breaking news
china
-
చైనా దూకుడు.. ఆపకుండా బంగారం కొంటున్న డ్రాగన్!
బంగారం, వెండి ధరలు ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన అనంతరం తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో కొత్త కదలికలకు దారితీసింది. ధరలు తీవ్ర అస్థిరతను చూపుతున్నప్పటికీ, చైనా మాత్రం బంగారం కొనుగోలును దూకుడుగా కొనసాగిస్తోంది. చైనా కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) వరుసగా 15వ నెల కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంది.2,307 మెట్రిక్ టన్నుల బంగారంపీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా విడుదల చేసిన డేటా, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. గత జనవరి నెలలో కూడా చైనా బలమైన బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. జనవరి చివరి నాటికి చైనా మొత్తం బంగారం నిల్వలు 74.19 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు (ఒక ఫైన్ ట్రాయ్ ఔన్సు అంటే 31.1035 గ్రాములు మొత్తం 2,307.56 మెట్రిక్ టన్నులు) చేరాయి. ఇది డిసెంబర్ చివర్లో నమోదైన 74.15 మిలియన్ ట్రాయ్ ఔన్సులతో పోలిస్తే స్వల్ప పెరుగుదలే అయినప్పటికీ, నిల్వల మొత్తం విలువ మాత్రం గణనీయంగా పెరిగింది.ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకే?జనవరి చివరి నాటికి చైనా బంగారం నిల్వల మొత్తం విలువ 369.58 బిలియన్ డాలర్లకు చేరింది. గత నెలలో ఇది 319.45 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఈ భారీ పెరుగుదలకి ప్రధాన కారణాలుగా నెల ప్రారంభంలో ఉన్న అధిక బంగారం ధరలు, అలాగే చైనా నిరంతర కొనుగోలు వ్యూహాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ప్రమాదాల నేపథ్యంలో చైనా తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే భాగంగా బంగారం నిల్వలను పెంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చైనా నుంచి వచ్చిన బలమైన డిమాండ్, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జరిగిన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణంగా జనవరిలో బంగారం ధరలు ఔన్సుకు 5,600 డాలర్ల చారిత్రక గరిష్టాన్ని తాకాయి. అయితే ఈ ర్యాలీ ఎక్కువ కాలం కొనసాగలేదు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్లో తదుపరి కీలక నాయకత్వ పాత్రకు కెవిన్ వార్ష్ను పరిగణనలోకి తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడడంతో మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా స్పాట్ గోల్డ్ ధరలు గణనీయంగా పడిపోయాయి.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,887 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ దిద్దుబాటు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరల దిశపై అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం కొనుగోలు చేస్తుండగా, అదే సమయంలో దేశీయ వినియోగదారుల బంగారం వినియోగం మాత్రం వరుసగా రెండో ఏడాది కూడా తగ్గుముఖం పట్టింది.భారత్ పసిడి నిల్వలు ఇలా..జనవరి 2026 నాటికి, భారతదేశ కేంద్ర బ్యాంకు తన విదేశీ మారక నిల్వలలో సుమారు 880 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. తాజా విదేశీ నిల్వల డేటా ప్రకారం జనవరి చివరి నాటికి భారతదేశ మొత్తం రిజర్వ్ వాల్యుయేషన్కు ఆర్బీఐ బంగారం హోల్డింగ్స్ సుమారు 123 బిలియన్ డాలర్లు దోహదపడ్డాయి. ప్రపంచ ధరల లాభాలతో భారతదేశ బంగారం నిల్వ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ తాజా పసిడి కొనుగోళ్లు గణనీయంగా మందగించాయి. -
చైనా అరాచకం.. భారత సరిహద్దుల్లో రహస్య అణు పరీక్షలు
వాషింగ్టన్: భారత్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో చైనా రహస్యంగా జరిపిన అణు పరీక్షలపై అమెరికా సంచలన విషయాలను వెల్లడించింది. 2020లో భారత్, చైనాల మధ్య గాల్వాన్లో ఘర్షణలు చోటుచేసుకున్న అనంతరం.. చైనా రహస్యంగా అణు పరీక్షలను నిర్వహించినట్లు అమెరికా చెప్పింది. దీంతో, అమెరికా వెల్లడించిన వివరాలు తీవ్ర చర్చకు దారి తీశాయి.అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ థామస్ డినాన్నో శుక్రవారం జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా థామస్.. అణు పరీక్షల వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత వారం రోజుల వ్యవధిలో జిన్ఙియాంగ్ ప్రావిన్సుల్లోని లోప్ నూర్ సైట్లో చైనా అణు పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా భూమి కంపనాలను గుర్తించడం కష్టంగా ఉండేందుకు ‘‘డీకప్లింగ్’’ అనే టెక్నాలజీని చైనా ఉపయోగించినట్లు అమెరికన్ అధికారులు చెబుతున్నారు.కాగా, డీ కప్లింగ్ అంటే భూగర్భంలో అతిపెద్ద గుహలో పరీక్షలు నిర్వహించడం. దీని వల్ల ఏర్పడే భూకంప తరంగాలు గుహలోనే అబ్సార్వ్ అవుతాయి. అయితే, ప్రపంచం కళ్ల నుంచి తప్పించుకోవడానికి చైనా రహస్య అణు పరీక్షలు నిర్వహిస్తోందనే సమాచారం తమ వద్ద ఉందన్నారు. జూన్ 22, 2020న చైనా అలాంటి ఒక అణు పరీక్షను నిర్వహించిందని అమెరికా నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. గాల్వాన్ ఘర్షణల్లో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. ఈ క్రమంలో చైనాపై భారత్ జరిపిన దాడిలో 35-40 మంది చనిపోయినట్లు యూఎస్ నివేదికలు చెబుతున్నాయి. చైనా తన సైనికుల మరణాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, గాల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత 2024లో ఈ ప్రతిష్టంభన ముగిసింది.చైనాపై ఎందుకు అనుమానం?చైనా తన అణ్వాయుధాలను పెంచుకోవడంపై అమెరికా ఆందోళన చెందుతోంది. బీజింగ్ వద్ద సుమారు 600 అణు వార్హెడ్లు ఉన్నాయని నమ్ముతున్నారు. గత సంవత్సరం, నవంబర్లో చైనా, పాకిస్తాన్ అణు పరీక్షలు చేసిన సమయంలో అమెరికా సైన్యాన్ని అణు ఆయుధాల పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ట్రంప్ ఆదేశించారు. మరోవైపు రష్యా కూడా అణు పరీక్షలు చేస్తోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు రష్యాతో భవిష్యత్తులో కుదిరే ఏ అణు ఒప్పందంలోనైనా చైనా కూడా భాగం కావాలని ట్రంప్ కోరుకుంటున్నారు. మరోవైపు.. అమెరికా, రష్యా మధ్య చివరి అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగిసిన తర్వాత ఈ ఆరోపణలు రావడం సంచలనంగా మారాయి. -
పుతిన్, ట్రంప్తో జిన్పింగ్ మాటామంతి
బీజింగ్: చైనా అధినేత జిన్పింగ్ బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్తో సంభాషించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా, రష్యా సంబంధాలపై పుతిన్తో జిన్పింగ్ విస్తృతంగా చర్చించారు. ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక ‘గ్రాండ్ ప్లాన్’ను పుతిన్ ప్రతిపాదించారు. గత ఏడాది నవంబర్ తర్వాత జిన్పింగ్, పుతిన్ ఫోన్లో మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఇటీవలి కాలంలో చైనా, జపాన్ సంబంధాలు దెబ్బతింటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్తో సంభాషణ చర్చనీయాంశంగా మారింది. పుతిన్తో, ట్రంప్తో జిన్పింగ్ ఒకేరోజు మాట్లాడడం అత్యంత అరుదైన ఘటన. అయితే, ట్రంప్తో ఏం చర్చించారన్నది తెలియరాలేదు. దీనిపై చైనా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. రష్యా, అమెరికాల మధ్య 2010లో కుదిరిన అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం గడువు గురువారం ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్త ఒప్పందాన్ని ప్రతిపాదించారు. ఇందులో చైనా భాగస్వామిగా మారాలని కోరుతున్నారు. అందుకు చైనా అంగీకరించడం లేదు. -
జాగ్రత్త..చైనా అటాక్ చేయవచ్చు: అమెరికా
చైనా విషయంలో భారత్కు అమెరికా కీలక సూచన చేసింది. డ్రాగన్ కంట్రీతో ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండడం మంచిదని హెచ్చరించింది. చైనా, భారత్పై ఏ క్షణానైన దాడికి తెగబడవచ్చని అమెరికా మెరైన్ ఇంటిలిజెన్స్ మాజీ అధికారి భారత్కు హెచ్చరిక జారీ చేశారు.అరుణాచల్ విషయంలో డ్రాగన్ కంట్రీ తరచుగా భారత్పై కయ్యానికి కాలు దువ్వుతుంది. అయితే ప్రస్తుతం ఆ సమస్య అంత పెద్దగా లేదు. అయితే భవిష్యత్తులో చైనా, భారత్పై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ మెరైన్ ఇంటెలిజెన్స్ అధికారి గ్రాంట్ న్యుషామ్ భారత్ను హెచ్చరించారు.2049వరకూ చైనా తనను ప్రపంచంలోనే తనను సూపర్ పవర్గా స్థాపించుకోవాలనుకుంటుందని దానికి ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించుకుంటుందని తెలిపారు. తైవాన్తో సమస్య ఉన్న సమయంలోనే అకస్మాత్తగా మరో దేశంపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. భారత్, దక్షిణకొరియా, జపాన్, ఫిలీప్పీన్స్ వంటి ప్రాంతాలపై అది దాడి చేయగలదని తెలిపారు. అందులోనూ భారత్ తొలిస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.దీనికోసం ఆయన చైనా, భారత్ మధ్య గతంలో జరిగిన గల్వాన్ లోయ వివాదాన్ని ప్రస్థావించారు. అయితే ప్రస్తుతం అమెరికా రాయబారిగా ఉన్న సెర్గియా గోర్ అధ్యక్షుడు ట్రంప్కు సన్నిహితుడని ఆయనతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరో మెట్టు ఎక్కుతాయని అన్నారు. కాగా ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధిస్తున్న అధిక పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చిల్లీ పెప్పర్స్ స్పా..! వెరైటీ థెరపీలు..
పర్యాటన అనగానే..చాలామంది స్కైడైవింగ్, జలపాతాలు, ప్రకృతి అందాల కోసం అన్వేషిస్తుంటారు. మరికొందరు మానసిక ప్రశాంతతను అందించే ధ్యానానికి సంబంధిన పర్యాట ప్రదేశాలను వెతుకుతారు. ఇంకొందరు ఆరోగ్యం కోసమే..సేద తీరే థెరపీలందించే స్పాల కోసం సర్చ్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ ప్రత్యేక స్పాలు. ఇంతవరకు చూడని, అనుభవం పొందని వెరైటీ స్పాలు. ఇవి బాడీకి విశ్రాంతినిచ్చే థెరపీల్లాంటి స్పాలు. ముఖ్యంగా చలికాలంలో సందర్శనకు బెస్ట్ స్పాలుగా పేర్కొనవచ్చు. ఎక్కడున్నాయంటే..అలాంటి ప్రత్యేక స్పాల కోసం చైనాలోని హార్బిన్ నగరంలోకి వాలిపోవాల్సిందే. ఇక్కడ ఉండే ప్రతి స్పా ఓ అద్భుతం. ఇలాంటి విచిత్రమైనవి ఎక్కడ ఉండవేమో అన్నంతగా ఆకర్షణగా ఉంటాయి ఈ స్పాలు. ఘాటెక్కించే స్పా చిల్లీ పెప్పర్స్ స్పా. మొత్తం ఎర్రటి పచ్చిమిర్చితో ఉండే పూల్ చూసి నోటమాటరాదు. ఓర్నీ ఇందులో స్నానం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహం కలుగుతుంది. కానీ ఇది ఒకరకమైన బాడీ చికిత్స కోసమేనట. ముఖ్యంగా చలికాలంలో వేడి మిరపకాయలతో కూడిన నీటిలో స్నానం చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం కలగడటమేగాక చురుగ్గా ఉండేలా చేస్తుందని నమ్ముతారట అక్కడి చైనా ప్రజలు. అక్కడ ఆ పూల్లోని ఎర్రటి మిరపకాయలు, ఇతర ఘాటైన పదార్థాలతో ఎర్రగా ఉంటుందట నీరు. దీంతోపాటు ప్రత్యేకమైన ఫిష్ స్పా కూడా ఉంది. ఇందులోని చిన్న చేపలు పాదాలకు పెడిక్యూర్ చేస్తాయి. దీంతోపాటు కొన్ని బహిరంగా హాట్ టబ్లు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రదేశంలో మంచు మద్య సహజంగా ఏర్పడిన ఆర్కిటిక్ స్పా ఒకటి ఉంది. ఇది 103 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట. అంతేగాదు ఈ ప్రదేశం ఐస్ పెస్టివెల్కి నిలయం కూడా. ఈ స్పాలన్నీ పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని, విశ్రాంతి తోపాటు బాడీకి ఒకవిధమైన చికిత్సను అందిస్తాయి. View this post on Instagram A post shared by Jordan Egbert (@counting.countries) (చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..) -
6 వేల మీటర్ల లోతులో జపాన్ ఘనత : ప్రపంచంలోనే తొలిసారి
జపాన్ సముద్రగర్భ అన్వేషణలో అద్భుతమైన మైలురాయిని అధిగమించి ప్రపంచ రికార్డును సాధించింది. పరిశోధకుల బృందం 6,000 మీటర్ల లోతునుండి 'రేర్ ఎర్త్' (అరుదైన మూలకాలు,Rare Earth Elements) మూలకాలను కలిగి ఉన్న అవక్షేపాలను (Sediment) విజయవంతంగా వెలికితీసింది. నీటి అడుగున ఖనిజ సేకరణలో ఇది ఒక రికార్డు. ఈ కీలకమైన ఖనిజాల వెలికితీత కొత్త శక్తి సాంకేతికతలు. ఆర్థిక భద్రతకు మార్గం సుగమం చేస్తాయి, విదేశీ సరఫరాదారులపై జపాన్ ఆధారపడటాన్ని తగ్గిస్తాయిని నిపుణులు భావిస్తున్నారు.ఖనిజాల వేటలో సముద్ర మట్టానికి సుమారు 6,000 మీటర్ల లోతులో ఖనిజాలను సేకరించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి పసిఫిక్ మహా సముద్రం లోని మారుమూల ద్వీపమైన మినామి టోరిషిమా సమీపంలో ఈ తవ్వకాలు జరిగాయి. ఈ ప్రయోగం కోసం 'చిమ్యు' (Chikyu) అనే అత్యాధునిక డ్రిల్లింగ్ నౌకను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఇంతటి లోతులో ఖనిజాలను సేకరించే ఆపరేషన్నిర్వహించడం ప్రపంచంలోనే తొలిసారి అని అధికారులు వెల్లడించారు.ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?ప్రపంచంలోనే తొలి విజయంప్రపంచ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని అధికారులు ప్రకటించారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (METI), జపాన్ ఏజెన్సీ ఫర్ మెరైన్-ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ (JAMSTEC) సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. అధునాతన డీప్-సీ డ్రిల్లింగ్ నౌక చిక్యూను ఉపయోగించి, బృందం మారుమూల పసిఫిక్ ద్వీపమైన మినామి టోరిషిమా సమీపంలో ఈ మిషన్ను నిర్వహించింది. ఈ పురోగతి కీలకమైన ఖనిజాలలో స్వావలంబన వైపు ఒక అడుగు అని అధికారులు అంటున్నారు. ఇతర దేశాలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, జపాన్ అత్యధిక లోతులో సరికొత్త రికార్డు నెలకొల్పడం విశేషం.ఇదీ చదవండి: భర్తను చితకబాదేసిన భార్య, వైరల్ వీడియోఈ రేర్ఎర్త్ మూలకాలు అవసరం ప్రస్తుతం ఆధునిక ప్రపంచానికి చాలా వుంది. ముఖ్యగా ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, స్మార్ట్ఫోన్లు, సైనిక పరికరాలు , ఇతర హై-టెక్ పరికరాలలో వీటిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరుదైన మూలకాల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ విజయంతో జపాన్ ఇక ఇతర దేశాలపై ఆధారపడే అవసరం ఉండదు.ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా? -
మాటే మంత్రమై.. ఆ బిడ్డకు ఊపిరి పోసింది..!
కోమాలో ఉన్న వ్యక్తుల కుటుంబాలకు ఈ ఘటన సరికొత్త ఆశను అందిస్తోంది. అచ్చం సినిమాని తలపించే సన్నివేశంలా..ఈ కేసులో ఆ బిడ్డ కోమా నుంచి బయటపడ్డాడు. వైద్యులు సైతం చేతులెత్తేశారు. కానీ మాటలు, సందేశాలే మంత్రాలుగా మారి మిరాకిల్ చేశాయి. ఆ బిడ్డకు ఊపిరిపోసి..కోమా నుంచి పూర్తిగా బయటపడేలా చేశాయి. ఆ తల్లి కళ్లల్లో ఆనందం వెల్లివెరిసేలా చేశాయి. అసలేం జరిగిందంటే..ఈ అద్భుత ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లోని యుయాంగ్కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు లియుచుక్కి నవంబర్ 2025లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డు ప్రమాదంలో చిన్నారి చుక్కికి మెదడు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయలయ్యాయి. దాంతో పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు సైతం కోమా నుంచి బయటడే అవకాశాలు తక్కువని అని తేల్చి చెప్పేశారు. కానీ ఆ బాలుడు తల్లి ఆశ వదులుకోలేదు. వైద్యుల సూచనల మేరకు అతడికి రోజు సుపరిచితమైన శబ్దాలు, మాటలు..వినేలా వాతావరణం కల్పించాలని చెప్పారు. దాంతో ఆ బాలుడు పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించి వారి మద్దతు..స్కూల్లో అసెంబ్లీలో ప్లే అయ్యే సాంగ్స్, ప్రార్థన గీతాలు వినిపించేలా చేసింది. అలాగే వీడియో కాల్ ద్వారా ఆ బాలుడి స్నేహితుల మాటలు అతనికి వినిపించేలా చేసింది ఆ బాలుడి తల్లి. రోజు అతడి స్నేహితులు.. రేయ్..! చుక్కి కళ్లుతెరవరా.., మాతో మాట్లాడరా, ఫుట్బాల్ ఆడదాం త్వరగా లేగు అన్న మాటలు ఆ బాలుడిలో స్పందన తెప్పించాయి. ఆ తల్లి అలా అతడి క్లాస్మేట్స్ మాటలు రోజు వినేలా చేయడంతో.. అతడి పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. అంతేగాదు 45 రోజుల కోమా అనంతరం తొలిసారిగా కనురెప్పలు కదపడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన ఉపాద్యాయుడి గొంతు విని నవ్వాడు. అలా 55వ రోజుకి స్పృహలోకి వచ్చి తన ఎడమ చేతిని కదిపాడు. తన పాఠశాల సంగీతం, సహ విద్యార్థులు సందేశాల రికార్డింగ్ ఆ బాలుడుని కోమా నుంచి బయటపడటానికి, కోలుకోవడానికి హెల్ప్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా కదిస్తోంది. A touching story😭😭An 8-year-old boy in Hunan, #China, woke from a 55-day coma after hearing the collected messages of love and well wishes from classmates🥺🥺It's the power of #friendship and #hope. ❤️ pic.twitter.com/M8sEcX8o9Z— GeoSight (互fo) (@ShanxiDaily) January 22, 2026 (చదవండి: ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..) -
పిల్లల కంటే పెంపుడు జంతువులే నయం!
చైనాలో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరుగాంచిన చైనా ఇప్పుడు జనాభా క్షీణతతో సతమతమవుతోంది. ప్రభుత్వం ఎన్ని ఆఫర్లు ప్రకటించినా అక్కడి యువత పిల్లలను కనేందుకు సుముఖంగా లేరు. చైనాలో ప్రస్తుతం ‘హ్యూమన్ బేబీస్’ కంటే ‘ఫర్ బేబీస్’ (బొచ్చు ఉన్న పెంపుడు జంతువులు) సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తల్లిదండ్రులుగా మారడం కంటే కుక్కలు, పిల్లులను పెంచుకోవడమే మేలని అక్కడి యువత భావిస్తోంది.రికార్డు స్థాయిలో పడిపోయిన జనన రేటుగత కొన్నేళ్లుగా చైనాలో జననాల సంఖ్య భారీగా తగ్గుతోంది. 2023 నాటికే చైనా జనాభా 1.405 బిలియన్ల((140.5 కోట్లు)కు పడిపోయింది. 2015లో 16.55 మిలియన్లు((1,65,50,000)గా ఉన్న జననాలు, గతేడాదికి కేవలం 7.92 మిలియన్ల((79,20,000)కు పరిమితమయ్యాయి. దశాబ్దం క్రితంతో పోలిస్తే ఇది సగం మాత్రమే. పెళ్లిళ్ల రేటు కూడా 20 శాతం వరకు తగ్గడం అధికారులను కలవరపెడుతోంది. 1979లో అమలు చేసిన ‘ఒక్కరు ముద్దు’ విధానం ప్రభావం ఇప్పుడు దేశ భవిష్యత్తుపై తీవ్రంగా కనిపిస్తోంది.పిల్లల కంటే పెంపుడు జంతువులే బెస్ట్ అంటూ..చైనాలోని యువత ప్రస్తుతం పిల్లల కంటే పెంపుడు జంతువుల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం అక్కడి ఆర్థిక పరిస్థితులు. చైనాలో పెరిగిపోతున్న జీవన వ్యయం, విపరీతమైన పోటీతత్వం కలిగిన వాతావరణంలో పిల్లలను పెంచడం భారమని వారు భావిస్తున్నారు. ‘పెంపుడు జంతువులు మనకు ఆనందాన్ని ఇస్తాయి. పిల్లల పెంపకం అనేది చాలా అలసిపోయే పని’ అని బీజింగ్కు చెందిన గ్వో జిన్యి అనే యువతి అభిప్రాయపడ్డారు. పెంపుడు జంతువులకు పిల్లల లాగా విద్యాభ్యాసం, పోటీ పరీక్షల టెన్షన్ ఉండదని ఆమె తెలిపింది.కెరీర్పై ఆందోళనచైనా యువతలో ముఖ్యంగా మహిళల్లో కెరీర్ పట్ల ఆందోళనలు పెరిగాయి. పిల్లలు పుడితే తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అన్న భయం వారిని వెంటాడుతోంది. చైనాలో 35 ఏళ్ల తర్వాత ఉద్యోగ నియామకాల్లో వివక్ష అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. పిల్లలను పెంచుతూ కెరీర్లో రాణించడం అసాధ్యమని భావిస్తున్న మహిళలు, తమ సమయాన్ని, ప్రేమను పెంపుడు జంతువులకే పంచుతున్నారు.ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. ఫలితం సున్నాజనాభాను పెంచడానికి చైనా ప్రభుత్వం ముగ్గురు పిల్లల వరకు అనుమతి ఇచ్చింది. పిల్లల పెంపకం కోసం పన్ను రాయితీలు, నగదు సబ్సిడీలు కూడా ప్రకటించింది. మరోవైపు గర్భనిరోధక సాధనాలపై పన్నులను పెంచి వినూత్న ప్రయోగాలు చేస్తోంది. అయితే ఈ ఆఫర్లు యువతను ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీల కంటే పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.మారుతున్న కుటుంబ విలువలుఒకప్పుడు చైనాలో తల్లిదండ్రులే పిల్లల భవిష్యత్తును నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యువత తమ జీవితంపై పూర్తి స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ కంటే వ్యక్తిగత ఆనందానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. పెంపుడు జంతువులను కేవలం జంతువులుగా కాకుండా, తమ కుటుంబ సభ్యులుగా చూస్తూ, వాటికి కూడా మనుషుల లాగే దుస్తులు, ఆహారం సమకూరుస్తున్నారు.పెరిగిన పెంపుడు జంతువుల జనాభాగోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం చైనాలో 4 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కంటే పెంపుడు జంతువుల సంఖ్యే ఎక్కువగా ఉంది. 2030 నాటికి చైనాలో సుమారు 70 మిలియన్ల పెంపుడు జంతువులు ఉంటాయని అంచనా. అదే సమయంలో పసిపిల్లల సంఖ్య 40 మిలియన్లకు పడిపోవచ్చు. 2017లో ఉన్న పరిస్థితికి ఇది పూర్తిగా వ్యతిరేకం. నాటి రోజుల్లో పిల్లలే పెంపుడు జంతువుల కంటే రెట్టింపు సంఖ్యలో ఉండేవారు.బాధ్యతాయుతమైన నిర్ణయం?చైనా యువత పిల్లలను వద్దు అనుకోవడం బాధ్యతారాహిత్యం కాదని, అది ఒక రకమైన ‘బాధ్యతాయుతమైన నిర్ణయం’ అని విశ్లేషకులు భావిస్తున్నారు. పిల్లలకు మెరుగైన జీవితాన్ని, తగినంత సమయాన్ని ఇవ్వలేనప్పుడు వారిని కనడం కంటే, ఒక కుక్కనో, పిల్లినో పెంచుకోవడం ఉత్తమమని వారు భావిస్తున్నారు. పెంపుడు జంతువులను పెంచి పోషించడాన్నివారు ‘నొప్పి లేని మాతృత్వం’ అని అంటున్నారు. ఇది కూడా చదవండి: పాదచారుల ప్రాణాలకు గ్యారెంటీ ఏది? -
ఆ విషయంలో USA, చైనా పెత్తనం మంచిది కాదు: UNO సెక్రటరీ
ఐక్యరాజ్య సమితి సెక్రటెరీ ఆంటోనియో గుటెరెస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని కేవలం ఒకటి లేదా రెండు శక్తులు నడపలేవన్నారు. ప్రపంచ అభివృద్ధికి అనేక దేశాల భాగస్వామ్యం చాలా కీలకమన్నారు.UNO సెక్రటెరీ ఆంటోనియో గుటెర్రెస్ అమెరికా, చైనాలకు కౌంటరిచ్చారు. ప్రపంచాన్ని ఒకటి, లేదా రెండు దేశాలు నడపడం సాధ్యం కాదన్నారు. ఆయన మాట్లాడుతూ " ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన దేశంగా ఉందనేది కాదనలేని సత్యం. అయితే భవిష్యత్తు గురించి మా అభిప్రాయంతో పాటు ఇతర దేశాల అభిప్రాయం ఏమిటంటే ఒకటి యుఎస్ కేంద్రంగా రెండు చైనా కేంద్రంగా ఉంటాయని అంచనా అయితే స్థిరమైన, శాంతి, అభివృద్ధితో కూడిన ప్రపంచం కావాలంటే అలా జరగకూడదు" అని ఆయన అన్నారు.ప్రపంచాన్ని పరిపాలించే ఒకటి లేదా రెండు శక్తుల ద్వారా సమస్యలు పరిష్కరించబడవు అని గుటెరెస్ తెలిపారు. ఇటీవల భారత్ - ఈయూ మధ్య జరిగిన ఒప్పందం బహుళ ధృవవ్యవస్థకు ఎంతో ప్రధానమన్నారు. ప్రపంచ అభివృద్ధి అనేక దేశాల చేతిలో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. అయితే ఇటీవల యూరప్ భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" అనే కీలక ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే -
చైనాలో 11 మంది కుటుంబ సభ్యులకు మరణశిక్ష.. కారణం ఇదే
మయన్నార్లో మాఫియా, వ్యభిచారం, ఇతర స్కామ్లలో పాల్గొన్న మింగ్ కుటుంబసభ్యులు 11 మందికి ప్రభుత్వం విధించిన మరణశిక్షను అమలు చేసినట్లు చైనా మీడియా పేర్కొంది. గతేడాది సెప్టెంబర్లో వీరికి మరణదండన విధించగా తాజాగా అమలు చేసింది.ఉత్తర మయన్మార్లోని నాలుగు కుటుంబాలు అని పిలువబడే సమూహాలలో మింగ్ కుటుంబసభ్యులు అనేది ఒక సమూహం. తొలుత చైనా దేశస్థులైన వీరు చైనా సరిహాద్దుకు సమీపంలోని షాన్ రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలలో పెద్ద నేర సామ్రాజాన్ని నడిపారు. ఆన్లైన్ మోసాలతో పాటు హత్యలు, గ్యాంబ్లింగ్, ప్రాసిస్టూషన్, ఇలా ఎన్నో రకాల నేరాలకు పాల్పడ్డారు. ఏటా ఈ ముఠాల దోపిడీ 43 బిలియన్ డాలర్లకు పైగా ఉండేదంటే వీరు ఎంత పెద్ద స్కామ్ జరిపారో అర్థం చేసుకోవచ్చు.2023 తర్వాత ఈ ముఠా వ్యవహారం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. అంతే కాకుండా వీరిపై వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో చైనా ఈ కుటుంబంపై విచారణ చేపట్టగా ఈ కుటుంబంపై కఠిన చర్యలకు ఉపక్రమించి వీరిని అరెస్టు చేసింది. గత సెప్టెంబర్లో ఈ కుటుంబానికి చెందిన 11 మంది కుటుంబ సభ్యులకు ఉరిశిక్ష విధిస్తూ ఆదేశ కోర్టులు తీర్పుఇచ్చింది. తాజాగా వారికి ఉరిశిక్ష వేసినట్లు చైనా మీడియా కథనాలు ప్రచురించింది. -
600 సూదులు గుచ్చి.. పాప బాగుకోసం ఓ తల్లి కఠినత్వం
