తున్న సూపర్ఫ్లూ.. రికార్డు స్థాయి కేసులు -
అమెరికా టారిఫ్స్: చరిత్ర సృష్టించిన చైనా..!
అమెరికా టారిఫ్లు చైనా వాణిజ్య జైత్రయాత్రకు బ్రేకులు వేయలేకపోయాయి. ప్రపంచ దేశాలతో వాణిజ్యం ఎలా చేయాలో తనను చూసి నేర్చుకోండన్నట్టుగా.. డ్రాగన్ వాణిజ్య మిగులును అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.90 లక్షల కోట్లు) వాణిజ్య మిగులును సాధించిన తొలి దేశంగా చైనా చరిత్రను సృష్టించింది.ఈ ఏడాది చైనా 3.6 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, ఇదే సమయంలో 2.6 ట్రిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. 2010లో ప్రపంచ దేశాలతో చైనా వాణిజ్య మిగులు 0.18 ట్రిలియన్ డాలర్లుగానే ఉంది. 2015 నాటికి 0.59 ట్రిలియన్ డాలర్లు, 2025 నాటికి 1.08 ట్రిలియన్ డాలర్లకు పెంచుకోవడం ద్వారా తయారీలో సూపర్ పవర్గా కొనసాగుతోంది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగానే చైనాపై టారిఫ్లు బాదేయడం తెలిసిందే. ఈ టారిఫ్ల కారణంగా అమెరికాకు చైనా వస్తు ఎగుమతులు నవంబర్లో 29 శాతం పడిపోయాయి. వరుసగా ఎనిమిదో నెల చైనా నుంచి యూఎస్కు ఎగుమతులు క్షీణతను చూశాయి. అమెరికా బెదిరింపులకు డ్రాగన్ ఏమాత్రం బెదరలేదు. సరికదా తన వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకోవడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. -
130 అడుగుల కొండ, వయ్యారంగా సెల్ఫీ..కట్ చేస్తే
పర్యాటక ప్రదేశానికి వెళ్లినపుడు, అక్కడి ప్రకృతిని ఆస్వాదించడం కంటే, సెల్పీ తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం పైనే దృష్టి. ప్రాణాలకు తెగించి మరీ సెల్ఫీ తీసుకునేటపుడు పొంచి ఉన్న ప్రమాదాలపై ఎన్నిమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ ఈ ధోరణి మాత్రం మారణం లేదు. అత్యంత ప్రమాదకరమైన 130 అడుగులు కొండపై నుంచి నడుస్తున్నపుడు సెల్ఫీ తీసుకుంటూ జారీ పడ్డాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.ది సన్ కథనం ప్రకారం, చైనాలోని గ్వాంగ్'ఆన్లోని హువాయింగ్ పర్వతంపై ఈ సంఘటన జరిగింది. బ్లేడ్ రాక్ అనే పర్యాటక ప్రదేశంలోని 130 అడుగుల కొండ శిఖరం వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారి పడిన పర్యాటకుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్గా మారింది. దీని ప్రకారం అతను ఫోన్ పట్టుకుని కొండ అంచున నడుస్తున్నాడు. రాళ్లపై తన అడుగులు ఎక్కడ పడుతున్నాయో చూసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. సెల్పీ కోసం ఇటు తిరిగాడు. అంతే క్షణాల్లో, అతని పాదాల కింద ఉన్న రాయి జరిగిరి, అదుపు తప్పి, ఠక్కున జారిపడ్డాడు. అలా కింద ఉన్న చెట్ల పొదలలోకి పడిపోయాడు.ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్ఇది చూసి తోటి హైకర్లు దెబ్బకి షాక్అయ్యారు. కేకలు పెడుతూ కొండ అంచున పరుగులుపెట్టారు. కానీ పడిపోయిన వ్యక్తి దాదాపు 15 మీటర్ల ఎత్తులో ఉన్న అడవిలో పడిపోయాడు. ఆ భయంకరమైన జలపాతం నుండి తీవ్రమైన గాయాలు లేకుండా , ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.⚠️ Important Video shows the terrifying moment as a tourist, in China, plunges off a 130ft high cliff while taking a selfie pic.twitter.com/0chRYp0Ban— Open News© (@OpenNewNews) December 8, 2025 ఆ దేవతలే కాపాడారు ఈ విషయాన్ని సదరు పర్యాటకుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ WeChatలో పోస్ట్ చేశాడు. చచ్చిపోతాననే అనుకున్నా.. కానీ ఆ పర్వత దేవతలే నన్ను ఆశీర్వదించారు. చాలా అదృష్టవంతుడిని. 40 మీటర్ల ఎత్తైన కొండపై నుండి పడి దాదాపు 15 మీటర్లు వాలుపైకి దొర్లాను అని రాసుకొచ్చాడు. మరోవైపు ప్రమాదం జరిగిందని చెబుతున్న బ్లేడ్ రాక్ ర్యాటక ప్రదేశం సుందరమైన ప్రాంతం , సరిహద్దుల్లో లేదు. వారు ఈ ప్రాంతాన్ని "దూరం నుండి మాత్రమే వీక్షించడానికి అనుమతి ఉంది , ఎక్కడానికి అనుమతి లేదు అని చెప్పారు అధికారులు. హైకింగ్ చేస్తున్నప్పుడు నిబంధనలను పాటించాలని, ఇలాంటి ప్రమాదకరమైన ప్రాంతాలలోకి ప్రవేశించకూడదని సందర్శకులకు గుర్తు చేశారు.ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు -
ఆ విపత్తు ముడివేసిన వైవాహిక బంధం..!
కొన్ని వివాహాలు విధి ఆడిన వింత నాటకంలా ఉంటాయి. డెస్టినీ అంటారే అలా..ఒకరితో మనకు రాసిపెట్టి ఉంటే..ఎలాగైనా..ఎన్నేళ్లైనా..మళ్లీ ఒక్కచోటుకి చేర్చి కలిపేస్తుంది.అందుకు నిదర్శనం ఈజంట. బహుశా వీళ్లిద్దరిని విధి ముడివేసిన జంట అనొచ్చేమో. కాదు కాదు.. విపత్తు ముడివేసిన జంట అనాలేమో..!.అసలేం జరిగిందంటే..నవంబర్ 29న హునాన్ ప్రావిన్స్లో ఐదవ వార్షిక హాన్ శైలి సామూహిక వివాహ వేడుక సందర్భంగా 37 జంటలు వైవాహిక బంధంతో ఒక్కటికానున్నాయి. ఆ నేపథ్యంలో ఓ జంట కథ వెలుగులోకి వచ్చింది. లియాంగ్ జిబిన్, లియు జిమెయ్ అనే జంట 15 ఏళ్లక్రితం అసాధారణ పరిస్థితుల్లో ప్రారంభమైన తమ లవ్స్టోరీని పంచుకున్నారు. రెండు జీవితాలను మార్చిన రక్షణ బాధ్యత..2008లో వెంచువాన్లో భూకంపం సంభవించినప్పుడు 22 ఏళ్ల లియాంగ్ అత్యవసర సహాయక చర్యల కోసం సైనికుడిగా పనిచేస్తున్నాడు. అప్పటికి పది సంవత్సరాల వయసున్న లియు, ఒక కూలిపోయిన భవనం రెండొవ అంతస్తులో ఉక్కు కడ్డీలు, ఇటుకల కింద చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ ఉంది. అది చూసిన లియాంగ్ అతడి బృందం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను కాపాడారు. ఆ తర్వాత చికిత్స కోసం తక్షణమే ఆస్ప్రతికి తరలించారు. అయితే ఆ చిన్నారి కోలుకున్నాక తన తల్లిదండ్రులతో కలిసి హునాన్లోని జుజౌకు వెళ్లిపోయారు. అయితే తనను కాపాడిని సైనికుడి గురించి ఏదో స్పల్ప జ్ఞాపకమే ఉందామెకు. అదీగాక ఆ ఘటన జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతగా ఆ సైనికుడి ముఖం అంతగా గుర్తులేదామెకు. అయితే 2020లో 22 ఏళ్ల లియు చాంగ్షాలో తన తల్లిదండ్రులతో భోజనం చేస్తున్నప్పుడు ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాళ్ల టేబుల్కి సమీపంలోని మరో టేబుల్ వద్ద కూర్చొన్న వ్యక్తిని చూసి లియు తల్లి గుర్తుపట్టి పలకరించింది. "మీరు మా బిడ్డ లియుని కాపాడిన బ్రదర్ లియాంగ్ మీరేనా అని అడుగుతుంది. పదేళ్ల వయసులో ఆ అమ్మాయి కాస్తా చాలా మారిపోవడంతో గుర్తుపట్టలేక ఇబ్బందిపడతాడు లియాంగ్. ఆ ఘటన గుర్తుంది కానీ ఆ చిన్నారి రూపు రేఖలు చాలా మారిపోవడంతో పోల్చుకోలేకపోతున్నానని చెబుతాడు లియు తల్లితో". అప్పటి నుంచి లియు ఆ సైనికుడు లియాంగ్తో క్రమంతప్పకుండా మాట్లాడుతూ ఉండేది. ఆమె భావల లోతుని అర్థం చేసుకుంటాడు లియాంగ్. అంతేగాదు లియుకి కూడా అతడి దృఢత్వం, విధేయత ఎంతగానో నచ్చుతాయి. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.లియుని తన జీవితంలోని ఆశాకిరణంగా భావిస్తాడు లియాంగ్. తాను నిరుత్సాహంగా ఉన్నప్పుడల్లా లియు సానుకూలత తనను పైకి లేపుతుందని ప్రగాఢంగా విశ్వసించడమే కాదు జీవితంటే ఆశతో నిండి ఉందని గుర్తు చేస్తుంటాదామె అని భావోద్వేగంగ చెబుతున్నాడు లియాంగ్ విధి ముడివేసిన బంధం..తమ జర్నీ గురించి చెబుతూ..విధి చాలా అద్భుతమైనది. పన్నేడేళ్ల క్రితం ఆమెను రక్షించాను. పన్నేండేళ్ల తర్వాత ఆమె నా జీవితంలోకి వచ్చింది. భలే చిత్రంగా ఉంది తలుచుకుంటుంటే అని నవ్వుతూ చెబుతున్నాడు లియాంగ్.(చదవండి: ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్..! అంత ఖరీదా..?) -
ఆ విషయంలో చైనా స్పష్టతనివ్వాలి
ఇటీవల చైనా షాంగై ఎయిర్ పోర్టులో ఇండియాకు చెందిన ఓ మహిళను చైనా అధికారులు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఆ విషయంపై చైనాను వివరణ కోరింది. భారతీయులు చైనా దేశం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని తెలిపింది. ఈ మేరకు డ్రాగన్ దేశం నమ్మకం కలిగేలా హామీ ఇవ్వాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తరచుగా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటుంది. ఆ ప్రాంతం చైనాదేనని చెప్పడం అంతేకాకుండా ఆదేశ మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్ భాగంగా చూపడంతో తరచుగా ఈ అంశంలో ఇరు దేశాలకు ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఓ మహిళ యూకే నుండి జపాన్ ప్రయాణిస్తుండగా మార్గం మద్యలో షాంఘై విమానాశ్రయంలో ఆగింది. ఆసమయంలో అక్కడి ప్రభుత్వాలు ఆమె అరుణాచల్ ప్రదేశ కు మహిళ అని తెలిసి తనను వేధించారని తెలిపింది. అంతే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనాలో భాగం అన్నారని పేర్కొంది. ఈ ఘటనను భారత్ ఆసమయంలోనే ఖండించింది.తాజాగా భారత్ చైనాను ఒక వివరణ కోరింది. భారత విదేశాంగ కార్యదర్శ రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ " భారతీయులు చైనా మీదుగా వెళ్లేటప్పుడు వారినే టార్గెట్ గా చేసుకొని ఇబ్బందులు పెట్టమని చైనా తెలపాలి. ఆ మేరకు నమ్మకం కలిగేలా అధికారులు ప్రకటన చేయాలి. ఇష్టానుసారంగా వ్యవహరించకుండా అంతర్జాతీయ ప్రయాణ చట్టాలను గౌరవించాలి. చైనా మీదుగా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు భారతీయులు జాగ్రత్తగా ఉండాలి" అని రణధీర్ జైశ్వాల్ తెలిపారు.అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని ఇది వరకే చాలా సార్లు భారత్ చెప్పింది. దాని గురించి మరోసారి మాట్లాడదలుచుకోలేదని రణధీర్ జైశ్వాల్ అన్నారు. అయితే ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని సహృద్భావ వాతరణంలో ఇరు దేశాల మైత్రి సాగుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. -
చైనానే ఆదర్శం 3 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తాం.. స్ట్రాటజీ బయటపెట్టిన రేవంత్ రెడ్డి
-
భారత్, చైనాలు మా సన్నిహిత మిత్రులు
బీజింగ్: భారత్, చైనాలు తమకు సన్నిహిత మిత్రదేశాలంటూనే ఆ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు తమకు లేదన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలను చైనా మీడియా ప్రముఖంగా ప్రచురించింది. పుతిన్ భారత్ పర్యటనకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వని చైనా ఈ విషయాన్ని మాత్రం హైలైట్ చేసుకుంది. రష్యాకు ఇటీవలి కాలంలో బాగా దగ్గరైన చైనా భారత్లో పుతిన్ పర్యటనపై అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ‘భారత్, చైనా రెండు కూడా మాకు సన్నిహిత మిత్రులే. ఆ సంబంధాన్ని మేము ఎంతగానో గౌరవిస్తాం.ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు మాకుందని నేను భావించడం లేదు’అని పుతిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్, చైనా నేతలు తమ మధ్య ఉన్న అత్యంత సున్నితమైనవి సహా అన్ని విభేదాలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉన్నారు. వీటిపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరేలా ఇద్దరు నేతలు ప్రయతి్నస్తారని నమ్మకం ఉంది. అదే సమయంలో, ఆ సమస్యలు రెండు దేశాలకు సంబంధించినవి అయినందున రష్యాకు కలుగజేసుకునే హక్కు లేదు’అని ఆయన చెప్పిన విషయాన్ని చైనా మీడియా ప్రస్తావించింది. రష్యాతో సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగా ఉన్న చైనా.. భారత్, రష్యాలు దగ్గరవడంపై మాత్రం అసహనంతో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.చైనాతో సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేసుకుంటూనే, భారత్తోనూ ఎప్పటిలాగానే మైత్రిని కొనసాగించారు పుతిన్. 2020లో లద్దాఖ్లో ఉద్రిక్తతల సమయంలోనూ ఇదే విధమైన బ్యాలెన్స్ను పుతిన్ కొనసాగించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. దీంతోపాటు, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ట్రంప్ ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడులపై పుతిన్ చేసిన వ్యాఖ్యలను కూడా చైనా మీడియా ప్రస్తావించింది. తమ నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అమెరికాకు, భారత్ చమురు కొనడంపై ఎందుకు అభ్యంతరమని పుతిన్ ప్రశ్నించారని కూడా తెలిపింది. ప్రస్తావించాల్సిన అంశమేమంటే..భారత్లో పర్యటనకు కొద్దిరోజుల ముందే చైనా, రష్యాలు ఆసియా పసిఫిక్తోపాటు పొరుగుదేశాల్లో భద్రతా పరమైన ప్రయోజనాలే లక్ష్యంగా వ్యూహాత్మక చర్చలు జరపడం..! -
వీల్పవర్ యాంకర్
కొన్ని విజయగాథలు ఎలా ఉంటాయంటే చక్రవర్తుల గెలుపులు కూడా దాని ముందు వెలవెలబోతాయి. చైనా అమ్మాయి లియాంగ్ యీ జీవితం వీల్చైర్కే పరిమితం. అయినా సరే రెండు చక్రాలు కదిలితేనే తన జీవితం కదిలేలా ఉండకూడదు అనుకుంది. ప్రయత్నించింది. పోరాడింది. నేను నాలానే ఉంటూ యాంకర్ అవగలను అని నమ్మి ప్రపంచాన్ని ఒప్పించింది. చైనా మొదటి వీల్చైర్ యాంకర్ లియాంగ్ స్ఫూర్తి గాథ నేడు ప్రత్యేకం.పట్టు పట్టనేకూడదు. పడితే విడవనూ కూడదు. అంతరాయాల అడ్డుగోడలను బద్దలుకొట్టి ముందుకు సాగడమే పని. లియాంగ్ను చూడండి. తను టీవీలో యాంకర్గా పని చేయాలనుకుంది. యాంకరే అయింది. అయితే ఆమెను విధి వీల్చైర్కు పరిమితం చేసింది. అయినా సరే మళ్లీ యాంకరే అయ్యింది. కాకపోతే ఈసారి వీల్చైర్ యాంకర్. గ్లామర్ రంగంలో వీల్చైర్తో ముందుకు వచ్చి స్క్రీన్ మీద కనపడి ఒప్పించడానికి చాలా స్థయిర్యం ఉండాలి. ఆ స్థయిర్యంతోనే చైనాలో ఫస్ట్ వీల్చైర్ యాంకర్గా గౌరవం పొందుతోంది లియాంగ్.ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే..చైనాలోని హునాన్లో జన్మించిన లియాంగ్కు ఒకటే కోరిక. టీవీ వ్యాఖ్యాతగా మారాలి అని. ఆ విధంగానే చదువు పూర్తి చేసి చైనాలో ప్రసిద్ధి చెందిన ‘హ్యూమన్ టీవీ’లో యాంకర్గా ఉద్యోగం సంపాదించుకుంది. చలాకీతనం, చక్కని చిరునవ్వు కలగలిసిన ఆమె యాంకరింగ్ అందర్నీ ఆకట్టుకుని ఈ రంగంలో ఆమె రాణిస్తుందని భావించేలా చేసింది. కానీ నాలుగు నెలల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఓ ్రపోగ్రామ్కి సిద్ధమవుతున్న సమయంలో స్టేజీ వెనుక ఆమె స్పృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆమె వెన్నెముకలో సమస్య కారణంగా నాడీవ్యవస్థ దెబ్బతిని పక్షవాతం సోకినట్లు వైద్యులు వివరించారు. దీంతో లియాంగ్ ఆశల ప్రపంచం కుప్పకూలిపోయింది. భవిష్యత్తు అంధకారంగా మారింది.ఆసుపత్రిలో చూపిన ఆదరణతో..అప్పటికి లియాంగ్ వయసు 21. జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితం కావాలన్న నిజాన్ని తట్టుకోవడం ఆమెకు కష్టమైంది. అతి కష్టం మీద చికిత్స వల్ల ఆమె ఛాతీ పైభాగంలో కదలికలు వచ్చినా కింద భాగమంతా పక్షవాతం నుంచి కోలుకోలేకపోయింది. తనకా జీవితం వద్దని, తొందరగా మృత్యువును చేరుకుంటే బాగుండునని లియాంగ్ భావించింది. తీవ్ర నిర్వేదానికి గురైంది. అయితే ఆసుపత్రిలో ఇతర రోగుల తీరు ఆమెలో మార్పు తెచ్చింది. అక్కడందరూ ఆమెను ప్రేమతో చూసేవారు, పలకరించేవారు, తమ కష్టాలను ఆమెకు వివరించేవారు. ఈ ప్రపంచంలో తనకు మాత్రమే కష్టాలు లేవని, అందరూ ఏదో ఒక రకమైన కష్టంతో బాధపడుతున్నారని లియాంగ్కు అర్థమైంది.తల్లి సహకారంతో మున్ముందుకు..‘ఎవరూ నా మీద జాలిపడటం నాకు ఇష్టం లేదు. నన్ను అందరితో సమానంగా చూడండి. అదే నాకు ఇష్టం’ అంటారు లియాంగ్. గత పదేళ్లుగా ఆమె అనేక టీవీ, రేడియో కార్యక్రమాల్లోపాల్గొన్నారు. పుస్తకాలు రాశారు. అనేక కార్యక్రమాల్లో తన జీవితం గురించి వివరించి తోటివారితో స్ఫూర్తి నింపారు. ఇవాళ్టికీ టీవీలో కార్యక్రమం ఉందంటే మూడు గంటల ముందే ఇంటి నుంచి బయలుదేరి స్టూడియోకు చేరుకుంటారు. ‘పనిలో చిన్న ΄÷రపాటు జరగడం కూడా నాకు ఇష్టం ఉండదు.అందుకే అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకుంటాను’ అంటారామె. ఆమె రోజూ వచ్చి పని చేసేందుకు తల్లి అండగా నిలబడ్డారు. లియాంగ్ కోసం వీల్ చెయిర్ మోసుకొస్తూ, అనేకమార్లు సహాయకురాలిగా వ్యవహరించారు. తన తల్లి తనకు అందించే మద్దతు వల్లే తాను తిరిగి ఈ స్థాయిలో ఉన్నానని అంటారు లియాంగ్. ‘పని లేకపోతే నా స్థితి నాకింకా గుర్తుకొచ్చి ఇబ్బంది పెడుతుంది. పనిలో పడితే నా ఇబ్బందిని పూర్తిగా మర్చిపోతాను. ఉత్సాహంగా పని చేస్తాను’ అంటున్నారు లియాంగ్. ఆలోచనలను మార్చిన చైనీస్ రచయితలియాంగ్ ఆరోగ్యం కొంత మెరుగైన తర్వాత ప్రఖ్యాత చైనీస్ రచయిత షి టీషెంగ్ని కలిసింది. ఆయన కూడా ఒక ప్రమాదం కారణంగా 21 ఏళ్లకే చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. అయితే తనలోని ప్రతిభను ఆ సమస్య అడ్డుకోలేదని నిరూపిస్తూ అనేక పుస్తకాలు రాశారు. ఆయన లియాంగ్కి కౌన్సెలింగ్ ఇచ్చారు. జీవితం ఇక్కడితో ముగిసిపోలేదని, భయపడి పారిపోవడం విజేతల లక్షణం కాదని హెచ్చరించారు. దీంతో లియాంగ్ ఆలోచనల్లో మార్పు మొదలైంది. కష్టపడి చదివి, బ్రాడ్ కాస్టింగ్ అండ్ హోస్టింగ్లో మాస్టర్స్ పూర్తి చేసింది. తిరిగి టీవీ ముందుకు వచ్చి‘వీల్చెయిర్ యాంకర్’గా తన ప్రత్యేకత చాటుకుంది. -
పాక్తో పాటు చైనా వెన్నులో వణుకు పుట్టేలా..
బెలూచిస్తాన్ రీజియన్లో గత 10 రోజులుగా నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెబల్ గ్రూప్స్ వరుస దాడులతో పాక్ సైన్యం వణికిపోతోంది. తాజాగా బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ మునుపెన్నడూ లేని రీతిలో కొత్త తరహా దాడికి దిగింది. ఈ దాడిలో భారీగానే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.జరీనా రఫీయా అలియాస్ ట్రాంగ్ మహూ.. బెలూచ్ వేర్పాటువాద సంస్థల దృష్టిలో ఆమె వీర మహిళ. చగయ్ సమీపంలో చైనా మైనింగ్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం ఓ బాంబుతో ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో చైనాకు ఆస్తినష్టం జరపడంతో పాటు ఆరుగురు పాక్ సైనికుల మరణించారు. అందుకే.. ఆమె త్యాగాన్ని అంతగా కీర్తిస్తున్నారు.బీఎల్ఎఫ్ ఈ తరహా మానవ బాంబు దాడులకు(fidayeen strike) దిగడం ఇదే తొలిసారి. అందునా ఒక మహిళతో దాడి చేయించడంతో ప్రముఖంగా నిలిచింది. ఈ మేరకు మహూ ఫొటోను టెలిగ్రామ్ ద్వారా రిలీజ్ చేసింది.చగయ్ జిల్లాలో చైనా అతిపెద్ద రాగి, బంగారపు మైన్ కార్యాకలాపాల సంబంధిత కార్యాలయాన్ని నెలకొల్పింది. ఇందుకోసం అక్కడ పాక్ భారీగా సైన్యాన్ని మోహరించింది. మహూ తొలుత ఆత్మాహుతి దాడి జరిపి కాపలాగా ఉన్నవాళ్లను హతమార్చింది. ఆపై రెబల్స్లోకి ప్రవేశించి తమ దాడిని సులువుగా కొనసాగించారు. అయితే ఈ దాడిలో తమ సైనికులు మరణించిన విషయాన్ని పాక్ సైన్యం ధృవీకరించలేదు.మరో వైపు.. ఈ మధ్యకాలంలో జరిగిన వరుస దాడులు తమ పనేనని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) ప్రకటించుకుంది. ఈ దాడుల్లో పాక్ ఇంటెలిజెన్స్.. ఆర్మీ అధికారులు పలువురు మరణించారు.ఎందుకీ దాడులంటే..బెలూచిస్తాన్లో తిరుగుబాట్లు (Baloch Insurgency) దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా జాతి స్వతంత్రత, వనరుల దోపిడీ, రాజకీయ నిర్లక్ష్యం, మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి కారణాలతో ఇవి మొదలయ్యాయి. నెమ్మదిగా.. చైనా పెట్టుబడులు (CPEC ప్రాజెక్టులు), పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడుల రూపంలో మరింత తీవ్రమవుతున్నాయి. BLA (Baloch Liberation Army), BLF (Baloch Liberation Front) వంటి గ్రూపులు చైనా ప్రాజెక్టులు, పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇందుకోసం చైనా ప్రాజెక్టులపై దాడులు, తాత్కాలిక భూభాగం ఆక్రమణలు.. ఇప్పుడు ఏకంగా సూసైడ్ దాడుల్లాంటి వ్యూహాలు అవలంబిస్తున్నాయి.ప్రధాన కారణాలు ఏంటంటే..బలూచిస్తాన్లో గ్యాస్, ఖనిజాలు, పోర్టులు ఉన్నప్పటికీ స్థానికులకు లాభం తక్కువ(ఆర్థిక దోపిడీ). వీటికి తోడు.. స్థానిక నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం(రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం). పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దాడులు, అపహరణలు, జాతి స్వతంత్రత(మానవ హక్కుల ఉల్లంఘనలు).. బలూచ్ జాతి వేర్పాటువాద పోరాటం.. చైనా పెట్టుబడులు (CPEC) పెడుతుండడాన్ని అక్కడి వాళ్లు భరించలేకపోతున్నారు. అందుకే తిరుగుబాటు గ్రూపుల ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు మారాయి. ఇది సాధారణంగానే పాక్ సైన్యంతో పాటు చైనాకు గుబులు పుట్టిస్తోంది.బలూచిస్తాన్ తిరుగుబాట్ల చరిత్ర👇మొదటి తిరుగుబాటు (1948): ఖాన్ ఆఫ్ కలాత్ పాకిస్తాన్లో విలీనాన్ని వ్యతిరేకించడంతో ప్రారంభమైంది.రెండో దశ తిరుగుబాటు (1958–59): భూస్వామ్యం, స్వతంత్రత డిమాండ్లతో మళ్లీ అల్లర్లు.మూడో దశ తిరుగుబాటు (1962–63): గిరిజన నాయకులు, పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు..నాలుగో దశ తిరుగుబాటు (1973–77): పెద్ద ఎత్తున సైనిక చర్యలు, వేలాది మరణాలు..ఐదో దశ తిరుగుబాటు (2004–ప్రస్తుతం): అత్యంత దీర్ఘకాలంగా.. ప్రస్తుతం కొనసాగుతున్నాయి. -
చైనా ప్రభుత్వాన్ని వణికిస్తున్న రోబోలు!
రోబోటిక్స్ టెక్నాలజీలో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న చైనా ప్రభుత్వాన్ని ఇప్పుడవే రోబోలు వణికిస్తున్నాయి. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసే కంపెనీల వేగవంతమైన విస్తరణ ఆ దేశ అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళిక సంస్థను ఆందోళనకు గురిచేస్తోంది.ఏకంగా 150 కి పైగా కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోల తయారీలోకి దిగడంతో పరిశ్రమ వేడెక్కే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.మార్కెట్లోకి ఒకేవిధమైన రోబోలు ఇబ్బడిముబ్బడిగా రావడంపై చైనా అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళికా సంస్థ నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ (ఎన్డీఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ ప్రతినిధి లీ చావో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "వేగం, బుడగలు ఎల్లప్పుడూ ఎదుర్కోవాల్సిన సమస్యలు" అని వ్యాఖ్యానించారు.ఈ రోబో తయారీ కంపెనీలలో సగానికి పైగా ఇతర పరిశ్రమల నుండి రోబోటిక్స్ లోకి విస్తరించిన ఇటీవలి స్టార్టప్ లు లేదా సంస్థలే కావడం గమనార్హం. ఈ వైవిధ్యం ఒకప్పుడు ఆవిష్కరణకు ఒక వరంగా కనిపించినప్పటికీ, ఒకే లాంటి ఆవిష్కరణలు మార్కెట్ ను ముంచెత్తితే నిజమైన పరిశోధన, అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎన్డీఆర్సీ హెచ్చరిస్తోంది. దీనిపై ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ కూడా ఇప్పటికే హెచ్చరించారు.చైనాలో రోబోలు ఎందుకింతలా పెరుగుతున్నాయి..?హ్యూమనాయిడ్ రోబోటిక్స్ ను "మూర్తీభవించిన ఏఐ"గా పేర్కొంటున్న చైనా భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి కీలకమైన చోదకంగా ప్రకటిస్తూ ఈ రంగాన్ని పెంపొందించడానికి ప్రోత్సాహకాలు, నిధులు, విధానపరమైన మద్దతును అందిస్తోంది. దీంతో ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. కొత్త కంపెనీలు, పెట్టుబడులు వరదలా పోటెత్తున్నాయి. అనేక సంస్థలు వీలైనంత త్వరగా హ్యూమనాయిడ్ మోడళ్లను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ పరుగులు దాదాపు సారూప్య - రోబోల విస్తరణకు దారితీస్తున్నాయి.ముఖ్యంగా కంపెనీలు తయారు చేసిన రోబోల డెమోలు, ప్రోటోటైప్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ అవి కర్మాగారాలు, గృహాలు లేదా ప్రజా సేవలలో పెద్ద ఎత్తున వినియోగించదగిన రోబోలుగా మాత్రం అందుబాటులోకి రావడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. హైప్, వాస్తవ యుటిలిటీ మధ్య అసమతుల్యత.. డిమాండ్ కార్యరూపం దాల్చడంలో విఫలమైతే బూమ్ కుప్పకూలుతుందనే భయాలను పెంచింది. -
పేరులో ఏముంది? విడాకుల వరకూ తీసుకెళ్లింది
కసి ఉండటానికి కారణాలు అవసరం లేదు కానీ, విడిపోవడానికి చాలా వెతుక్కోవచ్చు. తమ పిల్లాడికి పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయం లేక చైనాలో ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. షాంఘైలోని పుడాంగ్ న్యూ ఏరియాలో ఓ జంటకు 2023లో వివాహమైంది. మరుసటి ఏడాది బాబుకు జన్మనిచ్చారు. అయితే, ఆ పిల్లాడి నామకరణం పెద్ద రణంగా మారింది. నేను చెప్పిన పేరే పెట్టాలని ఇరువురూ పట్టుబట్టారు. చివరకు కలిసి ఉండలేం అని కోర్టుకెక్కారు. కేసు పూర్వాపరాలు చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. బాబుకు ఏడాది వయసు దాటినా ఇంకా జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడం, పేరు పెట్టకపోవడం వల్ల టీకాలు వేయడానికీ కుదరకపోవడం మైనర్ హక్కుల ఉల్లంఘనే అని హెచ్చరించారు. భావోద్వేగ సంఘర్షణలలో పిల్లలను బేరసారాలుగా ఉపయోగించకూడదని మందలించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయానికి రావాల్సిందేనని చెకప్పారు. ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేరులో ఏముంది అని అంటారు.. కానీ ఎంత ఉందో చూశారా? -
చైనాలో ఘోర రైలు ప్రమాదం
చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో 11మంది రైల్వే సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి గాయాలయినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ కున్మింగ్ నగరంలో ఘోరరైలు ప్రమాదం జరిగింది. భూకంపాల గుర్తింపును పరీక్షిస్తున్న ఒక టెస్ట్ ట్రైన్, రైలు ట్రాక్ పై విధులు నిర్వహిస్తున్న రైల్వే సిబ్బందిపై పట్టాలు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారని, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ మీడియా సంస్థలు తెలిపాయి. దీంతో ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.ఈ రైలు ప్రమాదం దశాబ్ద కాలంగా చైనాలో జరిగిన రైలు ప్రమాదాలలో అతి పెద్దదని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2011లో చివరిసారిగా ఒక భారీ ట్రైన్ ప్రమాదం జరిగిందని ఆ ఘటనలో 40 మంది మృతిచెందగా 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.Train Crash in China Kills 11 After Test Engine Ploughs Into Maintenance CrewThe deadly incident occurred along a curved section of track at Luoyangzhen station in Kunming, the capital of Yunnan province, early on Thursday morning.Two other workers were injured in the crash.… pic.twitter.com/gKNDQtNJFt— RT_India (@RT_India_news) November 27, 2025 -
ప్రియమైన కుమారుడికి మీ అమ్మ వ్రాయునది...
తన టీనేజ్ కుమారుడు అదేపనిగా ఫోన్లో మునిగివడం, ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఆ తల్లిని బాగా బాధ పెట్టింది. మందలిస్తే ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడింది. అయితే తన మనసులోని ఆవేదనను మాత్రం ఒక కాగితంపై పెట్టింది. ఆ కాగితం ఆమె నుంచి ఎలా మిస్ అయిందో తెలియదుగానీ ఇటు వెళ్లి అటు వెళ్లి సోషల్ మీడియాకు చేరింది.తన ఉత్తరంలో టీనేజర్ల మితిమీరిన స్క్రీన్ టైమ్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన మహిళ.చాలా స్కూల్స్లో మొబైల్ ఫోన్ను అనుమతించనప్పటికీ విద్యార్థులు వాటిని రహస్యంగా వాడుతున్నారు. అధిక స్క్రీన్ టైమ్ వలన వారి చదువు దెబ్బతింటుంది. చైనాకు చెందిన ఆ తల్లి ఉత్తరంపై ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ‘ఇది చైనా తల్లి సమస్య మాత్రమే కాదు ఎన్నో దేశాలలోని తల్లుల సమస్య’ ‘ఆ తల్లి ఉత్తరాన్ని ఎన్నో దేశాల ప్రజలు చదివి ఉంటారు. ఆమె కుమారుడు కూడా చదివే ఉంటాడు. అతడు మారుతాడని ఆశిద్దాం’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. (చదవండి: ఒరిజినల్ సర్టిఫికెట్లు వారి దగ్గర ఉంచుకునే అధికారం లేదు) -
‘అరుణాచల్’ వివాదం: చైనా వాదనపై భారత్ మండిపాటు
న్యూఢిల్లీ: చైనాలోని షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక భారత మహిళను 18 గంటలకు పైగా నిర్బంధించడంపై భారత్ తన దౌత్యపరమైన నిరసన తెలియజేసింది. చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే భారత పాస్పోర్ట్ ఉన్నప్పటికీ, ప్రేమా వాంగ్ థాంగ్డాక్.. లండన్ నుండి జపాన్కు వెళ్తుండగా ట్రాన్సిట్ సమయంలో అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలయ్యింది.చైనా అధికారులు ప్రేమా వాంగ్ థాంగ్డాక్ జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అయినందును ఆమె పాస్పోర్ట్ చెల్లదని ప్రకటించి, ఆమెను వేధింపులకు గురి చేశారు. కాగా ఈ ఘటన అంతర్జాతీయ విమానయాన నిబంధనలు, చైనా వలస నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించినట్లున్నదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)పేర్కొంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం చైనా తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. ఈ వివాదం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనతో మరింత తీవ్రమైంది. ‘జాంగ్నాన్ చైనా భూభాగం. భారతదేశం చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ను చైనా ఎప్పుడూ అంగీకరించలేదు’ అని చైనా ప్రతినిధి పేర్కొన్నారు.దీనికి ప్రతిస్పందనగా ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. ‘అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం. ఇది విడదీయరాని భాగం. ఇది వాస్తవం. చైనా వైపు నుండి ఎంత తిరస్కరణ వచ్చినా, ఈ వాస్తవాన్ని మార్చలేం’ అని స్పష్టం చేశారు. ప్రయాణికురాలు థాంగ్డాక్ తన అనుభవాన్ని ‘ఎక్స్’లో వివరిస్తూ, తన జన్మస్థలాన్ని లక్ష్యంగా చేసుకొని వేధించారని, పదేపదే ప్రశ్నించారని, విరుద్ధమైన సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన భారత్ ప్రభుత్వం చైనా అధికారులు హాస్యాస్పద కారణాలతో ప్రేమా వాంగ్ థాంగ్డాక్ను నిర్బంధించారని ఆరోపించింది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. భారత పౌరులను లక్ష్యంగా చేసుకోవడం సహించదగినదికాదని, అరుణాచల్ ప్రదేశ్ స్థితిపై చర్చకు అవకాశం లేదని న్యూఢిల్లీ స్పష్టంగా చైనాకు తన సందేశం పంపింది.ఇది కూడా చదవండి: 360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే! -
ఏప్రిల్లో ట్రంప్ చైనా పర్యటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏప్రిల్లో చైనాలో పర్యటించనున్నారు. టారిఫ్ వార్ తరువాత రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తాను ఫోన్లో సంభాషించానని, వచ్చే ఏడాది చివర్లో అమెరికా పర్యటనకు జిన్పింగ్ను ఆహ్వనించానని ఎక్స్వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. చైనాతో అమెరికా సంబంధం బలంగా ఉందని, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడేందుకు సహాయపడుతుందని వెల్లడించారు. నెల రోజుల కిందట ఇద్దరు నాయకులు దక్షిణ కొరియాలో భేటీ అయ్యారు. అనంతరం ఫోన్లో సంభాíÙంచారు. ఉక్రెయిన్, ఫెంటానిల్, అమెరికన్ సోయాబీన్స్ కొనుగోళ్లు వంటి అంశాలపై చర్చించామని ట్రంప్ తెలిపారు. పర్యటనలు ప్రస్తావించని చైనా అయితే ముందుగా ఫోన్ కాల్ గురించి ప్రకటించిన చైనా మాత్రం పర్యటనల గురించి వెల్లడించలేదు. కేవలం ఇరు దేశాల మధ్య వాణిజ్యం, తైవాన్, ఉక్రెయిన్ గురించి చర్చించారని పేర్కొంది. ‘‘చైనా ప్రధాన భూభాగానికి తైవాన్ తిరిగి రావడం ‘యుద్ధానంతర అంతర్జాతీయ క్రమంలో అంతర్భాగం’అని జిన్పింగ్ ట్రంప్తో అన్నారు. ట్రంప్ తన పోస్ట్లో ప్రస్తావించని బీజింగ్కు ఇది కీలకమైన సమస్య. ఫాసిజానికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం విజయాన్ని సంయుక్తంగా కాపాడుకోవాలని జిన్పింగ్ ట్రంప్తో అన్నారు. తెవాన్ ప్రశ్న చైనాకు ఎంత ముఖ్యమో అమెరికా అర్థం చేసుకుంటుంది.’’అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్కు సాయంపై అమెరికా అస్పష్టత వాణిజ్య యుద్ధాన్ని తగ్గించడానికి వరుస చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. రెండు అగ్రరాజ్యాల మధ్య వైరుధ్యాలు కొనసాగుతున్నాయని రెండు వైపుల నుంచి వచి్చన ప్రకటనల్లోని లోపాలు సూచిస్తున్నాయి. తైవాన్పై చైనా చర్య తీసుకుంటే, అమెరికాకు కీలకమైన మిత్రదేశమైన జపాన్లోని సైన్యం జోక్యం చేసుకోవచ్చని జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో చైనా–జపాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తకైచి వ్యాఖ్యలను బీజింగ్ ఖండించింది. ఎవరూ తాకకూడని ఎర్ర గీతను జపాన్ దాటిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు.స్వయం పాలనలో ఉన్న తైవాన్ సార్వభౌమాధికారంపై అమెరికా ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ తైవాన్ను స్వా«దీనం చేసుకోవడానికి బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తుంది. ఏదైనా సాయుధ దాడిని నిరోధించడానికి ద్వీపానికి సాయంగా అమెరికా దళాలను పంపే విషయంలో స్పష్టత లేదు. తైవాన్ తన రక్షణ బడ్జెట్ను పెంచాలని అమెరికా చెబుతోంది. తైవాన్కు 330 మిలియన్ డాలర్ల ఆయుధ అమ్మకాలకు అమెరికా ఈ నెలలో ఆమోదం తెలిపిందని తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో యుద్ధ విమానాల విడిభాగాలు కూడా ఉన్నాయి. దీనిపై చైనా నిరసన వ్యక్తం చేసింది. -
షాంఘై ఎయిర్పోర్ట్లో మహిళకు వేధింపులు : చైనా రియాక్షన్ ఇదే
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన ఘటనలో చైనా స్పందించింది. షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళను వేధించారనే ఆరోపణలను చైనా ఖండించింది. థాంగ్డోక్కు ఎదురైన అనుభవంపై స్పందన కోరగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆ మహిళ ఆరోపించినట్లుగా ఎటువంటి తప్పనిసరి చర్యలు, నిర్బంధం లేదా వేధింపులకు లేవని పేర్కొన్నారు.లండన్ నుంచి జపాన్కు ప్రయాణిస్తున్నకి షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో భారతీయ మహిళలను అడ్డుకున్న దుమారం రేగిన ఒక రోజు తరువాత డ్రాగన్ కంట్రీ దీనిపై వివరణ ఇచ్చింది. నవంబర్ 21న లండన్ నుండి జపాన్కు ప్రయాణిస్తున్న యూకేకి చెందిన భారతీయ పౌరురాలు పెమా వాంగ్జోమ్ థాంగ్డాక్, పాస్పోర్ట్లో జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని పేర్కొనడంపై ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తనను ఆపారని తెలిపింది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకున్న చర్యలు చట్టాలు , నిబంధనల ప్రకారం ఉన్నాయని పేర్కొంటూ ఈ సందర్భంగా వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. కాగా అరుణాచల్ చైనా భూభాగం అంటూ షాంఘైలో విమానంలో దిగిన థాంగ్లో పాస్పోర్ట్ను చూసిన చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం, కనుక ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదని వాదించి అవమానించి వేధింపులకు గురిచేశారు. తదుపరి విమానం ఎక్కకుండా, కనీసం ఆహారం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె థాంగ్డోక్ తన స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారతీయ కాన్సులేట్కు సమాచారం అందించింది. భారతీయ అధికారుల జోక్యం తర్వాత ఆమెను రాత్రి ఆలస్యంగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. -
అరుణాచల్ ప్రదేశ్ మాది..!
అరుణాచల్ ప్రదేశ్.. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. అయితే చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్పై ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. మనతో స్నేహం అంటూనే భారతదేశంలో సూర్యుడు ఉదయించే తొలి ప్రాంతం అరుణాచల్ను తరచు తమది అంటోంది. తాజాగా వారి అరాచకం మరోసారి బయటపడింది. యూకేలో ఉంటున్నభారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్పోర్ట్పై అరుణాచల్ప్రదేశ్-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్పోర్ట్ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను. పెమా వాంఘజామ్ థోంగ్డాక్ అనే లండన్ నుంచి జపాన్కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. పాస్పోర్ట్ కౌంటర్లో అరుణాచల్ ప్రదేశ్-భారత్ అని ఉందేంటని ప్రశ్నించారు. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ భాగమని ఆమె వాదించగా, కాదంటూ వారు వాగ్వాదానికి దిగారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమంటూ వితండ వాదం చేశారు. మూడు రోజుల క్రితం అంటే నవంబర్ 21వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె.. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకి స్పష్టం చేసింది. తనను చైనా అధికారుల ఎంతటి వేధింపులకు గురి చేశారో వెల్లబుచ్చింది. గత ఏడాది తాను చైనా మీదుగా ప్రయాణించినా ఎటువంటి ఇబ్బంది రాలేదని, అలాగే లండన్లో ఉన్న చైనా ఎంబాసీ కూడా ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. తాజాగా ఎదురైన అనుభవంతో తాను షాక్కు గురైనట్లు ఆమె వాపోయింది. ఈ కారణంగా తాను కేవలం కొంత పరిధి వరకే పరిమితమయ్యానని, టికెట్లను రీబుక్ చేసుకోలేకపోయానని, భోజనం కూడా కొనలేకపోయానని, ఆఖరకు టెర్మినల్స్ మధ్య కదలడానికి కూడా వీల్లేకుండా పోయిందని తెలిపింది. చైనా ఈస్టర్న్లో ప్రత్యేకంగా కొత్త టికెట్ కొనాలని అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని, అలా చేసిన తర్వాతే తన పాస్పోర్ట్ తిరిగి ఇస్తామన్నారని పేర్కొంది. దీనివల్ల పలు ఆటంకాలు ఏర్పడి ఆర్థిక నష్టం చవిచూడాల్సి వచ్చిందన్నారు. చివరకు లండన్లో ఉన్న తన ఫ్రెండ్ సాయంతో షాంఘైలో ఉన్న బారత ఎంబాసీని కలిశానని, ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో తాను చైనాను వీడి వెళ్లే అవకాశం దక్కిందన్నారు. ఇదొక భయానక ఘటనగా ఆమె అభివర్ణించారు.ఇదీ చదవండి: మీరు మాకు చెప్పాల్సింది: ప్రధాని మోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడుసరిహద్దులు మారొచ్చు.. రాజ్నాథ్ సింగ్ -
అణు దాడులను తట్టుకునేలా ‘ఐస్లాండ్’
చైనా దేశం మరో భారీ నిర్మాణానికి సిద్ధమయ్యింది. ప్రపంచంలోనే తొలిసారిగా భారీ కృత్తిమ ద్వీపం నిర్మాణాన్ని డ్రాగన్ కంట్రీ చేపడుతుంది. ఈ ద్వీపాన్నిఅణు బాంబు దాడులను సైతం తట్టుకునేలా నిర్మిస్తున్నట్లు ఆ దేశ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.కొత్త కొత్త నిర్మాణాలతో ప్రపంచ దేశాలని ఆశ్చర్యపరిచే డ్రాగన్ కంట్రీ మరో భారీ నిర్మాణం చేపడుతుంది. అణుబాంబు దాడులను సైతం తట్టుకునేలా భారీ కృత్తిమ ద్వీపనిర్మాణం నిర్మిస్తున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఐస్ లాండ్ ఆరు నుంచి తొమ్మిది మీటర్ల ఎత్తైన అలలను తట్టుకోవడంతో పాటు కఠినమైన తుఫానులను సైతం ఎదుర్కొనేలా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఏర్పరిచిన సామాగ్రి 238 మందికి నాలుగు నెలల పాటు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ద్వీపంలో అన్ని రకాల ఎమర్జెన్సీ కంపర్ట్ మెంట్ లు నిర్మిస్తున్నామని, వాటిలో ఎమర్జెన్సీ పవర్, కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుందని తెలిపారు. ఈ ద్వీపం 138 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పుతో నీటి మట్టానికి 45 మీటర్ల ఎత్తు ఉండేలా దీని నిర్మాణం చేపడుతున్నట్లు చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీని బరువు 78 వేల టన్నులుని తెలిపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా దీని నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. డీప్-సీ ఆల్-వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీగా ఫిలవబడే ఈ ద్వీప నిర్మాణం 2028 వరకూ పూర్తి చేయనున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు.కాగా ఇటీవలే చైనాలో నిర్మించిన ఓ భారీ వంతెన ప్రారంభించిన కొద్ది రోజులకే కూలిపోయింది. దీంతో నాసిరకం నిర్మాణాలు చేపట్టారని ఆ దేశ ఇంజినీర్లపై విమర్శలు వ్యక్తమయ్యాయి. -
చైనా ఎంబసీకి యూకే ప్రధాని పచ్చజెండా
లండన్: లండన్ నడిబొడ్డున చైనా నిర్మించతలపెట్టిన వివాదాస్పద సూపర్ ఎంబసీకి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించనుంది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మరికొద్ది నెలల్లో చైనాలో పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఎంబసీ ప్రణాళికకు ఆమోదం తెలపాలని నిర్ణయించింది. స్టార్మర్ ప్రతిపాదనకు హోం శాఖ, విదేశాంగ శాఖలు అడ్డుచెప్పే అవకాశాలు లేవని ది టైమ్స్ కథనం పేర్కొంది.అయితే, జాతీయ భద్రతా ప్రయోజనాలకు లోబడి ఇందులో కొన్ని మినహాయింపులుండొచ్చని తెలిపింది. డిసెంబర్ 10వ తేదీలోగా అధికారికంగా అనుమతి లభించవచ్చని పేర్కొంది. చైనా నిర్మించాలనుకుంటున్న భారీ దౌత్య కార్యాలయం తమ దేశంలో గూఢచర్యానికేనని యూకే అనుమానిస్తోంది. అయితే, ఎంబసీ ప్రణాళికను ఆమోదించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని చైనా హెచ్చరికలు చేయడం గమనార్హం. -
బొద్దింక కాఫీ ..! ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదట..
కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండారు. అబ్బా దాని వాసనే కాఫీ తాగనివాళ్లను సైతం నోరూరిస్తుంది. అలాంటీ టేస్టీ కాఫీని ఇంత వెరైటీగా తాగాలనుకుంటే మాత్రం దెబ్బకు వాంతులు అవ్వడం కాయం. ఏమైంది అనుకోకుండి.. చైనా ఓ సరికొత్త కాఫీ టేస్ట్ని పరిచయం చేయనుంది. అదెలాగో తెలిస్తే ఛీ...య్యాక్ అనేస్తారు. బీజింగ్లోని ఒక మ్యూజియం కాఫీని మాములు వెరైటీగా కాఫీప్రియులకు అందిచడం లేదు. అది సర్వ్ చేసే విధానం చూస్తే బాబోయ్ అనిపించే రేంజ్లో..అత్యంత విలక్షణంగా అందింస్తోంది కస్టమర్లకు. ఇలాంటి ఆలోచనలు ఎక్కడ నుంచి వస్తాయ్ అబ్బా అని అనుకోకుండా ఉండరు ఎవ్వరైనా. ఇంతకీ ఎలాగంటే..బొద్దింకలను పైన జల్లి, ఎండిన పసుపు మీల్ వార్మ్లు కూడా జోడిస్తారు. ఆమ్యూజియం పేరు క్రిమీ మ్యూజియం అట. అందుకని ఆ పేరుకు తగ్గట్టు కస్టమర్లకు ఇలా సర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదండోయ్ ఈ కాఫీ పేరు రోచ్ కాఫీ అట.కప్పు కాఫీ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 542లు పలుకుతుందట. ఇలాంటి కాఫీ కేవలం ఆ మ్యూజియంలోనే దొరకుతుందట. అలాగే ఇలాంటి వెరైటీ పానీయాలు మరికొన్ని కూడా ఉన్నాయి. జీర్ణ రసంతో తయారు చేసిన పానీయాలు, హాలోవీన్ సందర్భంగా యాంట్(చీమల) డ్రింక్వంటి పలు విభిన్నడ్రింక్స్ ఉన్నాయట. అయితే ఆ మ్యూజియం వీటిని నిర్భయంగా తాగొచ్చని, ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదని కస్టమర్లకు హామీ ఇవ్వడం మరింత విశేషం. ఆ పానీయాల తయారీకి సంబంధించిన ముడిసరకును మొత్తం సాంప్రదాయ చైనీస్ ఔషధ (TCM) మూలికా దుకాణం నుంచి కొనుగోలు చేస్తామని సదరు మ్యూజియ అధికారులు చెబుతుండటం గమనార్హం. అంతేగాదు చైనీస్ ఔషధం ప్రకారం..బొద్దింక పొడి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడేతుందట. అలాగే ప్రొటీన్ అధికంగా ఉండే మీల్వార్మ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయట. కాగా, కొందరు చీమల పానీయం పుల్లని రుచి కలిగి ఉండగా, రోచ్ కాఫీ సాధారణ కాఫీలానే ఉందని చెబుతున్నారు.(ఆ పెయింటింగ్ ధర ఏకంగా రూ.487 కోట్లు!..అందులో ఇంత కథ ఉందా!) -
‘చిప్’లు చేస్తున్నాం... చైనావే కొంటున్నాం!
చైనాలో తయారైన ‘సెక్యూరిటీ–చిప్’లకు... ఇండియా డేటాను నేరుగా చైనాకు పంపే ‘వెనుక తలుపులు’ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఇండియాలోని ప్రతి మూలలో జరిగే ప్రతిదీ తెలుసుకునే పనిలో ఉన్న ఆ దేశం నుండి వచ్చే హార్డ్వేర్పై ఆధారపడటం ప్రమాదకరం.పెరటి ‘చిప్’లు పనికిరావా?‘‘ప్రపంచం కోసం మన దేశం చిప్లను తయారుచేస్తుంది. కానీ మనం వాటిని ఉపయోగించం! నిజానికి ఇండియా ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద చిప్ డిజైనర్ హబ్ కూడా! ఎన్విడియా, ఇంటెల్, మీడియా టెక్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలకు ఇండియాలో చిప్ డిజైన్ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఈ అద్భుతమైన చిప్ డిజైన్లన్నీ ప్రపంచం కోసం! ప్రపంచ దేశాలకు ఎగుమతి కోసం! మన సొంత ఉపయోగం విషయానికి వస్తే, మనం దాదాపుగా 100 శాతం వరకు చిప్లను దిగుమతి చేసుకుంటున్నాం. ఇదొక వైరుద్ధ్యం. చిప్ల వృద్ధిలో సాంకేతికతల్ని రూపొందించే మెదళ్లు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. కానీ మనం సొంత అవస రాల కోసం ఆ మెదళ్లను ఉపయోగించటం లేదు మనం!ఒప్పందం వల్ల దెబ్బ తిన్నాం!‘‘వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్లు్య.టి.ఒ.) ఒప్పందం మన ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను చావు దెబ్బ తీసింది. 1999లో డబ్లు్య.టి.ఒ. ఐటీ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 2005 నుండి ఇండియా ఆ ఒప్పందాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఒప్పందం మన మార్కెట్కు బార్లా తలుపులు తెరిచింది కానీ, మన సొంత ఎలక్ట్రానిక్స్ తయారీని దుర్బలం చేసింది. అదే సమయంలో చైనా, బ్రెజిల్ వంటి దేశాలు తమ పరిశ్ర మలను రక్షించుకుని, వాటిని వృద్ధి చేసుకున్నాయి.అంటే, పాశ్చాత్య దేశాలు మనల్ని ఈ ఒప్పందం ఉచ్చులోకి లాగి, అవి లబ్ధి పొందాయి. చదవండి: రైలు ఏసీ కోచ్లో మ్యాగీ : వీడియో వైరల్, నెటిజన్లు ఫైర్ పేరుకే అన్నట్లుంది ప్రావీణ్యం!‘‘ఎంత సేపటికీ మనం విడి పరికరాలను కలపటంతోనే సరిపెట్టుకుంటున్నాం. ‘మేక్ ఇన్ ఇండియా’ అంటే కేవలం నట్లు, బోల్ట్లు, స్క్రూలు బిగించటమేనా? డిజైన్ చేయటం కాదా! అదెందుకు అర్థం చేసుకోలేకపో తున్నాం? కేవలం భాగాలను కలిపే నైపుణ్యం మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. మనకు ఎలాంటి గుర్తింపునూ తీసుకురాదు. మనకు ఏ డిమాండునూ కల్పించదు. మేక్ ఇన్ ఇండియాకు ప్రస్తుతం మనం జోడిస్తున్న విలువ సున్నా. దిగుమతి చేసుకున్న భాగాలను కూర్చటం మాత్రమే చేస్తున్నాం. అలా కాకుండా మనమే ఇక్కడ డిజైన్కు, తయారీకి మారాలి. అప్పుడే మనం సెమీకండక్టర్లు, డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల వంటి తుది ఉత్పత్తులను సృష్టించగలం. ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!చైనా మీద అనుమానాలు‘‘చైనీస్ చిప్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు మన జాతీయ భద్రతకు ప్రమాదం. మనం ఉపయోగించే ప్రభుత్వ హాజరు యంత్రాలు (చైనా నుంచి దిగుమతి చేసు కున్నవి) చైనాకు మన డేటాను పంపుతున్నట్లు మేము కనిపెట్టాం. దేశ భద్రతకే ముప్పు తెచ్చిపెట్టే సమస్య ఇది. ప్రభుత్వ పరికరాలు మాత్రమే కాదు, మన స్మార్ట్ఫోన్లలో ఎక్కువ భాగం– ఏటా అమ్ముడవుతున్న 15 కోట్ల ఫోన్లలో దాదాపు 60 శాతం – చైనా˘కంపెనీలవే! భారతదేశంలోని ప్రతి మూలలో జరిగే ప్రతిదీ తెలుసుకునే పనిలో ఉన్న ఆ దేశం నుండివచ్చే హార్డ్ వేర్పై ఆధారపడటం దేశ సమగ్రతకే ప్రమాదం. ‘సేవలు’ తగ్గి, ఉత్పత్తి పెరగాలి!‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా సేవా రంగాలపై ఆధారపడి ఉంది, ఇది దాదాపు 60 శాతం. మనం స్వయం సమృద్ధిగా ఉండాలనుకుంటే, ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం రూపాంతరం చెందాలి. మొదటిసారిగా, ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని ‘పరిశోధన–అభివృది’్ధ నిధిగా రూ. 1 లక్ష కోట్లను కేటాయించింది. అది చాలా పెద్ద మొత్తం. మనం చేయవలసింది ఏమిటంటే, సాంకేతిక ఉత్పత్తుల కోసం ఆర్డర్లను పొందటం. వాటి తయారీకి భార తీయ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వడం. బలమైన, స్వదేశీ సాంకేతిక పరిశ్రమను నిర్మించడానికి ఇది చాలా అవసరం’’.- ఎడిటోరియల్ టీమ్పాడ్కాస్ట్:ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఎ.ఎన్.ఐ.)అతిథి:అజయ్ చౌధరీ, టెక్ విజనరీ, హెచ్.సి.ఎల్. కో–ఫౌండర్హోస్ట్:స్మితా ప్రకాశ్, ఎ.ఎన్.ఐ. ఎడిటర్సంభాషణలో అజయ్ చౌధరీ వెల్లడించిన ముఖ్యాంశాలు: -
పోరులో పాక్ గెల్చిందట!