చైనాలో ఒళ్లు గొగుర్పొరిచే ఘటన చోటు చేసుకుంది. నిండా ఏడాది నిండని ఓ పసికందుకు తన తల్లి నాటు వైద్యం చేసింది. పసిపాప శరీరంతా 600కు పైగా సూదులు గుచ్చింది ఆ పసిపాపకు తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేర్చగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.చైనాలోని సౌత్ మార్నింగ్ పోస్ట్లో ఒళ్లు గొగుర్పొరిచే కథనం ప్రచురితమైంది. దాని ప్రకారం చైనాలోని యువాన్ ప్రావిన్సుకు చెందిన ఓ చిన్నారికి అతని తల్లి నాటువైద్యం చేస్తూ 600 సూదులు శరీరంలో గుచ్చింది. పసిపిల్లాడికి ఏదైనా జ్వరం వచ్చినా లేదా జలుబు, దగ్గు జ్వరం లాంటివి వచ్చినా తన తల్లి అతనికి సూదిద్వారా పొడిచి రక్తం తీసేది ఇది దానికి చికిత్సగా భావించేది. అయితే ఇలా చేస్తున్న క్రమంలో ఆ పసి కందు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తనను ఆసుపత్రిలో చేర్చింది.దీంతో పిల్లాడికి డాక్టర్లు చికిత్స చేయడానికి యత్నించగా ఒళ్లంతా మెడ,తల, కాళ్లు, ఇలా అనేక భాగాలపై సూది గుచ్చుకున్న గుర్తులు, నల్లటి మచ్చలు గుర్తించారు. దీంతో ఏంటా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతనికి మెరుగైన చికిత్స చేసి ఆ పసికందుకు ప్రాణాపాయం లేకుండా కాపాడారు.అయితే దర్యాప్తులో ఆ తల్లి ఏమి చదువుకోలేదని తనకు శాస్త్రీయ జ్ఞానం లేదని తేలింది. అంతే కాకుండా తన పాపను రక్షించుకోవడానికే సూదికుట్ పద్దతిని ఉపయోగించిందని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆమెపై చర్యలు తీసుకువాలో లేదా అన్న విషయంపై అక్కడి అధికారులు సంకోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చైనాలో పసిపిల్లలను హింసిస్తే కఠిన చట్టాల ప్రకారం శిక్షిస్తారు. -
ఇంగ్లాండ్లో... చైనా ఫోన్ ట్యాపింగ్ కలకలం
చైనా కంట్రీపై ఇంగ్లాండ్లో పలు నివేదికలు సంచలన అంశాలను ప్రచురించాయి. ఆ దేశ మాజీ ప్రధానుల ఉన్నతాధికారుల ఫోన్లను చైనా హ్యాక్ చేసినట్లు పలు నివేదికలు తెలిపాయి. అంతేకాకుండా ఈ ట్యాపింగ్ కోసం ప్రత్యేకమైన కోడ్ లాంగ్వేజ్ను వాడినట్లు పేర్కొన్నాయి.ఇంగ్లాండ్లోని పలు సంస్థల నివేదికలు ఇప్పుడు ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంగ్లాండ్ మాజీ ప్రధానులుగా బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషిసునాక్లు ఉన్న సమయంలో వారి ప్రత్యేక అధికారులు వివరాలపై చైనా హ్యాకర్లు ట్యాప్ చేసినట్లు పలు నివేదికలు తెలుపున్నాయి. సాల్ట్టైఫూన్ పేరుతో జరిగిన ఈ ఆపరేషన్ 2021-2024 మధ్య జరిగిందని పేర్కొన్నాయి. అందులోనూ రిషి సునాక్ ఆ దేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ హ్యాకి్ంగ్ ఎక్కువ జరిగిందని నివేదికలు తెలిపాయి. అయితే ఇటీవల చైనా లండన్తో పాటు యూరప్లో తన రాయబార కార్యాలయం నిర్మించాలని ప్రతిపాదనలు తీసుకరాగా బ్రిటన్ దానికి అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే ఆ దేశంలో తన దౌత్య కార్యాలయాన్ని చైనా గూడ చర్య కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం ఉందని నిరసనలు చెలరేగాయి. దీంతో ఈ నిర్ణయంపై ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ తన నిర్ణయాన్ని పదేపదే వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో చైనా తన నిరసన తెలిపింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. అయితే తాజాగా ఫోన్ ఈ నివేదిక మరోసారి ఈ అంశంపై అనుమానాలను రేకెత్తిస్తుంది. -
పాడ్‘కాస్ట్’.. కబుర్లకు కాసులు
సాక్షి, స్పెషల్ డెస్క్ : నాడు రేడియో–నేడు పాడ్కాస్ట్.. ఒకప్పుడు మన తాతయ్య తరం వాళ్లు రేడియోలు చెవి దగ్గర పెట్టుకుని వింటూ కనిపించేవాళ్లు. ఇప్పుడు మనం ఫోన్లు చేత్తో పట్టుకుని పాడ్కాస్ట్లు వింటున్నాం. సీన్ మారింది కానీ, ‘వినే’ అలవాటు మాత్రం మారలేదు. పాడ్కాస్ట్లు వినడంలో ప్రపంచంలోనే ఇండియా ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత 3వ స్థానంలో ఉంది. వినటం మన డీఎన్ఏలోనే ఉంది!కబుర్లు వినే అలవాటు భారతీయుల డీఎన్ఏలోనే ఉన్నట్లుంది. ఆ అలవాటుకు తగ్గట్లుగా పాడ్కాస్ట్లు రకరకాల సబ్జెక్టులపై కమ్మటి లోకాభిరామాయణం వినిపిస్తున్నాయి. ఏమీ తోచక బోర్ కొడుతున్నప్పుడు పాడ్కాస్ట్.. ట్రాఫిక్లో చిక్కుకుపోయినప్పుడు పాడ్కాస్ట్.. నాలెడ్జ్ కోసం, వినోదం కోసం, మనశ్శాంతి కోసం పాడ్కాస్ట్... ఇలా పాడ్కాస్ట్లనేవి భారతదేశపు అధునాతన రేడియోలు అయ్యాయి. తక్కువ ధరకే లభ్యమౌతున్న వై–ఫై, 4జీ, 5జీ డేటా..పాడ్కాస్ట్లకు అమితమైన ప్రజాదరణదక్కడానికి ప్రధాన కారణాలు.పాడ్కాస్ట్లకు డబ్బులే డబ్బులుఇండియాలో పాడ్కాస్ట్ రంగంఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం. వాణిజ్య ప్రకటనదారులు కూడా ‘వినేవారు మనవారే’ అన్నంత ఉదారంగా, పాడ్కాస్ట్లకు ప్రకటనలను కుమ్మరిస్తున్నారు.ఏం వింటున్నారు?కామెడీ అనుకుంటున్నారు కదూ! కాదట. ‘జ్ఞానాన్ని’ ఎక్కువగా ఇష్టపడుతున్నారట!అందులోనూ భక్తి, మోటివేషన్, బిజినెస్ అంటే చెవులు కోసుకుంటారని స్పాటిఫై, యూట్యూబ్ వార్షిక నివేదికలు చెబుతున్నాయి. ఎక్కడ వింటున్నారు?ప్రధానంగా యూట్యూబ్లో పాడ్కాస్ట్లనువింటున్నారు. యూట్యూబ్లోనే వీడియో పాడ్కాస్ట్లను చూస్తున్నారు. అలాగే కొన్ని మ్యూజిక్ యాప్స్ కూడా పాడ్కాస్ట్లనుఅందిస్తున్నాయి. 2026లోపాడ్కాస్ట్లు ఎలాఉండబోతున్నాయి?లోకల్ ఫీల్ : ఇంగ్లిష్ను మించి తెలుగు, మరాఠీ, బెంగాలీ, ఇతర భాషల్లో పాడ్కాస్ట్లు హోరెత్తించబోతున్నాయి.ఏఐ వాయిస్ : నిజమైన మనుషుల స్థానంలో ఏఐ రోబోలే మనకు పాడ్కాస్ట్లను వినిపిస్తాయి.లైవ్ షోలు : కేవలం ఫోన్లలోనే కాదు, స్టేజ్ మీద కూడా పాడ్కాస్ట్లను చేసి టికెట్స్ విక్రయిస్తారు. (ఆధారం : గ్రాండ్ వ్యూ రీసెర్చ్ అండ్ మార్క్ఎన్టెల్ అడ్వైజర్స్) -
జిన్పింగ్ సంచలన నిర్ణయం.. ఉప సైన్యాధ్యక్షుడు జాంగ్పై వేటు
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సన్నిహితుడు, ఆ దేశ సైన్యంలో రెండో అత్యున్నత స్థాయి అధికారి అయిన జనరల్ జాంగ్ యూషియాపై వేటు వేశారు. 75 ఏళ్ల జాంగ్ యూషియా చైనా అయుధ బలగాలను నియంత్రించే 'సెంట్రల్ మిలిటరీ కమిషన్' (CMC) కి వైస్ ఛైర్మన్గా ఉన్నాడు.జాంగ్ అవినీతి, క్రమశిక్షణ ఉల్లంఘన పాల్పడ్డారని ఆరోపిస్తూ జిన్పింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయను పదవి నుంచి తొలగించి, విచారణకు ఆదేశించారు. ఆయనతో పాటు సీఎంసీ జాయింట్ స్టాఫ్ డిపార్ట్మెంట్ చీఫ్ జనరల్ లియు జెన్లీపై కూడా మొదలైనట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. జాంగ్ యూషియా ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.అణు రహస్యాల లీక్..?చైనా అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన సాంకేతిక డేటాను (Nuclear Data) జాంగ్ అమెరికాకు లీక్ చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ తమ కథనంలో పేర్కొంది. రక్షణ మంత్రిగా ఒక అధికారిని నియమించేందుకు భారీగా లంచం తీసుకున్నారన్న ఆరోపణ కూడా జాంగ్పై ఉంది.అంతేకాకుండా జిన్పింగ్ను పదవి నుంచి దించేందుకు కూడా జాంగ్ యూషియా కుట్ర పన్నారని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ కారాణాలతో అతడిని పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అయితే 2027 నాటికి తైవాన్ను ఆక్రమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న జిన్పింగ్కు ఇప్పుడు ఇద్దరు సీనియర్ జనరల్స్ను కోల్పోవడం గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.కాగా సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మెన్గా జిన్పింగ్ ఉన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శే ఈ సీఎంసీ చైర్మెన్. జిన్పింగ్ కన్నా ఒక ర్యాంకు తక్కువగా సీఎంసీ ఉపాధ్యక్షుడి హోదాలో జాంగ్ ఉన్నారు. ఇప్పుడు అంతటి పవర్ఫుల్ హోదాలో ఉన్న జాంగ్పై వేటు వేయడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. -
HYD: బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా
సాక్షి హైదరాబాద్ : కూకట్పల్లిలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు చైనా మాంజా మెడకు చుట్టుకొని గాయాలు కావడంతో ఓ బాలిక మృతి చెందింది. తండ్రితో బైక్పై వెళుతున్న ఓ బాలికకు చైనా మాంజా మెడకు చుట్టుకొని తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో ఆ బాలిక తండ్రి హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఇటీవల జరిగిన బొటానికల్ గార్డెన్ వద్ద ఇద్దరు యువకులు బైక్పై వెళుతుండగా చైనా మాంజా తగిలి యువకులకు తీవ్రగాయాలయ్యాయి. అంతేకాకుండా ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు అనే వ్యక్తికి సైతం మంజా తగిలి గోంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావమయ్యింది. కర్ణాటకలో ఓ వ్యక్తి చైనా మాంజా ప్రమాదంలో మృతి చెందారు. అయితే చైనా మాంజాపై రాష్ట్ర పోలీసులు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంజాను అమ్మినా కొన్నా వారిపై కేసులుపెడతామని ఆదేశాలు జారీ చేశారు. నగరంలో పెద్దమెుత్తంలో మాంజాను పట్టుకొని సీజ్ చేశారు. అయినప్పటికీ కొంతమంది నిషేదిత చైనా మాంజాలతో పతంగులు ఎగురవేసి అమాయకులు ప్రాణాలు బలిగొనడం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.ఆ చిన్నారి చావుకు బాధ్యులెవరు..?చైనా మాంజాతో గాలి పటాలు ఎగరేయకండని, అవి ప్రమాదమని చెప్పినా ఇంకా ప్రాణాలే పోతున్నాయ్కూకట్పల్లిలో ఓ చిన్నారి తండ్రితో పాటు బైక్పై వెళుతూ ప్రాణాలు కోల్పోయిందినాన్నా.. నాన్నా అరిచేటప్పటికీ మెడ చుట్టూ తీవ్ర గాయమైందిఆస్పత్రికి తరలించినా ప్రాణం మాత్రం దక్కలేదుఆ చిన్నారికి చావుక ఎవరు బాధ్యులు.. మనకి మనం మారదాం.. మనకు మనం తెలుసుకుందాంఆ చిన్నారి ప్రాణాన్ని తీసుకొచ్చేదెవరూ..?ఆ కుటుంబం అరణ్య రోదనకు కారణం ఎవ్వరూ..?మనం మారాలి.. ఈ సమాజం మారాలి. సరదా కంటే ప్రాణం ముఖ్యమనే సంగతి తెలుసుకోవాలి -
చైనాలో చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు..
చైనాలో వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే భారీ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు 109 డాలర్లకుపైన ట్రేడ్ అవుతుండగా, ఒక్కరోజులోనే 3 శాతం పెరిగింది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెండి ధరలు 44 శాతం పెరిగాయి. గత 12 నెలల్లో ఈ పెరుగుదల 250 శాతాన్ని దాటింది. అయితే చైనాలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. అక్కడ వెండి ప్రీమియం కారణంగా స్థానిక ధరలు ఔన్సుకు సుమారు 125 డాలర్ల వరకు చేరాయి.భారత్–చైనా వెండి ధరల తేడావెండి ధరలు ఆల్టైమ్ హై వద్ద ఉన్నాయి. భారత్లో వెండి ధర గ్రాముకు సుమారు రూ.3.35గా ఉంది. చైనాతో పోలిస్తే ఇది సుమారు 17% తక్కువ. వివరంగా చూస్తే.. 1 ఔన్సు అంటే సుమారు 28.3 గ్రాములు. భారత్లో 1 ఔన్సు వెండి ధర సుమార రూ.9,984. అదే చైనాలో 1 ఔన్సు వెండి ధర 125 డాలర్లు.. భారత కరెన్సీలో రూ.11,450. అంటే భారత్–చైనా మధ్య ఒక్క ఔన్సుపై సుమారు రూ.1,969 (17%) ధర వ్యత్యాసం ఉంది.ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటి?చైనాలో వెండికి భారీ డిమాండ్ ఉండటంతో పాటు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఈ ధర వ్యత్యాసాన్ని మరింత పెంచుతున్నాయి. వెండి బుల్ రన్ వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి ప్రపంచ సరఫరా పరిమితులు. దీనికి తోడు, చైనా 2026 నుంచి వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇకపై వెండి ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్సులు అవసరం. ఈ విధానం 2027 వరకు అమల్లో ఉండనుంది.ఈ ఆంక్షలు ప్రకటించిన సమయంలో, ఎలాన్ మస్క్ కూడా స్పందిస్తూ, “ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి అత్యవసరం” అని హెచ్చరించారు. ప్రస్తుతం వెండి ఇప్పటికే సరఫరా కొరతను ఎదుర్కొంటోంది. ఇప్పుడు చైనా ఎగుమతులను పరిమితం చేయడంతో, ధరల అస్థిరత మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ప్రపంచ వెండి మార్కెట్లో చైనా పాత్రప్రపంచ వెండి సరఫరాలో చైనా వాటా సుమారు 65%. సిల్వర్ ఫ్యూచర్స్, భౌతిక పెట్టుబడులు, పేపర్ ట్రేడింగ్లో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. రెండవ అతిపెద్ద వెండి ఫ్యాబ్రికేటర్ కూడా చైనానే. చైనా ఎగుమతి పరిమితులు కొనసాగితే, ప్రపంచ సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సిల్వర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, గత ఐదేళ్లుగా వెండి మార్కెట్లో నిర్మాణాత్మక లోటు కొనసాగుతోంది. అంటే డిమాండ్ ఎప్పటికప్పుడు సరఫరాను మించిపోతూనే ఉంది.ఘఇది చదివారా? రూ.లక్షల బంగారం.. లాకర్లో సేఫేనా?చైనాలో కొత్త నిబంధనలుజనవరి 1, 2026 నుంచి వెండి ఎగుమతిదారులు తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్సులు పొందాలి. కఠినమైన ఉత్పత్తి, ఆర్థిక ప్రమాణాలు పాటించే పెద్ద, ప్రభుత్వ-ఆమోదిత సంస్థలకే లైసెన్సులు ఇస్తున్నారు. చిన్న ఎగుమతిదారులు మార్కెట్ నుంచి తప్పుకునే పరిస్థితి నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చైనా వెండి లభ్యత మరింత తగ్గే అవకాశముంది. -
వెళ్లిరా పాండా..!
అది కేవలం ఒక జూ కాదు.. ఒక దేశపు ఉద్వేగం.. ఆదివారం ఉదయం నుంచే టోక్యోలోని ‘ఉయెనో జూ’వెలుపల వేలాది మంది ప్రజలు నిలబడి ఉన్నారు. వారి చేతుల్లో కెమెరాలు, పాండా బొమ్మలు ఉన్నాయి.. కానీ కనులు మాత్రం వర్షిస్తున్నాయి. ఆఖరి నిమిషం.. కేవలం 60 సెకన్ల పాటు తమ ప్రియమైన కవల పాండాలను కళ్లారా చూసుకునేందుకు వారు పడుతున్న ఆరాటం వర్ణనాతీతం. ఎందుకంటే, ఆ నిమిషం తర్వాత జపాన్ గడ్డపై పాండాల శకం శాశ్వతంగా ముగిసిపోతోంది.. సెకనులో.. చెదిరిన కల వీటిని ఆఖరిసారిగా చూసుకునేందుకు.. ఆన్లైన్ లాటరీలో ఒక్కో టికెట్ కోసం 24 మంది పోటీ పడ్డారంటే ఆ పాండాలంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఆఖరిసారిగా.. వెదురు ఆకులను నములుతూ, అమాయకంగా అటూ ఇటూ తిరుగుతున్న కవల పాండాలు.. షా జియావో, లీలీలను చూసి అభిమానులు దుఃఖాన్ని నియంత్రించుకోలేకపోయారు. టికెట్ దొరకని వేలాది మంది జనం జూ గోడల బయటే నిలబడి, పాండాల ఉనికిని అనుభూతి చెందుతూ మౌనంగా వీడ్కోలు పలికారు. రాజకీయాల మధ్య నలిగిన అమాయక ప్రేమ.. పాండాల తరలింపు వెనుక ఒక విషాదకరమైన రాజకీయ నేపథ్యం ఉంది. 1972లో చైనా–జపాన్ దౌత్య సంబంధాల పునరుద్ధరణకు గుర్తుగా వచ్చిన ఈ పాండాలు.. ఇప్పుడు అవే దౌత్య సంబంధాలు క్షీణించడం వల్ల వెళ్లిపోతున్నాయి. తైవాన్ విషయంలో జపాన్ ప్రధాని సనాయే తకైచి చేసిన వ్యాఖ్యలు చైనాకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. సంబంధాలు దెబ్బ తినడంతో, పాండాల లీజు ఒప్పందాలను పొడిగించడానికి చైనా నిరాకరించింది. ఫలితంగా, జనవరి 27న ఈ కవలలు చైనాకు తిరిగి వెళ్లిపోతున్నాయి. మంగళవారం ఈ కవలలు చైనా వెళ్లిపోయాక, జపాన్లో ఒక్క పాండా కూడా ఉండదు. అర్ధ శతాబ్దపు చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అవి మా సొంత బిడ్డలు! ‘నేను ఈ పాండాల కోసం 15 ఏళ్లలో ఒక కోటి ఫొటోలు తీశాను. నా సొంత పిల్లలే నన్ను వదిలి వెళ్తున్నట్టు ఉంది’.. అని తకాహిరో అనే అభిమాని భారమైన హృదయంతో చెప్పిన మాటలు అక్కడున్న అందరినీ కదిలించాయి. ‘ఈ పాండాలు కేవలం జంతువులు కావు, మా కుటుంబ సభ్యులు. అవి మాకు ఎంతో ఓదార్పునిచ్చాయి’.. అంటూ 54 ఏళ్ల మెచికో కన్నీరు పెట్టుకుంది. పాండాల తరలింపుతో ఏటా సుమారు రూ.1,100 కోట్ల ఆదాయాన్ని జపాన్ కోల్పోనుంది. వ్యాపారులు తమ దుకాణాల బోర్డులు మార్చడానికి నిరాకరిస్తూ, ‘అవి మళ్లీ తిరిగి వస్తాయి’.. అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూగబోయిన జపాన్ హృదయం! ప్రేమకు, ఓదార్పుకు గుర్తుగా నిలిచిన ఈ మూగజీవాలు.. దేశాల మధ్య సరిహద్దు గొడవలకు బలైపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం వీటిని తరలించే విమానం గాల్లోకి ఎగిరినప్పుడు, దాని రెక్కలు ఒక దేశపు 54 ఏళ్ల జ్ఞాపకాలు, కోట్లాది మంది భారమైన హృదయాలను కూడా మూటగట్టుకుని వెళ్లిపోతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రాణం తీసిన పని ఒత్తిడి.. టెక్కీ దుస్థితి వైరల్
గ్వాంగ్జౌ: విపరీతమైన ఆఫీసు పని ఒత్తిడి ఒక యువకుడి ప్రాణాలను కబళించింది. చైనాలోని గ్వాంగ్జౌలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన టెక్ ఉద్యోగులపై పడే విపరీతమైన పని ఒత్తిడిని మరోసారి తెరపైకి తెచ్చింది. 32 ఏళ్ల ప్రోగ్రామర్ గావో గ్వాంగ్ హూయ్ వారాంతపు సెలవు దినమైన శనివారం నాడు కూడా ఇంటి నుండే విధులు నిర్వర్తిస్తూ కుప్పకూలిపోయాడు.విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే గావో గ్వాంగ్ హూయ్ అస్వస్థతకు గురయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం పనిలో నిమగ్నమై ఉండగా, అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన గావోను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ, ఆయన ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన చైనా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది.గావోను ఉదయం 9:46 గంటల సమయంలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్షియల్ హాస్పిటల్ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్కు తరలించినట్లు ఆస్పత్రి రికార్డులు వెల్లడిస్తున్నాయి. వైద్యులు ఆయనను కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాధితుడు క్లినికల్గా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అతని మరణానికి ప్రధాన కారణం ‘సడన్ రెస్పిరేటరీ అండ్ కార్డియాక్ అరెస్ట్’ (శ్వాస మరియు గుండె ఆగిపోవడం) అని వైద్యులు ధృవీకరించారు. దీనికి ‘స్టోక్స్-ఆడమ్స్ సిండ్రోమ్’ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇది గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన అంతరాయాల వల్ల సంభవించే ప్రాణాంతక పరిస్థితి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ ఉదంతంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే ఆస్పత్రిలో గావో ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలోనే ఆఫీసు వర్గాలు ఆయనను 'వీ చాట్’ టెక్నికల్ వర్క్ గ్రూప్లో యాడ్ చేసి, వర్క్ అప్పగించాయి. గావో మరణించిన రోజున కూడా ఆయన ఐదు సార్లు కంపెనీ సిస్టమ్లోకి లాగిన్ అయినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారం దరిమిలా సంస్థ పని తీరు, అమానవీయ వైఖరిపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.గావో మృతికి పనిభారమే కారణమని ఆయన భార్య యాంగ్ ఆరోపించారు. డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత కారణంగా, ఆరుగురు చేసే పనిని గావో ఒక్కడే చేయాల్సి వచ్చేదని ఆమె వాపోయారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పాటు సేల్స్, మేనేజ్మెంట్ బాధ్యతలు కూడా ఆయనపై ఉండేవని, రాత్రి 11 గంటల వరకు పనిచేయడం సర్వసాధారణమైపోయిందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై ‘వర్క్-రిలేటెడ్ ఇంజ్యూరీ’ (పని సంబంధిత గాయం) కింద కేసు నమోదు చేసి, సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: 40 ఏళ్లకే రిటైర్మెంట్? వణికిస్తున్న ‘లే-ఆఫ్’లు -
చైనాతో ఒప్పందం చేసుకుంటే... 100 శాతం టారిఫ్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాగ్ని తాజాగా కెనడా వైపు మళ్లింది. చైనాతో వాణిజ్య ఒప్పందం విషయంలో మొండిగా ముందుకెళ్తే కెనడాపై ఏకంగా 100 శాతం టారిఫ్లు విధిస్తామని శనివారం ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాటి మధ్య ఒప్పందం కుదిరితే ఆ మరుక్షణమే సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్సోషల్లో ఈ మేరకు పోస్టు పెట్టారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా వస్తువులు, ఉత్పత్తులను అమెరికాలో గుమ్మరించేందుకు ఆయన కెనడాను వేదికగా మార్చజూస్తున్నారని ఆరోపించారు. ‘‘కార్నీ ఉద్దేశం అదే అయితే గనక ఆయన చాలా పొరబడుతున్నారు. అలా జరిగేందుకు నేనెప్పటికీ అనుమతించబోను’’అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని కార్యాలయం అధికారికంగా స్పందించలేదు. ట్రంప్ తన పోస్టులో కార్నీని ‘గవర్నర్’గా సంబోధించడం విశేషం. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా విలీనం కావాలని ఆయన పలుమార్లు సూచించడం తెలిసిందే. ఈ సంబోధన తాలూకు ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ట్రంప్, కార్నీ నడుమ కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్వి ఏకపక్ష పోకడలంటూ ఇటీవల కార్నీ దుయ్యబట్టారు. దాంతో చిర్రెత్తుకొచి్చన ట్రంప్, అసలు కెనడా బతుకుతున్నదే అమెరికా దయాదాక్షిణ్యాల మీద అంటూ దావోస్ వేదికగా ఎద్దేవా చేశారు. దీనిపై కార్నీ స్పందిస్తూ, నియంతృత్వ పోకడలకు తల వంచకుండా ప్రపంచానికి కెనడా ఒక ఉదాహరణగా నిలుస్తుందంటూ బదులిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో గాజా పునర్నిర్మాణానికి తలపెట్టిన శాంతిమండలిలో చేరేందుకు కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. చైనా తన విద్యుత్ వాహనాలపై టారిఫ్లను తగ్గించేలా కెనడాతో కొంతకాలంగా బేరసారాలాడుతోంది. ప్రతిగా కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ఈ మేరకు ఒప్పందం దిశగా వాటి మధ్య ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. దీన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాను ఆర్థికంగా, సామాజికంగా చైనా పూర్తిగా కబళించేస్తుందని ఇటీవలే ఆయన హెచ్చరించారు. అమెరికా ప్రతిపాదిత గోల్డెన్డోమ్ రక్షణ ఛత్రంలోకి వచ్చేందుకు కెనడా నిరాకరించడంపై కూడా ట్రంప్ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. -
భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టు.. భార్యకు కోర్టు వింత శిక్ష
చైనాలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను సోషల్ మీడియాలో విమర్శించినందుకు భార్యకు కోర్టు వింత శిక్ష విధించింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. చైనాలోని హెనాన్ ప్రావిన్స్కు చెందిన నియు నా అనే మహిళకు, గావో ఫీతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. గావో ఫీ ఒక బొగ్గు గని కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు. అయితే అదే ఆఫీసులో పనిచేసే ఒక వివాహితతో గావో ఫీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఈ విషయం నియుకు తెలియడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె సోషల్ మీడియాలో తన భర్త బండారాన్ని బయటపెట్టింది. అతడు పనిచేసే ఆఫీస్ వివరాలతో, భర్తను తిడుతూ పోస్టులు పెట్టింది. దీంతో గావో ఫీ తన భార్యపై కోర్టులో 'పరువు నష్టం' దావా వేశాడు. ఈ కేసును విచారించిన న్యాయస్ధానం ఎవరూ ఊహించని తీర్పు ఇచ్చింది. ఒకరు వ్యక్తిగతంగా ఎన్ని తప్పులు చేసినా, చట్టం ప్రకారం అతడి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని కోర్టు తేల్చింది. దీంతో తన భర్తకు వరుసగా 15 రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని నియును కోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాలు మేరకు జనవరి 12 నుంచి నియు నా క్షమాపణ వీడియోలు పెట్టడం ప్రారంభించింది. అయితే ఆమె మాత్రం చాలా వ్యంగ్యంగా తన భర్తకు సారీ చెబుతోంది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఉద్దేశించి.. "మీ ఇద్దరిది నిజమైన ప్రేమ. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ గౌరవాన్ని నేను కాపాడాలి కాబట్టి క్షమించు" అంటూ సెటైర్లు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే కోర్టు ఇచ్చిన ఈ వింత తీర్పుతో ఆమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయింది. ఆమెకు రోజుల వ్యవధిలోనే 3,50,000 మంది ఫాలోవర్లు వచ్చారు. -
చైనాతో జాగ్రత్త.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాను టార్గెట్ చేశారు. కెనడాపై విరుచుకుపడ్డారు. గ్రీన్లాండ్పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో చైనాతో కెనడా వ్యాపారం చేయడం వారికే నష్టం కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ట్రుత్ వేదికగా.. గ్రీన్లాండ్పై విస్తారమైన క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలనే అమెరికా ప్రణాళికను కెనడా వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ గోల్డెన్ డోమ్ కెనడాను రక్షిస్తుంది. అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్.. కెనడాను రక్షించబోతోంది. కెనడా మా నుండి చాలా ఉచితాలను పొందుతుంది. అమెరికా కారణంగానే కెనడా మనుగడ సాగిస్తోంది. వారు కూడా కృతజ్ఞతతో ఉండాలి. అలా కాకుండా అమెరికాతో సంబంధాలను తెంచుకుకుంటున్నారు. బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకు కెనడా ఆమోదం తెలిపింది. చైనాకు అనుకూలంగా ఓటు వేశారు. మొదటి సంవత్సరమే కెనడాను చైనా తినేస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చైనాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడానికి బీజింగ్ను సందర్శించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా మద్దతు కారణంగానే కెనడా మనుగడ సాగిస్తుందనే ట్రంప్ వాదనను తిరస్కరించారు. ఈ క్రమంలో మార్క్ కార్నీ మాట్లాడుతూ..‘కెనడాకు అమెరికాతో సంబంధమే లేదు. మనం కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతుంది. కెనడా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం. కెనడాకు మనమే యజమానులం. ఇది మన సొంత దేశం. ఇది మన భవిష్యత్తు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, దావోస్లో ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే చిన్న దేశాల పట్ల గొప్ప శక్తులు బలవంతం చేయడాన్ని కార్నీ తప్పుబట్టారు. -
దేశీ ఎంట్రప్రెన్యూర్ల హవా.. చైనాను వెనక్కి నెట్టిన భారత్!