న్యూఢిల్లీ: పహల్గామ్లో ఉగ్రవాదుల పాశవిక దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ జరిపిన దాడులకు పాకిస్తాన్ దీటుగా బదులిచ్చిందని, ఆ నాలుగు రోజుల పోరులో పాక్ పైచేయి సాధించిందని అమెరికా సెనేట్లో సమర్పించిన ఓ నివేదికపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది మోదీ సర్కార్ దౌత్యవైఫల్యానికి ప్రబల నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ గురువారం ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ వేళ కొనసాగిన పరస్పర సైనిక చర్యల్లో భారత్పై పాక్ విజయం సాధించిందని అమెరికా–చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్ మంగళవారం అమెరికా ఎగువసభ అయిన సెనేట్లో 800 పేజీల నివేదికను సమర్పించింది. ‘‘108, 109 పేజీల్లో ఏప్రిల్లో పహల్గాం దాడి వెనుక పాక్ హస్తముంది. ఆపరేషన్ సిందూర్ వేళ చైనా అందించిన అత్యాధునిక ఆయుధాలతో భారత్ను పాక్ ఓడించింది. చైనా అత్యాధునిక ఆయుధాలు, నిఘా సాయంతో పాక్ పైచేయి సాధించింది. పాక్ సైన్యం మాటున చైనా తన అధునాతన ఆయుధ సంపత్తిని నేరుగా భారత్ పరీక్షించుకునే సువర్ణావకాశాన్ని సద్వినియోగంచేసుకుంది. తద్వారా తమ ఆయుధాల పనితీరును ప్రపంచానికి చాటిచెప్పి అంతర్జాతీయ ఆయుధ, రక్షణ రంగ మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని చూసింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘ అమెరికా సెనేట్లో సమర్పించిన నివేదికను చూశాకైనా ప్రధాని మోదీ మౌనం వీడతారా? భారత విదేశాంగ శాఖ తన అభ్యంతరాలను వ్యక్తంచేస్తుందా?’’ అని జైరాం రమేశ్ సూటి ప్రశ్న వేశారు. -
996 ఫార్ములా: ఇన్ఫోసిస్ నారాయణమూర్తిపై ఆగ్రహం!
వారానికి 72 గంటల పని మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఈ వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కొందమంది సమర్ధించారు. మరికొందరు విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ నిలవాలంటే.. 996 నియమం చాలా అవసరం అని ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఏమిటీ 996 రూల్?చైనాలో పాటిస్తున్న 9-9-6 నియమాన్ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 996 ఫార్ములా ప్రకారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని, వారానికి 6 రోజులను సూచిస్తుంది. అంటే రోజుకు 12 గంటలు.. 6 రోజులు చేయాలన్నమాట. ఇలా మొత్తానికి వారానికి 72 గంటలు పనిచేయాలన్నమాట.చైనాలోని చాలా కంపెనీలు ఈ నియమాన్ని పాటిస్తున్నాయి. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. కొన్ని సంస్థలు ఈ నియమాన్ని రద్దు చేసినప్పటికీ.. ఇంకొన్ని అమలు చేస్తూనే ఉన్నాయి. కాగా చైనా ప్రభుత్వం కూడా దీనిని క్రమంగా నియంత్రించడానికి తగిన చర్యలను తీసుకుంటోంది. అలాంటి ఈ విధానాన్ని నారాయణమూర్తి ప్రస్తావించడం.. కొంత మందిలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది.ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే.. తప్పకుండా యువత మరింత నిబద్దతతో పనిచేయాలి. భారత్ వృద్ధి రేటు 6.57 శాతం. దీని కంటే ఆరు రెట్లు పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన చైనాతో మనం పోటీ పడాలంటే.. పనిగంటలు పెంచాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారానికి 100 గంటలు పనిచేస్తారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. పేదలకు అవకాశాలు కల్పించడానికి యువత కష్టపడి, తెలివిగా పనిచేయడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.నెటిజన్ల రియాక్షన్నారాయణమూర్తి వ్యాఖ్యలపై చాలామంది నెటిజన్లు స్పందించారు. ఒకరు చైనా స్థాయి జీతాలు, మౌలిక సదుపాయాలు & జీవన వ్యయం ఇవ్వండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అని అన్నారు. భారతదేశానికి 72 గంటల వారాలు అవసరం లేదు. అద్దె, కిరాణా సామాగ్రి, పాఠశాల ఫీజులు & పెట్రోల్కు సరిపోయే జీతాలు భారతదేశానికి అవసరం. ప్రజలు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారని మరొక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: టెక్ కంపెనీ కొత్త చర్య.. భయపడుతున్న ఐటీ ఉద్యోగులు!యూరప్ దేశంలో 10-5-5 విధానం నడుస్తోంది. దీని గురించి మీకు తెలుసా అంటూ.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పని, వారానికి 5 రోజులు మాత్రమే. ఈ దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారాంతాల్లో సంతోషంగా జీవితం గడుపుతారు అని ఇంకొక యూజర్ అన్నారు. ఇలా ఒక్కొక్కరు.. ఒక్కోలా నారాయణమూర్తి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.🚨 "There is a saying in China, 9, 9, 6. You know what it means? 9 am to 9 pm, 6 days a week. And that is 72 hours work-week, " said Narayana Murthy. pic.twitter.com/FCeNFynG1F— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2025 -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై దాదాపు 500 శాతం సుంకాలు విధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. రెండు దేశాల యుద్ధం ముగించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో భేటీ కూడా అయ్యారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది సాధ్యం కాకపోవడంతో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ పెద్దమొత్తంలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా దాదాపు విఫలం కావడంతో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం తమ దేశానికి వేరే మార్గం లేదని ట్రంప్ పేర్కొన్నారు.రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్లు విధిస్తానన్నారు. సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ దేశాల జాబితాలో భారత్, చైనా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ను కూడా ఇందులో చేర్చనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తున్నామన్నారు. భారత్, చైనాలే ఆ దేశం నుంచి 70శాతం చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడనుంది. BREAKING:US president Trump approves bill allowing tariffs up to 500% on countries trading with Russia. pic.twitter.com/Lko3wXVuLU— Recon & surveillance (@Recon_surv) November 17, 2025 -
ఆసియా పసిఫిక్లో కీలకంగా భారత్
బ్యాంకాక్: ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ వృద్ధికి భారత్, చైనా కీలకంగా నిలుస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఆసియా పసిఫిక్ ఎయిర్లైన్స్ (ఏఏపీఏ) వెల్లడించింది. ప్యాసింజర్, కార్గోలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో 2026లో కూడా పరిశ్రమ వృద్ధి సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఏఏపీఏ డైరెక్టర్ జనరల్ సుభాష్ మీనన్ తెలిపారు. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ 10 శాతం పెరిగిందని వివరించారు. 2025 తొలి ఆరు నెలల్లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే, వచ్చే ప్రయాణికుల సంఖ్య 16 శాతం వృద్ధి చెందిందని 69వ అసెంబ్లీ ఆఫ్ ప్రెసిడెంట్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశీ మార్కెట్ విస్తరించేందుకు భారీగా అవకాశాలు ఉన్నాయని చెప్పా రు. చారిత్రకంగా చూస్తే భారతీయ విమానయాన దిగ్గజం ఎయిరిండియా చాలా కీలకమైనదని, అది నిలదొక్కుకోవడానికి కాస్త సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని మీనన్ చెప్పారు. సరఫరా వ్యవస్థపరంగా అంతరాయాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆసియా పసిఫిక్ ఎయిర్లైన్స్ డిమాండ్కి తగ్గ స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయ న పేర్కొన్నారు. ఏఏపీఏలో ఎయిరిండియా సహా 18 విమానయాన సంస్థలకు సభ్యత్వం ఉంది. నాలుగు తీర్మానాల ఆమోదం.. సదస్సు సందర్భంగా ఏఏపీఏ నాలుగు తీర్మానాలను ఆమోదించింది. సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లను అధిగమించడం, విమానాల్లో లిథియం బ్యాటరీలను తీసుకెళ్లడం, పన్నులు..చార్జీలు, పర్యావరణహితమైన విధంగా ఏవియేషన్ కార్యకలాపాలు సాగించడంలాంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ప్రాంతీయంగా ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్) కార్యకలాపాలు పెరిగేలా నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవడం, తయారీ సామర్థ్యాలు పెంచుకునేందుకు ఊతమివ్వడం, నిర్దిష్ట పెట్టుబడులకు ప్రోత్సాహకాలివ్వడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఏఏపీఏ కోరింది. అలాగే పునరి్వనియోగానికి పనికొచ్చే ఎయిర్క్రాఫ్ట్ మెటీరియల్స్ను రీసైకిల్ చేసేలా సర్క్యులర్ ఎకానమీ విధానాలను అమల్లోకి తేవొచ్చని పేర్కొంది. ఎయిర్లైన్స్కి అండగా ఉండాలి: ఐఏటీఏ సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లతో విమానాల డెలివరీలకు అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఎయిర్లైన్స్కి విమానయాన పరిశ్రమలోని వివిధ విభాగాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్‡్ష తెలిపారు. టారిఫ్లు, ఇతరత్రా అంశాల కారణగా విమానాల తయారీ సంస్థలు (ఓఈఎం) ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్లైన్స్ మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయని, మరోవైపు ఓఈఎంల మార్జిన్లు అధిక స్థాయిలో ఉంటాయని వాల్‡్ష తెలిపారు. మిగతా వర్గాలు లాభాలార్జించడంపై తమకే అభ్యంతరం లేదు కానీ పరిశ్రమలో సమతౌల్యత అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సరఫరా వ్యవస్థపై టారిఫ్లు ప్రతికూల ప్రభావం చూపుతాయని సుభాష్ మీనన్ చెప్పారు. వీటి వల్ల విమానయాన సంస్థల ఇంధనేతర వ్యయాలు కూడా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. టారిఫ్ల వల్ల ఇటు సరఫరా, అటు డిమాండ్ మీద ప్రభావం పడుతుందన్నారు. కన్సలి్టంగ్ సంస్థ ఆలివర్ వైమాన్తో కలిసి ఐఏటీఏ నిర్వహించిన అధ్యయనం ప్రకారం సరఫరా వ్యవస్థ సవాళ్ల కారణంగా 2025లో అంతర్జాతీయంగా ఎయిర్లైన్స్ పరిశ్రమపై 11 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. అక్టోబర్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇంధనం అధికంగా వాడాల్సి రావడం, అదనపు మెయింటెనెన్స్, మరింత ఎక్కువగా ఇంజిన్లను లీజుకు తీసుకోవడంలాంటి అంశాలపై విమానయాన సంస్థలు గణనీయంగా వెచి్చంచాల్సి రానుంది. 20 ఏళ్లలో 19,560 విమానాలు అవసరం: ఎయిర్బస్ అంచనాలు వచ్చే 20 ఏళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 19,560 చిన్న, పెద్ద విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ వెల్లడించింది. అంతర్జాతీయంగా 20 ఏళ్లలో 42,520 విమానాలు అవసరం కానుండగా, ఇది అందులో దాదాపు సగమని వివరించింది. భారత్, చైనాలో విమానయానానికి డిమాండ్ పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ఎయిర్బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీ చెప్పారు. ప్రాంతీయంగా ప్యాసింజర్ల సంఖ్య ఏటా 4.4 శాతం వృద్ధి చెందనుందని, ఇది అంతర్జాతీయ సగటు 3.6 శాతం కన్నా అధికమని వివరించారు. ఆసియా–పసిఫిక్లో సరికొత్త వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని స్టాన్లీ పేర్కొన్నారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుదల, నెట్వర్క్ విస్తరణ, చౌక విమానయాన సంస్థల రాక, మౌలిక సదుపాయాలు మెరుగుపడటం మొదలైనవి విమానయాన వృద్ధికి దోహదపడే అంశాలని చెప్పారు.కొత్తతరం విమానాలతో 25 శాతం ఇంధనం ఆదా.. తమ కొత్త తరం వైడ్–బాడీ విమానాలు 25 శాతం మేర ఇంధనాన్ని ఆదా చేస్తాయని, కర్బన ఉద్గారాలను కూడా ఆ మేరకు తగ్గిస్తాయని ఎయిర్బస్ తెలిపింది. ఏఏపీఏ సదస్సు సందర్భంగా ఎయిర్బస్ వెల్లడించిన అంచనాల ప్రకారం ఆసియా పసిఫిక్లో వచ్చే రెండు దశాబ్దాల్లో 3,500 పెద్ద విమానాలు అవసరం కానున్నాయి. ఇది అంతర్జాతీయంగా పెద్ద విమానాలకున్న డిమాండ్లో సుమారు 43 శాతం. మరోవైపు, ప్రాంతీయంగా 16,100 చిన్న విమానాలు కావాల్సి ఉంటుంది. గ్లోబల్ డిమాండ్లో దాదాపు 47 శాతం. దాదాపు 32 శాతం విమానాలు పాత మోడల్స్ స్థానాన్ని భర్తీ చేయనుండగా, మిగతావి ఫ్లీట్ విస్తరణకు ఉపయోగపడనున్నాయి. -
'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...
కూతురు కోసం ఏ తండ్రైనా దేన్నైనా త్యాగం చేస్తాడు..ఎంత కష్టమైనా భరిస్తాడు. తమ కంటిపాప కంటే తమేకేది ఎక్కువ కాదు అనేంత ప్రేమను చూపిస్తారు. కానీ ఈ నాన్నలా ఇంతలా ప్రేమించడం మాత్రం కష్టమే. అందరి నాన్నల కంటే ఈ తండ్రి ప్రేమ అంతకుమించి..అని చెప్పొచ్చు. ఇతడి కూతురి ప్రేమను చూడగానే ఆకాశమంత మూవీలోని ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది. "ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా..ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా.. అమ్మరా..మేఘాల పల్లకి తెప్పిస్తా.. లోకాన్ని కొత్తగ చూపిస్తా.. వెన్నెలే తనపై కురిపిస్తా.." అంటూ సాగే పాట కళ్లముందు కదలాడుతుంది. ఆ సినిమాలో మాదిరిగానే ఈ తండ్రికి కూడా పై చదువుల కోస దూరంగా వెళ్తున్న కూతురిని విడిచిపెట్టి ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఆమె అక్కడ భోజనం విషయంలో ఇబ్బంది పడుతుందని తెలిసి..మొత్తం మకాం ఆమె వద్దకు మార్చేశాడు. కూతురు పక్కన లేనిదే జీవితం వృధా అని మొత్తం తన లైఫ్నే త్యాగం చేసేశాడు. మరి ఆ ఆసక్తికరమైన ఆ పేరెంట్ కథేంటో చూసేద్దామా..!చైనాకు చెందిన లీ బింగ్డ్ అనే టీనేజర్ జిలిన్ ప్రావిన్స్లో జిలిన్ నార్మల్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. దాదాపు ఒక ఏడాది తర్వాత బింగ్డ్ తన యూనివర్సిటీ క్యాంటిన్లో భోజనం అస్సలు బాగుండటం లేదని తండ్రి లీతో చెప్పింది. తాను ఇంటి భోజనం చాలా మిస్సవ్వుతున్నానని వాపోయింది. అంతే ఆ తండ్రి బార్బెక్యూ రెస్టారెంట్లో చేస్తున్న ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసి..వంట మంచిగా చేయడం ఎలాగో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత కూతురు ఉండే యూనివర్సిటీ సమీపానికి తన మకాం మార్చేసి..అక్కడే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపన్ చేశాడు. మొదటి రోజు అతడు వండిన వంటకాలకు స్వలంగానే లాభం పొందాడు. అది తన కూమార్తె బింగ్డ్ ట్యూటర్గా సంపాదించే దాంతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. తండ్రి శ్రమను చూసి చలించిపోయిన ఆ కూతురు..తన కథను సోషల్మీడియాలో షేర్ చేసింది. అంతేగాదు తన తండ్రి శుభ్రమైన వంటకు ప్రాధాన్యత ఇస్తాడని, అతని అమ్మకాలు మరింత మెరుగుపడాలంటే తగిన సలహాలు ఇవ్వగలరు అని పోస్ట్లో జోడించింది. వెంటనే ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే గాక..తండ్రి ఫుడ్స్టాల్ వద్ద జనాలు క్యూలో నిలబడేలా రద్దీగా మారేందుకు దారితీసింది. కొత్తమంది కస్టమర్లు ఆమె తండ్రి వ్యాపారానికి మద్దతిచ్చేలా మరిన్ని ఆర్డర్లు కోరారు. అంతేగాదు ఆ తండ్రికి కూతురుపై ఉన్న అచంచలమైన ప్రేమకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు కూడా.లాభం కంటే కూతుర చెంత చాలు..స్టాల్ రద్దీగా మారిపోవడంతో లీ తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించింది. గత నెలలో స్టాల్ నడుపుతున్నప్పుడూ చాలాచలిగా అనిపించిందని, కానీ ఇప్పుడూ కస్టమర్ల తాకిడితో అది వెచ్చగా మారిపోయిందని చమత్కరిస్తోంది లీ. తన తండ్రి పెద్దపెద్ద లాభాలనేమి ఆశించడం లేదని, కేవలం తన కూతురుకి దగ్గరగా జీవించాలన్నదే తన ఆశ అని వివరించింది. తన తల్లి కొన్నేళ్ల క్రితమే లుకేమియాతో మరణించిందని, దాంతో తాము ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమను పెంచేసుకున్నామని బింగ్డ్ చెప్పుకొచ్చింది. చాలామంది నా తండ్రి లీ ప్రేమను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ..నాకు మాత్రం ఆయనప్రేమ సూర్యుడి వలే వెచ్చని హాయిని అందిస్తుందని సంతోషభరితంగా చెబుతోంది కూతురు బింగ్డ్.(చదవండి: హాట్టాపిక్గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?) -
చైనాలో కలకలం.. భారీ శబ్ధంతో కుప్పకూలిన బ్రిడ్జి
చైనాలో ఇంజినీరింగ్ వైఫల్యం బట్టబయలైంది. చైనా-టిబెట్ను కలిపెందుకూ ఇటీవలే ప్రారంభించిన హాంగ్ కీ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. చైనా సియాచిన్ ప్రావిన్స్ లో నిర్మించిన ఈ బ్రిడ్జి 758 మీటర్ల పొడవైంది. వంతెన కూలడానికి గల కారణాలు తెలవాల్సి ఉంది.చైనా సియాచిన్ ప్రావిన్స్ లో టిబెట్-చైనాను కలుపుతూ నిర్మించిన హాంగ్ కీ బ్రిడ్జీని కొద్దిరోజుల కిందటే ప్రారంభించారు. కాగా మంగళవారం ఉదయం సమయంలో బ్రిడ్జి ప్రారంభంలోని భాగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపైనుంచి వాహనాలు ఏమి వెళ్లకపోవడం, అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే వంతెన కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. 758 మీటర్ల పొడవైన ఈ వంతెన సెంట్రల్ చైనాను టిబెట్ తో కలుపుతుంది. వంతెన కూలిన సమయంలో భారీగా శిథిలాలు నదిలో పడిపోయి పెద్ద ఎత్తున వ్యర్థాలు పైకి లేచాయి. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇండస్ట్రీయల్ సెక్టర్ లో తామెప్పుడూ ముందుంటాం అనే చెప్పుకునే డ్రాగన్ దేశంలో ఇంత పెద్ద వంతెన నిర్మించిన కొద్ది రోజుల్లోనే కూలిపోవడం ఏంటని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. Chinese Engineering Failure- The 758-metre-long Hongqi bridge collapsed in southwest China, months after opening. China isn’t as smart as everyone makes them out to be. They couldn’t copy this design. The ground shifted on one of the approaches. Luckily it was noticed the day… pic.twitter.com/ZJDDdwgCP9— Peter Lemonjello (@KCtoFL) November 11, 2025 -
చైనా అమ్ముల పొదిలో అత్యాధునిక నౌక
బీజింగ్: వాణిజ్యంలోనూ, సైనిక శక్తిలోనూ అమెరికాను ఢీకొడుతున్న చైనా.. తన నౌకాదళాన్ని మరింత శక్తిమంతం చేసే చర్యల్లో మరో ముందడుగు వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫుజియాన్ విమాన వాహక నౌకను నౌకాదళానికి అందించింది. ఇందులో అత్యంత ఆధునికమైన ఎలక్టోమ్య్రాగ్నటిక్ వ్యవస్థ (ఈమల్స్)ను అమర్చారు. ఈ వ్యవస్థ ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో మాత్రమే ఉంది. ఇటీవల హైనాన్ ప్రావిన్స్లోని సన్యా పోర్టులో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్వయంగా ఈ నౌకను నౌకాదళానికి అందించినట్టు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది. అయితే, ఈ నౌకలో ఇంకా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడారన్న విషయాన్ని చైనా అత్యంత గోప్యంగా ఉంచుతోంది. అయితే, ఆ దేశ మీడియా రిపోర్టుల ప్రకారం ఈ నౌకపై జే–15టీ, జే–35, కాంగ్జింగ్–600 వంటి యుద్ధ విమానాలను మోహరించనున్నట్టు తెలిసింది. నౌకపై ఈ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ టెస్టులు పూర్తయ్యాకే కమిషనింగ్ చేశారని జిన్హువా పేర్కొంది. ఈ నౌక బరువు 80 వేల టన్నులు. ఎమిటీ ఈమల్స్? విమాన వాహక నౌక పైనుంచి యుద్ధ విమానాలు రాకపోకలు సాగించటమే అత్యంత కీలకమైన అంశం. చాలా తక్కువ నిడివి ఉండే రన్వే పై టేకాఫ్ కావటం, ల్యాండింగ్ చేయటం క్లిష్టమైన పని. సంప్రదాయ విమానవాహక నౌకలో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో విమానాన్ని బయటి నుంచి నియంత్రించేందుకు టర్బైన్ టెక్నాలజీని వాడుతారు. గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, ఫుజియాన్లో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ టెక్నాలజీని వాడారు. ఈ వ్యవస్థ ద్వారా యుద్ధ విమానం తక్కువ సమయంలో ఎక్కువ శక్తి పుంజుకుని గాల్లోకి ఎగిరేందుకు బయటి నుంచి శక్తిని అందిస్తారు. ల్యాంగింగ్ సమయంలోనూ విమానం నిర్దేశిత ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్లి సముద్రంలో పడిపోకుండా ఈ అయస్కాంత శక్తి నియంత్రిస్తుంది. సంప్రదాయ టెక్నాలజీలతో పోల్చితే ఎలక్టోమ్య్రాగ్నటిక్ వ్యవస్థ సాంకేతికంగా క్లిష్టమైనదే అయినప్పటికీ.. దాని నిర్వహణ సులభం. అయితే, ఏవైనా సమస్యలు వస్తే మాత్రం రిపేర్లకు చాలా ఖర్చవుతుంది. అమెరికాను మించి చైనా నౌకాశక్తి ప్రపంచంలో అత్యంత భారీ నౌకాదళం ఉన్న దేశంగా అమెరికాను వెనక్కు నెట్టి చైనా అవతరించింది. అమెరికా వద్ద ప్రస్తుతం 219 యుద్ధ విమానాలు ఉండగా, చైనా వద్ద 234 ఉన్నాయి. చైనా వద్ద ఇప్పటికే ఉన్న మూడు విమాన వాహక నౌకలు సంప్రదాయ ఇంధన శక్తితో పనిచేస్తాయి. దీంతో ఆ దేశం కొత్తగా అణుశక్తితో నడిచే దలియాన్ అనే నాలుగో విమాన వాహక నౌకను నిర్మిస్తోంది. భారత్ వద్ద ఐఎస్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే రెండు విమాన వాహక నౌకలు ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణ చైనా సముద్రంతోపాటు సుదూర సముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చాటుకొనేందుకు చైనా నౌకా శక్తిని భారీగా పెంచుతోందని చైనా మిలిటరీ వ్యవహారాల నిపుణుడు ఝాంగ్ జున్షే ఆ దేశ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్తో తెలిపారు. -
ఆ సమావేశాల్లో తేలిందేమిటి?
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు ఏడు రోజులలో ఆసియాలో కీలకమైన ఆర్థిక సమావేశాలు వరుసగా జరిగాయి. జరిగింది ఆసియాలోని మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలలో అయినా, అమెరికా, చైనా, రష్యా సహా ప్రపంచ దేశాలు పాల్గొన్నాయి. ఆ సమావేశాలలో జరిగిన చర్చలు, జరిగిన ఒప్పందాలు మొత్తం ప్రపంచ వాణిజ్య, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల విషయమై భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనా ధోరణులు ఏ విధంగా ఉండనున్నాయో ఆ సమావేశాలలో స్పష్టమైంది. కానీ, అగ్రస్థాయి ఆసియా దేశం అయి ఉండి, ఆర్థిక పరిమాణంలో నాల్గవ స్థానానికి చేరిన ఇండియా ప్రధాని మోదీ మాత్రం ఆ సమావేశాలలో పాల్గొనక అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు ప్రభుత్వం అధికారికమైన వివరణ కూడా ఏమీ ఇవ్వక ఊహాగానాలకు వదలివేసి మరింత ఆశ్చర్యపరిచింది.ట్రంప్ వర్సెస్ ఇతర దేశాలుమొదట మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ‘ఆసియాన్’, ఆర్సీఈపీ (రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్), తర్వాత దక్షిణ కొరియా నగరం బూసాన్లో ఏపీఈసీ (ఆసియా– ఫసిఫిక్, ఎకనమిక్ కో–ఆపరేషన్) శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. అమెరికా, చైనా అధ్యక్షులు విడిగా సమావేశమయ్యారు. వీటి మధ్య అమెరికా అధ్యక్షుడు జపాన్ వెళ్లి అక్కడి ప్రధానితో చర్చలు జరిపారు. ‘ఆసియాన్’లో 11 దేశాలకు, ఆర్సీఈపీలో 15 దేశాలకు, ఏపీఈసీలో 21 దేశాలకు సభ్యత్వం ఉంది. మొత్తం అన్ని ఖండాలకు చెందిన ఈ దేశాలను కలిపి చూస్తే, ప్రపంచ జనాభాలో, ఆర్థిక శక్తిలో, వాణిజ్యంలో అత్యధిక భాగస్వామ్యం వాటిదే. చర్చలు, తీర్మానాలు, ఒప్పందాల చివరన రెండు ధోరణులు స్పష్టంగా తేలాయి. ఒకటి – అమెరికా తన ‘అమెరికా ఫస్ట్’ నినాదా నికి అనుగుణంగా ఆ యా దేశాలతో విడివిడిగా చర్చించి ద్వైపాక్షిక ఒప్పందాలు మాత్రమే చేసుకోవటం. చైనా మినహా మరెవరిపై సుంకాలు తగ్గించకపోవటం. ఆ యా సంస్థల సామూహిక చర్చలలో అధ్యక్షుడు ట్రంప్ అసలు పాల్గొనక పోవటం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల పట్ల విముఖత చూపటం. ఇందుకు భిన్నంగా, అమెరికాకు సన్నిహితంగా భావించే వాటితో సహా తక్కిన అన్ని దేశాలు, ఎటువంటి మినహాయింపు లేకుండా, స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టు బడులు వర్తమాన ప్రపంచానికి తప్పనిసరి అవసరమని తీర్మానించాయి. వారిలో కొందరు ఒత్తిడి కారణంగానైతేనేమి, సైద్ధాంతిక మైత్రి వల్లనైతేనేమి అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసు కున్నారు. ప్రధానంగా అరుదైన లోహాలు, ఖనిజాలు, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, రక్షణ, రవాణా పరికరాలకు సంబంధించి! అదే సమయంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుకూలిస్తూ, ఒత్తిడులను వ్యతిరేకిస్తూ తీర్మానించారు. పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ – ప్రొటెక్షనిజాన్నీ, ప్రపంచం తిరిగి ఆటవిక రాజ్య స్థితికి వెళ్లటాన్నీ విమర్శించారు. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలలో ఒకటైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ అయితే తాము వాణిజ్య పరంగా అమెరికాపై ఆధారపడే సాంప్రదాయిక స్థితి నుంచి దూరంగా జరగదలచుకున్నామనీ, రాగల కాలంలో అమెరికా బయటి దేశాలతో వాణిజ్యాన్ని రెట్టింపు చేయగలమనీ ప్రకటించారు. ఆ వెంటనే చైనా అధ్యక్షునితో సమావేశమై, ‘మరింత సుస్థిరమైన, సమ్మిళితమైన అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణానికి’ చైనాతో కలిసి పనిచేయగలమన్నారు. త్వరలో చైనా సందర్శనకు అంగీకరించారు.ప్రాంతీయ సంబంధాల సరళతరంవాస్తవానికి ఒకవైపు అమెరికా, మరొకవైపు తక్కిన ప్రపంచపు ఈ విధమైన ధోరణులు కొంత కాలంగా కనిపిస్తున్నవే. అది ట్రంప్కు తెలియనిది కాదు. ఆయన తన విధానాలను ఈ ఆసియా సమావేశాల సందర్భంగా మార్చుకోగలరని కూడా ఎవరూ ఆశించి ఉండరు. అయితే రెండు ధోరణులు కూడా ఈ వారం రోజుల సమా వేశాల కాలంలో మరింత స్థిర రూపం తీసుకోవటమన్నది గమనించదగ్గది. అంతా మన మంచికే అన్న సామెత వలె, ఈ పరిణామాలు ప్రపంచ దేశాల మధ్య బహుముఖ సంబంధాలు, బహుళ ధ్రువ ప్రపంచ ఆవిష్కరణకు మార్గాన్ని మరింత సుగమం చేయగలవు.ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. అవి – సాధారణంగా అమెరికా పలుకుబడి కింద పని చేస్తాయనే పేరున్న ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎంఎఫ్) ఈ సమావేశాలకు ముందు చెప్పిన మాటలు. నిబంధనలకు విరుద్ధంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల దృష్ట్యా వివిధ దేశాలు తమ ప్రాంతీయ వాణిజ్య సంబంధాలను సరళతరం చేసుకోవాలని ఐరాస వాణిజ్య విభాగం అధికారులు సూచించారు. తర్వాత ఆసియా ప్రాంతీయ ఆర్థిక పరిస్థితులపై ఐఎంఎఫ్ ఒక నివేదికను విడుదల చేస్తూ– ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధి ప్రధానంగా వాణిజ్యంపై ఆధార పడి ఉందనీ, అందువల్ల అక్కడి దేశాలు సుంకాలు కాని ఇతర వాణిజ్య ఆంక్షలను తగ్గించుకోవటం, ప్రాంతీయ వాణిజ్యాన్ని సమీ కృత పరచుకోవటం, ఆ విధంగా అమెరికా సుంకాల ఒత్తిడి నుంచి తప్పించుకోవటం, ప్రపంచ ఆర్థిక ఒడుదొడుకులను తట్టుకోవటం చేయాలనీ చెప్పింది. ఇండియా ఏం చేస్తున్నట్టు?ఇంత ముఖ్యమైన సమావేశాలకు కిందిస్థాయి అధికారులను మాత్రమే పంపిన భారత ప్రభుత్వం దీనంతటి నుంచి గ్రహించవలసింది చాలానే ఉంది. ఉదాహరణకు మనం ‘లుక్ ఈస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’ అని చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాము గానీ, ఆర్సీఈపీలో సభ్యత్వమైనా లేదు. ఆసియాన్లో సభ్యత్వం లేకున్నా ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి’ హోదా ఉంది. ‘ఆసియాన్’ కూటమితో వాణిజ్య, ఆర్థిక సంబంధాల గణనీయమైన అభివృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ ఆ పని మందకొడిగానే సాగుతున్నది. చైనా 771 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, మన వాణిజ్యం విలువ 131 బిలియన్లు మాత్రమే. భౌతికంగా, డిజిటల్ పరంగా సంబంధాలు చాలా పరిమితం. పోతే... ఐరాస, ఐఎంఎఫ్ సూచనలను అన్వయించుకుని చూస్తే – ఇండియా ఉన్న దక్షిణాసియాలో, ‘సార్క్’లో ఆర్థిక సమన్వయం, వాణిజ్య సంబంధాలు పాకిస్తాన్తో సమస్య వల్ల అథమ స్థాయిలో ఉన్నాయి. ‘బిమ్స్టెక్’ అనే మరొక సంస్థను పాకిస్తాన్ను మినహాయిస్తూ ఏర్పాటు చేసినా పరిస్థితి మెరుగుపడటం లేదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అంతరిక్షంలో వంట.. అదెలా!
న్యూయార్క్: అంతరిక్ష కేంద్రం. ఏ చిన్నపాటి నిప్పురవ్వ అంటుకున్నా రోదసీలోనే అంతా అంటుకుని అగ్నిగోళంగా మండిపోయే అత్యంత సున్నిత ప్రాంతం. అలాంటి అంతరిక్ష కేంద్రంలోనూ వేడివేడి చికెన్ వింగ్స్ను అది కూడా ఎలాంటి పొగరాని ప్రత్యేక ఓవెన్ను వండుకుని చైనా వ్యోమగాములు చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోని ఓ ప్రైవేట్ స్పేస్స్టేషన్లో ఇలా ఓవెన్లో చికెన్ను వండుకుని తినడం ఇదే తొలిసారి. అసలు అంతరిక్ష కేంద్రంలో వంటచేయడం కూడా ఇదే ప్రప్రథమం. తాము అభివృద్ధి చేసిన స్పేస్ కిచెన్ సాంకేతికతను చైనా ఇలా విజయవంతంగా పరీక్షించింది. పరీక్షించడమేకాదు పనిలోపనిగా ఆ వేడివేడి చికెన్ను వ్యోమగాములంతా తిని భారరహిత స్థితిలో మాంసాహార వంటకంలోని మజాను ఆస్వాదించారు. ఇందుకు తియాంగాంగ్ స్పేస్స్టేషన్ ( Tiangong Space Station) వేదికైంది. కనీసం 500 సార్లు భూమి మీద విస్తృతస్థాయిలో పరీక్షించాక దానిని తియాంగాంగ్ స్పేస్స్టేషన్కు తీసుకొచ్చారు. తాజాగా ఆహారం దిశగా పయనం వ్యోమనౌక ద్వారా తీసుకొచ్చిన అతిశీతల ఆహార పదార్థాలకు మళ్లీ వేడి చేసి తినడానికి బదులుగా అప్పుడే వండిన వేడివేడి ఆహారం తినాలనే ఆశ నుంచి హాట్–ఎయిర్ ఓవెన్ ఆలోచన పుట్టుకొచ్చింది. ఓవెన్లో పెట్టే వస్తువులను పట్టి ఉంచే పట్టీ, వేడిచేసే మెష్, ఉడికించే ట్రే, సమంగా కాల్చే రోటేటింగ్ బుట్టలతో వినూత్న ఓవెన్ను తయారుచేశారు. ‘‘ఓవెన్ గరిష్ట ఉష్ణోగ్రతను 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 190 డిగ్రీ సెల్సియస్కు పెంచాం. దీంతో చికెన్, మటన్ వంటి పదార్థాలను అప్పటికప్పుడు వేడివేడిగా తినొచ్చు’’అని చైనా శాస్త్రవేత్త, చైనా ఆస్ట్రోనాట్ రీసెర్చ్, ట్రైనింగ్ సెంటర్లో పరిశోధకుడు యువాన్ యోంగ్ చెప్పారు. ఈ ఓవెన్ను ఇటీవల షెంజువాన్–21 వ్యోమనౌక ద్వారా భూమి నుంచి తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కు తీసుకొచ్చారు. తాజాగా దీనిని చికెన్, మటన్ ముక్కలను బేక్ చేసి పరీక్షించారు. చికెన్ వింగ్స్ను చైనా షెంజువాన్–21, షెంజువాన్–22ల వ్యోమగాములు (astronauts) ఎంచక్కా ఆరగిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.పొగరాకుండా ఏర్పాట్లు భారరహిత స్థితిలో పొగ కమ్మితే అది ఎప్పటికీ బయటకు పోదు. దాంతో వ్యోమగాముల ఆరోగ్యంపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వంటలను వండినప్పుడు పొగ వెలువడకుండా ఓవెన్లో ప్రత్యేక ఏర్పాటుచేశారు. బహుళ పొరల ఫిల్టర్లను దానిలో అమర్చారు. అత్యధిక వేడిమిని ఇచ్చే రసాయన చర్యలు, సాంకేతికత మేళవింపుతో ఓవెన్ను తయారుచేశారు. భారరహిత స్థితిలోనూ అది సవ్యంగా పనిచేయడం విశేషం. అంతరిక్ష కేంద్రంలోనూ వాడగల ప్రపంచంలోనే మొట్టమొదటి ఓవెన్ ఇదేనని ఆస్ట్రోనాట్స్ సిస్టమ్లో డెప్యూటీ చీఫ్ డిజైనర్ లూ వీబో చెప్పారు. మొక్కజొన్న పొత్తులు వేయించుకునేందుకూ ఇందులో ఏర్పాటు ఉంది. కేక్ (Cake) సైతం తయారు చేసుకోవచ్చు.చదవండి: షట్డౌన్ తెచ్చిన ఆహార సంక్షోభంతయాంగాంగ్ స్పేస్స్టేషన్లో ఉన్నప్పుడు ఏదైనా చైనా జాతీయ ప్రత్యేక దినోత్సవాలు వచ్చినప్పుడు వేడుకల్లో భాగంగా ఈ వంటకాలను ఇందులో తయారుచేయొచ్చు. దీర్ఘకాల అంతరిక్ష ప్రాజెక్టుల్లో వ్యోమగాములకు రుచికరమైన ఆహారం అందించే లక్ష్యంతో ఈ ఓవెన్ను తయారుచేసినట్లు చైనా తెలిపింది. స్పేస్ బార్బెక్యూతో పసందైన వంటకాలను తినబోతున్నామని చైనా వ్యోమగాములు చెప్పారు. గతంలో రష్యా, అమెరికా, చైనా సంయుక్తంగా నిర్మించిన, ప్రస్తుతం విధుల్లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చాక్లెట్చిప్ కుకీలను బేక్ చేసినా అందుకు చాలా సమయం పట్టింది. కానీ చైనా వ్యోమగాములు కేవలం 28 నిమిషాల్లోనే చికెన్ వింగ్స్ను సంపూర్ణంగా ఉడికించి శెభాష్ అనిపించుకున్నారు. మటన్ ముక్కలనూ బేక్ చేశారు. -
పాక్ చైనా అణుపరీక్షలు చేస్తున్నాయి
వాషింగ్టన్: దశాబ్దాల క్రితంనాటి తొలితరం అణుబాంబు ధాటికే హిరోషిమా, నాగసాకి నగరాలు తుడిచిపెట్టుకుపోయిన దారుణోదంతాలను చవిచూసిన ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో చెడువార్తను మోసుకొచ్చారు. గత ఒడంబడికలను బుట్టదాఖలుచేస్తూ ఇకపై తాము అణుపరీక్షలు చేపడతామని ట్రంప్ సోమవారం ప్రకటించారు. తాము మాత్రమే అణుపరీక్షలు చేయట్లేమని, ఇప్పటికే పాకిస్తాన్, చైనా ఈ పని మొదలెట్టాయని ఆయన కొత్త విషయం చెప్పారు. సీబీసీ న్యూస్ ఛానల్ వారి నోరా ఓ డేనియల్ ఇంటర్వ్యూలో ట్రంప్ పలు విషయాలను వెల్లడించారు. ‘‘ రష్యా అణు పరీక్షలు చేస్తోంది. చైనా తక్కువేం తినలేదు. అదికూడా అణుపరీక్షలు చేస్తోంది. ఈ విషయాన్ని అవి బహిరంగంగా చెప్పట్లేవు. మేం అలా కాదు. మేం అన్నీ చెప్పేస్తాం. అమెరికా సైతం అణుపరీక్షలు చేయబోతోంది. ఎందుకంటే వాళ్లంతా చేస్తున్నారుగా. ఉత్తర కొరియా ఇప్పటికే అణుపరీక్షలు చేసేసింది. పాకిస్తాన్ ఇప్పుడు చేస్తోంది’’ అని ట్రంప్ చెప్పారు. ‘‘ కొన్ని దేశాలు తమ అణు పరీక్షల వివరాలను బహిర్గతంచేయట్లేవు. ఆ అణుపరీక్షలు భూగర్భంలో జరుగుతున్నాయో. దాంతో అవి ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయో ఎవరికీ తెలీవు. కేవలం సూక్ష్మస్థాయిలో ప్రకంపనలు మాత్రమే వస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికా పరీక్షలు జరపడం సబబే’’ అని ట్రంప్ తన నిర్ణయాన్ని సమరి్థంచుకున్నారు. ‘‘అణ్వాయుధాలను తయారుచేశాక వాటిని పరీక్షించకుండా ఉంటే ఎలా? అవి పనిచేస్తున్నాయో లేదో తెలియాలంటే పరీక్షించాలి కదా. అయినా ఇతర దేశాలు అణుపరీక్షలు జరుపుతూ అణ్వ్రస్తాలను పెంచుకుంటున్నాయి. అమెరికా సైతం తగు నిల్వలను సముపార్జించాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్కు పొంచి ఉన్న ముప్పు చైనా, పాక్లు కొత్తగా అణుపరీక్షలు జరుపుతోందన్న ట్రంప్ వ్యాఖ్యలతో సరిహద్దున పొరుగుదేశంతో భారత్కు అణుముప్పు పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే భారత్ కంటే అత్యధికంగా చైనా వద్ద ఏకంగా 600 అణ్వాయుధాలు ఉన్నాయి. మరో ఐదేళ్లలో వీటి సంఖ్య 1,000కి చేరుకోనుంది. పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలున్నాయి. భారత్ వద్ద 180 అణువార్హెడ్లు ఉన్నాయి. అంతర్జాతీయ అధికారిక రికార్డ్ల ప్రకారం రష్యా 1990తర్వాత అణుపరీక్షలు జరపలేదు. చైనా 1996 తర్వాత, భారత్ 1998 మే తర్వాత అణుపరీక్షలు చేయలేదు. -
బీజింగ్లో రామాయణ నృత్య రూపకం
బీజింగ్: ప్రముఖ చైనా పండితుడు, దివంగత ప్రొఫెసర్ జి.జియాన్లిన్ అనువదించిన రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ఆది కావ్యం–మొదటి కవిత’అనే నృత్య రూపకాన్ని చైనా కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. భారత నాట్యంలో నిపుణురాలైన చైనా కళాకారిణి జిన్ షాన్షాన్ దర్శకత్వంలో, 50 మందికి పైగా ప్రతిభావంతులైన స్థానిక కళాకారులతో కూడిన బృందం ఈ నాటకాన్ని శనివారం ఇక్కడి భారత రాయబార కార్యాలయంలో ప్రదర్శించింది. ఇది ‘అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనం’.. అని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్లో అభివరి్ణంచింది. ఈ ప్రదర్శనను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. ఈ నృత్య రూపకాన్ని బీజింగ్లో ప్రదర్శించడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో మొదటిసారి ప్రదర్శించారు. గత నెలలో, రాయబార కార్యాలయం ’సంగమం–భారతీయ తాతి్వక సంప్రదాయాల సమ్మేళనం’ అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించింది. ఇందులో ప్రముఖ చైనా పండితులు భగవద్గీత, భారతీయ నాగరికతా విలువలపై ప్రసంగించారు. -
చరిత్ర సృష్టించిన కేరళ.. కడు పేదరికానికి పుల్స్టాప్
కేరళ రాష్ట్రం చరిత్ర సృష్టించింది. దేశంలో కడు పేదరికాన్ని(extreme poverty) నిర్మూలించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు దక్కించుకుంది. శనివారం ఆ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక ప్రకటన చేశారు. తద్వారా చైనా దేశం తర్వాత అలాంటి ఘనత పొందిన రెండో ప్రాంతంగా కేరళ నిలిచింది.ఇది కేవలం గణాంకాల విషయం కాదు.. మానవీయ విజయం అంటూ శనివారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో పినరయి విజయన్ ప్రకటించారు.ఇవాళ(నవంబర్ 1న) “కేరళ పిరవి” (Kerala Piravi) దినోత్సవం(రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం). ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగ్గా.. పలువురు రాజకీయ, సినీ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మేం చెప్పినదాన్నే అమలు చేశాం. వాస్తవాలు తెలియజేస్తున్నాం అంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టారాయాన. అయితే ప్రభుత్వ ప్రకటనను మోసపూరితంగా అభివర్ణిస్తూ ఈ సెషన్ను ప్రతిపక్షాలు బహిష్కరించాయి.2021లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే “అత్యంత పేదరిక నిర్మూలన” లక్ష్యంగా నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్లే.. 4 లక్షల మంది ఎన్యూమరేటర్లు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి 1,03,099 మంది అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తించారు. ప్రతి కుటుంబానికి ప్రత్యేక మైక్రో ప్లాన్ రూపొందించి.. కుడుంబశ్రీ(కుటుంబశ్రీ), స్థానిక సంస్థలు, సామాజిక సంక్షేమ శాఖ కలిసి అమలు చేశాయి.చైనా తర్వాత కేరళనే.. 2019లో అత్యంత దుర్భర పేదరికం నిర్మూలించిన దేశంగా చైనా నిలిచింది. ప్రపంచ బ్యాంక్, UNDP, మరియు చైనా ప్రభుత్వ నివేదికలు ద్వారా గుర్తింపు పొందింది. ఆ తర్వాత.. ఇప్పుడు కేరళ ఆ ఘనత సాధించడం గమనార్హం. ప్రతి వ్యక్తికి ఆహారం, నివాసం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రాథమిక అవసరాలు అందుతున్నాయని కేరళ ఈ సందర్భంగా ప్రకటించుకుంది.కేరళ రాష్ట్రం భారతదేశంలో 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అంతేకాక, దేశంలో మొట్టమొదటి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా, పూర్తిగా విద్యుతీకరణ పొందిన రాష్ట్రంగా కూడా నిలిచింది. ఇప్పుడు.. అత్యంత దుర్భర పేదరికం (extreme poverty) నిర్మూలనలో భారతదేశంలో తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. -
‘భారతీయులే కీలకం.. హెచ్-1బీ వీసాపై మరో ట్విస్ట్’
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ(H-1B) వీసాలపై ఫీజు పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీసాలపై ప్రకటనను పునఃపరిశీలించాలని అమెరికా చట్టసభ సభ్యుల బృందం.. తాజాగా ట్రంప్ను కోరడం విశేషం. ఫీజు పెంపుల అంశం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండగా.. ఏఐ(AI) సాంకేతిక నాయకత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా చట్టసభ సభ్యుల బృందం ప్రతినిధులు జిమ్మీ పనెట్టా, అమీ బెరా, సలుద్ కార్బజల్, జూలీ జాన్సన్ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లేఖ రాశారు. ఈ లేఖలో హెచ్1-బీ వీసాల ఫీజుల పెంపు గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. లేఖలో..‘హెచ్-1బీ గ్రహీతల్లో అత్యధిక వాటాను భారతీయులు కలిగి ఉన్నారు. వారిలో ఎక్కువ మంది సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు(AI)లో అమెరికా నాయకత్వానికి కేంద్రంగా ఉన్నారు. వీసాల విషయం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు కూడా ఎంతో కీలకం. ఇలాంటి వీసా విధానం ఇండో-పసిఫిక్లో అమెరికాకు అత్యంత సన్నిహిత ప్రజాస్వామ్య మిత్రదేశాలలో ఒకటైన భారత్తో సంబంధాలను దెబ్బతీస్తుంది. వీసాల అమలు వల్ల కీలకమైన ప్రజాస్వామ్య భాగస్వామితో వ్యూహాత్మకంగా అమెరికా భాగస్వామ్యం బలపడుతుంది.మరోవైపు.. ఏఐ, అధునాతన సాంకేతికతలలో చైనా దూకుడుగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో మనం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడాన్ని కొనసాగించాలి. హెచ్-1బీ వీసాల అమలు అంటే కేవలం ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయడం కాదు. ఇది 21వ శతాబ్దంలో ప్రపంచ శక్తిని నిర్వచించే పరిశ్రమలలో అమెరికా నాయకత్వాన్ని చూపించడం. వీసాల ఫీజు పెంపు పెద్ద కంపెనీలకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ.. నైపుణ్యంపై ఆధారపడే స్టార్టప్లు, పరిశోధన సంస్థలను గుదిబండగా మారుతుంది’ అని హెచ్చరించారు. లేబర్ డిపార్ట్మెంట్ వీడియో..ఇదిలా ఉండగా.. హెచ్-1బీ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తున్నారని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఆరోపించింది. హెచ్-1బీ వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ యువత తమ అమెరికన్ డ్రీమ్స్ కోల్పోతున్నారని, పరిస్థితిని సరిచేసి ఆ కలను తిరిగి అమెరికా ప్రజలకు ఇవ్వాలని సంకల్పించామని పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా వీడియో విడుదల చేసింది.ఈ వీడియోలో చూపించిన గణాంకాల ప్రకారం, హెచ్-1బీ వీసాలలో 72 శాతం భారతీయులకే జారీ అవుతున్నాయని వెల్లడించింది. వీసా కింద అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య కార్మికుల్లో అధికశాతం భారత్ నుంచే వెళ్తున్నారని తెలిపింది. వీసా వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయా అని గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్వాల్ పేరిట ఆడిట్ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమిస్తూ, స్థానిక అమెరికన్లకు నష్టం కలిగించే కంపెనీలను గుర్తించడమని పేర్కొంది. -
‘తాత్కాలిక సంధి’ కాలం!
ఎట్టకేలకు అమెరికా–చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు దక్షిణ కొరియాలోని బూసాన్లో గురు వారం చర్చించాక ఇరు దేశాల మధ్యా తాత్కాలిక సంధి కుదిరింది. వాణిజ్య కీచులాట లకు రెండు దేశాలూ ఏడాది పాటు విరామం ప్రకటించాయి. చైనా దిగుమతులపై విధించిన సుంకాల్లో 10 శాతం తగ్గించాలని అమెరికా నిర్ణయించింది. అలాగే అపురూప ఖనిజాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని చైనా నిర్ణయం తీసుకుంది.దాంతోపాటు అమెరికా నుంచి సోయాబీన్స్ కొనుగోళ్లను పునరుద్ధరించటానికి అంగీకరించింది. రెండు దేశాల దోబూచులాట ట్రంప్ ఆగమనంతో మాత్రమే మొదలుకాలేదు. ఆ రెండింటి మధ్యా అంతకుముందే ఉన్న వాణిజ్య ఆధిపత్య పోటీ జో బైడెన్ హయాంలో తీవ్రతరమైంది. దాన్ని ట్రంప్ మరింత ఎగదోశారు. మొన్న ఏప్రిల్లో చైనాపై 145 శాతం సుంకాలు విధించారు. ఈ బ్లాక్మెయిల్కు తలొగ్గబోమనీ, తుదివరకూ పోరాడతామనీ చైనా జవాబిచ్చింది. ఈ పోటీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలన్నీ సతమతమయ్యాయి. కానీ తాజా చర్చల వల్ల తాత్కాలికంగానైనా అవి సద్దు మణగటం మంచి పరిణామం. ఈ చర్చలు మరిన్ని చర్చలకు దారితీసి వాణిజ్య సంధికి దారితీయొచ్చన్న ఆశాభావం కూడా అందరిలో వ్యక్తమవుతోంది. ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్నప్పుడు చిరునవ్వులు రువ్వుకోవడం, ఎక్కువసేపు కరచాలనాలతో ఫొటోలకు పోజులివ్వటం రివాజే. ట్రంప్, జిన్పింగ్లిద్దర్నీ అంచనా వేయటం అంత సులభం కూడా కాదు. అందులోనూ ట్రంప్ 24 గంటలు తిరగకుండా మాట మార్చటంలో సిద్ధహస్తుడు. అందువల్ల బూసాన్ సమావేశంపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైగా చర్చల అనంతరం ట్రంప్ ప్రకటించినంతస్పష్టంగా చైనా వైపు నుంచి వివరణ లేదు. ‘కీలక ఆర్థిక, వాణిజ్య అంశాలపై అధినేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య దృఢమైన పునాది కోసం ట్రంప్తో కలిసి పనిచేయటానికి షి సంసిద్ధత చూపారు’ అని చైనా ప్రకటన చెబుతోంది. అపురూప ఖనిజాల సంగతేమీ అందులో లేదు. కాకపోతే చైనా వాణిజ్య శాఖ ప్రకటన ‘అక్టోబర్ 9 నాటి ఎగుమతుల నియంత్రణలను’ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలి పింది. అందులో అపురూప ఖనిజాలు కూడా ఉన్నాయి. కార్లు, సెమీ కండక్టర్లే కాక సైనిక ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు తేలినందువల్లే నియంత్రణ విధించామని చైనా లోగడ తెలిపింది.ట్రంప్ తగ్గించామంటున్న సుంకాల విషయంలోనూ తకరారు ఉంది. మాదక ద్రవ్యాల తయారీకి తోడ్పడే ఫెంటానిల్ రసాయనాన్ని చైనా ఎగుమతి చేస్తోందని ఆరో పిస్తూ చైనా సరుకులపై ట్రంప్ 20 శాతం సుంకాలు విధించారు. ఇప్పుడు 10 శాతం తగ్గించటమంటే దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని అర్థం. తాము కూడా సుంకాలు సవరిస్తామని చైనా అంటున్నది. తమ ఎన్విడియా కంపెనీ చిప్లను చైనా కొనుగోలు చేయొచ్చని ట్రంప్ అన్నప్పటికీ బ్లాక్వెల్ చిప్ల విషయం చర్చకు రాలేదంటున్నారు.అంటే ఈ సంధిలోనూ అపరిష్కృత సమస్యలు దాగున్నాయి.రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలూ అగ్రభాగాన ఉన్నాయన్న మాటేగానీ మాంద్యంతో యాతన పడుతున్నాయి. ట్రంప్ సుంకాల యుద్ధంతో సోయాబీన్స్ను బ్రెజిల్ నుంచి చైనా కొనుగోలు చేయటం మొదలెట్టింది. దాంతో అమెరికా రైతులు దివాలా స్థితికి చేరారు. అది ట్రంప్ను ఊపిరాడకుండా చేస్తోంది. అందుకే జిన్పింగ్తో చర్చల్లో తైవాన్ సమస్య జోలికి పోలేదు. అటు చైనా 2021 నాటి స్థిరాస్తి మార్కెట్ సంక్షోభం నుంచి బయటపడలేదు. దేశంలో కొనుగోలు శక్తి పడిపోవటంతో సరుకు అమ్ముడు కాక మార్కెట్లు నేలచూపు చూస్తున్నాయి. 2035 నాటికి ఏఐలో అగ్రగామిగా మారి తిరిగి పుంజుకోవాలనుకుంటున్నా అమెరికా నియంత్రణలు అడ్డంకిగా మారాయి. విద్య, నైపు ణ్యాల్లో భారీగా వ్యయం చేయాలనుకుంటున్న చైనా అందుకవసరమైన పెట్టుబడుల కోసం చూస్తోంది. అపురూప ఖనిజాల నియంత్రణ ద్వారా ఇప్పటికైతే అమెరికాను దారికి తెచ్చుకుంది. వచ్చే ఏప్రిల్లో బీజింగ్ సందర్శిస్తానని ట్రంప్ అంటున్నారు గనుక ఆ లోగా ఈ ‘తాత్కాలిక సంధి’ సామరస్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
చైనాకు ట్రంప్ గుడ్న్యూస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. చైనాపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గురువారం దక్షిణ కొరియా బుసాన్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. జిన్పింగ్తో భేటీ అద్భుతంగా జరిగిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం.. 2018 దాకా చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 0-5 శాతంగా ఉండేవి. అయితే 2021లో అది 20 శాతానికి చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టి టారిఫ్ వార్ మొదలుపెట్టాక చైనా విషయంలోనూ పెంపు ఉండొచ్చని అంతా భావించారు. అందుకు తగ్గట్లే అది 57 శాతానికి చేరింది. అయితే ఆ పెంపు 155 శాతం దాకా ఉంటుందని.. నవంబర్ 1వ తేదీ నుంచి అమలు అవుతుందని ఆయన హెచ్చరించారు కూడా. ఈలోపు..పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా గురువారం ఈ ఇరు దేశాధినేతలు రెండు గంటలపాటు సమావేశం కాగా, చర్చలు ఫలవంతం అయ్యాయి. తాజా తగ్గింపుతో సుంకాలు 47 శాతానికి చేరాయి. ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక అద్భుతమైన ఆరంభం అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. టారిఫ్ తగ్గింపుతో పాటు సోయాబీన్ కొనుగోళ్ల పునరుద్ధరణ, అలాగే.. రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి ఇంతకు మించి ఏం చెప్పలేనన్న ఆయన.. ముఖ్యమైన అంశాలకు సంబంధించి వివరాలను కాసేపట్లో విడుదల చేస్తామని మీడియాకు తెలిపారు. -
మాది గొప్ప సంబంధం.. మళ్లీ కలవడం ఆనందంగా ఉంది
వాణిజ్య ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ముఖాముఖి మాట్లాడుకున్నారు. దక్షిణ కొరియా బుసాన్లో గురువారం ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా ఈ ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత.. కరచలనం చేసుకుంటూ నవ్వుకుంటూ ఇద్దరూ మీడియా ముందు ఫోజులిచ్చారు. ఆపై ఇరు దేశాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ జరిపారు.‘‘మా మధ్య మంచి పరిచయం ఉంది. మాది గొప్ప సంబంధం. మళ్లీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగానే కుదిరే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మీరు తిరిగి అధ్యక్షుడయ్యాక మూడుసార్లు ఫోన్లో మాట్లాడాం, చైనా-అమెరికా ఆర్థిక సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. అమెరికాను గొప్ప దేశంగా మార్చే దృష్టితో చైనా అభివృద్ధి సాగుతోంది అని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. ఇరు దేశాల సంబంధాలు స్నేహపూర్వకంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అదే సమయంలో.. BREAKING 🚨 China’s President stuns the world THANKING President Trump for promoting PEACE "Mr President you care a lot about world peace. You are very enthusiastic about settling regional hotspot issues”I AM IN TOTAL SHOCK 🔥 pic.twitter.com/yEkzCdigUf— MAGA Voice (@MAGAVoice) October 30, 2025చైనా-అమెరికా.. రెండు ప్రపంచ శక్తులు. అవి ఎప్పుడూ ఒకే అభిప్రాయంలో ఉండకపోవడం సహజం. పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం కూడా సహజమే. కానీ వాటిని ద్వైపాక్షిక సంబంధాల చర్చల ద్వారా అధిగమించి ముందుకు ఎలా సాగుతామనేదే ముఖ్యం అని జిన్పింగ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. మరోవైపు.. గాజా కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రపై జిన్పింగ్ ప్రశంస గుప్పించారు. ప్రపంచ శాంతికి ఈ ఒప్పందం మీరు చేసిన గొప్ప కృషి అని అన్నారాయన. ఇలాంటి శాంతి చర్చలకు చైనా మద్దతు తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. అంతకు ముందు.. JUST IN: 🇺🇸🇨🇳 President Trump officially meets with Chinese President Xi Jinping to discuss trade deal. pic.twitter.com/lIB0O68Wo7— Watcher.Guru (@WatcherGuru) October 30, 2025తమ భేటీ విజయవంతం అవుతుందనే ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నాకు ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన(జిన్పింగ్) చాలా కఠినమైన చర్చాకర్త. అది ఏమాత్రం మంచిది కాదు’’ అంటూ అక్కడ నవ్వులు పూయించారు. ఇదిలా ఉంటే.. 2018లో ప్రారంభమైన ట్రంప్-చైనా వాణిజ్య యుద్ధం 2025లో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసింది. ట్రంప్ సుంకాల బెదిరింపులు.. చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" ఎగుమతులపై నియంత్రణలను విధించడంతో పరిస్థితి క్షీణించసాగింది. ఈ తరుణంలో.. తాజా భేటీ చైనా–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు దారితీసే అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చిస్తారని, ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో జరుగుతున్న భేటీ సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అయితే ట్రంప్-జిన్పింగ్ల భేటీ కంటే ముందే ట్రేడ్ డీల్కు సంబంధించిన ఒప్పందం ఖరారైనట్లు సంకేతాలు అందుతున్నాయి. దీని ప్రకారం.. అమెరికా సుంకాలను నిలిపివేయడం, అలాగే.. చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" నియంత్రణలను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయడం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
ట్రంప్కి ఊహించని ఎదురుదెబ్బ!
పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి..అంతర్జాతీయ సమాజంలో ఒంటరితనం.. వెరసి ఒత్తిడికి గురైన ఇరాన్-రష్యాలు.. ఇప్పుడు అమెరికా సైతం అడ్డుకోలేని మార్గాన్ని ఎంచుకున్నాయి అదే 162 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ప్రపంచ వాణిజ్యాన్ని శాశ్వతంగా మార్చివేయగల ఈ పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది.. ఇరాన్-రష్యాల మధ్య రష్ట్ నుంచి అస్తారా వరకు నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గం ఇనుము, కాంక్రీటుతో కూడిన ఉత్త నిర్మాణం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC)లో అత్యంత కీలక భాగం. మొత్తం 7,200 కిలోమీటర్ల పరిధిలోని ఈ కారిడార్ వాణిజ్య ఖర్చులను ఈ రైల్వే లైన్ 30 శాతం తగ్గించడమే కాదు.. రవాణా సమయాన్ని కూడా 37 రోజుల నుండి 19 రోజులకు తగ్గించగలదు. పైగా సుయాజ్ కాలువ మార్గంతో పోలిస్తే సగం సమయం మాత్రమే!.ఇరాన్తో ఈ ఏడాది జనవరిలోనే రష్యా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కీలక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 1.6 బిలియన్ యూరోల(మన కరెన్సీలో 1,641 కోట్ల రూపాయలు) నిధులను ఒక్క రష్యానే ఈ ప్రాజెక్టు కోసం సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టు గనుక అందుబాటులోకి వస్తే.. ప్రతి ఏడాది 20 మిలియన్ టన్నుల సరుకులు(నూనె, గ్యాస్, ఉక్కు, ఆహారం, యంత్రాల వంటివి) రవాణా చేయొచ్చు. అయితే..రష్యా-ఇరాన్ ఈ రైలు ప్రాజెక్ట్ వ్యూహాత్మకమేనన్న అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ఏర్పడిన ఒంటరితనాన్ని అధిగమించి, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రధారులుగా మారాలని రష్యా, ఇరాన్లు భావిస్తున్నాయనేది స్పష్టం అవుతోంది. పైగా సూయాజ్ కాలువ, మలక్కా జలసంధి పాశ్చాత్య దేశాలు అడ్డుపడదగిన మార్గం కాదు కూడా.ఏయే దేశాలు చేతులు కలపొచ్చు?చైనా ఈ అభివృద్ధిని ఆసక్తిగా గమనిస్తోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో(BRI) ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం నుండి బాల్టిక్ వరకు నిరంతర వాణిజ్య మార్గాన్ని పర్యవేక్షిస్తోంది. పాశ్చాత్య ఆంక్షలను తిరస్కరిస్తున్న ఈ బ్లాక్.. భవిష్యత్తులో INSTCతో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. 2024లో రష్యా అధికారికంగా గుర్తించిన తాలిబన్ పాలిత అఫ్గనిస్తాన్ కూడా ఈ కారిడార్లో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది పాకిస్థాన్ను పక్కనపెట్టి దక్షిణాసియాలోకి మార్గాన్ని విస్తరించనుంది. ఇదే సమయంలో భారత్ ప్రతిపాదించిన IMEC కారిడార్(అమెరికా, భారత్, ఇజ్రాయెల్, యూరప్ కలిసి ప్రతిపాదించిన మార్గం) ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. దీంతో.. భారత్ కూడా ఈ మార్గాన్ని పరిశీలించవచ్చనే అంచనాలున్నాయి. ప్రభావం..ఈ రైలు మార్గం (Rasht–Astara) పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా అమెరికా ప్రభావాన్ని తగ్గించడంలో కీలకమే చెప్పొచ్చు. పైగా ఈ కారిడార్ ద్వారా చైనా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో రష్యా-ఇరాన్ సంబంధాలు బలపడతాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరచే దిశగా సాగుతుంది. బ్రిక్స్, SCO బలమైన మద్దతుతో.. పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అడ్డుకోగలరా?ఇంతటి వ్యూహాత్మకమైన రైలు మార్గాన్ని ట్రంప్ దీన్ని నేరుగా అడ్డుకోవడం చాలా కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. అయితే.. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రొత్సహించడమో(IMEC కారిడార్ త్వరగతిన పూర్తయ్యేలా చూడడం) లేదంటే ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లతో ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇదీ చదవండి: ప్రపంచానికి దారిదీపం భారతే! -
కిడ్నీ మార్పిడి కోసం కేన్సర్ రోగిని పెళ్లాడింది..కట్చేస్తే..!
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ ...అన్న పాట గుర్తుకొస్తుంది ఈ ఘటన. ఏదో వ్యాధుల కారణంగా.. అవసరార్థం పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి ప్రేమ, ఇష్టం వంటివి లేదు. రోగాల కారణంగా ఒక్కటయ్యారు..కానీ వారి మధ్య విడదీయరానంత ప్రేమ చిగురించేలా చేసి..అద్భుతమే చేసింది ఆ దంపతుల మధ్య. ఎవరా ఆ జంట..? ఏమా కథ చూసేద్దామా..!2014లో చైనాలోని షాంగ్జీకి చెందిన 24 ళ్ల వాంగ్ జియావో అనే మహిళ యురేమియా అనే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి ఎంతలా ఉందంటే..ఆమెకు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స జరగకపోతే.. ఒక్క ఏడాదికి మించి బతకదని తేల్చి చెప్పేశారు వైద్యులు. అయితే ఆమెకు కిడ్నీ దానం చేసేందుకు సన్నిహితులు, బంధువులు ముందుకొచ్చినా..వాళ్లెవ్వరిది ఆమెకు సరిపోలేదు. ఓ పక్క సమయం మించిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు కేన్సర్ పేషెంట్ అయిన జాంగ్ లియాంగ్ అనే వ్యక్తి ఓ విచిత్రమైనా ఆఫర్ ఇచ్చాడామెకు. "తాను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, చనిపోయేంతవరకు చికిత్స సమయంలో తనను ప్రేమగా చూసుకునే తోడు కోసం ఆశిస్తున్నానని, అందుకు ప్రతిగా తను మరణించాక కిడ్నీని ఇస్తానని చెబుతాడు". ఇక్కడ వాంగ్కి మరో ఛాన్స్లేదు. పైగా తక్కువ వ్యవధి ఉంది. మరోవైపు జాంగ్కి సంరక్షణ, ఒక తోడు కావాలి. దాంతో బాగా ఆలోచించి వాంగ్ ఓ ఒప్పందం ప్రకారం..జాంగ్ని పెళ్లి చేసుకుంది. ఒకరు మనుగడ కోసం, మరొకరు సంరక్షణ ఆశిస్తూ చేసుకున్న ఈ వివాహం వారి జీవితాను ఊహించిన మలుపు తిప్పింది.అద్భుతం చేసిన ప్రేమ..మొదట్లో ఒప్పందాల పెళ్లి కాస్త. .బలమైన బంధంగా మారిపోయింది. అతడి కోసం వంట చేసి, కీమోథెరపీ చికిత్సలలో జాంగ్ కోరిన సంరక్షణను అందించింది. వైద్య సమస్యల కారణంగా పరిచయమైన ఈ అపరిచిత జంట వారాలు గడుస్తున్న కొద్ది.. ఇద్దరి మధ్య అనురాగం ఏర్పడి..విడిచి ఉండలేనంతగా ప్రేమ చిగురించింది. అచ్చం ప్రేమికులు మాదిరిగా అయిపోయారు ఆ దంపతులు. దూకుడుగా ఉన్న జాంగ్ కేన్సర్ వాంగ్ సహచర్యం ప్రేమ కారణంగా మెరుగవ్వుతూ..వైద్యులే విస్తుపోయేలా తగ్గిపోయింది. మొత్తానికి ఆ మహమ్మారి కేన్సర్ని జయించాడు జాంగ్. అతడు బాగుండటమే చాలు అన్నంత స్థితికి వాంగ్ వచ్చేసింది కూడా. మొదట్లో తాను బతకాలని ఆశించినా .. రాను రాను అతడు ఉంటేనే తన ప్రాణం ఉంటుంది అన్నంతగా ప్రేమను పెంచేసుకుంది. ఇక్కడ వాంగ్కి జాంగ్ కిడ్నీ రాలేదు, అయినా అలా వ్యాధితో పోరాడతూనే ఉండాలనే ఫిక్స్ అయ్యింది. విచిత్రం ఏంటంటే..ఆ వ్యాధులు ఇద్దరిని దంపతులుగా చేసి, వాటిని క్యూర్ అయ్యేలా చేశాయి. ఇక్కడ వాంగ్కి కూడా మూత్రపిండాల వ్యాధి సివియర్గా లేదని మెరుగవ్వుతుందని, మందులతో నిర్వహించొచ్చని వైద్యులు చెప్పడం విశేషం. ఇలా జరుగుతుందని ఊహించను కూడా లేదని ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ జంట. ఈ స్టోరీ ప్రేమ గొప్పతనం ఏంటో చెప్పకనే చెబుతోంది. పైగా జీవిత పరమార్థమే తానని చెప్పకనే చెప్పేసింది ఈ రెండక్షరాల ప్రేమ ..! మనం కోసం ఓ వ్యక్తి ఉన్నారు అంటే ఎంతటి అగాథాన్ని అయినా..సవాలునైనా అధిగమించి సునాయసంగా బటయపడగలం అనేందుకు ఈ దంపతులే ఉదాహరణ. ఇక్కడ ఆ జంట విషయంలో ప్రేమ అద్భుతమే చేసింది కదూ..!. (చదవండి: Delhi Police constable Sonika Yadav: వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!) -
భారత్తో లోతైన చర్చలే జరిపాం: చైనా
చైనా-భారత్ నడుమ సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇరు దేశాల సైన్యాలు ఈ మేరకు లోతైన చర్చలే జరిపినట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ వర్గాలు ఈ ప్రకటనను ధృవీకరించాల్సి ఉంది.పశ్చిమ సరిహద్దు ప్రాంతాల నిర్వహణపై కీలక చర్చలు జరిగాయని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో సైనిక , దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపింది. ఈ సమావేశం అక్టోబర్ 25వ తేదీన భారత వైపు ఉన్న ఒక నిర్దిష్ట సమావేశ స్థలంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఇదే తరహాలో జూలైలో కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) పరిసర ప్రాంతాల్లో పరిస్థితులపై చర్చలు జరిగాయి. చైనా ఈ చర్చలను కూడా “స్పష్టమైన”విగా పేర్కొంది. ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుతంగా, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుతున్నాయని తెలిపింది.2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సైనిక మోహరింపుతో నాలుగేళ్ల పాటు ఉద్రిక్త పరిస్థితులే కొనసాగాయి. అయితే.. 2024 అక్టోబర్లో కుదిరిన ఒప్పందం తర్వాత ఇండియా-చైనా సంబంధాలు మెరుగవుతున్న సూచనలు కనిపించాయి. ఈలోపు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ , చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య తియాంజిన్లో షాంగై సమ్మిట్ సందర్భంగా చారిత్రక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, “భారత్-చైనా ప్రత్యర్థులు కాదు, భాగస్వాములు” అని ఇరు దేశాధినేతలు స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడుకోవడం, పరస్పర గౌరవం, సహకారం అందించుకోవడంపై రెండు దేశాలు అంగీకరించాయని ఆ సందర్భంలో మోదీ తెలిపారు. ఈ భేటీ వేదికగా.. వాణిజ్య, పౌరవిమానయాన, పెట్టుబడుల పరంగా పరస్పర సహకారం పెంచేందుకు 12 అంశాలపై అవగాహన ఏర్పడింది.అయితే ఈ ఒప్పందాల తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారతాయని భావించినప్పటికీ.. అలాంటిదేం కనిపించేదు. ప్రస్తుతం.. తూర్పు లడాఖ్లో LAC వెంబడి ఇరు దేశాలు సుమారు 50,000–60,000 సైనికులను మోహరించాయి. అయితే తాజా చర్చల పురోగతితో ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: పాక్ ఇంక మారదా?.. మళ్లీ పిచ్చి ప్రేలాపనలు -
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చెక్మేట్!
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. వీళ్లను ఏమాత్రం తక్కువ చేయడానికి వీల్లేదు. మన దేశంలో 35 నుంచి 45 లక్షల మంది ద్వారా గత ఏడాది కాలంలో రూ.3,500 కోట్ల వ్యాపారం జరిగిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే.. ఇలా అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లకు చెక్ పెట్టేందుకు మన పొరుగు దేశం చైనా ఓ అద్భుతమైన ప్రణాళిక అమలు చేయబోతోంది. ఏదో ఒక వీడియోతో ఓవర్నైట్ సెన్సేషన్ అయిపోవడం ఈరోజుల్లో సర్వసాధారణంగా మారింది. అలా భారత్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు.. ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇదే అదనుగా తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్లను కంపెనీలు ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. భారత్తో పాటు పలు దేశాల్లో వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల్లో ఇప్పుడు వాళ్లదే కీలక పాత్ర. పైగా సెలబ్రిటీలకి బదులు తక్కువ బడ్జెట్తో ఆ పని చేస్తుండడం కంపెనీలకు కలిసొస్తోంది. ఫ్యాషన్, ఫిట్నెస్, ఫుడ్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో విస్తృతంగా కంటెంట్ రూపొందిస్తున్నారు. ఉదాహరణకు.. ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలోయింగ్ ఉన్న ఓ వ్యక్తి ఓ కంపెనీ పరుపులను అదే పనిగా ప్రమోట్ చేయడం!. అయితే ఏఐ జమానాలో.. ప్రజలను తప్పుదోవ పట్టించే కంటెంట్ కూడా అదే స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అందుకే చైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రొఫెషనల్ విషయాలపై మాట్లాడాలంటే ఇన్ఫ్లుయెన్సర్లకు అర్హతలు తప్పనిసరి చేసింది. వైద్యం, ఆర్థికం, న్యాయం, విద్య వంటి సున్నితమైన రంగాల్లో కంటెంట్ రూపొందించే ముందు ఇన్ఫ్లుయెన్సర్లు తమ విద్యా అర్హతలు, శిక్షణ పత్రాలు లేకుంటే ప్రొఫెషనల్ అనుభవాన్ని చూపించాల్సి ఉంటుంది. అక్కడి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు (ఉదాహరణకు.. Douyin, Weibo, Bilibili వంటి ప్రముఖ ప్లాట్ఫారమ్లు) ఈ అర్హతలనూ ధృవీకరించాల్సి ఉంటుంది. అలా చేయకుంటే.. ఇన్ఫ్లుయెన్సర్ల సో.మీ. అకౌంట్లను నిలిపివేయడమే కాదు.. శాశ్వత నిషేధం విధించే అవకాశం లేకపోలేదు. అలాగే.. 100,000 యువాన్ (₹11 లక్షల వరకు) జరిమానా విధించబడుతుంది. చైనా సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CAC) ఈ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ రూల్స్లో ఇన్ఫ్లుయెన్సర్లు లగ్జరీ లైఫ్స్టైల్ను ప్రదర్శించడంపై కూడా నిషేధం.ఇన్ఫ్లుయెన్సర్ల వ్యక్తిగత అకౌంట్లు మాత్రమే కాదు.. వాళ్లు నిర్వహించే మల్టీ-చానల్ నెట్వర్క్ (MCN)లకు కూడా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ సంస్థలు తమ టాలెంట్ను రాజకీయంగా, ప్రొఫెషనల్గా సమర్థవంతంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదే సమయంలో.. కంపెనీ బ్రాండ్లు కూడా ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కంపెనీలు లేదంటే సో.మీ. ప్లాట్ఫారమ్లు ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ను స్పష్టంగా లేబుల్ చేయాలి. ఈ లేబుల్స్ను తొలగించడం లేదంటే తారుమారు చేయడం కఠినమైన నేరంగా పరిగణిస్తారు. లేబులింగ్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధిస్తారు. భారత్లో ఇలా.. భారత్లో చైనా తరహా కఠిన నిబంధనలు (అర్హతల ధృవీకరణ, ప్లాట్ఫారమ్లపై బాధ్యత, భారీ జరిమానాలు) అమల్లో లేవు. కానీ.. స్పాన్సర్డ్ కంటెంట్కి డిస్క్లోజర్ తప్పనిసరిగా ఉంది. అంటే.. ఏఎస్సీఐ (Advertising Standards Council of India) ప్రకారం, #ad, #sponsored వంటి ట్యాగ్లు తప్పనిసరిగా ఉండాలి. అలాగే తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తే, ఇన్ఫ్లుయెన్సర్తో పాటు బ్రాండ్ కూడా Consumer Protection Act (CCPA) ప్రకారం బాధ్యత వహించాలి. ఈ ఏడాదిలో ఏర్పాటైన ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ గవర్నెన్స్ కౌన్సిల్ (IIGC).. నైతిక ప్రమాణాలు, కంటెంట్ నైతికత, వినియోగదారుల హక్కులు వంటి అంశాలపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అయితే..ఏఐ ఆధారిత కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్సహా ఇతర దేశాలు కూడా చైనా విధించిన నిబంధనలను పరిశీలించే అవకాశం ఉంది. స్వేచ్ఛా భావప్రకటనకు ఇది అడ్డంకిగా మారుతుందన్న విమర్శలు ఉన్నప్పటికీ, ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు ఇది అవసరమన్న వాదనలు కూడా ఉన్నాయి. -
ప్రధాని మోదీపై హత్యకు కుట్ర?.. పుతిన్ రక్షించాడా?
భారత ప్రధాని నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ భారీ హత్య కుట్రను భారత, రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా అడ్డుకున్నాయని ఓ సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికాకు చెందిన ఓ స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లు తెలుస్తోంది.మలయాళ మీడియా సంస్థ 'మాతృభూమి', రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) మౌత్ పీస్ ఆర్గనైజర్ కథనాల ప్రకారం, ఆగస్టు 31వ తేదీ రాత్రి ఢాకాలోని ఓ విలాసవంతమైన హోటల్లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ మృతదేహం లభ్యమైంది. బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చానని అధికారికంగా చెప్పినప్పటికీ, అతని ప్రొఫైల్ నిఘా వర్గాలలో అనుమానాలు రేకెత్తించింది. అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లలో అనుభవమున్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అసాధారణం. అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించి నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి. దీంతో జాక్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఉందని భావించారు.Modi’s life was under threat during SCO summit.An american operative was in Bangladesh for the job.Putin invited him to travel in his car.That was the moment 😲Assassin@tion was planned on China's land to blame China. The Russian spy agency saved him. pic.twitter.com/u9TD7pjnZj— Defense Scope🔭 (@DefeScope) October 22, 2025పుతిన్ రక్షించాడా?ఇదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీని తన అత్యంత భద్రత కలిగిన 'ఆరస్ లిమోసిన్' కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇద్దరూ సుమారు 45 నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు. ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడలేవు. సంభాషణలను రికార్డ్ చేయడం గానీ, ట్రాక్ చేయడం గానీ అసాధ్యం. మోదీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారని సమాచారం.25th October 2025. CIA Links Surface After Putin Shielded Modi During SCO Meet.According to Defence News, President Putin saved Indian Prime Minister Modi, from possible assassination attempt at hands of Western Intelligence Agencies. Speculations revolve around direct… pic.twitter.com/yCaigh7heN— Sense and Sensibility (@UNIT_Diplomat) October 25, 2025భారత నిఘా సంస్థ 'రా' (RAW), రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ 'ఎస్విఆర్' (SVR) కొద్దిరోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లను పసిగట్టాయి. పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఆగస్టు 30 రాత్రికే ముప్పును గుర్తించి, నిందితుల కదలికలపై నిఘా పెట్టి కుట్రను అమలు కాకముందే నిర్వీర్యం చేశాయి. ఆ మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.మోదీ వ్యాఖ్యల అర్థమేంటి?చైనా పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ ‘సమీకాన్ ఇండియా’ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి, “నేను చైనాకు వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా? లేక తిరిగొచ్చినందుకా?” అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనం గుర్తుచేసింది. తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డాననే విషయాన్ని ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని కథనం విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో, పలు డిజిటల్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి."Mai gaya tha isliye Tali baja rahe ho YA Laut aaya hu isliye Tali baja rahe ho?"REPORTEDLY, it was planned to turn SCO Summit into Tashkent Summit, but President Putin saved PM Modi Ji from meeting Lal Bahadur Shastri Ji's fate.Ps- China didn't have any hand in it. Same old… pic.twitter.com/3sYLogtyi1— BhikuMhatre (@MumbaichaDon) October 11, 2025ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం, ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉండటం వంటివి అమెరికాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చడంలో అమెరికాకు చరిత్ర ఉందని, ఈ నేపథ్యంలోనే ఈ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
ప్రపంచ జ్ఞానామృతం భగవద్గీత
బీజింగ్: భగవద్గీత జ్ఞానామృతమంటూ ప్రశంసలు చైనా పండితులు కురిపించారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొనే ఆధ్యాత్మిక, భౌతిక సమస్యలకు సమాధానాలు ఇందులో ఉన్నాయన్నారు. భగవద్గీత భారతీయ నాగరికత సూక్ష్మ చరిత్ర వంటిదంటూ శ్లాఘించారు. ఈ ప్రాచీన భారతీయ గ్రంథరాజంపై చైనీయులు ఇలా బహిరంగంగా గౌరవాన్ని ప్రకటించడం అరుదైన విషయంగా చెబుతున్నారు. శనివారం చైనా రాజధాని బీజింగ్లో భారత దౌత్యకార్యాలయం ‘సంగమమ్– భారతీయ తాత్విక సంప్రదాయాలు’అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో పలువురు పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గీతను భారతీయ తత్వశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా అభివరి్ణంచారు. ఆధ్యాత్మిక, భౌతిక అన్వేషణల మధ్య సామరస్యాన్ని సాధించేందుకు భగవద్గీత ఎంతో సాయంగా ఉంటుందన్నారు. భగవద్గీతను చైనీస్ భాషలోకి తర్జుమా చేసిన ప్రొఫెసర్ ఝాంగ్ బావోషేంగ్(88) ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. భగవద్గీతను భారతదేశ ఆధ్యాత్మిక ఇతిహాసం, తాత్విక విజ్ఞాన సర్వస్వంగా ఆయన పేర్కొన్నారు. ఇది నేటికీ భారతీయ జీవనాన్ని తీర్చిదిద్దుతోందని చెప్పారు. ప్రొఫెసర్ ఝాంగ్ భారత్లో 1984–86 సంవత్సరాల మధ్య గడిపిన తన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దక్షిణాగ్రాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న గోరఖ్పూర్ వరకు ప్రతిచోటా శ్రీకృష్ణుని ఉనికిని, ఒక సజీవ నైతిక, ఆధ్యాత్మిక ఆదర్శాన్ని ప్రత్యక్షంగా గమనించానన్నారు. జెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఓరియంటల్ ఫిలాసఫీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వాంగ్ ఝి–చెంగ్ మాట్లాడుతూ.. 5 వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతీయ యుద్ధరంగంలో జరిగిన సంభాషణ అయిన భగవద్గీత, నేడు ప్రజలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, అనేక గందరగోళాలకు సైతం సరైన సమాధానాలను ఇస్తూ కాలాతీతంగా మారిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన పండితులకు భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ఘనస్వాగతం పలికారు. గతేడాది తమ దౌత్య కార్యాలయం రామాయణంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
పటిష్టంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడినట్టు ఆర్బీఐ అక్టోబర్ బులెటిన్ తెలిపింది. ‘‘అమెరికాలో వాణిజ్య, ఆర్థిక పరమైన అనిశ్చితులు పెరిగాయి. అయినప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కుదురుగా ఉంది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తలెత్తడం, అమెరికా ప్రభుత్వం షట్డౌన్ కొనసాగుతుండడంతో అక్టోబర్లో పెట్టుబడిదా రుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపించింది. పట్టణ డిమాండ్ కోలుకుంటున్నట్టు, గ్రామీణ వినియోగం బలంగా ఉన్నట్టు ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ భా రత ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్త ప్రతికూలతలకు దూరంగా ఉండలేదు. కానీ, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరడం, బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, తగినంత విదేశీ మారక నిల్వలు, విశ్వసనీయమైన ద్రవ్య, పరపతి కార్యాచరణతో భారత్ గట్టిగా నిలబడగలిగింది’’అని ఆర్బీఐ తన బులెటిన్లో పేర్కొంది. సంస్కరణల మద్దతు అక్టోబర్ 1 నాటి మానిటరీ పాలసీ కమిటీ తీర్మానం ప్రకారం వృద్ధి అవకాశాలు బలంగానే ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. దేశీ చోద కాలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. దేశీయంగా చేపడుతున్న సంస్కరణలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డాలర్తో రూపాయి విలువ ఇటీవల క్షీణించినట్టు పే ర్కొంటూ.. వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు స్థిరంగా బయ టకు వెళుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వరుసగా మూడో నెల సెపె్టంబర్లో ప్రతికూలంగా నమోదైనట్టు తెలిపింది. ఈ బులెటిన్లోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, అధికారికమైనవి కావని ఆర్బీఐ పేర్కొంది. -
భారత్లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో..
ఒక దేశంలో అధిక ఇళ్లు ఉండి.. కొనుగోలుదారులు లేక సంక్షోభంలో కూరుకుపోతుంటే, మరో దేశంలో కోట్లాదిమందికి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. చైనాలో దాదాపు 90 శాతం మంది ప్రజలకు సొంత ఇళ్లు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. భారతదేశంలో మాత్రం 31 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలకు ఇంకా సొంత గూడు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మన దేశ గృహనిర్మాణ రంగాన్ని, దాని చుట్టూ అల్లుకున్న సవాళ్లకు ఇది అద్ద పడుతుంది. అసలు చైనాలో ఇంత అధిక సంఖ్యలో ప్రజలకు సొంతిల్లు ఉండటానికి కారణాలేమిటి? అదే సమయంలో భారత్లో సొంతింటి కల ఎందుకు సాకారం కావడం లేదో కారణాలను పరిశీలిద్దాం.చైనాలో సొంతిల్లు ఉండటానికి కారణాలుగత ప్రభుత్వ విధానాలు, మార్కెట్ సంస్కరణలు1998కు ముందు చైనాలో పట్టణ గృహనిర్మాణ రంగం దాదాపు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. 1998లో ప్రభుత్వం గృహనిర్మాణ సంస్కరణలను చేపట్టి ప్రజలు ఇళ్లను సొంతం చేసుకోవడానికి అనుమతించింది. అంతకుముందు ఉన్న ఇళ్లను అతి తక్కువ ధరలకు ఇతరులకు విక్రయించారు. దాంతో పెద్దమొత్తంలో సొంతింటి కల నెరవేరింది.సంపద పోగుచేసుకోవడంలో..చైనాలో ప్రజలు సంపదను పోగుచేయడానికి ఇళ్లను అత్యంత సురక్షితమైన, ప్రధాన సాధనంగా భావిస్తారు. విదేశీ పెట్టుబడులకు ఇతర మార్గాలు పరిమితంగా ఉన్నప్పుడు స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ఒక సాంప్రదాయక పద్ధతిగా మారింది. ఇది ఇళ్ల కొనుగోలుకు ఉన్న డిమాండ్ను భారీగా పెంచింది.పట్టణీకరణవేగవంతమైన పట్టణీకరణ కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు తరలివచ్చారు. పెరిగిన డిమాండ్ను తీర్చడానికి స్థానిక ప్రభుత్వాలు భూమిని స్థిరాస్తి డెవలపర్లకు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకున్నాయి. డెవలపర్లు భారీ స్థాయిలో గృహ నిర్మాణాలను చేపట్టారు. కొన్ని సందర్భాల్లో ఇది జనాభా అవసరాల కంటే అధిక సంఖ్యలో ఇళ్లను నిర్మించడానికి దారితీసింది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో అధిక గృహ లభ్యత ఏర్పడింది.Breaking🇨🇳90% of people in China now own their own homes.Most Homeless People (2025)🇮🇳 India – 3.1M+🇺🇸 United States – 580K+🇳🇬 Nigeria – 500K+🇷🇺 Russia – 440K+🇵🇭 Philippines – 420K+🇧🇷 Brazil – 390K+🇮🇩 Indonesia – 380K+🇲🇽 Mexico – 320K+🇿🇦 South Africa – 280K+🇫🇷… pic.twitter.com/ZykA0EBKMX— World updates (@itswpceo) October 22, 2025భారత్లో ఇలా..స్థిరాస్తి ధరలు అధికం, ఆదాయాలు తక్కువపట్టణ ప్రాంతాల్లో భూమి, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరగడం వల్ల ఇళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయ వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో సిటీలు, టైర్-1 నగరాల్లో ఇది ప్రధాన సమస్య.బ్యాంక్ రుణాలు, ఫైనాన్సింగ్ సవాళ్లుగృహ రుణాలు అందుబాటులో ఉన్నప్పటికీ రుణం కోసం అవసరమయ్యే భారీ డౌన్ పేమెంట్ను చెల్లించలేని పరిస్థితులున్నాయి. తక్కువ ఆదాయ వర్గాల వారికి బ్యాంకు రుణాలు పొందడంలో కఠినమైన షరతులు, క్రెడిట్ హిస్టరీ లేకపోవడం అడ్డంకులుగా మారుతున్నాయి.భూమి కొరత, భూ సేకరణ సమస్యలుపెరుగుతున్న జనాభాకు సరిపడా భూమి లభ్యత లేదు. పట్టణ ప్రాంతాల్లో భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది గృహనిర్మాణ ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుతున్నాయి. భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివాదాలు కూడా ప్రాజెక్టుల ఆలస్యానికి, ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.సామాజిక కారణాలుపట్టణ వలస, మురికివాడలుమెరుగైన ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది నిరంతరం నగరాలకు వలస వస్తున్నారు. ఈ వలసలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో గృహ లభ్యత, మౌలిక వసతులు లేకపోవడం వల్ల మురికివాడలు (స్లమ్స్) ఏర్పడుతున్నాయి. ఈ వర్గాలకు సొంతింటి కల సుదూరంగానే ఉంటోంది.ప్రభుత్వ పథకాల అమలు సవాళ్లుకేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY)’ వంటి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ లబ్ధిదారులను గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. ఇది పథకాల అమలు ఆలస్యం అవ్వడానికి కారణమవుతోంది.మౌలిక వసతుల లేమిప్రభుత్వం నిర్మించే తక్కువ ధర గృహాలు కొన్నిసార్లు నగరాలకు దూరంగా ఉంటున్నాయి. చాలావరకు కనీస మౌలిక వసతులు (రవాణా, నీరు, విద్యుత్) అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉండటం వల్ల వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు.భారత్లో సొంతింటి కలను సాకారం చేయాలంటే ప్రభుత్వాలు తక్కువ ఆదాయ వర్గాలకు తగినంత ఫైనాన్సింగ్ సహాయం అందించాలి. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడం, పట్టణ ప్రాంతాల్లో గృహ లభ్యతను పెంచడం వంటివి చేయాలి. భూమి ధరల పెరుగుదలను నియంత్రించడం వంటి సమగ్ర విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: 400 సెల్ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా? -
భారత్ పక్కలో బల్లెంలా చైనా.. సరిహద్దుల్లో ఆయుధాలు
-
భారత్ పక్కలో చైనా మిసైల్ బల్లెం
న్యూఢిల్లీ: కయ్యాలమారి చైనా ఒకవైపు భారత్కు స్నేహ హస్తం అందిస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. టిబెట్లోని పాంగాంగ్ సరస్సు తూర్పు ఒడ్డున, వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అత్యాధునిక గగన రక్షణ వ్యవస్థ బేస్ను నిర్మిస్తోంది. సకల వసతులతోపాటు భారీ ఆయుధాలు, క్షిపణులు మోహరించేలా దీని నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తోంది. ఈ బేస్ను మొదట అమెరికాకు చెందిన ఆల్సోర్స్ అనాలిసిస్ అనే సంస్థ గుర్తించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా బేస్ను కనిపెట్టింది. 2020లో భారత్–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన గస్తీ పాయింట్కు ఈ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గార్ కౌంటీలో ఉన్న ఈ కేంద్రం భారత్లో ఇటీవల ఆధునీకరించిన న్యోమా ఎయిర్ఫీల్డ్కు సరిగ్గా ఎదురుగా ఉంటుంది. భారీ క్షిపణులకు కేంద్రంగా.. ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే ఈ కాంప్లెక్స్లో భారీ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యార్లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు, రాడార్ సిస్టంలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షిపణి లాంచింగ్ వాహనాలను రహస్యంగా దాచి ఉంచేందుకు భారీ బంకర్ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు ముందుకు వెనుకకు జరుపగల పైకప్పును అమర్చినట్లు నిపుణులు గుర్తించారు. అంటే ఆ భవనంలో దాగి ఉన్న వాహనం నుంచి క్షిపణిని ప్రయోగించాలనుకుంటే వెంటనే భవనం పైకప్పు పక్కకు జరుగుతుంది. క్షిపణి ప్రయోగం పూర్తికాగానే మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. శత్రువు నిఘాకు దొరక్కుండా తమ క్షిపణి వ్యవస్థలను దాచేందుకు ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఒక్కో బంకర్ రెండు వాహనాలను నిలిపి ఉంచగల భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ బంకర్ భవనాల్లో చైనా దీర్ఘశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ (భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి) హెచ్క్యూ–9 క్షిపణి వ్యవస్థలను మోహరించనున్నట్లు ఇంటెలిజెన్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ ఈ కాంప్లెక్స్ను బహిర్గతం చేసిన తర్వాత అమెరికాకే చెందిన గగనగల ఇంటెలిజెన్స్ కంపెనీ వంటార్కు చెందిన ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ టీం (ఓఎస్ఐఎన్టీ) మరింత కచ్చితమైన చిత్రాలను సేకరించింది. సెపె్టంబర్ 29న తీసిన శాటిలైట్ చిత్రాల్లో కొన్ని బంకర్ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండగా, కొన్నింటికి మూసి ఉండటం కనిపించింది. ‘ఈ రకమైన భవనాలు చైనా క్షిపణి వ్యవస్థలకు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శత్రువుల ఎదురుదాడి నుంచి తన క్షిపణి వ్యవస్థలను రక్షిస్తాయి. మామూలు సమయంలో అక్కడ మిసైల్ లాంచర్స్ ఉన్నట్లు గుర్తించటం కూడా కష్టమే’అని ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ పేర్కొంది. చైనా గతంలో ఇలాంటి భవనాలనే దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల్లో నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా చేపట్టిన ఈ నిర్మాణాలను గత జూలైలోనే డామియెన్ సైమన్ అనే జియోస్పేషియల్ పరిశోధకుడు గుర్తించాడు. కానీ, అప్పుడు అక్కడ ఏం నిర్మిస్తున్నారన్నది తెలియలేదు. -
ట్రంప్ ‘ఏడువారాల నగలు’
మహారాణులకు, ఏడువారాల నగల వలె, అమెరికా మహారాజు డోనాల్డ్ ట్రంప్కు ఏడువారాల వ్యూహాలుంటాయి. ఈ స్థితిని ప్రపంచం పలు విషయాలలో గమనిస్తున్నది. గమనించి మొదట భయ పడింది. తర్వాత అయోమయానికిగురైంది. చివరకు పరిస్థితి కొంత వినోదాత్మకంగా మారగా, ప్రేక్షకులలో కొందరు ట్రంప్ తలపై ఆయన ఇటీవల స్వయంగా ధరించి పోస్ట్ చేసిన రాజు గారి కిరీటానికి బదులు సర్కస్ క్లౌన్ టోపీని చూస్తున్నారు. కొందరు ఏమిచేయాలో తోచక విసుగెత్తి తలలు పట్టుకుంటున్నారు.అమెరికా అధ్యక్షుని గురించి పైన చేసిన వ్యాఖ్యలేవీ కాలక్షేపపు ఊహాగానాలు కావు. ప్రతి ఒక్కటీ వాస్తవంగా జరుగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకుని అన్న మాటే. అట్లా పరిగణించిన విష యాలు ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, భారత దేశంతో ఆర్థిక – వ్యూహాత్మక సంబంధాలు, చైనాతో వాణిజ్య – వ్యూహాత్మక తగవులు. వీటికి సంబంధించి కొన్ని మాసాల నుంచి మొదలుకొని నేటివరకు మాట్లాడుతున్నవి, చేస్తున్నవి, చేస్తానని చేయనివి, తాను చేయకున్నా ఇతరులు చేయాలనేవి, ఇతరులు చేయాలంటూ తిరిగి అందుకు మార్పులు చేసేవి, తాను చేస్తాననే వాటిలో మార్పులు తెచ్చేవి... అన్నింటినీ ఒక కాలక్రమంలో పేర్చి పెట్టి చూస్తే, మొత్తం మీద కనిపించేది ట్రంప్ చక్రవర్తి ‘ఏడువారాల నగలు’. మనంఅంటున్న ఈ మాట ఆయనకు చేరే అవకాశం లేదుగానీ, ఇటీవల అమెరికన్ పౌరులు ‘నో కింగ్’ అంటూ పెద్ద ఎత్తున జరిపిన నిరసనలను హాస్యాస్పదంగా చూపేందుకు తానే హాస్యాస్పద వేషధారణ చిత్రాన్ని పోస్ట్ పెట్టినట్లు, ఏడువారాల నగలతో ఏడు పోస్టులు పెట్టే వారేమో!చక్రవర్తి ఎందుకు?ట్రంప్ చేస్తున్నదంతా ఒక వ్యూహంలో భాగమని ఆయన అంతే వాసులు ప్రచారం చేసి లోకాన్ని నమ్మించజూశారు. వారు చెప్పిన దాని ప్రకారం ఆయన ఒక విషయమై అవతలి వారిని పిచ్చుకపై వేస్తాను సుమా బహ్మాస్త్రం అన్నట్లు మొదటే భయపెడతారు. అట్లా వేయటం నిజంగా తన ఉద్దేశం కాదు. కానీ అట్లా భయపెడితే అవతలి వారు బ్రహ్మాస్త్ర ప్రయోగం నిజంగానే జరగవచ్చునని భయ పడిపోయి, తన ఆదేశాలను శిరసావహించగలరన్నది ట్రంప్ అంచ నాలట! దానిని వారు బ్రహ్మాస్త్ర వ్యూహమన్నారు. ఇది యథాతథంగా వినేందుకు గొప్పగా తోస్తుంది. మధ్యయుగాల నాటి ‘బెనెవెలెంట్ డిక్టేటర్ (ఉదార నియంత) లక్షణాల తరహాలో కనిపిస్తుంది. ట్రంప్ వ్యక్తిత్వంలో, వ్యవహరణలో నిజంగానే ఈ లక్షణాలు ఉన్నాయన్నది కొందరి అభిప్రాయం. పరిస్థితి అంతవరకే అయితే ఫరవాలేదు. నిజం చెప్పాలంటే ‘ఉదార నియంత’ భావన ఆధునిక ప్రజాస్వామ్య భావనలకు సరిపడేది కాదుగానీ, ఒకోసారి అందువల్ల కొంత మంచి కూడా జరుగుతుంటుంది. అదే సమయంలో ఎక్కువసార్లు బెడిసి కొడుతుంది. ఈ రెండింటిలో ఏమి జరిగేదీ అవతలి పక్షాల పైనా, వాస్తవ పరిస్థితుల పైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, కిరీటం ధరించిన ‘కింగ్ ట్రంప్’ గారి ‘బెనెవె లెంట్ డిక్టేటర్’ వ్యూహం కొద్ది సందర్భాలలో తప్ప పనిచేయదు. వాస్తవానికి ఈ హెచ్చరిక ఆయనకు అందరికన్నా ముందు చేసినవాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా. అయినదానికి కాని దానికి ట్యారిఫ్లు పెంచుతూ, వాణిజ్య ఒప్పందాల గురించి బెది రిస్తూ, చివరకు బ్రెజిల్ ప్రతిపక్ష నాయకుడు బోల్సొనారోపై చర్యల విషయంలోనూ జోక్యం చేసుకొనజూసినపుడు, ‘‘ప్రపంచం చక్ర వర్తిని కోరుకోవటం లేదు. అమెరికన్లు ట్రంప్ను ఎన్నుకున్నది చక్ర వర్తి అయేందుకు కాదు’’ అని ఘాటుగా మాట్లాడారాయన. పరిస్థి తిని ట్రంప్ అర్థం చేసుకోలేదన్నది వేరే విషయం! మార్చేందుకే మాట ఉన్నది...ప్రస్తుతానికి వచ్చి, పైన పేర్కొన్న వేర్వేరు విషయాలను గమనిస్తే, అమెరికా అధ్యక్షుడు నాలుగు రోజులకు ఒక విధంగా మాట మార్చటం చూస్తున్నాం. ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటలలో ఆపివేయగలనంటూ మొదలుపెట్టిన ఆయన, ఇపుడు ఏమిచేయాలో తోచక, టేబుల్కు రెండు వైపులా తానే నిలిచి తనతో తానే పింగ్పాంగ్ ఆడుతున్నారు. ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని, సోమవారం నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ను హెచ్చరిస్తారు. డోన్బాస్ను వదలుకోవాలని మంగళవారం ఆదేశించి క్రిమియాను సైతం స్వాధీన పరచుకునేందుకు జెలెన్స్కీకి తోమహాక్లు అంద జేయగలనంటూ బుధవారం నాడు పుతిన్ను భయపెట్టజూస్తారు. గురువారంరోజు ఇద్దరితోనూ ఖనిజ ఒప్పందపు చర్చలు నడుపు తారు. శుక్రవారం యూరోపియన్ దేశాలను మీ దారి మీదేనని చెప్పి, శనివారం నాడు ‘నాటో’ను అందరం కలిసి బలోపేతం చేద్దామంటారు. ఈ విధంగా ఉక్రెయిన్ విషయమై ప్రపంచం గమనించి అబ్బు రపడుతున్న ‘ఏడువారాల నగల ప్రదర్శన’ వంటిదే ఇతర సంద ర్భాల్లోనూ చూస్తున్నాము. ఉక్రెయిన్ వలెనే మరొక యుద్ధమైన గాజాను గమనించండి. గతాన్ని కొద్దిసేపు అటుంచి ఇటీవలి పరిణామాలనే గమనిస్తే– 20 అంశాల ప్రకటన, షర్మ్ అల్ షేక్ సంతకాలతో మొత్తం పశ్చిమాసియాలోనే ‘శాశ్వత శాంతి’ సిద్ధించిందని ప్రకటించారు ట్రంప్. అది తొందరపాటనీ, మొదటి దశ అయిన కాల్పుల విరమణే ఇంకా స్థిరపడవలసి ఉందనీ అందరూ ఎత్తిచూపారు. కానీ అధ్యక్షుడు మాత్రం నోబెల్ శాంతి ప్రకటన ముగిసినదే తడవు హమాస్కు హెచ్చరికలు మొదలుపెట్టారు.అంతర్గత అరాచక శక్తులను అదుపు చేసేందుకు హమాస్ ఆయు ధాలను ఉంచుకోవచ్చునని ఒకరోజు ప్రకటించి, ఒకరోజు తిరిగే సరికి అస్త్రసన్యాసం చేస్తారా లేక ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ‘సర్వనాశనం’ చేయాలా అని బెదిరింపులు మొదలుపెట్టారు. ఇజ్రా యెల్ బాంబింగులు, సహాయ సరఫరాల నిలిపివేతలపై మౌనం వహిస్తున్నారు. గతంలోకి వెళితే, ఆయన గాజా, పాలస్తీనా విధా నాలు, రకరకాల ప్రకటనలు తెలిసినవే గనుక ఇక్కడ రాయ నక్కర లేదు. 20 అంశాల ప్రకటన అయితే బయటి వారితో తాత్కా లిక ప్రభుత్వం, బయటి దళాలతో భద్రతావ్యవస్థ, బయటి వారి ప్రణాళికల మేరకు అభివృద్ధి అని చెప్పటం మినహా, స్వతంత్ర పాలస్తీనా గురించి నిశ్చితంగా ఏమీ పేర్కొనక పోవటం తెలిసిందే. వీటన్నింటి చుట్టూ తిరుగుతూ ట్రంప్ వేర్వేరు మాటలతో ఏడు వారాల నగలు ధరిస్తూనే ఉన్నారు. మధ్యయుగాల క్రీడభారత దేశం, చైనాలతో ట్యారిఫ్లు, వాణిజ్య ఒప్పందాలకుసంబంధించి కూడా సరిగా ఇదే జరుగుతున్నది. ఒక రోజు బెదిరింపులు, ఈసడింపులు, మరునాడు సానునయమైన మాటలు. ఒక రోజు సంయుక్త సమావేశపు ప్రతిపాదనలు, మరొకరోజు వాయి దాలు... ఇది ఈ రెండు ఆసియన్ దేశాల విషయంలోనూ జరుగు తున్నది. ట్రంప్కు సమస్య ఎక్కడ వస్తున్నదంటే, కొద్ది తేడాలతో రెండు దేశాలు కూడా ఒక పరిమితిని దాటి తమ జాతీయ ప్రయో జనాలను వదులుకునేందుకు సిద్ధంగా లేవు. చైనా అయితే తన ఆర్థిక బలిమి వల్ల, కొన్ని రంగాలలో అమెరికాను పూర్తిగా ధిక్కరించ గలగటం ట్రంప్కు పాలుపోని పరిస్థితి అయింది. అయినా చైనా, ఇండియాలను గెలవనివ్వకూడదు గనుక, తరచూ ‘నగల మార్పిడి’ చేసుకుంటూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు అర్థం చేసుకుని మారవలసింది ఏమంటే, తన వ్యూహంలో బలహీనతలు అనేకం ఉన్నాయి. ప్రపంచం ఒకప్పటి వలె లేదు. అందువల్ల, మధ్య యుగపు రాజువలె కిరీట ధారణ, రాణివలె ఏడువారాల నగలు చూసి చిత్తభ్రమలకు లోనై లొంగిపోయే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతున్నది.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా డీల్
స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలు రక్షణ, అంతరిక్ష రంగంలో కీలక ఉపకరణాల దాకా అన్నింటి తయారీకి అత్యావశ్యకమైన ఖనిజాల సరఫరాపై చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. విదేశాలకు తమ అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయాలంటే కఠిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని చైనా మొండికేయడం తెల్సిందే.దీంతో చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా, ఆస్ట్రేలియా రూ.75,000 కోట్ల విలువైన చరిత్రాత్మకమైన ‘అరుదైన ఖనిజాల ఒప్పందం’కుదుర్చుకున్నాయి. అధ్యక్షభవనంలో డొనాల్డ్ ట్రంప్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు.‘‘గత కొన్ని నెలలుగా చర్చలు జరిపి ఎట్టకేలకు నేడు ఒప్పందం కుదుర్చుకున్నాం. మరో ఏడాదిలోగా మా రెండు దేశా లు భారీ ఎత్తున అరుదైన ఖనిజ నిల్వలను సాధించనున్నాయి. ఈ నిల్వలతో మేమేం చేస్తామో మీకు కూడా తెలీదు’’అని వ్యాఖ్యానించారు.తొలి ఆరు నెలల్లో ఇరు దేశాలు చెరో 3 బిలియన్ డాలర్ల మేర ఖనిజాల తవ్వకాల ప్రాజెక్ట్ల్లో పెట్టుబడులు పెడతాయి. ఉపగ్రహాలు, ఎంఆర్ఐ యంత్రాలు, గైడెన్స్ వ్యవస్థలు, లేజర్లు, జెట్ ఇంజిన్లదాకా అన్నింటి తయారీలోనూ అరుదైన భూ మూలకాలనే ఉపయోగిస్తారు. -
China: ఈ బుల్లెట్ ట్రైన్ ‘‘మెరుపు తీగే’.. గంటకు ఎంత వేగమంటే..