విలువైన సంస్థలకు సారథ్యం వహిస్తున్న యువ ఎంట్రప్రెన్యూర్స్ సంఖ్యపరంగా చైనాను భారత్ వెనక్కి నెట్టింది. ఆ కోవకి చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తలు భారత్లో 166 మంది ఉండగా చైనాలో 140 మంది ఉన్నట్లు అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూత్ సిరీస్ 2025 ఒక నివేదికలో తెలిపింది.100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే అంకురాలను స్థాపించిన 40 ఏళ్ల లోపు ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఇందుకు పరిగణనలోకి తీసుకున్నారు. నివేదిక ప్రకారం 200 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే సంస్థలకు సారథ్యం వహిస్తున్న వారి సంఖ్య చైనాలో 54గా ఉండగా, భారత్లో 35గా ఉంది. ఇక 100 మిలియన్ డాలర్ల సంస్థలను స్థాపించిన లేదా 200 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే సంస్థలను నడిపిస్తున్న, 40 ఏళ్ల లోపు కొత్త తరం వ్యాపారవేత్తల సంఖ్య భారత్లో 201గా ఉండగా, చైనాలో 194గా ఉంది. ఈ జాబితాలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ అగ్రస్థానంలో ఉండగా, అల్కెమీకి చెందిన నిఖిల్ విశ్వనాథన్ రెండో స్థానంలో, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ హర్షద్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.ఈ ఎంట్రప్రెన్యూర్లు సారథ్యం వహిస్తున్న సంస్థల మొత్తం విలువ రూ. 31 లక్షల కోట్లుగా (357 బిలియన్ డాలర్లు) ఉందని హురున్ పేర్కొంది. ఇది భారతదేశపు జీడీపీలో 11వ వంతు అని తెలిపింది. ఈ ఎంట్రప్రెన్యూర్ల నేతృత్వంలోని కంపెనీలలో మొత్తం 4.43 లక్షల మంది పని చేస్తున్నట్లు వివరించింది. అపోలో హాస్పిటల్స్లో అత్యధికంగా 42,497 మంది ఉద్యోగులు ఉన్నారు. ముప్ఫైల మధ్యలో ఉన్న చాలా మంది ఫిన్టెక్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సరీ్వస్), హెల్త్కేర్, క్లీన్ ఎనర్జీ తదితర విభాగాల్లో తమ సంస్థలను అగ్రగాములుగా తీర్చిదిద్దుతున్నట్లు హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. -
చైనా జనాభా మరింత తగ్గింది!
బ్యాంకాక్: చైనాలో జనాభా తగ్గుదల క్రమంగా సంక్షోభ స్థాయికి చేరుతోంది. గత ఏడాది కాలంలో దేశంలో జనాభా 33.9 లక్షల మేరకు తగ్గి 140.4 కోట్లకు చేరింది. 2025లో దేశంలో జననాల రేటు ఏకంగా 17 శాతం మేరకు పడిపోయింది. ఇక జననాల సంఖ్య కేవలం 79.2 లక్షలుగా నమోదైంది. 2024తో పోలిస్తే 16.2 లక్షల మేరకు తగ్గింది. ఇక 2025లో చైనాలో మరణాల సంఖ్య 1.131 కోట్లుగా నమోదైంది. గత ఐదు దశాబ్దాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం! చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) సోమవారం విడుదల చేసిన తాజా జనాభా లెక్కల్లో ఈ వివరాలను పొందుపరిచింది. ఆ దేశంలో జననాల సంఖ్యలో తగ్గుదల నమోదవడం ఇది వరుసగా నాలుగో ఏడాది! ఈ పరిణామం షీ జింగ్పిన్ సర్కారుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం అంచనా వేసింది. చైనా దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగడం, 2023లో ఆ స్థానాన్ని భారత్కు కోల్పోవడం తెలిసిందే. పెళ్లీ వద్దు, పిల్లలూ వద్దు! చైనాలో జనాభా తగ్గుదల సమస్యకు ప్రధాన కారణం పిల్ల్లల్ని కనడం పట్ల చైనీయుల్లో వ్యక్తమవుతున్న తీవ్ర నిరాసక్తతే. చుక్కలనంటుతున్న జీవన వ్యయం, భరించలేని ఒత్తిళ్ల నడుమ పిల్లల్ని కని పెంచడం తమవల్ల కాదంటూ సగటు చైనీయులు చేతులెత్తేస్తున్నారు. జీవనవ్యయం ఊహాతీతంగా పెరిగిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. యువతీ యువకుల్లో చాలామంది అసలు పెళ్లి మాటే ఎత్తడం లేదు. వీలైనంత కాలం సింగిల్గానే బతుకు బండి లాగించడానికి ఇష్టపడుతున్నారు. దాంతో కొన్నేళ్లుగా చైనాలో పెళ్లిళ్ల సంఖ్యలో కూడా భారీగా తగ్గుదల నమోదవుతోంది. 2024లో దేశవ్యాప్తంగా జరిగిన పెళ్లిళ్లు కేవలం 61 లక్షలే! 2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గుదల! అంతేకాదు, గత 45 ఏళ్లలో అత్యల్పం కూడా!! దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సంఖ్య గత పదేళ్లుగా తగ్గుతూనే వస్తోంది. అయితే 2025లో మాత్రం చైనాలో పెళ్లిళ్ల సంఖ్య 8.5 శాతం పెరుగుదల నమోదైంది. పెరుగుతున్న వృద్ధులు వృద్ధుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటం చైనా నాయకత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్న అంశం. ప్రస్తుతం అక్కడ వృద్ధుల సంఖ్య 32.3 కోట్లు. మొత్తం జనాభాలో ఇది ఏకంగా 23 శాతం! అక్కడ వృద్ధుల సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తోంది. అదేసమయంలో పనిచేసే వయసువారి సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. 2035 నాటికి చైనాలో వృద్ధుల సంఖ్య 40 కోట్లు దాటుతుందని అంచనా. కారి్మకుల లభ్యత భారీగా తగ్గుతుండటంతో రిటైర్మెంట్ వయసును పురుషులకు 60 నుంచి 63 ఏళ్లకు, మహిళలకు 55 నుంచి 58 ఏళ్లకు చైనా పెంచేసింది.‘పామూ’ కారణమేనా?చైనాలో జననాలు భారీగా తగ్గడానికి మరో గమ్మత్తైన కారణం కూడా తెరపైకి రావడం విశేషం. అదే... స్నేక్ ఇయర్! చైనా క్యాలెండర్ ప్రకారం 2025 వుడ్ స్నేక్ నామ సంవత్సరం. పాము పేరిట వచ్చే ఏడాది పిల్లల్ని కనేందుకు అస్సలు అనువైనది కాదన్నది చైనీయుల నమ్మకం. ఈ కారణంగా కూడా గతేడాది జననాల రేటు బాగా తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనాలో సంవత్సరాలకు జంతువుల పేర్లు పెట్టడం వేల ఏళ్లనాటి సంప్రదాయం. 12 ఏళ్లకు 12 జంతువుల పేర్లుంటాయి. వన్ చైల్డ్ పాలసీ జనాభా నియంత్రణకు దశాబ్దాల పాటు చైనా అనుసరించిన కఠిన నిబంధనలు కూడా ప్రస్తుత పరిస్థితికి మరో ప్రధాన కారణంగా మారాయి. ఒక్కరి కంటే ఎక్కువ మందిన ఇకనేందుకు వీల్లేదన్న నిబంధనను 1980 ఉంచి చైనా అత్యంత కఠినంగా అమలు చేయడం తెలిసిందే. జనాభా తగ్గుదల నేపథ్యంలో పదేళ్ల క్రితం ఈ నిబంధనను ఎత్తేసినా లాభం లేకపోయింది. దంపతులు ఇద్దరు పిల్లల్ని కనొచ్చంటూ 2015లో నిబంధనలను చైనా ప్రభుత్వం సడలించింది. ఐదేళ్లయినా పెద్దగా ఫలితం లేకపోవడంతో 2021లో దాన్ని ముగ్గురు పిల్లలకు పెంచింది. అయినా జనం మాత్రం ఎక్కువ మందిని దేవుడెరుగు, ఒక్కర్ని కూడా కనేందుకు ఇష్టపడటం లేదు! ఒక్కో కాన్పుకు 3,600 యువాన్లు (500 డాలర్లు) ఇస్తామన్న ప్రకటన కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అంతేగాక ప్రతి పిల్లాడికీ పెంపకం నిమిత్తం ఏటా 1,534 డాలర్లు ఇస్తామన్నా జనం అంతగా పట్టించుకోలేదు. ఇలా కాదని ప్రభుత్వం కండోమ్ల వాడకాన్ని తగ్గించే చర్యలకు దిగింది. అందులో భాగంగా వాటిపై, గర్భ నిరోధక మాత్రలపై ఎడాపెడా పన్నులు పెంచేసింది. కండోమ్లపై అయితే జనవరి 1 నుంచి పన్నులను మరో 13 శాతం పెంచేసింది! అంతేగాక డే కేర్ సెంటర్లు, కేజీ స్కూళ్లకు పలు పన్ను మినహాయింపులు వంటి పలు చర్యలకు కూడా దిగింది. అయినా జనాభా పెరుగుదల విషయంలో ఆశించిన ఫలితాలు పెద్దగా కనిపించడం లేదని తాజా గణాంకాలు మరోసారి తేల్చేశాయి. ఒక దేశంలో జనాభా పెరగాలంటే మహిళల సగటు సంతాన సాఫల్య రేటు కనీసం 2.1, అంతకు మించి ఉండాలి. కానీ చైనాలో మాత్రం అది 2020 నాటికే ఏకంగా 1.3కి తగ్గిపోయింది! ఇక 2025లోనైతే ఆ దేశంలో జననాల రేటు ప్రతి 1,000 మంది జనాభాకు ఏకంగా 5.63 శాతానికి తగ్గిపోయింది. 1949లో మావో జె డాంగ్ సారథ్యంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ ఆ దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే అత్యల్పం! చైనాతో పాటు తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా వంటి పలు తూర్పు ఆసియా దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తూ వస్తోంది!! -
ట్రంప్ పన్నులపై భగ్గుమన్న నాటోదేశాలు
గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై ట్రంప్ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై తాజాగా ఈయూ ఫారెన్ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్ స్పందించారు. మిత్ర దేశాల మధ్య వైరం వల్ల పరోక్షంగా రష్యా-చైనాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని తెలిపారు.డెన్మార్క్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఎనిమిది దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 10 శాతం పన్నులు విధించారు. అయితే ఈ అధిక పన్నులను ఆ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దీనిపై మాట్లాడుతూ ట్రంప్ బెదిరింపులు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ అంశంపై ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్ ఎక్స్లో స్పందించారు. ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ "మిత్రులమధ్య వైరం వల్ల చైనా, రష్యాలు లబ్ధిపొందే అవకాశం ఉంది. గ్రీన్లాండ్ భద్రత ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. దానిని నాటోలో అంతర్గతంగా చర్చించుకోవాలి. ఈ అధిక పన్నుల వల్ల యూరప్ దేశాలతో పాటు అమెరికా పేదదేశంగా మారే అవకాశం ఉంది". అని ఆమె అన్నారు. అదేవిధంగా ఈ అంశం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సహయాన్ని పక్కదారి పట్టించేదిగా ఉండకూడదన్నారు.అయితే గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఎనిమిది దేశాలు, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై ట్రంప్ 10 శాతం పన్నులు విధించారు. ఫిబ్రవరి 10 నుంచి అది అమలులోకి వస్తుందని తెలిపారు. దీనిపై ఆ దేశాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. -
సుదీర్ఘ సొరంగ రహదారి
ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన సొరంగ రహదారి. చైనా ప్రభుత్వం గత డిసెంబర్ 16న దీనిని ప్రారంభించింది. టియాన్షాన్ పర్వతశ్రేణుల వద్ద కొండలను తొలిచి నిర్మించిన ఈ సొరంగ రహదారి పొడవు 22.13 కిలోమీటర్లు. ఉరుంకీ నగరం నుంచి కోర్లా నగరానికి వెళ్లేందుకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో చైనా ప్రభుత్వం ఈ సొరంగ రహదారిని నిర్మించింది. ఉరుంకీ నుంచి కోర్లాకు ఇదివరకు ఏడుగంటలు పట్టేది.ఈ సొరంగం వల్ల ప్రయాణ సమయం మూడున్నర గంటలకు తగ్గింది. దాదాపు ఏడువందల మీటర్ల లోతున ఈ సొరంగ మార్గాన్ని నిర్మించడం వల్ల అతి శీతల వాతావరణంలో సునాయాసంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. టియాన్షాన్ పర్వతశ్రేణుల వద్ద శీతకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 42 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంటాయి. పూర్తిగా మంచు నిండిన మార్గంలో వాహనాలు ప్రయాణించడం దుస్సాధ్యంగా ఉండేది. ఈ సొరంగం నిర్మించడం వల్ల మంచు కారణంగా ఆటంకాలు లేకుండా, సురక్షితంగా సునాయాసంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. -
తైవాన్ చుట్టూ చైనా సైనిక కదలికలు..
తైవాన్ చుట్టూ చైనా సైనిక ఉనికి మరింత పెరుగుతోంది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల వరకు తైవాన్ ప్రాదేశిక జలాల సమీపంలో 26 చైనా సైనిక విమానాలు, ఎనిమిది నావికాదళ నౌకలు, ఒక ప్రభుత్వ నౌకను గుర్తించారు.ఈ 26 విమానాల్లో ఏడు విమానాలు సెంట్రల్ లైన్ను దాటి తైవాన్ ఉత్తర, మధ్య, నైరుతి ఎయిర్ డిఫెన్స్ జోన్లలోకి ప్రవేశించాయి. ఇదే సమయంలో, చైనా సైన్యానికి చెందిన ఒక నిఘా మానవరహిత వైమానిక వాహనం (డ్రోన్) కూడా తైవాన్ నైరుతి రక్షణ జోన్లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ రేడియో హెచ్చరికలు జారీ చేసిన అనంతరం, ఆ డ్రోన్ సంఘటనా స్థలం నుంచి వెనక్కి వెళ్లిందని పేర్కొంది. ఈ డ్రోన్ తైవాన్ నియంత్రణలో ఉన్న ప్రాటాస్ దీవుల మీదుగా ఎగిరినట్లు వెల్లడించింది. ఈ చర్యను తైవాన్ రక్షణ శాఖ రెచ్చగొట్టే, బాధ్యతారాహిత్య చర్యగా అభివర్ణించింది.శుక్రవారం కూడా తైవాన్ చుట్టూ చైనా సైనిక కదలికలు తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు మొత్తం 34 చైనా విమానాలు, 11 నౌకలు గుర్తించినట్లు జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ నివేదించింది. వీటిలో 18 విమానాలు సెంటర్ లైన్ను దాటి తైవాన్ ఉత్తర, మధ్య, నైరుతి, తూర్పు ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ADIZ)లోకి ప్రవేశించాయని పేర్కొంది.చైనా సైనిక చర్యల నేపథ్యంలో తైవాన్ భద్రతాపరమైన పరిస్థితులపై ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. -
కెనడా, చైనా స్నేహగీతం
బీజింగ్: కెనడా క్రమంగా అమెరికాకు దూరమవుతూ చైనాకు దగ్గరవుతోంది. చైనా నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ వాహనాలపై టారిఫ్లను 100 శాతం తగ్గించనున్నట్టు కెనడా ప్రధాని మార్క్ కార్నీ శుక్రవారం ప్రకటించారు. కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై చైనా ఇప్పటికే టారిఫ్లను 84 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఇరుదేశాల నేతలు రెండు రోజుల క్రితం బీజింగ్లో సమావేశమయ్యారు. వాణిజ్య బంధం బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఐదేళ్లలో చైనా నుంచి 70 వేలకు పైగా ఈవీలను దిగుమతి చేసుకుంటామని కార్నీ వెల్లడించారు. గత రెండు రోజులు చరిత్రాత్మక, ఫలవంతమైన దినాలు అంటూ వ్యాఖ్యానించారు. కెనడాతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తామని చైనా అధినేత జీ జిన్పింగ్ స్పష్టంచేశారు. గత ఏడాది అక్టోబర్లో మార్క్ కార్నీతో సమావేశమయ్యాయని, చైనా–కెనడా సంబంధాల్లో అప్పుడే నూతన అధ్యాయం ప్రారంభమైందని స్పష్టంచేశారు. గత ఎనిమిదేళ్లలో చైనాలో పర్యటించిన తొలి కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ రికార్డుకెక్కారు. వాస్తవానికి కెనడా, చైనాల మధ్య టారిఫ్ల యుద్ధం నడిచింది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత కెనడా ప్రభుత్వం చైనా వైపు మొగ్గుచూపుతోంది. -
భారత్, చైనా నడుమ షాక్స్గావ్ రగడ
షాక్స్గావ్. భారత్, చైనా నడుమ సరికొత్త రగడకు కేంద్ర బిందువుగా మారిన లోయ. కల్లోల కశీ్మర్లో అత్యున్నత పర్వత శ్రేణుల సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఇరుదేశాల నడుమ మరోసారి ఘర్షణ వాతావరణాన్ని పెంచుతోంది. అది ఎప్పటికీ తమదేనని, అక్కడ జరిపే ఎలాంటి నిర్మాణాలనైనా అక్రమమైనవిగానే పరిగణిస్తామని భారత్ తాజాగా స్పష్టం చేయడం తెలిసిందే. షాక్స్గావ్ తమదేనంటూ చైనా ఎప్పట్లాగే తెంపరితనం ప్రదర్శిస్తోంది. అక్కడి తన నిర్మాణాలన్నీ సక్రమమేనని అడ్డగోలు వాదనకు దిగుతోంది. ఇంతకీ ఏమిటీ షాక్స్గావ్? ఎందుకీ వివాదం?షాక్స్గావ్ లోయ కశ్మీర్లో హంజా–గిల్గిట్ ప్రాంతంలో ఉంటుంది. 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నెలకొని ఉన్న అతి శీతల ప్రాంతం. ఇటు కారకోరం పర్వత శ్రేణులను, అటు ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ను ఆనుకునే ఉంటుంది. దీన్ని ట్రాన్స్ కారకోరం శ్రేణిగా అని పిలుస్తారు. దీనికి ఉత్తరాన చైనా, దక్షిణాన, పశి్చమాన పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం (పీఓకే) ఉన్నాయి. అలా ఈ లోయ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉండటంతో దీనిపై ఆధిపత్యం చాలా ప్రధానంగా మారింది. పాక్ పెట్టిన చిచ్చు.. భారత్, చైనా నడుమ షాక్స్గావ్ చిచ్చు పెట్టింది దాయాది పాకిస్తానే. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే నాటి అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాక్ సైన్యం షాక్స్గావ్ లోయను ఆక్రమించేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపినా అక్కడినుంచి వైదొలగలేదు. భారత్ కూడా ఈ ప్రాంతాన్ని తిరిగి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలేవీ చేయలేదు. 1950ల్లో తూర్పు హంజా గుండా చైనా ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకురావడం మొదలు పెట్టింది. దాంతో ఆ దేశంతో భారత సంబంధాలు క్రమంగా దిగజారడం మొదలైంది. దాంతో 1963లో నాటి పాక్ పాలకుడు అయూబ్ ఖాన్ ఓ కుటిలాలోచన చేశారు. యార్కండ్ నదితో పాటుగా షాక్స్గావ్ లోయ మొత్తాన్నీ చైనాకు ధారాదత్తం చేసేశారు. చైనా–పాక్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా కొన్నేళ్లుగా చైనా అక్కడ దూకుడుగా పలు నిర్మాణాలు చేపట్టింది. ముఖ్యంగా ఇరు దేశాలనూ అనుసంధానిస్తూ హైవే నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. ఏకంగా 10 మీటర్ల వెడల్పుతో ఇప్పటికే 75 కి.మీ. పొడవున రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చైనా, పాక్ కుదుర్చుకున్న సీపీఈసీ ఒప్పందం షాక్స్గావ్లో చెల్లబోదని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింద. దానిని భారత్ ఎన్నడూ గుర్తించలేదని స్పష్టం చేసింది. అక్కడి చైనా–పాక్ ఆర్థిక కారిడార్ను అక్రమమైనదిగానే గుర్తిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం కుండబద్దలు కొట్టారు. దీనిపై చైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భారత్కు ఇరకాటమే.. ప్రాదేశికంగా, సైనికపరంగా షాక్స్గావ్ అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది. అటు పాక్, ఇటు చైనా రూపంలో ఇద్దరు ప్రత్యర్థులు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ కీలక ప్రాంతంపై పూర్తిస్థాయి పట్టు భారత్కు అత్యంత కీలకం. దీనికి ఒకవైపున్న సియాచిన్ గ్లేసియర్ నుంచి పాక్పై భారత్ నిత్యం డేగకన్ను వేసి ఉంచుతుంది. మరోవైపున ఉన్న కారకోరం శ్రేణి గుండా చైనాపై నిఘా నేత్రం సారిస్తూ ఉంటుంది. ‘‘2024 నాటికే చైనా 4.8 కి.మీ. పొడవైన అఘిల్ కనుమ గుండా దిగువ షాక్స్గావ్ వరకు రోడ్డు నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసేసింది. నిర్మాణ బృందాల మాటున చైనా సైన్యం అక్కడ మోహరించింది. ఈ ప్రాంతం సియాచిన్కు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది మన భద్రతకు ఎప్పటికైనా ముప్పే’’అని ప్రముఖ భద్రత వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లాని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘దశాబ్దాలుగా సియాచిన్పై భారత్ పట్టు కొనసాగుతోంది. అక్కడినుంచి దక్షిణాన పాక్పై నిత్యం కన్నేసి ఉంచుతున్నాం. ఇప్పుడు ఉత్తరాన షాక్స్గావ్ వైపు నుంచి చైనా ముప్పు ముంచుకొచి్చంది. దాంతో సియాచిన్, పరిసర ప్రాంతాల్లో మనం నిత్యం రెండువైపులా శత్రువులను కాచుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. మైనస్ 50 డిగ్రీల అతి శీతల పరిస్థితులుండే చోట మన సైనిక బలగాలను రెండు భాగాలుగా మోహరించాల్సి వస్తుంది’’అని ఆయన వివరించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాకు భారత ఆర్మీ జనరల్ వార్నింగ్.. ఆ భూమి ఎప్పటికీ మాదే
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. షక్సాగామ్ వ్యాలీలో చైనా మౌళిక సదుపాయాల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ అంగీకరించదని తేల్చిచెప్పారు. 1963లో చైనా-పాక్ మధ్య జరిగిన భూబదిలీ ఒప్పందాన్ని ఇండియా ఎప్పుడు ఆమోదించేది లేదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు.కాగా షక్సాగామ్ వ్యాలిలో చైనా చేపడుతున్న నిర్మాణాలపై జనవరి 9న భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ భూమిపై పాక్- చైనా చేసుకున్న ఒప్పందం ఎప్పటికీ చెల్లదు. దీనిని భారత్ ఎప్పటికీ గుర్తించదని ప్రకటించింది. అయితే దానికి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో వింగ్ నిన్న (సోమవారం) స్పందించారు. 1963లోనే ఈ భూభాగంపై పాకిస్థాన్-చైనా అంగీకారం చేసుకున్నాయని ఇప్పుడు దానిపై స్పందించడానికి భారత్కు అవకాశం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేదీ తాజాగా స్పందించారు. జనరల్ ద్వివేదీ మాట్లాడుతూ " ఈ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను భారత్ గుర్తించదు. షక్సాగామ్పై 1963లో పాక్తో చేసుకున్న ఒప్పందం ఎట్టిపరిస్తితుల్లో చెల్లదు. అక్కడ కట్టే నిర్మాణాలను అక్రమ కట్టడాలుగానే భారత్ భావిస్తోంది" అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉందని కూడా జనరల్ ద్వివేదీ స్పష్టం చేశారు.షక్సాగామ్ వివాదంషక్సాగామ్ లోయ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉంది. దీనిని పాకిస్థాన్ 1963లో జరిగిన ఒప్పందంలో భాగంగా చైనాకు అప్పగించింది. ఆ భూమిలో ప్రస్తుతం చైనా రహదారులు, సైనికస్థావరాలు తదితర నిర్మాణాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ నిర్మాణాలను వ్యతిరేకిస్తుంది. -
ఒంటరి జీవుల వింత యాప్.. అత్యధిక డౌన్లోడ్లతో..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఒంటరిగా ఉండాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చైనాలో ఒంటరితనం అనేది ఒక సామాజిక అంశంగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉండేవారి భద్రతను దృష్టిలో ఉంచుకుని, రూపొందించిన ‘ఆర్ యూ డెడ్?’ (Are You Dead?) అనే మొబైల్ యాప్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది.ఈ యాప్ గత మే నెలలో ప్రారంభమైనప్పటి నుండి అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న పెయిడ్ యాప్గా నిలిచింది. ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు.. వారికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యానికి గురైనా ఆ సమయంలో తలెత్తే భయాన్ని ఈ యాప్ పోగొడుతోంది. ఈ యాప్లో క్లిష్టమైన ఫీచర్లు లేదా నిరంతర ట్రాకింగ్ అనేది ఉండదు. యాప్ యూజర్లు ప్రతి రెండు రోజులకు ఒకసారి యాప్ను ఓపెన్ చేసి, తాము క్షేమంగా ఉన్నామని నిర్ధారించడానికి స్క్రీన్పై కనిపించే బటన్ను నొక్కాలి.ఒకవేళ వినియోగదారుడు నిర్ణీత సమయంలోగా స్పందించకపోతే, యాప్ వెంటనే అత్యవసర కాంటాక్ట్ నంబర్కు సందేశాన్ని పంపుతుంది. తద్వారా సదరు వ్యక్తికి ఏదో ప్రమాదం జరిగి ఉండవచ్చని వారి సన్నిహితులు గ్రహించి, వెంటనే స్పందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రారంభంలో ఉచితంగా లభించిన ఈ యాప్, ప్రస్తుతం 8 యువాన్ల (సుమారు రూ. 95) ధరతో అందుబాటులో ఉంది. చైనాలో 2030 నాటికి ఒంటరిగా నివసించే వారి సంఖ్య 20 కోట్లకు చేరుకోవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.వృద్ధాప్యం, ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్లడం మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా ఈ యాప్ ఆదరణం పొందుతోంది. ఈ యాప్ పేరు ‘ఆర్ యూ డెడ్?’ (మీరు చనిపోయారా?) అని ఉండటంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేరు ప్రతికూలంగా ఉందని కొందరు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా ‘ఆర్ యూ అలైవ్?’ లేదా మరేదైనా పేరు పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు యాప్ పేరును మార్చడంపై ఆలోచిస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో హిందూ ఓటర్ల భయం.. ఈసీకి ప్రత్యేక వినతి -
చైనా మాంజా.. సీపీ సజ్జనార్కు టీహెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: చైనా మాంజాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అడ్వకేట్ రామరావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక కోరిన కమిషన్.. ఫిబ్రవరి 26వ తేదీలోపు రిపోర్ట్ అందజేయాలని టీహెచ్ఆర్సీ ఆదేశించింది.కాగా, నిషేధిత చైనా మాంజా నగరవాసుల ప్రాణాల మీదకు తెస్తోంది. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. కాగా తాజాగా, సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా కారణంగా మరొకరు గాయపడ్డారు. ఉప్పల్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగలడంతో ఏఎస్సై నాగరాజు గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఏఎస్ఐని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చైనా మాంజా అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
షక్స్గామ్ లోయ మాదే
బీజింగ్: సరిహద్దుల్లోని షక్స్గామ్ లోయ ప్రాంతం తమదేనంటూ చైనా మళ్లీ ప్రకటించుకుంది. భారత్ అభ్యంతరం తెలపడంతో ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేసింది. లోయలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అభ్యంతరాలకు తావులేకుండా నిర్మిస్తున్నవని తెలిపింది. షక్స్గామ్లోయలో చైనా ఆధ్వర్యంలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులపై భారత్ శుక్రవారం అభ్యంతరం తెలిపింది. భారత దేశ ప్రాదేశిక సమగ్రతకు, ప్రయోజనాలకు భంగం కలిగిన పక్షంలో తగు చర్యలు తీసుకునే హక్కు తమకుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూకశీ్మర్లోని భాగమే షక్స్లోయ. సుమారు 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఈ లోయను పాక్ ప్రభుత్వం 1963లో చైనాకు అప్పగించి, సరిహద్దు ఒప్పందం కుదుర్చుకుంది. ‘షక్స్గామ్ లోయ భారత్లోనిదే. 1963లో చైనా–పాకిస్తాన్ కుదుర్చుకున్న సరిహద్దు ఒప్పందాన్ని మేం ఎన్నడూ గుర్తించలేదు. ఈ ఒప్పందం చట్టవిరుద్ధం, చెల్లుబాటు కాదని పలుమార్లు తెలిపాం’అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ తెలిపారు. అదేవిధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగం మీదుగా వెళ్లే చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)ను కూడా భారత్ గుర్తించడం లేదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశీ్మర్, లద్దాఖ్లలోని పూర్తి ప్రాంతం భారత్లో విడదీయరాని భాగమని చెప్పారు. ఇదే అంశాన్ని చైనా, పాక్ అధికారులు పలు మార్లు తెలిపామని జైశ్వాల్ వెల్లడించారు. జైశ్వాల్ ప్రకటనపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ సోమవారం మీడియా సమక్షంలో స్పందించారు. భారత్ పేర్కొన్న భూభాగం చైనాదేనన్నారు. చైనా తన భూభాగంలోనే మౌలిక వసతుల నిర్మాణాలను చేపట్టింది. 1960ల్లో చైనా, పాకిస్తాన్లు సరిహద్దు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ ఉమ్మడి సరిహద్దును అంగీకరించాయి’అని తెలిపారు. సీపెక్పై మావో నింగ్ మాట్లాడుతూ..ఇది దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, సామాజికారి్థక అభివృద్ధికి ఉద్దేశించిన ప్రాజెక్టని చెప్పారు. సీపెక్, సరిహద్దు ఒప్పందాలతో కశ్మీర్ విషయంలో తమ వైఖరి మారబోదన్నారు. ఈ వివాదాన్ని ఐరాస, మండలి తీర్మానాలకు లోబడి పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమన్నారు. ఇలాఉండగా, కశీ్మర్ వివాదం పరిష్కారమయ్యాక అధికారికంగా ఒప్పందంపై సంతకాలు చేద్దామంటూ 1963నాటి ఒప్పందంలో చైనా–పాక్లు పేర్కొనడం గమనార్హం. -
పతంగుల చరిత్ర తెలిస్తే ఆశ్చర్యమే..!