న్యూఢిల్లీ: బుల్లెట్ రైళ్ల వేగంలో చైనా మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. చైనా తయారు చేసిన తాజా బుల్లెట్ రైలు సీఆర్ 450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైలు ట్రయల్ రన్లోనే గంటకు 453 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంది.బుల్లెట్ రైలు సీఆర్ 450ను ప్రస్తుతం షాంఘై- చెంగ్డు మధ్య హై-స్పీడ్ రైలు మార్గంలో టెస్ట్ చేస్తున్నారు. ఈ రైలు వాణిజ్యపరంగా గంటకు 400 కి.మీ. వేగంతో నడిచేలా రూపొందించారు. ఇది ప్రస్తుతం సేవలలో ఉన్న సీఆర్ 400 ఫక్సింగ్ రైళ్ల కంటే 50 కి.మీ. వేగవంతమైనది. ఈ పాత మోడల్ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో నడుస్తాయి. సీఆర్ 450కి ముందు ఈ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంతో నడిచే రైళ్లుగా గుర్తింపు పొందాయి.సీఆర్ 450ను స్మార్ట్ డిజైన్తో రూపొందించారు. దీని నోస్ కోన్ 15 మీటర్లు. నూతన మోడల్లో ఏరోడైనమిక్ నిరోధకతను 22 శాతం మేరకు తగ్గించారు. దీంతో వేగం, ఇంధన సామర్థ్యం మరింత మెరుగుపడ్డాయి. ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో 0 నుండి 350 కి.మీ./గం. వరకు వేగవంతం అవుతుంది. ట్రయల్స్ సమయంలో, రెండు సీఆర్ 450 రైళ్లు గంటకు 896 కిమీ వేగంతో పరుగులు తీశాయి. ప్రయాణ వేగంలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాయి. ఈ రైలును రూపొందించిన ఇంజనీర్లు స్పోర్ట్స్ కార్ల డిజైన్ ప్రేరణతో ఏరోడైనమిక్ మెరుగుదలపై ఐదేళ్లు పనిచేశారు. #China's CR450 high-speed train, the world's fastest bullet train, has set a new record by reaching a top speed of 453 km/h during testing. It can accelerate from a standstill to 350 km/h within 5 minutes! #highspeedtrain pic.twitter.com/2AtK0LFZb1— CCTV Asia Pacific (@CCTVAsiaPacific) October 22, 2025 ఇది కూడా చదవండి: మెహుల్ ఛోక్సీ అప్పగింతకు ఓకే: బెల్జియం కోర్టు -
భారత్ పథకాలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు
ఎలక్ట్రిక్ వాహనాలు (EV), అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్, ఆటోమొబైల్స్ విభాగంలో భారత్ కంపెనీలకు అందిస్తున్న ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాలకు వ్యతిరేకంగా చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఉన్న ఈ పథకాలను డబ్ల్యూటీఓ వేదికపై సమర్థించుకోవాల్సిన అవసరం భారత్కు ఏర్పడింది.చైనా ఆరోపణలుచైనా తన ఫిర్యాదులో భారతదేశం ఈవీ ప్రోత్సాహకాలు, పీఎల్ఐ పథకాలు చైనీస్ కోర్ వస్తువులపై వివక్ష పూరితంగా ఉన్నట్లు ఆరోపించింది. ఈ పథకాల కింద దేశీయ విలువ జోడింపునకు సంబంధించిన అంశాలు WTO కీలక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని చైనా పేర్కొంది. అందులో సబ్సిడీలు, కౌంటర్వైలింగ్ చర్యలపై ఒప్పందం (SCM అగ్రిమెంట్-రాయితీలకు వ్యతిరేకం), సుంకాలు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (GATT 1994), వాణిజ్య సంబంధిత పెట్టుబడి చర్యల ఒప్పందం (TRIM)ను భారత్ బేఖాతరు చేసినట్లు చైనా తెలిపింది.భారతదేశం వైఖరిఈ పథకాలను అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’కు అనుగుణంగా ఈ పథకాలు ఉన్నాయని భారత్ చెబుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయ ప్రోత్సాహకాలు డబ్ల్యూటీఓ చట్టంలో ‘గ్రే ఏరియా’(పారిశ్రామిక రాయితీలు, టెక్నాలజీ ప్రమోషన్ పథకాలు, పర్యావరణ, అభివృద్ధి లక్ష్యాలను పేర్కొంటూ చట్టంలో స్పష్టంగా నిషేధించబడని విధాన చర్యలను సూచిస్తుంది)లో ఉన్నాయి. అందువల్ల పారిశ్రామిక అభివృద్ధి కోసం విధానాలు రూపొందించే హక్కు భారత్కు ఉంది.డబ్ల్యూటీఓ వివాద ప్రక్రియడబ్ల్యూటీఓ వివాద పరిష్కార విధానంలో భాగంగా సమస్యను పరిష్కరించేందుకు భారత్, చైనాలు ముందుగా ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంటుంది. సంప్రదింపులు విఫలమైతే చైనా తీర్పు ఇవ్వడానికి విధాన ప్యానెల్ను అభ్యర్థించవచ్చు. భారతదేశానికి ప్రతికూల తీర్పు వస్తే అప్పీల్ చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం -
ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం
చైనా ప్రత్యేక ఎరువుల ఎగుమతులను మళ్లీ నిలిపివేయడం ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగం ఈ నిర్ణయంతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. చైనా చర్యల వల్ల భారత్లో ఎరువుల లభ్యత, ధరలపై ప్రభావం పడునుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.చైనా ఎగుమతి నిలిపివేతఅక్టోబర్ 15, 2025 నుంచి టెక్నికల్ మోనోఅమ్మోనియం ఫాస్ఫేట్ (TAMP), యాడ్ బ్లూ (యూరియా సొల్యూషన్), డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP), సాంప్రదాయ యూరియా వంటి ప్రత్యేక ఎరువుల ఎగుమతులను చైనా నిలిపివేసింది. ఈ సస్పెన్షన్ సుమారు 5-6 నెలల పాటు ఉంటుంది. అంటే ఈ నిలిపివేత మార్చి 2026 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ చర్య వల్ల అంతర్జాతీయ ఎరువుల మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని అనుసరించి సరఫరా గొలుసులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంపై దీని ప్రభావంభారతదేశం ఈ ప్రత్యేక ఎరువుల్లో దాదాపు 95% చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇది ఏటా సుమారు 2.5 లక్షల టన్నులు, అంటే 60-65% రబీ సీజన్లో ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఎరువుల దిగుమతులపై ఆధారపడుతుండడం వల్ల చైనా ఏకపక్ష నిర్ణయాలు భారతదేశ వ్యవసాయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.చైనా నిర్ణయం వల్ల కఠినమైన ప్రపంచ సరఫరా, అనిశ్చితి ఫలితంగా ఎరువుల ధరలు 10-15% వరకు పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదలతో అంతిమంగా రైతులపై భారం పడనుంది. దాంతో పంట ఉత్పత్తి వ్యయం పెరుగనుంది. కొందరు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుత రబీ సీజన్ (అక్టోబర్-మార్చి) కోసం భారతీయ వ్యాపారుల వద్ద ఇప్పటికీ నిల్వలున్నాయి. కాబట్టి తక్షణ ఎరువుల కొరత లేనప్పటికీ భవిష్యత్తులో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.గతంలో ఇలా..చైనా గతంలో కూడా 2023 మధ్యలో, మే-జూన్ 2025లో (భారతదేశ ఖరీఫ్ సీజన్ను ప్రభావితం చేస్తూ) ఎగుమతులను నిలిపివేసింది. ఆగస్టు 2025లో దౌత్య చర్చల తర్వాత తాత్కాలికంగా వీటిపై నిషేధం ఎత్తివేశారు. తిరిగి అక్టోబర్ 15 నుంచి మళ్లీ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సస్పెన్షన్ మార్చి 2026 తర్వాత కూడా కొనసాగితే భారతదేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడం, స్థిరమైన ప్రత్యామ్నాయ సరఫరాదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడం, ఎరువుల వినియోగంలో సామర్థ్యాన్ని పెంచే విధానాలను అమలు చేయడం వంటి చర్యలు అత్యవసరం.ఇదీ చదవండి: పాకిస్థాన్లో కేజీ టమాటా రూ.700 -
Donald Trump: ఒప్పందం చేసుకోకపోతే.. ట్రంప్ వార్నింగ్
-
దిగిరాకపోతే 155 శాతం సుంకాలు: ట్రంప్
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం కొనసాగుతోంది. రష్యా చమురును కొనడం ఆపకపోతే భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుందని ఇండియాకు ఆయన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా చైనాపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చైనాకు అమెరికాపై అపార గౌరవం ఉందని.. అందుకే ఎక్కువ టారిఫ్లు చెల్లిస్తోందని వెటకారంగా మాట్లాడారాయన. ఈ క్రమంలో.. భారీ సుంకాల మోత తప్పదంటూ హెచ్చరికల జారీ చేశారు. తాజాగా అమెరికా ఆస్ట్రేలియాతో 8.5 బిలియన్ డాలర్ల ‘అరుదైన ఖనిజాల’ ఒప్పందం(Rare Minerals Agreement) చేసుకుంది. సోమవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ వైట్హౌజ్లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ మీడియాతో మాట్లాడుతున్న టైంలో.. ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా-అమెరికా ఈ ఇరు దేశాలు అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని, అలా జరగని పక్షంలో చైనా 155 శాతం సుంకాలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. చైనాతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదరనుందని భావిస్తున్నా. ఈ ఒప్పందం రెండు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా మంచిదై ఉంటుంది. చైనా అమెరికా పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తోందని.. ప్రస్తుతం 55% టారిఫ్ల రూపంలో భారీగా డబ్బు చెల్లిస్తోందని పేర్కొన్నారు. నవంబర్ 1న ఒప్పందం కుదరకపోతే టారిఫ్లు 155%కి పెరిగే అవకాశం ఉంది అని హెచ్చరించారు(Trump Warn China).అక్టోబర్ 31వ తేదీ నుంచి దక్షిణ కొరియా వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సమావేశం జరగనుంది. అయితే.. దీనికంటే ముందే అక్టోబర్ 29, 30 తేదీలలో ట్రంప్ అక్కడ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కానున్నారు. తనకు చైనా అధ్యక్షుడికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనన ట్రంప్.. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.చైనా ప్రపంచంలో అరుదైన ఖనిజాల (Rare Earth Materials) ప్రధాన సరఫరాదారు. వీటి సాయంతోనే స్మార్ట్ఫోన్లు, యుద్ధ విమానాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాల తయారు అవుతుంటాయి. అయితే.. చైనా ఈ ఎగుమతులపై నియంత్రణలు పెంచింది. దీంతో అమెరికా సహా ఇతర దేశాలకు ఈ ఖనిజాలు అందుబాటులో ఉండటం కష్టతరమయ్యే చాన్స్ ఉంది. అందుకే ట్రంప్ చైనాతో మంచి వాణిజ్య ఒప్పందం కుదిరితే, ఇలాంటి సమస్యలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.ఇదీ చదవండి: అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన నెతన్యాహు! -
చైనా డ్యామ్తో మహా విపత్తు
ప్రపంచ జల సంతులనాన్ని తలకిందులు చేసే పనికి చైనా ఒడిగడుతోంది. దాని పర్యవసానాలు వాతావరణ మార్పు అంశమంతటి తీవ్ర ప్రభావం చూపబోతు న్నాయి. చైనా 168 బిలియన్ డాలర్లతో హిమాలయ సూపర్–డ్యామ్ నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలో అత్యంత ఖర్చుతో కూడిన మౌలిక వసతి ప్రాజెక్టు మాత్రమే కాక, అంతర్జాతీయంగా అత్యంత ముప్పుతో కూడుకున్నది కావడం వల్ల భయాలు వ్యక్తమవుతున్నాయి. బీజింగ్ దీన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా వర్ణిస్తోంది కానీ, నిజానికి దాన్ని ముంచుకొస్తున్న జీవావరణ మహా విపత్తుగా పేర్కొనాలి. యాలంగ్ జింగ్పొ నది మలుపు తిరిగి భారతదేశంలోకి ప్రవే శిస్తున్న చోటుకు కొద్ది వెనుకగా ఈ ఆనకట్టను నిర్మిస్తున్నారు. దీన్ని మనం బ్రహ్మపుత్ర నదిగా పిలుచుకుంటాం. చైనా ప్రధాని లీ చాంగ్ గత జూలైలో ఈ ఆనకట్టకు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు గురించి అధి కారికంగా ప్రకటించారు. కానీ, ఆనకట్ట నిర్మాణ పనులు కొంతకాలంగా సాగుతున్నాయని ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడిస్తున్నాయి. రహస్య నిర్మాణంచైనా నాయకుడు ఒకరు ఒక ఆనకట్టకు శంకుస్థాపన చేయడం చివరిసారిగా 1994లో జరిగింది. యాంగ్ చి నదిపై నిర్మించిన త్రీ గార్జెస్ డ్యామ్కు అప్పటి ప్రధాని లి పెంగ్ శంకుస్థాపన చేశారు. దాని కన్నా కూడా బ్రహ్మపుత్ర మెగా డ్యామ్ పరిమాణంలో చాలా పెద్దది. ఈ ప్రతీకాత్మకత మారుతున్న ప్రపంచంలో పెరుగుతున్న చైనా ఆశ లతోపాటు, పెద్ద గండాన్ని సూచిస్తోంది. త్రీ గార్జెస్ డ్యామ్ను మొదట్లో ఆధునిక వింతగా కీర్తించారు. ఇపుడు దాన్ని పర్యావరణ, సామాజికపరమైన వైపరీత్యంగా గుర్తిస్తు న్నారు. దానివల్ల పది లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఈ డ్యామ్ తరచూ కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతోంది. భూగోళ కంపన సుస్థిరత దెబ్బతింది. దాని బ్రహ్మాండ జలాశయం చివరకు భూ భ్రమణాన్ని కూడా కొద్దిగా మందగింప జేసింది. చైనా చేపట్టిన నూతన ప్రాజెక్టు స్థితిగతులు మరింత ప్రమాద కరంగా ఉన్నాయి. ప్రపంచంలో భూకంపాలకు ఎక్కువ అవకా శాలున్న ప్రాంతాల్లోని ఒకదానిలో దాన్ని నిర్మిస్తున్నారు. సైనిక దళాలు పెద్ద యెత్తున మోహరించి ఉండే∙సరిహద్దు ప్రాంతానికి దగ్గరలో అది ఉంది. భారతదేశపు విశాలమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా ‘దక్షిణ టిబెట్’గా పరిగణిస్తోంది. నిర్మాణంలో బల హీనత వల్లగానీ లేదా జలాశయం పురికొల్పగల భూగర్భ ఫలకాల చలనం వల్లగానీ డ్యామ్ కుప్పకూలితే, భారతదేశపు ఈశాన్య ప్రాంతం, బంగ్లాదేశ్ మహా విధ్వంసాన్ని చవిచూడవలసి రావచ్చు. త్రీ గార్జెస్ డ్యామ్ కన్నా దాదాపు మూడింతల ఎక్కువ విద్యుదుత్పాదనకు వీలుగా రూపకల్పన చేసిన ఈ డ్యామ్కు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 2021లో ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ నదుల పొడవునా పెద్ద పెద్ద ప్రాజెక్టులను రహస్యంగా నిర్మిస్తూ పోవడం చైనాకు రివాజుగా మారింది. జలం ఆధిపత్య సాధనంబ్రహ్మపుత్ర, మిగిలిన నదుల లాంటిది కాదు. హిమాలయ ఉత్తుంగ శిఖరాల నుంచి కిందకు దూకుతూ ప్రపంచంలోని అత్యంత నిటారైన, లోతైన లోయను సృష్టిస్తోంది. అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ కన్నా ఇది రెండింతల లోతైనది. సాటిలేని నదీమ శక్తి కేంద్రీకృతమవుతున్న చోట డ్యామ్ను చైనా నిర్మిస్తోంది. టిబెట్లోని పర్వతాలపైన నీటి బుగ్గల నుంచి పుడుతున్న బ్రహ్మపుత్ర, ప్రపంచంలోని ఎత్తయిన ప్రాంతాల నుంచి ప్రవహించే ప్రధాన నదులలో ఒకటి. భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే ఈ నది వ్యవసాయానికి, మత్స్యసంపదకు ఆలంబనగా ఉంటూ, జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మనుగడ కల్పిస్తోంది. బ్రహ్మపుత్రకు ఏటా వచ్చే వరదలు విధ్వంసకరమైనవే అయి నప్పటికీ, అవి విష పదార్థాలను తోసుకుపోతాయి. భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతాయి. సేద్యానికి ఎంతో ముఖ్యమైన పోషక విలువ లున్న అవక్షేపాలను పొలాలకు చేకూర్చుతాయి. కానీ సూపర్– డ్యామ్ ఈ గతిని తలకిందులు చేస్తుంది. ఒండ్రుమట్టికి అడ్డుకట్ట వేస్తుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలతో ఇప్పటికే సంకటంలోనున్న బంగ్లాదేశ్ డెల్టా కుంచించుకుపోతుంది. భారతీయ రైతులను సహజ ఫలదీకరణ ఆవృత్తాలకు దూరం చేస్తుంది. ఉప్పు నీరు చేరిపోవడం, వరదలు మరింత పరిపాటిగా మారతాయి. వచ్చిన చిక్కేమిటంటే, నీటిని వనరుగాకాక, ఒక శక్తి సము పార్జన సాధనంగా చైనా చూస్తోంది. నది టిబెట్ను విడిచిపెట్టే చోట మెగా–డ్యామ్ నిర్మించడం ద్వారా, దిగువ ప్రవాహ ప్రాంతాలలో నివసించే కోట్లమందికి ఇష్టముంటే నీరు ఇవ్వగలగాలని, లేకపోతే నీటిబొట్టు కూడా అందకుండా చేయగలగాలని చూస్తోంది. ఒకప్పుడు చమురుపై ఆధిపత్యం ప్రపంచ శక్తిని నిర్ణయించేది. ఈ 21వ శతాబ్దంలో, సరిహద్దులను దాటి ప్రవహించే నదులపై నియంత్రణ అంతే నిర్ణాయక శక్తిగా పరిణమించవచ్చు. ఈ డ్యామ్ ద్వారా చైనా, ఒక్క తూటా కూడా పేల్చనవసరం లేకుండా, నీటిని ఆయుధంగా మలచుకోగలుగుతుంది. ‘చమురు ఉత్పాదన, ఎగు మతి దేశాల కూటమి’ (ఒపెక్) చమురుపై ఒకప్పుడు ఎలాంటి వ్యూహాత్మక పట్టును అనుభవించిందో, నీటిపై అదే రకమైన శక్తిని చైనాకు ఈ డ్యామ్ కట్టబెట్టవచ్చు. ప్రమాదంలో జల భద్రతనిజానికి, ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ కలిపి నిర్మించిన డ్యామ్లకన్నా కూడా ఎక్కువ సంఖ్యలో పెద్ద డ్యామ్లను చైనా నిర్మించింది. అదే ఊపులో, అది 1990ల నుంచి అంతర్జాతీయ నదు లపై దృష్టి పెట్టింది. మికాంగ్ నదిపై అది కట్టిన 11 పెద్ద డ్యామ్లు దిగువ ప్రవాహ ప్రాంతాలను ఇప్పటికే అతలాకుతలం చేస్తున్నాయి. దుర్భిక్షాలు తీవ్రమవుతున్నాయి. థాయిలాండ్, లావోస్, కంబో డియా, వియత్నావ్ులలో జీవనోపాధులకు ఎసరు పెడుతున్నాయి. ఏ రూపంలో నీటి పంపకానికైనా ససేమిరా అనడాన్ని బీజింగ్ కొనసాగిస్తోంది. పొరుగునున్న దేశాలతో నీటి పంపక ఒప్పందాలు వేటిపైనా అది సంతకం చేయలేదు. ఐక్యరాజ్య సమితి 1997లో చేసిన జలవనరుల ఒడంబడికలోనూ అది చేరలేదు. తన సరి హద్దుల లోపలనున్న జలాలన్నింటిపైన ‘నిర్ద్వంద్వ సార్వభౌమాధి కారం’ చాటుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆసియాను మించి ప్రయోజనాలు ఇక్కడ పణంగా ఉన్నాయి. అంతర్జాతీయ సగటుకన్నా వేగంగా టిబెట్ వేడెక్కుతోంది. పీఠ భూమి హైడ్రాలజీని తారుమారు చేయడం ప్రాంతీయ జూదం మాత్రమే కాక, మొత్తం భూగోళానికి ముప్పు తేవడమే అవుతుంది. టిబెట్ నుంచి నదీ ప్రవాహాల గతులు మారుతున్న ప్రభావ ప్రకంప నాలు, ఆసియాను దాటి, బాహ్య వాతావరణ వ్యవస్థలు, ఆహార భద్రత, వలసల తీరుతెన్నులపైన కూడా కనిపిస్తాయి. దేశ సరిహద్దులను దాటి వెళ్ళే నదులపై ఏకఛత్రాధిపత్యం వహించడంలో బీజింగ్ సఫలమైతే, ఇతర దేశాలు కూడా అదే బాట పట్టవచ్చు. అది ఇతరత్రా బలహీనంగా ఉన్న సహకార నియమ నిబంధనలను నీరుగార్చవచ్చు. నైలు నదీ పరీవాహక ప్రాంతం నుంచి టైగ్రిస్–యూఫ్రటీస్ వరకు అదే పరిస్థితి నెలకొంటుంది. ఆ విధంగా, మెగా–డ్యామ్ ఒక్క ఆసియా సమస్య మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానిది. అందుకే అంతర్జాతీయ జల నిబంధనలను గౌరవించేట్లుగా అంతర్జాతీయ సమాజం చైనాపై ఒత్తిడి తేవాలి. బ్రహ్మచేలానీవ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’లో వ్యూహాత్మక అధ్యయనాల ప్రొఫెసర్(‘ద గ్లోబ్ అండ్ మెయిల్’ సౌజన్యంతో) -
నన్ను అలా చేసేలే చేశారు: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ప్రస్తుతం చైనాపై విధించిన సుంకాలు శాశ్వతం కాదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా చర్యలకు అనుగుణంగానే వారి వస్తువులపై అత్యధిక సుంకాలు విధించాల్సి వచ్చిందన్నారు. అవేమీ స్థిరంగా కొనసాగవన్నారు ట్రంప్. కాకపోతే తాను ఆ విధంగా సుంకాలు విధించేలా చేశారంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రంప్.. చైనాపై విదించిన సుంకాలకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో ఇరుదేశాలు ఒకరిపై ఒకరు అత్యధిక సుంకాలు విధించుకోవడానికి కారణాలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ బదులిచ్చారు. మరో రెండు వారాల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశం అవుతానని, అప్పుడు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు, సుంకాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. తమ మధ్య భేటీ అంతా సజావుగానే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. చైనా ఎప్పుడూ తమపై ఆదిపత్యం కోసమే చూస్తుందని, ఏం జరుగుతుందనేది తనకైతే తెలియదని, ఏం జరుగుతందో చూద్దాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చైనాపై 145 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటన చేసిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య వైరం కాస్త ముదిరింది. ఆపై చైనాపై సుంకాలను 100 శాతానికి పరిమితం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై సైతం చైనా తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండటానికి ఈ తరహా విధానం మంచిది కాదని, తమ ఆధిపత్యంతో ప్రపంచ దేశాల్ని కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని చైనా ధ్వజమెత్తింది. అప్పట్నుంచీ ఇరు దేశాల మధ్య వైరంతో పాటు దూరం కూడా పెరిగింది.ఇదీ చదవండి. ‘రాబోయే కాలమంతా భారత్ది.. ఆ దేశ ప్రధానిది.. అటు తర్వాతే ఎవరైనా’ -
వాళ్లు ఇస్తున్న సబ్సిడీలు అన్యాయం: భారత్పై చైనా ఫిర్యాదు
ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), బ్యాటరీ ఉత్పత్తి రంగాలలో భారత్ అందిస్తున్న సబ్సిడీలు (EV Battery Subsidies) దేశీయ పరిశ్రమలకు అన్యాయంగా లాభాన్ని కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ చైనా (China) బుధవారం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వద్ద ఫిర్యాదు చేసింది. చైనా చేసిన ఫిర్యాదు వివరాలను త్వరలో పరిశీలిస్తామని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.భారత్ ‘ నేషనల్ క్రిటికల్ మినరల్ స్టాక్ పైల్’ (NCMS) కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిసిన వెంటనే చైనా ఈ ఫిర్యాదు చేసింది. ఈ స్కీం లక్ష్యం అరుదైన భూ మూలకాలు (rare earth elements) వంటి కీలక ఖనిజాల లభ్యతను మెరుగుపరచడం, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం. ఈ మూలకాలు ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, ఇతర గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలకు కీలకం కావటంతో, వాటి ఎగుమతిపై ఆంక్షలు విధించాలని చైనా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.ఇతర దేశాలపైనా..చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్తో పాటు తుర్కియే, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలపై కూడా ఈ తరహా ఫిర్యాదులు డబ్ల్యూవో వద్ద నమోదయ్యాయి. డబ్ల్యూవో నిబంధనల ప్రకారం మొదటి దశలో చర్చల ద్వారానే వివాద పరిష్కారం వెతకాలి. చర్చలు ఫలితం ఇవ్వకపోతే, సమస్యపై తీర్పునిచ్చే ప్యానెల్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.ఈ విషయంపై స్పందించిన భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్.. చైనా సమర్పించిన వివరాలను త్వరలో అధ్యయనం చేస్తామని తెలిపారు. చర్చలతో పరిష్కారం సాధించే దిశగా భారత్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.ఇక వాణిజ్య సంబంధాల పరంగా చైనా భారత్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే 2023-24లో చైనాకు భారత ఎగుమతులు 14.5% తగ్గి 14.25 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో చైనాతో దిగుమతులు 11.52% పెరిగి 113.45 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
చైనాను అడ్డుకోవడానికి భారత్ మద్దతు కావాలి: స్కాట్ బెసెంట్
వాషింగ్టన్: అమెరికా, చైనా(China) మధ్య టారిఫ్ల కారణంగా ట్రేడ్ వార్ కొనసాగుతోంది. అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్(Scott Bessent) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చైనాను టార్గెట్ చేసి.. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆరోపణలు గుప్పించారు.అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అమెరికా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తోంది. ఇదే సమయంలో చైనా ప్రపంచంలో వార్ ఎకానమీకి ఫైనాన్స్ చేస్తోందని ఆరోపించారు. అరుదైన ఖనిజాల(rare Metals) ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ సామగ్రి తయారీలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా ఈ వనరులలో దాదాపు 70% సరఫరాను నియంత్రిస్తుండటంతో, అమెరికా దీనిని వ్యూహాత్మక ముప్పుగా చూస్తోంది. ఇక, అక్టోబర్ 9 నుంచి అరుదైన ఖనిజాల ఎగుమతులకు అనుమతులు తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.NEW:🇺🇲🇮🇳 US Treasury Secretary Scott Bessent now expects to receive support from India in the case of China's rare earth materials, despite the fact that a few weeks ago Trump imposed tariffs on them and blackmailed India to stop buying oil from Russia. pic.twitter.com/S0ol7tWiR8— Megatron (@Megatron_ron) October 14, 2025అయితే.. ఆయన మాటల్లో స్పష్టంగా చైనాపై వ్యతిరేక ధోరణి కనిపించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, సాంకేతిక పరమైన పోటీ, దక్షిణ చైనా సముద్రం వివాదం వంటి అంశాలు ఇప్పటికే ఉద్రిక్తతలను పెంచాయి. ఇప్పుడు అరుదైన ఖనిజాల విషయం కూడా ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అమెరికా ఈ వనరుల సరఫరాను చైనా నుండి స్వతంత్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. భారత్ ఈ రంగంలో విస్తారమైన వనరులు కలిగి ఉండటంతో, అమెరికా వ్యూహాత్మకంగా భారత్ వైపు మొగ్గు చూపుతోంది.మరోవైపు, అమెరికా ఇటీవల భారత్పై కొన్ని ఉత్పత్తులపై టారిఫ్లు విధించడం, వాణిజ్య పరమైన అడ్డంకులు సృష్టించడం విమర్శలకు దారితీసింది. టారిఫ్లతో భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే, చైనాపై పోరులో మద్దతు కోరడం విరుద్ధ ధోరణిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినప్పటికీ, ఖనిజాల రంగంలో భారత్ భాగస్వామ్యం అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. -
చైనాకు గూఢచర్యం?? .. భారత సంతతి అధికారి అరెస్ట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లీ జె టెలిస్(Ashley Tellis) అరెస్ట్ అయ్యారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకుని అక్కడి అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో.. చైనాకు గూఢచర్యం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. Who Is Ashley Tellis.. ఆష్లీ జె టెలిస్ ముంబైలో జన్మించారు. బాంబే వర్సిటీ పరిధిలోని సెయింట్ జెవియర్స్ కాలేజీలో బీఏ, ఎంఏ చదివారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసి.. విదేశీ విధాన నిపుణుడిగా ఎదిగారు. ముఖ్యంగా.. అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అడ్వైజర్గా పనిచేస్తూ.. అమెరికా-భారత్ అణు ఒప్పందంలో కీలక పాత్ర(US-India Civil Nuclear Agreement) పోషించారు. అంతేకాదు విదేశీ విధాన పరిశోధకుడిగా ఇరు దేశాల సంబంధాలపైనా ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన కార్నెగీ ఎండౌమెంట్లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అయితే..జాతీయ రక్షణ సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ఆయన అనుమతి లేకుండా తన వెంట తీసుకెళ్లారనే అభియోగం నమోదైంది. 18 యూఎస్సీ సెక్షన్ 793(ఈ) ప్రకారం.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం.. రహస్య ప్రాంతంలో టెలిస్ను విచారణ జరుపుతున్నారు. తూర్పు వర్జినీయా అటార్నీ ఆఫీస్ కార్యాలయం ఆయన అరెస్ట్, విచారణను ధృవీకరించింది.ఫెడరల్ అధికారులు ఏమన్నారంటే.. 64 ఏళ్ల వయసున్న టెలిస్.. దేశభద్రతకు సంబంధించిన గోప్యమైన పత్రాలను తన వెంట తీసుకెళ్లడం చట్ట ప్రకారం తీవ్ర నేరమే. తన సహ ఉద్యోగినిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్లు తనకివ్వమని ఆయన కోరారు. యూఎస్ ఎయిర్ఫోర్స్లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేశారు. అలాగే.. చైనా అధికారులతోనూ ఆయన సమావేశమైనట్లూ ఆధారాలు ఉన్నాయి. 2022తో పాటు 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నారు. ఈ మధ్యే చైనా అధికారులు ఆయనకు ఓ కాస్ట్లీ బ్యాగును కూడా గిఫ్ట్గా అందించారు అని అన్నారు. అయితే చైనా అధికారులతో భేటీ .. అకడమిక్కు సంబంధించినదని ఆయన అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. గూఢచర్యం ఆరోపణలు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు. అలాంటి అభియోగాన్ని నమోదు చేయలేదు. అయితే కీలక పత్రాలకు సంబంధించిన నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష, $250,000(మన కరెన్సీలో రూ. 2 కోట్ల 21 లక్షల) జరిమానా విధించవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు దక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏఐ గురించి గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు -
కాబోయే వాడు హగ్ చేసుకున్నాడని రూ. 3.73లక్షల డిమాండ్..!
ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లి కుదిరి నిశ్చితార్థం తంతు ముగిస్తే చాలు.. ఇక ప్రీ వెడ్డింగ్ షూట్కి ప్లాన్ చేసుకుంటున్నారు. పాత కాలంలో అమ్మాయి-అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకోవడమే గగనమైతే.. ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లికొడుకు-పెళ్లికూతరు(పెళ్లికి ముందే) ప్రీ వెడ్డింగ్ షూట్లో మెరిసి మురిసిపోవడం పరిపాటిగా మారిపోయింది. ఇదంతా ఇలా ఉంచితే, ప్రీ వెడ్డింగ్ షూట్లో అమ్మాయిని అబ్బాయి హగ్ చేసుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అటు పెళ్లి క్యాన్సల్ కావడం ఒకటైతే, తనను హగ్ చేసుకున్నందుకు మూడు లక్షల డబ్బై ఐదు వేలు రూపాయిలు ఇవ్వాలని అమ్మాయి డిమాండ్ చేస్తోంది. చైనాలో చేసుకున్న ఈ ఘటన వైరల్గా మారింది. వీరి నిశ్చితార్థం జనవరిలో జరగ్గా, నవంబర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ దాదాపు పూర్తి చేసుకున్నారు. ఒక హోటల్ తీసుకుని మరీ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అయితే ఒకానొక సందర్భంలో అమ్మాయి ముందుండి, అబ్బాయి వెనుక ఉండే ఫోటో తీసే సందర్భంలో హగ్ చేసుకోమన్నాడు ఫోటో గ్రాఫర్. దాంతో నిశ్చితార్థ పెళ్లి కొడుకు ఆమెను హగ్ చేసుకున్నాడు. అంతే ఈ పెళ్లి క్యాన్సిల్ అంటూ అమ్మాయి తెగేసి చెప్పేసింది. ఇలా హగ్ చేసుకోవడం ఏంటని పాత సంప్రదాయాన్ని తిరగతోడింది. తాము నిశ్చితార్థం చేసుకోవడానికి ఖర్చులు అయినందున రూ. 3.73 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఆ అమ్మాయికి నిశ్చితార్థంలో అబ్బాయి కుటుంబం వారు 200,000 యువాన్లు(రూ. 25 లక్షలు) బహుమతిగా ఇవ్వడానికి అంగీకరించి అది కాస్తా ఇచ్చేశారు. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ కావడంతో 30,000 యువాన్లు(రూ. 3.73 లక్షలు ) కట్ చేసి మిగతా అమౌంట్ను తిరిగి ఇచ్చేసింది. ఇలా ఎందుకు కట్ చేసారని అడిగితే.. అబ్బాయి హగ్ చేసుకున్నందుకు అని ఆమె సమాధానం చెప్పింది. ఇది సరైన పద్ధతి కాదంటున్నాడు ఆ సంబంధం కుదిర్చిన మధ్యవర్తి. తాను వెయ్యికిపైగా పెళ్లిల్లు చేశానని, ఈ అమ్మాయి మాత్రం చాలా భిన్నంగా ఉందన్నాడు. పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత మొత్తం తిరిగి ఇవ్వకుండా ఇలా కట్ చేసుకుని మిగతా 170,500 యువాన్లు(సుమారు రూ. 21లక్షలు) మాత్రమే తిరిగి ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏమీ కారణం లేకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇలా డిమాండ్ పేరుతో సుమారు నాలుగు లక్షల రూపాయిలు కట్ చేసుకోవడంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు ‘పెళ్లిళ్ల పేరయ్య’.ఇదీ చదవండి: ఇజ్రాయిల్ పార్లమెంట్లో ట్రంప్ ప్రసంగానికి నిరసన సెగ -
మన ఎగుమతిదార్లకు మంచి చాన్స్..
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో భారతీయ ఎగుమతిదార్లు లబ్ధి పొందేందుకు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనితో అగ్రరాజ్యానికి ఎగుమతులను మరింతగా పెంచుకోవడానికి చాన్స్ లభించవచ్చని పేర్కొన్నారు. 2024–25లో అమెరికాకు భారత్ సుమారు 86 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. చైనాపై భారీ టారిఫ్ల వల్ల అమెరికన్ కొనుగోలుదారులు భారత్వైపు మొగ్గు చూపవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఈ వాణిజ్య యుద్ధం ద్వారా మనం లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. నవంబర్ 1 నుంచి చైనా ఉత్పత్తులపై అదనంగా 100 శాతం టారిఫ్లు విధించనున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో చైనా దిగుమతులపై మొత్తం సుంకాలు 130 శాతానికి చేరతాయి. అమెరికా డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటికి కీలమైన రేర్ ఎర్త్ ఎగుమతులపై అక్టోబర్ 9న చైనా తాజాగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ విధంగా స్పందించింది. ప్రస్తుతం చైనాపై అమెరికా 30 శాతం సుంకాలు విధిస్తుండగా, భారత్పై అంతకన్నా ఎక్కువగా 50 శాతం వేస్తోంది. దీనితో మన ఉత్పత్తుల కన్నా చైనా ఉత్పత్తులే చౌకగా లభించే పరిస్థితి నెలకొంది. అయితే, చైనాపై 100 శాతం అదనపు సుంకాలు విధించడం వల్ల అమెరికన్ మార్కెట్లో చైనా ఉత్పత్తుల ధరలు, మిగతా దేశాలతో పోటీపడలేనంతగా పెరిగిపోతాయని ఓ ఎగుమతిదారు తెలిపారు. దీంతో సుంకాలు తక్కువగా ఉన్న దేశాల వైపు అమెరికన్ కొనుగోలుదారులు మొగ్గు చూపుతారని బొమ్మల ఎగుమతిదారు మను గుప్తా తెలిపారు. ఇప్పటికే టార్గెట్లాంటి రిటైల్ దిగ్గజాలు కొత్త ఉత్పత్తుల కోసం తమను సంప్రదించినట్లు వివరించారు. ఈవీల రేట్లకు రెక్కలు.. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), విండ్ టర్బైన్లు, సెమీకండక్టర్ల విడిభాగాల రేట్లకు రెక్కలొచి్చనట్లు మేథావుల సంఘం జీటీఆర్ఐ తెలిపింది. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, పాదరక్షలు, వైట్ గూడ్స్, సోలార్ ప్యానెళ్ల కోసం అమెరికా ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతోందని పేర్కొంది. వరుసగా నాలుగో ఏడాది 2024–25లో కూడా భారత్కి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలి్చంది. ఇరు దేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు) ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతంగా, దిగుమతుల్లో 6.22 శాతంగా ఉంటోంది. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నాయి. -
ట్రంప్కు చైనా కౌంటర్.. భయపడే ప్రసక్తే లేదు..
బీజింగ్: అగ్రరాజ్యం అమెరికా(US Tariff), డ్రాగన్ కంటీ చైనా(china) మధ్య టారిఫ్ల విషయంలో మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump Tariff Warning) విధించిన టారిఫ్ల అంశంపై తాజాగా చైనా స్పందించింది. ఈ సందర్బంగా అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని తీవ్ర విమర్శలు చేసింది. ఇలాంటి నిర్ణయాలు రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.ట్రంప్ నిర్ణయాలపై తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కౌంటర్ ఇచ్చింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. ఈ చర్యలు చైనా ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని పేర్కొంది. రెండు వైపులా ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని వివరించింది. ప్రతీ విషయంలోనూ చైనాపై అధిక సుంకాలు విధిస్తామని బెదిరించడం సరైన మార్గం కాదు. అమెరికా తన తప్పుడు పద్దతులను వెంటనే సరిదిద్దుకోవాలి. చైనా-అమెరికా మధ్య స్థిరమైన వాణిజ్య సంబంధాలను మేము కోరుకుంటున్నాం. ట్రంప్ నిర్ణయాలు ఇలాగే కొనసాగితే చైనా తన చట్టబద్దమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటుంది అని హెచ్చరించింది.ఇది కూడా చదవండి: పాకిస్తాన్కు బిగ్ షాక్.. కాగా, అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చైనా తీరు తనను షాక్కు గురిచేసిందని పేర్కొన్నారు. అనంతరం, చైనా ఉత్పత్తులపై అదనంగా 100 శాతం టారిఫ్లు విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇవి నవంబర్ 1వ తేదీ లేదా అంతకంటే ముందే అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. అంతేకాకుండా నవంబర్ 1 నుంచి క్రిటికల్ సాఫ్ట్వేర్ ఎగుమతులపై కొన్నిరకాల నియంత్రణలు విధిస్తామని తేల్చిచెప్పారు. ఇక, చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 30 శాతం సుంకాలు అమలవుతున్నాయి. ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలతో కలిపితే మొత్తం సుంకాలు ఏకంగా 130 శాతానికి చేరడం గమనార్హం. ప్రతీకార చర్యల్లో భాగంగానే చైనా ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. అరుదైన ఖనిజాల విషయంలో అసలేం జరగబోతోందో చూద్దామని, అందుకే నవంబర్ 1వ తేదీని డెడ్లైన్గా విధించామని పేర్కొన్నారు. నియంత్రణల విషయంలో చైనా వెనక్కి తగ్గితే అదనపు టారిఫ్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. 🚨Beijing blames the US for raising trade tensions.China signals it won’t back down in the face of the latest tariff threat from President Donald Trump.Officials said “we do not want a tariff war, but we are not afraid of one.” pic.twitter.com/nWpC4GCgOR— CryptoCurrency News (@CryptoBoomNews) October 12, 2025 -
చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు.. కుప్పకూలిన స్టాక్మార్కెట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కొత్త సుంకాల యుద్ధాన్ని ప్రకటించడంతో ప్రపంచ వాణిజ్య సంబంధాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై నవంబర్ 1 నుంచి 100% కొత్త సుంకం విధించనున్నట్లు, అదే తేదీన చైనా సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే చైనాపై యూఎస్ 30 శాతం సుంకాలు విధించింది. తాజా పరిణామం అమెరికా స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. శుక్రవారం రోజునే నాస్డాక్, డోజోన్స్, ఎస్అండ్పీ సూచీలు భారీగా నష్టపోయి, మదుపర్ల సంపద 1.5 ట్రిలియన్ డాలర్ల మేర ఆవిరైంది.ప్రతీకార చర్యలు, అరుదైన ఖనిజాల అస్త్రంఅమెరికా తీసుకున్న ఈ తాజా చర్యకు ముఖ్య కారణం.. అరుదైన భూ ఖనిజాలపై (Rare Earth Magnets) చైనా విధించిన కొత్త ఎగుమతి నియంత్రణలకు ప్రతీకారం తీర్చుకోవడమే. అరుదైన భూ ఖనిజాల ప్రపంచ సరఫరాలో చైనా దాదాపు 70% ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆటోమొబైల్స్, డిఫెన్స్, సెమీకండక్టర్లతో సహా హైటెక్ పరిశ్రమలకు ఈ ఖనిజాలు అత్యంత కీలకం. ఈ ఖనిజాలు తమ అధునాతన సాంకేతిక, రక్షణ రంగాలకు ఎంత ముఖ్యమో అమెరికాకు తెలుసు. చైనా వీటి సరఫరాను నియంత్రించడం ద్వారా అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో తమకు అనుకూలంగా ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. చైనా ఎగుమతి నియంత్రణలు, అమెరికాపై చైనా ఉపయోగించే ఒక కీలకమైన ఆర్థిక అస్త్రంగా మారింది.మార్కెట్లపై ప్రభావంఈ వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీసింది. అధిక సుంకాలు, ఎగుమతి నియంత్రణలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తాయని, తద్వారా అంతిమంగా అమెరికాలోని వినియోగదారులపై ధరల భారం పెరుగుతుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. చైనాపై 100% సుంకం, చైనా సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలు వంటి చర్యలు కేవలం వాణిజ్య లోటుకు సంబంధించిన అంశాలే కాకుండా, సాంకేతిక, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలుగా మారాయి.భవిష్యత్తుపై..ఈ తాజా ఉద్రిక్తతలు అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాన్ని మరింత తగ్గిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పరం ప్రతీకార చర్యలకు దిగడం వల్ల ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వృద్ధి మందగిస్తాయనే భయాలు పెరుగుతున్నాయి. అరుదైన ఖనిజాల సరఫరాపై చైనాకున్న ఏకచ్ఛత్రాధిపత్యం పరిస్థితులను మరింత జటిలం చేస్తుంది. అమెరికాను చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను, దేశీయ ఉత్పత్తిని పెంచే చర్యలు చేపట్టేలా ఒత్తిడిని పెంచుతోంది.మొత్తంమీద ఈ వాణిజ్య ఉద్రిక్తతలు కేవలం సుంకాల పెరుగుదలకు సంబంధించినవి మాత్రమే కాదు. ఇవి ప్రపంచ ఆర్థిక ఆధిపత్యం, కీలకమైన సాంకేతికతలపై నియంత్రణ, జాతీయ భద్రతా ప్రయోజనాలకు సంబంధించిన వ్యూహాత్మక పోటీగా మారాయి. ఈ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ సమీప భవిష్యత్తులో కూడా మార్కెట్లలో అనిశ్చితిని కొనసాగించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.ఇదీ చదవండి: ‘ప్రపంచానికి 200 మంది ఎలాన్ మస్క్లు అవసరం’ -
చైనాపై ట్రంప్ బాంబు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబు ప్రయోగించారు. ఈసా రి డ్రాగన్ దేశం చైనాను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే చైనా ఉత్పత్తులపై అదనంగా 100 శాతం టారిఫ్లు విధించబోతున్న ట్లు తేల్చిచెప్పారు. ఇవి నవంబర్ 1వ తేదీ లేదా అంతకంటే ముందే అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. అంతేకాకుండా నవంబర్ 1 నుంచి క్రిటికల్ సాఫ్ట్వేర్ ఎగుమతులపై కొన్నిరకాల నియంత్రణలు విధిస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. అరుదైన ఖనిజాల విషయంలో చైనా తీరు తనను షాక్కు గురిచేసిందని పేర్కొన్నారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 30 శాతం సుంకాలు అమలవుతున్నాయి. ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలతో కలిపితే మొత్తం సుంకాలు ఏకంగా 130 శాతానికి చేరడం గమనార్హం. అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ప్రభు త్వం కొత్తగా నియంత్రణలు విధించడం పట్ల ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతీకార చర్యల్లో భాగంగానే చైనా ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. అరుదైన ఖనిజాల విషయంలో అసలేం జరగబోతోందో చూ ద్దామని, అందుకే నవంబర్ 1వ తేదీని డెడ్లైన్గా విధించామని పేర్కొన్నారు. నియంత్రణల విషయంలో చైనా వెనక్కి తగ్గితే అదనపు టారిఫ్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. త్వరలో దక్షణ కొరియాలో జరిగే సదస్సులో చైనా అధినేత షీ జిన్పింగ్ను కలిసే ఆసక్తి లేదని తొలుత వెల్లడించిన ట్రంప్ తాజాగా మాట మార్చేశారు. జిన్పింగ్తో జరిగే భేటీని రద్దు చేసుకోలేదని పేర్కొన్నారు. కానీ, ఈ భేటీ జరుగుతుందో లేదో తనకు తెలియదన్నారు. అదనపు టారిఫ్లు అమలయ్యేనా? అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ప్రభుత్వం గురువారమే ఆంక్షలు విధించింది. మరుసటి రోజే చైనాపై ట్రంప్ సుంకాల మోత మోగించడం గమనార్హం. అమెరికాలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి చైనా నుంచి వచ్చే ఖనిజాలే ఆధారం. నిజానికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. చైనాపై ట్రంప్ అదనపు టారిఫ్లు అమల్లోకి రావడం అంత సులభం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. సుంకాల కారణంగా చైనా ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగితే అమెరికన్లకే నష్టమని అంటున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో విదేశాలపై టారిఫ్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అమెరికా అవసరాలను దృష్టిలో పెట్టుకొని టారిఫ్లు తగ్గించారు. చైనా విధించిన టారిఫ్లను 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఇదిలా ఉండగా, దక్షిణ కొరియాలో ఈ నెలాఖరున ట్రంప్, జిన్పింగ్ మధ్య భేటీ జరుగుతుందని, అదనపు సుంకాలపై ట్రంప్ తన నిర్ణయం మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో అరుదైన ఖనిజాల మార్కెట్ లో 70 శాతం వాటా చైనాదే కావడం విశేషం. -
అద్భుతం.. మనిషికి పంది కాలేయం!
ఆధునిక వైద్య చరిత్రలో మరో అద్భుతం. కాలేయం సమస్యలతో బాధే పడే వారికి ఊరట నిచ్చే వార్త. విజయవంతంగా మనిషికి పంది కాలేయం (Pig Liver) అమర్చారు చైనా వైద్యులు. అంతేకాదు దాని పనితీరు కూడా బేషుగ్గా ఉందని ప్రకటించారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినతను 170 రోజులు పైగా బతికివున్నాడని, పంది కాలేయం అమర్చిన వారిలో ఎక్కువ రోజులు బతికిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది.చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్కు చెందిన 71 ఏళ్ల వ్యక్తి సిరోసిస్, హెపటైటిస్ బితో బాధపడుతున్నాడు. కాలేయం పూర్తిగా పాడైపోవడంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ (Liver transplantation) చేయాలని నిర్ణయించారు. జన్యుమార్పిడి చేసిన పంది కాలేయాన్ని అతడికి అమర్చారు. తర్వాత అతడిని అబ్జర్వేషన్లో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అన్హుయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బీచెంగ్ సన్ నాయకత్వంలో ఈ ప్రయోగం జరిగింది.ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కాలేయం పనితీరు బాగానే ఉందని, జీవక్రియలు సాఫీగా సాగాయని వైద్యులు తెలిపారు. అయితే 38వ రోజున చిన్న సమస్య తలెత్తినా పరిష్కరించామన్నారు. జెనోట్రాన్స్ప్లాంటేషన్- సంబంధిత థ్రోంబోటిక్ మైక్రోయాంజియోపతి కారణంగా ఏర్పడిన గ్రాఫ్ట్ తొలగించామన్నారు. కాలేయ మార్పిడిన జరిగిన వ్యక్తి 171 రోజులు జీవించిన తర్వాత అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించాడని చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా కాలేయ మార్పిడిలో ఎదురయ్యే సవాళ్లను చాలా వరకు అధిగమించామని అన్నారు.భవిష్యత్ ఆశాకిరణం"గుండె లేదా మూత్రపిండాలతో పోలిస్తే కాలేయ మార్పిడి చాలా క్లిష్టమైందని అందరూ భావిస్తుంటారు. కానీ మా ప్రయోగం తర్వాత ప్రజలు భిన్నంగా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను" అని డాక్టర్ బీచెంగ్ సన్ CNNతో అన్నారు. ఈ ప్రయోగాన్ని భవిష్యత్ ఆశాకిరణంగా వర్ణించారు జర్మనీలోని హన్నోవర్ మెడికల్ స్కూల్లో గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీనర్ వెడెమెయర్. కాలేయ మార్పిడి ప్రయోగాల్లో ఇంకా ఎంత దూరం ప్రయాణించాలనే విషయాన్ని కూడా ఈ ప్రయోగం వెల్లడి చేసిందన్నారు. అతడే ఫస్ట్!రీడింగ్ క్రానికల్ ప్రకారం.. పరిమాణంలో మనిషి అవయవాలకు వరాహ అవయవాలు పోలి ఉండటం, పంది జన్యు- సవరణ సాంకేతికత లభ్యత కారణంగా వీటి నుంచే మనుషులకు అవయవ మార్పిడి చేస్తున్నారు. తొలిసారిగా అమెరికాకు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి 2022లో జన్యుమార్పిడి చేసిన పంది గుండెను (Pig Heart) అమర్చారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్లో ఈ ప్రయోగం జరిగింది. అవయవ మార్పిడి జరిగిన రెండు నెలల తర్వాత బెన్నెట్ మరణించాడు.పంది కిడ్నీ కూడా..అమెరికాకు చెందిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ గత సంవత్సరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండ్రాలను (Pig Kidney) ఆయనకు అమర్చారు. ఆ ప్రక్రియ తర్వాత రెండు నెలల్లో రిచర్డ్ మరణించాడు.చదవండి: అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజు 25 లక్షల సంపాదన! -
ప్రజాభీష్టాన్ని పట్టించుకోవాలి!
స్వతంత్ర భారతదేశం పలు పునర్విభజనలతో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడటాన్ని చూసింది. ఈ మార్పులు దేశంలోని బహుళ సాంస్కృతిక, బహుళ జాతుల సంక్లిష్టతలను ప్రతి బింబింపజేశాయి. లద్దాఖ్లో ప్రస్తుతం కనిపిస్తున్న అశాంతి, సార్వభౌమాధి కారాన్ని పంచుకునేందుకు చేస్తున్న సాధారణ వక్కాణింపు కాదు. వారు స్వతంత్ర ప్రతిపత్తిని ఆకాంక్షిస్తున్నారు. జమ్ము–కశ్మీర్ను విభజించిన తర్వాత, 2019లో లద్దాఖ్కు కేంద్ర పాలిత ప్రాంత (యూటీ) హోదా కల్పించారు. అయితే, తమ హక్కుల పరిరక్షణను కోరుతూ లద్దాఖీయులు 2021 డిసెంబర్లో తిరిగి వీధులకెక్కారు. లద్దాఖ్ ఎందుకు కీలకం?లద్దాఖ్ ఒక శీతల ఎడారి. దాని గణనీయమైన ప్రాంతం చైనా, పాకిస్తాన్ల ఆక్రమణలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణరంగం సియాచిన్ హిమనదం ఈ ప్రాంతం లోనిదే. వ్యూహ పరంగా లద్దాఖ్కు ఉన్న ప్రాధాన్యం, పొరుగునున్న రెండు శత్రు దేశాల ఉనికి వల్ల భారత్ అప్రమత్తంగా మెలగుతూ, అక్కడ సత్పరి పాలనకు బాధ్యత వహించవలసి ఉంది. ఉపాధి అవకాశాలను తగినంతగా పెంపొందించే విధంగా దాని ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంద కపోతే, ఆ ప్రాంత పౌరుల్లో అసంతృప్తి, అశాంతి కొనసాగుతూనే ఉంటాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారతదేశపు భద్రతను, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో అది విఘాతంగా పరిణమించవచ్చు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయటడంలో లద్దాఖ్ నైసర్గిక స్వరూపం అధికారులకు సవాల్గా పరిణమిస్తోంది. లద్దాఖ్ ఇంత సంక్లిష్టమైనదిగా మారడానికి చారిత్రక కారణాలున్నాయి. డోగ్రా రాజు గులాబ్ సింగ్కు చెందిన సేనాపతి జోరావర్ సింగ్ 1834 –35లో ఈ ప్రాంతాన్ని జయించారు. జమ్ము–కశ్మీర్ అంశం వివాదంగా మారినపుడు, ఆ పెద్ద వివాదంలో లద్దాఖ్ చిక్కుకుంది. భారత సైన్యం 1947లో ప్రతిదాడులు చేపట్టి, ద్రాస్, కార్గిల్, లేహ్ల నుంచి చొరబాటుదారులను తరిమేయడంతో, జమ్ము–కశ్మీర్లోని మూడు పాలిత విభాగాల్లో లద్దాఖ్ ఒకటిగా రూపుదాల్చింది.నిరసనలకు కారణాలులద్దాఖ్ చాలా కాలం అభివృద్ధికి నోచుకోలేదు. పేలవమైన ఆరోగ్య సేవలతో మరణాల రేటు అధికంగా ఉంటూ వచ్చింది. ఉపాధి అవకాశాలు వ్యవసాయానికి, ప్రభుత్వ రంగానికి, చాలా కాలం తర్వాత టూరిజానికి పరిమితమయ్యాయి. దాంతో ప్రభుత్వంపై లద్దాఖ్కు పేచీ తలెత్తింది. తమ సొంత ప్రతినిధుల చేతిలో అధికారం ఉంటేనే, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అందుకే, 2024 ఫిబ్రవరిలో నిరసనలు తలెత్తడం ఆశ్చర్యం కలిగించలేదు. అవి లేహ్, కార్గిల్లను ఏకం చేశాయి. ఇంజినీర్, విద్యావేత్త, గాంధేయవాది అయిన సోనమ్ వాంగ్చుక్ నాయకత్వ పాత్రను ధరించారు. వాంగ్చుక్ నూతన తరహా పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని హిందీ సినిమా ‘3 ఇడియట్స్’ రూపొందడంతో, ఆయన ఇదివరకే ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆయన నిరాహార దీక్షకు కూర్చుని, శ్రేయోభిలాషుల సలహా మేరకు, 21 రోజుల తర్వాత దాన్ని విరమించుకున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇసుమంత కూడా మార్చుకోలేదు. ఆయన గత నెలలోనూ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. లేహ్లో హింసాయుత ఘటనలు చోటుచేసుకోవడంతో, మళ్ళీ విరమించుకున్నారు. తదనంతరం, ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి, జోధ్పూర్ జైలుకు తరలించారు. చర్చలతో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చు. కానీ, ఆ ప్రక్రియలో వాంగ్చుక్కు పాత్ర కల్పించడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. కాల్పుల్లో నలుగురు నిరసనకారులు మరణించిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వాంగ్చుక్ కోరుతున్నారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ హోదా, లద్దాఖ్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ల విషయంలో లేహ్ అపెక్స్ బాడీకి, కార్గిల్ డెమొక్రాటిక్ అలయ¯Œ ్సకు తన మద్దతును పునరుద్ఘాటించారు. రాష్ట్ర హోదా వచ్చేనా?జమ్ము–కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నపుడు లద్దాఖ్ నుంచి శాసన సభలో నలుగురు సభ్యులు, ఒక లోక్సభ సభ్యుడు ఉండే వారు. ఈ ప్రాతినిధ్యం తగినంతగా లేదనే భావన అప్పుడూ ఉంది. ఈ ప్రాంతం, ప్రజల పట్ల అధికారులు వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రజాస్వామిక, ప్రాతినిధ్య పరిపాలనను పటిష్ఠ పరచేందుకు లేహ్కు (1995లో), కార్గిల్కు (2003లో) లద్దాఖ్ స్వయం ప్రతిపత్తి పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళను జమ్ము– కశ్మీర్ ప్రభుత్వం ఎట్టకేలకు ఏర్పాటు చేసింది. కానీ, ఇది క్షేత్ర స్థాయిలో పరిస్థితులలో మార్పు వచ్చేందుకు తోడ్పడలేకపోయింది. 2019 ఆగస్టు 5న, 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో కేంద్రపాలిత ప్రాంత హోదా డిమాండ్ నెరవేరిందికానీ, అవకాశా లను అది పరిమితం చేసింది. పాలనా యంత్రాంగంలోకి తీసుకునేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటిదేమీ లేకపోవడం వల్ల కేంద్ర పాలిత హోదా ఎక్కువ ఉద్యోగావకాశాలను చూపలేకపోయింది. దాదాపు 3 లక్షల జనాభా కలిగిన లద్దాఖ్ వ్యవస్థాగతంగా బలహీనంగా ఉంది. యూటీ అనిపించుకున్నా వనరులపై హక్కులు ఉండవు కనుక, అది రాష్ట్ర హోదాను కోరుకుంటోంది. అధికార కేంద్రీకరణకు మొగ్గు చూపే బీజేపీ కేంద్రంలో గద్దెపై ఉండటం వల్ల, రాష్ట్ర హోదా మంజూరు కుదిరే పని కాదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెడుతుందనీ, బయటి ప్రాంతాల కార్మికులు ఉన్న కొద్ది పాటి అవకాశాలను ఎగరేసుకుపోతారనీ ఈ ప్రాంతంలో భయాందో ళనలు ఉన్నాయి. అందుకే, తమను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యులులో చేర్చాలనీ, రాష్ట్ర హోదా కల్పించాలనీ అడుగుతున్నారు. లద్దాఖ్కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రెండు పార్లమెంట్ సీట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, రాజకీయ ప్రాతినిధ్య పెంపునకు పురిగొల్పే విధంగా ప్రత్యేక రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని లద్దాఖ్ ప్రజానీకం చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనదే!అజయ్ కె. మెహ్రావ్యాసకర్త ‘సెంటర్ ఫర్ మల్టీ లెవెల్ ఫెడరలిజం’లోవిజిటింగ్ సీనియర్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే
ఎవరో ఏదో చెప్పారని, అశాస్త్రీయమైన వైద్య విధానాల్ని, పద్ధతుల్ని అవలంబించేవారికి ఇది షాకింగ్ న్యూస్. ఎన్నాళ్లుగానో వేధిస్తున్న నడుం నొప్పిని తట్టుకోలేక చైనాకు చెందిన ఒక వృద్ధురాలు పాత ఆచారాన్ని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విషయం ఏమిటంటే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తూర్పు చైనాలోని 82 ఏళ్ల వృద్ధురాలు జాంగ్ హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతోంది . ఈ బాధను భరించలేక బతికున్న కప్పలను మింగేసింది.ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిందింటిని మింగింది. ఇలా సజీవ కప్పలను మింగడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని స్థానికంగా ప్రచారంలో ఉన్న విషయాన్ని నమ్మి ఇలాచేసినట్టు తెలుస్తోంది.నడుం నొప్పి తగ్గలేదు సరికదా, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రి పాలైంది. విషయం తెలిసి వైద్యులే నివ్వెర పోయారు. చాలాకాలంగా హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతున్న జాంగ్, అసలు విషయం చెప్ప కుండానే తనకు కప్పలు కావాలని కుటుంబ సభ్యులను కోరింది. ఇలా మొదటి రోజు మూడు కప్పలను, మరుసటి రోజు ఐదు కప్పలను సజీవంగా మింగేసింది. దీంతో క్రమంగా పరిస్థితి క్షీణించడంతో అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు వైద్యులను సంప్రదించారు. వైద్యుల ప్రకారం ఆమె పొట్టలో పరాన్నజీవి సంక్రమణను కనుగొన్నారు. ఆక్సిఫిల్ కణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కప్పలలో సాధారణంగా కనిపించే టేప్వార్మ్ లార్వా స్పార్గానమ్తో సహా, ఇతర బాక్టీరియా ఉనికిని వైద్యులు నిర్ధారించారు. నడవలేని స్థితిలో రెండు వారాల పాటు చికిత్స తీసుకుని ఎట్టకేలకు ఇంటికి చేరింది సజీవంగా కప్పలను మింగడం వల్ల రోగి జీర్ణవ్యవస్థ దెబ్బతిని, పరాన్నజీవులు చేరాయి ఆసుపత్రి వైద్యుడు తెలిపారు.నోట్ : ఆరోగ్య చిట్కాలు చిట్కాలు మాత్రమే అని గమనించాలి.అవి పరిష్కారం ఎంతమాత్రం కావు. అందులోనూ సుదీర్ఘ కాలంలో బాధపడుతున్న వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే మొదటికే మోసం రావచ్చు. -
అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజుకు 25 లక్షలు!
మనిషి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. హీరో అనుకున్న వారు జీరో కావొచ్చు. ఎందుకూ పనికిరారు అనుకున్నవారు ఎవరూ ఊహించని విధంగా పైకి ఎదగవచ్చు. శిఖరం చేరిన వారు పాతాళానికి పడిపోవచ్చు. ఇలాంటి వారిలో మళ్లీ పైకి లేచేవారూ ఉంటారు. జీవితాన్ని మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టి ముందుకెళ్లడానికి ఏమాత్రం సంకోచించరు. అలాంటి ఓ వ్యాపారవేత్త గురించి మనం తెలుసుకుందాం. అయితే ఆయన మనదేశానికి చెందిన వాడు కాదు. స్ఫూర్తి పొందడానికి ఎక్కడివారైతే ఏంటి?చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా! చనాకు చెందిన 57 ఏళ్ల టాంగ్ జియాన్ 2000 సంవత్సరం ప్రాంతంలో నెలకు మూడు మిలియన్ యువాన్ల (ప్రస్తుత రేటు ప్రకారం సుమారు ₹3.7 కోట్లు) వరకు సంపాదించేవాడు. తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్లోని తీరప్రాంత నగరమైన కింగ్డావోలో (Qingdao) మూడు ప్రసిద్ధ రెస్టరెంట్లు, బార్లు ఉండేవి. జీవితంగా సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో ఊహించని మలుపు తిరిగింది. తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి టాంగ్ జియాన్ చేతులు కాల్చుకున్నాడు. త్వరగా సంపాదించాలన్న దురాశతో సొంత డబ్బుతో పాటు ఇతరులను నుంచి అప్పులు తీసుకుని మరీ పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయాడు. ఫలితంగా 2015 నాటికి రూ. 57 కోట్లు అప్పులతో దివాళా తీశాడు.వీధి దుకాణంతో రీస్టార్ట్వ్యాపారంలో సర్వం కోల్పోవడంతో అతడి జీవితం తలకిందులైంది. రెస్టరెంట్లను మూసివేశాడు. ఆస్తులు మొత్తం అమ్మినా అప్పులు తీరలేదు. భార్యతో తరచుగా గొడవ పడేవాడు. దీంతో భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఊహించని విధంగా ఒడిదుడుకులు ఎదురు కావడంతో ఎందుకు బతకాలన్న ఆలోచనలు వెంటాడేవి. అయితే తనపై ఆధారపడిన అమ్మ, కన్నబిడ్డ గుర్తుకు రావడంతో ఎలాగైనా జీవితాన్ని ఈదాలని అనుకున్నాడు. 2018లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. పాత రెస్టరెంట్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ స్టాల్ (street food stall) స్టార్ట్ చేశాడు. ఇంట్లో తయారుచేసిన సాసేజ్లను అక్కడ అమ్మడం ప్రారంభించాడు. 74 ఏళ్ల తల్లి అతడికి సహాయం చేసేది.ఒకప్పుడు బాగా బతికిన టాంగ్ జియాన్ (Tang Jian) చివరికి వీధి దుకాణం పెట్టుకోవాల్సి రావడంతో న్యూనతకు గురయ్యాడు. తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధరించేవాడు. అయితే పొరుగున ఉండే వారిలో ఒకరు అతడిని గుర్తు పట్టడంతో ముఖం దాచుకోవడం మానేశాడు. ధైర్యంగా తన వ్యాపారంపై దృష్టి పెట్టాడు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాడు. చేతితో తయారు చేసిన నాణ్యమైన సాసేజ్లను తక్కువ ధరకు విక్రయించడంతో అతడి వ్యాపారం దినదినాభివృద్ధి సాధించింది. రోజుకు 2 టన్నుల సాసేజ్లను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు టాంగ్ జియాన్ రోజుకు దాదాపు 200,000 యువాన్లు (₹25 లక్షలు) సంపాదిస్తున్నాడు. పలు షాపింగ్ సెంటర్లలో అతడి అవుట్లెట్లు ఉన్నాయి.కోవిడ్ దెబ్బ కొట్టినా..సంకల్పం గట్టిగా ఉంటే శిఖరస్థాయికి నుంచి కిందకు పడిపోయినా మళ్లీ పైకి లేవొచ్చని టాంగ్ జియాన్ దీమాగా చెబుతున్నాడు. కోవిడ్-19 (Covid-19) సమయంలో వ్యాపారం మందగించడంతో డిజిటల్ బాట పట్టాడు. ఆన్లైన్ అమ్మకాలతో దాదాపు 12 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. తాజాగా కృత్రిమ మేధస్సు సహాయంతో తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాడు. ఒక సెషన్లో మిలియన్ యువాన్ (₹1.25 కోట్లు) విలువైన వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నాడు. 2027 నాటికి అప్పులన్నీ తీర్చేయాలన్న లక్ష్యంతో అతడు ముందుకు సాగుతున్నాడు. స్ఫూర్తిదాయకంటాంగ్ జియాన్ ప్రస్థానాన్ని 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' ప్రచురించింది. దీన్ని చదివిన పాఠకులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడాలని టాంగ్ జీవితం బోధిస్తోందని పేర్కొంటున్నారు. ఉన్నత స్థానం నుంచి కిందకు పడిపోయినా పట్టుదలతో పోరాడిన టాంగ్ జీవితం స్ఫూర్తిదాయకమని (inspiring) అంటున్నారు. సంకల్పం, సహనంతో అనుకున్నది సాధించవచ్చని టాంగ్ మరోసారి రుజువు చేశాడని మెచ్చుకుంటున్నారు. చదవండి: డొనాల్డ్ ట్రంప్ నాణెంపై వివాదం -
వీడియో: 18వేల అడుగుల ఎత్తు! సెల్ఫీ తీయబోతే పట్టు తప్పి..