రాష్ట్రంలో రేపటి నుంచి (జనవరి 13) కైట్ ఫెస్టివల్ 2026 ప్రారంభం కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే పతంగులను ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎగురవేస్తారు. ఈ నేపథ్యంలో అసలు పతంగుల చరిత్ర ఏంటి ? ఏఏ దేశాలలో వాటిని ఎగురవేస్తారు? రాష్ట్రంలో నిర్వహించే ట్ కైట్ ఫెస్టివల్ ప్రత్యేకతలు.. తెలుసుకోవాలని ఉందా అయితే మరెందుకు ఆలస్యం ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి.శ్రీరాముడు ఎగరవేసిన పతంగితెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రైతులందరూ సంతోషంగా వేడుకను జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం చాలా పాపులర్ అయితే ఈ గాలిపటాలకు ఘనమైన చరిత్రే ఉంది. పురాణాల ప్రకారం శ్రీరామ చంద్రుడు మకర సంక్రాంతి రోజున గాలిపటాన్ని ఎగురవేసారని అది ఇంద్రలోకానికి వెళ్లిందని ప్రజలు విశ్వసిస్తారు. ఈ విషయాన్ని తులసిదాసు రామచరితమానస్లోనూ ప్రస్థావించారు. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో గాలిపటాలు ఎగురవేయడం ప్రారంభమైందని నమ్ముతారు.చారిత్రక ఆధారాలుచరిత్రప్రకారం 5వ శతాబ్ధంలో చైనాలో సైనిక అవసరాల కోసం చెక్క గాలిపటాన్ని తయారు చేశారని దీనిని సైనిక సమాచారం కోసం, గాలిదిశను తెలుసుకోవడం కోసం వినియోగించేవారని ఆధారాలున్నాయి. అనంతరం భారత్కు చైనా యాత్రికులు ఫాహియాన్, హుయాన్త్సాంగ్ వచ్చినప్పుడు వీటిని తీసుకవచ్చారని చరిత్రకారులు చెబుతుంటారు. అంతేకాకుండా మెుగలుల కాలంలో సైతం గాలిపటాల క్రీడలు నిర్వహించేవారని ఆ తరువాతి కాలంలో క్రమంగా ఆటలుగా మారాయని చెబుతుంటారు.శరీరానికి కలిగే మేలుగాలిపటాలు బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేస్తారు దీంతో సూర్యరశ్మి శరీరానికి సమృద్ధిగా తాకి విటమిన్ డీ లభిస్తుందని చెబుతుంటారు. చలికాలంలో వీటిని ఎగరవేస్తారు గనుక చలినుంచి రక్షణ కోసమనే వాదన ఉంది. అంతేకాకుండా గాలిపటాన్ని నియంత్రించడం అనేది ఒక విన్యాసం. దీని ద్వార కళ్లకు, మెదడుకు చక్కటి వ్యాయామం కలుగుతుంది. ఏకాగత్రను పెంచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.ప్రపంచవ్యాప్తంగాఅయితే ఇంత ఘనమైన చరిత్ర ఉన్న పతంగులు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఎగురవేస్తున్నారు. అమెరికా, బ్రెజిల్, యూరప్, ఫ్రాన్స్లతో పాటు చైనా, జపాన్, థాయిలాండ్, ఇండోనేషియాలతో పాటు ఇతర దేశాలలో గాలిపటాలు ఎగురవేయడాన్ని పెద్ద వేడుకలాగా నిర్వహిస్తారు. దీనికోసం ప్రత్యేక పోటీలు నిర్వహించి ఘనంగా వేడుకలు జరుపుతారు. భారత్లోనూ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో పతంగుల పండుగ నిర్వహిస్తారు. గుజరాత్లో నిర్వహించే కైట్ ఫెస్టివల్ దేశవ్యాప్తంగా చాలా ఫేమస్కైట్ ఫెస్టివల్-2026హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్-2026 జనవరి 13 నుంచి 18 వరకూ జరగనుంది. ఈ వేడుకల్లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లయర్స్ థాయిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆల్జీరియా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, శ్రీలంక, రష్యా, స్విట్జర్లాండ్, తదితర దేశాల నుంచి పాల్గొననున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొననున్నట్లు ప్రకటించింది. ఫెస్ట్ సందర్భంగా సాంస్క్రృతిక ప్రదర్శనలతో పాటు వివిధ రకాల ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఫెస్ట్లో మాంజా దారంతో పతంగులు ఎగురవేయడం నిషిద్దమని కేవలం పత్తితో తయారు చేసిన దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని నియమం విధించింది. తెలంగాణలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ 2011 నుంచి ప్రారంభమయ్యింది. -
మేము దాడి చేయకుంటే వాళ్లు చేస్తారు: ట్రంప్
గత కొంతకాలంగా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటానంటూ డెన్మార్క్ను రెచ్చగొడుతున్న ట్రంప్ తాజాగా ఆ అంశంపై మరోసారి మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవాల్సిందేనన్నారు లేకుంటే చైనా, రష్యాలు ఆ పని చేస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.వెనిజువెలా అధ్యక్షున్ని బంధించి ఆ దేశ పాలనను హస్తగతం చేసుకున్న ట్రంప్ తన తదుపరి టార్గెట్ గ్రీన్లాండ్ అని ప్రకటించారు. అరుదైన ఖనిజాలు, చమురు, సహజవాయువులు పుష్కలంగా ఉండడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆ ద్వీపంపై అమెరికా అధ్యక్షుడి కన్ను పడింది. దీంతో ఎలాగైనా ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేస్తామని దాని రక్షణ బాధ్యత తమపై ఉందని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే దీనిపై గ్రీన్లాండ్ ప్రజలు నిరాసక్తి చూపిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో అమెరికాలో కలిసేది లేదని తాము స్వతంత్రంగా ఉండదలుచుకుంటున్నామని తమ దేశ పార్లమెంటులో తీర్మానం సైతం చేశారు.అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోవడం లేదు తాజాగా గ్రీన్లాండ్ వ్యవహారంపై మరోసారి స్పందించారు. "గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. లేకపోతే చైనా, రష్యా దాన్ని స్వాధీన పరచుకుంటాయి. ఎట్టిపరిస్థితుల్లో అది నేను జరగనివ్వను". అని ట్రంప్ అన్నారు. గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్తో ఒప్పందం చేసుకుంటాం. లేదా ఎలాగైనా స్వాధీనం చేసుకుంటాం అని పేర్కొన్నారు.రష్యా, చైనా దేశాల సైనిక బలం ఏమిటో మీకు తెలుసు వారికి ప్రతిచోట సబ్మెరైన్లు, డిస్ట్రాయర్లు ఉన్నాయి. వారి సైనిక శక్తిని మీరు తట్టుకోలేరు అని డెన్మార్క్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే గ్రీన్లాండ్పై ట్రంప్ వ్యాఖ్యలనను డెన్మార్క్ ప్రధాని ఖండించారు. ఒకవేళ గ్రీన్లాండ్పై అమెరికా దాడి చేస్తే అది 80 సంవత్సరాల ట్రాన్స్ అట్లాంటిక్ ఒప్పందానికి భంగం కలిగించడమేనన్నారు. -
పచ్చని మనసున్న యంత్రాలు!
మంచి మనసు ఉంటే అంతా మంచే జరుగుతుంది అన్నట్లు, మంచి మనసున్న యంత్రాలు కూడా మంచి పనులు చేయగలవు అని ఈ సాలెపురుగు రోబోలు నిరూపించాయి. చైనా ఎడారుల్లో 2025లో షాంసీ ప్రావిన్స్లో ప్రారంభమైన ‘గ్రీన్ వాకర్స్’ ప్రాజెక్ట్లో భాగంగా ఈ రోబోలు ఎడారిని ఒక పచ్చని తోటగా మారుస్తున్నాయి. వీటి చేతుల్లో ఆయుధాలు లేవు. కాని, గుండెల్లో పచ్చదనంపై ప్రేమ కోడ్ కొండంత ఉంది.అందుకే, సూర్యకాంతినే శక్తిగా మార్చుకొని, ప్రతి అడుగుతో ఒక చెట్టును నాటుతూ ముందుకు సాగుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు. ప్రకృతికి తిరిగి ఊపిరి పోసే ప్రయత్నం. భూమిపై అత్యంత కఠినమైన ప్రాంతాల్లో కూడా, సాంకేతికత సరైన దిశలో ఉపయోగిస్తే ఎలా మార్పు తేగలదో చూపించే అందమైన ఉదాహరణ. ఎడారి మధ్యలో మొలకెత్తిన ప్రతి చిన్న మొక్క, భవిష్యత్తు పచ్చగా ఉండబోతుందనే ఆశకు నడిచే సంకేతం. -
గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాల్సిందే
వాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, చమురు, సహజ వాయువు నిల్వలతో కూడిన గ్రీన్లాండ్ను సాధ్యమైనంత త్వరగా అమెరికాలో విలీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు. గ్రీన్లాండ్ను రష్యా, చైనాలు ఆక్రమించుకోక ముందే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికన్లకు ఆయన తేల్చిచెప్పారు. ట్రంప్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రీన్లాండ్ విషయంలో తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. వీలైతే సులభమైన మార్గంలో.. లేకపోతే కఠినమైన మార్గంలో ఆ ప్రాంతాన్ని అమెరికాలో కలిపేయక తప్పదని ఉద్ఘాటించారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాము అనుకున్నది చేసి తీరుతామన్నారు. త్వరలో ఏదో ఒకటి చేయక తప్పదని వెల్లడించారు. గ్రీన్లాండ్ రక్షణ బాధ్యత తమపై ఉందన్నారు. లీజుకు తీసుకున్న ప్రాంతంపై యాజమాన్య హక్కుందని ఎలా అంటారని డెన్మార్క్పై అసహనం వ్యక్తంచేశారు. లీజు ఒప్పందాలతో ఎలాంటి ఉపయోగం ఉండదని, చట్టబద్ధంగా యాజమాన్య హక్కులు ఉండాలని వ్యాఖ్యానించారు. విలీనాన్ని ఎవరూ ఆపలేరు చైనా ప్రజలను, రష్యా ప్రజలను తాను చాలా అభిమానిస్తానని.. కానీ, వారు గ్రీన్లాండ్లో అమెరికాకు పొరుగువారిగా ఉండిపోవడం తమకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. అలా జరగనివ్వబోనని పేర్కొన్నారు. ఈ విషయం అర్థం చేసుకోవాలని నాటోకు సూచించారు. మొత్తానికి గ్రీన్లాండ్ అనేది అమెరికాలో అంతర్భాగం కావడం తథ్యమని, అలా జరగడం ఎవరూ ఆపలేరని ట్రంప్ పరోక్షంగా స్పష్టంచేశారు. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అత్యంత కీలకమని ట్రంప్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రష్యా, చైనా నౌకలు పాగా వేస్తున్నాయని, అది తమ భద్రతకు విఘాతం కలిగిస్తోందని అంటున్నారు. గ్రీన్లాండ్ వాయవ్య భాగంలో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఏర్పాటయ్యింది. ప్రస్తుతం అక్కడ 100 మందికిపైగా అమెరికా జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మకానికి లేదు గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్లో భాగంగా కొనసాగుతోంది. పాక్షికంగా స్వయం ప్రతిపత్తి హోదాను అనుభవిస్తోంది. ఇక్కడి ప్రజలకు డెన్మార్క్ పౌరసత్వం ఉంది. డెన్మార్క్ నుంచి ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. గ్రీన్లాండ్ను డబ్బుతో కొనాలన్న ఆలోచన ఉన్నట్లు అమెరికా శ్వేతసౌధం అధికారులు ఇటీవలే ప్రకటించారు. ఆ ప్రయత్నం విఫలమైతే బలప్రయోగం తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. సైన్యాన్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని వెల్లడించారు. అమెరికా దురాక్రమణ ప్రయత్నాల పట్ల డెన్మార్క్, గ్రీన్లాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, డబ్బుతో కొనేయాలన్న ఆలోచన ఉంటే మానుకోవాలని డెన్మార్క్ నేతలు తేల్చిచెప్పారు. ఒకవేళ అమెరికా గనుక సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘నాటో’అంతమవుతుందని అన్నారు. పార్లమెంట్లో తీర్మానం అమెరికాలో తాము అంతర్భాగంగా మారే ప్రసక్తే లేదంటూ గ్రీన్లాండ్ పార్లమెంట్లో శుక్రవారం తీర్మానం చేశారు. పార్లమెంట్లోని అన్ని పారీ్టలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నాయి. గ్రీన్లాండ్ ఎప్పటికీ గ్రీన్లాండర్స్దే గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్తోపాటు అధికార, ప్రతిపక్ష నాయకులు శుక్రవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అమెరికా పౌరులుగా లేదా డెన్మార్క్ పౌరులుగా మారాలన్న కోరిక తమకు లేదని తేల్చిచెప్పారు. తమ దేశాన్ని స్వాహా చేయాలన్న ప్రయత్నాన్ని పక్కనపెట్టాలని అమెరికాను కోరారు. ఎప్పటికీ గ్రీన్లాండ్ పౌరులుగానే ఉంటామని, అందులో మరో మాటకు తావులేదని వెల్లడించారు. విలీనం వెనుక ఎన్నో సవాళ్లు బల ప్రయోగంతో గ్రీన్లాండ్ను విలీనం చేసుకోవాలన్న ఆరాటం ట్రంప్లో ఉన్నప్పటికీ అది అనుకున్నంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెబుతున్నారు. సైనిక చర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించే అవకాశం ఉంది. అమెరికాతో సంబంధాల విషయంలో విదేశాలు పునరాలోచించుకోవచ్చు. మొదట ‘నాటో’కూటమిలో సంక్షోభం తలెత్తుతుంది. కూటమి విచి్ఛన్నమైనా ఆశ్చర్యం లేదు. కొన్ని దేశాలు గ్రీన్లాండ్ రక్షణ కోసం ముందుకు రావొచ్చు. గ్రీన్లాండ్ సమీపంలో ఇప్పటికే రష్యా, చైనాల జలాంతర్గాములు, నౌకలు ఉన్నాయి. ఉమ్మడిగా సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తున్నాయి. గ్రీన్లాండ్కు మద్దతుగా ఆ రెండు దేశాలు అమెరికాతో తలపడే అవకాశాలు లేకపోలేదు. అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం వినాశనానికి దారితీయవచ్చు. మొదట కాల్పులు, తర్వాతే మాటలు గ్రీన్లాండ్పై ఎవరైనా దండయాత్ర చేస్తే కచి్చతంగా తిప్పికొడతామని డెన్మార్క్ హెచ్చరించారు. దురాక్రమణదారులపై తొలుత కాల్పులు జరుపుతామని, ఆ తర్వాతే చర్చిస్తామని పేర్కొంది. ఈ మేరకు డెన్మార్క్ ప్రభుత్వం తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా దూకుడుగా ముందుకెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, అమెరికాను ఢీకొట్టగల శక్తి డెన్మార్క్కు లేదు. వెనెజువెలా తరహా సైనిక ఆపరేషన్ను తట్టుకొనే బలం కూడా లేదు. అమెరికా భూభాగంలో డెన్మార్క్ పరిమాణం 0.44 శాతమే. సైనిక శక్తి అంతంతమాత్రమే. సైనిక సిబ్బంది వేల సంఖ్యలోనే ఉన్నారు. కానీ, నాటో సభ్యదేశాలపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. -
చైనా కంపెనీకి జాక్పాట్.. దుబాయ్లో అనుమతులు..!
చైనీస్ టెక్ కంపెనీ అయిన అపోలో గో అరుదైన ఘనత సాధించింది. దుబాయ్లో డ్రైవర్లెస్ కార్ల పరీక్షకు అనుమతి పొందిన ఏకైక కంపెనీగా నిలిచింది. దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) పూర్తి డ్రైవర్లెస్ పరీక్ష అనుమతిని మంజూరు చేసింది. దీంతో డ్రైవర్ సీటులో వ్యక్తి లేకుండా వేగంగా వెళ్లే కార్లు దుబాయ్ రోడ్లపై కనిపించనున్నాయి.కాగా.. 2026 మొదటి అర్ధభాగం నాటికి వాణిజ్య ప్రాతిపదికన పూర్తిగా డ్రైవర్లెస్ టాక్సీ సేవలను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దుబాయ్ రోడ్లపై వెయ్యికి పైగా వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ వినూత్న సాంకేతికత సజావుగా సాగేందుకు వీలుగా దుబాయ్లోని మిడిల్ ఈస్ట్లో మొట్టమొదటి 'ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్'ను కూడా కంపెనీ ప్రారంభించింది. వాహన నిర్వహణ, భద్రతా తనిఖీలు, నిపుణుల శిక్షణ అన్నీ ఈ హబ్లో నిర్వహిస్తారు.2030 నాటికి దుబాయ్ మొత్తం ట్రాఫిక్లో 25 శాతం డ్రైవర్లెస్ వాహనాలుగా మార్చాలనే పాలకుల నిర్ణయానికి ఈ చర్య ప్రోత్సాహకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆధునిక రవాణా వ్యవస్థలను వేగంగా అవలంబిస్తున్న దుబాయ్ పరిస్థితి వారి సాంకేతికతకు ఉత్తమంగా సరిపోతుందని చైనాకు చెందిన బైడు ఉపాధ్యక్షుడు వాంగ్ యున్పెంగ్ అన్నారు.కాగా.. గత మార్చిలో ఆర్టీఏతో కుదుర్చుకున్న ఒప్పందం తర్వాత కంపెనీకి జూలైలో టెస్ట్ లైసెన్స్ మంజూరు చేశారు. సురక్షితమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ప్రపంచ మోడల్గా మారాలని దుబాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే నెలల్లో దుబాయ్లో రద్దీగా ఉండే వీధుల్లో డ్రైవర్లెస్ కార్లు పరీక్షించనున్నారు. -
భారత్, చైనాను కట్టడి చేయడమే లక్ష్యం
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబు సిద్ధం చేశారు. అమెరికా హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఏకంగా 500% టారిఫ్లు విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రష్యా నుంచి చమురు ఎవరూ కొనకుండా ఆంక్షలు విధించబోతున్నారు. ఆంక్షలను ఉల్లంఘించే దేశాలపై సుంకాల మోత మోగనుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లుపై అమెరికా కాంగ్రెస్లో త్వరలోనే ఓటింగ్ జరగనుంది. అక్కడ ఆమోదం పొందితే భారత్, చైనా ఉత్పత్తులపై 500 శాతం సుంకాలు విధించే అధికారం ట్రంప్కు లభిస్తుంది. రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ విషయం వెల్లడిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఆయన బుధవారం వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. అధ్యక్షుడితో చాలా ఫలవంతమైన చర్చ జరిగిందని, బిల్లును ఆమోదించారని స్పష్టంచేశారు. ‘‘శాంతి కోసం ఉక్రెయిన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని మెట్లు దిగిరావడానికి కూడా సిద్ధపడుతోంది. రష్యా అధినేత పుతిన్ శాంతికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే ఉక్రెయిన్లో రక్తపుటేర్లు పారిస్తున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు. రష్యా యుద్ధ యంత్రానికి ఇంధనం సమకూరుస్తున్న దేశాలను శిక్షించక తప్పదు. రష్యా నుంచి ఇబ్బడిముబ్బడిగా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్లో మారణహోమానికి పరోక్షంగా సహకరిస్తున్న దేశాలపై భారీగా సుంకాలు విధించే అధికారం ట్రంప్కు దక్కబోతోంది. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా నుంచి ఇప్పటికీ చమురు కొంటూనే ఉన్నాయి. ఈ కొనుగోళ్లు ఆగాలంటే సుంకాల కొరడా ప్రయోగించాల్సిందే’’అని లిండ్సే గ్రాహం తేల్చిచెప్పారు. సుంకాల బిల్లుకు కాంగ్రెస్లో తప్పనిసరిగా ఆమోదం లభిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వచ్చేవారమే బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఇతరులకు విక్రయించినా వాత తప్పదు భారతదేశ ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇందులో 25 శాతం సుంకాలను రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా విధించారు. తాజాగా రూపొందించిన ‘శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025’బిల్లు కూడా ఆమోదం పొందితే సెకండరీ టారిఫ్లు, అంక్షలు అమల్లోకి వచ్చి మొత్తం సుంకాలు ఏకంగా 550 శాతానికి చేరుతాయనడంలో సందేహం లేదు. రష్యా నుంచి చమురు కొనడమే కాకుండా దాన్ని ఇతరులకు విక్రయించుకొనే దేశాలపై 500 శాతం సుంకాలు విధించాలన్న ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. భారత్లోని చమురు సంస్థలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటూ.. శుద్ధి చేసి యూరప్ దేశాలకు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా చమురుతో భారత కంపెనీలు భారీగా లాభపడుతున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు కీలకమైన వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య చురుగ్గా చర్చలు కొనసాగుతున్న సమయంలోనే కొత్త ఆంక్షలను ట్రంప్ సర్కార్ తెరపైకి తీసుకురావడం గమనార్హం. ‘పుతిన్ కస్టమర్ల’పై ఒత్తిడి పెంచాల్సిందే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకుంటామని భారత్ తమకు హామీ ఇచ్చిందని లిండ్సే గ్రాహం ఇటీవలే చెప్పారు. అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా నుంచి ఈ హామీ లభించిందని అన్నారు. టారిఫ్ల నుంచి ఇండియాకు ఉపశమనం కల్పించేలా ట్రంప్ను ఒప్పించాలంటూ తనను కోరారని తెలిపారు. గ్రాహం ఆదివారం ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్తో కలిసి ప్రయాణించారు. టారిఫ్ బిల్లు గురించి చర్చించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆగాలంటే ‘పుతిన్ కస్టమర్ల’పై ఒత్తిడి పెంచాల్సిందేనని తేల్చిచెప్పారు. అందుకు ట్రంప్ తలూపారు. మొదట భారత్, చైనా వంటి దేశాలు దారికొస్తే చివరకు రష్యా కూడా దిగిరాక తప్పదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. వినయ్ క్వాత్రా గత నెలలో అమెరికా సెనేటర్లతో భేటీ అయ్యారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల తీరుపై మాట్లాడారు. భారత్–అమెరిఆ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి మద్దతివ్వాలని సెనేటర్లను కోరారు. భారత్కు అతిపెద్ద ఎగుమతిదారు రష్యా భారత తమ ముడి చమురు అవసరాలను తీర్చుకోవడానికి ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. 88 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. 2021 కంటే ముందు ఇందులో రష్యా ముడి చమురు వాటా కేవలం 0.2 శాత ఉండేది. ప్రస్తుతం అది 40 శాతానికి చేరడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దండయాత్ర ప్రారంభించిన తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. చమురు దిగుమతులను నిలిపివేశాయి. దాంతో రష్యా ప్రభుత్వం తమ ముడి చమురును చౌక ధరకు భారత్, చైనాలకు విక్రయించడం ప్రారంభించింది. అమెరికా పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ అవి పట్టించుకోవడం లేదు. తమ అవసరాల కోసమే రష్యా చమురు కొనుగోలు చేసి, వాడుకుంటున్నామని, ఇందులో మరో దురుద్దేశం లేదని చెబుతున్నాయి. భారత్కు చమురు ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా రష్యా అవతరించింది. గత నెలలో రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున భారత్ దిగుమతి చేసుకుంది. మరిన్ని కష్టాలు తప్పవా? మరో 500 శాతం టారిఫ్లు అమల్లోకి వస్తే భారత్ పరిస్థితి ఏమటన్నదానిపై చర్చ జరుగుతోంది. అమెరికా ఇప్పటికే వసూలు చేస్తున్న 50 శాతం టారిఫ్లు వల్ల భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్, అమెరికాల మధ్య గతంలో ఎన్నడూలేనంతగా సంబంధాలు దెబ్బతిన్నాయి. మొత్తం టారిఫ్లు 550 శాతానికి చేరితే భారత ఉత్పత్తులకు అమెరికాలో ధరలు పెరిగి, గిరాకీ పడిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా భారత్ నుంచి ఎగుమతులు తగ్గిపోతాయి. అంతిమంగా భారత ఉత్పత్తి సంస్థలు నష్టపోతాయి. దాంతో ఆ సంస్థలను మూసివేయడమో, అందులో పనిచేసే కార్మీకులను తగ్గించడమో జరుగుతుంది. అమెరికాకు కాకుండా ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే కొత్త మార్కెట్లను అన్వేíÙంచాలి. -
భార్య కేన్సర్ చికిత్సకు నిధులుగా..50 టన్నుల చిలగడ దుంపలు!