సెల్ఫీ మోజు.. ఓ పర్వతారోహకుడి ప్రాణం బలి తీసుకుంది(Selfie Death). ఏకంగా 18వేల అడుగుల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఆ వ్యక్తి పెద్ద పొరపాటు చేశాడు. తోటి బృందంతో సెల్ఫీ కోసమని కట్టుకున్న తాడును విప్పదీసుకున్నాడు. అదే.. అతని మరణానికి కారణమైంది. చైనా సిచువాన్లోని మౌంట్ నామా(Mount Nama) శిఖరంపై(ఎత్తు: 5,588 మీటర్లు.. సుమారుగా 18,300 అడుగులు) ఓ బృందం ట్రెక్కింగ్ చేస్తోంది. ఆ సమయంలో ఓ హైకర్.. సేఫ్టీ రోప్ను విప్పేసి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పి దొర్లుకుంటూ పడిపోయాడు. అలా.. 200 మీటర్లు(656 మీటర్లు) జారిపడి మృతి చెందాడు. ఆ సమయంలో తోటి బృందంలోని సభ్యులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.మృతుడ్ని 31 ఏళ్ల హాంగ్గా గుర్తించారు. రక్షణ బృందాలు అతన్ని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతని ప్రాణం పోయింది. అతికష్టం మీద స్వాధీనం చేసుకున్న హాంగ్ మృతదేహాన్ని.. గోంగ్గా మౌంటెన్ టౌన్కు తరలించారు. సెల్ఫీ కోసం తన సేఫ్టీ రోప్ తీసేయడం.. ఐస్ యాక్స్ లేకపోవడంతో కాళ్లకు ఉన్న క్రాంపాన్ బూట్లు మంచుపై జారి ఈ ఘోరం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. హంగ్ మంచు కొండలు ఎక్కడం ఇదే తొలిసారి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటుచేసుకోగా, వీడియో సోషల్ మీడియాలోMount Nama Viral Video వైరల్ అవుతోంది. Terrifying Footage Shows Tourist Sliding To His Death After Taking A Selfie On Mount Nama Feng In Sichuan, 🇨🇳He reportedly unclipped his safety harness to take a picture, but slipped on the ice and was sent plummeting into the abyss - to the horror of fellow climbers. pic.twitter.com/Z4Wa5esHlT— sanjay patel (@Sanjaypatel12Dr) October 3, 2025 ఇదిలా ఉంటే.. హంగ్తో పాటు వెళ్లిన బృందం ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే అతను ప్రొఫెషనల్ కాదని, అరుదుగా కొండలెక్కిన అనుభవం మాత్రమే ఉందని సిచువాన్ మౌంటెనీరింగ్ అసోషియేషన్ అంటోంది.ఇదీ చదవండి: మీరు తినగా వదిలేసిన ఆహారం ఏమవుతుందో తెలుసా? -
మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబ్(Trump Another Tariff) పేల్చారు. ఈసారి మధ్యస్థ, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ ట్రక్కులపై పెంచిన ఈ సుంకాలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. నవంబర్ 1వ తేదీ నుంచి మధ్యస్థ, భారీ వాణిజ్య ట్రక్కులపై అమెరికా 25% సుంకాలు వసూలు చేయనుంది. అమెరికాలో వాహనాల ఉత్పత్తిని ప్రొత్సహించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే.. అమెరికా-ఆధారిత భాగస్వామ్య దేశాలు, జాయింట్ వెంచర్లు ఈ టారిఫ్ నుంచి మినహాయింపు పొందే అవకాశం లేకపోలేదు. ఇక.. చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై ఈ లేటెస్ట్ టారిఫ్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ టారిఫ్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ విడి భాగాలు, ఉపకరణాలు (components) దిగుమతులపై కూడా టారిఫ్లు ఉంటే, ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్-ఆధారిత వ్యాపారాలపై ప్రభావం ఉండొచ్చు. భారత్ నుంచి అమెరికాకు ఈ తరహా ట్రక్కుల (Medium/Heavy-duty Trucks) దిగుమతులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అంతగా ప్రభావం పడకపోవచ్చు. అయితే.. ఇక్కడి కంపెనీలు అమెరికా మార్కెట్లో ప్రవేశించాలనుకుంటే మాత్రం టారిఫ్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: నెల తిరగకముందే రాజీనామా చేసిన ప్రధాని! -
వదిలేసిన ఆహారం విషమవుతోంది!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుంది. కొన్ని దేశాలలో ఉత్పత్తి చేసిన ఆహారంలో చాలా భాగం వృథా అవుతోంది. ఇక్కడ ఫుడ్ వేస్ట్ అవడమే కాదు అది మళ్లీ మనకే ప్రాణాంతకమవుతోంది. ఈ వృథా ఆహార పదార్థాలు చెత్త డంపుల్లో పడి మీథేన్ వంటి ప్రమాదకర గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరం. ప్రపంచ గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో ఆహారం వృథా కారణంగా 8 నుంచి 10% వరకు ఉంటున్నాయి. అలాగే 30% వ్యవసాయ భూమిని ఆహార పదార్థాలకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. మీకు తెలుసా? ఒక ఇంట్లో ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 132 కిలోగ్రాముల ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. అలాగే, ప్రపంచదేశాలు ఏటా 1 లక్ష కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆహారాన్ని వదిలేస్తున్నాయి. మరో విషాదమేమంటే.. ఇంత ఆహారం వృతా అవుతున్నా ప్రపంచంలో 78.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తుండటం..!చైనా.. భారత్.. పాకిస్తాన్..ఆహార వృథా సమస్య తీవ్రతపై 2024లో ఓ నివేదిక విడుదలైంది. ఇందులోని డేటాలో ప్రపంచంలోని ఏఏ దేశాల వాళ్లు ఎక్కువ ఆహారాన్ని వృధా చేస్తున్నారో తెలిపారు. ఆహారం వృథా చేసే దేశాల్లో మొదటి స్థానాన్ని చైనా ఆక్రమించింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశాలలో చైనా ఒకటి. చైనాలో సంవత్సరానికి 108 మిలియన్ టన్నులకు పైగా ఆహారాన్ని వృథా అవుతోంది. అంటే చైనాలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి 76 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నాడన్నమాట. ఇక రెండో స్థానంలో ఉన్నది మనమే. మనదేశంలో సంవత్సరానికి 78 మిలియన్ టన్నులకు పైగా ఆహారం వృథా అవుతోంది. దేశ జనాభా ఎక్కువ కాబట్టి ప్రతి భారతీయుడు సంవత్సరానికి 54 కేజీలు వృథా చేస్తాడు. అసమర్థ స్టోరేజ్, రవాణా లోపాలు, వ్యవసాయ క్షేత్రం నుంచి మార్కెట్కు తరలించేటప్పుడు ఆహారం చెడిపోవడం..వంటివి ఫుడ్ వేస్ట్ అవడానికి ప్రధాన కారణాలు. మూడో స్థానం పాకిస్తాన్. ఇక్కడ ఏడాదికి 31 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. అయితే సగటున ప్రతి వ్యక్తి 122 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. ప్రపంచంలో ఆహారం వృథా అయ్యేది ఇక్కడే. నిల్వ వసతులు లేమిఆహార వృథాలో నాలుగో స్థానం నైజీరియాది. ఇక్కడ 24.8 మిలియన్ టన్నుల వృథాతో సగటున ఒక్కో వ్యక్తి 106 కేజీల ఆహారం వృథా చేస్తున్నాడు. ఇక్కడ వృథా ఎక్కువగా వినియోగదారుల నుంచి కాకుండా కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, రవాణా సమస్యలు, మార్కెట్ యాక్సెస్ లోపాలతో వృథా అవుతోంది. ఐదో స్థానంలో అమెరికా ఉంది. అమెరికాలో ప్రతి ఏటా దేశం మొత్తంలో 24 మిలియన్ టన్నులు ఆహారం వృథా అవుతండగా లగటు ప్రతి వ్యక్తి 71 కేజీలు వృథా చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లలో ఆహారం వృథా అవుతుంది. ఆరో స్థానంలో బ్రెజిల్. సంవత్సరానికి 20 మిలియన్ టన్నులు పైగా, ప్రతి వ్యక్తికి 95 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఏడో స్థానంలో ఈజిప్ట్ ఉంది. 18 మిలియన్ టన్నులతో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి వ్యక్తి 155 కేజీలు వృథా చేస్తున్నారు. ఎనిమిదో స్థానంలో ఇండోనేసియా ఉంటుంది. 15 మిలియన్ టన్నులతో ప్రతి వ్యక్తి 52 కేజీలు వృథా చేస్తున్నాడు. తొమ్మిదో స్థానంలో బంగ్లాదేశ్. 4 మిలియన్ టన్నులు పైగా, కానీ వ్యక్తికి 82 కేజీల చొప్పున వృధా అవుతోంది. బంగ్లాదేశ్ లాంటి దేశానికి ఇది చాలా ఎక్కువ. చివరి స్థానంలో మెక్సికో నిలిచింది. ఏడాదికి 13.4 మిలియన్ టన్నుల మేర వృథా అవుతుంది. సగటున ప్రతి వ్యక్తి 102 కేజీలు ఆహారం వృథా అవుతోంది.మనం ఏమి చేయగలం? అవసరమైన మేరకే కొనుగోలు చేయడం, వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం, ఫుడ్ బ్యాంకులకు డొనేట్ చేయడం వంటి చిన్న మార్పులతో పెద్ద తేడా తీసుకురావచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. మార్పు మన నుంచే మొదలుకావాలన్నది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఆ తర్వాతే సమాజం, దేశంతో పాటు ప్రపంచం కూడా మారుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అదే ఆహారం మనకే విషమైతే..? మనుగడ ప్రశ్నార్థకమవుతుంది..! -
ఎవరెస్టుపై అత్యంత భయానక రాత్రి!
ఖట్మాండు: ఎవరెస్ట్ పర్వతంపై భారీ మంచు తుఫాన్ పర్వతంతో(Mount Everest blizzard) ఒక్కసారిగా అలజడి రేగింది. సుమారు 1,000 మంది పర్వతారోహకులు ఈ తుపానులో చిక్కుకునిపోగా.. వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టిబెట్ వైపు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో చైనా ప్రభుత్వం ఈ సహయక చరయలను పర్యవేక్షిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్పై టిబెట్(Mount Everest Tibet) వైపు అక్టోబర్ 3న తేదీన భారీ మంచు తుఫాన్ ప్రారంభమైంది. ఈ ప్రభావంతో కర్మా వ్యాలీ, కాంగ్షుంగ్ వైపు ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్లు క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకునిపోయారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో మంచు తొలగిస్తూ దారులను క్లియర్ చేస్తున్నారు. Nearly 1,000 people are trapped on Mount Everest slopes — Rescue operation underway.#MountEverest #Everest pic.twitter.com/hyVSR0ER3a— Shehzad Qureshi (@ShehxadGulHasen) October 5, 2025రెస్యూ బృందాలు ఇప్పటిదాకా 350 మందిని కాపాడినట్లు సమాచారం. వాళ్లందరినీ ఆదివారం నాటికే క్యూదాంగ్ పట్టణానికి తరలించారు. మరో 200 మందిని దశలవారీగా కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. హైపోథర్మియా(Hypothermia.. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువకి పడిపోవడం) కారణంగా పర్వతారోహకులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు స్పష్టమవుతోంది. “ఇది తమ జీవితంలోనే అత్యంత భయంకరమైన రాత్రి” అని పలువురు మీడియాకు రోదిస్తూ చెప్పారు. మంచు తుఫాన్ ధాటికి టెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో పర్వతారోహకులు సురక్షిత ప్రాంతాల వైపు తరలిపోతున్న దృశ్యాలతో ఓ వీడియో రికార్డు బయటకు వచ్చింది. అయితే పర్వతారోహకులు అలా తరలిపోతుండడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారి తప్పిపోయే అవకాశం ఉండడం, పైగా హైపోథర్మియాతో పాటు ఆక్సిజన్ కొరత వాళ్ల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తుఫాన్ తీవ్రంగానే..కర్మా లోయ సముద్ర మట్టానికి 4,200 మీటర్ల ఎత్తులో ఉంది. నేపాల్లో భారీ వర్షాలు, మెరుపు వరదలు,కొండ చరియలు విరిగిపడి 47 మంది మరణించారు. ఈ ప్రతికూల వాతావరణ ప్రభావంతో.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఎవరెస్ట్పై మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షం, ఆపై భారీ మంచు తుపాను సంభవించింది. మరోవైపు.. తుపాను నేపథ్యంలో తింగ్రీ కౌంటీ టూరిజం సంస్థ అన్ని టికెట్ అమ్మకాలు, ప్రవేశాలను శనివారం నుంచే నిలిపివేసింది.గతంలోనూ.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం.. మౌంట్ ఎవరెస్ట్. అయితే దీనిని అధిరోహించే క్రమంలో అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా 340 మరణించారు. అలాగే గతంలో ప్రకృతి విపత్తుల కారణంగానూ ఇక్కడ ప్రాణ నష్టం సంభవించింది కూడా. 1996 మే 10-11 తేదీల్లో మౌంట్ ఎవరెస్ట్ తుపాను కారణంగా ఎనిమిది మంది మరణించారు. అలాగే.. 2014 ఏప్రిల్ 18వ తేదీన మంచు శిఖరాలు (ice seracs) కూలిపోవడంతో 16 మంది నేపాలీ గైడ్లు మృతి చెందారు. అయితే భద్రతా లోపాలు, పైగా ఈ ఘటనలో భాదిత కుటుంబాలకు తక్కువ పరిహారం చెల్లించడంతో గైడ్లు సమ్మెకు దిగడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2015 నేపాల్ భూకంపం కారణంగా.. ఎవరెస్ట్ బేస్క్యాంప్పై మంచు కుప్పలు కూలి 22 మంది మృతి చెందారు. చరిత్రలో అత్యంత ఘోరమైన ఎవరెస్ట్ విపత్తుగా దీనికి గుర్తింపు లభించింది. -
ఈ నెల్లోనే భారత్-చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు!
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం, గల్వాన్ ఉద్రిక్తతలతో బీటువారిన చైనా, భారత్ బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించనున్నాయి. సుమారు ఇరుదేశాల మధ్య ఐదేళ్ల నుంచి ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను అతి త్వరలో పునరుద్ధరించబడనున్నాయి. ఈ నెల చివరి నాటికి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్-చైనాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా టారిఫ్ల మోత మోగించడంతో విసిగి పోయిన భారత్, చైనాలు మళ్లీ స్నేహగీతాన్ని ఆలపిస్తున్నాయి. అందులో భాగంగానే నేరుగా విమానసర్వీసుల పునర్ప్రారంభానికి శ్రీకారం చుట్టబోతున్నాయి.గల్వాన్ నుంచి గట్టిబంధం దిశగా2020 మేలో తూర్పు లద్దాఖ్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతకు బీజం పడింది. జూన్లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముష్టిఘాతం, పిడిగుద్దులు, ఘర్షణ కారణంగా ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలను మరింత పెంచారు. దీంతో భారత్, చైనా సత్సంబంధాలు అడుగంటాయి. పాస్పోర్ట్లు, దిగుమతులు, అనుమతులు మొదలు మరెన్నో రంగాల్లో సత్సంబంధానికి బీటలు పడ్డాయి.అయితే ట్రంప్ ఇష్టారీతిన విధించిన దిగుమతి సుంకాల భారంతో ఇబ్బందులు పడుతున్న భారత్, చైనాలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భావిస్తున్నాయి. ఇందుకోసం మళ్లీ స్నేహగీతం పాడక తప్పని నెలకొంది. గత కొద్దినెలలుగా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గత నెలలో అంగీకారం తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు సిద్ధపడ్డారు.చైనాతో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని ఆదేశ పర్యటనను ఖరారుచేసి మోదీ సూచనప్రాయంగా చెప్పారు. భారత్ వంటి దేశాలపై టారిఫ్ను అమెరికా పెంచడాన్ని చైనా సైతం తీవ్రంగా పరోక్షంగా ఖండించింది. ఇలా నెమ్మదిగా బలపడుతున్న మైత్రీ బంధాన్ని నేరుగా విమానసర్వీసుల ద్వారా మరింత పటిష్టంచేయాలని భారత్ ఆశిస్తోంది. చివరిసారిగా మోదీ చైనాలో 2018 జూన్లో పర్యటించారు. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటించారు. ఇటీవల టియాన్జిన్లో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు: అందులో ఇరు దేశా మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణ అంశం ఒకటి. -
నాలుగు వారాల్లో జిన్పింగ్ను కలుస్తా: ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో నాలుగు వారాల్లోగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను(Xi Jinping) తాను కలుస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చైనాతో సోయాబీన్ అంశంపై చర్చించనున్నట్టు తెలిపారు. కాగా, ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో జిన్పింగ్తో భేటీపై ఆసక్తి నెలకొంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో తాజాగా స్పందిస్తూ..‘చైనా(China) చర్యల కారణంగా అమెరికాలో సోయాబీన్ రైతులు నష్టపోతున్నారు. జోబైడెన్ ప్రభుత్వంలో అమెరికా నుంచి సోయాబీన్ కొనుగోళ్లను చైనా ఆపేసింది. ఇప్పుడు కేవలం చర్చల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే జిన్పింగ్తో మాట్లాడాలని అనుకుంటున్నారు. మరో నాలుగు వారాల్లో నేను జిన్పింగ్ను కలిసి దీనిపై మాట్లాడతాను. నేను మా రైతులను ఎప్పటికీ నిరాశపరచను. అమెరికా రైతులకు అండగా ఉంటాను. మేము ఇప్పటికే సుంకాల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాం. ఆ డబ్బులో కొంత భాగం రైతులకు సహాయం చేయబోతున్నాం. రైతులను ఆదుకుంటాం’ అని చెప్పుకొచ్చారు. Trump announced he will have a meeting with Xi to beg China to start buying American soybeans again: pic.twitter.com/liZZ3cEkFU— Spencer Hakimian (@SpencerHakimian) October 1, 2025 మరోవైపు.. అక్టోబరు చివరివారంలో దక్షిణకొరియాలో ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (అపెక్) సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరుకానున్నారు. ఆ సదస్సు అనుబంధంగా జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతానని ఇటీవల ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక, వచ్చే ఏడాది ఆరంభంలో చైనాలో పర్యటిస్తానని కూడా అమెరికా అధ్యక్షుడు ఆ మధ్య ప్రకటించారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగం మళ్ళీ టిక్ టాక్ విషయంలో ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి మంతనాలను జరుపుతోంది. తాజాగా ఓవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను అధ్యక్షుడు జిన్పింగ్తో మంచి సంభాషణ జరిపాను. ఆయన టిక్టాక్ ఒప్పందాన్ని ఆమోదించారు. ఒప్పందం కోసం మేము ఎదురుచూస్తున్నాం. దానిపై సంతకం చేయాలి. ఇది లాంఛనప్రాయంగా ఉండవచ్చు. టిక్టాక్ ఒప్పందం జరుగుతోంది. పెట్టుబడిదారులు సిద్ధమవుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
చైనాకు చెమటలు పట్టిస్తోన్న అండమాన్ ప్రాజెక్టు
-
చైనా కోసం గాడిదలు పెంచుతున్న పాకిస్థాన్..
తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ సరికొత్త వ్యాపార అవకాశాలపై దృష్టి పెట్టింది. చైనా కోసం గాడిదలను పెంచుతోంది. ఇందుకోసం చైనా కంపెనీ జింగ్యింగ్ పెట్టుబడులతో పెషావర్లో 37 మిలియన్ డాలర్లతో భారీ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా ఏటా 80 వేల గాడిదలను చైనాకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.చైనాలో గాడిద మాంసానికి, ఎముకలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నెలకు 10 వేల గాడిదలను ప్రాసెస్ చేసి, మాంసం ఎగుమతులు చేయాలని నిర్ణయించినట్లు పాకిస్థాన్ ఆహార భద్రత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే స్థానికంగా మాత్రం గాడిద మాంసం అమ్మకాలపై నిషేధం ఉంటుందట.చైనాకు గాడిద మాంసాన్ని ఎగుమతి చేసేందుకు పెషావర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గాడిదల పెంపకానికి ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలలో 40 ప్రత్యేక పొలాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
ఆకాశయానానికి మహా బ్రిడ్జి
బీజింగ్: ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల్లో అద్భుతాలు సృష్టించడంలో డ్రాగన్ దేశం చైనా ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇప్పుడు మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనను ఆదివారం అధికారికంగా ప్రారంభించింది. వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. నైరుతి చైనాలోని గిజౌ ప్రావిన్స్లో ‘హుజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జి’ పేరిట ఈ భారీ వంతెన నిర్మించారు. ఈ బ్రిడ్జి ఎత్తు 625 మీటర్లు. అంటే ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కంటే రెండు రెట్లు ఎక్కువ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనగా హుజియాంగ్ బ్రిడ్జి రికార్డుకెక్కింది. మొత్తం పొడవు 2,890 మీటర్లు. రెండు ఆధార స్తంభాల మధ్య(స్పాన్) వంతెన పొడవు 1,420 మీటర్లు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్పాన్ బ్రిడ్జిగా మరో రికార్డు సృష్టించింది. కొండ ప్రాంతంలో దీన్ని నిర్మించారు. 2022లో నిర్మాణ పనులు మొదలయ్యా యి. మూడేళ్లలోనే పూర్తయ్యాయి. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నిర్మాణంలో ఇంటెలిజెంట్ కేబుల్ హోస్టింగ్ సిస్టమ్తోపాటు 2,000 ఎంపీకే హై–్రస్టెంత్ స్టీల్ వైర్ ఉపయోగించారు. ఈ మహా వంతెనకు 21 పేటెంట్లు దక్కడం గమనార్హం. మారుమూల ప్రాంతంలో ఇది అందుబాటులోకి రావడంతో ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరుగుతుందని, స్థానికంగా అభివృద్ధి వేగం పుంజుకుంటుందని, నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు రాబోతున్నాయని, అధికారులు చెప్పారు. వంతెన ప్రారంబోత్సవానికి వేలాది మంది జనం హాజరయ్యారు. సంబరాల్లో మునిగిపోయారు. పరస్పరం తమ ఆనందం పంచుకున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన బ్రిడ్జి తమ ప్రాంతంలో అందుబాటులోకి రావడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. నాటు పడవలపై ప్రయాణించే అగత్యం ఇక తప్పిపోయిందని, కొత్త వంతెనపై రయ్రయ్ అంటూ దూసుకెళ్తామని అన్నారు. -
కర్ణుని మాదిరి జననం..! కట్చేస్తే ఇవాళ స్టార్ రేంజ్ క్రేజ్..
మనం ఎలా పుట్టామన్నది కాదు..మన జీవితాన్ని ఎలా మలుచుకున్నామనేది ముఖ్యం. అది మన రేంజ్ని, ఉనికిని తెలియజేస్తుంది. అదే ప్రూవ్ చేసింది పాక్ అమ్మాయి. పుట్టింది పాక్లో..ఫేమస్ అయ్యింది చైనాలో. ఎంతలా ఆమెకు సోషల్ మీడియా క్రేజ్ ఉందంటే..ఓవర్నైట్ స్టార్ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారామెకు. ఇంతకీ ఎవరా అమ్మాయంటే..ఆ అమ్మాయే 20 ఏళ్ల ఫ్యాన్ జిహే. పాకిస్తాన్ మూలాలకు చెందిన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జననం అచ్చం కర్ణుని మాదిరిగా జరిగింది. ఎలా మహాభారతంతో కుంతీదేవి కర్ణుని ఒక పెట్టేలా వదిలేసిందో అలా ఫ్యాన్ పాక్ తల్లిదండ్రులు పుట్టగానే ఒకకార్డుబోర్డు పెట్టేలో వదిలేశారు. అయితే పాక్లో పనిచేస్తున్న చైనా దంపతులుకు ఆశిశువు దొరికింది. పిల్లలు లేకపోవడంతో ఆ చిన్నారిని చైనా దంపతులు దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అలా ఫ్యాన్ చైనాలోని హెనాన్ అనే గ్రామంలో పెరిగింది. ఆ దంపతులు తిరిగి చైనాకి వచ్చి స్థిరపడటంతో ఆమె బాల్యమంతా చైనా దేశంలోనే సాగింది. 2023 ఆమె లైఫ్ ఊహించిన మలుపు తిరిగింది. సరదాగా తన గ్రామీణ నేపథ్యం యాసలో మాట్లాడుతూ న్యూడిల్స్ ఆస్వాదిస్తున్న వీడియోని సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడమే కాదు ఆమె సోషల్ మీడియా అకౌంట్కి మిలియన్ల కొద్ది చైనా ఫాలోవర్లు సంపాదించుకుంది. వ్యవసాయ కుటుంబ జీనవ విధానం, అలాగే ఆ గ్రామంలో లభించే స్థానిక ఉత్పత్తులు వాటికి సంబంధించిన వీడియోలతో చైనా ప్రజలకు మరింత చేరువైంది. దాంతో ఆమె విశాల హృదయానికి వేలాదిమంది అభిమానులుగా మారడమే గాక ఆమె వీడియోలకు మంచి క్రేజ్ పెరిగింది. అలా తన వీడియోలకు వీరాభిమాని అయినా లియు జియావోషుయ్ అనే అతడిని కామన్ స్నేహితుల ద్వారా కలుసుకుంది. అలా పరిచయమైన అతడు కాస్త ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు. ఈ నెల సెప్టెంబర్ 17న వివాహ బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. అంతేగాదు,ఫ్యాన్ ఆన్లైన్లోక్రేజ్ తగ్గకుండా ఉడేలా ఆమె వీడియోలను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే పనుల తోపాటు ఆమె తల్లిదండ్రుల బాగోగులను చూసుకునే బాధ్యతను తీసుకున్నాడు. అందుకోసమే తన జాబ్ని కూడా వదిలేసుకున్నాడు లియు. మరో విశేషం ఏంటంటే ఆ దంపతులు అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడమే కాదు అలంకరణ కోసం సముద్ర నేపథ్య అంశాలను ఎంచుకున్నాడు. ఎందుకంటే తన భార్య ఫ్యాన్ ఇంతవరకు సముద్రాన్నే చూడలేదన్న ఉద్దేశ్యంతో అట. ఈ సందర్భంగా పాక్ మూలాలున్న చైనా అమ్మాయి ఫ్యాన్కి అభిమానుల నుంచి అభినందనల వెల్లువెత్తడమే కాకుండా వారి పూర్తి మద్దతును అందించారు. పైగా ఫ్యాన్ అబిమానులు తామెంతో ముద్దుగా పిలచుకునే "ఫెయిరీ టేల్ ప్రిన్సెస్" (రాకుమారి)ని యువరాణిలా చూసుకోవాలని లియుకి నొక్కి చెప్పడం విశేషం. ఈ స్టోరీ.. మన బ్యాగ్రౌండ్ ఎలాంటిదైనా..మన టాలెంట్, కష్టపడేతత్వంతో మన ఉనికిని చాటుకునేలా బతకొచ్చని ప్రూవ్ చేసింది ఈ అందమైన టీనేజర్. (చదవండి: Sandeep Jangala: క్రికెట్ టు క్లౌడ్ కిచెన్ కమ్ కేఫ్..! చివరికి దేశంలోనే తొలి మిల్లెట్ కేఫ్గా..) -
జోక్యం చేసుకుంటే దీటుగా బదులిస్తాం.. ట్రంప్కు చైనా కౌంటర్
బీజింగ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలే నిధులు సమకూరుస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం చైనా విరుచుకుపడింది. తాము రష్యాతో జరుపుతున్న వాణిజ్యంపై అమెరికా జోక్యం చేసుకుని ఎలాంటి చర్యలైనా చేపడితే దానికి దీటుగా బదులిస్తామని చైనా స్పష్టంచేసింది.చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. యూరోపియన్ యూనియన్తో పాటు సాక్షాత్తు అమెరికానే రష్యాతో వాణిజ్యం నెరుపుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించి శాంతిని నెలకొల్పేందుకు చైనా చర్చలను చురుకుగా ప్రోత్సహిస్తోందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చైనా, భారత్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలాన్నిస్తున్నాయని ట్రంప్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.‘అమెరికా, ఈయూ దేశాలతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి. చైనా, రష్యా కంపెనీలు డబ్ల్యూటీఓ నిబంధనలు, మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మేము ఏ థర్డ్ పార్టీని కూడా లక్ష్యంగా ఎంచుకోలేదు. ఎవ్వరి ప్రయోజనాలను కూడా దెబ్బతీయట్లేదు. మా న్యాయమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు ఏం చేయాలో అది మాత్రమే చేస్తాం’ అని గుయో జియాకున్ చెప్పారు. -
రష్యా, చైనాలతో భారత్కు పోలిక లేదు: ఫిన్లాండ్ అధ్యక్షుడు
హెల్సింకి: భారతదేశం.. రష్యా, చైనాల మాదిరి కాదని..అదొక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్ అని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను పరిష్కరించడంలో భారతదేశ భౌగోళిక, రాజకీయ పాత్రను, శాంతి చర్చలలో భాగస్వామ్యాన్ని ఆయన వివరించారు. సాంకేతిక, వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్- ఫిన్లాండ్ సంబంధాలను బలోపేతం చేయడానికి మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు.ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారతదేశ అభివృద్ధిని కొనియాడుతూ పాశ్చాత్య దేశాలు ఆ దేశంతో మరింత సన్నిహితంగా మెలగాలని కోరారు. బ్లూమ్బెర్గ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారతదేశం, రష్యా, చైనా మధ్య పెరుగుతున్న సమన్వయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశం అటు యూరోపియన్ యూనియన్కు, ఇటు యునైటెడ్ స్టేట్స్కు సన్నిహిత మిత్రదేశం. అందుకే రష్యా, చైనా దేశాల జాబితాలో భారత్ను చేర్చనన్నారు. భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్. అందుకే పశ్చిమ దేశాలు భారతదేశంతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని అన్నారు. 🚨 BIG STATEMENT🇫🇮 Finland Prez Stubb: “India is a very close ALLY of the EU & US.”“India is an emerging SUPERPOWER with demography & economy on its side.” 🔥“West must engage with India.” 🎯 pic.twitter.com/oVwfEA3ERW— Megh Updates 🚨™ (@MeghUpdates) September 24, 2025రష్యా- చైనా ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయని భావిస్తున్నానని, 1990ల ప్రారంభంలో చైనా-రష్యా ఒకే పరిమాణంలో ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు చైనా 10 రెట్లు వృద్ధి సాధించింది. ఇప్పుడు రష్యా నుంచి చమురు,గ్యాస్ కొనుగోలు, సాంకేతిక మార్పిడితో పరస్పర సహకారం అందిస్తోంది. ఇది రష్యా యుద్ధ తంత్రానికి అవకాశం కల్పిస్తుంది. అందుకే ఆ దేశాల మధ్య దగ్గరి సంబంధం ఉన్నదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు.భారతదేశంతో ఇతర దేశాల భాగస్వామ్యం కోసం ఫిన్లాండ్ పిలుపు నివ్వడం ఇది మొదటిసారి కాదని, అంతకుముందు, హెల్సింకి సెక్యూరిటీ ఫోరం 2025లో కోరామన్నారు. తాను ఇటీవల ప్రధాని మోదీతో ఉక్రెయిన్ పరిస్థితి గురించి మాట్లాడానని, తొలుత కాల్పుల విరమణ అవసరమని, ఆ తర్వాతనే శాంతి చర్చలను ప్రారంభించగలమని మోదీ పేర్కొన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు హాజరైన షాంఘై సహకార సంస్థ (ఎసీసీఓ)సమ్మిట్కు హాజరయ్యారని, ఆ సమయంలో వారి మధ్య స్నేహాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. -
కొత్త కే-వీసా పాలసీ ప్రకటించిన చైనా
-
అమెరికా పొమ్మంటే.. చైనా రమ్మంటోంది
బీజింగ్: హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును పెంచేసి అమెరికా విదేశీ ప్రతిభావంతులను దూరం చేసుకుంటుంటే ఇదే అదనుగా వాళ్లకు చైనా స్వాగతం పలుకుతోంది. కీలకమైన సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్(స్టెమ్) కోర్సుల్లో పట్టభద్రులైన విదేశీ నిపుణులు సులభంగా తమ కొత్త కే–వీసా పొంది తమ దేశంలో హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ నుంచి కొత్త కేటగిరీ అయిన కే–వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు ఆదివారం పేర్కొంది. కొత్త కేటగిరీ వీసాల జారీకి వీలుగా విదేశీయుల రాకపోకల అడ్మినిస్ట్రేషన్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. అమెరికా సహా పలు సంపన్న దేశాలు స్థానికుల ఉద్యోగకల్పనకు ప్రాధాన్యతనిస్తూ వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండటంతో విదేశీ ప్రతిభావంతులను ముఖ్యంగా దక్షిణాసియా యువ ప్రతిభను ఒడిసిపట్టేందుకు చైనా ఇలా కొత్త కేటగిరీ వీసాను తెస్తోంది. చైనా లేదా విదేశీ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఇన్స్టిట్యూట్లలో స్టెమ్ కోర్సుల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఆపై ఉత్తీర్ణత సాధించిన యువ శాస్త్ర, సాంకేతిక నిపుణులకు కే–వీసాను ఇవ్వనున్నారు. బోధన, పరిశోధనారంగంలో ఉన్న వాళ్లూ కే–వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కువ రోజుల కాలపరిమితి, ఎక్కువ సార్లు స్వదేశాలకు రాకపోకలు సాగించే వెసులుబాటు, రెన్యూవల్ సదుపాయం వంటి మరిన్ని ఫీచర్లను కే–వీసాకు జోడించారు. హెచ్–1బీ వీసా రావాలంటే అమెరికాలోని కంపెనీయే స్వయంగా వీసా దరఖాస్తుదారుడిని సిఫార్సు చేయాల్సి ఉంటుంది. చైనా కే–వీసాకు అలాంటి కఠిన షరతులు లేవని తెలుస్తోంది. విదేశీయులు చైనాలో విద్య, సాంస్కృతిక, శాస్త్ర, సాంకేతికత, అంకుర వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొనేందుకు కే–వీసా అనుమతిస్తుంది. ఇన్నాళ్లూ అమెరికాకు పొలోమంటూ వెళ్లిన సృజనాత్మక, ప్రతిభావంత యువతను తమ వైపునకు తిప్పుకోవాలని చైనా అభిలషిస్తోంది. -
షీ జిన్పింగ్కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: అమెరికా, చైనా సంబంధాల్లో మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్ శుక్రవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ ‘టిక్టాక్’ను అమెరికాలో యథాతథంగా కొనసాగించడంపై వారు చర్చించినట్లు సమాచారం. దీనిపై త్వరలో తుది ఒప్పందానికి రావాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఇరువురి మధ్య చర్చ ప్రారంభమైనట్లు వైట్హౌస్ అధికారులు వెల్లడించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించి, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్, జిన్పింగ్ భావిస్తున్నారు. త్వరలో ముఖాముఖి సమావేశమై ఒప్పందాన్ని కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన తర్వాత జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడడం ఇది రెండోసారి. వచ్చే నెలలో జిన్పింగ్ను కలుస్తా: ట్రంప్ జిన్పింగ్తో మాట్లాడానని, టిక్టాక్ అంశంతో పాటు వాణిజ్యంపై చర్చించానని ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. దక్షిణ కొరియాలో వచ్చే నెల లో జరగబోయే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జిన్పింగ్ను కలుసుకోబోతున్నానని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో చైనాకు వెళ్తానని తెలిపారు. -
భారత్కు అల్టిమేటమా?.. ఏమాత్రం పనిచేయదు
టారిఫ్ల బెదిరింపులతో భారత్ను తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందా?.. అయితే అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదని.. అలాంటి అల్టిమేటంలు ఎన్ని ఇచ్చినా భారత్ తలవంచబోదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ అభిప్రాయపడ్డారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు ఉన్న దేశాలని, అలాంటి దేశాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్లు, ఒత్తిడులు ఏమాత్రం పని చెయ్యబోవని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అంటున్నారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడం ఆపాలని చేస్తున్న ఒత్తిళ్లు.. ఆ దేశాలను అమెరికాకు మరింత దూరం చేస్తాయే తప్ప ప్రయోజనం ఉండబోదని ‘ది గ్రేట్ గేమ్’ అనే టీవీ కార్యక్రమంలో లావ్రోవ్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు, ఆయుధాల కొనుగోలు ద్వారా.. ఉక్రెయిన్పై యుద్ధానికి భారత్ పరోక్షంగా ఫండింగ్ చేస్తోందని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే 25 శాతం పెనాల్టీ సుంకాలను ట్రంప్ విధించారు(మొత్తం 50 శాతం). రష్యాతో వాణిజ్యం ఆపకపోతే మరిన్ని ఆంక్షలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. అయితే భారత్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. ఈ పరిణామాలపై సెర్గీ స్పందించారు. ‘‘నాకు నచ్చనిది వెంటనే ఆపండి. లేకుంటే మరిన్ని సుంకాలు విధిస్తా’’ అనే భాష ఆ దేశాలపై ప్రయోగించడం ఏమాత్రం సరికాదు. అలాంటి బెదిరింపులు ప్రాచీన నాగరికత ఉన్న ఆ దేశాలపై పని చేయవు కూడా అని అన్నారాయన. పైగా..ఈ తరహా విధానం ఆ దేశాల ఆర్థిక స్థితిని దెబ్బతీయడమే కాకుండా, వారికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కొత్త మార్కెట్లు, కొత్త ఇంధన వనరులు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాక, ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది. అయితే, దీని కంటే కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే—ఈ విధానానికి నైతికంగా, రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది అని పేర్కొన్నారాయన. ఇక రష్యాపై కొత్త ఆంక్షల విధింపు బెదిరింపులపైనా ఆయన స్పందించారు. ‘‘నిజం చెప్పాలంటే.. కొత్త ఆంక్షల వల్ల ఎలాంటి సమస్య కనిపించడం లేదు. ట్రంప్ మొదటి పదవీకాలంలోనే ఎన్నో ఆంక్షలు విధించబడ్డాయి. బైడెన్ పదవీకాలంలో ఆంక్షలకు బదులు దౌత్యపరమైన చర్చలు తెరమీదకు వచ్చాయి. కానీ, అమెరికాతో రాజీ కోసం ఎలాంటి ప్రయత్నం జరగలేదు’’ అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు, ఆయుధ కొనుగోళ్ల అంశంతో భారత్పై ట్రంప్ సుంకాలు విధించారు. అయితే చైనా విషయంలో మాత్రం కేవలం బెదిరింపులకే పరిమితం అయ్యారు. అలాగే రష్యాపైనా కఠిన ఆంక్షలు ఉంటాయంటూ ప్రకటనలు చేస్తున్నా.. ఆచరణలోకి మాత్రం తీసుకురావడం లేదు. ఇదిలా ఉండగానే అమెరికా-భారత్ వాణిజ్య చర్చల్లో పురోగతి చోటు చేసుకోవడం.. సుంకాలపై అమెరికా వెనక్కి తగ్గవచ్చనే సంకేతాలను అందిస్తోంది. -
గ్లోబల్గా చైనా ఈవీలతో టాటా పోటీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చైనా కంపెనీలతో ధరలపరంగా పోటీపడటంపై దృష్టి పెడుతున్నట్లు టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ) శైలేష్ చంద్ర తెలిపారు. ఇప్పటికే కొన్ని అంశాల్లో దీటుగా పోటీనిస్తుండగా, వచ్చే ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో చైనా తయారీ సంస్థలకు సరిసమానమైన రేట్లకే వాహనాలను అందించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా తయారీ, స్వావలంబన సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారీ ఉత్పత్తి స్థాయితో పాటు ప్రభుత్వం నుంచి లభించే ప్రోత్సాహకాలు చైనా కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటున్నాయని, అందుకే అవి తక్కువ రేట్లకు ఉత్పత్తులను అందించగలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా స్థిరమైన పాలసీలపరంగా ప్రభుత్వ తోడ్పాటు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం 5 శాతానికి పెరిగిందని చెప్పారు. టాటా మోటర్స్ ఆగస్టులో 7,111 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. గతేడాది ఆగస్టులో నమోదైన 4,392 యూనిట్లతో పోలిస్తే ఇది 62 శాతం అధికం. -
పీహెచ్డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్తో రోజుకు రూ.లక్ష పైనే..!
ఒక్కోసారి పెద్దపెద్ద చదవులు చదివినా..ఉద్యోగం సంపాదించడంలో విఫలమవుతుంటారు. టన్నుల కొద్దీ డిగ్రీలు చేసినా అక్కరకు రాకుండా పోతుంటాయి. అలా అని నైరాశ్యంతో కూర్చోకుండా ఏదో ఒక మార్గం ఎంచుకుని ముందుకుపోయి గ్రేట్ అనిపించుకునే వారు ఒకరో, ఇద్దరో ఉంటారు. ఆ కోవకు చెందినవాడే ఈ చైనీస్ వ్యక్తి. ఈ వ్యక్తి చదివినదానికి చేస్తున్న పనికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఓ గొప్ప సందేశం అందించాడు. జియాంగ్సు ప్రావిన్స్ నుంచి పీహెచ్డీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన 37 ఏళ్ల డింగ్ స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆయన బెల్జియంలో భూ సంరక్షణ, పంట ఉత్పత్తిలపై పరిశోధన కూడా చేశారు. దాదాపు 30 పరిశోధనా పత్రాలు సమర్పించి మరి డాక్టోరల్ పట్టాని కూడాపొందారు. ఇంతటి ఉన్నత విద్యావంతుడైనా అవేమి ఆయనకు జీవనాధారం కాలేకపోయాయి. కనీసం అతడి పొట్టని పోషించేకునే సామర్థ్యాన్ని అందివ్వలేకపోయాయి. అయినా కించెత్తు నిరాశకు చోటివ్వకుండా తన భార్య వాంగ్తో కలిసి స్పైసీ చాంగ్కింగ్ తరహా బఠానీ నూడుల్స్ అమ్మూతూ..ఫుడ్ వ్యాపారంలో మంచి లాభాలను అందుకున్నాడు. అంతేగాదు అనతికాలంలోనే అతడి ఫుడ్స్టాల్ ఫేమస్ అయ్యి ఏకంగా రోజుకి రూ. లక్ష రూపాయల పైనే ఆర్జించే రేంజ్కు చేరకున్నాడు. గత మేనెలలో తన భార్య వాంగ్ స్వస్థలంలోని స్థానిక మార్కెట్లో ఈ ఫుడ్ స్టాల్ని ప్రారంభించారు. ఒక ప్లేట్ స్పైసీ బఠానీ నూడుల్స్ ధర రూ. 600 నుంచి రూ. 700 పై చిలుకు అమ్ముతున్నట్లు వెల్లడించాడు డింగ్. స్థానికుల అభిరుచులకు అనుగుణంగా కాస్త స్పైసీ తగ్గించి విక్రయించి.. కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. నెటిజన్లు సైతం ఆ జంట చాలా తెలివైన వారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. విదేశంలో చైనీస్ నూడుల్స్తనో ఆదాయం సృష్టించుకున్న తెలివైన వ్యవస్థాపక దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ) -
పేరెంటింగ్ విషయంలో బీకేర్ఫుల్..! ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా..
పిల్లలు ప్రవర్తనా తీరు వల్లే వాళ్ల తల్లిందండ్రులకు గుర్తింపు లేదా అవమానం అనేవి రావడం జరుగుతాయి. అందుకే పిల్లల పెంపకంలో ప్రతి తల్లిదండ్రులు చాలా కేర్ఫుల్గా ఉండాలని అంటుంటారు. వాళ్లు గనుక ఇతరులను ఇబ్బందిపెట్టేలా ఊహకందని ఘనకార్యం చేసి వస్తే..ఇక తల్లిదండ్రులకు చీవాట్లు, అవమానాలు తప్పవు. అంతవరకు అయితే పర్లేదు, వారి కారణంగా కోర్టులపాలై, కోట్ల కొద్ది జరిమానాలు ఎదుర్కొంటే ఆ తల్లిదండ్రులకు కనడమే నేరంగా మారుతుంది. అలాంటి దురదృష్టకర ఘటనే పాపం ఆ ఇద్దరు టీనేజర్ల తల్లిందండ్రులకు ఎదురైంది.అసలేం జరిగిందంటే..ఆ యువకులను చూస్తే..అబ్బా ఇలాంటి పుత్రులు పగవాడికి కూడా వద్దు అని అస్యహించుకునేంత దారుణానికి ఒడిగట్టారు ఆ ఇద్దరు. వాళ్లు చేసిన పని వింటే ఎవ్వరికైనా చిర్రెత్తికొచ్చి తిట్టిపోసేలా ఉంది. ఈ ఘటన చైనాలోని షాంఘైలో చోటు చేసుకుంది. అక్కడ ప్రసిద్ద హైడిలావ్ హాట్పాట్ రెస్టారెంట్లో టాంగ్ అనే ఇంటిపేరుతో ఉన్న ఇద్దరు 17 ఏళ్ల యువకులు మద్యం తాగి ఆ మత్తులో విచక్షణరహితంగా ప్రవర్తించారు. సమీపంలోని టైబుల్ ఎక్కి సంప్రాదాయ చైనీస్ హాట్పాట్ శైలిలో మాంసం, కూరగాయలు వండటానికి ఉపయోగించే కమ్యూనల్ సూప్లో మూత్రం పోశారు. ఆ ఇరువురు ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 24, 2025న ఒక ప్రైవేట్ డైనింగ్ రూమ్లో జరిగింది. అయితే ఆ కలుషితమైన రసాన్ని కస్టమర్లు సేవించినట్లు ఆధారాలు లేవు. అందుకుగానూ సదరు బ్రాంచ్ హైడిలావ్ రెస్టారెంట్ ఈ సంఘటన జరిగిన రోజు నుంచి మార్చి 8లోపు సందర్శించిన దాదాపు నాలుగువేల మంది కస్టమర్లకు పరిహారం చెల్లించింది. అంతేగాదు ఈ ఘటనకు పరిహారం కావాలంటూ సదరు రెస్టారెంట్ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన కారణంగా తమ రెస్టారెంట్ పరవు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది, పైగా కస్లమర్ల నమ్మకానికి భంగం కలిగేలా చోటు చేసుకుందని అందుకుగానూ తమకు సుమారు రూ. 28 కోట్లు దాక నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. ఈ కేసుని విచారించిన షాంఘై కోర్టు..ఇది అవమానకరమైన చర్యగా పేర్కొంటూ..టేబుల్వేర్ని కలుషితం చేయడమే గాక ప్రజలకు కూడా అసౌకర్యం కల్పించారంటూ మండిపడింది. ఈ టీనేజర్లు ఇద్దరు సదరు రెస్టారెంట్ ఆస్తిహక్కులు, ప్రతిష్టను ఉల్లంఘించారని పేర్కొంది. అంతేగాదు ఈ టీనేజర్ల తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ బాధ్యతల్లో విఫలమయ్యారంటూ చీవాట్లు పెట్టింది. అందుకుగానూ ఆ పేరెంట్స్ని సందరు రెస్టారెంట్కి రూ. 2 కోట్లుదాక నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరిచ్చింది. అలాగే ఆ టీనేజర్ల తల్లిదండ్రులు సదరు రెస్టారెంట్కి బహిరంగంగా క్షమాపణుల కోరుతూ.. వార్తపత్రికలో ప్రచురించాలని కూడా ఆదేశించింది. అందుకేనేమో మొక్కై వంగనిది.. మానై వంగునా అని పెద్దలు అంటుంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే సరిగా పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేదంటే వాళ్లు చేసే ఘనకార్యలకు ఫలితం అనుభవించక తప్పదు. పేరెంటింగ్ విషయంలో ప్రతి తలిందండ్రులు చాలా కేర్ఫుల్గా ఉండాలని ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది కదూ..!.(చదవండి: రండి.. ఫొటో దిగుదాం’) -
జర్మనీని వెనక్కి నెట్టిన చైనా: మొదటిసారి టాప్ 10లోకి..
చైనాలోని పలు కంపెనీలు.. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ దేశం మొదటిసారి ఐక్యరాజ్యసమితి మోస్ట్ ఇన్నోవేటివ్ కంట్రీస్ యాన్యువల్ ర్యాంకింగ్లో టాప్ 10లోకి ప్రవేశించింది. యూరప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని అధిగమించి ఈ రికార్డ్ కైవసం చేసుకుంది.2011 నుంచి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 78 సూచికల ఆధారంగా 139 ఆర్థిక వ్యవస్థలపై నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) సర్వేలో చైనా 10వ స్థానంలో నిలిచింది.జాబితాలోని టాప్ 10 దేశాలలో.. వరుసగా స్విట్జర్లాండ్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, కొరియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, చైనా ఉన్నాయి.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజర్మనీ ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని GII కో ఎడిటర్ 'సచా వున్ష్-విన్సెంట్ (Sacha Wunsch-Vincent) అన్నారు. కొత్త ర్యాంకింగ్.. అమెరికాలో ట్రంప్ పరిపాలన విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రతిబింబించలేదని అన్నారు. -
టిక్టాక్పై డీల్ కుదిరింది
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ సోషల్మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్ భవితవ్యంపై డీల్ కుదిరినట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా వెల్లడించారు. సోమవారం ఆయన తన సోషల్మీడియా ఖాతా లో దీనికి సంబంధించి సంస్థ పేరు చెప్పకుండా వివరాలు వెల్లడించారు. ‘అమెరికా, చైనా అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా సాగాయి. అమెరికా యువత అత్యధికంగా కోరుకుంటున్న ఒక కంపెనీ విషయంలో ఒప్పందం కుదిరింది. దీనిపై వచ్చే శుక్రవా రం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడుతా’అని ప్రకటించారు. ఆయన పేరు చెప్పకపోయినా ఆ కంపెనీ టిక్టాక్ అని భావిస్తున్నారు. చైనా కంపెనీ బైట్డ్యాన్స్ సృష్టించిన టిక్టాక్ యాప్ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
తుది పోరులో తడబాటు
హాంగ్జౌ (చైనా): వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీకి నేరుగా అర్హత సాధించాలని ఆశించిన భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆతిథ్య చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో సలీమా టెటె నాయకత్వంలోని టీమిండియా 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ మొదలైన తొలి నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్ను నవ్నీత్ కౌర్ గోల్గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చైనా పుంజుకోవడంతో భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. 21వ నిమిషంలో జిజియా ఒయు గోల్తో చైనా స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత హాంగ్ లీ (41వ నిమిషంలో), మెరోంగ్ జు (51వ నిమిషంలో), జియాకి జాంగ్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ చేసి చైనాకు విన్నర్స్ ట్రోఫీతోపాటు ప్రపంచ కప్ బెర్త్ను అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత్కు ఐదు పెనాల్టీ కార్నర్లు... చైనాకు ఆరు పెనాల్టీ కార్నర్లు రాగా... రెండు జట్లు ఒక్కో దానిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాయి. భారత క్రీడాకారిణి ఉదిత ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును గెల్చుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో జపాన్ 2–1తో దక్షిణ కొరియాను ఓడించింది. -
అడకత్తెరలో ఇండియా
ఇండియా–యూఎస్ బాంధవ్యం ఎంత ఘోరంగా దెబ్బ తిన్నది! అటు చూస్తే వాషింగ్టన్ – బీజింగ్ సంబంధాలు మెరు గవుతున్నాయి. ఈ నూతన పరిణామం... అమెరికాతో ఇండియా బాంధవ్యాన్ని ఇంకెంతగా ప్రభావితం చేయబోతోంది? రష్యా చమురు కొనుగోలు ఆపేయకుంటే, ఇండియాపై అగ్రరాజ్యం రెండవ, మూడవ విడత అదనపు సుంకాలు విధిస్తుందా? ‘‘ఇండియా దౌత్యానికి నిజంగా ఇదో పరీక్షా సమయం. కొంతకాలం ముందు నుంచీ పరిస్థితులు ఏమంత బాగోలేవు. ఇప్పుడు అవి మరింత దుర్బలంగా మారాయి’’... మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ అభిప్రాయం ఇది. అధ్యక్షుడు ట్రంప్ ‘‘స్వతహాగానే కక్ష సాధింపు మనిషి. ఇండియా పట్ల ఇప్పు డాయన అదే వైఖరితో వ్యవహరిస్తున్నారు’’. కాబట్టి ఇండియా– యూఎస్ సంబంధాలు ‘‘తప్పనిసరిగా మరింత క్షీణిస్తాయి’’.‘క్వాడ్’ను సైతం వదులుకుంటారా?వాషింగ్టన్తో ఢిల్లీ బాంధవ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసే పరిణా మాల విషయానికి వద్దాం. మొదటిది – చైనాతో తనకున్న ఎంతో మంచి బాంధవ్యాన్ని గురించి, షీ జిన్పింగ్తో తన స్నేహాన్ని గురించి ట్రంప్ అదేపనిగా మాట్లాడుతున్నారు. బీజింగ్తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన ఎంతో ఇదిగా ఉన్నారు. తాను చైనాలో పర్యటిస్తానని సైతం చెబుతున్నారు. ఆయన ఈ మొత్తం వ్యవహారంలో ఎంత దూరం వెళ్తారన్నదే ఇక్కడ ప్రశ్న.చైనాతో పెద్ద ఒప్పందం ఒకటి కుదుర్చుకోవడానికి ‘క్వాడ్’ను సైతం త్యాగం చేయబోతున్నారా? ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం, క్వాడ్ సదస్సు కోసం ఇండియాను సందర్శించే ఉద్దేశం ట్రంప్కు లేదు. దీనర్థం ఏమిటి? ఆయన ప్రభుత్వ విదేశాంగ విధానంలో ఇండో–పసిఫిక్ వ్యూహం ఇంకెంతో కాలం కీలకం కాదు. ఈ పరిణామం ఇండియా–యూఎస్ సంబంధాలకు శరాఘాతం లాంటిది. చైనా పట్ల అమెరికా విధానంలో ఒకప్పుడు కేంద్రస్థానంలో ఉన్న మనల్ని... ఇది అంచుల దాకా నెట్టివేస్తుంది. మన ప్రాధాన్యం పూర్తిగా మసకబారుతుంది. శరణ్ దీన్ని చాలా సున్నితంగా ఇలా చెప్పారు: ‘‘యూఎస్, చైనాలతో ఇండియా సంబంధాలు... వాటి పరస్పర సంబంధాల కంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఇండియాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది’’. అయితే ఇప్పుడీ పరిస్థితి లేదు. వాషింగ్టన్–బీజింగ్ నడుమ ప్రస్తుత సంబంధాలు, కచ్చితంగా వాషింగ్టన్ – ఢిల్లీ నడుమ కంటే బాగున్నాయని చెప్పాలి. ఇదంతా చూస్తుంటే – అమెరికా, చైనా నడుమ జి–2 తరహా ఏర్పాటుకు అవకాశం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. సమాధానం అవును అనుకుంటే, ఆసియా ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి ‘చట్ట బద్ధత’ కల్పించినట్లే! ఇండియాకు అది అంగీకారం కాదు.ఈ పరిస్థితుల్లో, ఇండియా, చైనా సంబంధాల్లో ఎంత పురోగతి సాధ్యమవుతుంది? మరోపక్క పాకిస్తాన్తో చైనా దృఢ సంబంధాలు సడలిపోయే అవకాశం లేదు. సరిహద్దు సమస్య అలా అపరిష్కృతంగానే మిగిలిపోతుంది. ఆసియాలో ప్రాబల్యం వహించాలని చైనా కోరుకుంటోంది. ఇండియా అందుకు ససేమిరా అంగీకరించదు. వాణిజ్యం విషయానికి వస్తే– అరుదైన ఖనిజాలు, ఎరువులు,సొరంగ తవ్వక యంత్రాల్లో చైనా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.అందుకే, తియాన్జిన్లో ఎన్ని చిరునవ్వులు చిందించినా, ఎంత గట్టి కరచాలనాలు చేసినా... ఇండియా–చైనా సంబంధాల్లో గణ నీయ పురోగతికి అవకాశాలు అతి తక్కువ.రష్యా కోసం మూల్యం చెల్లిస్తున్నామా?రష్యా చమురు విషయానికి వద్దాం. రష్యా మీద ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకే ఇండియా మీద 25 శాతం అదనపు సుంకం విధించామని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ చెప్పారు. ఆ ఎత్తుగడ పారలేదు. దీంతో ట్రంప్ నిస్పృహ చెందారు. ఇప్పుడు ఆయన ఇండియా మీద అదనపు సుంకాలు విధిస్తారా?రష్యా చమురు గురించి జవాబు చెప్పుకోవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. రష్యా చమురుతో ఇండియా ఆదా చేస్తున్నది బారె ల్కు సుమారు 2 డాలర్లు మాత్రమే! ఈ చమురు కొనుగోళ్ల కారణంగా మనం అమెరికాకు ఏటా 48 బిలియన్ డాలర్ల ఎగుమతు లను కోల్పోతాం. రష్యా నుంచి చేసుకునే చమురు దిగుమతులతో మనకు సమకూరే ప్రయోజనం, మనం అమెరికాకు చేసే ఎగుమతులతో పోల్చితే చాలా తక్కువ. ఆర్థికంగా చూసినట్లయితే – రష్యా చమురు కొనుగోళ్లు నిలిపి వేయడం ఉత్తమం. అయితే వ్యూహాత్మక, రాజకీయ కోణాలు అందుకు అనుమతిస్తాయా? ఇప్పటి విధానం ప్రకారం చూస్తే, రష్యా చమురును ఇండియా కొంటూనే ఉంటుంది. దీనివల్ల రష్యాకు డబ్బు లభిస్తుంది. ఆంక్షల క్లిష్ట సమయంలో ఆర్థిక ప్రయోజనం పొందుతుంది. మరి ఇండియా? అమెరికాకు ఎగుమతులు చెయ్యలేకపోవడమే కాకుండా వాషింగ్టన్తో సంబంధాలు పూర్తిగా చెడతాయి. అలా రెండు రకాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ తెర వెనుక నడచిన ఒక అంశాన్ని ఇప్పుడు తెర పైకి తీసుకువచ్చి దీనికి ఒక ముగింపు ఇస్తాను. అమెరికాతో మన సంబంధాలు గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత అథమ స్థాయికి దిగజారి పోయాయి. మనకు పాకిస్తాన్తో ఎన్నడూ బాంధవ్యం లేదు. చైనాతో సంబంధాలు మెరుగుపడుతున్నా, ఆ దేశంతో మనకు ఉన్న సమస్యలు చిన్నవేమీ కావు. రష్యాతో మన సంబంధాలు బలోపేతం అయ్యాయి. అయితే అందుకు మనం ఇప్ప టికే భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. మరోవంక చైనా, పాకిస్తాన్, రష్యాలతో అమెరికా సంబంధాలు బైడెన్ హయాంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయి. ఇది నిజంగా ఒక వైచిత్రి. తొమ్మిది నెలల్లోనే వీటి మధ్య సాన్నిహిత్యం మెరుగుపడింది. అదే సమయంలో అమెరికాతో మన సంబంధాలు కుప్ప కూలాయి. కాబట్టి ఇండియా దౌత్యానికి ఇది ‘బ్యాడ్ టైమ్’ అనుకోవాలా? దీనికి సమాధానం అవును అని తప్ప మరో విధంగా చెప్పలేను.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ట్రంప్ సుంకాల ప్రకటనకు స్పందనగా మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి
-
రష్యాతో దోస్తీపై చైనాకు ట్రంప్ హెచ్చరిక.. డ్రాగన్ కౌంటర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా విషయంలో దూకుడు పెంచుతూ నాటో దేశాలు, చైనాలను హెచ్చరించారు. చమురు కొనుగోలును వెంటనే నిలిపేయాలని.. లేదంటే చైనాపై 100 శాతం పన్నులు విధిస్తానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది.అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రి స్పందించారు. స్లోవేనియా పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ..‘యుద్ధం సమస్యలను పరిష్కరించలేదు. ఇదే సమయంలో పలు దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ప్రస్తుతం చైనా ఎలాంటి యుద్దం చేయడం లేదు.. యుద్ధంలో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. అయితే, చైనాపై ట్రంప్ టారిఫ్ల ప్రకటన చేసిన కొద్దిసేపటికే వాంగ్ యి ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం.అంతకుముందు ట్రంప్.. చైనాపై భారీ సంఖ్యలో సుంకాలు విధిస్తేనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100 శాతం కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పన్నులు విధిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. లేదంటే తన సమయంతోపాటు అమెరికా డబ్బునూ వృథా చేస్తున్నట్లేనని అన్నారు.China hits back at Trump's 100% tariff call.Chinese Foreign Minister Wang Yi said that war cannot solve problems and sanctions only complicate them— CivilBuzz (@NetiNeti24) September 14, 2025అంతటితో ఆగకుండా.. రష్యాపై బీజింగ్ పట్టు సాధించిందని.. సుంకాలు విధించడం ద్వారా దీన్ని బలహీనపరచవచ్చని అన్నారు. ఈ యుద్ధానికి బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలే కారణమని మరోసారి ఆరోపించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్లు విధించాలని ఈయూ, జీ7 దేశాలకు విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. -
2-3 నిమిషాల్లో విరిగిన ఎముకలు అతికితే!!
ఈ గమ్మును మీ విరిగిన ఎముకల మధ్య రాస్తే.. అవి రెండు నుంచి మూడు నిమిషాల్లో అతుక్కుంటాయి అంటూ ఓ వీడియో గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలో ఈ గ్లూ మీద జరిగిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని.. ఇది మార్కెట్లోకి రావడమే ఆలస్యమని.. ఇది గనుక అందుబాటులోకి వస్తే వైద్యరంగంలోనే విప్లవాత్మక మార్పునకు కారణమవుతుందని ఊదరగొడుతున్నారు. ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంత?.. ఓసారి పరిశీలిస్తే.. విరిగిన ఎముకలు అంత ఈజీగా అతుకుతాయా? గంటల తరబడి ఆపరేషన్లు చేస్తే.. నెలలు, సంవత్సరాల తరబడి అవి అతుక్కుంటున్నాయి. అలాంటిది కేవలం సెకన్ల వ్యవధిలో ఓ సూది ద్వారా అతుక్కనేలా చేయొచ్చా?. చైనా పరిశోధకులు కనిపెట్టిన బోన్ గ్లూకు అసలు శాస్త్రీయత ఉందా?.. ఆ ప్రచారంలో ఉన్నట్లు విరిగిన ఎముకలను గంటల పాటు శస్త్రచికిత్స చేసి, స్టీల్ ప్లేట్లు అమర్చే సంప్రదాయ వైద్యం ఇక చరిత్ర అవ్వబోతోందా?.. షెజాంగ్ స్థానిక మీడియా ప్రకారం.. తూర్పు చైనా(China)లోని షెజాంగ్ ప్రావిన్స్లో ‘బోన్ 02’ అనే బోన్ గ్లూ(bone glue)ను పరిశోధకులు ఆవిష్కరించారు. దీంతో విరిగిన ఎముకలను మూడు నిమిషాల్లోనే అతికించవచ్చని ఆ కథనం సారాంశం. సర్ రన్ రన్ షా ఆస్పత్రిలో అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లిన్ షాన్ఫింగ్ నేతృత్వంలోని బృందం దీనిని డెవలప్ చేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన జిగురు కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే ఎముకను బాగుచేస్తుందని అంటున్నారాయన. రక్త ప్రవాహం అధికంగా ఉండే వాతావరణంలోనూ దీని పనితీరు మెరుగ్గా ఉందని వెల్లడించారు. సంప్రదాయ వైద్యంలో ఎముకలు అతికించాలంటే శరీరానికి పెద్ద కోతలు వేసి, స్టీల్ ప్లేట్లను అమర్చుతారు. కానీ ఈ ఇంజెక్షన్తో అలాంటి అవసరం రాదని అంటున్నారాయన. పైగా బోన్ 02 శరరీంలో ఈజీగా కలిసిపోతుందని, కాబట్టి మరో సర్జరీ అనే అవసరం లేకుండా చేస్తుందని చెబుతున్నారాయన. ఆపరేషన్ల సక్సెస్ రేటు తక్కువగా ఉంటుండడమే.. తనకు దీనిని రూపొందించాలనే ఆలోచన కలగజేసిందని అంటున్నారాయన.ఇంతకీ ఈ గ్లూను అభివృద్ధికి ప్రేరణ ఏంటో తెలుసా?. నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలు. వాటి జీవశైలిని పరిశీలించిన లిన్ షాన్ఫింగ్ ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టారు.ట్రయల్స్.. సక్సెస్.. ‘బోన్ 02’(Bone-02)ని లాబోరేటరీలో కూడా పరీక్షించారు. అందులో తేలింది ఏంటంటే.. ఇది 400 పౌండ్ల బలాన్ని తట్టుకోగలదు (అంటే చాలా బలంగా అంటుకుంటుంది). 0.5 MPa కోత బలం (shear strength) అంటే పక్కదిశలో ఒత్తిడిని తట్టుకునే శక్తి ప్రదర్శించింది. అలాగే.. 10 MPa సంపీడన బలం (compressive strength) అంటే నేరుగా ఒత్తిడిని తట్టుకునే శక్తి చూపించింది. ఈ లక్షణాలన్నీ సంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేయగల సామర్థ్యం దీనికి ఉందని సూచిస్తున్నాయి. అలాగే.. దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్లు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అవసరం లేకుండా.. ఎముక గాయం నయం కాగానే శరీరంలో కలిసిపోవడం ఈ ‘బోన్ 02’లోని మరో విశిష్ట లక్షణం ఉండనే ఉంది. మొత్తం 150 మంది పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్లో ఇది విజయవంతంగా పని చేసింది. దీంతో.. సెప్టెంబర్ 10వ తేదీన దీనిని ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే.. చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ (NMPA) నుంచి పూర్తి మార్కెట్ అనుమతి పొందిందా? అనేదానిపై సష్టత కొరవడింది. వైద్య చరిత్రలో మైలురాయే!ఎముకలను అతికించేందుకు ఈ తరహా ప్రయోగాలు గతంలోనూ జరిగాయి. 1940 కాలంలో.. ఎముకలను అతికించే పదార్థాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మొదలైంది. 1950 నుంచి ముప్పై ఏళ్లపాటు నాన్స్టాప్గా ఈ తరహా పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం జంతు మూలాల నుంచి తీసిన ప్రోటీన్ పదార్థం, బలమైన అంటుకునే లక్షణాలున్న ఎపాక్సీ రెసిన్లు (Epoxy Resins) రసాయనాలు, వేగంగా గట్టిపడే ప్లాస్టిక్ తరహా అక్రిలేట్లు (Acrylates)సైనోఎక్రిలేట్లు (super glue తరహా) పదార్థాలు ఉపయోగించారు. అయితే.. ఇవి ఎముకలను అతికించే సామర్థ్యం ప్రదర్శించినా.. బాడీకి పనికి రాకుండా పోయాయి. వీటి వల్ల బయోకంపాటబిలిటీ సమస్యలు ఎదురయ్యేవి. అంటే.. ఇన్ఫెక్షన్, అలర్జీలు వచ్చేవి. పైగా శరీర కణజాలాన్ని దెబ్బ తీశాయి. వాటిని తొలగించేందుకు రెండో సర్జరీ అవసరం అయ్యేవి. ఈ కారణాల వల్ల, వాటిని వైద్యంగా విరమించాల్సి వచ్చింది. సైనోఎక్రిలేట్లు (super glue తరహా) వంటి పదార్థాలతో ప్రయోగాలు జరిగాయి.1990–2010 మధ్యకాలంలో.. బయోకంపాటబుల్ పాలిమర్లు, కోలాజెన్, కెరటిన్, కైటోసన్ వంటి పదార్థాలపై దృష్టి పెట్టారు. ఇవి శరీరంలో కరిగిపోవడం, తక్కువ రిస్క్ ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉన్నా, అంత బలంగా అంటుకునే సామర్థ్యం ప్రదర్శించలేకపోయాయి. 2010 తర్వాత.. బయోమిమిటిక్ దిశగా ప్రయోగాలు జరిగాయి. అంటే.. ఆల్చిప్పలు, గవ్వలు, గోరింటాకు వంటి జీవుల నుంచి స్ఫూర్తి పొందిన బయోమిమిటిక్ గ్లూలు అభివృద్ధి చేయడం మొదలైంది. ఇవి నీటి లోపల కూడా బలంగా అంటుకునే లక్షణాలను కలిగి ఉండటంతో, శరీరంలోని రక్త ప్రవాహంలో కూడా పనిచేయడం లాంటి ఫలితాలను ఇచ్చాయి. అలా కొన్ని గ్లూలు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నా.. అక్కడ సరైన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. ఇలాంటి టైంలో.. చైనా బోన్ 02 గ్లూలు వాస్తవిక ప్రయోగ దశకు చేరుకోవడం గమనార్హం. సాధారణంగా, ఇలాంటి వైద్య పరికరాలను Class III medical deviceగా పరిగణిస్తారు. కాబట్టి వీటికి క్లినికల్ ట్రయల్స్, టెక్నికల్ సమీక్ష, రెగ్యులేటరీ అనుమతులు అవసరం. ఆ తర్వాతే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి వస్తాయి. అంటే ఇది మార్కెట్లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. సో.. వైరల్ అవుతున్న ఆ వీడియో.. ఆ కథనం రెండూ నిజమే. ‘బోన్ 02’ అనే గ్లూ ఎముకలు అతికించడంలో వేగంగా, బలంగా, సురక్షితంగా పనిచేస్తోందని రుజువైంది. ఇది సంప్రదాయ చికిత్సకు మంచి ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
8.5 కోట్ల ఏళ్లనాటి డైనోసార్ గుడ్లు
బీజింగ్: భూగోళంపై ఒకప్పుడు భారీ డైనోసార్లు(రాక్షస బల్లులు) ఉండేవన్న సంగతి తెలిసిందే. వాటిపై ఇప్పటికీ అధ్యయనం జరుగుతూనే ఉంది. భూమిని గ్రహ శకలాలు ఢీకొట్టడం లేదా వాతావరణ మార్పుల వల్ల లక్షల సంవత్సరాల క్రితం ఇవి అంతరించిపోయాయని సైంటిస్టులు చెబుతుంటారు. కానీ, చైనాలో 85 మిలియన్ల (8.5 కోట్లు) ఏళ్ల క్రితం నాటి రాక్షస బల్లుల గుడ్లను పరిశోధకులు వెలికితీశారు. అంటే డైనోసార్ల చరిత్ర మనం ఊహించిదానికంటే పురాతనమైనదని స్పష్టమవుతోంది. సెంట్రల్ చైనాలోని యూన్యాంగ్ బేసిన్లో ఉన్న ఖింగ్లాంగ్షాన్లో తవ్వకాల్లో రాక్షస బల్లుల గుడ్లు లభించాయి. ఇవి ఏ కాలానికి సంబంధించినవో తెలుసుకోవడానికి ఆధునిక కార్పొనేట్ యురేనియం–లెడ్(యూ–పీబీ) డేటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ గుడ్లు 8.5 కోట్ల ఏళ్ల నుంచే ఇక్కడ ఉన్నట్లు తేల్చారు. ఆ కాలాన్ని క్రెటాసియస్ పీరియడ్ అంటారు. ఆ సమయంలోనే భూమిపై భారీగా వాతావరణ మార్పులు సంభవించాయి. అత్యంత వేడిగా ఉన్న వాతావరణం చల్లబడడం మొదలైంది. ఈ పరిణామమే డైనోసార్లు క్రమంగా అంతరించిపోవడానికి దోహదపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. డైనోసార్ ఎగ్స్ విషయంలో కార్పొనేట్ యురేనియం–లెడ్ డేటింగ్ పరీక్ష చేయడం ఇదే మొదటిసారి. ఈ వివరాలను ఎర్త్ సైన్స్ పత్రికలో ప్రచురించారు. -
వాటే పబ్లిక్ టాయిలెట్.. టూరిస్ట్ స్పాటా..?!
టూరిస్ట్ స్పాట్ అనగానే ఏ అద్భుతమైన ప్రకృతి దృశ్యమో లేక మిస్టరీ ప్రదేశాలో అనుకుంటాం. కానీ ఇలాంటి టూరిస్ట్ స్పాట్ ఒకటి ఉందని అస్సలు ఊహించరు. ఆ ప్రదేశం పేరు వినగానే ఇదేం పర్యాటక ప్రదేశం రా బాబు అని తలపట్టుకుంటారు. కానీ చూస్తే మాత్రం..దీన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న వారి అద్భుత ఆలోచనను ప్రశంసించకుండా ఉండలేరు. ఇంతకీ అదేంటో చక చక చదివేయండి మరి..చైనాలోని గన్సు ప్రావిన్స్లోని డన్హువాంగ్ నైట్ మార్కెట్లో కొత్తగా పునరుద్ధరించిన పబ్లిక్ టాయిలెట్ ఊహించని విధంగా సాంస్కృతిక ఆకర్షణగా మారింది. ఓ సాధారణ రెస్ట్రూమ్కి ఇంత క్రేజ్ ఏంటా అనే కదా..!. అయితే ఇది అలాంటి ఇలాంటి రెస్ట్రూమ్ కాదు. "డన్హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్"గా పిలిచే ఈ టాయిలెట్ యునెస్కోలో చోటు దక్కించుకున్న ప్రసిద్ధ మొగావో గుహలకు నిలయంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది ఈ రెస్ట్రూమ్. చెప్పాలంటే వారసత్వ కళకు ప్రతిబింబంలా ఉంటుంది ఈ పబ్లిక్ టాయిలెట్ రూపురేఖలు. రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ డన్హువాంగ్ పబ్లిక్ టాయిలెట్ సంస్కృతికి అర్థం పట్టేలా కుడ్య చిత్రాలు, ఏదో రాజదర్బారులో ఉన్న అనుభూతిని ఇస్తాయి. బయటి భాగంలో అల్ట్రా క్లియర్ గాజు కర్టెన్ గోడలు ఉన్నాయి. అంతేకాదండోయ్ ఈ రెస్ట్రూమ్లో యాంటీ బ్యాక్టీరియల్ నర్సింగ్ టేబుల్స్, చైల్డ్ సేఫ్టీ సీట్లు, స్వీయ క్లీనింగ్ సిస్టమ్తో కూడిన పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ గది కూడా ఉంది. అలాగే ఇక్కడ సౌకర్యవంతమైన సీటింగ్ ప్రదేశం తోపాటు డ్రింక్ డిస్పెన్సర్లు, వృద్ధులు, వికలాంగులకు అనువైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆగస్టు 16న ప్రారంభించిన ఈ పబ్లిక్ టాయిలెట్ అతి కొద్ది సమయంలోనే పర్యాటకులకు ఇష్టపమైన స్పాట్గా మారిపోయింది. దీన్ని సందర్శించడానికి పర్యాటకులు సాంప్రదాయ హన్పు దుస్తులను కూడా ధరిస్తారట. అందుకు సంబంధించిన వీడీయో నెట్టింట సంచలనం సృష్టించడమే గాదు, రకరకాల చర్చలకు దారితీసింది కూడా. View this post on Instagram A post shared by China Exploring (@china__exploring) (చదవండి: ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..! యాభై దాటాకా లైఫ్ స్టార్ట్ అంటున్న 'ఖ్యాల్') -
చైనా సంచలనం.. అమెరికా చిప్ లేకుండా ‘బ్రెయిన్’ ఏఐ నమూనా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. స్పైకింగ్బ్రెయిన్ 1.0 (SpikingBrain 1.0) అనే “మెదడు ప్రేరిత” లాంగ్వేజ్ మోడల్ను విడుదల చేసింది. ఇది ఎన్విడియా చిప్లు లేకుండానే సంప్రదాయ ఏఐ మోడళ్ల కంటే 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.ఈ మోడల్ను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ అభివృద్ధి చేసింది. ఇది న్యూరోమార్ఫిక్ డిజైన్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే మన మెదడు లాగా, అవసరమైన న్యూరాన్లు మాత్రమే స్పందిస్తాయి. ఈ “స్పైకింగ్ కంప్యూటేషన్” పద్ధతి వల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అలాగే ట్రైనింగ్ డేటా అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది.స్పైకింగ్బ్రెయిన్.. చాట్జీపీటీ (ChatGPT) లాంటి మోడళ్లకు అవసరమైన ట్రైనింగ్ డేటాలో కేవలం 2 శాతం మాత్రమే ఉపయోగించి, వాటితో సమానమైన పనితీరును అందిస్తుందని ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకుడు లి గువోకి తెలిపారు. ఈ మోడల్ చైనాలోనే అభివృద్ధి చేసిన మెటాఎక్స్ చిప్లపై పనిచేస్తుంది. అమెరికా జీపీయూ ఎగుమతి నియంత్రణలకు లోనవకుండా, స్వతంత్ర ఏఐ మౌలిక సదుపాయాల వైపు చైనా అడుగులు వేస్తోంది.స్పైకింగ్బ్రెయిన్.. దాని డెమో సైట్ లో తనను తాను ఇలా పరిచయం చేసుకుంటుంది. "హలో! నేను స్పైకింగ్ బ్రెయిన్ 1.0, లేదా 'షుంక్సీ', మెదడు-ప్రేరేపిత ఏఐ మోడల్ని. మానవ మెదడు సమాచారాన్ని స్పైకింగ్ కంప్యూటేషన్ పద్ధతితో ప్రాసెస్ చేసే విధానాన్ని నేను మిళితం చేస్తాను. పూర్తిగా చైనీస్ టెక్నాలజీపై నిర్మించిన శక్తివంతమైన, నమ్మదగిన, శక్తి-సమర్థవంతమైన ఏఐ సేవలను అందించగలను" అంటోంది. -
దేశంలోకి రెండేళ్లలో రూ.800 కోట్ల దొంగ బంగారం
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ద్వారా గడిచిన రెండేళ్ల కాలంలో కనీసం టన్ను బరువైన రూ.800 కోట్ల బంగారంలో దేశంలోకి దొంగచాటుగా వచ్చింది. 2023, 2024 సంవత్సరాల్లో టిబెటన్లు, చైనీయులే ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు. గతేడాది జూలైలో లద్దాఖ్లో ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) దళం 108 కిలోల విదేశీ బంగారం కడ్డీలను పట్టుకున్న నేపథ్యంలో ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు మంగళవారం ఈడీ వర్గాలు తెలిపాయి.చైనాతో మనకున్న 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్ఏసీ రక్షణ బాధ్యతలను ఐటీబీపీయే చూసుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఐదు ప్రాంతాలు, లద్దాఖ్లో ఒక చోట మంగళవారం తనిఖీలు చేపట్టామని ఈడీ వివరించింది. దొంగతనంగా తీసుకువచ్చిన బంగారానికి సంబంధించిన చెల్లింపులన్నీ క్రిప్టోకరెన్సీ ద్వారానే పూర్తయినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తెలిపింది. పట్టుబడిన 108 కిలోల విదేశీ బంగారాన్ని చైనాకు చెందిన భు చుమ్చుమ్ అనే వ్యక్తి భారత్లోని టెండు తాషికి ఎల్ఏసీ ద్వారా పంపాడని డీఆర్ఐ వివరించింది. ఇందుకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకున్నామంది. -
Sagubadi: ఒక్కసారి నాట్లు...ఆరుసార్లు కోతలు!
ఒక్కసారి నాట్లేసి మూడేళ్లలో వరుసగా ఆరు సార్లు పంట కోసుకునే రోజులు రానున్నాయి. ఇలాంటి వరిని ‘పెరెన్నియల్ రైస్’(పీఆర్) అంటున్నారు. ఈ విలక్షణ వరి వంగడాలను రూపొందించుకున్న చైనా ఏడేళ్లుగా సాగు చేస్తోంది. ఉత్పత్తి ఖర్చులు 40% మేరకు తగ్గుతాయి. నికరలాభం పెరుగుతుంది. పనిలో పనిగా భూసారం, జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది. చైనా తదితర దేశాల్లో ఏటేటా పీఆర్ వరి సాగు విస్తరిస్తోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) కూడా దీనిపై తాజాగా దృష్టి సారించింది. ‘ఫార్మింగ్ సిస్టం’ జర్నల్ తాజా సంచికలో భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) శాస్త్రవేత్త డాక్టర్ విజయకుమార్ షణ్ముగం రాసిన అధ్యయన పత్రం ఆధారంగా ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనంఖర్చులు పెరిగిపోవటం, ఆదాయం తగ్గిపోవటం, నీటి అవసరాలు పెరగటం, భూసారం క్షీణించటం, హరితగృహ వాయువులతో పర్యావరణానికి తీరని హాని జరగటం.. ఇవీ ప్రస్తుతం మన దేశంలో వరి వ్యవసాయాన్ని వేధిస్తున్న సవాళ్లు. దాదాపు ఈ సమస్యలన్నిటికీ ఏకకాలంలో చెక్ పెట్టే అద్భుతమైన ‘పెరెన్నియల్ రైస్’ వంగడాలను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ వరి వంగడాలను చైనాలో రైతులు ఏడేళ్లుగా సాగు చేస్తున్నారు. సాధారణంగా వరి పంటను ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట చేతికి వస్తుంది. తర్వాత సీజన్లో మళ్లీ దున్ని, దమ్ము చేసి, నాట్లు వేసుకుంటున్నాం. ఈ వంగడం ఒక్కసారి నాటితే చాలు. మొత్తంగా చూస్తే పీఆర్ వరుసగా 6 సీజన్లలో తిరిగి పెరిగే వరి పంటను కోసుకోవచ్చు. పటిష్టంగా ఉండే కుదుళ్లు పంట కోసిన తర్వాత మళ్లీ చిగురించి, పిలకలన్నీ మొదటి పంటలాగే ఏపుగా పెరగటం పీఆర్23 వంగడం ప్రత్యేకత. ఒక్కసారి నాట్లు వేస్తే చాలు.. ఇక తర్వాత ప్రతి పంట కాలంలోనూ మళ్లీ మళ్లీ పొలాన్ని దున్ని, నాట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ఈ వరి మొక్కల వేర్లు సాధారణ రకాల (అడుగు) మొక్కల వేర్ల కన్నా బలంగా ఉండి రెట్టింపు (2 అడుగుల) లోతుకు చొచ్చుకెళ్తాయి. యున్నన్ యూనివర్సిటీ ఆవిష్కరణచైనాలోని యున్నన్ రాష్ట్రంలోని ‘యున్నన్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (వైఏఏఎస్)’ పెరెన్నియల్ రైస్ వంగడాలను రూపొందించింది. ఒరిజా సటివ అనే సాధారణ వరి రకాన్ని ఒరిజా సాంగిస్తామినట అనే ఆఫ్రికా అటవీ జాతి వరి మొక్కతో ఎంబ్రయో రెస్క్యూ టెక్నిక్ను ఉపయోగించి సంకరం చేసి ‘పెరెన్నియల్ రైస్– పీఆర్23’ వంగడాన్ని రూపొదించింది. అధిక దిగుబడి, గింజ నాణ్యత గల పీఆర్24, పీఆర్25, పీఆర్101, పీఆర్107 వంగడాలను 2020లో విడుదల చేసింది.17 దేశాల్లో ప్రయోగాత్మక సాగు 2018 నుంచి దక్షిణ చైనాలో 44,752 మంది చిన్న రైతులు 15,333 హెక్టార్లలో పీఆర్ వంగడాలను నీటిపారుదల సదుపాయంతో సాగు చేస్తున్నారు. వీరంతా ఆర్థికంగా, పర్యావరణ పరంగా ప్రయోజనాలు పొందుతున్నారని యున్నన్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇంటర్నేషనల్ పెరెన్నియల్ రైస్ కొలాబరేషన్ తోడ్పాటుతో యున్నన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 17 దేశాల్లో విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో సాగవుతున్న పీఆర్ వంగడాలు స్థిరంగా మెరుగైన దిగుబడిని ఇస్తు న్నట్లు యున్నన్ యూనివర్సిటీ తెలిపింది. వరి గడ్డితో ఆచ్ఛాదనకోతల తర్వాత గడ్డిని సాళ్ల మధ్య ఆచ్ఛాదనగా వేస్తున్నారు. దీంతో పోషకాలు పునర్వినియోగమవుతూ భూసారం మెరుగవుతోంది. నేలలో సూక్ష్మజీవరాశి జీవవైవిధ్యం పెరుగుతోంది. కలుపు సమస్య తగ్గుతోంది. రసా యనిక పురుగుమందులు, కలుపుమందుల అవ సరం తగ్గుతున్నది. అవసరం మేరకు ఏడాదంతా కొద్ది కొద్దిగా నీరు ఇచ్చినప్పటికీ, మొత్తంగా సాగు నీటి వాడకం తగ్గుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 29% తగ్గిన ఉత్పత్తి వ్యయంప్రతి ఏటా నాట్లు వేసే పద్ధతిలో కన్నా ఒక్కసారి నాట్లు వేసి మూడేళ్లలో మొత్తం ఆరు పంటలు కోసుకునే ఈ పద్ధతిలో అన్ని ఖర్చులూ కలిపి ఉత్పత్తి వ్యయం 29% తగ్గిందని నాలుగేళ్ల అధ్యయనంలో తేలింది. మొదటి సీజన్లో అన్ని ఖర్చులూ మామూలే. రెండో సీజన్ నుంచి 54% వరకు కూలి ఖర్చులు ఆదా అవుతాయి. మొత్తం మూడేళ్లలో ఆరు పంట సీజన్లకు గాను.. 5 పంట సీజన్లలో సీజన్కు 68–77 పనిదినాల అవసరం తగ్గుతుంది. వాతావరణాన్ని కలుషితం చేసే యంత్రాల వాడకమూ తగ్గుతుంది. పీఆర్23 ధాన్యం మిల్లింగ్ సామర్థ్యం 73% నమోదైంది. ప్రతి ఏటా నాట్లు వేసే పద్ధతి కన్నా పీఆర్ పద్ధతిలో దిగుబడి 8.8% తక్కువైనప్పటికీ, రైతుకు నికరాదాయం 235% పెరిగిందని అధ్యయన పత్రం తెలిపింది. మన సగటు దిగుబడి కన్నా ఎక్కువేఒకసారి పంట కోసిన తర్వాత తిరిగి పెరగటంలో పీఆర్23 వంగడం పనితీరు మెరుగ్గా ఉందని గుర్తించారు. దీని పిలకలు 90–98% తిరిగి పెరిగాయి. అందువల్ల వాణిజ్యపరమైన సాగుకు ఈ వంగడాన్ని ఉపయోగిస్తున్నారు. 119 రోజుల్లో పీఆర్23 పంట కోతకు వస్తోంది. తొలి కోతలో హెక్టారుకు 6.8–7.5 టన్నుల ధాన్యం దిగుబడిని ఇస్తుండగా, తర్వాత కోతల్లో 5.4–6.3 టన్నుల వరకు దిగుబడి వస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత్లో సగటు వరి ధాన్యం దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులు మాత్రమే. కాబట్టి మన రైతులకు ఇది ఉపయోగకరమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముందున్న సవాళ్లుపీఆర్ వరి సాగులో ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. మన దేశపు వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పీఆర్ వరి వంగడాలను రూపొందించుకోవాలి. పంట కోసిన తర్వాత తిరిగి పంట చిగురించటం కోసం నీరు పెడతాం. మొలకలు రాకముందే మోళ్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. మొలకల కన్నా కలుపు వేగంగా పెరిగే అవకాశం ఉంది. గడ్డిని ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వేయటం వల్ల కలుపు కొంత అదుపులో ఉన్నప్పటికీ, కలుపు మందులు వాడక తప్పదు. మోళ్లలో మిగిలిన రోగకారకాలు చీడపీడల బెడదను పెంచవచ్చు. వేసవి అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో పంటను రక్షించుకోవటం అంత తేలిక కాదు. సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం నిధులను విరివిగా వెచ్చించి పరిశోధనలను వేగంగా కొనసాగించాలి. అన్నీ సజావుగా జరిగితే కొద్ది సంవత్సరాల్లో భారతీయ పెరెన్నియల్ రైస్ వంగడాలు మన రైతులకు అందుబాటులోకి రావచ్చు. -
'అద్భుత భవంతులు': వాస్తుకళా నైపుణ్యానికి సాంకేతిక జత చేసి..
ప్రపంచంలోని కొన్నిచోట్ల ఇటీవలి కాలంలో చిత్ర విచిత్రమైన వింత భవంతులు పుట్టుకొస్తున్నాయి. వాస్తుకళా నైపుణ్యానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జతచేసి నిర్మించిన ఈ అద్భుత భవంతులు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. వీటిలో కొన్నింటి విశేషాలను తెలుసుకుందాం.ది డ్యాన్సింగ్ హౌస్ఇది చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో ఉంది. ఈ భవనం 1996లో పూర్తయింది. దీని ఆకృతి డ్యాన్స్ చేస్తున్న జంటను పోలి ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే దీన్ని మొదట్లో ‘జింజర్ అండ్ ఫ్రెడ్‘ అని పిలిచేవారు. ఆ పేరు ప్రముఖ డ్యాన్సర్లు జింజర్ రోజర్స్, ఫ్రెడ్ ఆస్టైర్ల పేర్ల నుంచి వచ్చింది. ఇది ఒక కార్యాలయ భవనం. అయితే, దీని పై అంతస్తులో ఒక రెస్టరెంట్ ఉంటుంది. ఆ రెస్టరెంట్లో కూర్చుని భోంచేస్తూ, ప్రేగ్ నగర అందాలను తిలకించడం మరపురాని అనుభూతిగా ఉంటుంది.ది వేవ్ బిల్డింగ్ఇది డెన్మార్క్లోని వెజ్లే నగరంలో ఉంది. దీనిని హెన్నింగ్ లార్సెన్ ఆర్కిటెక్ట్స్ సంస్థ డిజైన్ చేసింది. పేరుకు తగ్గట్టుగానే, ఇది వెజ్లే నౌకాశ్రయం పక్కన, సముద్ర కెరటాల ఆకారంలో ఉంటుంది. దీని నిర్మాణం 2009లో మొదలైంది. ఇది రెండు దశల్లో పూర్తయింది. మొదట ఒక వైపు నిర్మాణం పూర్తయిన తర్వాత, 2018లో రెండవ వైపు నిర్మాణం కూడా పూర్తయింది. వేవ్ బిల్డింగ్లో మొత్తం 140 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ భవనం తన డిజైన్, లైటింగ్తో ఆ ప్రాంతానికి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చింది. రాత్రిపూట ఈ భవనం విద్యుత్ కాంతులతో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ భవనం డిజైనింగ్ నైపుణ్యానికి అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.ఎలిఫెంట్ బిల్డింగ్ఇది థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఉంది. దీని నిర్మాణం 1997లో పూర్తయింది. థాయ్ ఆర్కిటెక్ట్ ఒంగ్–అర్డ్ సత్రాబంధు, ఇంజినీర్ డాక్టర్ అరుణ్ చైసెరితో కలిసి దీనిని రూపొందించారు. ఈ భవనం మూడు టవర్లను కలిగి ఉంటుంది, ఇవి ఏనుగు కాళ్లు, తొండంలా కనిపిస్తాయి. దీనికి ఏనుగు చెవులు, కళ్లు, దంతాలలాంటి డిజైన్ కూడా ఉంది. ఇది కేవలం ఒక ఆకర్షణీయమైన కట్టడం మాత్రమే కాదు, ఇందులో నివాసయోగ్యమైన అపార్ట్మెంట్లు, కార్యాలయాలు, షాపింగ్ సెంటర్లు, బ్యాంక్, పోస్టాఫీసు వంటివి చాలానే ఉన్నాయి. ఏనుగు థాయ్లాండ్ జాతీయ జంతువు కావడంతో ఈ భవనం థాయ్ జాతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత విచిత్ర, విలక్షణ భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.క్రాస్ టవర్స్ఇది దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఉంది. ఈ భవనాన్ని డానిష్ ఆర్కిటెక్ట్ సంస్థ బ్యార్కే ఇంగెల్స్ గ్రూప్ 2012లో డిజైన్ చేసింది. రెండు వేర్వేరు టవర్లు ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా, వాటి మధ్యలోని కొన్ని గదులు ఒకదానితో ఒకటి కలిసేలా డిజైన్ చేశారు. ఇది బయట నుంచి చూడటానికి హ్యాష్ట్యాగ్లా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘హ్యాష్ట్యాగ్ టవర్స్’ అని కూడా అంటారు. గాలి, సూర్యరశ్మి భవనంలోకి ధారాళంగా వెళ్లేలా దీన్ని నిర్మించారు. దాంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఇందులో పలు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, నివాసయోగ్యమైన అపార్ట్మెంట్లు ఉన్నాయి.జిగ్జాగ్ టవర్స్ఇది ఖతార్ రాజధాని దోహాలో ఉంది. ఈ టవర్స్ను 2009లో నిర్మించారు. ఈ టవర్స్ రూపకల్పన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భవనం నిర్మాణం బయట నుంచి చూస్తే జిగ్జాగ్ ఆకారంలో ఉంటుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. మాల్స్, రెస్టారెంట్లు, కేఫ్లు, వివిధ రకాల దుకాణాలు ఇందులో ఉంటాయి. ఈ రెండు టవర్స్లో మొత్తం 748 లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి.లాంగాబెర్గర్ బిల్డింగ్ ఇది అమెరికాలోని ఒహాయోలో ఉంది. ఈ భవనం లాంగాబెర్గర్ కంపెనీ ప్రధాన కార్యాలయం. ఈ కంపెనీ చేతితో తయారు చేసే చెక్క బుట్టలకు ప్రసిద్ధి చెందింది. తమ ప్రత్యేకతకు గుర్తుగా వారు తమ ప్రధాన కార్యాలయాన్ని ఒక పెద్ద బుట్ట ఆకారంలో 1997లో నిర్మించారు. ఇది నిజంగానే చూడటానికి బుట్టలా కనిపిస్తుంది. ఈ భవనం సుమారు 192 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 79 అడుగుల ఎత్తుతో ఉంటుంది. లాంగాబెర్గర్ కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత, ఈ భవనాన్ని 2018లో అమ్మకానికి పెట్టింది. ప్రస్తుతం ఇది ఖాళీగా ఉంది, కాని, దాని ప్రత్యేకమైన డిజైన్ కారణంగా ఇది ఇప్పటికీ ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. సంహిత నిమ్మన -
చైనా కండబల ప్రదర్శన
రెండో ప్రపంచ యుద్ధంలోనూ, జపాన్ దురాక్రమణను ప్రతిఘటించటంలోనూ విజయం సాధించి ఎనిమిది దశాబ్దాలవుతున్న సందర్భంగా బుధవారం తియనాన్మెన్ స్క్వేర్లో నిర్వహించిన సైనిక పరేడ్లో చైనా తన రక్షణ పాటవాన్ని ప్రదర్శించటం కన్నా బలప్రదర్శనకు ప్రాధాన్యమిచ్చింది. వ్యూహాత్మక అణ్వస్త్రాలు తన దగ్గరున్నాయని, ఇక రాబోయేదంతా తన యుగమేనని చాటదల్చుకున్నట్టుంది. 1949లో ప్రజా రిపబ్లిక్గా ఏర్పడింది మొదలు ఆ దేశం పదేళ్లపాటు ఏటా ఇలాంటి ఆర్భాటాన్ని ప్రదర్శించేది.ఎందుకో ఆ తర్వాత ఆపి, తిరిగి 1984లో పునరుద్ధరించింది. ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆ పరేడ్ను విక్టరీ డే ఉత్సవంగా మార్చారు. ఈ తరహా పరేడ్లకు విదేశీ అతిథుల్ని పిలవటం అందరూ పాటించే ఆనవాయితీ. అయితే చైనా ఒక్కసారి 1959లో మాత్రమే దాన్ని పాటించింది. మళ్లీ అరవై ఆరేళ్ల తర్వాత ఇన్నాళ్లకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. వారిద్దరే కాదు... చైనా సన్నిహితులుగా ముద్రపడిన ఇరాన్, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి కూడా అధినేతలు హాజరయ్యారు.ఈ పరేడ్ల సంప్రదాయం ఎవరు మొదలెట్టారోగానీ ఇందులో ప్రదర్శించేవన్నీ మారణాయుధాలు. ఈసారి పరేడ్లో చైనా వంద రకాల మారణాయుధాలను ప్రదర్శించింది. యుద్ధతంత్రాన్ని సమూలంగా మార్చగల ఆయుధాలే అందులో ఎక్కువ. సంప్ర దాయ యుద్ధంలోనూ, కొత్త తరహా యుద్ధంలోనూ తమ దరిదాపుల్లోకి రాగలవారెవరూ లేరని చైనా చెప్పదల్చుకున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. పొరుగునున్న తైవాన్ దురాక్రమణకు ఇదొక రిహార్సల్ కావొచ్చన్న అనుమానాలు అందరిలో ఉన్నాయి. తైవాన్ జోలికెళ్తే అమెరికా దాడికొస్తుందన్న సంశయం చైనాకుండేది. కానీ ఉక్రెయిన్పై కత్తిగట్టిన పుతిన్ ముందు అమెరికా, పాశ్చాత్య దేశాలు నిస్సహాయులుగా మిగిలిన వైనం చూశాక తానూ తైవాన్లో ఆ మాదిరి ప్రయత్నం చేయొచ్చని చైనా భావిస్తూండవచ్చు. ఈ పరేడ్ ద్వారా చైనా దాన్నే చెప్పదల్చుకుందా?పరేడ్లు చూసి తమ దేశం శక్తిమంతంగా తయారైందని, శత్రువులు వణుకు తున్నారని సంబరాలు చేసుకునేవారు అన్ని దేశాల్లోనూ కనబడతారు. కానీ క్షణాల్లో భూమండలాన్ని భస్మీపటలం చేయగల శక్తి తమకున్నదని చాటుకోవటంలో ఉండే ఆనందమేమిటో సామాన్యులకు అర్థం కాదు. అణ్వస్త్రాన్ని మొదటగా ఉపయోగించబోమని చైనా మొదటినుంచీ చెబుతోంది. కానీ అది ప్రదర్శించిన అణు జలాంతర్గామి తీరు చూస్తుంటే ఆత్మరక్షణ కాదు... ఎదురుదాడికి చైనా సంసిద్ధమైందన్న అభిప్రాయం కలుగుతుంది. చడీచప్పుడూ లేకుండా, అమెరికా గూఢచర్యానికి దొరకకుండా ఏ ఖండంలోని సాగర జలాల్లోనైనా దాన్ని మోహరించ వచ్చంటున్నారు. నీటి అట్టడుగున ఎంత దూరమైనా దూసుకెళ్లగల డ్రోన్లు, 2000 కిలోమీటర్ల శ్రేణిలోని విమాన వాహక నౌకలను ధ్వంసం చేయగల వైజె–21 హైపర్సోనిక్ క్షిపణి వగైరాలను పరేడ్లో ప్రదర్శించింది. శబ్దవేగం కన్నా పదిరెట్ల వేగం దీని సొంతం.ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు ముప్పు ముంచుకురాగలదన్న అనుమానంతో అమెరికా అతి జాగ్రత్తలు తీసుకునేది. ఇకపై దానికి జపాన్ రక్షణ బాధ్యత అదనం. ఇప్పటికే జపాన్ తీరం పొడవునా టైఫూన్, తోమహాక్, ఎస్ఎం–6 క్షిపణుల్ని మోహరించింది. ప్రపంచం గుర్తుపట్టలేనంతగా మారిపోతోంది. జరుగుతున్న పరిణామా లన్నీ ఉద్రిక్తతలను మరిన్ని రెట్లు పెంచేవే. చైనా పరేడ్ కూడా అటువంటిదే. ప్రపంచశాంతికి దోహదపడతామని ఒకపక్క చెబుతూ కండబలాన్ని ప్రదర్శించటం సరికాదన్న స్పృహ కూడా ఆ దేశానికి లేకపోయింది. ఆహ్వానించిన షీ జిన్పింగ్తోపాటు అతిథులుగా వచ్చిన పుతిన్, కిమ్లు కూడా నియంత లక్షణాలు పుణికిపుచ్చుకున్నవారు. ఎన్నికలు లేకుండానో... బూటకపు ఎన్నికల ద్వారానో అధికారంలోకొచ్చినవారు. వీరికి జనమన్నా, వారి భద్రతన్నా ఏం పట్టింపు ఉంటుంది? సుంకాల యుద్ధంలో తలమునకలై అన్నిటినీ గాలికొదిలిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... జిన్పింగ్, పుతిన్లు ఉమ్మడిగా అమెరికాపై కుట్ర సాగిస్తున్నారని ఆరోపించారు. కనుక రాగల రోజుల్లో అమెరికా కండబల ప్రదర్శన అందరూ చూడాల్సి రావొచ్చు. -
డేంజరస్ చైనాతో.. దోస్తీయా?
చైనాకు రష్యా, భారత్ సన్నిహితం కావటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్గుమంటున్నారు. దుష్ట చైనాతో చేతులు కలుపుతారా? అంటూ రుసరుసలాడుతున్నారు. చైనా అంధకారంలోకి మీరూ పడిపోతున్నారంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశంలో మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిసి ఉన్న ఫొటోను సోషల్మీడియాలో షేర్చేస్తూ అక్కసు వెళ్లగక్కారు. మరోవైపు అమెరికాకు దీటుగా చైనా తన సైనిక, ఆయుధ శక్తిని ప్రదర్శిస్తుంటే.. ఉక్రెయిన్లోకి ఏ ఇతర దేశం బలగాలు వచ్చినా దాడి చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు.. ధీటుగా చైనా, రష్యా సవాళ్లతో ప్రపంచం ఉద్రిక్తంగా మారుతోంది. మధ్యేమార్గం అనేది మాయమై.. ప్రపంచం రెండు ముక్కలుగా చీలుతోంది. అమెరికా బెదిరింపులకు గురైనవారిని తాను కాపాడుతాను అన్నట్లుగా చైనా తన సైనిక బలాన్ని ప్రదర్శించటంతో రెండు ప్రపంచ మహాశక్తులు యుద్ధానికి ఎదురెదురుగా నిలబడినట్లయ్యింది.ఈ అసాధారణ పరిణామానికి ఈసారి భారత్ కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల చైనాలో నిర్వహించిన షాంఘై సహకార సమాఖ్య (ఎస్సీఓ) సమావేశంలో కనిపించిన ఒకే ఒక్క దృశ్యం ఇప్పుడు ప్రపంచ దృక్పథాన్ని మార్చివేస్తోంది. ట్రంప్ నిష్టూరాలు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను లొంగదీసుకునేందుకు భారత్ను వాడుకోవాలని భంగపడి.. సుంకాల పేరుతో బెదిరింపులకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎస్సీఓ సమావేశంపై భయపడుతూనే నిషూ్టరాలు ఆడారు. ఆ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోను తన సొంత సోషల్మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్లో షేర్ చేస్తూ భారత్, రష్యాను తాము కోల్పోయామని రాసుకొచ్చారు.‘చూడబోతే మేము అంధకార అగాధమైన చైనాకు భారత్, రష్యాలను కోల్పోయినట్లు కనిపిస్తోంది. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దుష్ట చైనాతో చేతులు కలిపితే అంధకారంలోకి వెళ్లినట్లేనని భావాత్మకంగా చెప్పారు. అదే సమయంలో తన దారికి తెచ్చుకోవాలనుకున్న రష్యా, భారత్లు తన ప్రత్యర్థి అయిన చైనా వైపు వెళ్లిపోయాయన్న భయం కూడా ఆయన మాటల్లో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. యుద్ధమా? శాంతా? ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి ముగింపు పలికే సుముహూర్తం ఇదేనని చైనా భావిస్తోంది. ఈ నెల 3న ఆ దేశం విక్టరీ పరేడ్లో చేసిన బలప్రదర్శన ప్రపంచానికి ఈ అంశంలో స్పష్టమైన సందేశం ఇచ్చింది. అమెరికా పేరు ప్రస్తావించకుండానే ‘శాంతియా? యుద్ధమా?’తేల్చుకోవాలని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టమైన హెచ్చరిక జారీచేశారు. ఆ సమావేశానికి అమెరికా ఆగర్భ శత్రువులైన ఉత్తరకొరియా, ఇరాన్ దేశాల అధినేతలు కూడా హాజరయ్యారు. అమెరికా బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, కాపాడేందుకు తాను ఉన్నానన్న భావన జిన్పింగ్ ప్రకటనలో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు.జిన్పింగ్ ప్రకటనకు కొనసాగింపు అన్నట్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అలాంటి ప్రకటనే చేశారు. ఉక్రెయిన్తో ఏ దేశం తన బలగాలను మోహరించినా వాటిపై దాడులు చేస్తామని శుక్రవారం హెచ్చరిక జారీచేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం యూరోపియన్ దేశాధినేతలతో సమావేశమై సైనిక మద్దతు కోరిన నేపథ్యంలో పుతిన్ ప్రకటన సంచలనంగా మారింది.ఎందుకంటే అమెరికాతోపాటు దాదాపు యూరప్ దేశాలన్నీ నాటోలో భాగస్వాములుగా ఉన్నాయి. ఒకవేళ నాటో బలగాలు ఉక్రెయిన్లోని అడుగుపెడితే.. వాటితో ముఖాముఖి యుద్ధానికి సిద్ధమని పుతిన్ తేల్చి చెప్పారు. దీంతో ప్రాంతీయ ఘర్షణలన్నీ కలిసి నిర్ణయాత్మక ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. భారతే కీలకం దశాబ్దాలుగా మధ్యేవాద విధానంతో ప్రపంచ ప్రధాన శక్తులన్నింటితో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తున్న భారత్.. ప్రస్తుతం ఎటో ఒకవైపు మొగ్గాల్సిన సంకట స్థితిలో పడింది. తన ప్రమేయం లేకుండానే అమెరికా– చైనా శక్తుల మధ్య కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. భారత్ జోక్యం చేసుకుంటేనే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే వాదిస్తున్నారు. అందుకు భారత్ స్పందించకపోవటంతో భారత వస్తువులపై 50 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో అనివార్యంగానే మనదేశం.. చైనా, రష్యాకు మరింత దగ్గర కావాల్సి వస్తోందనే అంచనాలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు అమెరికాను దెబ్బకొట్టాలంటే చైనా, రష్యాలకు కూడా భారతే కీలకంగా మారింది. ఎస్సీఓ సమావేశానికి 10 సభ్య దేశాధినేతలు, మరికొన్ని ఆహా్వనిత దేశాల నేతలు విచ్చేసినా.. అందరి దృష్టి భారత ప్రధాని నరేంద్రమోదీపైనే కేంద్రీకృతమైంది. ఈ సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై సొంత దేశంలో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. భారత్ను అనవసరంగా దూరం చేసుకున్నామన్న బాధ ఆ విమర్శల్లో కనిపిస్తోంది.అయితే, చైనాతో భారత సంబంధాలు తక్షణం గొప్పస్థాయికి వెళ్తాయన్న నమ్మకం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సరిహద్దు సమస్యే భారత్–చైనా దైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాన అడ్డంకి అన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ జనరల్ అనిల్ చౌహాన్ మాటలను గుర్తుచేస్తున్నారు. -
అద్భుతమంటూనే సెటైర్ వేసిన ట్రంప్!
పుతిన్, కిమ్ సహా 26 దేశాధినేతల సమక్షంలో చైనా నిర్వహించిన అతిపెద్ద.. శక్తివంతమైన సైనిక పరేడ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అద్భుతంగా ఉంది అంటూనే అది తన దృష్టిని ఆకర్షించేందుకు రూపొందించిన నాటకీయ ప్రదర్శన మాత్రమేనని సెటైర్ వేశారు. ఓవల్ ఆఫీస్లో మీడియాతో ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నాకు తెలిసి అది అందమైన.. అత్యంత అద్భుతమైన కార్యక్రమం. కానీ, వాళ్లు అలా ఎందుకు చేశారో నేను అర్థం చేసుకోగలను. నేను చూస్తున్నాననే వాళ్లు అనుకుని ఉంటారు’’ అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆధ్వర్యంలో తియానన్మెన్ స్క్వేర్ వద్ద రెండో ప్రపంచ యుద్ధ విక్టరీ పరేడ్ జరిగింది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ సహా 26 దేశాల అధినేతలు హాజరయ్యారు. దాదాపు 50 వేల మందికి పైగా వీక్షకులు హాజరైన ఈ పరేడ్లో శక్తివంతమైన క్షిపణులనూ చైనా ప్రదర్శనకు ఉంచింది. అయితే.. తన ప్రసంగంలో జిన్పింగ్ అమెరికాను ప్రస్తావించకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ను ఓడించడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని చైనాకు గుర్తు చేశారాయన. షీ(జిన్పింగ్) స్నేహితుడే. కానీ, ఆయన అమెరికా పేరును ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చైనాకు స్వాతంత్రం దక్కడంలో మా సాయం కూడా ఉంది. అలాంటిది క్రెడిట్ కోరుకోవడం తప్పేం కాదు కదా అని ట్రంప్ అన్నారు.అంతకు ముందు.. ఈ ముగ్గురు దేశాధినేతల కలయికపై ట్రంప్ Truth Socialలో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జాంగ్ ఉన్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అమెరికా వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని అనిపిస్తోంది అంటూ పోస్ట్ చేశారాయన. అయితే.. అయితే, వైట్హౌస్లో జరిగిన ప్రెస్మీట్లో మాత్రం స్వరాన్ని మార్చారాయన. వాళ్లతో తన సంబంధం బాగానే ఉందని.. వచ్చే రెండు వారాల్లో అది ఎలా ఉంటుందో తెలుస్తుందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అదే సమయంలో.. బీజింగ్ పరేడ్కు ఆహ్వానం రాకపోవడంపై ట్రంప్కు ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన.. ఆ విషయం గురించి ఇప్పటివరకు ఆలోచించలేదు. నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని బదులిచ్చారు. అంతేకాదు.. త్వరలో షీ జిన్పింగ్ను కలిసే అవకాశం ఉందని బదులిచ్చారాయన. -
అన్నీ మంచి శకునములే...
భారతదేశంపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు 50 శాతానికి పెంచిన ఐదు రోజులకు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశాల నుంచి దేశానికి అన్నీ మంచి శకునాలే లభించాయి. చైనా, రష్యాలతో సంబంధాలు మరింత బలో పేతమయ్యాయి. ఈ కొత్త స్థితి వెంటనే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారోలు,ఇండియాపై చేసిన అనుచితమైన వ్యాఖ్య లలో ప్రతిఫలించింది. ప్రధాని మోదీ తమపై కొంత అలిగినా తిరిగి వైఖరి మార్చుకోగలరని వారు చివరి వరకూ ఆశించారు. ఆయనకు తాము తప్ప గత్యంతరం లేదనుకున్నారు. కానీ, మోదీ వైఖరి మరింత దృఢంగా మారినట్లు తియాన్జిన్లో అడుగడుగునా కనిపించింది.అర్థాలు–అంతరార్థాలుఈ సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్న మాటలేమిటో యథాతథంగా చూడటం అవసరం. జిన్పింగ్తో సమావేశం అనంతరం మోదీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ, రెండు దేశాలూ అభివృద్ధిలో భాగస్వా ములే తప్ప ప్రత్యర్థులు కాదనీ, భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారరాదనీ భావించినట్లు పేర్కొన్నది. పరస్పర గౌరవం, ఉభయుల ప్రయోజనాలు, ఇరువురి సున్నితమైన మనోభావాల గుర్తింపు అవసర మన్నది. ఇటువంటి అవగాహనలు 21వ శతాబ్దపు ధోరణులకు అను గుణంగా బహుళ ధ్రువ ప్రపంచంతోపాటు బహుళ ధ్రువ ఆసియా రూపు తీసుకునేందుకు ఆవశ్యకమని పేర్కొన్నది. చైనాతో సంబంధాల మెరుగుదల నిరుటి కజాన్–బ్రిక్స్ సమావేశాల నుంచే మొద లైందని పలుమార్లు గుర్తు చేస్తున్న మోదీ, ఇపుడు రెండు దేశాల మధ్య ‘శాంతి, సుస్థిరతల వాతావరణం ఏర్పడింద’న్నారు. జిన్పింగ్ మాటలను కూడా కొంత చెప్పుకొన్న తర్వాత ఇరువురి అభిప్రాయాల అర్థాలు, అంతరార్థాలు చూద్దాము: రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80 సంవత్సరాల తర్వాత కూడా ప్రచ్ఛన్న యుద్ధ కాలపు మనస్తత్వం, ఆధిపత్య ధోరణి, ప్రొటెక్షనిజం కొనసాగుతున్నాయి. కొద్ది దేశాల అంతర్గత విధానాలను ఇతరులపై రుద్దకూడదు. అంతర్జాతీయ నియమ నిబంధనలన్నవి పరీక్షాత్మక దశకు చేరుకున్నాయి. సమ్మిళితమైన ఆర్థిక ప్రపంచీకరణ అవసరం. భారతదేశం, చైనాలు పరస్పర విశ్వాసాన్ని బలపరచుకుని, పరస్పర అభివృద్ధికి అవకాశాలను పెంచుకోవాలి. వ్యూహాత్మకమైన, దీర్ఘ కాలిక దృక్కోణంతో వ్యవహరించాలి. నాయకులిద్దరూ చెప్పినవి ఇంకా ఉన్నాయిగానీ, అన్నీ ఈ ప్రధా నమైన మాటల చుట్టూ తిరిగేవే. సరిహద్దు వివాదాన్ని, పాకిస్తాన్ అంశాన్ని ప్రధానంగా ముందుకు తెచ్చుకుని అభివృద్ధి సహకార అవకాశాలను విస్మరించవద్దన్నది మొదటి అంతరార్థం. ఇరువురి సున్నిత మనోభావాలన్నది ఇందుకు సంబంధించినదే గాక, ఆసియాతో పాటు ప్రపంచంలోనూ ఒక శక్తిగా ఎదగజూస్తున్న ఇండి యాకు ఆటంకాలు కల్పించరాదనే అర్థం వస్తుంది. ఇక్కడ, బహుళ ధ్రువ ప్రపంచం అన్నమాటతో పాటు, బహుళ ధ్రువ ఆసియా అనే మాటను కొత్తగా ఉపయోగంలోకి తేవటం గమనించదగ్గది. అనగా, చైనాయేగాక ఇండియా కూడా ఒక ధ్రువమనేది గుర్తించటమన్న మాట. 21వ శతాబ్దపు ధోరణులలోకి అది కూడా వస్తుంది. సుంకాలకు ముందు నుంచే...చైనాతో సంబంధాల మెరుగుదల కజాన్ నుంచే మొదలైన మాట నిజమే అయినా ఆ విషయాన్ని మోదీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? కేవలం ట్రంప్ సుంకాలు అందుకు కారణమని అమెరికాలో, బయటా జరుగుతున్న ప్రచారం నిజం కాదనీ, భారత దేశం తన ప్రయోజనాల కోసం స్వతంత్ర నిర్ణయాలు గతం నుంచే తీసుకుంటున్నదనీ ప్రకటించేందుకు!చైనా అధ్యక్షుని ఉద్దేశం... రెండు దేశాల మధ్య సరిహద్దుల వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అందుకు పరిష్కార ప్రయ త్నాలు జరుగుతున్నందున, అందుకు బందీ కాకుండా, పరస్పర అభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టాలని! అందుకు అనుగుణంగా తాము భారతదేశంతో కలిసి పనిచేయగలమనటం! ఆయన ఉప యోగించిన డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయటమనే మాటలో ఈ అంతరార్థాలన్నీ కనిపిస్తాయి. మారుతున్న పరిస్థితులు, అందు వల్ల రెండు దేశాలకు కలుగుతున్న సమస్యలు, వాటి నుంచి బయట పడేందుకుగానీ, భవిష్యత్తులో అభివృద్ధి కోసం గానీ అవసరమైన వేమిటో రెండు దేశాల నాయకులకు స్పష్టమైన అవగాహన ఏర్పడి నట్లు కనిపిస్తున్నది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా నిలిచి పోయిన ఒప్పందాలు ఒక్కటొక్కటిగా ఇప్పటికే జరుగుతుండటం తెలిసిందే.స్పష్టమైన సందేశంరష్యా విషయానికి వస్తే, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షునితో జరిపిన సమావేశం, అనూహ్యంగా ఆయన కారులో ప్రయాణించటం, హోటల్కు చేరిన తర్వాత కూడా కారులోనే ఉండి ముప్పావు గంట సేపు చర్చించి ఆ ఫొటోను పోస్ట్ చేయటం, బయట కూడా పుతిన్తో కలిసి వెళ్లి జిన్పింగ్తో చేసిన సంభాషణల వంటివన్నీ ఇటు భారతీయులకు, ప్రపంచ దేశాలకు, అటు అమెరికా శిబిరానికి పంపవలసిన సందేశాలనే పంపాయి. దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగటమే గాక, ఉభయుల మధ్యగల చిరకాలపు సాన్నిహిత్యం ఇంకా బలపడగలదని, సుంకా లకు వెరవబోమనే సంకేతాలను భారత ప్రధాని అమెరికా శిబిరానికి 50 శాతం నాటి ముందుకన్నా బలంగా పంపటం విశేషం. ఇప్పటి కైనా వివేకం కలిగితే ఆ శిబిరం చేయవలసింది తమ తీరును అన్ని విధాలా మార్చుకుని, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వ్యవహరించటం!షాంఘై సంస్థ నిజానికి రక్షణ, తీవ్రవాదం అంశాలకు సంబంధించినది. కానీ, మొదటిసారిగా తియాన్జిన్లో ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వ్యూహాల గురించి చర్చించటం మారుతున్న పరిస్థితులకు, పాశ్చాత్య ప్రపంచానికి బయటి దేశాల ఆందోళనలు, అవసరాలకు అద్దం పడుతున్నది. ఈ విధంగా ‘బ్రిక్స్’కు అదనంగా మరొక సంస్థ క్రమంగా బలపడుతున్నది. కజాన్లో వలెనే తియాన్జిన్లోనూ పాశ్చాత్య ఆధిపత్య వ్యతిరేకత, బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం, డాలర్ను క్రమంగా బలహీనపరచటం, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలు, ప్రస్తుతం గల అంతర్జాతీయ వ్యవస్థలపై అమెరికా కూటమి నియంత్రణ స్థానే సంస్కరణలతో ప్రజాస్వామికీకరణ, వర్ధమాన దేశాల మధ్య అవగాహనలను, మైత్రీ సహకారాలను బలపరచుకోవటం ప్రధానాంశాలయ్యాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్తో జస్ట్ 30 సెకన్లు.. మోదీతో మాత్రం 45 నిమిషాలు
చైనా టియాంజిన్ వేదికగా జరిగిన షాంగై సదస్సు తర్వాత.. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్లు ద్వైపాక్షికంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే హోటల్లో భేటీ జరిగింది కేవలం 15 నిమిషాలుకాగా, మరో 45 నిమిషాల ఇద్దరూ కారులోనే ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వాళ్లేం మాట్లాడుకున్నారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. షాంగై సదస్సు కోసం మోదీ రెండ్రోజులపాటు చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. సదస్సు వేదికగా.. పహల్గాం ఉగ్రదాడిపై సభ్యదేశాల మద్దతును తీర్మానం రూపంలో కూడగట్టారాయన. అయితే సోమవారం సదస్సు తర్వాత.. మోదీ కోసం పుతిన్ 10 నిమిషాలు ఎదురు చూశారు. ఆపై మోదీతో కలిసి తన ప్రత్యేకమైన ఆరుస్ లిమోసిన్Aurus limousine కారులో మాట్లాడుకుంటూ ప్రయాణించారు. అమెరికాతో భారత్కు టారిఫ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ ఇద్దరూ భేటీ కావడం, పైగా ఆ కారు చాలా ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థతో కూడుకున్నది కావడంతో ఆటోమేటిక్గా ఏం మాట్లాడుకున్నారనే ప్రశ్న ఎదురైంది. అయితే అందులో పెద్ద రహస్యం ఏం లేదని చైనా పర్యటనలోనే ఉన్న పుతిన్ చెప్పుకొచ్చారు. ‘‘అందులో సీక్రెట్ ఏం లేదు. ఆలస్కా సదస్సులో జరిగిన పరిణామాలను ఆయనకు వివరించా’’ అని ప్రెస్మీట్లో పుతిన్ చెప్పారు. అంతేకాదు.. అలస్కా భేటీ సమయంలోనూ ఆయన ట్రంప్తో కారులో ప్రయాణించిన విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. అలస్కా యాంకరేజ్ ఎయిర్పోర్టులో దిగిన తర్వాత పుతిన్, ట్రంప్కు చెందిన లిమోసిన్ ‘ది బీస్ట్’లో భేటీ జరగాల్సిన ప్రాంతం వద్దకు ప్రయాణించారు. అయితే.. ఎయిర్పోర్ట్ నుంచి వేదిక చాలా దగ్గర. అందుకే తమ మధ్య కేవలం 30 సెకన్లపాటే మాటలు జరిగాయని.. అదీ కూడా బ్రోకెన్ ఇంగ్లీష్లోనే సాగిందని అన్నారు. ఆ సమయంలో.. ట్రంప్ పూర్తి ఆరోగ్యవంతంగా కనిపించడంతో తాను సంతోషం వ్యక్తం చేశానని పుతిన్ అన్నారు. మరోవైపు.. రష్యా నేషనల్ రేడియో స్టేషన్ ‘వెస్టిఎఫ్ఎమ్’ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. మోదీ-పుతిన్లు తమ బృందాలతో చైనాలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. అంతకంటే ముందు.. ఆ వేదికకు చేరే క్రమంలో కారులో సుదీర్ఘంగా సంభాషించుకున్నారు అని తెలిపింది. మరోవైపు.. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. పుతిన్-మోదీ ముఖాముఖి మాట్లాడుకున్నారు. ఆయన(పుతిన్) తమ సంభాషణ మధ్యలో ఎలాంటి అంతరాయం కలగకూడదని భావించే కారులో ప్రయాణించారు’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు నేపథ్యంతో ట్రంప్ భారత్పై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. భారత్ తమ దేశంపై అధిక సుంకాలు విధిస్తోందంటూ సంచలన ఆరోపణలకు దిగారాయన. ఈ పరిణామంపై పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఇండియా, చైనాలాంటి దేశాలతో ఆ తీరున వ్యవహారించడం సరికాదని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని ట్రంప్ వైఖరిని తప్పుబట్టారు. మరోవైపు పుతిన్ డిసెంబర్లో భారత్ పర్యటనకు రానున్నారు, ఉక్రెయిన్ శాంతి చర్చలు.. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఆగస్టు 15న తటస్థ వేదికగా అలస్కాలో ట్రంప్-పుతిన్ల భేటీ జరిగింది. అయితే ఈ భేటీ ఫలవంతంగా జరగలేదని తెలుస్తోంది. మరోవైపు జెలెన్స్కీ-యూరప్ దేశాధినేతలతో వైట్హౌజ్లో జరిగిన చర్చలు మాత్రం సవ్యంగా సాగినట్లు సంకేతాలు అందాయి. దీంతో.. తదుపరి దశలో జరగబోయే అమెరికా-ఉక్రెయిన్-రష్యా త్రైపాక్షిక చర్చలపై ఉత్కంఠ నెలకొంది. -
‘భారత్తో రష్యాకు భారీ డ్యామేజ్.. అది చాలదా?’
రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంతోనే భారత్పై ద్వితీయశ్రేణి ఆంక్షలు విధించాల్సి(పెనాల్టీ సుంకాలు) వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నొక్కి చెప్పారు. అయితే ఇది ఇక్కడితోనే అయిపోలేదని అంటున్నారాయన. భారత్ వల్లే రష్యాకు భారీ డ్యామేజ్ కూడా జరిగిందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బుధవారం పోలాండ్ అద్యక్షుడు కరోల్ నావ్రోకితో వైట్హౌజ్లోని తన ఓవల్ ఆఫీస్ ఆఫీస్లో జరిగిన జాయింట్ ప్రెస్మీట్లో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. రష్యాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఓ పోలాండ్కు చెందిన విలేకరి ప్రశ్నించారు. ఇండియాపై ద్వితీయ శ్రేణి సుంకాలు విధించాను. చైనా తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసే పెద్ద దేశం ఇండియానే. ఇది రష్యాకు వందల బిలియన్ల డాలర్ల నష్టం కలిగించింది. మీరు దీన్ని చర్య కాదు అంటారా?.. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 సుంకాలు మిగిలే ఉన్నాయి. మీరేమో చర్య లేదు అంటున్నారు. బహుశా.. మీకు కొత్త ఉద్యోగం అవసరం అంటూ రిపోర్టర్ను ఉద్దేశించి ట్రంప్ అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇండియాకు పెద్ద సమస్యలు వస్తాయి అని రెండు వారాల క్రితమే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుడు అదే జరిగిందని గుర్తు చేశారు. భారత్ తమకు మిత్రదేశమంటూ జులై 30వ తేదీన ట్రంప్ తొలుత 25 శాతం సుంకాలు(ప్రతీకార సుంకాలు) ప్రకటించారు. ఆ సమయంలో రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్రంగా ఆక్షేపించారు. ఇక ఆగస్టు 6వ తేదీన రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్పై పెనాల్టీగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా ఉక్రెయిన్ యుద్దానికి భారత్ ప్రత్యక్షంగా ఫండింగ్ చేస్తోందని ఆరోపించారాయన. దీంతో ఆగస్టు 27వ తేదీ నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్అదే సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన భారత్ను అత్యధిక సుంకాలు విధించే దేశంగా పేర్కొంటూ.. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్ అంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా వస్తువులపై ఆ దేశం అత్యధికంగా సుంకాలు విధిస్తోందని.. అందువల్లే అమెరికన్ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే.. ఇండియా ఇప్పుడు నో టారిఫ్ ఒప్పందానికి దిగి వచ్చిందన్న ఆయన.. అది ఆలస్యంగా జరిగిందంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇండియా రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తోందని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. తన సుంకాల వల్లే భారత్ ఇప్పుడు టారిఫ్లు తగ్గించేందుకు సిద్ధమైంది అని అన్నారు.నిజంగానే చమురు ఆగిందా?ఇదిలా ఉంటే.. తన సుంకాల వల్లే భారత్ దిగొచ్చిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసిందంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తుండడం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది. రష్యా ఈ విషయంపై అధికారికంగా ఏం స్పందించలేదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తామని, ఆర్థిక లాభదాయకత ఆధారంగా తమ వ్యూహాం ఉంటుందని ఇటు భారత్ చెబుతూ వస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ.. రైతులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలపై రాజీ పడం. ఒత్తిడి పెరిగినా తట్టుకుంటాం అని సుంకాలపై స్పందించారు. మరోవైపు.. చమురు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా ఆపలేదు. కానీ కొంతమేర తగ్గించిన సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన 50% సుంకాలు (25% రెసిప్రోకల్ టారిఫ్ + 25% పెనాల్టీ టారిఫ్) ప్రభావంతో జూలై, ఆగస్టు నెలల్లో రష్యా చమురు దిగుమతులు తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావం తక్షణమే పూర్తిగా కనిపించక పోవచ్చని.. ఎందుకంటే చమురు కొనుగోలు ఒప్పందాలు వారాల ముందే కుదురుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్తో అలా మాట్లాడాల్సింది కాదుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. చైనా పర్యటన ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఇండియా, చైనాలాంటి దేశాలతో అలా వ్యవహారించడం సరికాదని అమెరికా వైఖరిని తప్పుబట్టారు. అమెరికా భారత్పై 50% సుంకాలు విధించడం.. ఆర్థిక శిక్షగా అభివర్ణిస్తూనే ఇది అంతర్జాతీయ సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నంగా పేర్కొన్నారు.ఇండియా, చైనా వంటి దేశాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ఇండియా 1.5 బిలియన్ జనాభా కలిగిన దేశం. వీరి చరిత్ర, రాజకీయ వ్యవస్థలు గౌరవించాల్సినవి. వీటి నాయకత్వాన్ని బలహీనపరచాలనుకోవడం పొరపాటు. శిక్షించేందుకు ప్రయత్నించడం, సుంకాలు విధించడం అనేవి ఆర్థిక బలప్రయోగం. ఇది కాలనీల యుగం కాదు. భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని అమెరికా వైఖరిని పరోక్షంగా విమర్శించారు. -
ఆంక్షలతో లొంగదీసుకోలేరు
మాస్కో: భారత్, చైనాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్లు, ఆంక్షలను రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుపట్టారు. ఆ రెండు దేశాలను ఆంక్షల కొరడాతో లొంగదీసుకోవాలని చూడడం సరైంది కాదని తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనాలతో మాట్లాడే విధానమే సరిగ్గా లేదని, వలసవాద పాలన కాలం నాటి మాటలను ట్రంప్ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పుతిన్ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా సర్కార్ వైఖరిపై ఘాటుగా స్పందించారు. ఆసియాలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచి, దారికి తెచ్చుకోవాలని చూస్తే అది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అంశాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. భారత్, చైనాలు చక్కటి భాగస్వామ్య దేశాలని పుతిన్ గుర్తుచేశారు. అమెరికా విధిస్తున్న టారిఫ్లను ఆ రెండు దేశాల్లో నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా అభివర్ణించారు. భారత్, చైనాలు కలిసి అమెరికాను శిక్షిస్తాయని ఎవరైనా చెబితే ఆ విషయం సీరియస్గా ఆలోచించాల్సిందేనని ట్రంప్ ప్రభుత్వానికి సూచించారు. 140 కోట్లకుపైగా జనాభా ఉన్న ఇండియాను, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాను బలహీన దేశాలుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. వలసవాద ప్రభుత్వాల హయాం ఎప్పుడో ముగిసిపోయిందని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు అప్పుటి పదజాలం ఉపయోగిస్తామంటే కుదరదని, ఈ విషయం అమెరికా తెలుసుకోవాలని హితవు పలికారు. అమెరికా, భారత్, చైనాల మధ్య మళ్లీ సాధారణ సంబంధాలు నెలకొంటాయన్న నమ్మకం తనకు ఉందని పుతిన్ స్పష్టంచేశారు. 🚨🇷🇺 'YOU CANNOT TALK TO INDIA OR CHINA LIKE THAT:' Putin on economic pressure against partners"Attempting to weaken their leadership, built through difficult histories, is a mistake." pic.twitter.com/GsiU3K3mnZ— Sputnik India (@Sputnik_India) September 3, 2025కారులో మోదీతో సంభాషణ రహస్యం కాదు చైనాలో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. కారులోనే 45 నిమిషాలకుపైగా మాట్లాడుకున్నారు. దీనిపై వస్తున్న ఊహాగానాలపై పుతిన్ స్పందించారు. మోదీతో కారులో సంభాషించడం వెనుక రహస్యం ఏమీ లేదన్నారు. అది రహస్య సంభాషణ కాదని స్పష్టంచేశారు. అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన భేటీ విశేషాలను మోదీకి వివరించానని చెప్పారు. -
పుతిన్తో కిమ్ భేటీ.. ఇలా కూడా చేస్తారా.. వీడియో వైరల్
బీజింగ్: రష్యా, ఉత్తర కొరియా అధినేతలు పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ చైనా రాజధాని బీజింగ్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బుధవారం విక్టరీ డే పరేడ్లో పాల్గొన్న అనంతరం స్టేట్ గెస్ట్ హౌస్లో కలుసుకున్నారు. భేటీ ప్రారంభం కావడానికి ముందు మీడియా ప్రతినిధులతో పుతిన్ మాట్లాడారు. అయితే, అనంతరం చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..భేటీ అనంతరం పుతిన్-కిమ్ అక్కడి నుంచి వెళ్లిపోగానే.. వారు కూర్చున్న ప్రదేశం వద్దకు వేగంగా ఇద్దరు వ్యక్తులు దూసుకొచ్చారు. అందులో ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని తెగ తుడిచేశారు. ఉత్తరకొరియా అధ్యక్షుడికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకుండా శుభ్రం చేశారు. ఆయన తాకిన ఫర్నీచర్ను క్లీన్ చేశారు. ఇంకొకరు ఆయన వాడిన గ్లాస్ అతి జాగ్రత్తగా ట్రేలో పెట్టుకొని తీసుకెళ్లిపోయారు. ఆయనకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఆ ప్రాంతంలో లేకుండా క్లీన్ చేసేశారు.అయితే, ఇలా వ్యవహరించాడాని కారణంగా ఉందని రష్యా జర్నలిస్ట్ ఒకరు వెల్లడించారు. ఆయన డీఎన్ఏ ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ఇలా చేశారని చెప్పుకొచ్చారు. కాగా, దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు చిక్కకుండా ప్రపంచ నేతలు ఇలా జాగ్రత్తలు పాటిస్తుంటారు.The staff accompanying the North Korean leader meticulously erased all traces of Kim's presence. They took the glass he drank from, wiped down the chair's upholstery, and cleaned the parts of the furniture the Korean leader had touched. pic.twitter.com/JOXVxg04Ym— Russian Market (@runews) September 3, 2025పుతిన్ కూడా అంతే.. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఇటీవల అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి జాగ్రత్తే తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పుతిన్ మల వ్యర్థాలను తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఓ సూట్ కేసును ఆయన బాడీగార్డులు మోసుకెళ్లారట. ఆ పూప్ సూట్కేస్లో వాటిని సేకరిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా.. పుతిన్-కిమ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలిసింది. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా సైనికులతో కలిసి పోరాడుతున్న ఉత్తరకొరియా జవాన్లపై ప్రశంసల వర్షం కురిపించారు. రష్యా–ఉత్తర కొరియా మధ్య బంధం నానాటికీ బలపడుతోందని కిమ్ హర్షం వ్యక్తంచేశారు. గత ఏడాది జూన్లో ఇరుదేశాలు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారని తెలిపారు. అప్పటి నుంచి పరస్పరం సహకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. రష్యాకు, ఉత్తరకొరియా సహకరించడం సోదర దేశంగా తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. అవసరమైన సాయం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.అయితే, ఉక్రెయిన్పై యుద్ధం గురించి కిమ్ నేరుగా ప్రస్తావించలేదు. మీడియాతో మాట్లాడిన అనంతరం పుతిన్, కిమ్ ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించుకున్నారు. ఉక్రెయిన్పై యుద్ధంలో సహకరిస్తున్నందుకు కిమ్కు పుతిన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసినట్లు సమాచారం. రష్యాలో పర్యటించాలని కోరుతూ కిమ్ను పుతిన్ ఆహ్వానించారు. ఉక్రెయిన్పై యుద్ధం కోసం ఉత్తర కొరియా సైన్యం రష్యాకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా ఇప్పటిదాకా 15,000 మంది సైనికులను పంపించింది. బాలిస్టిక్ మిస్సైళ్లు, ముందుగుండు సామగ్రి సహా పలు కీలక ఆయుధాలను సైతం సరఫరా చేస్తోంది. -
జిన్పింగ్ జీ.. 150 ఏళ్లు బతకొచ్చంటారా?: పుతిన్
బీజింగ్: ఇప్పటికే దశాబ్దాలుగా చైనా, రష్యాలను ఏకఛత్రాధిపత్యంతో ఏలేస్తున్న జిన్పింగ్, పుతిన్లకు ఇంకొన్ని దశాబ్దాలపాటు అధికార పీఠాన్ని అట్టిపెట్టుకోవాలనే ఆశ ఉన్నట్టుంది. బుధవారం బీజింగ్లో కట్టుదిట్టమైన మిలటరీ భద్రత మధ్య జరిగిన సైనిక, సాయుధ పరేడ్లో వీరిద్దరి అనూహ్య సంభాషణ ఈ విషయాన్ని రుజువుచేసింది. ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో జిన్పింగ్, పుతిన్ల గుసగుసలు దగ్గర్లోని మైక్రోఫోన్ ద్వారా బయటకు వినిపించడంతో వీరి మనసులోని మాట బయటపడింది.తియాన్మెన్ స్క్వేర్ గేట్ నుంచి పరేడ్ వీక్షణ వేదిక మీదకు వెళ్లే మార్గంలో నడుచుకుంటూ జిన్పింగ్, పుతిన్, కిమ్, ఇతర నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా 150 ఏళ్లదాకా మనిషి జీవించగలడు అనే అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా జిన్పింగ్తో పుతిన్.. ‘జీవసాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోంది. ముసలివైపోతున్న, పాడవుతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకుంటూ మనిషి చాన్నాళ్లు జీవించవచ్చు. ఇలా నూతన అవయవాలతో యవ్వన ఛాయతో మెరుగైన జీవనం సాధ్యమే. బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువునూ జయించవచ్చు’ అని అన్నారు.దీనికి జిన్పింగ్ మాండరిన్ భాషలో బదులిచ్చారు. ‘గతంలో 70 ఏళ్లు బతకడం అంటే గగనం. ఇప్పుడు 70 ఏళ్లు వయసు వచ్చిన చిన్నపిల్లాడి కిందే లెక్క. కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అభివృద్ధిలోకి వస్తున్న వైద్యశాస్త్ర పరిశోధనా ఫలాలను అందిపుచ్చుకుంటే ఈ శతాబ్దిలోనే మనుషులు 150 ఏళ్లదాకా జీవించగలరు’’ అని అన్నారు. ఇదే సమయంలో జిన్పింగ్, పుతిన్లను చూసి కిమ్ కిసుక్కున నవ్వారు. వీళ్ల సంభాషణ విని నవ్వారో, ఊరకే యథాలాపంగా నవ్వారో తెలీదు. కానీ ఈ సంభాషణ మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాకు అమర్చిన మైక్రోఫోన్ ద్వారా ప్రత్యక్షప్రసారమైందని రాయిటర్స్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. పుతిన్, జిన్పింగ్ ఇద్దరి వయసూ 72 కావడం గమనార్హం. తదుపరి ఎన్నికల్లోనూ అధ్యక్ష పీఠంపై కూర్చునేలా జిన్పింగ్ ఇప్పటికే రాజ్యాంగంలో మార్పులుచేశారు. పుతిన్ సైతం ఇదే తరహాలో గతంలోనే రాజ్యాంగ సవరణ చేశారు. ఇద్దరికీ మరికొన్నాళ్లు పరిపాలించాలనే ఆసక్తి ఎక్కువగా ఉందని అందరికీ తెల్సిందే. -
ఎదురులేనంతగా ఎదుగుతాం: జిన్పింగ్
బీజింగ్/హాంకాంగ్: అసాధారణ రక్షణరంగ పాటవంతో అత్యాధునీకరించిన అస్త్రశస్త్రాలతో చైనా ఎదురులేకుండా ఎదుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రకటించారు. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్పై గెలుపునకు గుర్తుగా జరిపిన 80వ విజయోత్సవ పరేడ్ ఇందుకు వేదికైంది. టారిఫ్లతో స్నేహితులు, శత్రువులు అనే తేడా లేకుండా ఇష్టారీతిన ఆధిపత్య బలప్రదర్శన చేస్తున్న అగ్రరాజ్యాధినేత ట్రంప్ వైఖరిని ధిక్కరించేలా జిన్పింగ్ ప్రసంగం సాగింది. చైనా సైన్యానికి సెంట్రల్ మిలటరీ కమిషన్ సారథిగా సర్వసైన్యాధ్యక్షుడి హోదాలో జిన్పింగ్ ప్రసంగించారు. ‘‘ మానవత్వం అనేది ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూడక తప్పదని చరిత్ర మనకు ఏనాడో చెప్పింది. చైనా పునరుజ్జీవానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటికప్పుడు వ్యూహాత్మక తోడ్పాటునందిస్తోంది. అది ప్రపంచ శాంతి, అభివృద్ధికి సైతం ఎంతగానో సాయపడుతోంది. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను కంటికి రెప్పలా కాపాడేందుకు చైనా మిలటరీ స్వశక్తితో ఉక్కు సంకల్పంతో శత్రు దుర్భేద్యంగా తయారైంది. ఆధునిక చరిత్రలో రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ సేనలను మట్టికరిపించడం ద్వారా చైనా తొలిసారిగా విదేశీ దురాక్రమణలను విజయవంతంగా అడ్డుకుంది. మానవ నాగరికత, ప్రపంచశాంతి సంరక్షణ, యుద్ధంలో త్యాగాలతో చైనా ప్రజలు ఈ క్రతువులో కీలక పాత్ర పోషించారు. అందరం సమానం, శాంతి సామరస్యంతో జీవనం సాగిద్దామనే భావన ఒక్కటే ప్రపంచదేశాలను యుద్ధాల బాటలో నడవకుండా ఆపుతుంది. నేడు మానవత్వం అనేది కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఏదో ఒక్కటే ఎంచుకోవాలి. శాంతి కావాలా యుద్ధం కావాలా? చర్చలా లేదా ఘర్షణలా? యుద్ధాలకు దిగితే రక్తసిక్తమైన మరుభూమి మినహా మనకేం మిగలదు’’ అని జిన్పింగ్ వ్యాఖ్యానించారు.భూమండలాన్ని కవర్ చేసే భారీ క్షిపణిపరేడ్లో తొలిసారిగా ద్రవరూప ఇంధనంతో పనిచేసే ఖండాతర వ్యూహాత్మక అణ్వస్త్ర ఆయుధం డీఎఫ్–5సీను ప్రదర్శించారు. దీని లక్ష్య పరిధి ఏకంగా 20,000 కిలోమీటర్లు. అంటే ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా శత్రువును శబ్దం కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకొచ్చి తుదముట్టిస్తుంది. ఇంతటి వేగంతో రావడంతో దీనిని అడ్డుకునే శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు సంసిద్ధమయ్యేందుకు సరిపడా సమయం చిక్కదు. ఆలోపే ఇది లక్ష్యను తుత్తునియలు చేస్తుంది. పైగా ఇది ఒకేసారి 10 వేర్వేరు దిశల్లోని లక్ష్యాలను ఛేదించేలా 10 వార్హెడ్లను ప్రయోగించగలదు.నభూతో నభవిష్యతిగతంలో ఎన్నడూ మీడియాకంట పడని, అత్యంత నూతన తరం ఆయుధాలు, అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణులు, యుద్ధట్యాంక్లు, జలాంతర డ్రోన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు, ఐదో తరం యుద్ధవిమానాలను చైనా తొలి సారిగా ప్రదర్శించింది. బీజింగ్లోని ప్రఖ్యాత తియా న్మెన్స్క్వేర్ కూడలి మీదుగా ఈ పలు రకాల ఆయుధ వ్యవస్థల పరేడ్ సాగింది. నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిగిన ఈ పరేడ్ను చూసేందుకు జనం లక్షలాదిగా తరలివచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో, ఇండోనేసి యా అధ్యక్షుడు ప్రబోబో సుబియంతో, కాంబోడియా రాజు నోరోడోమ్ సిహమోనీ, వియత్నాం అధ్యక్షుడు లూంగ్ కూంగ్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, మయ న్మార్ సైనిక నేత సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లాంగ్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమార్త్ తొకయేవ్, జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ నాంగాగ్వా, కాంగో అధ్యక్షుడు డెనిస్ ససూ ఎన్గిసో, క్యూబా అధ్యక్షుడు మెగేల్ డియాజ్ క్యానెల్, అజర్బైజార్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ సహా 26 దేశాల అగ్రనేతలు బీజింగ్లో జరిగిన ఈ విక్టరీ పరేడ్లో ముఖ్య అతిథులుగా పాల్గొని పరేడ్లో అత్యాధునిక ఆయుధ సంపత్తిని స్వయంగా తిలకించారు. పరేడ్కు హాజరైనవారు..లేజర్ వెపన్, అండర్వాటర్ డ్రోన్లుపెద్ద హెచ్జెడ్–155 రకం వాహనంపై నుంచి ప్రయోగించే శ్వేతవర్ణ భారీ ఎల్వై–1 లేజర్ ఆయుధాన్ని చైనా ప్రదర్శించింది. ఇది శత్రువుల ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలను ముక్కలు ముక్కలుగా కోసేస్తుంది. ఇది సముద్రజలాలపై యుద్ధ్దరీతులను మార్చేయడం ఖాయమని చైనా రక్షణనిపుణులు చెప్పారు. దీంతోపాటు గాల్లోంచి ప్రయోగించి చిన్నపాటి జేఎల్–1 అణ్వస్త్రసామర్థ్యమున్న క్షిపణిని ప్రదర్శించారు. దీంతోపాటు ఇదే సామర్థ్యమున్న ఇతర వేరియంట్లు డీఎఫ్–51, డీఎఫ్–31లనూ చూపించారు. వైజే–17 యాంటీషిప్ మిస్సైల్, డీఎఫ్–61 క్షిపణి, 5,000 కి.మీ.ల దూరాలను ఛేదించే డీఎఫ్–26డీ మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రదర్శించారు. యుద్ధవిమానాలు జే–20, జే–20ఏ, జే–20ఎస్, జే–35ఏలను ప్రదర్శించింది. తమ జాడ శత్రువులకు చిక్కకుండా రహస్యంగా ఎగిరొచ్చే( స్టెల్త్ సామర్థ్యమున్న) ఐదో తరం అన్ని వేరియంట్ల యుద్ధవిమానాలను ఇలా ఒకే పరేడ్లో ప్రదర్శించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో జే–20ఏ మోడల్ యుద్ధవిమానంలో మాత్రమే ఇద్దరు పైలట్లు కూర్చునే వీలుంది. ఇవిగాక సీజే–1000 వాహనం నుంచి ప్రయోగించే సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి, నౌక నుంచి ప్రయోగించే క్రూయిజ్ మిస్సైల్, గగనతలం నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులనూ ప్రదర్శించారు. నీటిలో నిఘా అవసరాలకు వాడే డ్రోన్లనూ చూపించారు. హెచ్క్యూ20, హెచ్క్యూ–22ఏ, హెచ్క్యూ–29 వంటి గగనతల రక్షణ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ ప్రదర్శించారు. హైపర్సోనిక్ గ్లౌడ్ క్షిపణిని సైతం అడ్డుకునే హెచ్క్యూ–19 గగనతల రక్షణ వ్యవస్థను ప్రదర్శించారు. టైప్–100 యుద్ధ ట్యాంక్ను ప్రదర్శించింది. ఈ ట్యాంక్ను అత్యంత తెలివైన ట్యాంక్గా చెబుతారు. సమన్వయం చేసుకొంటూ దాడులు చేయగలదని చైనా పేర్కొంది. 12,000 కిలోమీటర్లు ప్రయాణించే డాంగ్ఫెంగ్–61 ఖండాంతర క్షిపణిని ప్రదర్శించింది. 60 అడుగుల పొడవైన సముద్ర డ్రోన్ ‘ఏజేఎక్స్002’ ఈసారి పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లాంగ్ రేంజ్ బాంబర్లు సైతం బీజింగ్ గగనతలంపై చక్కర్లు కొట్టాయి. నౌకలను నీటిలో ముంచేసే క్షిపణులను ఈ బాంబర్ నుంచి ప్రయోగించవచ్చు. హెచ్ఎస్యూ 100 అండర్వాటర్ డ్రోన్నూ చూపించారు. కృత్రిమ మేధ సాయంతో దాడిచేసే డ్రోన్లు, జీజే–11 స్టెల్త్ డ్రోన్లను సైతం ప్రదర్శించారు. -
చైనా విక్టరీ డే వేడుక.. అధునాతన భారీ ఆయుధ ప్రదర్శన
బీజింగ్: డ్రాగన్ దేశం చైనాలో ప్రతి ఏటా జరిగే విక్టరీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విక్టరీ డే సందర్భంగా చైనా.. తొలిసారి అధునాతన ఆయుధాలను ప్రదర్శించింది. ఇక, ఈ ప్రదర్శనను రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తిలకించారు. చైనా విక్టరీ డే వేడుకల్లో పలు దేశాల నేతలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇక, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయానికి గుర్తుగా చైనా ఏటా విక్టరీ డే వేడుకలు జరుపుకుంటోంది. చైనాలోని తియానన్మెన్ స్వ్కేర్ విక్టరీ వేడుకలు జరుగుతున్నాయి. ఇక, 80వ వార్షికోత్సవానికి 26 దేశాలకు చెందిన అధినేతలు విచ్చేశారు. భారీ భద్రత నడుమ నిర్వహిస్తున్న విక్టరీ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వీక్షించేందుకు దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా తొలిసారి అధునాతన ఆయుధాలను చైనా ప్రదర్శించింది. యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామగ్రి ప్రదర్శించింది. BREAKING: Xi Jinping, Vladimir Putin, and Kim Jong Un have arrived for the start of China's biggest ever military paradeWatch live: https://t.co/95pL7zkMJV📺 Sky 501, Virgin 602 pic.twitter.com/y4mkyVP4Ii— Sky News (@SkyNews) September 3, 2025అత్యాధునిక ఆయుధాలు..ఈ క్రమంలో ప్రపంచానికి తన బలాన్ని చూపించేందుకు.. తొలిసారిగా హైప్రొఫైల్ ఆయుధాలను చైనా ప్రదర్శించింది. నాల్గోతరం ప్రధాన యుద్ధ ట్యాంకర్ తొలి నమునాను ఇక్కడ ఆవిష్కరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అధునాతన ఆయుధాలు, అత్యాధునిక మానవరహిత పరికరాలు, హైపర్సోనిక్ వంటి క్షిపణులను ప్రదర్శించిన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ దేశీయంగా తయారైనవేనని, ఇప్పటికే వినియోగంలో ఉన్నట్లు చైనా సైనిక వర్గాలు వెల్లడించాయి. గగనతల రక్షణ వ్యవస్థలు, వ్యూహాత్మక క్షిపణులు కూడా ప్రదర్శనలో ఉంచనున్నట్లు సమాచారం. తద్వారా ప్రపంచానికి తన సైనిక శక్తిని చాటే ప్రయత్నాలు డ్రాగన్ చేస్తున్నట్లు తెలుసింది.⚡️📸 World leaders pose for a group photo at China’s military parade commemorating the 80th anniversary of the end of World War II. pic.twitter.com/Ah78o5IzXc— Sputnik (@SputnikInt) September 3, 2025మరోవైపు, ఈ భారీ సైనిక కవాతు చైనా-జపాన్ల మధ్య వివాదంగా మారింది. ఈ వేడుకలో పాల్గొనొద్దని ప్రపంచ నాయకులను టోక్యో కోరింది. జపాన్ చేసిన ఈ అభ్యర్థనపై చైనా దౌత్యపరమైన నిరసనను తెలియజేసింది. తియాన్జిన్లో జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన నేతలందరూ ఇందులో పాల్గొంటారని తెలిపింది. ఇక, 66 సంవత్సరాలలో చైనా విక్టరీ వేడుకలకు హాజరైన మొదటి ఉత్తర కొరియా అధ్యక్షుడిగా కిమ్ జోంగ్ ఉన్ రికార్డుల్లోకి ఎక్కాడు. Today marks China's grand military parade commemorating the 80th anniversary of the victory in the World Anti-Fascist War. pic.twitter.com/4i6XK66amV— Silver(互FO) (@cobra08101) September 3, 2025 -
జిన్పింగ్ కుడి భుజం కైక్వీతో మోదీ చర్చలు.. ‘నవ్వని వ్యక్తి’తో నెగ్గుకొచ్చారా?
బీజింగ్: కైక్వీ.. కమ్యూనిస్ట్ చైనాలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు కుడిభుజంగా పేరొందిన కైక్వీ అంటే అపరచాణిక్యుడనే పేరు. అటు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీపీ)లో అగ్రగణ్యునిగా కొనసాగుతూనే ఇటు ప్రభుత్వంలోనూ కీలక పదవుల్లో అవలీలగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిన్పింగ్కు తల్లో నాలుకలా వ్యవహరిస్తూ జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడూ సీరియస్గా కనిపిస్తారు. ఆయన నవ్వడం ఎవరూ చూడలేదని చైనా రాజకీయవర్గాల్లో ఓ మాట వినిపిస్తుంది.విదేశాల నుంచి జిన్పింగ్ను కలిసేందుకు ఎందరో దౌత్యాధికారులు వచ్చినా తర్వాత కైక్వీని కలిసి ప్రసన్నంచేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆయన ఎవరినీ కలవరు. ఇటీవల షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర భేటీ కోసం తియాంజిన్ తీరనగరానికి విచ్చేసిన ఎస్సీఓ అగ్రనేతలు, దౌత్యవేత్తలు తనను కలవాలని చూసినా కైక్వీ ససేమిరా అన్నారట. అలాంటి కైక్వీ ప్రత్యేకంగా భారత ప్రధాని మోదీతో 45 నిమిషాలకుపైగా విడిగా మాట్లాడిన వార్త ఇప్పుడు చైనా వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.చైనాలో జిన్పింగ్ శకం ముగిసి కైక్వీ భావ చైనా అధ్యక్షుడు కావొచ్చనే వాదన సైతం మొదలైంది. అందుకే కైక్వీతో మోదీ భేటీని జిన్పింగ్ స్వయంగా ఏర్పాటుచేశారని తెలుస్తోంది. గల్వాన్ ఘటన తర్వాత దెబ్బతిన్న భారత్, చైనా బంధాన్ని మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడమే లక్ష్యంగా కైక్వీని కలవాలని మోదీకి జిన్పింగ్ సూచించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరుదేశాల మధ్య బంధాన్ని పటిష్టపర్చి మరింత మెరుగైన ఆర్థిక, దౌత్య సంబంధాల కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు వార్తలొచ్చాయి. ఎవరీ కైక్వీ? చైనా కమ్యూనిస్ట్ పారీ్టలో అత్యున్నత నిర్ణాయక మండలిలో ఈయన సీనియర్సభ్యునిగా ఉన్నారు. పార్టీ పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీలో ఐదో అత్యున్నత నేతగా కొనసాగుతున్నారు. జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడుగా పేరొందారు. జిన్పింగ్కు చీఫ్ ఆఫ్ స్టాఫ్గానూ కైక్వీ మరో పదవిలో కొనసాగుతున్నారు. మావో తర్వాత చైనాలో ఇలా రెండు, మూడు పదవుల్లో ఏకకాలంలో కొనసాగుతున్న వ్యక్తి ఈయనే కావడం విశేషం. చైనాలోని అధికార క్రమంలో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ జిన్పింగ్తో ఉన్న అత్యంత దగ్గరి రాజకీయ సాన్నిహిత్యం కారణంగా తదుపరి దేశాధ్యక్షుడు ఇతననే వాదన సైతం బలంగా వినిపిస్తోంది.ఫుజియాన్ ప్రావిన్స్లోని యూక్సీ కౌంటీలో జన్మించిన ఈయ తొలిసారిగా 1980వ దశకంలో జిన్పింగ్ను కలిశారు. 1975లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. సాన్మింగ్, ఖ్వుజోయూ, హాంగ్జోయూ నగరాలకు మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. 2016లో బీజింగ్ నగరానికి తాత్కాలిక మేయర్గా పనిచేశారు. ప్రస్తుతం చైనా ప్రభుత్వంలో, పార్టీలో ఏ స్థాయి ర్యాంక్లో కొనసాగుతున్నాసరే కైక్వీ మాట చెల్లుబాటు అవుతుందని తెలుస్తోంది. పార్టీ జనరల్ ఆఫీస్కి డైరెక్టర్గానూ ఉన్నారు. జిన్పింగ్ను అందరి ఎదుట కైక్వీ ‘అంకుల్’, ‘బాస్’అని పిలుస్తారు. -
స్నేహబంధం బలోపేతం
బీజింగ్: అమెరికా విసిరిన టారిఫ్ల సవాళ్లతో ఇక్కట్లు ఎదురవుతున్న వేళ చైనా, రష్యా తమ చిరకాల స్నేహబంధాన్ని మరింత బలపరుచుకుంటు న్నాయి. చైనాలోని తియాంజిన్లో సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు జరిగిన మర్నాడే ఇరు దేశాలు మంగళవారం మరోసారి సమావేశమై ద్వైపాక్షిక చర్చలు చేపట్టాయి. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చర్చల కోసం రాజధాని బీజింగ్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్కు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సాదర స్వాగతం పలికారు.పుతిన్ను ‘చిరకాల మిత్రుని’గా అభివర్ణించారు. పుతిన్ సైతం తన ప్రసంగంలో జిన్పింగ్ను ప్రియ స్నేహితునిగా సంబోధించారు. ‘నాడు మేము కలిసే ఉన్నాం.. ఇప్పుడు కూడా కలిసే ఉంటాం’అని పుతిన్ చెప్పుకొచ్చారు. ఇరు దేశాధినేతల లాంఛన సమావేశం అనంతరం చైనా అధికార కేంద్ర స్థానమైన ఝోంగన్హాయ్లో ఇరుపక్షాల ఉన్నతాధికారుల మధ్య తేనీటి విందు భేటీ జరిగింది.రష్యా పర్యాటకులకు ఈ నెల నుంచి 30 రోజులపాటు వీసారహిత సదుపాయం కల్పించనున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే చైనాకు మరో సహజవాయు పైప్లైన్ను నిర్మించేందుకు ఆ దేశంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు రష్యా ప్రభుత్వరంగ చమురు సంస్థ గాజ్ప్రోం సీఈఓ అలెక్సీ మిల్లర్ తెలిపారు. ప్రస్తుత పైప్లైన్ మార్గాల ద్వారా సహజవాయు సరఫరాను మరింత పెంచేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి. -
కలసికట్టుగా ముందుకెళ్దాం... చైనాలోని తియాంజిన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్తో భేటీ
-
భద్రత, శాంతితోనే అభివృద్ధి
తియాంజిన్: షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) పట్ల భారత్ వైఖరి, విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఎస్ అంటే సెక్యూరిటీ(భద్రత), సీ అంటే కనెక్టివిటీ(అనుసంధానం), ఓ అంటే అపర్చునిటీ(అవకాశం) అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశ అభివృద్ధికైనా భద్రత, శాంతి, స్థిరత్వమే పునాది అని వెల్లడించారు. ప్రపంచ దేశాల పురోగతికి ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఎన్నో సవాళ్లు విసురుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై పోరాటం చేయడం మానత్వం పట్ల మన బాధ్యత అని సూచించారు. చైనాలోని తియాంజిన్లో ఎస్సీఓ సదస్సులో రెండో రోజు సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రాంతీయ అభివృద్ధికి అనుసంధానం అత్యంత కీలకమని చెప్పారు. అనుసంధానం దిశగా జరిగే ప్రతి ప్రయత్నమూ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా ఉండాలని సూచించారు. ఎస్సీఓ చార్టర్లోని మూలసూత్రాల్లో ఇది కూడా ఒక భాగమేనని గుర్తుచేశారు. కాలం చెల్లిన విధానాలు వద్దు ఎస్సీఓ కింద ‘సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్’ ఏర్పాటు చేసుకుందామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఘనమైన మన ప్రాచీన నాగరికతలు, కళలు, సాహిత్యం, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై పరస్పరం పంచుకోవడానికి ఈ ఫోరమ్ తోడ్పడతుందని అన్నారు. దక్షిణార్ధ గోళ దేశాలు(గ్లోబల్ సౌత్) మరింత వేగంగా ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. కాలం చెల్లిన విధానాలతో అనుకున్న లక్ష్యం సాధించలేమని చెప్పారు. ఇంకా వాటినే నమ్ముకొని ఉండడం భవిష్యతు తరాలకు అన్యాయం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించుకోవాలని సూచించారు. భారతదేశ ప్రగతి ప్రయాణాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంస్కరణ, పనితీరు, మార్పు అనే మంత్రంతో తమదేశం ముందుకు సాగుతోందన్నారు. విస్తృత స్థాయిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, దీనివల్ల జాతీయ అభివృద్ధికి, అంతర్జాతీయ సహకారానికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామిగా మారాలంటూ ఎస్సీఓ సభ్య దేశాలను మోదీ ఆహా్వనించారు. ముష్కరులను పోషించడం మానుకోవాలి ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం కొన్ని దేశాలు ఇకనైనా మానుకోవాలని ప్రధాని మోదీ పరోక్షంగా పాకిస్తాన్కు హితవు పలికారు. ముష్కర మూకలను పెంచిపోíÙస్తే మొత్తం మానవళికి ముప్పు తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదని అన్నారు. తాము క్షేమంగా ఉన్నామని ఏ ఒక్కరూ అనుకోవడానికి వీల్లేదన్నారు. కలిసికట్టుగా పోరాడితేనే ఉగ్రవాదం అంతమవుతుందని ఉద్ఘాటించారు. అల్ఖైదా, అని అనుబంధ గ్రూప్లపై యుద్ధం ప్రారంభించామని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడిని కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇది కేవలం భారత్పై జరిగిన దాడి కాదని, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్క దేశానికీ, ప్రతి పౌరుడీకి ఒక సవాల్ అని పేర్కొన్నారు. పహల్గాం దాడి సమయంలో భారత్కు అండగా నిలిచిన దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ఎస్సీఓ
తియాంజిన్: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యదేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఈ మేరకు సోమవారం ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం, సానుభూతి ప్రకటించారు. ఈ హేయమైన ఘటనకు కారణమైన ముష్కరులను, వారి పోషకులను, కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇలాంటి ఘాతుకాలను సహించడానికి ఎంతమాత్రం వీల్లేదన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరాటానికి కట్టుబడి ఉన్నామని వారు ఉద్ఘాటించారు. ఉగ్రవాద, వేర్పాటువాద, తీవ్రవాద శక్తులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయానికొచ్చారు. అలాంటి శక్తులను స్వలాభం కోసం ఎవరూ వాడుకోకుండా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. బెల్డ్ అండ్ రోడ్ను తప్పుపట్టిన మోదీ చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ కార్యక్రమం(బీఆర్ఐ) పట్ల ఎస్సీఓ సదస్సు వేదికగా ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి అనుసంధాన ప్రాజెక్టులు ఇతర దేశాల జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఉండాలని చెప్పారు. ఏ కార్యక్రమం అయినా సరే నమ్మకం, విశ్వసనీయత పెంచుకొనేలా ఉండాలి తప్ప తగ్గించుకొనేలా ఉండొద్దన్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్ను అనుసంధానిస్తూ బీఆర్ఐని చైనా ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగమైన చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గుండానే వెళ్తోంది. దీన్ని భారత్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. -
ఉమ్మడిగా ముందుకెళ్దాం
తియాంజిన్: ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు భారత్–రష్యా సంబంధాలే మూలస్తంభమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం రెండు దేశాలు భుజం భుజం కలిపి పనిచేస్తాయని, ఉమ్మడిగా ముందుకెళ్తాయని అన్నారు. చైనాలోని తియాంజిన్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం రష్యా అధినేత పుతిన్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థికం, ఇంధనం, ఎరువులు, వాణిజ్యం, అంతరిక్షం, సాంస్కృతిక, భద్రత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు జరిగాయి. పుతిన్తో సమావేశం అనంతరం మోదీ మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్లో పుతిన్ ఇండియాలో పర్యటించబోతున్నారని, ఆయనకు స్వాగతం పలకడానికి 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. భారత్, రష్యా మధ్యనున్న ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని చెప్పారు. భారత్–రష్యా బంధం కేవలం ఇరుదేశాల ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా కీలకమేనని వివరించారు. అది మానవాళి కోరిక ఉక్రెయిన్లో శాంతి సాధన కోసం ఇటీవల జరిగిన ప్రయత్నాలను మోదీ స్వాగతించారు. ఉక్రెయిన్లో ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరపడాలని ఆకాంక్షించారు. ఇందుకోసం భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించాలన్నారు. అక్కడ యుద్ధం ముగిసి, శాశ్వత శాంతి నెలకొనాలన్నది మొత్తం మానవాళి కోరిక అని ఉద్ఘాటించారు. పుతిన్తో భేటీ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కారులో పుతిన్తో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోను షేర్ చేశారు. రష్యా అధ్యక్షుడితో అద్భుతమైన చర్చ జరిగిందని పేర్కొన్నారు. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నామని వివరించారు. బహుముఖ సంబంధాల్లో చురుగ్గా పురోగతి: పుతిన్ భారత్తో బంధానికి ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పుతిన్ పునరుద్ఘాటించారు. భారత్–రష్యా సంబంధాలు ప్రత్యేక, విశేష వ్యూహా త్మక భాగస్వామ్యం స్థాయికి చేరడం ఆనందంగా ఉందన్నారు. రెండు దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. రెండు దేశాల బహుముఖ సంబంధాలు చురుగ్గా పురోగతి సాధిస్తూనే ఉంటాయన్నారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు పూర్తి సానుకూలంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బహుళ స్థాయి సహకార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, రెండు దేశాల మధ్య పర్యాటకుల మారి్పడి నానాటికీ వృద్ధి చెందుతోందని, ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, జీ20, ఎస్సీఓ తదితర అంతర్జాతీయ వేదికలపై సన్నిహితంగా, సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని పుతిన్ వెల్లడించారు. ముఖ్యమైన రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షికబంధంపై మోదీ, పుతిన్ సంతృప్తి వ్యక్తంచేశారని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇరుదేశాల మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని వారు నిర్ణయానికొచ్చినట్లు పేర్కొంది. ఒకే కారులో మోదీ, పుతిన్ ప్రయాణం తియాంజిన్లో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యాలో తయారైన అరుస్ లిమోజిన్ కారులో ఇరువురు నేతలు ఎస్సీఓ సదస్సు వేదిక నుంచి రిట్జ్–కార్ల్టన్ హోటల్కు చేరుకున్నారు. ఇరువురు నేతలు ఒకే కారులో కలిసి ప్రయాణించడం, సన్నిహితంగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ, పుతిన్ మధ్య వ్యక్తిగత, వ్యూహాత్మక స్నేహ సంబంధాలకు ఈ ఘటన నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. పుతిన్తో సంభాషణ ఎల్లప్పుడూ అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. మోదీతో కలిసి ప్రయాణించాలని మొదట పుతిన్ కోరుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మోదీ రాక కోసం ఆయన ఎస్సీఓ వేదిక వద్ద 10 నిమిషాల పాటు వేచి చూశారు. హోటల్కు చేరుకున్న తర్వాత కూడా కారులోనే 45 నిమిషాలపాటు మాట్లాడుకోవడం విశేషం. అనంతరం హోటల్ లోపల ద్వైపాక్షిక సమావేశం జరిగింది. అంతకుముందు ఎస్సీఓ వేదిక వద్ద మోదీని పుతిన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. పుతిన్ను కలుసుకోవడం నాకు సదా ఆనందదాయకం అని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మోదీ, పుతిన్, చైనా అధినేత జిన్పింగ్ కలిసి ఉన్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
హతవిధి.. పాక్ ప్రధానికి ఘోర పరాభవం!
2025లో చైనా తియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు గురించి ప్రపంచమంతా ఇప్పుడు చర్చించుకుంటోంది. ట్రంప్ టారిఫ్ వార్, ఉక్రెయిన్ శాంతి చర్చల అంశాలతో పాటు పహల్గాం దాడి విషయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. భారత దేశానికి మద్దతుగా సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానం సైతం చేయడం ప్రధానంగా నిలిచాయి. అయితే.. ఈ సదస్సు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు ఈ సమ్మిట్లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కారణంగా కాగా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ చేస్తూ పాక్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. షరీఫ్ అంతర్జాతీయంగా అవమానానికి గురయ్యారన్నది ఆ పోస్టుల సారాంశం. అందుకు కారణం లేకపోలేదు.. వేదికపై ఆతిథ్య దేశాధినేత సహా మిగతా ప్రపంచాధినేతలెవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాదు కాదు.. అసలు పట్టన్నట్లు వ్యవహరించడమే పెద్దగా హైలైట్ అయ్యింది. అవి ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને નીચે જોવા જેવી સ્થિતિ પેદા થઈRead more at: https://t.co/xr1jIGM2b2#PMModiSCOsummit2025 #NarendraModi #PMModi #ShehbazSharif #VladimirPutin #SCOsummit2025 #SCOsummitinChina #XiJinping #Reels #shorts #newskida #treeshinewskida pic.twitter.com/NxjZc9wc6W— NewsKida (@TreeshiNewsKida) September 1, 2025భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని షరీఫ్ను అసలు పట్టించుకోలేదు. మోదీ-పుతిన్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. షరీఫ్ బిక్కముఖం వేసుకుని పలకరించలేదే అన్నట్లు చూస్తూ ఉండిపోయారు. పైగా మోదీ తన ప్రసంగంలో పహల్గాం దాడి గురించి మాట్లాడిన ఆయన.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయంటూ పాక్నే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం సాగినంత సేపు అక్కడే ఉన్న షరీఫ్ ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది!. PM Modi, Putin, Xi Jinping and Shehbaz Sharif meetup in SCO Summit 2025😭🤣#SCOSummit pic.twitter.com/MKnj7TjCO1— Bruce Wayne (@_Bruce__007) September 1, 2025ఇక.. పుతిన్ను కలవాలన్న షరీఫ్ ఉత్సాహం.. అవమానాన్నే మిగిల్చింది. సదస్సు ముగిశాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కరచలనం చేయడానికి షరీఫ్ కంగారుగా పరిగెత్తుతూ కనిపించారు. పుతిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో షరీఫ్ మురిసిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. షరీఫ్ను చూసి పూర్తిగా పట్టన్నట్లు ప్రవర్తించారు. అయితే కాసేపటికే పుతిన్ మరోసారి ఆయన్ని పలకరించారు.आतंक पर बड़ी चोट कर रहे थे PM मोदी, सुन रहे थे पाक पीएम शहबाज शरीफ#PMModi #ShehbazSharif #PMModiInChina #SCOSummit2025 #Pakistan pic.twitter.com/EU2UkhZCq1— One India News (@oneindianewscom) September 1, 2025Shehbaz Sharif after seeing Xi and Putin with Modi while ignoring him 😭 pic.twitter.com/fDlEIEQDor— Fazal Afghan (@fhzadran) September 1, 2025 Pakistan PM Shehbaz Sharif Serving Juice to @narendramodi and #Putin Nice Gesture 🙌 #NarendraModi #ShehbazSharif #SCOSummit #SCOSummit2025 pic.twitter.com/R1eZEni9M7— SATYA ᴿᶜᴮ 🚩 (@sidhufromnaayak) September 1, 2025 ఇక సదస్సు ముగిసిన తర్వాత.. గ్రూప్ ఫొటో సమయంలోనూ షరీఫ్కూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మోదీకి ఎక్కడో ఎనిమిది మంది దేశాధినేతల అవతల నిలబెట్టారు. అంతెందుకు.. చైనా, పాకిస్తాన్కు దశాబ్దాలుగా మిత్ర దేశం అయినప్పటికీ.. ఈ సదస్సులో షరీఫ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొసమెరుపు. దీంతో.. షాంగై సదస్సు ఏమోగానీ పాక్ ప్రధాని పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా కనిపించిందని కొందరు నెటిజన్స్ అభివర్ణించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకువేసి.. పుతిన్-మోదీ-జిన్పింగ్ భేటీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, ఇటు పాక్ షరీఫ్కు పీడకలను మిగిల్చే అవకాశం ఉందంటూ జోకులు పేలుస్తున్నారు. ట్విటర్, రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి ఫేమస్ ఫ్లాట్ఫారమ్లలో మీమ్స్, ట్రోలింగ్ ముంచెత్తాయి. మిత్ర హస్తం అవతలి వాళ్లు అందించాలే తప్ప.. అడుక్కోకూడదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుతిన్తో కరచలనం కోసం ఓ బిచ్చగాడిలా ప్రవర్తించారంటూ పాక్ ప్రజలే ఆయన్ని దెప్పి పొడుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్కు, ఆ దేశ ప్రధానికి ఉన్న ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చా జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పాక్ మీడియా షరీఫ్ను గ్లోబల్ పవర్హౌజ్ అంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..
చైనాలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల టియాంజిన్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం మోదీ కోసం ఆ దేశంలోని ప్రతిష్టాత్మక వాహనంగా ఉన్న ‘హాంగ్కీ ఎల్ 5’ను ఏర్పాటు చేసింది. దీనికి చైనాలో అత్యంత ప్రముఖమైన, ప్రభుత్వ లగ్జరీ కారుగా గుర్తింపు ఉంది.హాంగ్కీ ఎల్ 5 ప్రత్యేకతలుహాంగ్కీ అంటే మాండరిన్ భాషలో ‘రెడ్ ఫ్లాగ్’ అని అర్థం.ఇది చైనా పురాతన ప్యాసింజర్ కార్ బ్రాండ్. దీన్ని 1958లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ (ఎఫ్ఎడబ్ల్యు) ప్రారంభించింది.ఎల్ 5 మోడల్ను చైనా అగ్రనేతల కోసం, ఎంపిక చేసిన విదేశీ ప్రముఖుల కోసం రిజర్వ్ చేశారు.అమెరికా అధ్యక్షుడు ప్రయానించే ‘బీస్ట్’కు ఆ దేశంలో ఎంత గుర్తింపు ఉంటుందో.. చైనాలో ‘హాంగ్కీ ఎల్ 5’కు అంత గుర్తింపు ఉంటుంది.5.5 మీటర్ల పొడవు ఉండే ఈ కారు బరువు 3 టన్నుల కంటే ఎక్కువే. దీని విలువ సుమారు రూ.7 కోట్లు (సుమారు 8 లక్షల డాలర్లు)గా ఉంటుందని అంచనా. ఇందులో లెదర్, హ్యాండ్క్రాఫ్ట్ కలపతో ఇంటీరియర్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖులు సంభాషణకు సురక్షితమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: వారెన్ బఫెట్ పంచ సూత్రాలు.. -
పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చిన ప్రధాని మోదీ
-
SCO సదస్సులో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ
-
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
సరిహద్దు ఉగ్రవాదం భారత్, చైనా దేశాలపై ప్రభావం చూపుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికి, శాంతికి ముప్పుగా పరిణమించిందని తియాన్జిన్ వేదికగా సోమవారం జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు‘‘ఉగ్రవాద సమస్యలతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి. ఎస్సీవో సభ్య దేశంగా భారత్ కీలక భూమిక పోషిస్తోంది. ఎస్సీవో కోసం భారత్ విజన్, పాలసీ 3 పిల్లర్లపై ఆధారపడి ఉంది. భద్రత, అనుసంధానం, అవకాశాలు 3 పిల్లర్లుగా నిలుస్తాయి. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు 2025(SCO Summit)లో మోదీ ప్రసంగించారు.సరిహద్దు ఉగ్రవాదం భారత్తో పాటు చైనాపైనా ప్రభావం చూపుతోంది. ఇరు దేశాలకూ ఇదొక సవాల్గా మారిందని మోదీ స్పష్టం చేశారు.ఈ సమస్యను ఎదుర్కొనడానికి పరస్పర సహకారం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగితేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. పాక్ ప్రధానిపై విసుర్లుSCO సదస్సు వేదికలో పాకిస్తాన్పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపం. అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదు అని స్పష్టం చేశారు. ‘‘ఆ సమయంలో కొన్ని దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలకు మా కృతజ్ఞతలు. అలాగే.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలను మేం అంగీకరించబోం’’ అని వ్యాఖ్యానించారాయన. భద్రత ప్రతి దేశ హక్కు. ఉగ్రవాదం మనమందరికీ సవాల్. ఇది కేవలం భారత్కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు. SCO సభ్యదేశాలు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండించాలి. అంతర్జాతీయంగా ఏకతా అవసరమని మోదీ పిలుపునిచ్చారు. ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అక్కడే ఉన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పాక్కు అపమానకరమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకు ముందు.. సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతలను ఆప్యాయంగా పలకరించిన మోదీ.. పాక్ ప్రధాని వైపు కనీసం కన్నెత్తి చూడలేదు.పాక్ పేరు లేకుండానే.. సదస్సు ముగింపు ప్రకటనలో చైనా సహా యూరేషియన్(యూరప్+ఆసియా సమాహారం) దేశాలు భారత్ వైపు నిలిచాయి. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. ఎస్సీవో సదస్సులో తీర్మానం చేశాయి. అయితే.. అందులో ఎక్కడా పాకిస్థాన్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. చైనా, టర్కీ సహా పలు దేశాలు పహల్గాం బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశాయి. దాడికి పాల్పడినవారిని శిక్షించాలని వేదిక నుంచి గళం వినిపించాయి. ఉగ్రవాదం, విభజనవాదం, తీవ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని సభ్యదేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అదే సమయంలో.. పాక్లో జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్, ఖుజ్దార్ దాడులను కూడా ఖండించాయి.మరోవైపు.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్, చైనా అధినేతలు చర్చించుకున్నారు. ఈ విషయంలో భారత్ చైనా మద్దతు కోరగా.. చైనా అందుకు అంగీకరించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. -
షాంఘై సదస్సు.. పాక్ ప్రధానికి మోదీ ఝలక్
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో ఉన్నారు. చైనాలోని తియాన్జిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 25వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఎస్సీవో సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఈ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.తియాన్జిన్ వేదికగా జరుగుతున్న సదస్సుల్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సైతం ఉన్నారు. అయితే, ప్రధాని మోదీ మాత్రం పాక్ ప్రధానిని పట్టించుకోలేదు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను పలకరించలేదు. షాంఘై సదస్సులో భారత్, పాక్ ప్రధానులు ఎదురుపడినప్పటికీ మోదీ మాత్రం పలకరించలేదు. అయితే, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత మొదటిసారిగా మోదీ, షరీఫ్ ఎదురుపడ్డారు.Watch: Pakistan PM Shahbaz Sharif looks on as PM Modi, Russian President Putin walks past him at the SCO summit pic.twitter.com/aqIMQBuI6v— Sidhant Sibal (@sidhant) September 1, 2025మరోవైపు.. ఇదే వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాత్రం ప్రధాని మోదీ ఎంతో ఆత్మీయతతో ఉన్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్ను ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకించారు. షేక్హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పుతిన్ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’ అని రాసుకొచ్చారు. ఇక, జిన్పింగ్, పుతిన్తో మాట్లాడిన ఫొటోలను పోస్టు చేశారు. ఇదే సమయంలో తియాన్జిన్లో చర్చలు కొనసాగుతున్నాయి అని పేర్కొన్నారు.Always a delight to meet President Putin! pic.twitter.com/XtDSyWEmtw— Narendra Modi (@narendramodi) September 1, 2025మరోవైపు.. ఈ సదస్సు అనుబంధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ ద్వైపాక్షికంగా సమావేశం కానున్నారు. రష్యా చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్పై ట్రంప్ అదనపు సుంకాలు, ఉక్రెయిన్పై మాస్కో యుద్ధం వంటి పరిణామాల వేళ వీరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టారిఫ్ల అంశంపై వీరిద్దరూ చర్చించుకునే అవకాశం ఉంది. #WATCH | Prime Minister Narendra Modi, Chinese President Xi Jinping, Russian President Vladimir Putin, and other Heads of States/Heads of Governments pose for a group photograph at the Shanghai Cooperation Council (SCO) Summit in Tianjin, China.(Source: DD News) pic.twitter.com/UftzXy6g3K— ANI (@ANI) September 1, 2025 -
Modi in China: షాంఘై శిఖరాగ్ర సమావేశం ప్రారంభం.. నేడు ప్రధాని మోదీ ప్రసంగం
తియాన్జిన్: షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు ఆదివారం రాత్రి తియాన్జిన్లో ప్రారంభమయ్యింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ విందు కార్యక్రమంతో సదస్సు మొదలయ్యింది. నేడు సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.జిన్పింగ్ ఇచ్చిన విందు కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా వివిధ దేశాధినేతలు పాల్గొన్నారు. కూటమి దేశాల మధ్య ఐక్యతను, సహకారాన్ని పెంపొందించి, పురోగమనంలోకి పయనించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని జిన్పింగ్ పేర్కొన్నారు. దక్షిణార్థగోళ దేశాల బలాన్ని పెంపొందించేందుకు, మానవ నాగరికత మరింత పురోగమించడానికి వీలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా 20 మంది విదేశీ నేతలను, 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులను ఈ సదస్సుకు జిన్పింగ్ ఆహ్వానించారు.సోమవారం వీరంతా కీలక సమావేశంలో పాల్గొననున్నారు. వేదికపై మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చైనాతో సంబంధాలపై ఆయన ఈ సదస్సులో మాట్లాడే అవకాశం ఉంది. మోదీ సహా వివిధ దేశాధినేతలు జిన్పింగ్తో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కాగా షాంఘై సహకార సంస్థ సదస్సులో వివిధ దేశాలు అభివృద్ధిపై వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు, భద్రత, ఆర్థిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. PM Modi, President Putin and President Xi shared a light moment on the sidelines of the SCO Summit in China. pic.twitter.com/pEpAdF4qYi— Tar21Operator (@Tar21Operator) September 1, 2025 -
మీ బోర్డర్ దాటి వస్తున్న పాక్ టెర్రరిస్టుల సంగతేంటి?