సాయం అంటే ఏదో మనకు తోచింది, చేతనైనది చేస్తాం. కానీ ఈ వ్యక్తి ఎంత గొప్పగా సాయం చేశాడంటే..ఆ సాయ ఫలితం తానొక్కడే అనుభవించకూడదు అనుకున్నాడో ఏమో..! గానీ అదర్నీ భాగమయ్యేలా చేసి గొప్ప సందేశం అందించాడు. అందరం తల ఓ చేయి వేస్తే ఎంత కష్టమైన పరార్ అనే గొప్ప విషయాన్ని గొంతెత్తి చెప్పినట్లుగా ఉంది నిశబ్దంగా చేసిన అతడి సహాయం. ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందంటే..ఇది చైనాలో చోటు చేసుకుంది. చైనాకు చెందిన జియా చాంగ్లాంగ్ అనే 35 ఏళ్ల వ్యక్తికి అందిన ఉదార సహాయం అందర్నీ ఆలోచింపచేసేలా ఉంది. సోషల్ మీడియాలో ఈ ఘటన అందరి హృదయాలను తాకింది. జియా భార్య లీకి జూలైలో అక్యూట్ మైలోయిడ్ లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రారంభ చికిత్స తదనంతరం ఇంట్లోనే ఆమె కోలుకుంటోంది. జియా ఇప్పటికే ఆమె చికిత్స కోసం దగ్గర దగ్గర రూ. 45 లక్షలు పైనే ఖర్చు చేశాడు. ఇప్పుడు ఆమెకు బోన్మ్యారో(ఎముక మజ్జ మార్పిడి) చేయాల్సి ఉంది. అయితే ఇందుకు సుమారు రూ. 51 లక్షలు పైనే ఖర్చు అవుతుందట. ఈ దంపతులిద్దరు సెకండరీ స్కూల్లో సహా విద్యారులు. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వాళ్లు చైనాలోని పాన్డాంగ్ ప్రావిన్స్లోని యాంటాయ్లో నివశిస్తున్నారు. వారికి ఎనమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడుని తామిద్దరం కలిసి అల్లారు ముద్దుగా పెంచుకోవాలని ఆశపడుతున్నారు. అందుకు విధి సహకరిస్తుందో లేదో అనే బెంగతో ఉన్నారా ఆ దంపతులు. తమకు వచ్చిన ఈ గండం గట్టేక్కేందుకు చేయవల్సిన ప్రయత్నాలన్ని చేశారు. తమ బంధువుల, స్నేహితులు, పొదుపు ద్వారా పోగు చేసిన సొమ్ము అంతా ఖర్చు అయిపోయింది. దాంతో చేసేది లేక తన భార్య ట్రీట్మెంట్ ఖర్చుల కోసం నిధులు సేకరించే పనిలో పడ్డాడు జియా. తన వద్ద ఉన్న ఒక్క కంప్యూటర్ని కూడా అమ్మేశాడు. ఇక అమ్మేందుకు ఏమి మిగలేదు జియా వద్ద. దాంతో ఇలా నిధులు ఆఫ్లైన్లో, సోషల్ మీడియా వేదికగా తనవంతు ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఇంతలో అనూహ్యంగా ఓ మిరాకిల్ జరిగింది. ఫాంగ్ అనే ఇంటిపేరు గల ఒక అజ్ఞాత దాత మెసేజింగ్ యాప్ ద్వారా జియాను సంప్రదించి, చిలగడదుంపలను అందివ్వడంతో అతని జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అజ్ఞాత దాత జియాకి సుమారు 50 టన్నుల చిలగడ దుంపలు అందించి తన వంతు చేస్తున్న సాయం అని పోస్ట్ పెట్టాడు. నిజానికి ఫాంగ్ అని ఇంటిపేరున్న వ్యక్తి స్వయంగా చిలగడ దుంపలు పండిస్తాడట. అయితే జియా తన భార్య పట్ల ఎంతో భాధ్యతగా వ్యవహరించిన తీరు అతడిని కదిలించిందట. అందుకే ఇలా సాయం చేస్తున్నట్లు పోస్ట్లో పేర్కొన్నాడు. ఇప్పుడ జియా ఆ చిలగడదుపంలను 'కృతజతా ఛారిటీ అమ్మకం' అనే లేబుల్ పెట్టి అమ్ముతుండటం విశేషం. దాని ద్వారా వచ్చిన సొమ్మును తన భార్య వైద్య ఖర్చుల కోసం వినియోగిస్తున్నాడు. ఆ అజ్ఞాత వ్యక్తి సాయం అనే పదానికి అద్భుతమైన అర్థం ఇచ్చాడు. అతను కాయకష్టం చేసుకునే రైతుల నుంచి చిలగడదుపంలు కొని జియాకు అందజేశాడు. అటు రైతులకు ఫలం అందింది. అలాగే జియా కూడా సులభంగా డబ్బు పొందితే విలువ తెలుసుకోలేడనే ఉద్దేశ్యంతో ఆ ఆజ్ఞాత వ్యక్తి ఇలా డబ్బుని కాకుండా ఆ చిలగడదుంపలనే అందించాడు. అంటే శ్రమతో కష్టపడి అమ్మి విరాళం పొందేలా చేసి..ఈ సాయంలో సాధారణ ప్రజలు కూడా భాగమయ్యేలా చేశాడు. అంతేగాదు కష్టకాలంలోని ఉన్న వ్యక్తికి ఎలాంటి అండదండ ఇవ్వొచ్చో అందరికి అవగతమయ్యేలా చేశాడు. దీంతో ఆ అజ్ఞాత వ్యక్తిని అంతా హ్యాట్సాప్ బ్రో అని నెటిజనులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పైగా ఇది అలాంటి ఇలాంటి సహాయం కాదు..మాటల్లేవ్ అంతే అని కీర్తిస్తున్నారు కూడా.(చదవండి: మురికి వాడలో పెరిగిన ఆ అబ్బాయ్ ..ఎన్నో జీవితాలను అద్భుతంగా మార్చాడు!) -
కిమ్ క్షిపణి గర్జనల వేళ.. ‘డ్రాగన్-కొరియా’ షాకింగ్ ట్విస్ట్!
దశాబ్ధాల పగను పక్కన పెట్టి.. దక్షిణ కొరియా, చైనాలు ఇప్పుడు స్వప్రయోజనాల కోసం దోస్తీకి సిద్ధమయ్యాయి. తాజాగా చైనాలో అడుగుపెట్టిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్, చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ కావడం ప్రపంచం దృష్టిని అమితంగా ఆకర్షించింది. 2019 తర్వాత దక్షిణ కొరియా నేత చైనాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం ఆసక్తికరంగా మారింది.రెండో ప్రపంచ యుద్ధంలో..చైనా, దక్షిణ కొరియాల మధ్య సంబంధం ఈ నాటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ నుంచి ఎదురవుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఈ రెండు దేశాలు చేతులు కలిపాయి. జపాన్ ఆక్రమణ నుండి కొరియాను రక్షించుకునేందుకు నాడు చైనా అండగా నిలిచింది. ఆనాటి పోరాట వీరుల స్మారకార్థం నేటికీ షాంఘై(చైనా)లో స్మృతి చిహ్నాలు కనిపిస్తాయి. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ తన పర్యటనలో వాటిని సందర్శించడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధానికి నిదర్శనంగా నిలిచింది.సయోధ్య కరువయ్యిందిలా..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరు దేశాల పరిస్థితులు తలకిందులయ్యాయి. కొరియా యుద్ధం సమయంలో చైనా.. ఉత్తర కొరియాకు మద్దతు ఇవ్వగా, అమెరికా.. దక్షిణ కొరియాకు అండగా నిలిచింది. దీంతో దశాబ్దాల పాటు ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కరువయ్యింది. చైనా కమ్యూనిజం బాటలో, దక్షిణకొరియా ప్రజాస్వామ్య బాటలో ప్రయాణిస్తూ బద్ధశత్రువులుగా మారిపోయాయి.వాణిజ్యమే పరమావధిగా..‘బీబీసీ’ అందించిన కథనం ప్రకారం సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ మౌనం తర్వాత, 1992లో ఇరు దేశాలు తిరిగి దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. వాణిజ్యమే పరమావధిగా చైనా తన దేశ తలుపులను తెరిచింది. దీంతో దక్షిణ కొరియా కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి. నాటి నుండి ఆర్థికంగా ఇరు దేశాలు పరస్పరం ఆధారపడటం మొదలైంది.కొరియాపై అనధికారిక యుద్ధం2016లో దక్షిణ కొరియా తీసుకున్న ఒక నిర్ణయం చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఉత్తర కొరియా ముప్పు నుంచి తప్పించుకునేందుకు అమెరికాకు చెందిన 'థాడ్' (THAAD) క్షిపణి వ్యవస్థను దక్షిణ కొరియా తన గడ్డపై మోహరించింది. ఇది తమ భద్రతకు ముప్పుగా భావించిన చైనా, అప్పటి నుండి కొరియాపై అనధికారిక యుద్ధం కొనసాగిస్తోంది. ఆ క్షిపణి కారణంగా నెలకొన్న వివాదం దరిమిలా చైనాలో కొరియన్ పాప్ (K-pop) సంగీతం, సినిమాలు, నాటకాలపై అప్రకటిత నిషేధం మొదలైంది.సెల్ఫీతో చిగురించిన దోస్తీదశాబ్దాల ఉద్రిక్తతల తర్వాత, అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ సోమవారం బీజింగ్లో షీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. గంభీరంగా సాగిన చర్చల మధ్య, గత ఏడాది జిన్పింగ్ తనకు బహుమతిగా ఇచ్చిన షియోమీ ఫోన్తో లీ ఆయనతో సెల్ఫీ దిగారు. ‘ఫోన్ పిక్చర్ క్వాలిటీ బాగుంది’ అంటూ ఆయన చేసిన పోస్ట్, ఇరు దేశాల మధ్య నెలకొన్న వైరం తొలగిపోతున్నదనే సంకేతాన్ని ప్రపంచానికి అందించింది.ఉత్తర కొరియాతో పొంచివున్న ముప్పు‘లీ’ చైనా పర్యటనలో ఉన్న సమయంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన వక్రబుద్ధిని చాటుకున్నారు. ఆదివారం తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా తాజాగా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడాన్ని నిరసిస్తూ కిమ్ ఈ పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఉత్తర కొరియాను నియంత్రించేందుకు చైనా సహకారం ‘లీ’కి అత్యంత కీలకంగా మారింది.ఆసియా రాజకీయాల్లో కీలక మలుపు‘లీ’ తాజా పర్యటనలో భాగంగా టెక్నాలజీ, వాణిజ్యం, పర్యావరణ రంగాలలో ఇరు దేశాలు మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా కే- పాప్, కొరియన్ డ్రామాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంపై ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు సమాచారం. చైనా విదేశాంగ శాఖ కూడా సాంస్కృతిక మార్పిడికి సిద్ధమని ప్రకటించడం కొరియన్ వినోద రంగానికి పెద్ద ఊరటగా నిలిచింది. చైనాతో సంబంధాలను గాడిలో పెట్టిన లీ.. తన తదుపరి పర్యటనలో భాగంగా జపాన్ వెళ్లనున్నారు. అమెరికా, చైనా, జపాన్.. ఈ మూడు దేశాల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ, దక్షిణ కొరియా ప్రయోజనాలను రక్షించడం ‘లీ’కి కీలకంగా మారింది. ఏదిఏమైనా ‘లీ’ పర్యటనతో ఆసియా రాజకీయాల్లో ఒక కొత్త మలుపు మొదలైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉద్రిక్తత.. జనం రాళ్ల దాడి -
సరికొత్త రికార్డ్.. చైనాను అధిగమించిన భారత్!
వరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనాను.. భారత్ అధిగమించింది. దీంతో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.150.18 మిలియన్ టన్నులుభారతదేశంలో వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులు కాగా.. చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం 25 పంటలకు చెందిన 184 కొత్త రకాలను విడుదల చేస్తూ వెల్లడించారు. అంతే కాకుండా అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు పంట ఉత్పత్తిని & రైతుల ఆదాయాన్ని పెంచుతాయని, ఈ కొత్త రకాలు రైతులకు త్వరగా చేరేలా చూడాలని మంత్రిత్వ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.దేశ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడుతూ.. అధిక దిగుబడినిచ్చే విత్తనాల అభివృద్ధిలో దేశం గొప్ప విజయాన్ని సాధించిందని అన్నారు. 1969లో గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి.. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఫైబర్ పంటలు వంటి మొత్తం 7,205 పంట రకాలు నోటిఫై చేసినట్లు పేర్కొన్నారు.2014 తర్వాత పెరుగుదల..1969, 2014 మధ్య నోటిఫై చేసిన 3,969 రకాలతో పోలిస్తే.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 3,236 అధిక దిగుబడినిచ్చే రకాలను ఆమోదించిందని చౌహాన్ తెలియజేశారు. భారత్ ఆహార కొరత ఉన్న దేశం నుంచి ప్రపంచ ఆహార ప్రదాతగా మారిందని, ఇప్పుడు విదేశీ మార్కెట్లకు బియ్యాన్ని సరఫరా చేస్తోందని అన్నారు.దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, తద్వారా భారతదేశ ఆహార భద్రతకు భరోసా లభిస్తుందని చౌహాన్ అన్నారు. అంతే కాకుండా.. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి పప్పుధాన్యాలు & నూనెగింజల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాలని మంత్రి వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు.సమిష్టి కృషి ఫలితంఅధిక దిగుబడినిచ్చే.. విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకునే విత్తనాల అభివృద్ధి బలంతో దేశం వ్యవసాయ విప్లవం యొక్క కొత్త యుగంలోకి ప్రవేశించిందని చౌహాన్ అన్నారు. ఈ విజయం ఐసిఎఆర్ యొక్క పంటలపై అఖిల భారత సమన్వయ ప్రాజెక్టులు, రాష్ట్ర మరియు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు ప్రైవేట్ విత్తన కంపెనీల సమిష్టి కృషి ఫలితమని కేంద్ర మంత్రి అన్నారు.ఇటీవల విడుదల చేసిన మొత్తం 184 రకాల్లో.. 122 తృణధాన్యాలు, 6 పప్పు ధాన్యాలు, 13 నూనె గింజలు, 11 పశుగ్రాస పంటలు, 6 చెరకు, 24 పత్తి (22 బిటి పత్తితో సహా), 1 జనపనార, 1 పొగాకు ఉన్నాయి.ఇదీ చదవండి: స్టార్లింక్ సేవలు ఫ్రీ.. మస్క్ కీలక ప్రకటన -
యుద్ధం అనాథను చేస్తే..సేవతో అందరి మనసులను దోచుకుంది..!
యుద్ధం ఆమెకు విషాదాన్ని మిగిల్చినా..ఆమె సేవతో మనసులను రంజింప చేసింది.అపరిచితుల దయ మధ్య పెరిగి పెద్దదై జీవితాన్ని సార్థకం చేసుకునేలా బతికి చూపించింది. ఓ అనాథ తిరగరాసిన ఈ కథ..యువతకు స్ఫూర్తి, విలువలను నేర్పించే ఓ గొప్ప పాఠం. ఆమె స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..1945లో రెండొవ చైనా-జపనీస్ యుద్ధంలో జపాన్ ఓటమి అనంతరం సుమారు నాలుగువేల మంది జపనీస్ పిల్లలు చైనాలో నిరాశ్రయులయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఈశాన్య చైనా, ఇన్నర్ మంగోలియా ప్రాంతాలలో ఉన్నారు. ఈ పిల్లల్లో చాలామందిని చైనీస్ కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. ఆ అనాథల్లోని ఒకటే ఈ జు యాన్ చిన్నారి కథ..!.ఆమె లియోనింగ్ ప్రావిన్స్లోని షెన్యాంగ్ నగరంలో సకురా యమమోటోగా జన్మించింది. ఆమె తండ్రి విమానం కూలిపోవడంతో మరణించగా, తల్లి ప్రసవం తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా మరణించింది. దాంతో ఆమె కనీసం ఏడాది కూడా నిండకమునుపే ఓ చైనీస్ కుటుంబం దత్తత తీసుకుంది. అయితే ఆమె పెంపుడు తండ్రి సైన్యానికి వెళ్లిపోవడంతో అతని భార్య ముగ్గురు పిల్లల్ని పెంచడం కష్టంగా భావించి తన పొరుగింటి వాళ్లకు దత్తతగా ఇచ్చేసింది ఆమెను. అలా ఆమె జు జెన్స్ దంపుతులకు చేరింది. వాళ్లు ఆమెకు జు యాన్ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకునేవారు. ఆమె పుట్టుకతో ఎంతో విషాదాన్ని చూడటంతో బాధను దిగమింగి ఎంతో స్థైర్యవంతురాలిగా పెరగాలన్న ఉద్దేశ్యంతో జు యాన్ అని పేరుపెట్టారట ఆ పెంపుడు తల్లిదండ్రులు. అయితే వాళ్లకు పిల్లలను పెంచిన అనుభవం అంతగా లేకపోవడంతో తన తల్లికి ఇచ్చి పెంచమని చెప్పింది జు పెంపుడు తల్లి. అలా అమ్మమ్మ ఇంటి వద్ద పెరిగిన ఆమెకు, మంచి ప్రేమ, సంరక్షణ లభించాయి. 1962లో స్థానిక ఆస్పత్రిలో వైద్య శిక్షణ పూర్తి చేసుకుని, తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో వైద్యురాలిగా పనిచేసేందుకు వెళ్లింది. అలా ఆమె ఎన్నో ప్రసవాలు చేసింది. ఆమె పురుడుపోసిన నవజాత శిశువులందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారు కూడా. తనను చైనీస్ ప్రజలు రక్షించారు, ఫలితంగా శిశువులకు సేవ చేశానని అనుకునేదామె. 1980లో తన బిడ్డతో షెన్యాంగ్కు తిరిగి వచ్చి నిర్మాణ సంస్థలో పనిచేయడం ప్రారంభించింది. పదవీ విరమణ తర్వాత స్వయంగా చైనా సంప్రదాయ వైద్యాన్ని నేర్చుకుని మళ్లీ సేవ చేయడం ప్రారంభించింది. అప్పుడే తాను జపనీస్ అనాథనని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. యుద్ధసమయంలో చైనా, జపాన్ వేర్వేరు పద్ధతుల్లో టీకాలు వేసేది. దాని కారణంగానే నాటి చైనా జపాన్ యుద్ధ సమయంలో నిరాశ్రయలైన పిల్లల్లో ఆమె ఒక్కత్తినని తెలుసుకుంటుంది. అయితే ఆమెలాగా యుద్ధం కారణంగా అనాథగా మారిని చాలామంది రెడ్క్రాస్ సొసైటీ సాయంతో తమ వాళ్లను కలుసుకుని స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే జు యాన్ ఆ పని అస్సలు చేయలేదు. నిజానికి ఆ సమయంలో జపనీస్ యుద్ధ అనాథలు దాదాపు 120 మంది ఉండగా ఇప్పుడు కేవలం ఐదుగురే మిగిలి ఉండటం విశేషం. అయితే జు తనను తాను ఎప్పుడూ చైనీస్గానే భావించాను కాబట్టి తనవాళ్లను కలిసే ప్రయత్నం చేయలేదంటోంది. పైగా తనకు రక్షణ కల్పించిన ఈ నేల నా ఇల్లు తన స్వదేశం అని సగర్వంగా చెబుతోందామె.(చదవండి: ఇండియాలో ఇటలీగా పేరొందిన హిల్ స్టేషన్..! మన హైదరాబాద్కి జస్ట్..) -
బలూచిస్తాన్పై చైనా కన్నుపడిందా?
విదేశీ భూభాగాలపై కన్నేయడం చైనాకు పరిపాటి. అది పొరుగు దేశమైతే చైనా చర్యలు మరీ అతిగా ఉంటాయి. ఈ క్రమంలోనే వేరే దేశం భూభాగాన్ని తమ మ్యాప్లో కూడా చూపించడానికి చైనా వెనుకాడదు. ముందు ఒక రాయి వేసి.. తర్వాత ఏం జరుగుతుందో చూస్తుంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ని పదే పదే చైనా తమ భూభాగంలో చూపించడం ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ భారత్ బలమైన దేశం అనేది ఒకటైతే, ఇప్పుడు చైనాకు భారత్ సాయం అవసరం ఉంది కాబట్టి వారు ఎటువంటి దుస్సాహసానికి పాల్పడటం లేదు. గత కొన్నేళ్లుగా భారత్పై దూకుడుగా ఉండే విషయంలో చైనా ఆచితూచి వ్యవహరిస్తోంది. అదే సమయంలో భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న చైనా.. ఇప్పుడు వేరే దేశాలపై పడింది. అందులో ఒకటి రష్యా అయితే, మరొకటి పాకిస్తాన్.కొన్ని రోజుల క్రితం రష్యా భూభాగాన్ని తమ మ్యాప్లో చూపించిన చైనా.. ఇప్పుడు పాకిస్తాన్ను టార్గెట్ చేసింది. చైనాకు పాకిస్తాన్ మిత్రదేశమే కానీ, అవకాశం వస్తే తమకు మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరనే నైజం చైనాది. ఆ క్రమంలోనే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ భూభాగంపై చైనా కన్నేసినట్లు కనబడుతోంది. ఎప్పుట్నుంచో పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న బలూచిస్తాన్.. సుదీర్ఘ పోరాటం చేస్తుంది. తమ హక్కులను పాకిస్తాన్ కాలరాస్తుందని, అందుకు తమకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఎక్కువైంది. పాక్పై ప్రేమా..యురేనియం నిల్వలే టార్గెటా?బలూచిస్తాన్లో యురేనియం నిల్వలు ఉన్నాయనేది కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్న తరుణంలో చైనా ఆచితూచి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్కు సైనిక సాయం పేరుతో ముందుగా వారి భూభాగంలోకి ప్రవేశించాలని చైనా కుట్ర రాజకీయాలకు పాల్పడే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. అందిందే జుట్ట.. అందకపోతే స్నేహం అనేది చైనా వైఖరి. ఇప్పడు భారత్ విషయంలో చైనా అదే చేస్తంది. మరి పాకిస్తాన్ విషయంలో చైనా అలా ఎందుకు ఆలోచించదని నిపుణులు చెబుతున్న మాట,. ప్రస్తుతం పాకిస్తాన్క సైనిక సాయం పేరుతో చైనా ఒక అడుగు ముందకేసి, ఆ తర్వాత మిగతాది చూసుకోవచ్చనే దృష్టితో ఉందని అంటున్నారు.బలూచిస్తాన్లో యురేనియం నిల్వల పరిస్థితిబలూచిస్తాన్లో యురేనియం నిల్వలు ఉన్నాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులకు కూడా భద్రతా, భౌగోళిక రాజకీయ పరంగా ప్రభావం చూపుతున్నాయి.ప్రపంచ స్థాయి యురేనియం నిల్వల జాబితాలో పాకిస్తాన్ పేరు ఉన్నప్పటికీ, బలూచిస్తాన్లోని నిల్వల ఖచ్చితమైన పరిమాణం అంతర్జాతీయ నివేదికల్లో స్పష్టంగా ఇవ్వబడలేదు. ఈ వనరుల కారణంగా స్థానిక ప్రజల్లో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ అస్థిరత కారణంగా తవ్వకాలు, వినియోగం కష్టతరంగా మారాయి. ఓవరాల్గా చూస్తే ఈ వనరులు పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. చైనా పెట్టుబడులు, స్థానిక అసంతృప్తి, మరియు అంతర్జాతీయ ఆసక్తి కారణంగా ఇవి సున్నితమైన అంశంగా మారాయి.బలూచిస్తాన్ నేతల్లో అదే ఆందోళన..ప్రస్తుతం బలూచిస్తాన్ నేతల్లో అదే ఆలోచన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు పాకిస్తాన్తో పోరాడటానికే తాము ఆపసోపాల పడుతుంటే, మరొకవైప చైనా గోల ఏమిటో వారికి అంతుపట్టడం లేదు. తమ భూభాగంలోకి చైనా సైనిక దళాలు వస్తాయనే కచ్చితమైన సమాచారంతోనే వారు భారత్ సాయాన్ని అభ్యర్థిస్తున్నారు. అందుకోసమే భారత్ సాయాన్ని పదే పదే కోరుతున్నారు. అయితే బలూచిస్తాన్కు సాయం విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ను కూడా పూర్తిగా నమ్మలేం. అసలే ఉగ్రవాద మూలాలున్న బలూచిస్తాన్కు సాయం చేస్తే తర్వాత భారత్కు విపత్కర పరిస్థితుల ఏర్పడవచ్చు.అందుకోసమేనా ఎదురుచూపులు?తమకు అవకాశం వచ్చినప్పుడల్ల పాకిస్తాన్తో యద్ధానికి కూడా సై అంటోంది బలూచిస్తాన్. అయితే జనాభా పరంగా చూసినా, బలూచిస్తాన్ రెబల్స్ ప్రకారం చూసినా.. ఒక దేశంతో పోరాడాలంటే వారి శక్తి సరిపోదు. ఈ తరుణంలో తమ భూభాగంలోకి చైనా వైమానిక దళాలు త్వరలో రాబోతున్నాయని బలూచిస్తాన్ అగ్రనేత మిర్ బలూచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం భారత్ సాయాన్ని కూడా అభ్యర్థించారు. దశాబ్దాల క్రితం పాకిస్తాన్ నుంచి విముక్తి పొందిన బంగ్లాదేశ్ తరహాలో తమకు స్వాతంత్ర్యం కావాలని బలూచిస్తాన్ నేతలు కోరుకుంటున్నారు. అప్పుడు ఎలా అయితే భారత్ సాయం చేసిందో ఇప్పుడు కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి జై శంకర్కు సైతం బలూచిస్తాన్ నుంచి లేఖ వచ్చింది.బలూచిస్తాన్ సాయం విషయంలో భారత్ ఎటువంటి దూకడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు బలూచిస్తాన్కు సైనిక బలం కావాలి కాబట్టి. భారత్ సాయాన్ని కోరుతుందనేది అందరికీ తెలిసిన విషయం. ఈ తరుణంలో బలూచిస్తాన్కు భారత్ మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. కానీ పాకిస్తాన్ నుంచి మరొకసారి ముప్పు ఎదురైన పక్షంలో భారత్ తమ ఉన్న వనురులను ఉపయోగించుకునే ముందుకెళ్తుంది. అది బలూచిస్తాన్కు పరోక్షంగా కలిసి వస్తుందా లేదా అనేది తర్వాత విషయం. అయితే త్వరలో ఆపరేషన్ 2.0 అని వార్త ఇప్పుడు మరొక ఆసక్తిని పెంచుతుంది. మార్చి నెలలో పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0ను చేపట్టనుందనే ఇప్పుడు దాయాది దేశం ఉగ్రవాదుల్లో గుబుల పుట్టిస్తోంది. మరొకవైపు భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0 చేపడితే, సందట్లో సడేమియా అన్నట్లు తాము కూడా పాకిస్తాన్కు చుక్కలు చూపించాలని బలూచిస్తాన్ రెబల్స్ భావిస్తున్నారు. -
మళ్లీ కిమ్ కుమార్తె హల్ చల్!