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఇందులో చైనా సరిహద్దుల నుంచి భారత్లోకి చొరబడుతున్న పాక్ టెర్రరిస్టుల అంశాన్ని కూడా ప్రధాని మోదీ.. జిన్పింగ్ వద్ద ప్రస్తావించారు. అయితే దీనికి చైనా తన సంపూర్ణ మద్దతును భారత్కు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ‘ జిన్పింగ్ వద్ద పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను కూడా మోదీ ప్రస్తావించారు. ఇందుకు చైనా సానుకూలంగా స్పందించింది. టెర్రర్ కార్యకలాపాల వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని జిన్పింగ్ అన్నారు. ఎటువంటి ఉగ్రవాద చర్యల నిర్మూలనకైనా తమ మద్దతు ఉంటుందని జిన్పింగ్ అన్నారు. ఇరుదేశాలకు ప్రమాదంగా మారిన ఉగ్రవాద అంశాన్ని జిన్పింగ్ కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత్కు తమ వంతు సహకారం అందిస్తామన్నారు’ అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. టియాంజిన్ నగరంలో ఎస్సీవో సదస్సులో పాల్గొన్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయ శాంతి, ఆర్థిక స్థిరత్వం, సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపు, సాంకేతిక రంగాల్లో సహకారం పెంచుకునే వంటి అంశాలపై చర్చలు జరిగాయి.వాణిజ్య, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్-చైనా మధ్య స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతాయి అని ప్రధాని మోదీ తెలపడంతో ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడానికి అడుగులు పడ్డాయి. ఈ పర్యటన ద్వారా భారత్ తన ప్రాంతీయ ప్రాబల్యాన్ని చాటింది. ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. -
‘అసలు ట్రంప్కు బుర్ర ఉందని అనుకోవడం లేదు’
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఫుల్ స్టాప్ పడ్డ పలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా మోదీ.. చైనాలో అడుగుపెట్టారు. ఎప్పట్నుంచో భారత్తో సంబంధాల కోసం ఎదురుచూస్తున్న చైనా కూడా మోదీ పర్యటనకు ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంచితే, భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ సుంకాలను 50 శాతం పెంచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై చైనాకు చెందిన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు ఎయిమర్ టాన్జెన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నానని చెప్పుకుంటున్న ట్రంప్కు కనీసం బుర్ర ఉంటే భారత్పై ఆ విధంగా సుంకాలు విధించే వాడు కాదంటూ మండిపడ్డారు. ప్రపంచ మార్కెట్ పరంగా చూసినా, కార్మికుల పరంగా చూసినా భారత్ అతి పెద్దదని, అటువంటి దేశంపై ట్రంప్ విజ్ఞత లేకుండా వ్యవహరించి తప్పు చేశాడన్నారు . ట్రంప్ తన బెదిరింపులతో లొంగదీసుకోవాలనుకోవడం, అందులోనూ భారత్ లాంటి దేశంపై సుంకాలతో కాలు దువ్వడం వంటిది అమెరికాకే మంచిది కాదన్నారు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్పింగ్-మోదీల మధ్య జరుగుతున్న చర్చలతో మరో కొత్త శకం ఆరంభం కానుందన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ను బలవంతంగా లొంగిపోయేలా చేయాలనుకున్నారు. రష్యా ఆయిల్ కొంటే సుంకాలు విధించడం ఏంటి?,. భారత్ లాంటి దేశాన్ని తక్కువ చేసి చూడటం సమంజసం కాదనేది నా అభిప్రాయం. తెలివైన వారు ఎవరూ కూడా ఇలా వ్యవహరించరు. ట్రంప్ చర్య సరైనది కాదు. భారత్కు బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడే శక్తి ఉంది.. అవకాశం కూడా ఉంది’ అని ఎయిమర్ టాన్జెన్ స్సష్టం చేశారు. ఇదీ చదవండి: భారత్లోకి మళ్ళీ టిక్టాక్?: మొదలైన నియామకాలు -
భారత్లోకి మళ్ళీ టిక్టాక్?: మొదలైన నియామకాలు
భారతదేశంలో ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొంది.. ఇప్పుడు నిషేధంలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా యాప్ 'టిక్టాక్' ఉద్యోగుల కోసం ఎదురు చూస్తోంది. గురుగ్రామ్లోని ఆఫీసులో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు లింక్డిన్లో పోస్ట్ చేసింది. ఇందులో ఒకటి కంటెంట్ మోడరేటర్ (బెంగాలీ స్పీకర్), మరొకటి మంచి భాగస్వామ్యం.. కార్యకలాపాల లీడ్ కోసం. దీన్నిబట్టి చూస్తుంటే టిక్టాక్ మళ్ళీ భారత్లోకి అందుబాటులోకి రానుందా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.బైట్డాన్స్ యాజమాన్యంలోని షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ కంపెనీ వెబ్సైట్ ఇటీవల భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే.. దేశంలో టిక్టాక్ సేవలను తిరిగి ప్రారంభించడానికి కావలసిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయలేదని అధికారులు తెలిపారు. ఆగస్టు 22న, కూడా ఈ చైనా యాప్ భారతదేశంలో తిరిగి అనుమతించారనే వాదనలను అధికారులు తిరస్కరించారు.టిక్టాక్ వెబ్సైట్లోని ల్యాండింగ్ పేజీ ఓపెన్ చేయగానే.. భారతదేశంలో ఇది అందుబాటులో లేదని సందేశాన్ని ప్రదర్శించేది. కానీ గత వారం డెస్క్టాప్ ద్వారా యాక్సెస్ చేసినప్పుడు ఈ ప్లాట్ఫామ్కు సంబంధించిన 'అబౌట్ అస్' పేజీ కనిపించింది. అయితే ఎలాంటి వీడియోలు కనిపించలేదు.ఇదీ చదవండి: స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్: సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలాటిక్టాక్ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదు. "మేము భారతదేశంలో టిక్టాక్కు మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటిస్తూనే ఉన్నాము" అని టిక్టాక్ ప్రతినిధి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు.భారత.. చైనా దళాల మధ్య గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ భారతదేశం జూన్ 2020లో టిక్టాక్తో పాటు 58 ఇతర చైనీస్ యాప్లను నిషేధించింది. అయితే ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే సంకేతాలను కనిపిస్తున్నాయి. ఏడేళ్ల తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. చైనా సోషల్ మీడియా యాప్ మళ్ళీ అందుబాటులోకి వస్తుందేమో అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
పాక్ తో స్నేహం భారత్ తో గొడవ.. టారిఫ్ వార్ తో అమెరికాకు నష్టం..!
-
Modi China visit : ద్వైపాక్షిక సహకారంతోనే ప్రజా సంక్షేమం: ప్రధాని మోదీ
తియాంజిన్: ‘పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాము’ అని అధ్యక్షుడు జీ జిన్పింగ్తో చర్చల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇరుదేశాల ప్రజల సంక్షేమం ఈ ద్వైపాక్షిక సహకారంతో ముడిపడి ఉందన్నారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఎస్సీఓ సదస్సులో భాగంగా వీరి మధ్య భేటీ జరిగింది. ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తో ఆదివారం ద్వైపాక్షిక చర్చలు చేపట్టారు. అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి, రెండు ఆసియా పొరుగు దేశాలు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు 2025 కోసం చైనాలోని తియాంజిన్ నగరానికి చేరిన ప్రధాని, అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నేపధ్యంలోనే మోదీ.. జిన్పింగ్తో సమావేశం అయ్యారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. చివరిసారిగా ఈ నేతలు రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కలుసుకున్నారు.2020లో గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఈ భేటీ తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇరు దేశాలు ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాల సంబంధాలను మెరుగుపరుచుకోవడం ప్రధాన ఎజెండాగా ఉండనుంది. ప్రధాని మోదీ- జిన్పింగ్ భేటీలో ముఖ్యాంశాలుప్రధాని మోదీ , చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సమావేశం 55 నిమిషాల పాటు కొనసాగింది.కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది- ప్రధాని మోదీరెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు కూడా ప్రారంభం కానున్నాయి - ప్రధాని మోదీ శిఖరాగ్ర సమావేశం విజయవంతం అయినందుకు అభినందిస్తున్నాను- జిన్పింగ్తో ప్రధాని మోదీసంబంధాలను మెరుగుపరచుకోవడానికి కట్టుబడి ఉన్నాం- జిన్పింగ్తో ప్రధాని మోదీగత సంవత్సరం కజాన్లో అర్థవంతమైన చర్చలు జరిగాయి- ప్రధాని మోదీ Tianjin, China: During his bilateral meeting with Chinese President #XiJinping, Prime Minister Narendra Modi says, "I congratulate you on China's successful chairmanship of the SCO. I thank you for the invitation to visit China and for our meeting today." pic.twitter.com/McF7aOQu11— Priya Mishra (@Priyaaa_B) August 31, 2025 -
ముగ్గురు మొనగాళ్లు రెడీ.. ట్రంప్ కు మాస్టర్ స్కెచ్
-
టియాంజిన్ లో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ
-
చైనాలో అడుగుపెట్టిన మోదీ
తియాంజిన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. జపాన్లో రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం సాయంత్రం చైనాకు చేరుకున్నారు. ఉత్తర చైనాలోని తియాంజిన్లో ఆదివారం, సోమవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధినేత షీ జిన్పింగ్తోపాటు ఇతర దేశాల అధినేతలతో సమావేశమవుతారు. తియాంజిన్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు సంప్రదాయ రీతిలో సంగీత, నృత్య కార్యక్రమాలతో స్వాగతం పలికారు. జిన్పింగ్తోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్, చైనా కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్లు విధించిన నేపథ్యంలో భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతుండడం, మోదీ–జిన్పింగ్ భేటీ అవుతుండడాన్ని ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అలాగే చైనా అధినేత జిన్పింగ్ 2019 అక్టోబర్లో భారత్లో పర్యటించారు. గణనాథుడి చిత్రాన్ని షేర్ చేసిన చైనా ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్.. వినాయకుడి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరుదేశాలు కళలు, విశ్వాసం, సంస్కృతులను పంచుకున్నాయని వెల్లడించారు. ఇవి చైనాలోని టాంగ్ రాజవంశం కాలంలో, మొగావో గుహల్లోని గణనాథుడి ప్రతిమలు అని పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య శతాబ్దాలుగా బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఇవి అద్భుతమైన ప్రతీకలు అని యూ జింగ్ స్పష్టంచేశారు. #WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome as he arrives at a hotel in Tianjin, China. Chants of 'Bharat Mata ki jai' and 'Vande Mataram' raised by members of the Indian diaspora.(Video: ANI/DD) pic.twitter.com/hiXQYFqm07— ANI (@ANI) August 30, 2025 -
హర్మన్ప్రీత్ ‘హ్యాట్రిక్’
రాజ్గిర్ (బిహార్): అంచనాలకు తగ్గట్టు ఆడకపోయినా... ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు శుభారంభం లభించింది. శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో భాగంగా జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో చైనా జట్టును ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (20వ, 33వ, 47వ నిమిషాల్లో) ‘హ్యాట్రిక్’ నమోదు చేసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. మరో గోల్ను జుగ్రాజ్ సింగ్ (18వ నిమిషంలో) అందించాడు. చైనా తరఫున షిహావో డు (12వ నిమిషంలో), బెన్హాయ్ చెన్ (35వ నిమిషంలో), జీషెంగ్ గావో (41వ నిమిషంలో) ఒక్కోగోల్ చేశారు. ఈ మ్యాచ్లో నమోదైన మొత్తం ఏడు గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారానే రావడం విశేషం. హర్మన్ప్రీత్ సింగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. హర్మన్ప్రీత్కు 200 డాలర్ల చెక్ను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అందజేశారు. తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న చైనాపై భారత్ భారీ విజయం సాధిస్తుందని ఆశించినా... ప్రత్యర్థి జట్టు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. భారత జట్టు తమకు లభించిన 11 పెనాల్టీ కార్నర్లో కేవలం నాలుగింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. చైనా జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్లు రాగా, మూడింటిని లక్ష్యానికి చేర్చింది. తొలి రోజు జరిగిన ఇతర లీగ్ మ్యాచ్ల్లో మలేసియా 4–1తో బంగ్లాదేశ్ జట్టుపై... డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా 7–0తో చైనీస్ తైపీపై... జపాన్ 7–0తో కజకిస్తాన్పై విజయం సాధించాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో చైనీస్ తైపీతో బంగ్లాదేశ్; మలేసియాతో దక్షిణ కొరియా తలపడతాయి. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం జపాన్ జట్టుతో ఆడుతుంది. -
భారత్-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
టోక్యో: భారత్-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. చైనాలో జరగనున్న ఎస్సీవో (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) సమ్మిట్ కోసం చైనా తియాంజిన్ నగరానికి వెళ్లనున్నారు.అంతకంటే ముందే చైనా పర్యటనపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోదీని ఆ దేశ ప్రముఖ జాతీయ దినపత్రిక ‘యోమియురి షింబున్’ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో అంతర్జాతీయంగా ఆర్ధిక ఒడిదుడుకులు కొనసాగుతున్న తరుణంలో భారత్-చైనాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇరు దేశాలు పరస్పర గౌరవం, ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కలిసి ముందుకు సాగాలి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు తియాంజిన్కి వెళ్లనున్నట్లు చెప్పిన మోదీ.. గతేడాది కజాన్లో జరిగిన ఓ సమావేశం తర్వాత ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని తెలిపారు.భారత్, చైనా వంటి రెండు పెద్ద దేశాల మధ్య స్థిరమైన, అనుకూలమైన సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత్-చైనా కలిసి పనిచేయడం ద్వారా ఆర్థిక స్థిరత సాధించవచ్చని మోదీ పేర్కొన్నారు.ప్రధాని మోదీ శనివారం సాయంత్రం చైనాలోని తియాంజిన్ చేరతారు. ఆదివారం ఉదయం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో 40 నిమిషాల పాటు సమావేశం జరగనుంది. సోమవారం ఎస్సీవో ప్రధాన సమావేశం జరుగుతుంది.ఈ క్రమంలో 2020 నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలను పునరుద్ధరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
జిన్పింగ్ మాస్టర్ ప్లాన్.. చైనా సైనిక కవాతుకు పుతిన్, కిమ్
బీజింగ్: సెప్టెంబర్ 3న బీజింగ్లో జరగనున్న చైనా సైనిక కవాతుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరవుతారని చైనా తెలిపింది. ఇదొక చారిత్రక పర్యటన అవుతుందని చైనా విదేశాంగ శాఖ గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించింది. ఇది కిమ్ మొట్టమొదటి పాక్షిక అంతర్జాతీయ సమావేశం కాగా, కొత్త ప్రపంచ క్రమం కోసం ప్రయత్నిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ఇది దౌత్య విజయంగా మారింది. ఉత్తరకొరియా– చైనాలది దశాబ్దాల స్నేహమని, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూనే ఉంటాయని తెలిపింది. కవాతుకు 26 మంది దేశాధినేతలు.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి 80 ఏళ్లవుతుండగా.. ఆ సంఘర్షణ ముగిసిన సందర్భంగా చైనా ‘విక్టరీ డే’కవాతును నిర్వహిస్తోంది. వందలాది యుద్ధ విమానాలు, ట్యాంకులు, యాంటీ–డ్రోన్ వ్యవస్థలతో సహా తన తాజా ఆయుధాలను చైనా ప్రదర్శించే అవకాశం ఉంది. దాని సైన్యం కొత్త దళ నిర్మాణాన్ని పూర్తిగా కవాతులో ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో పదివేల మంది సైనిక సిబ్బంది చారిత్రాత్మక టియానన్మెన్ స్క్వేర్ గుండా కవాతు చేస్తారు. చైనా సైన్యంలోని 45 స్థాయిల సైనికులు, యుద్ధ అనుభవజు్ఞలు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ కవాతుకు హాజరు కానున్న 26 మంది దేశాధినేతల్లో పుతిన్, కిమ్ కూడా ఉంటారు.జిన్పింగ్ ఆహ్వానాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే–మ్యుంగ్ తిరస్కరించారు. ఆయన స్థానంలో జాతీయ అసెంబ్లీ స్పీకర్ కిమ్ జిన్–ప్యోను హాజరు కానున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న చాలా పాశ్చాత్య దేశాలు నాయకులు కవాతుకు హాజరు కావడం లేదు. ఇండోనేషియా అధ్యక్షుడు, మలేషియా ప్రధాన మంత్రి, మయన్మార్ సైనిక పాలకుడు, యురోపియన్ యూనియన్ నాయకుడు, స్లోవాక్ ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, బల్గేరియా, హంగేరీ ప్రతినిధులు కూడా హాజరుకున్నారు. 1959 తర్వాత ఉత్తర కొరియా నాయకుడు చైనా సైనిక కవాతుకు హాజరు కావడం ఇదే తొలిసారి. 2015లో చివరిసారిగా విక్టరీ డే పరేడ్ నిర్వహించినప్పుడు ఉన్నతాధికారులలో ఒకరైన చో ర్యాంగ్–హేను పంపింది. కవాతులో పాల్గొనొద్దు: తైవాన్ చైనా సైనిక కవాతులో పాల్గొనవద్దని ప్రజాస్వామ్య దేశాలకు తైవాన్ విజ్ఞప్తి చేసింది. చైనా ఈ సమయాన్ని ఉపయోగించుకుని సారూప్యత కలిగిన ప్రభుత్వాల మధ్య చీలికను తీసుకురావచ్చని హెచ్చరించింది. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య దేశాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని లేదా బహిరంగంగా ఖండించాలని ఆ దేశ విదేశాంగ శాఖ కోరింది. చైనా సైనిక, ఆర్థిక వృద్ధి ఇండో–పసిఫిక్లో ఉద్రిక్తతలకు దారి తీస్తుందని, ఒకప్పుడు రక్షణ రంగంలో చైనా కంటే అమెరికా ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ, ఇప్పుడు చైనా దాన్ని దాటేసిందని ప్రకటించింది. చైనా రక్షణ వ్యయంలో దాదాపు 90 శాతం ఇండో–పసిఫిక్లో, ముఖ్యంగా భారత్–చైనా సరిహద్దులో కేంద్రీకృతమై ఉందని, ఈ సమయంలో అమెరికాతోపాటు మిత్రదేశాలు అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పింది. -
31న జిన్పింగ్తో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31, వచ్చే నెల 1వ తేదీల్లో చైనాలో పర్యటించబోతున్నారు. తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీన చైనా అధినేత షీ జిన్పింగ్తో మోదీ సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్–చైనా సంబంధాలు, పరస్పర సహకారంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు చర్చించే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెల 1వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్తో నరేంద్ర మోదీ భేటీ అవుతారు.భారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో చైనా, రష్యా అధినేతలతో భారత ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమావేశం కాబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం ఏకంగా 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్–చైనా మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. భారత్పై అమెరికా విధించిన భారీ టారిఫ్లను జిన్పింగ్ తప్పుపట్టారు.ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. వూహాన్ సిటీలో షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, మోదీ–పుతిన్ మధ్య జరగబోయే ద్వైపాక్షిక భేటీకి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఇటీవలి కాలంలో ఇండియాకు మరింత దగ్గరయ్యేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్పై దండయాత్ర ప్రారంభించిన తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్, చైనాల నుంచి మరింత సహకారాన్ని పుతిన్ కోరుకుంటున్నారు. తియాంజిన్లో మోదీ, జిన్పింగ్, పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు రష్యా ప్రభుత్వం ఇటీవల సంకేతాలిచ్చింది. -
ప్రపంచ ‘బెర్త్’ లక్ష్యంగా...
రాజ్గిర్ (బిహార్): వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో... నేడు మొదలయ్యే ఆసియా కప్లో భారత పురుషుల హాకీ జట్టు బరిలోకి దిగనుంది. ఆసియా కప్ విజేత జట్టు ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత పొందుతుంది. శుక్రవారం మొదలయ్యే ఆసియా కప్ పూల్ ‘ఎ’ తొలి మ్యాచ్లో చైనాతో భారత్ తలపడుతుంది. ఇటీవల జరిగిన యూరోపియన్ అంచె ప్రొలీగ్లో భారత్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. 8 మ్యాచ్లాడితే ఏకంగా ఏడింట పరాజయాన్నే మూటగట్టుకుంది. అయితే తాజా ఆసియా కప్ పరిస్థితులను ఐరోపా జట్లు, పరిస్థితులతో పోల్చలేం. కానీ అక్కడ తలెత్తిన లోటుపాట్లను మాత్రం ఇక్కడా కొనసాగిస్తే మాత్రం మూల్యం తప్పదు. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత్ డిఫెన్స్లో దుర్భేద్యంగా మారాలి. పెనాల్టీ కార్నర్లను గోల్గా మలిచే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. గోల్కీపింగ్ కూడా పటిష్టం కావాలి. రిటైరైన దిగ్గజ గోల్కీపర్ శ్రీజేశ్ స్థానంలో ఆడుతున్న కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా ఇంకా చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలా అన్ని రంగాల్లో మెరుగైతేనే మేటి జట్లను నిలువరించగలం. యూరోపియన్ అంచెలో ఎదురైన పరాజయాల భారాన్ని తగ్గించుకోగలం. మిడ్ఫీల్డ్లో రాజిందర్ సింగ్, రాజ్ కుమార్ పాల్, మన్ప్రీత్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్లు మరింత బాధ్యత కనబరిస్తేనే ఆసియా కప్లో ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధిస్తాం. ఆసియా కప్లో భారత్, చైనాలున్న పూల్ ‘ఎ’లో జపాన్, కజకిస్తాన్ మిగతా జట్లు కాగా... పూల్ ‘బి’లో దక్షిణ కొరియా, మలేసియా, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ జట్లున్నాయి. -
ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్కి ప్రపోజ్ చేశాడు ..కట్చేస్తే..!
ఫుడ్ డెలివరి బాయ్ సాధారణంగా కస్టమర్తో మేడమ్ మీ ఆర్డర్ అని అంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇతడు ఏకంగా ఐ లవ్ యు అన్నాడు. ఆ హఠాత్పరిణామానికి కంగుతిన్న ఆ మహిళా కస్టమర్ కూడా ఐలవ్ యు అని అతడికి రిప్లై ఇవ్వడం కొసమెరుపు. సినిమాల్లో చూపించినట్లుగా తొలిచూపులోనే ప్రేమలో పడటం అన్నట్లుగా ఆ ఒక్క క్షణంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. కట్చేస్తే ఆ తర్వాత ఇద్దరూ..ఇదంతా చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్కు చెందిన 27 ఏళ్ల లియు హావో ఫుడ్ డెలివరీ బాయ్. అమెరికా అలబామా నివాసి హన్నా హారిస్ 2024లో షెన్యాంగ్ కు వెళ్లింది. ఆమె అక్కడ కిండర్ గార్టెన్ టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లినప్పుడే ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హన్నా అతడిని చూడటం అదే తొలిసారి. అయితే ఆ రోజు ఆ ఫుడ్ని మేడపైన రూమ్కి డెలిరీ చేయాల్సి ఉంది. ఆ నిమిత్తం లిప్ట్లో వెళ్తుండగా ప్రమాదవశాత్తు హన్నా కూడా అదే లిఫ్ట్లో ఉండటం జరిగింది. దాంతో అతడు ఆమెను ఎలా పలకరించాలో తోచక హాయ్..!.. ఐలవ్ యు అని పలికరించాడు. ఆ సంబోధనకు విస్తుపోతూ..ఆమె కూడా అనాలోచితంగా ఐ లవ్ యు అని రిప్లై ఇచ్చేసింది. అంతే ఇరువురు ఒక్కసారిగా తెల్లబోయనట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు కాసేపు. అంతే ఆ క్షణం నుంచి ఇరువురి మధ్య విడదీయరాని ప్రేమ బంధం గాఢంగా అల్లుకుపోయింది. డెలివరీ బ్యాకెండ్ యూప్ సాయంతో ఇరువురు చాట్ చేసుకునేవారు. నిజానికి ఇద్దరికి ఒకరి భాష ఒకరికి సరిగా రాదు, అర్థం కాదు. కానీ భాషా అంతరంతో సంబంధంలేని ప్రేమ వారిని ఒక్కటిగా చేయడమే కాదు, కమ్యునికేషన్ సమస్యకు తావులేకుండానే సాంకేతిక సాయంతో వారి వారి భాషల్లోనే సంభాషించుకోవడం విశేషం. ఈ ఏడాది మార్చిలోనే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు కూడా. అంతేగాదు జూన్లో తన బాయ్ఫ్రెండ్ పుట్టినరోజుని జరుపుకుంది హన్నా. ఆమె అతడిని యూఎస్ తీసుకువెళ్లాలని భావిస్తున్నప్పటికీ..లియు మాత్రం తమ భవిష్యత్తును చైనాలోనే ప్లాన్ చేయాలని యోచిస్తున్నాడు. ఈ ఇద్దరు లవ్స్టోరీ నెట్టింట వైరల్గా మారడమే కాదు..మనోడు మాములోడు కాదు అంటూ లియూపై ఫన్నీగా సెటైర్లు వేస్తూ..పోస్టులు పెట్టారు.(చదవండి: స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..) -
ట్రంప్ బిగ్ ఆఫర్.. చైనాకు కొత్త టెన్షన్!
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించారు. దాదాపు ఆరు లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో, భారీ సంఖ్యలో చైనా విద్యార్థులు.. అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చైనా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ విద్యార్థులపై వేధింపులు మాత్రం ఆపాలని విజ్ఞప్తి చేసింది.కాగా, అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్.. చైనా విద్యార్థుల విషయంలో మాత్రం సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఆరు లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంటామని ప్రకటించడంపై చైనా స్పందించింది. ఈ సందర్బంగా చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ..‘అమెరికాలో చదువుకునేందుకు చైనా విద్యార్థులకు ఆహ్వానిస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చైనా విద్యార్థులను వేధించడం, ప్రశ్నించడం, నిరాధార ఆరోపణలతో స్వదేశానికి పంపించడం వంటి చర్యలను ఆపాలి. తద్వారా వారి చట్టబద్ధమైన హక్కులను రక్షించాలి’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వీసాలు, గ్రీన్కార్డులు, విదేశీ విద్యార్థుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. భారత్ సహా ఇతర దేశాల విద్యార్థుల వీసాల ప్రక్రియను కఠినతరం చేశారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు. మరోవైపు.. హెచ్-1బీ వీసాలు, గ్రీన్కార్డుల విషయంలో కూడా కొత్త నిబంధనలను తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. -
చైనా-భారత్-పాక్.. కనివినీ ఎరుగని రీతిలో విధ్వంసం!
దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనాలను ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి. మునుపెన్నడూలేని విధంగా క్లౌడ్ బరస్ట్, మెరుపు వరదలు మూడు దేశాల్లోనూ తీవ్ర నష్టం కలిగించాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా.. ఈ ఏడాది మాత్రం అసాధారణంగా నమోదు అవుతోంది. అందుకు కారణాలను పరిశీలిస్తే.. భారీ వర్షాలు భారత్, పాకిస్తాన్, చైనా దేశాలను పెను విపత్తులుగా ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్, మెరుపు/ఆకస్మిక వరద(Flash Floods) ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఇవే ఈ మూడు దేశాల్లో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించాయి. జమ్ము కశ్మీర్ ఈ ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఎంతో మంది మరణించడం చూస్తున్నదే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి.ఇక.. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పంజాబ్ ప్రాంతాలు వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు నెలల కాలంలో వర్షాలు, వరదలతో పాక్లో 700 మంది మరణించినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. వీళ్లలో చిన్నారులే అధికంగా ఉన్నారు. చైనాలో రెండు నెలల వర్షాల వల్ల ₹1.84 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలిపోతోంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం.. దానికి వ్యతిరేకంగా ఇంకొన్ని చోట్ల తగ్గుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. మాన్సూన్ ట్రఫ్ అంటే..మాన్సూన్ ట్రఫ్ అనేది దక్షిణాసియా దేశాల్లో వర్షాకాలంలో వర్షాల పంపిణీకి దిశానిర్దేశం చేసే వాతావరణ రేఖ. ఇది సాధారణంగా పాకిస్తాన్ నుంచి బెంగాల్ ఖాతీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ట్రఫ్ చుట్టూ తక్కువ ఒత్తిడి ఏర్పడిన ప్రాంతాల(Low Pressure Formation) వల్ల వర్షాలు కురుస్తుంటాయి. చైనా, పాక్, భారత్లో ఈ సీజన్లో వర్షాలకు కారణం ఇదే. (తక్కువ ఒత్తడి ప్రాంతాల్లోకి చుట్టుపక్కల నుంచి గాలి ప్రవహిస్తుంది. ఆ గాలి ఆవిరితో నిండిన మేఘాలను తీసుకువస్తుంది. ఇది వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే మాన్సూన్ కాలంలో తక్కువ ఒత్తడి ప్రాంతాలు భారీ వర్షాలకు కారణమవుతాయి). అయితే..వాతావరణ మార్పు, నగరీకరణ, అటవీ నాశనం వంటి మానవ చర్యలు ఈ ట్రఫ్ మార్గాన్ని అస్థిరంగా మార్చి వర్షాల తీవ్రతను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొండ ప్రాంతాలు, నదుల నుంచి నీటి ఆవిరి ఎక్కువగా ఉంటోంది. ఈ ఆవిరి మేఘాల్లో చేరి, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తక్కువ సమయంలో భారీ వర్షంగా కురుస్తుంది. ఇది వర్షపాతం తీవ్రతను పెంచుతూ, ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. పైపెచ్చు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆవిరి పెరిగి, తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ✅ పరిష్కార మార్గాలు• ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: ప్రజలకు సమయానికి సమాచారం అందించాలి. అయితే అది కష్టతరంగా మారుతోంది• వరద మైదానాల పునరుద్ధరణ: సహజ జల ప్రవాహ మార్గాలను తిరిగి స్థాపించాలి.• స్థిరమైన నగరీకరణ ప్రణాళికలు: పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి.• అటవీ విస్తరణ: వర్షపు నీటిని శోషించే వనరుల పెంపు.• ప్రజల అవగాహన: వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తులపై ప్రజలలో చైతన్యం కలిగించాలి.దక్షిణాసియాలో వర్ష విపత్తులు మామూలు ప్రకృతి ధోరణుల కంటే ఎక్కువగా మానవ చర్యల ప్రభావంతో ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పును అర్థం చేసుకుని, దీన్ని ఎదుర్కొనే విధానాలను అభివృద్ధి చేయడం అత్యవసరమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. -
చైనాకు ట్రంప్ బంపరాఫర్
వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య కీలకమైన సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పేర్కొన్నారు. ఆరు లక్షల మంది చైనా విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. వారికోసం అమెరికా యూనివర్సిటీల తలుపులు తెరిచి ఉంచామని వెల్లడించారు. చైనా విద్యార్థులు తమ దేశంలో నిక్షేపంగా ఉన్నత చదువులు చదువుకోవచ్చని సూచించారు.వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చైనాలోని అరుదైన ఖనిజాలు అమెరికాకు సులువుగా లభించేలా చూడాల్సిన బాధ్యత జిన్పింగ్ ప్రభుత్వంపై ఉందన్నారు. లేకపోతే చైనా ఉత్పత్తులపై 200 శాతం టారిఫ్లు విధించడానికైనా వెనుకాడబోమని హెచ్చరంచారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతల కారణంగా చైనా విద్యార్థులు నష్టపోవడం తమకు సమ్మతం కాదన్నారు. వారిపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త వహిస్తామన్నారు. మరోవైపు చైనా విద్యార్థులకు ట్రంప్ ఆహ్వానం పటకడం పట్ల మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Trump claims we’re going to let 600k Chinese students in and that China has paid a lot in tariffs. No, they actually haven’t. Guess how much CHINA has paid in tariffs. Just guess. This guy conned so many of you idiot MAGA loyalists and now you’re going to jump through hoops… pic.twitter.com/JAX9l8czSO— JohnBurk (@johnburk39) August 25, 2025 -
పుతిన్, మోదీలకు జిన్పింగ్ రెడ్ కార్పెట్
బీజింగ్: ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు చైనాలోని టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో) సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ శిఖరాగ్రానికి రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను రెడ్ కార్పెట్ పరిచి జిన్పింగ్ స్వయంగా ఆహా్వనం పలకనున్నారు. బ్రిక్స్ దేశాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన వేళ అమెరికా ఆధిపత్యానికి గండికొట్టడంతోపాటు, ప్రత్యామ్నాయం తామేనని చూపేందుకు జిన్పింగ్ ప్రయత్నం చేయనున్నారు. ఈ సదస్సుకు మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల నేతలు పాల్గొననున్నారు. మరో వారంలో మొదలయ్యే కీలక సదస్సులో ఎస్సీవోలో మరికొన్ని దేశాలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని పరిశీలకులు అంటున్నారు. ‘అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ క్రమం ఎలా దారుణంగా ఉంటుందో చెప్పడంతోపాటు, జనవరి నుంచి చైనా, ఇరాన్, రష్యా, తాజాగా భారత్ను కట్టడి చేసేందుకు వైట్ హౌస్ చేసిన ప్రయత్నాలు అంతగా ప్రభావం చూపలేదని చూపడానికి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని జిన్పింగ్ భావిస్తున్నారు’అని ది చైనా–గ్లోబల్ సౌత్ ప్రాజెక్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎరిక్ ఒలాండర్ విశ్లేషించారని రాయిటర్స్ పేర్కొంది. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఐక్య వేదికను చూపుకునేందుకు, బహుళ ధ్రువ క్రమం దిశగా ప్రపంచం సాగుతోందని తెలియజేయడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. అంతర్జాతీయంగా ఇటీవల చోటుచేసుకున్న దౌత్యపరమైన పరిణామాలు, బ్రిక్స్ దేశాల మధ్య బలోపేతమవుతున్న ఆర్థిక సంబంధాలను ప్రస్తావించిన ఒలాండర్..ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనూహ్య చర్యల ఫలితమేనన్నారు. ఎస్సీవోలో ప్రస్తుతం 10 శాశ్వత సభ్య దేశాలు, మరో 16 దేశాలు పరిశీలక హోదాలో ఉన్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకార దృక్పథానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయని ఒలాండర్ పేర్కొన్నారు. సభ్య దేశాల సంఖ్య పెరిగినప్పటికీ దేశాల మధ్య సహకారం పరంగా చూస్తే బ్రిక్స్ మంచి ఫలితాలను రాబట్టలేకపోతోందని తక్షశిల ఇన్స్టిట్యూట్కు చెందిన మనోజ్ కేవల్రమణి రాయిటర్స్తో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఎస్సీవో లక్ష్యం, ఆచరణాత్మక వైఖరి ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తమ్మీద అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రయోజనాలను సాధించుకోవడమనేదే ఎస్సీవో ప్రధాన లక్ష్యంగా ఉందని చెప్పారు. సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే ఈ వేదిక లక్ష్యం అయినప్పటికీ, చైనా–భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను సడలించేందుకు ఇది ఉపయోగపడనుందని తెలిపారు. భారత్ మంకుపట్టును వీడి చైనాతో సామరస్యంగా వ్యవహరిస్తుందని ఒలాండర్ అంచనా వేశారు. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ శిఖరాగ్రం సందర్భంగా భారత్–చైనాలు సరిహద్దుల్లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణతోపాటు వీసా నియంత్రణలు, వాణిజ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు చేయవచ్చని తెలిపారు. వాతావరణ మార్పుల వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారం విస్తృతం కానుందన్నారు. భద్రతా పరమైన అంశాల్లో ఎస్సీవో సాధించే పురోగతి మాత్రం పరిమితంగానే ఉంటుందని కేవల్రమణి విశ్లేషించారు. 2001లో ఎస్సీవోను ప్రకటించాక జరుగుతున్న అతిపెద్ద శిఖరాగ్రం ఇదే. అంతర్జాతీయ వ్యవహారాల్లో పెరుగుతున్న ఈ కూటమి ప్రాధాన్యతను చెప్పకనే చెబుతుందని పరిశీలకులు అంటున్నారు. కొత్త ప్రపంచ క్రమతను చాటే ముఖ్యమైన వేదిక ఎస్సీవో శిఖరాగ్రమని చైనా విదేశాంగ శాఖ తాజాగా అభివర్ణించడం గమనార్హం. -
Asia Cup: భారత జట్టు ఇదే
న్యూఢిల్లీ: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును గురువారం ప్రకటించారు. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు జార్ఖండ్కు చెందిన 23 ఏళ్ల సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. సెప్టెంబరు 5 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమిస్తుంది. గ్రూప్ ‘బి’లో జపాన్, థాయ్లాండ్, సింగపూర్ జట్లతో కలిసి భారత్కు చోటు లభించింది.సెప్టెంబరు 5న థాయ్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్... 6న జపాన్తో, 8న సింగపూర్తో పోటీపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో చైనా, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా, మలేసియా జట్లున్నాయి. ఆసియా కప్లో విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆసియా కప్లో భారత జట్టు రెండుసార్లు (2004, 2017) చాంపియన్గా, రెండుసార్లు రన్నరప్గా (1999, 2009) నిలిచింది. భారత మహిళల హాకీ జట్టు: బన్సరీ సోలంకి, బిచ్చూ దేవి ఖరీబమ్ (గోల్ కీపర్లు), మనీషా చౌహాన్, ఉదిత, జ్యోతి, సుమన్ దేవి థౌడమ్, నిక్కీ ప్రధాన్, ఇషిక చౌధరీ (డిఫెండర్లు), నేహా, వైష్ణవి విఠల్ ఫాల్కే, సలీమా టెటె, షర్మిలా దేవి, లాల్రెమ్సియామి, సునీలితా టొప్పో (మిడ్ ఫీల్డర్లు), నవ్నీత్ కౌర్, రుతుజా పిసాల్, బ్యూటీ డుంగ్డుంగ్, ముంతాజ్ ఖాన్, దీపిక, సంగీత కుమారి (ఫార్వర్డ్స్).ఇదీ చదవండి: రజత పతకాలు నెగ్గిన రీనా, ప్రియ సమోకోవ్ (బల్గేరియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్షిప్లో గురువారం భారత్కు రెండు రజత పతకాలు లభించాయి. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రీనా (55 కేజీలు), ప్రియ (76 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలను గెల్చుకున్నారు. ప్రియ 0–4తో నదియా సొకోలవ్స్కా (ఉక్రెయిన్) చేతిలో, రీనా 2–10తో ఎవరెస్ట్ లెడెకర్ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యారు.మరోవైపు 72 కేజీల విభాగంలో కాజల్ ఫైనల్లోకి దూసుకెళ్లి స్వర్ణ పతకం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో కాజల్ 13–6తో జాస్మిన్ (అమెరికా)పై విజయం సాధించింది. 50 కేజీల విభాగంలో శ్రుతి... 53 కేజీల విభాగంలో సారిక కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. సెమీఫైనల్స్లో సారిక 0–10తో అనస్తాసియా పొలాస్కా (ఉక్రెయిన్) చేతిలో... శ్రుతి 0–11తో రింకా ఒగావా (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
ట్రంప్ కు భారీ షాక్.. భారత్ వెంట చైనా
-
ఆసియాకు డబుల్ ఇంజిన్లు భారత్, చైనా!
న్యూఢిల్లీ: భారత్- చైనా సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతున్న తరుణంలో.. ఆ దేశ రాయబారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వేచ్ఛా వాణిజ్యంతో ఇన్నాళ్లూ లాభపడిన అమెరికా ఇప్పుడు టారిఫ్ల పేరుతో బేరాలాడుతూ భారత్పై వేధింపులకు దిగుతోందని భారత్లో చైనా రాయబారి జు ఫెయింగ్హాంగ్ విమర్శించారు. భారత్పై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్లు విధించడాన్ని తమ దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. మౌనంగా ఉంటే అమెరికా వేధింపుల్ని మరింతగా పెంచుతుందన్న ఆయన.. ఈ విషయంలో భారత్ పక్షాన చైనా గట్టిగా నిలబడుతుందని వెల్లడించారు. భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్లను తెరవడంపై ఫెయింగ్ హాంగ్ స్పందిస్తూ... ఒకరి ఉత్పత్తులకు మరొకరు అవకాశమివ్వడం ద్వారా రెండు దేశాల అభివృద్ధికి ఎంతగానో అవకాశముందని చెప్పారు. ఆసియాకు రెండు దేశాలు డబుల్ ఇంజన్ల వంటివని అభివర్ణించారు. పోటీపరంగా చూస్తే ఐటీ, సాఫ్ట్వేర్, బయోమెడిసిన్ ఉత్పత్తుల్లో భారత్ మెరుగ్గా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నిర్మాణరంగం, నూతన ఇంధన రంగాల్లో చైనాది పైచేయిగా ఉందని వివరించారు. రెండు ప్రధాన మార్కెట్లు అనుసంధానమైతే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వివరించారు. భారత్పై అమెరికా సుంకాల (US Tariffs) విధింపు, వాటిని మరింత పెంచుతామని ఆ దేశం చేస్తున్న ప్రకటనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాణిజ్య, సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫీహాంగ్ వ్యాఖ్యానించారు.ఇటువంటి సందర్భాల్లో మౌనంగా ఉండటం, రాజీ పడటం.. బెదిరింపులకు పాల్పడేవారికి మరింత ధైర్యాన్నిస్తుంది. చైనా (China)లోని తియాంజిన్ వేదికగా ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్ సహా అన్నిపక్షాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ‘‘అంతర్జాతీయ వేదికపై పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్, చైనాలు ఐక్యంగా ఉంటూ.. పరస్పరం సహకరించుకోవాలి. ఇరుదేశాల స్నేహం.. ఆసియాకు, ప్రపంచానికీ మేలు చేకూరుస్తుంది. భారత్, చైనాలు కలిసి తమ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టగలవు’’ అని ఫీహాంగ్ పేర్కొన్నారు.జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలురష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్పై అమెరికా విధించిన సుంకాలపై మాస్కో వేదికగా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని.. చైనా అని పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనకు మాస్కో వెళ్లిన జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిశారు. ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత్పై అమెరికా విధించిన సుంకాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఘాటుగా స్పందించారు. అంతేకాదు.. మాస్కో నుంచి అత్యధిక స్థాయిలో ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారత్ కాదని, యూరోపియన్ యూనియన్ అని వెల్లడించారు. ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు భారత్ సాయాన్ని అమెరికా కోరిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందని అన్నారు. 2022 తర్వాత రష్యాతో వాణిజ్యం అత్యధికంగా జరిపిన దేశం కూడా భారత్ కాదని అన్నారు. అయినా భారత్పైనే ఎక్కువ సుంకాలు విధించడంలోని తర్కమేంటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. -
‘భారత్ ప్రత్యర్థేమీ కాదు’.. ట్రంప్కు నిక్కీ హేలీ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిక్షాత్మక సుంకాలు విధించడాన్ని ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తప్పుబట్టారు. ట్రంప్ నిర్ణయాల కారణంగా వాషింగ్టన్- న్యూఢిల్లీ మధ్య సంబంధాలు విచ్ఛిన్నమయ్యే దశకు చేరుకున్నాయని ఆమె అన్నారు. వీటిని తిరిగి ట్రాక్లోకి తీసుకురావడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు.బుధవారం ప్రచురితమైన న్యూస్వీక్ ఆప్-ఎడ్లో.. ఆమె భారతదేశాన్ని చైనా మాదిరిగా ప్రత్యర్థిగా పరిగణించరాదని అన్నారు. ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, భారత్- పాక్ మథ్య సంధి కుదిర్చానంటూ అమెరికా పేర్కొనడం.. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య చీలికకు కారణమవుతున్నాయని హేలీ పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా భారత్- అమెరికా సంబంధాలలో విభేదాలు కనిపించాయని, ట్రంప్ యంత్రాంగం భారత్పై 25 శాతం సుంకాలతో దాడి చేసిందని ఆమె అన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలలో అమెరికా పాత్ర లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసిందన్నారు.2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను సమర్థించిన నిక్కీ హేలీ ఇప్పుడు ఆయన చర్యలను తప్పుపడుతున్నారు. భారతదేశాన్ని అత్యుత్తమ ప్రజాస్వామ్య భాగస్వామిగా పరిగణించాలని, అది చైనా మాదిరిగా ప్రత్యర్థి కాదన్నారు. ఇప్పటివరకు రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఎటువంటి ఆంక్షలను విధించలేదని ఆమె పేర్కొన్నారు. ఆసియాలో చైనా ఆధిపత్యానికి దీటుటా ఎదుగుతున్న దేశంతో స్నేహ సంబంధాలను దూరం చేసుకోవడం వ్యూహాత్మక విపత్తు అవుతుందని ఆమె అధ్యక్షుడు ట్రంప్ను హెచ్చరించారు.భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, చైనా తర్వాతి స్థానంలో ఉందని హేలీ గుర్తుచేశారు. కమ్యూనిస్ట్ నియంత్రణలో ఉన్న చైనాతో పోలిస్తే, ప్రజాస్వామ్య భారతదేశం స్వేచ్ఛా ప్రపంచాన్ని బెదిరింపులకు గురిచేయదని ఆమె అన్నారు. ట్రంప్ మొదటి పరిపాలనా కాలంలో ఐక్యరాజ్యసమితికి 29వ అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ ఉన్నారు. అమెరికా అధ్యక్ష మంత్రివర్గంలో పనిచేసిన మొదటి భారతీయ అమెరికన్గా ఆమె పేరొందారు. -
చైనాతో సంధి వేళ సరిహద్దులపై నేపాల్ మరో డ్రామా.. భారత్ కౌంటర్
ఢిల్లీ: భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదాలు తగ్గించుకుంటున్న క్రమంలో తెరపైకి నేపాల్ వచ్చింది. లిపులేఖ్ కనుమ ద్వారా చైనాతో భారత్ సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేపాల్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ విషయంలో నేపాల్ వాదనలు అసమగ్రంగా ఉన్నాయని స్పష్టంచేసింది.వివరాల ప్రకారం.. భారత్- చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు చర్చల ద్వారా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో హిమాలయ పర్వత ప్రాంతం ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ ప్రాంతం మీదుగా వాణిజ్య సరిహద్దులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో నేపాల్ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. లిపులేఖ్ కనుమ ద్వారా భారత్, చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం 1954లో ప్రారంభమైంది.దశాబ్దాలుగా వాణిజ్యం కొనసాగుతోంది. ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. ప్రాదేశిక వాదనలను ఏకపక్షంగా విస్తరించడం సాధ్యం కాదు. వాణిజ్య మార్గంపై ఖాట్మండు ప్రాదేశిక వాదన అనుకూలమైనది కాదు. చారిత్రక వాస్తవాలు ఆధారంగా లేవు. కోవిడ్, ఇతర పరిణామాల కారణంగా వాణిజ్యానికి ఇటీవల సంవత్సరాల్లో అంతరాయం కలిగింది. ఇప్పుడు దానిని తిరిగి ప్రారంభించడానికి రెండు వైపులా అంగీకారం కుదిరింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి దౌత్యం ద్వారా నేపాల్తో నిర్మాణాత్మక పరస్పర చర్యకు భారత్ సిద్ధంగా ఉంది అని స్పష్టం చేశారు.అయితే నేపాల్ పశ్చిమ సరిహద్దు లింపియాధురలో 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపులేఖ్ కనుమ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి తెరవడానికి భారత్, చైనా ఇటీవల అంగీకరించాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. లిపులేఖ్, లింపియాధురతో సహా కాలాపానీ ప్రాంతం తమ భూభాగమని భారత్ తన వైఖరిని వ్యక్తం చేస్తోంది. కాగా, 1816 సుగౌలి ఒప్పందం ప్రకారం కాలాపానీ, లింపియాధురతో సహా లిపులేఖ్ తమకే చెందుతుందని నేపాల్ వాదిస్తోంది. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం, రోడ్ల విస్తరణ, సరిహద్దు వాణిజ్యం వంటి ఎటువంటి కార్యకలాపాలను చేపట్టవద్దని నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. -
మళ్లీ చివురించిన చెలిమి
ఏ దేశానికైనా ప్రథమ ప్రాధాన్యం స్వీయ ప్రయోజనాలు. ఆ తర్వాతే మిగిలినవన్నీ. గాల్వాన్ ఘర్షణల తర్వాత గత అయిదేళ్లుగా భారత్, చైనాల మధ్య ఏర్పడిన వివాదాలు అనేకానేక చర్చల పరంపర తర్వాత కూడా అసంపూర్ణంగానే ఉండిపోయిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన దేశంలో రెండురోజులు పర్యటించటం, ఇరు దేశాల మధ్యా ఏదో మేరకు సదవగాహన కుదరటం హర్షించదగ్గ పరిణామం. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అంతకు ముందు విదేశాంగ మంత్రి జైశంకర్తో చర్చలు జరిపారు. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు ఉంటాయి. ఒకటి రెండు పర్యటనలతోనో, రెండు మూడు దఫాల చర్చల్లోనో అవి పరిష్కారం కావాలంటే సాధ్యం కాకపోవచ్చు. అందుకు ఎంతో ఓరిమి, తమ వైఖరిపై అవతలి పక్షాన్ని ఒప్పించే నేర్పు అవసరం. దీర్ఘకాలం ఆ వివాదాలను కొనసాగనిస్తే మూడో దేశం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిరుడు అక్టోబర్లో రష్యాలోని కజాన్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అప్పటికి నాలుగేళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్నారు. ఇరు దేశాల సంబంధాలనూ సాధారణ స్థితికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న జూన్లో కైలాస– మానససరోవర్ యాత్రకు భక్తులను అనుమతించేందుకు చైనా అంగీకరించింది. భారత్ సందర్శించే చైనా యాత్రికులకు మన దేశం పర్యాటక వీసాలు పునరుద్ధరించింది. ఈనెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో వాంగ్ యీ వచ్చారు. ఆ సదస్సుకు మోదీ హాజరుకావాలంటే సుహృద్భావ సంబంధాలు అవసరమని కూడా చైనా భావించింది. ప్రధాని ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరైతే ఆయన ఏడేళ్ల అనంతరం చైనా సందర్శించి నట్టవుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్యా జరిగిన ఘర్షణల తర్వాత సైనికాధికారుల స్థాయిలో చాలా దఫాలు చర్చలు సాగాయి. అయినా సరిహద్దుల్లో ఏప్రిల్ 2020కి ముందున్న పరిస్థితులు ఏర్పడలేదు. ఆఖరికి కజాన్లో మోదీ–షీల మధ్య సమావేశం తర్వాత కూడా గత పది నెలల్లో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. వాంగ్ యీ పర్యటన సందర్భంగా ఇరుదేశాలూ 12 అంశాల్లో కీలక నిర్ణయాలు తీసు కున్నాయి. రెండు దేశాల మధ్యా విమాన రాకపోకలను పునరుద్ధరించుకోవాలనీ, వివాదాస్పద సరిహద్దు సమస్యపై చర్చించేందుకు మూడు వేర్వేరు బృందాలు ఏర్పాటు చేసుకోవాలనీ తీర్మా నించాయి. సరిహద్దు విషయంలో ఇప్పుడు పనిచేస్తున్న బృందంతో పాటు తూర్పు, మధ్య సెక్టార్లకు సంబంధించి వేర్వేరు బృందాలు ఏర్పడితే త్వరితగతిన పరిష్కారం సాధించవచ్చని ఇరు దేశాల విదేశాంగమంత్రులూ భావించారు. అలాగే వాణిజ్యాన్ని పెంచుకోవటానికి సరి హద్దుల్ని మళ్లీ తెరవాలని నిర్ణయించారు. లిపూలేఖ్ పాస్, షిప్కి లా పాస్, నాథూ లా పాస్ల గుండా ఈ వాణిజ్యం సాగుతుంది. అలాగే పరస్పరం పెట్టుబడుల ప్రవాహానికి కూడా అనుమ తిస్తారు. అన్నిటికన్నా ముఖ్యం – అరుదైన ఖనిజాల ఎగుమతులకు చైనా అంగీకరించటం. స్మార్ట్ ఫోన్ల నుంచి ఫైటర్జెట్ల వరకూ, విండ్ టర్బైన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకూ ఉత్పాదన ప్రక్రియలో ఈ అరుదైన ఖనిజాలు అత్యవసరం. ఇవి ప్రపంచంలో 99 శాతం చైనాలోనే లభ్యమవుతాయి. వీటితోపాటు ఎరువుల ఎగుమతులపై లోగడ విధించిన నిషేధాన్ని తొలగించ టానికి చైనా అంగీకరించటం ఈ పర్యటనలో ప్రధానాంశం. మన రైతులు ఎక్కువగా మొగ్గు చూపే డీఏపీ ఎరువులు చైనాలో ఉత్పత్తవుతాయి. రెండుచోట్లా ప్రవహించే నదీజలాలపై డేటాను ఇచ్చిపుచ్చుకోవటానికి భారత్, చైనా అంగీకరించాయి. త్రీగోర్జెస్ డ్యామ్ను మించిన స్థాయిలో బ్రహ్మపుత్ర నదిపై 16,000 కోట్ల డాలర్ల వ్యయంతో భారీ ఆనకట్ట నిర్మించాలని చైనా తలపెట్టిన నేపథ్యంలో నదీ జలాల డేటాపై అంగీకారం కుదరటం హర్షించదగ్గది.చర్చల తర్వాత తాజా ప్రపంచ పరిణామాలపై వాంగ్ యీ విడుదల చేసిన ప్రకటనలో పరోక్షంగా అమెరికా వ్యవహారశైలిపై విమర్శలుండటం గమనార్హం. స్వేచ్ఛా వాణిజ్యాన్నీ, అంతర్జాతీయ సంబంధాలనూ భగ్నం చేసేలా కొందరు ఏకపక్షంగా బెదిరింపులకు దిగుతున్న పర్యవ సానంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన ప్రస్తావించారు. ఆధిపత్య ధోరణులు ఏ రూపంలో ఉన్నా గట్టిగా ప్రతిఘటించటం చాలా అవసరం. ఏదేమైనా ఇరుదేశాలూ సాధ్యమైనంత త్వరగా సరిహద్దు సమస్యకు పరిష్కారం అన్వేషించగలిగితే, ఉగ్రవాదం అంతానికి చేతులు కలిపితే... ప్రధాని మోదీ చెప్పినట్టు అది రెండు దేశాల మధ్య మాత్రమే కాదు, ఆసియా ఖండంలోనే కాదు... యావత్ ప్రపంచశాంతికీ, సౌభాగ్యానికీ దోహదపడుతుంది. సాధ్యమైనంత త్వరగా అది సాకారం కావాలని ఆశించాలి. -
జైలు శిక్ష తప్పించుకునేందుకు.. నాలుగేళ్లలో ముగ్గురు పిల్లలు, చివరికి
జైలు శిక్షను తప్పించుకునేందుకు ఒక మహిళ వింత నాటకానికి తెర తీసింది. దేశంలోని చట్టాలను ఉపయోగించుకొని మరీ జైలుకు వెళ్లకుండా తప్పించుకుంది. నాలుగేళ్లలో మూడు సార్లు గర్భం దాల్చిన ఘటన వార్తల్లో నిలిచింది. ఆలస్యంగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) కథనం ప్రకారం 2020లో చెన్ హాంగ్ అనే మారుపేరుతో పిలువబడే మహిళ మోసం కేసులో దోషిగా తేలింది. ఇందుకుగాను ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. కానీ జైలు శిక్ష అనుభవించకుండా చైనా చట్టంలో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు జైలుకెళ్లకుండానే, తాత్కాలికంగా తమ శిక్షను అనుభవించే వెసులుబాటును ఉపయోగించుకుంది. ఇలాంటి ఖైదీలు జైల్లో కాకుండా సాధారణంగా ఇంట్లో లేదా ఆసుపత్రులలో కమ్యూనిటీ దిద్దుబాటు సెంటర్లలో వీరు ఉండవచ్చు. 2020 - 2024 మధ్య, చెన్ ఒకే పురుషుడితో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రతీ సారి జైలుకెళ్లడం వాయిదా పడుతూ వచ్చింది. అయితే చైనీస్ చట్టం ప్రకారం, అటువంటి పరిస్థితులలో దోషులు ప్రతి మూడు నెలలకు వైద్య నివేదికలను సమర్పించాలి . స్థానిక కరెక్షన్ సెంటర్లలో క్రమం తప్పకుండా చెకప్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే చెన్ బండారం బైటపడింది.కానీ మే 2025లో జరిగిన ఒక సాధారణ తనిఖీలో, చెన్ బేబీ కనపించకపోవడంతోపాటు, పిల్లల రిజిస్ట్రేషన్ ఆమె మాజీ భర్త సోదరి పేరుతో నమోదై ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు ఆమె తొలి సంతానం కూడా తన మాజీ భర్తతో నివసిస్తున్నట్లు తేలింది. దీంతో అసలు విషయాన్ని ఒప్పుకుంది చెన్. భర్తకు విడాకులు ఇచ్చి, ముగ్గురు పిల్లలను ఆయనకే ఇచ్చానని ఒప్పుకుంది. జైలు శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా గర్భధారణను ఒక వ్యూహంగా ఉపయోగించుకుందని స్థానిక ప్రొక్యూరేటరేట్ కూడా నిర్ధారించింది. ఇదీ చదవండి: రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలొదిలేసింది: వైరల్ వీడియోఅయితే ఆమెకు నిర్దేశించిన శిక్షాకాలం ఇక ఏడాది కాలమే మిగిలి ఉండటంతో చెన్ను మిగిలిన కాలానికి నిర్బంధ కేంద్రానికి పంపారు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్ గామారింది. కొందరు నెటిజన్లు ఆమెపై జాలి చూపించగా మరికొందరు ఔరా అంటూ నో రెళ్ల బెట్టారు. తల్లి జైలు నుండి తప్పించు కోవాలనే కోరికతోనే జన్మించిన ముగ్గురు పిల్లలపైనా మరికొందరు జాలి చూపించారు. కోరుకున్నప్పుడు గర్భవతి కావడం నిజంగా షాకే అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత