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూతురు కిమ్ జు యే మరోసారి బహిరంగంగా కనిపించారు. గురువారం కొత్త సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి తాత, ముత్తాతల సమా«ధిని ఆమె తొలిసారి బహిరంగంగా సందర్శించారు. తల్లిదండ్రులతో ముందు వరుసలో నిలబడి ‘కుముసుసన్’స్మారకానికి నమస్కరిస్తున్న చిత్రం శుక్రవారం ఆ దేశ ప్రభుత్వ మీడియాలో ప్రచురితమైంది. 41 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాను పరిపాలిస్తున్న తన కుటుంబంలోని మూడోతరం నాయకుడు. 2022 నవంబర్లో మొదటిసారిగా కిమ్ కుమార్తె ప్రభుత్వ మీడియాలో కనిపించారు. అప్పటినుంచి పైనిక కవాతులు, క్షిపణి ప్రయోగాలతో సహా అనేక కార్యక్రమాల్లో తన తండ్రితో పాటు పాల్గొంటున్నారు. గతేడాది సెప్టెంబర్లోకిమ్ చైనా పర్యటనలోనూ ఆమె వెంట ఉన్నారు. కిమ్ ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు. ఆయనకెలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవు. దానికి తోడు ఉత్తర కొరియా అత్యంత పురుషాధిక్య స్వభావం కలిగిన దేశం. అలాంటిది కిమ్ తన కుమార్తెను బయటి ప్రపంచానికి పదేపదే కనిపించేలా చేయడం ఆశ్చర్యం కలిగిండచంతోపాటు చర్చనీయాంశం కూడా అయ్యింది. కుటుంబ పాలనను విస్తరించాలనే ఆలోచనలకు ప్రజల మద్దతును పెంచుకోవడం కోసమే కిమ్ ఇలా కూతురును ముందుకు తెస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. -
"చెడగొడితే రిప్లై ఇలానే ఉంటుంది"
సాక్షి,తమిళనాడు: భారత్-పాక్ వివాదంలో అమెరికా-చైనా జోక్యం అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్కు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే స్థాయి ఎవరికి లేదని పరోక్షంగా హెచ్చరించారు. పాకిస్థాన్ లాంటి చెడ్డ పొరుగుదేశంతో భారత్ సరిహద్దు పంచుకోవాల్సి రావడం నిజంగా బాధాకరమన్నారు. ఐఐటీ మాద్రాస్ క్యాంపస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇండియా ఎయిర్ఫోర్స్ కెపాసిటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. పాక్ టెర్రరిస్టులను వారి సొంత దేశంలో భారత్ మట్టి కరిపించింది. అంతే కాకుండా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని దాయాది దేశాన్ని హెచ్చరించింది. ఆ తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాల్పులు విరమణ జరిగింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు తలనొప్పిగా మారింది. ఈ యుద్ధం తాను చెబితేనే ఆగిందని, పన్నులు పెంచుతానని హెచ్చరించడంతో ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపాయని క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేశారు. భారత్ ఈ విషయంపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ తన తీరు మార్చుకోవడం లేదు. ఇది చాలదన్నట్లు ఇటీవల డ్రాగన్ కంట్రీ సైతం ఇదే తంతు ఎత్తుకుంది. ఇండియా పాక్ యుద్ధాన్ని తామే నివారించామని ఇటీవల ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి ప్రగల్భాలు పలికారు.ఈ సందర్భంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. " భారత్కు ఏంచేయాలో, ఏం చేయకూడదో చెప్పే హక్కు ఎవరికీ లేదు తమ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ఇండియాకు చాలా క్లియర్గా తెలుసు’ అంటూ పరోక్షంగా ఈ రెండు దేశాలకు కౌంటరిచ్చారు. అనంతరం పాకిస్థాన్ను ఉద్దేశించి మాట్లాడుతూ " ప్రతిఒక్కరికీ చుట్టుప్రక్కల వారు ఉంటారు. అలాగే భారత్కు ఉన్నారు. అయితే వారు చెడ్డవారు. మన సరిహద్దుకు పశ్చిమ దిక్కునున్న దేశం దిక్కు చూస్తే వారు తరచుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మన ప్రజలను టెర్రరిజం నుంచి కాపాడుకోవాల్సిన హక్కు దేశానికి ఉంది. ప్రస్తుతం అదే చేస్తున్నాం" అని జైశంకర్ అన్నారు.అదేవిధంగా ఆయన సిందూనది జలాల ఒప్పందం అంశంపై మాట్లాడుతూ. "చాలా సంవత్సరాల క్రితం సిందూనది జలాల ఒప్పందం చేసుకున్నాము. కానీ దశాబ్ధాలుగా మనకు సత్సంబంధాలు లేవు. మంచి సంబంధాలు లేనప్పుడు దాని ఫలితాలు అదే విధంగా ఉంటాయి. దయచేసి మీరు మాకు నీరు ఇవ్వండి మేము మాత్రం ఉగ్రవాదులని మీదేశానికి పంపుతాము అంటే ఏలా కుదురుతుంది" అని జైశంకర్ ప్రశ్నించారు. గతేడాది ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్లోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో దాదాపు 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. -
కండోమ్, గర్భనిరోధక మాత్రలపై అమల్లోకి వచ్చిన వ్యాట్
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి సరికొత్త సమస్య వచ్చి పడింది. జననాల సంఖ్య దారుణంగా పడిపోతుండడంతో జనాభాను పెంచేందుకు చైనా ప్రభుత్వం నానాపాట్లు పడుతోంది. ఈ క్రమంలో కొత్త ఏడాది.. అందునా మొదటి రోజే ఓ కీలక నిర్ణయం ప్రకటించింది. కండోమ్ సహా గర్భ నిరోధక మాత్రలు, ఇతర సంబంధిత ఔషధాలపై 13 శాతం పన్ను విధించి.. తీవ్ర చర్చకు దారి తీసింది.చైనా ప్రభుత్వంలో ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఉన్నాయి. అక్కడ గత మూడేళ్లుగా జననాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2024లో కేవలం కోటి మంది పిల్లలు మాత్రమే పుట్టారు. ఇది గత దశాబ్దం కాలంనాటి గణాంకాల్లో సగం కావడం గమనార్హం. వృద్ధ జనాభా, ఆర్థిక మందగమనం కారణంగా ప్రభుత్వం త్వరగా పెళ్లి చేసుకుని ఎక్కువ పిల్లలు కనాలని అక్కడి యువతను కోరుకుంటోంది. ఈ క్రమంలో.. గర్భనిరోధక వస్తువులు (కండోమ్లు, మాత్రలు, IUDలు)లపై పన్నులు పెంచగా, చైల్డ్కేర్ సేవలు (పిల్లల సంరక్షణ), వివాహ సంబంధిత సేవలు, వృద్ధుల సంరక్షణ సేవల వస్తువులపై పన్నులు తగ్గించింది. తల్లిదండ్రులకు ఎక్కువ పేరెంటల్ లీవ్.. క్యాష్ హ్యాండౌట్లు (ఆర్థిక సహాయం) వంటి ప్రోత్సహాకాలు అందిస్తోంది. 2026 జనవరి 1 నుండి కండోమ్లు, గర్భనిరోధక మాత్రలు, IUDలు వంటి వస్తువులపై 13 శాతం వ్యాట్ అమల్లోకి తెచ్చింది. 1993 నుంచి ఈ వస్తువులు వ్యాట్ కేటగిరీ నుంచి మినహాయింపు పొందుతూ వచ్చాయి. కానీ.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..కండోమ్ల ధర పెరగడం వల్ల జననాల సంఖ్య పెరగడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయవ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్య పిల్లల పెంపకం ఖర్చులు ఎక్కువగా ఉండటమేనని చెబుతున్నారు. చైనాలో కండోమ్లపై పన్నులు పెరగడం వల్ల వాటి ధరలు పెరిగితే, ప్రజలు వాటిని తక్కువగా ఉపయోగించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుండగా.. ఇది హెచ్ఐవీ వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుందని డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తోంది. గతంలో కొన్ని దేశాల్లో ఎదురైన పరిస్థితులనూ ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావిస్తోంది. అదే సమయంలో చైనాలో హెచ్ఐవీ కేసులు.. గత దశాబ్దంలో తగ్గినా, యువతలో కొత్త కేసులు ఇంకా నమోదవుతున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తోంది.ట్రోలింగ్.. జననాల రేటు పెంచేందుకు చైనా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యువత ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం పెళ్లి చేసుకుని పిల్లలు కనమని చెబుతోంది. మరోవైపు గర్భనిరోధక వస్తువులను ఖరీదుగా చేస్తోందంటూ మండిపడుతున్నారు.మరోవైపు.. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. కండోమ్స్ ధరలు పెంచడం అంటే.. ముందుగానే రెండు,మూడేళ్లకు ముందే కండోమ్స్ కొనుగోలు చేయమని చెబుతున్నారా? అంటూ చైనా యువత సెటైర్లు సంధిస్తున్నారు. కండోమ్ ధరలు పెంచటం ద్వారా పిల్లల సంఖ్య పెరుగుతుందనే ఆలోచన రావటమే సూపర్.. మనం పిల్లల్ని కనటానికి మన కంటే ప్రభుత్వమే చాలా ఎక్కువగా కష్టపడుతుందంటూ నెటిజన్లు పంచ్ల మీద పంచ్లు వేస్తున్నారు. -
చైనాకు తైవాన్ చెక్.. అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
తైపీ: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ టె స్పష్టం చేశారు. ఆ దేశం చుట్టూ చైనా ఇటీవల లైవ్–ఫైర్ సైనిక కసరత్తలు చేపట్టిన నేపథ్యంలో గురువారం కొత్త సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా విస్తరణవాద కాంక్ష నేపథ్యంలో, తైవాన్ ప్రజలకు తమను తాము రక్షించుకునే శక్తి ఉందో, లేదోనని అంతర్జాతీయ సమాజం చూస్తోందన్నారు.జాతీయ రక్షణ, సమాజాన్ని కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సమగ్రమైన రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై అధ్యక్షుడిగా తన వైఖరి స్పష్టమన్నారు. ఒకప్పుడు జపాన్ కాలనీగా ఉన్న తైవాన్ 1949లో చైనాతో జరిగిన అంతర్యుద్ధంలో ఓడిపోవడంతో స్వతంత్ర పాలనలో ఉంది. అయితే చైనా మాత్రం తైవాన్ను తన సొంత భూభాగంగా చూస్తుంది. అవసరమైతే దానిని బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని పదేపదే బెదిరిస్తుంది. ఈ నేపథ్యంలో లై వ్యాఖ్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.అధ్యక్షుడు లై, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఎన్ని చెప్పినా, ఏం చేసినా.. తైవాన్ చైనాలో భాగమనే వాస్తవాన్ని వారు మార్చలేరని తెలిపింది. తైవాన్పై చైనా దాడి చేస్తే టోక్యో జోక్యం చేసుకుంటుందని జపాన్ చేసిన వ్యాఖ్యలు, యూఎస్ ఆయుధ విక్రయాలపై చైనా కొత్త నాయకుడి వ్యాఖ్యలపై బీజింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ విలీనాన్ని ఎవ్వరూ ఆపలేరని తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా వ్యాఖ్యానించారు. -
ట్రంప్ అడుగుజాడల్లో చైనా
మంచేదైనా జరిగితే తమ ఖాతాలో వేసుకోవటానికి సిద్ధపడేవాళ్లు కోకొల్లలు. ఇది లోకో త్తర సత్యం. ఒకరకంగా అదొక వ్యాధి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఆ సమస్య ఉంది. తన ప్రమేయం లేకుండా ముగిసిన యుద్ధాలనూ, ఇంకా ముగియని యుద్ధాలనూ తానే ఆపానని చెప్పుకోవడంతోపాటు ఉనికిలో లేనివాటికి కూడా అడ్డుచక్రం వేశాననటం ఆయనకే చెల్లింది. ఆ బాణీ ఇంకా ఆపలేదు. ఇప్పుడు చైనా వంతు వచ్చినట్టుంది. 2025లో భారత్–పాక్ ఘర్షణలు నివారించటంతోపాటు అనేక ఇతర యుద్ధాలను ఆపిన ఘనత తమదంటూ తాజాగా వాంగ్–యీ ప్రకటించుకున్నారు. ఆ రెండు దేశాలూ అనేక రంగాల్లో పోటీపడుతున్నాయి. ఆర్థికంగా ఇప్పటికీ అమెరికాదే పైచేయి అయినా, రేపో మాపో దాన్ని చైనా అధిగమిస్తుందని ఎవరో కాదు... ఆర్థిక నిపుణులే దండోరా వేస్తు న్నారు. ఆ విషయంలో చైనాను ప్రశంసించాల్సిందే! అమెరికాతో పోలిస్తే ఎక్కడో అట్ట డుగునుండే దేశాన్ని 75 ఏళ్లలోనే ఈ స్థాయికి తీసుకురావటం మాటలు కాదు మరి. అంతమాత్రాన అమెరికా చెప్పే అబద్ధాలను కూడా వల్లెవేయటం వంటి చౌకబారు అనుకరణలు బెడిసికొడతాయని చైనా గ్రహించకపోవటం క్షమార్హం కానిది. కశ్మీర్లోని పెహల్గాంలో పాక్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు అనేకమంది అమాయ కులను పొట్టనబెట్టుకున్న వైనం తర్వాత గత ఏడాది మే మొదటివారంలో మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేయటం, దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై దాడి చేసే ప్రయత్నం, మనం తిప్పికొట్టడం, ఎదురు దాడి చేయడం వంటివి జరిగాయి. చివరకు కుదిరిన కాల్పుల విరమణ వెనక రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్లు (డీజీఎంలు) ఉన్నారని మన దేశం చెబుతోంది. ఇలాంటి విషయాల్లో మూడో పక్షం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించ బోమని అప్పట్లోనే స్పష్టం చేసింది. నిజానికి ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా పాక్ సైన్యం వాడిన ఆయుధ సామగ్రిలో చైనా సరఫరా చేసినవి కూడా ఉన్నాయని అప్పుడే బయటపడింది. ఆ సామగ్రి 81 శాతం అని కూడా తేలింది. పాకిస్తాన్ మనపై ప్రయోగించిన ఆయుధ సామగ్రి చూశాక, ఈ ఘర్షణను ‘సజీవ ప్రయోగశాల’గా చైనా ఉపయోగించుకున్నట్టు కనబడుతోందని కూడా మన దేశం విమర్శించింది. అలాంటి దేశం ‘తగుదు నమ్మా...’ అంటూ ఇరుపక్షాల మధ్యా రాజీకీ దౌత్యం నెరపానని ఇప్పుడు గప్పాలు కొడుతోంది. లోపాయకారీగా ఘర్షణలను ఎగదోయటం, పైకి శాంతి వచనాలు వల్లించటం ఇటీవలి ధోరణేం కాదు. ఇలాంటి జిత్తులమారి ఎత్తుగడల్లో అమెరికా ఆరితేరింది. ఇజ్రా యెల్ సాగించే అన్ని దాడుల వెనకా ఆ దేశం ఉంటుంది. అవే దాడుల్ని ఆపినట్టు కనబడటంలో ముందుంటుంది. శాంతి సాధన కోసం ‘ఏ సమస్యనైనా వస్తునిష్ఠతో చూడటం, న్యాయమైన వైఖరి తీసుకోవటం’ తమ విధానమని... లక్షణాలనూ, మూల కారణాలనూ తొలగించటమే తమ ధ్యేయమని వాంగ్–యీ చెప్పుకున్నారు. డాలర్ ఇంకా శాసిస్తూనే ఉంది కనుక అమెరికా ఇలాంటి అబద్ధాలు చెప్పినా ఏదోమేరకు చెల్లు బాటవుతాయి. సుంకాలు పెంచుతామని బెదిరించానంటే ‘అవును కాబోలు...’ అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ చైనా సైతం ‘అన్నీ నేనే... అంతా నేనే’ అని అనటం ఎబ్బెట్టుగా ఉంటుంది. అదను చూసుకుని పక్కనున్న తైవాన్ను కబళించాలని ప్రయత్నిస్తూ, మనతో సరిహద్దుల్లో అకారణ వైరానికి దిగుతూ, అరుణాచల్ ప్రదేశ్లో గ్రామాల పేర్లు మార్చు కుని మురిసిపోతూ ఇలా తటస్థత నటించటం అనైతికత. చైనాకూ, తైవాన్కూ మధ్య రాజీ కుదర్చటానికి ప్రయత్నిస్తానని మన దేశం ముందుకొస్తే చైనా అంగీకరిస్తుందా? అధికారంలోకొచ్చిన నాటి నుంచీ నోబెల్ బహుమతి కోసం వెంపర్లాడటం ట్రంప్కు ఎక్కువైంది. బహుశా ఆయనకు మోకాలడ్డాలని చైనా ఏమైనా ప్రయత్నిస్తోందేమో! అలా చేయదల్చుకుంటే ట్రంప్ తప్ప వేరెవరూ చైనాను ఆటంకపరచరు. తామిచ్చే శాంతి బహుమతి సైతం ప్రతిష్ఠాత్మకమైనదిగా ఉండేలా చూసుకొనే బాధ్యత నోబెల్ కమిటీది. ఈలోగా లేని పెద్దరికాన్ని ప్రదర్శించటం వల్ల నవ్వులపాలు కావటం ఖాయమని అటు ట్రంప్, ఇటు చైనా తెలుసుకోవాలి. -
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు.. డాక్టర్లు వేలిని కత్తిరించారు?
పాముల్లో ఉండే గుణం.. కాటు వేయడం. అన్ని పాముల్లో విషం లేకపోయినా, విషపూరిత పాములతోనే అత్యంత ప్రమాదం. అది మనం పెంచుకునే విషపూరిత పాము అయినప్పటికీ దానితో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే మన ప్రాణం మీదకు తెచ్చుకోవాలి. అదే జరిగింది ఇక్కడ. ఓ వ్యక్తి విషపూరిత పామును ముచ్చటగా పెంచుకుంటున్నాడు. కానీ ఆ పాము కాటుతో తన చేతి వేలిని కోల్పోయాడు సదరు వ్యక్తి. చైనా దేశంలోని బీజింగ్లో జరిగిన ఈ ఘటన వైరల్గా మారింది. అతనికి చిన్నప్పటినుండి పాములంటే ఆసక్తి. ఆ క్రమంలోనే ఓ విషపూరిత పామును పెంచుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాముకు జబ్బు చేసి ఆహారం తినలేకపోతోంది. దానికి బలవంతంగా చేతితో ఆహారాన్ని పెడుతూ వస్తున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ పాము కోరల్లో అతని చేయి ఇరుక్కుంది. దాంతో పాము కాటుకు బారిన పడ్డ ఆ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి కరిచిన వేలిని తీసేయాలన్నారు. వేలిలో విషం ఉందని, అది తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో చేసేదిలేక వేలిని తీయించుకున్నాడు. ఇది ఆ వ్యక్తికి నేర్పిన జీవిత పాఠంగా గుర్తిండిపోవడం ఖాయం. విషపూరితమైన వాటికి దూరంగా ఉండటం ఎంత మంచిదో ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది.అదొక ఫైవ్ స్టెప్ స్నేక్చైనీస్ కథల్లో ఈ పామును "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు. ఇది అంతటి విషపూరితమైందని నమ్మకం ఉంది, ఒకవేళ ఇది ఎవరినైనా కరిస్తే వారు ఐదు అడుగులు కూడా వేయకముందే మరణిస్తారని చెబుతారు. ఇటీవలి సంవత్సరాల్లో చైనాలో విచిత్రమైన మరియు తరచుగా ప్రమాదకరమైన జంతువులను పెంపుడు జంతువులుగా పెట్టుకునే ధోరణి పెరుగుతోంది.ఈ పాము విషం.. అత్యంత వేగంగా ప్రభావం‘ఫైవ్ స్టెప్ స్నేక్"అనేది అత్యంత విషపూరిత పాముకు సంబంధించినది.ఈ పాము కాటు వేస్తే, విషం చాలా వేగంగా ప్రభావం చూపుతుంది.ప్రజల్లో ఒక నమ్మకం ఉంది: కాటు పడిన వ్యక్తి ఐదు అడుగులు కూడా వేయలేడు, వెంటనే కుప్పకూలిపోతాడు.అందుకే దీనిని "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు.శాస్త్రీయ పేరు- రస్సెల్ వైపర్శరీరంపై గోధుమ రంగు, పెద్ద పెద్ద వృత్తాకార మచ్చలు ఉంటాయి. పొడవు సాధారణంగా 1–1.5 మీటర్లు.రాత్రివేళ ఎక్కువగా చురుకుగా ఉంటుంది.విష ప్రభావంరక్తం గడ్డకట్టే విధానాన్ని (blood clotting) దెబ్బతీస్తుంది.తీవ్రమైన నొప్పి, వాపు, అంతర్గత రక్తస్రావం కలుగుతుంది.తక్షణ వైద్య సహాయం లేకపోతే ప్రాణాపాయం. -
ఆ దేశాల్లో కానరాని సంబరాలు.. కారణమిదే..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లోని ప్రజలు జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. ఆరోజు విందు వినోదాలతో వేడుకలు చేసుకుంటారు. అయితే అన్ని దేశాల్లోనూ జనవరి ఒకటి నూతన సంవత్సర ఆరంభం కాదు. కొన్ని దేశాల్లో తమ సంస్కృతులు, ప్రాచీన క్యాలెండర్లు, చంద్రుని గమనం (లూనార్ సైకిల్స్) ఆధారంగా వేర్వేరు తేదీలలో కొత్త ఏడాదిని స్వాగతిస్తారు. నూతన సంవత్సర వేడుకలు వందల ఏళ్ల నాటి సంప్రదాయాలకు ప్రతిరూపాలు.డ్రాగన్ డ్యాన్స్ల హోరుచైనీస్ నూతన సంవత్సరం సాధారణంగా ఫిబ్రవరి 17 నుండి మార్చి 3 మధ్య వస్తుంది. ఏకంగా 15 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఆ రోజుల్లో డ్రాగన్ డ్యాన్స్లు, ఎరుపు రంగు లాంతర్లు, కుటుంబ విందులతో చైనా కళకళలాడుతుంది. ప్రతి ఏటా ఒక జంతువును ‘రాశి’ (Zodiac Animal) గా పరిగణించడం వీరి ప్రత్యేకత.రైస్ కేక్ సూప్ తింటే..కొరియాలో 'సోల్లాల్' (Seollal) పేరుతో మూడు రోజుల పాటు నూతన సంవత్సర వేడుక నిర్వహిస్తారు. 2026, ఫిబ్రవరి 17న ఇది మొదలుకానుంది. ఈ సందర్భంగా అక్కడి వారంతా ‘టెక్గుక్’ (tteokguk) అనే రైస్ కేక్ సూప్ను సేవిస్తారు. ఇది తింటే వయస్సు ఒక ఏడాది పెరుగుతుందని వారు నమ్ముతారు.దేశవ్యాప్తంగా వాటర్ ఫైట్థాయిలాండ్లో ఏప్రిల్ 13 నుండి 15 వరకు 'సోంగ్క్రాన్' (Songkran) పేరిట నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటారు. దేశవ్యాప్తంగా వాటర్ ఫైట్ నిర్వహిస్తారు. ఇది చెడును కడిగివేస్తుందని వారు భావిస్తారు.నిశ్శబ్ధ స్వాగతంబాలిలో 'న్యేపి' (Nyepi) అనే నిశ్శబ్ద వేడుక జరుగుతుంది. 2026 మార్చి 19న జరగబోయే ఈ వేడుకలో భాగంగా 24 గంటల పాటు ద్వీపం మొత్తం నిశ్శబ్ధంగా మారుతుంది. విమానాలు, ట్రాఫిక్, లైట్లు, శబ్దం ఏమీ ఉండవు. ప్రజలంతా ప్రశాంతంగా మెలుగుతూ ధ్యానంలో కాలం గడుపుతారు.ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ)ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం ప్రతి ఏటా మారుతూ ఉంటుంది (2026లో జూన్ 16-17 తేదీలలో రావచ్చు). చంద్రుని గమనం ఆధారంగా ఏటా సుమారు 11 రోజులు ముందుకు జరుగుతుంది. ఇతర దేశాల్లో ఉండే అట్టహాసాలు, పార్టీలకు భిన్నంగా ఇక్కడ ఆ రోజున ప్రశాంతత పాటిస్తూ, ప్రార్థనలు, ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతారు. ఇది కూడా చదవండి: New Year 2026: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు -
చైనాకు పాక్ ఉప ప్రధాని.. కారణం ఇదే..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్దార్ చైనాలో పర్యటించనున్నారు. ఈ వారం చివర్లో చైనాను సందర్శించనున్న ఆయన చైనా విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కాగా, ఏడో దశ ద్వైపాక్షిక చర్చలు జనవరి 4న బీజింగ్లో జరుగుతాయని పాక్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆహ్వానం మేరకు దార్ ఈ పర్యటన చేస్తున్నారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఇరు దేశాలు స్మారక కార్యకలాపాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ఈ పర్యటన బలోపేతం చేస్తుందని ప్రకటించింది. -
బ్రహ్మపుత్రపై డ్యామ్కు రూ. 15.27 లక్షల కోట్లు!
బీజింగ్: భారత్కు అత్యంత ముప్పుగా చెబుతున్న బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్ నిర్మాణానికి ఏకంగా దాదాపు రూ.15.27 లక్షల కోట్లు(170 బిలియన్ డాలర్లు) కేటాయిస్తున్నట్టు అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రకటించారు. బుధవారం నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. విద్యుదుత్పత్తి సాకుతో అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంగా టిబెట్ భూభాగంలో ఈ భారీ డ్యామ్ నిర్మాణాన్ని చైనా తలపెట్టడం తెలిసిందే. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలకు వరద ముప్పు పెరుగుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వైషమ్యాలు పెచ్చరిల్లిన వేళ ప్రా జెక్టులోని జలరాశిని మనపైకి జలఖడ్గంలా చైనా వాడే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. అలాంటి డ్యామ్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లేందుకే చైనా నిర్ణయించుకుందని జిన్ పింగ్ ప్రకటన తేటతెల్లం చేసింది. తైవాన్కు వార్నింగ్ తైవాన్ను ఎప్పటికైనా చైనాలో విలీనం చేసుకుని తీరతామని జిన్ పింగ్ పునరుద్ఘాటించారు. దీన్ని ఎవరూ ఆపలేరని కూడా అన్నారు. తద్వారా తైవాన్ కు మద్దతు పలుకుతున్న అమెరికా వంటి దేశాలను అన్యాపదేశంగా ఆయన హెచ్చరించారు. తైవాన్ చుట్టూ సైనిక కసరత్తులను కొద్ది రోజులుగా చైనా మరింత ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. -
చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు
-
ఇండియా-పాక్ వార్.. చైనా అక్కసు
ఆపరేషన్ సిందూర్తో భారత్కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ తరచుగా భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ విషయంపై భారత్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ మామ తన తీరు మార్చుకోవడం లేదు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానితో జరిగిన భేటీలో కూడా ఈ వ్యాఖ్యలే చేశారు.ఇది చాలదన్నట్లు తాజా ఆజాబితాలో చైనా దేశం కూడా చేరింది.ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత్కు తంటాలు తప్పడం లేదు. ఇండియన్ ఆర్మీ ముష్కరుల స్థావరాల్ని వారి స్వస్థలంలోనే ధ్వంసం చేసి ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలిసేలా చేసింది. తన జోలికస్తే రిప్లై ఏలా ఉంటుందో చిన్న ట్రైలర్ చూపించింది. దీంతో భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైన పాక్ దారికొచ్చింది. ఇరు దేశాలు పరస్పర కాల్పులు విరమణ ఒప్పందంపై సంతకం పెట్టాయి. తాజాగా చైనా ఈ అంశంలో వేలు పెట్టింది. భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించి తానే ఈ యుద్ధాన్ని ఆపానని డ్రాగన్ కంట్రీ ప్రకటించిందిఆ దేశ విదేశాంగ మంత్రి వాంఘ్ యీ మాట్లాడుతూ " చైనా చాలా దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరించింది. మయన్మార్లో సందిగ్ధతలు, ఇరాన్ న్యూక్లియర్ సమస్య, భారత్- పాకిస్థాన్ సమస్య, కంబోడియా-థాయిలాండ్ వివాదం, పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య గొడవ ఇలా ప్రపంచ దేశాల మధ్య గొడవలన మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించాం" అని చైనా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. " మేము ఇదివరకే ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాం. భారత్-పాకిస్థాన్ అంశంలో మూడవ పార్టీ జ్యోక్యం లేదు. మా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం రెండు దేశాల మధ్యలోనే జరిగిందని" భారత్ హెచ్చరించింది. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్కు మద్ధతుగా నిలిచింది. పాక్కు అవసరమైన యుద్ధ సామాగ్రిని, ఫైటర్ జెట్స్ అందించింది. ఆసమయంలో భారత్ చేసిన దాడులలో డ్రాగన్ కంట్రీకి చెందిన కొన్ని వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. -
చైనా స్టీల్ ఉత్పత్తులపై 12 శాతం టారిఫ్స్ విధించిన భారత్
-
అక్కడ కాఫీ షాప్కి వెళ్లాలంటే హెల్మెట్ ధరించాల్సిందే..! ఎందుకో తెలుసా?
సాహసమే చేయ్రా డింభకా. అన్నది కదరా పాతాళభైరవి. చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది అన్న పాట పాడుకుంటూ సాహసం చేయాల్సిందే అక్కడ కాఫీ కోసం. హాయిగా ఆస్వాదించే కమ్మటి కాఫీ కోసం అంత కష్టపడటం ఏంటి అనుకోకండి. ఎందకంటే ఇక్కడ కాఫీ షాపు వెళ్లడం అంటే డేరింగ్ టూర్ లాంటిది. నిజానికి ఇక్కడకు కాఫీ కోసం వెళ్తున్నట్లు ఉండదు..ఏదో పర్యాటకానికి వచ్చామా..అన్నట్లు ట్రెక్కింగ్లు, రకరకాల విన్యాసాలు చేసుకుంటూ పోవాలి. అలా అని వాళ్లేమి మనకు టాస్క్లు, సరదా గేమ్లు పెట్టడం లేదు. ఆ కాఫీ షాపుకు వెళ్లే వే అలా సాహసానికి కేరాఫ్గా ఉంటుంది. ఇంతకీ ఆ కాఫీ షాపు ఎక్కడుందంటే..చైనాలోని యాంగ్షువో కౌంటీలోఈ వింతైన షాపు ఉంది. దీనిని 'ఎర్త్కోర్ ఎక్స్ప్లోరేషన్' అని పిలుస్తారు. ఒక గుహ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అలా అని అంత ఈజీగా అది మనకు కనిపించదు. సాహసాలంటే ఇష్టపడే పర్యాటక ఔత్సాహికులకు ఈ కాఫీ షాప్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడకు వెళ్లాలంటే అడుగడుగున ఓ సాహాసం చేయాలి, కొన్ని క్లిష్టమైన టాస్క్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వెళ్తునప్పుడూ మన కాఫీ కోసం వెళ్తున్నామా..లేక ఏదైనా ట్రెక్కింగ్ లేదా టూర్కి వచ్చామా అనే సందేహం కలుగకమానదు. అంతేకాదండోయ్ ఈ గుహ గుండా వెళ్లేటప్పుడూ హెల్మెట్, సురక్షితమైన బూట్లు తప్పనిసరి. గుహ గట్లు, ఇరుకైన మార్గాలు, లోతుగా ఉండే ప్రదేశాలు, కొన్నిచోట్ల తాళ్లు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరికొన్ని చోట్ల..నిర్జన చీకటి ప్రదేశం గుండా వెళ్లి..అక్కడ వంతెనలు ఎక్కాల్సి ఉంటుంది. అలా చివరికి కాఫీ కేఫ్కి చేరుకుంటాం. అక్కడ సున్నపురాయి నిర్మాణాలు, స్టాలక్టైట్లు(మంచులా కనిపించే కాల్షియం కార్బొనేట్ అవపాతం), పైకప్పులు, చక్కటి లైటింగ్తో మరో ప్రపంచంలోకి అగుడుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అరకరడ ఉన్న శ్వేత నేపథ్యానికి తగ్గట్టు ఉండే తెల్టి కుర్చీలు మొత్తం సెటప్ అదరహో అనిపిస్తుంది. భూగర్భ శాస్త్రాన్ని కాఫీ సంస్కృతితో కలుపుతున్నట్లుగా ఉంటుంది అక్కడి వాతావరణం. ఈ కాఫీ కోసం ఎంతో శ్రమపడి వెళ్లి హాయిగా టేస్టీ కాఫీని ఆస్వాదించాల్సి ఉంటుంది మరి. మాములుగా కాఫీ తాగేస్తే మజా ఏం ఉంది..ఇలా డేరింగ్ ఫీట్లు చేస్తూ వెళ్లి కాఫీ తాగడంలోని కిక్కే వేరబ్బా..!. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Jérôme Poirier (@jerometraveller) (చదవండి: Fast Track Immigration: ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ అంటే..? సుస్మితా, రాణి ముఖర్జీలు సైతం..) -
అది నిజం కాదు.. చైనాకు అంత సీన్ లేదు!
భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తామే చల్లార్చామంటూ చైనా చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. అయితే చైనాకు అంత సీన్ లేదని భారత్ అంటోంది. మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పుడూ ఒకేరకమైన విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేస్తూ.. డ్రాగన్ కంట్రీ ప్రకటనను తోసిపుచ్చింది. చైనా ప్రకటనను కేంద్ర వర్గాలు తోసిపుచ్చినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం.. భారతదేశం మధ్యవర్తిత్వంపై ఎప్పటినుంచో స్పష్టమైన వైఖరిని అవలంభిసతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. ఆ తర్వాత ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదు. కేవలం పాకిస్తాన్ DGMO (Director General of Military Operations) భారత్ను సంప్రదించి కాల్పుల విరమణ కోరింది. కాబట్టి.. భారత్ ఎప్పటికీ మూడోపక్ష జోక్యాన్ని అనుమతించదు అని పేర్కొన్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ఆపరేషన్ సిందూర్ పేరిట సర్జికల్ స్ట్రయిక్సతో సర్వనాశనం చేసింది. ఈ నేపథ్యంతో మే 7-10వ తేదీల మధ్య ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. రెండు దేశాల సైనిక డీజీఎంవోల సంప్రదింపుల ఫలితంగా సడలిపోయాయని మోదీ సర్కారు ప్రకటించింది. కానీ,తాజాగా బీజింగ్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు వివాదాలను పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కూడా చైనా తన మధ్యవర్తిత్వం ద్వారా తగ్గించిందని ఆయన వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన టారిఫ్ బెదిరింపులతోనే ఇరు దేశాలు దిగొచ్చి కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. దీనికి కారకుడంటూ భారతీయ మూలాలున్న తన ప్రత్యేక సహాయకుడు రికీ గిల్ను ట్రంప్ ప్రభుత్వం తాజాగా సత్కరించింది కూడా. ఈ పరిణామాల నడుమే.. మే నెల ఉద్రిక్తతల సమయంలో పాక్కు ఆయుధాలను సరఫరా చేసిన చైనా ఇప్పుడు మధ్యవర్తిత్వం నడిపి ఉద్రిక్తతలను చల్లార్చామంటూ ప్రకటించుకోవడం కొసమెరుపు. -
స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్లు
ఢిల్లీ: చైనా విషయంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి వచ్చే ఉక్కు(స్టీల్) ఉత్పత్తులపై భారత్ సుంకాలు విధించింది. మూడేళ్ల పాటు ఈ సుంకాలు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. అయితే, చైనా నుండి వచ్చే ఎగుమతుల పెరుగుదలను నియంత్రించే లక్ష్యంతో భారత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.అయితే, చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన, నాసిరకం ఉత్పత్తులను అరికట్టేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుండి వచ్చే ఎగుమతుల పెరుగుదలను నియంత్రించే లక్ష్యంతో(సేఫ్ గార్డు డ్యూటీ) భారత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా భారత్.. చైనాపై మొదటి సంవత్సరంలో సుంకాన్ని 12 శాతంగా నిర్ణయించగా.. రెండో సంవత్సరంలో 11.5 శాతానికి తగ్గించనున్నారు. అలాగే, మూడో సంవత్సరంలో 11%కి తగ్గిస్తున్నట్టు మంగళవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తుల్లో భారత్ (India) రెండో స్థానంలో ఉంది. చైనా (China) నుంచి నాసిరకం ఉక్కు తక్కువ ధరలకే వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల దేశీయ ఉక్కు తయారీదారులపై కూడా ప్రభావం పడుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల దిగుమతులకు దీనినుంచి ఉపశమనం కల్పించింది. చైనా, వియత్నాం, నేపాల్ దేశాలకు ఈ సుంకాలు వర్తించనున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు కూడా ఇది వర్తిస్తుంది. Big relief for domestic steel manufacturersGovt imposes safeguard duty on imports of certain steel productsSafeguard duty imposed for three years in a staggered mannerDuty will be imposed at 12% in the first year, 11.5% in the second year, followed by 11% in the third year pic.twitter.com/ehH2CPqYb2— Prakash Priyadarshi (@priyadarshi108) December 30, 2025ఇదిలా ఉండగా.. చౌక దిగుమతులు, నాసిరకం ఉత్పత్తుల కారణంగా దేశీయ ఉక్కు పరిశ్రమ దెబ్బతినకూడదని మంత్రిత్వ శాఖ పదేపదే చెబుతోంది. ఇటీవల, దిగుమత్తుల్లో గణనీయమైన పెరుగుదల ఉండటం దేశీయ కంపెనీలపై ప్రభావం చూపించింది. దీంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) మూడేళ్ల సుంకాన్ని సిఫార్సు చేసింది. ఈ క్రమంలో సుంకాలను విధించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, ఇండియన్ స్టెయిన్లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఈ సమస్యను ముందుగానే ఎత్తి చూపింది. ఆగస్టు 2025లో చౌక ఉక్కు దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాలని ప్రభుత్వాన్ని కోరుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్కు ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఈ ఏడాది ఏప్రిల్లోనే భారత్కు విదేశాల నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 12 శాతం తాత్కాలిక సుంకం విధించింది. 200 రోజులకు గాను విధించిన ఈ సుంకాలు గత నెలలోనే ముగిశాయి. -
తైవాన్పై చైనా దూకుడు.. గగనతల దిగ్బంధనం
హాంకాంగ్: చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మంగళవారం రెండో రోజు కూడా తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలను కొనసాగించింది. తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి జస్టిస్ మిషన్ 2025 పేరుతో విన్యాసాలకు తెరతీసింది.తైవాన్కు బయటి నుంచి అందే ఎలాంటి మద్దతునైనా అడ్డుకునే సత్తా తమకుందని చూపేందుకు స్వయం పాలిత దీవిని దిగ్బంధనం చేసి, లైవ్ ఫైర్ డ్రిల్స్ సాగిస్తోంది. ఇందులో పీఎల్ఏ సదరన్ థియేటర్ కమాండ్లోని డె్రస్టాయర్లు, ఫ్రిగేట్లు, యుద్ధ విమానాలు, బాంబర్లు పాల్గొంటున్నాయి. తైవాన్ ఉత్తరం వైపు మొదలుకొని దక్షిణ వైపు సముద్ర జలాలతోపాటు గగనతలంపైనా దిగ్బంధనం కొనసాగిస్తున్నాయి. తైవాన్ ఉత్తర ప్రాంతంపై లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించం ద్వారా ఆశించిన ఫలితాలను రాబట్టినట్లు సదరన్ కమాండ్ తెలిపింది.కాగా, సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు తమ దీవికి సమీపంలో చైనాకు చెందిన ఫైటర్ జెట్లు, బాంబర్లు కలిపి 130 విమానాలు, 14 మిలటరీ ఓడలు, 8 ఇతర షిప్పులు కనిపించాయని తైవాన్ తెలిపింది. చైనాకు చెందిన కనీసం 90 విమానాలు జలసంధిలోని తైవాన్ గగనతల రక్షణ జోన్లోకి ప్రవేశించాయని పేర్కొంది. చైనా బెలూన్ కూడా సంచరించిందని తెలిపింది. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ నుంచి లాంగ్ రేంజ్ ఆర్టిలరీ విభాగం తమ ఉత్తర ప్రాంతంపై కాల్పులు జరిపిందని వివరించింది. తమ తీరానికి 44 కిలోమీటర్ల దూరం వరకు వీటి ప్రభావం కనిపించిందని వెల్లడించింది. -
తైవాన్ జలసంధిలో భారీగా విన్యాసాలు
బీజింగ్: తైవాన్ ఎప్పటికీ తమదేనంటున్న డ్రాగన్ దేశం చైనా తైవాన్ జలసంధిలో తాజాగా సైనిక విన్యాసాలకు తెరతీసింది. తైవాన్కు మద్దతుగా జపాన్ ప్రధానమంత్రి తకాయిచీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు, తైవాన్కు అమెరికా ఇటీవల భారీగా ఆయుధాలను విక్రయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నడుమ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ(పీఎల్ఏ) ఈస్టర్న్ థియేటర్ కమాండ్ సోమవారం యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లతోపాటు లాంగ్ రేంజ్ క్షిపణులతో తైవాన్ జలసంధి మధ్యప్రాంతంలో సముద్రజలాలతోపాటు గగనతలంలోనూ విన్యాసాలు చేపట్టింది. ఈ విషయాన్ని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. కీలకమైన లక్ష్యాలను కచి్చతంగా ఛేదించేలా బలగాల సామర్థ్యాలకు పదును పెట్టడమే వీటి ఉద్దేశమని పేర్కొంది. చైనా చర్యలపై తైవాన్ వెంటనే స్పందించింది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ విన్యాసాలను చేపట్టామని తైవాన్ రక్షణ మంత్రి తెలిపారు. చైనా మిలటరీ చర్యలను శాంతికి తీవ్ర విఘాతం కలిగించే దుందుడుకు వైఖరిగా ఆయన అభివరి్ణంచారు. తైవాన్ వైమానిక స్థావరంలో ల్యాండవుతున్న పలు మిరేజ్ 2000 యుద్ధ విమానాల వీడియోను విడుదల చేశారు. దీంతో, సోమవారం పీఎల్ఏ చేపట్టిన విన్యాసాలు ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచినట్లయిందని పరిశీలకులు అంటున్నారు. ఓ వైపు జపాన్.. మరో వైపు అమెరికా నవంబర్ 7న జపాన్ పార్లమెంటులో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తైవాన్లో తలెత్తే ఏదైనా అత్యవసర పరిస్థితి జపాన్ మనుగడకే ముప్పు కలిగించే పరిస్థితిగా మారవచ్చని, అటువంటప్పుడు అమెరికాకు మద్దతుగా జపాన్ సైన్యం రంగంలోకి దిగాల్సిన అవసరం రావచ్చని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తకాయిచీ తకైచి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. చైనా విమా న వాహక నౌకలు, విమానాల సంచారంపై ఓ కన్నేసి ఉంచేందుకు ఒకినావాలోని సుదూర తూర్పు ద్వీపంలో మొబైల్ సర్వైలెన్స్ రాడార్ యూనిట్ను మోహరించాలనే జపాన్ నిర్ణయాన్ని కూడా చైనా విమర్శించింది. తైవాన్కు సమీపంలో జపాన్ లకి‡్ష్యత సైనిక మోహరింపులను బలోపేతం చేయడా న్ని, మధ్యశ్రేణి క్షిపణులను మోహరించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై చైనా తీవ్రంగా తప్పుబట్టింది. సైనిక శక్తిని బలోపేతం చేసుకునేందుకు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడు తోందని ఆరోపించింది. ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే ఈ నెల 18వ తేదీన తైవాన్కు రూ.లక్ష కోట్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఆమోదం తెలిపిన పక్షంలో తైవాన్కు ఇచ్చే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీ అవుతుంది. అమెరికా చర్య తైవాన్ స్వాతంత్య్రం కోరే, వేర్పాటువాద శక్తులకు ఊతమిచి్చనట్లేనని చైనా కన్నెర్ర చేసింది. తైవాన్ స్వాతంత్య్ర శక్తులు ఆ దీవిని పేలేందుకు సిద్ధంగా ఉన్న బాంబులాగా మారుస్తారంటూ వ్యాఖ్యానించింది. చైనా స్వాతంత్య్రాన్ని, సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడు కునేందుకు అవసరమైన అన్ని చర్యలను తప్పక తీసుకుంటుందని స్పష్టం చేసింది. 2022లో అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్కు మద్దతు తెలిపేందుకు వచి్చనప్పటి నుంచి డ్రాగన్ దేశం విన్యాసాల పేరుతో తైవాన్ను పలుమార్లు దిగ్బంధనం చేసింది. -
తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..!
అనుకోని ప్రమాదాల్లో బాధితులు అవయవాలు కోల్పోవడం సర్వసాధారణం. ఒక్కోసారి కొన్నిటిని కృత్రిమ అవయవాలతో భర్తి చేస్తే.. కొన్ని సున్నితమైన అవయవాల విషయాల్లో అది అస్సలు సాధ్యం కాదు. ఇక్కడ ఒక్క మహిళ కూడా అలానే ఎడమ చెవిని కోల్పోయింది. అయితే దాన్ని చక్కగా తిరిగి ఆమెకు అతికించేందుకు విన్నూతమైన వైద్యవిధానాన్ని ఉపయోగించారు. తెగిన చెవిని తిరిగి అతికించడం కాస్తం కష్టం. అయితే దాన్ని పాడవకుండా కాపాడి మరి అతికించారు. అది ఏవిధంగానే తెలిస్తే.. ఇదేం వైద్య విధానం అని విస్తుపోతారు.చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్కు చెందిన సన్ అనే మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జుట్టు యంత్రంలో చిక్కుకుంది. ఆ వేగానికి తల ఎడమవైపు చర్మంతో సహా చెవి కూడా పూర్తిగా తెగిపోయింది. దాంతో స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆ ప్రమాదంలో సదరు మహిళకు రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందువల్ల చెవిని తిరిగి అమర్చడం క్లిష్టంగా మారింది. అయితే తెగిపోయిన చెవికి గనుక రక్తప్రసరణ అందకపోతే అది కుళ్లిపోయే ప్రమాదం ఉంది. దాంతో వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. తెగిపోయిన చెవి పాడవ్వకుండా ఉండేలా.. పాదం పైభాగానికి అతికించారు. ఎందుకంటే అక్కడ చర్మం పల్చగా ఉండటమే గాక అక్కడి ఉండే రక్తనాళాలు సరిగ్గా చెవి రక్తనాళాల పరిమాణంలోనే ఉంటాయి. ఆ నేపథ్యంలో పాదానికి చెవిని అతికించారు. అక్కడ తలవెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు ఉండటంతో ఈ క్లిష్టమైన మైక్రో సర్జరీకి సుమారు 10 గంటల సమయం పట్టింది. చెవి సురక్షితంగా పెరగడానికి సుమారు ఐదు నెలలు పైనే పట్టింది. ఆ ఐదు నెలలు నిరీక్షణ అనంతరం పాదంపై ఉన్న చెవిని తీసి తల భాగంలో విజయవంతంగా అమర్చారు వైద్యులు. అలాగే ఆ మహిళ తల చర్మాన్ని పునరుద్ధరించడానికి కడుపు నుంచి తీసిన చర్మాన్ని అతికించారు. ఈ సరికొత్త చికిత్సా విధానం విజయవంతం అవడమే గాక సదరు మహిళ సైతం పూర్తిగా కోలుకుంటోంది కూడా. ఇలాంటి శస్త్ర చికిత్సలు చైనాకేం కొత్త కాదు. ఎందుకంటే గతంలో కూడా చైనా వైద్యులు రోగి భుజంపై చెవిని పెంచి అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. View this post on Instagram A post shared by Interesting Engineering (@interestingengineering)చదవండి: భావోద్వేగ మద్దతుకు పెరుగుతున్న డిమాండ్..! ఈ ఏడాదిలోనే ఏకంగా.. -
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
ఫసిఫిక్ మహా సముద్రంలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తైవాన్ను రక్షించేందుకు తాము ఎటిపరిస్థితుల్లోనూ వెనుకాడబోమంటూ జపాన్ ప్రధాని సనే తకైచి చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. ఈ వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా.. తైవాన్ చుట్టూ ‘జస్టిస్ మిషన్ 2025’ సైనిక విన్యాసాలను ప్రారంభించింది. దీంతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.మూడు ప్రధాన సముద్రాలు (తూర్పు చైనా, దక్షిణ చైనా, ఫిలిప్పీన్)తో కూడిన తైవాన్ జలసంధి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో జరిగిన స్వోర్డ్ A, జాయింట్ స్వోర్డ్ B, స్ట్రైట్ థండర్ వంటి విన్యాసాల కంటే భారీ స్థాయిలో చైనా తాజా సైనిక విన్యాసాలు నిర్వహించడమే ఇందుకు కారణం. తైవాన్ కోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేషన్ సమీప జలాల్లో చైనా కోస్ట్ గార్డ్ కార్యకలాపాలు పెరిగాయి. అదేవిధంగా.. తైవాన్ సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ నౌక 1303 దృశ్యాన్ని విడుదల చేసింది. అయితే, చైనా కోస్ట్ గార్డ్ ఈ విన్యాసాల్లో తమ పాల్గొనడం గురించి అధికారికంగా ప్రకటించలేదు. తైవాన్పై చైనా దాడులు చేస్తే జపాన్ సైన్యం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని.. జపాన్ ప్రధాని సనే తకైచి ఇటీవల పార్లమెంటులో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిచర్యగా చైనా తన సైనిక బలగాలను తైవాన్ చుట్టూ భారీగా మోహరించి యుద్ధ విన్యాసాలు చేస్తోందనేది స్పష్టమవుతోంది. తైవాన్ చుట్టూ ఉన్న ప్రధాన ఓడరేవులను దిగ్బంధించడం, బయటి దేశాల నుంచి సాయం అందకుండా అడ్డుకోవడం, క్షిపణి వ్యవస్థల పనితీరును పరీక్షించడం ప్రధాన టార్గెట్గా తెలుస్తోంది.మరోవైపు తకైచి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజింగ్ వర్గాలు.. తమ అంతర్గత విషయాల్లో జపాన్ జోక్యం చేసుకుంటే బాగోదని హెచ్చరించింది. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. అదే సమయంలో.. కౌంటర్గానే తైవాన్ను దిగ్బంధించేలా తన ఎయిర్ఫోర్స్, నేవీ బలగాలతో ‘జస్టిస్ మిషన్ 2025’లో చేపట్టినట్లు పరోక్ష ప్రకటన చేయడం గమనార్హం. -
ఎవడ్రా వీడు..మరి ఇంత టాలెంటెడా..?! .
శరీరంలో ఏ అయవం కదలదు అంటే..ఎవ్వరైనా చతికిలపడిపోతారు. జీవితమే లేదు అన్నంతగా బాధపడిపోతారు. కానీ అతడి శరీరంలో ఏ చిన్న అవయవం కదిలిన చాలు..అద్భుతం చేయొచ్చు అనుకున్నాడు. ఆ దృఢ సంకల్పమే జస్ట్ ఒకేఒక చేతి వేలు, కాలి బొటనవేలుతో అద్భుతమే సృష్టించి తన కుటుంబానికి ఆసరాగానే కాదు..టెక్నాలజీ తెలియని అమ్మను అన్ని నేర్చుకునేలా చేసి ముందుండి నడుపించిన గొప్ప కొడుకు అతడు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్న ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు సంపదతో పనిలేదు అని చెప్పే ప్రేరణాత్మక స్టోరీ..!.36 ఏళ్ల లి జియా, నైరుతి చైనాలోని చాంగ్కింగ్కు చెందిన వ్యక్తి. అతను కేవలం ఐదేళ్ల ప్రాయంలో కండరాల బలహీనత ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. అనారోగ్యం కారణంగా ఐదోతరగతితోటే పాఠశాల చదువుకి స్వస్తి పలకాల్సి వచ్చింది. అయితే చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చినా..చదవడం, రాయడం మాత్రం లీ కొనసాగించడం విశేషం. స్వీయంగా చదువుకోవడం ప్రారంభించాడు. అతనికి కంప్యూటర్ సైన్స్, భౌతిక శాస్త్రం అంటే మహా ఇష్టం. కంప్యూటర్ని తనకు పరిచయం చేసిన వ్యక్తి అతడి చెల్లెలు. పాఠశాల నుంచి తెచ్చే పుస్తకం ద్వారా కంప్యూటర్పై మక్కువ ఏర్పడటం మొదలైంది. పుస్తకంలో ప్రతి అధ్యయం అతడికి ఆకర్షణీయంగా కనిపించేది. ప్రతి కొత్త విద్యాసంవత్సరంలో ఏ కొత్త కంప్యూటర్ పుస్తకం విడుదలవుతుందో అని ఆసక్తిగా ఎదురుచూసేవాడు. అంత ఇష్టం కంప్యూటర్ అంటే. వాటిని పదేపదే క్షణ్ణంగా చదివేవాడు. ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ల సాయంతో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. అయితే ఒకపక్క లీ పరిస్థితి దారుణంగా దిగజరిపోవడం ప్రారంభించింది. నడిచే సామర్థ్యాన్నికోల్పోయాడు. ఆ తర్వాత తినడం, శ్వాస తీసుకోవడం వంటివన్నీ సమస్యాత్మికంగా మారిపోయాయి. కేవలం ఒక చేతి వేలు, కాలి బొటనవేలు మాత్రమే కదిలించగలిగేవాడు. అంతేగాదు 2020లో కోమాలోకి వెళ్లిపోయాడు కూడా. వైద్యులు ట్రాకియోటమీ చేసి, బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు కూడా. ఆ సమయంలో అతడి జీవితం అత్యంత కటిక చీకటి అలుముకున్న క్లిష్టతరమైన సమయంగా పేర్కొనవచ్చు. అయితే 2021 ప్రారంభంలో లీ నేలలేని స్మార్ట్ వ్యవసాయం గురిచి తెలుసుకున్నాడు. అది అతడికి కొండంత ధైర్యాన్ని, భరోసాని ఇంచ్చింది. ఆధునిక వ్యవసాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీని అనుసంధానించాలనే ఆలోచనను ఆచరణలో పెట్టాలని స్ట్రాంగ్ఆ నిర్ణయించుకున్నాడు.ఆఖరికి వెంటిలేటర్పై ఉన్నప్పుడు కూడా, అతను ఒక వేలు మరియు ఒక కాలి బొటనివేలితో వర్చువల్ కీబోర్డ్ను ఆపరేట్ చేస్తూ.. పూర్తి స్మార్ట్ ఫామ్ కంట్రోల్ సిస్టమ్ను విజయవంతంగా సృష్టించాడు. 2017లో అతని తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత లీ తల్లి వు డిమెయ్ అతని సంరక్షణ బాధ్యతను తీసుకుంది. ప్రతి శారీరక పనిలోనూ కొడుకు సూచనలను అనుసరించేది. అలా కాలక్రమేణ తనకు అస్సలు తెలియని సాంకేతిక నైపుణ్యాలను సులభంగా ఒడిసిపట్టిందామె. సర్క్యూట్లు గురించి తెలియకపోయినా.. కంట్రోల్ బోర్డులను సోల్డరింగ్ చేయడం, నెట్వర్క్ వైరింగ్ను ఇన్స్టాల్ చేయడం, సర్క్యూట్లను అసెంబుల్ చేయడం, వ్యవసాయ పరికరాలను నిర్వహించడం వంటి వాటిల్లో మంచి నైపుణ్యం సాధించింది. తన కుమారుడు లీ మార్గదర్శకత్వంలో తల్లి వు మాన్యువల్గా రిమోట్ కంట్రోల్డ్ డ్రైవర్లెస్ వాహనాన్ని కూడా నిర్మించింది. ఇది వారి ఉత్పత్తులను డెలివరీలు చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేగాదు అతడి తల్లి వుకి సాంకేతిక సూత్రాలు ఏమి తెలియకపోయినా..వైర్లను ఎలా కనెక్ట్ చేయాలని, సిస్టమ్ని ఎలా సెటప్ చేయాలో ఆమెకు తెలుసు. ఇక లీ నిర్మించిన స్మార్ట్ వ్యవసాయం విజయవంతంగా నడుస్తోంది, లాభాలను ఆర్జిస్తోంది. ప్రస్తుతం అతడి జీవితం ఒక కొత్త విజయవంతమైన అధ్యయనానికి నాంది పలికింది. బాల్యమంత అనారోగ్యమయంతో గడిపినా..కనీసం శరీరంలో ఏ భాగాలు కదిలించలేకపోయినా..కేవలం వేళ్ల సాయంతో తన జీవితాన్ని అందంగా నిర్మించాలనుకోవడం మాములు టాలెంట్ కాదు కదూ..!. ఎంత కష్టమైనా సరే ఎదిగే చిన్న అవకాశం చాలు..ఉవ్వెత్తున ఎగిసిపడే స్థాయికి..చేరి విజయాన్నిపాదాక్రాంతం చేసుకోవచ్చని ప్రూవ్ చేశాడు..ఎందరికో అతడి కథ స్ఫూర్తిని కలిగించడమే గాక, మనసుని తాకింది కూడా.(చదవండి: 91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..) -
భారీగా పెరిగిన వెండి ధరలపై.. మస్క్ ట్వీట్
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే కేజీ సిల్వర్ రేటు భారతదేశంలో రూ.2.74 లక్షలకు చేరింది. ఈ ధరలు వచ్చే సంక్రాంతి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు.చైనా కొత్త ఎగుమతి నియమాల గడువు దగ్గర పడుతున్న కొద్దీ వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!వెండిని ఆభరణాలుగా కంటే.. అనేక పరిశ్రమలలో (సౌర ఫలకాలు, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, 5జీ మౌలిక సదుపాయాలు) పారిశ్రామిక ప్రక్రియలకు ఉపయోగిస్తారు. వెండి అనేది.. భూమిపై అత్యంత ఉత్తమ విద్యుత్ వాహక లోహం. కాబట్టి దీనిని అనేక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. ఇవన్నీ చూస్తుంటే.. సిల్వర్ ధరలు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. -
పెళ్లి చేసుకోలేదంటే జరిమానా.. గ్రామస్తుల తీర్మానం
బీజింగ్: చైనాలోని ఓ గ్రామం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆ దేశవ్యాప్తంగా, సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. గ్రామ కమిటీ ప్రత్యేకంగా రూపొందించిన నియమావళి ప్రకారం.. ఆ ఊరి గ్రామస్తులు ఆలస్యంగా వివాహం చేసుకోవడం, గర్భధారణకు సంబంధించిన నియమాలు పాటించని వారికి, అలాగే పిల్లల పెంపకం విధానాల్లో మార్పులు చేసిన వారికి జరిమానాలు విధిస్తూ ఆ ఊరి పెద్దలు తీర్మానించారు. జరిమానా వివరాలు• పెళ్లి కాకముందే గర్భం దాల్చితే 3,000 యువాన్ (సుమారు రూ.35,000).• పెళ్లి కాకముందే కలిసి నివసిస్తే సంవత్సరానికి 500 యువాన్ (సుమారు రూ.6,000).• బయటి ప్రావిన్స్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే 1,500 యువాన్ (సుమారు రూ.18,000).• అసత్య వదంతులు వ్యాప్తి చేస్తే 500 నుంచి 1,000 యువాన్ జరిమానా.ఈ వార్త వెలుగులోకి రావడంతో నెటిజన్లు ఊరు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా మంది నెటిజన్లు ఈ నియమాలను వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. వివాహం ఎప్పుడు చేసుకోవాలి? పిల్లల్ని ఎప్పుడు కనాలి? అనేది వ్యక్తిగత నిర్ణయం. దానిపై గ్రామ కమిటీకి హక్కు ఎలా వస్తుంది?’ అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, కొందరు మాత్రం గ్రామంలో జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలుగా సమర్థిస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం, చైనాలో ప్రస్తుతం జనన రేటు తగ్గుదల (Demographic Winter) ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం జనన రేటు పెంచాలని ప్రయత్నిస్తున్న సమయంలో, గ్రామ స్థాయిలో ఇలాంటి జరిమానాలు విధించడం వ్యతిరేక ధోరణిగా కనిపిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విధానాలకు విరుద్ధమని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ సంఘటనతో చైనా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక నియంత్రణ ఎంత కఠినంగా అమలవుతోందో బయటపడింది. ఒకవైపు ఆధునికీకరణ, ఆర్థికాభివృద్ధి దిశగా చైనా దూసుకెళ్తుంటే, మరోవైపు గ్రామాల్లో ఇలాంటి నియమాలు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. మొత్తానికి, ఈ గ్రామం తీసుకున్న నిర్ణయాలు స్థానిక సమస్యగానే కాకుండా, జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. -
అల్లకల్లోల ప్రపంచంలో అద్వితీయ చైనా
సోవియట్ సోషలిస్ట్ నమూనా పతనం తర్వాత, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్య మంలో ఏర్పడిన శూన్యాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ ఒక గొప్ప చర్చకు వేదికగా మార్చు కుంది. సోవియట్ మోడల్ను గుడ్డిగా అనుసరించడం కంటే, మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలను చైనా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవాలని ఆ దేశ నాయకత్వం నిర్ణయించింది. దీని ఫలితంగా పుట్టిందే ‘చైనా లక్షణాలతో కూడిన సోషలిజం’. 1947లో స్వాతంత్య్రం పొందిన భారత దేశం కంటే రెండు ఏళ్ళు ఆలస్యంగా, 1949 అక్టోబర్1న ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ ఏర్పడినప్పటికీ, నేడుఆ దేశం సాధించిన ప్రగతి అసాధారణం. కొనుగోలుశక్తి సామర్థ్యం పరంగా చైనా ఇప్పటికే అమెరికాను అధిగమించి, అనేక రంగాలలో అగ్రగామిగా నిలిచింది.భారతదేశం నేడు దారిద్య్రం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రూపాయి పతనం వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) భారత ఆర్థిక గణాంకాల పారదర్శకతను ప్రశ్నిస్తూ ‘సీ గ్రేడ్’ ఇచ్చింది. ఒకవైపు డాలర్తో రూపాయి విలువ 90 రూపాయలకు పడి పోతుంటే, మరోవైపు ‘మేడ్ ఇన్ చైనా –2025’ ప్రణా ళికతో చైనా పారిశ్రామిక మౌలిక సదుపాయాలనుసంపూర్ణ ఆటోమేషన్ దిశగా మలుస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలు చైనాతో భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాయి. ఇది ఆ దేశ ఉత్పత్తి సామర్థ్యానికి నిదర్శనం.1978లో డెంగ్ జియావో పింగ్ ప్రారంభించిన ‘ఓపెనింగ్ అప్’ సంస్కరణలు చైనా స్వరూపాన్ని మార్చివేశాయి. గత మూడు దశాబ్దాలలో 85 కోట్లమంది ప్రజలను పేదరికం నుండి బయటపడేయడం ప్రపంచ మానవాభివృద్ధి చరిత్రలోనే ఒక అద్భుతం. 30 ఏళ్ళ క్రితం 66%గా ఉన్న పేదరికాన్ని 2020 నాటికిసంపూర్ణంగా నిర్మూలించి, ప్రపంచానికి ఒక పాఠంగా చైనా నిలిచింది.ప్రపంచ ఉత్పత్తిలో చైనా వాటా ఆశ్చర్యకరంగాఉంది. ఉక్కు ఉత్పత్తిలో 53.9%, సిమెంట్ ఉత్పత్తిలో 51.1% వాటాతో చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది. ప్రపంచంలోని మొత్తం హై స్పీడ్ రైల్ లైన్లలో 66% ఒక్క చైనాలోనే ఉన్నాయి. షిప్ బిల్డింగ్ రంగంలో కూడా అమె రికా, ఐరోపాలను తలదన్నేలా 51% భారీ ఓడలను చైనా నిర్మిస్తోంది. ముఖ్యంగా, ‘కొస్కో’ వంటి ప్రభుత్వ సంస్థలు 24,000 కంటైనర్ల సామర్థ్యం గల భారీ ఓడ లను అత్యంత చౌకగా నిర్మిస్తున్నాయి. కేవలం రెండు దశాబ్దాల క్రితం ఈ రంగంలో ఉనికి లేని చైనా, నేడు జపాన్, సౌత్ కొరియాలను కూడా సవాలు చేస్తోంది.చైనా నేడు ఏఐ రేసులో అగ్రస్థానంలో ఉంది. 2024లో పరిశోధనల కోసం ఆ దేశం 570 బిలియన్ డాలర్లను కేటాయించింది. సుమారు 5,000 ఏఐకంపెనీలు, 16,000 ఇంక్యుబేటర్లతో పూర్తి స్థాయి ఆటోమేషన్ దిశగా అడుగులు వేస్తోంది. సామాజిక సామరస్యం కోసం 700 మిలియన్ల ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో ‘సోషల్ క్రెడిట్ సిస్టం’ (ఎస్సీఎస్)ను అమలు చేస్తూ నేరాల రేటును గణనీయంగా తగ్గించింది. విద్యా రంగంలో కూడా ప్రతి ఏటా 5 మిలియన్ల ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విద్యార్థులు పట్టా పొందుతున్నారు. ఇది అమెరికాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ.అభివృద్ధికి వెన్నెముక విద్యుత్తుచైనా విద్యుత్ వినియోగం అమెరికా, యూరో పియన్ యూనియన్, ఇండియా, రష్యాల మొత్తం వినియోగం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. త్రీ గార్జెస్ డ్యామ్ (22,500 మె.వా.) వంటి భారీ ప్రాజెక్టులతో పాటు, దానికంటే రెండింతలు పెద్దదైన మెడోగ్ హైడ్రో పవర్ స్టేషన్ (60 వేల మె.వా.) నిర్మాణాన్ని ప్రారంభించింది. కాలుష్య రహితవిద్యుత్తు కోసం న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియపై పరిశోధనలు చేస్తోంది. 2025 నాటికి ఏఐ డాటాసెంటర్ల కోసం భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తినిలక్ష్యంగా పెట్టుకుంది.వ్యవసాయ ఆధునికీకరణ, పర్యావరణ పరిరక్షణ, ఆహార భద్రత విషయంలో చైనా స్వయం సమృద్ధిని సాధించింది. ‘బేదో’ శాటిలైట్ ద్వారా నడిచే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రైవర్ లేని వరి నాటు యంత్రాలతో వ్యవసాయ రంగంలో 72% ఆధునికీకరణను సాధించింది. కొండ ప్రాంతాలలో నేలకోతను అరికట్టడానికి ‘మూడు పాళ్ళు అడవి, రెండు పాళ్ళు గడ్డిభూమి’ విధానాన్ని అమలు చేస్తూ పర్యావరణాన్ని రక్షిస్తోంది. దీనివల్ల మృత్తిక క్రమక్షయం78% తగ్గింది. 1990లో 170గా ఉన్న పట్టణాల సంఖ్య నేడు 700కు పెరిగింది. ఇందులో 17 మెగా సిటీలుఉన్నాయి. ఒకప్పుడు చిన్న చేపలు పట్టే గ్రామమైన షేన్జెన్, నేడు ప్రపంచానికి ‘సిలికాన్ వ్యాలీ’గా రూపాంతరం చెందింది. ఈ అద్భుతమైన అభివృద్ధి వెనుక క్రమశిక్షణ కలిగిన రాజకీయ సంకల్పం, విప్లవాత్మక నాయకత్వం ఉన్నాయి. చైనా కేవలం ఆర్థిక శక్తిగా మాత్రమే కాక, అగ్రరాజ్యాల ఆధిపత్య వలస వాదానికి వ్యతిరేకంగా, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేస్తోంది. చైనా అభివృద్ధి నమూనా ఇతర దేశాలకు గుడ్డిగా ఎగుమతి చేసేది కాదనీ, ప్రతి దేశం తమ భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందాలనీసీపీసీ భావిస్తోంది. పర్యావరణ హితమైన ‘నూతన ఉత్పత్తి శక్తుల’ ఆవిష్కరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చైనా, పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక వ్యవ స్థాగత సవాలుగా నిలిచింది.చైనా సాధించిన ఈ ప్రగతి కేవలం అంకెల్లో మాత్రమే కాదు, ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులో కనిపిస్తుంది. పర్యా వరణం, సాంకేతికత మానవ వనరుల సమతుల్యతతో కూడిన ఈ నమూనా ప్రపంచ దేశాలకు ఒక సరికొత్త దిశను చూపిస్తోంది. మొత్తంగా చూసినప్పుడు చైనా ప్రస్థానం కేవలం ఒక దేశాభివృద్ధి మాత్రమే కాదు, అది ఒక సిద్ధాంతానికీ, ఆచరణకూ మధ్య జరిగిన విజయ వంతమైన ప్రయోగం.-వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు-నైనాల గోవర్ధన్ -
రాకెట్ లాంటి రైలు.. 2 సెకన్లలోనే 700 KMPH వేగంతో పరుగులు..
బీజింగ్: చైనాలో మాగ్లేవ్ రైలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ రైలు కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని చేరి రికార్డు సృష్టించింది. చాంగ్షాలో నిర్వహించిన ఈ ప్రయోగం చైనాలో సాంకేతిక ఆధిపత్యాన్ని మరోసారి చాటింది.మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతలో రైలు పట్టాలపై నేరుగా నడవదు. బలమైన అయస్కాంత శక్తి సహాయంతో గాల్లో తేలుతూ ముందుకు సాగుతుంది. దీని వల్ల ఘర్షణ తగ్గి అత్యధిక వేగాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఈ రికార్డు స్థాయి వేగం భవిష్యత్తులో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయనుంది.నిపుణుల అంచనా ప్రకారం, బీజింగ్ నుంచి షాంఘై వరకు ప్రయాణం కేవలం రెండు గంటల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. పర్యావరణహితమైన ఈ రైలు ఇంధన వినియోగాన్ని తగ్గించడమే కాకుండా శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. చైనా ప్రభుత్వం దీన్ని జాతీయ గర్వంగా భావిస్తూ, రాబోయే దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా మాగ్లేవ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విజయంతో చైనా ప్రపంచ రవాణా రంగంలో ముందంజలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.అమెరికా, జపాన్, యూరప్ వంటి దేశాలు కూడా మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ, చైనా సాధించిన ఈ వేగం వారిని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా, ఈ ప్రయోగం కేవలం చైనాకే కాకుండా ప్రపంచ సాంకేతికతలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.Reporter left speechless after witnessing Japan's new $70 million Maglev train in action at 310 mphpic.twitter.com/nexIApcmRh— Massimo (@Rainmaker1973) November 25, 2025 -
గాలిలో తేలుతూ.. మెరుపుతీగలా వెళ్లే ట్రైన్!
ఎప్పటికప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్న చైనా.. మరో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కి.మీ వేగవంతమయ్యే మాగ్లెవ్ (Maglev) రైలు ఈ రికార్డ్ సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. చాలామంది ట్రైన్ రాకకోసం వేచి చూస్తున్నారు. అంతేలోనే మెరుపుతీగలా ట్రైన్ వెళ్లిపోయింది. అక్కడున్నవారంతా.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. చూడటానికి ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యంలా కనిపిస్తుంది.అత్యంత వేగవంతమైన సూపర్కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ రైలును విజయవంతంగా టెస్ట్ చేశారు. 700 కిమీ వేగంతో వెళ్లినప్పటికీ.. రైలును సురక్షితంగా స్టాప్ చేశారు. ఈ టెస్ట్ చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించారు.🇨🇳China leads the future!🇨🇳🚄China set a global record by accelerating a ton-scale test maglev to 700 kilometers per hour in just two seconds.Dedicated to maglev research for 10 years, the Chinese technicians have overcome core technical challenges. pic.twitter.com/F1Mv8dUZvc— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) December 25, 2025మాగ్లెవ్ ట్రైన్స్.. సాధారణ పట్టాలపై నడవవు. బదులుగా ఇందులోని సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలు రైలును ఎత్తి, పట్టాలను తాకకుండానే ముందుకు నెట్టివేస్తాయి. దీనివల్ల వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని భవిష్యత్తులో వాక్యూమ్ సీల్డ్ ట్యూబ్ల ద్వారా ప్రయాణించేలా చేయనున్నారు.ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చైనా యూనివర్సిటీ బృదం పదేళ్లుగా కృషి చేస్తున్నారు. 2025 జనవరిలో టెస్ట్ చేసినప్పుడు ఇది గంటకు 648 కి.మీ. గరిష్ట వేగాన్ని చేరుకుంది. ఇప్పుడు తాజాగా జరిపిన టెస్టులో 700 కిమీ వరకు వేగవంతం అయింది. అదే యూనివర్సిటీ.. మూడు దశాబ్దాల క్రితం దేశంలో మొట్టమొదటి మనుషులతో కూడిన సింగిల్-బోగీ మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేసింది.🚄🇯🇵 Le train japonais Maglev L0 ne se contente pas d’être rapide : il redéfinit littéralement la notion de vitesse dans le transport moderne.Grâce à la lévitation magnétique, il flotte au-dessus de son rail, éliminant toute friction et lui permettant d’atteindre plus de 600… pic.twitter.com/hnV4VnZ3Ro— Le Contemplateur (@LeContempIateur) December 4, 2025 -
చైనాలో మరో అద్భుతం..
బీజింగ్: చైనా మరో అడుగు ముందుకేసి అద్భుతం సృష్టించింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగాన్ని ప్రజా రవాణా కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ సొరంగం ద్వారా 7 గంటల ప్రయాణాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.డ్రాగన్ దేశం చైనాలో ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 22.13 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం టియాన్షాన్ షెంగ్లీ టన్నెల్ డిసెంబర్ 26 శుక్రవారం అధికారికంగా ట్రాఫిక్కు ప్రారంభించారు. ఇది వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజియన్లోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాలను దాటి, గతంలో కొన్ని గంటలు పట్టే పర్వత ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుంది.22.13 kilometers! China just opened the world’s longest highway tunnel across a mountain range to traffic in Xinjiang.China named the tunnel Tianshan Victory. Why? Because it cuts through 16 geofracture zones and is without doubt a world marvel of engineering. pic.twitter.com/FGM34fyqia— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 26, 2025 ఇదిలా ఉండగా.. చైనా శుక్రవారమే మరో ఎక్స్ప్రెస్వేను కూడా ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ జిన్జియాంగ్లోని పట్టణ సముదాయాలను కలిపే మరొక ముఖ్యమైన సహాయక సొరంగం G0711 ఉరుంకి-యులి ఎక్స్ప్రెస్వే కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ సొరంగం చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లోని టియాన్షాన్ పర్వత శ్రేణిలో ఉంది. ఇది రెండు సమాంతర గొట్టాలుగా రూపొందించబడింది. ఒక్కొక్కటి రెండు లేన్ల ట్రాఫిక్ను కలిగి ఉంటాయి. ఇది ఉత్తర జిన్జియాంగ్లోని ఉరుంకిని దక్షిణాన యులికి కలిపే ఉరుంకి-యులి ఎక్స్ప్రెస్వేలో భాగం. ఈ సొరంగం 3,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించబడింది. సొరంగం ప్రారంభంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణానికి ఇప్పుడు 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. The Urumqi-Yuli Expressway officially opens to traffic!At its heart lies the world’s longest expressway tunnel. At 22 kilometers, it turns a 3-hour mountain drive into 20 minutes.A major leap in connectivity for Xinjiang.🛣 pic.twitter.com/jNMoRm2qvU— Mao Ning 毛宁 (@SpoxCHN_MaoNing) December 26, 2025The Tianshan Victory Tunnel opened to full traffic today. Spanning 22.13 km, it is the world's longest highway tunnel. The driving time from Ürümqi to Korla has been reduced from seven hours to 3.5 hours. Traveling in #Xinjiang has become significantly more convenient.#China… pic.twitter.com/fUWIHPZNRC— China Bro (@chinalittlebro6) December 26, 2025 -
పర్వత ప్రాంతం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్వే ప్రారంభం
బీజింగ్: చైనా మరోసారి ప్రపంచ ఇంజనీరింగ్ రంగాన్ని ఆశ్చర్యపరిచే ప్రాజెక్టును పూర్తి చేసింది. షింజియాంగ్ ప్రావిన్స్లోని తియాన్షాన్ పర్వతాల ప్రాంతంలో నిర్మించిన 22.13 కిలోమీటర్ల పొడవైన ‘తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్’ను అధికారికంగా ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్వే టన్నెల్గా గుర్తింపు పొందింది.ఈ టన్నెల్ ద్వారా గతంలో పర్వత మార్గం గుండా ప్రయాణించడానికి గంటల తరబడి పట్టిన ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లో పూర్తవుతోంది. షింజియాంగ్ ఉత్తర భాగంలోని ఉరుమ్చీ నగరాన్ని, దక్షిణ భాగంలోని యులీ ప్రాంతాన్ని కలుపుతూ నిర్మించిన G0711 ఉరుమ్చీ–యులీ ఎక్స్ప్రెస్వేలో ఇది కీలక భాగంగా నిలిచింది.తీవ్ర చలిలో, మైనస్ 43 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల్లో, 9,842 అడుగుల ఎత్తులో ఈ టన్నెల్ను నిర్మించడం ఒక ఇంజనీరింగ్ సవాలుగా నిలిచింది. కేవలం ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా చైనా మరోసారి తన నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది.తియాన్షాన్ పర్వతాలు షింజియాంగ్ను ఉత్తర–దక్షిణ భాగాలుగా విభజిస్తాయి. ఈ టన్నెల్ ప్రారంభం వల్ల రెండు ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగవుతుంది. ఇది కేవలం రవాణా మార్గమే కాకుండా, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక పరంగా కొత్త అవకాశాలను ఆహ్వానించినట్లు అవుతుంది. -
ఇది భారత్తో విభేదాలు సృష్టించే ప్రయత్నమే..!
అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ రిలీజ్ చేసిన తాజా నివేదికపై చైనా తీవ్రంగా స్పందించింది. భారత్తో సరిహద్దు ఉద్రిక్తతలు శాంతియుతంగానే ఉన్నాయని.. అయితే పాత పరిస్థితులను ప్రస్తావిస్తూ భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలకు అమెరికా ప్రయత్నిస్తోందని మండిపడింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియన్ మాట్లాడుతూ.. ఈ నివేదిక చైనా రక్షణ విధానాన్ని వక్రీకరిస్తోంది. భారత్ సహా పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. తన సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమే ఇది అని అన్నారు. భారత్ సంబంధాలను చైనా వ్యూహాత్మక స్థాయిలో, దీర్ఘకాల దృష్టితో చూస్తోంది. పరస్పర విశ్వాసం పెంపు, సహకారం, విభేదాల పరిష్కారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను స్థిరంగా ఉంచాలని కోరుకుంటోంది అని అన్నారు. అయితే.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) పై US నివేదికలో చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం సరిహద్దు పరిస్థితి స్థిరంగా ఉందని, కమ్యూనికేషన్ చానెల్స్ సజావుగా పనిచేస్తున్నాయని తెలిపారు. మరోవైపు.. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ నివేదికను ఖండిస్తూ.. ఇది తప్పుడు కథనాలు, పక్షపాతాలతో కూడిందని, చైనా మిలిటరీ ముప్పు అనే అతిశయోక్తితో నిండిపోయి ఉందని విమర్శించింది. మొత్తంగా చైనా అగ్రరాజ్య నివేదికను అసంబద్ధమైనదని.. బాధ్యతారహితమైనదని పేర్కొంది.భారత అమెరికా సంబంధాలను నీరుగార్చేందుకు చైనా కృషి చేస్తోందని.. సరిహద్దు ఉద్రిక్తతలు సడలింపును ఎరగా వేసి భారత్తో సత్సంబంధాలను పునరుద్ధరించకోజూస్తున్న డ్రాగన్ కంట్రీ అదే సమయంలో పాకిస్థాన్తోనూ మైత్రిని నెరపుతోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ నివేదిక వెలువరించింది. దీంతో చైనా పైవిధంగా స్పందించింది. -
‘భారత్, అమెరికా ఒక్కటి కావడం చైనాకు ఇష్టం లేదు’
న్యూయార్క్: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడాన్ని అనుకూలంగా మార్చుకోవాలని, ఈ పరిణామాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని చైనా భావిస్తున్నట్లు అమెరికాకు చెందిన ‘డిపార్టుమెంట్ ఆఫ్ వార్’ వెల్లడించింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్కు వార్షిక నివేదిక సమర్పించింది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించుకోవాలన్నదే చైనా ప్రయత్నమని నివేదికలో ఉద్ఘాటించింది. భారత్–అమెరికా మధ్య సంబంధాలు బలపడడం, రెండు సన్నిహితంగా కలిసి పనిచేయడం చైనాకు ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఎల్ఏసీ వద్ద సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, స్నేహపూర్వక సంబంధాలు పునరుద్ధరించుకోవాలని భారత్, చైనాలు ఒప్పందానికి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నేరుగా విమానాలు నడపడం, వీసాలు జారీ చేయడం వంటి అంశాలపై నిర్ణయానికి వచ్చాయి. మొత్తానికి భారత్, చైనా సంబంధాలు పూర్వస్థితికి రావడానికి పరిస్థితులు చాలావరకు మెరుగయ్యాయి. భారత్తో వాణిజ్యానికి చైనా ప్రాధాన్యం ఇస్తోంది. భారత ప్రధాని మోదీ, చైనా అధినేత జిన్పింగ్ పలుమార్లు భేటీ అయ్యారు. 2020 జూన్లో గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత్, చైనా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల సైన్యం మోహరించింది. ఇరుపక్షాల మధ్య చర్చల అనంతరం ఉద్రిక్తతలు తగ్గిపోవడం మొదలైంది. ఈ పరిణామాలను యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ వార్ తన నివేదికలో విశ్లేషించింది. భారత్తో సంబంధాలకు చైనా అమితమైన ఉత్సాహం చూపిస్తోందని.. అదే సమయంలో చైనా చర్యలు, ఉద్దేశాలను భారత్ పూర్తిగా విశ్వసించడం లేదని స్పష్టంచేసింది. 2049 నాటికి ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాలన్నదే చైనా జాతీయ వ్యూహమని వివరించింది. చైనా వ్యూహంలో తైవాన్తోపాటు భారత్లోని అరుణాచల్ప్రదేశ్ కూడా ఉన్నాయని తెలియజేసింది. -
చైనా మరో దుశ్చర్య: ట్రావెల్ వ్లాగర్కి 15 గంటల నరకం, ఎందుకంటే
అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అన్నందుకు ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్-కమ్-యూట్యూబర్ను చైనాలో 15 గంటల పాటు నిర్బంధించిన వైనం మరోసారి ఆందోళన రేపింది. నవంబర్ 16న జరిగిన సంఘటనను వివరిస్తూ డిసెంబర్ 23న ఇన్స్టాగ్రామ్లో రీల్ యూట్యూబ్లో బాధితుడు ఒక సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేశాడు. కేవలం తన బాధను పంచుకోవాలనే ఉద్దేశమే తప్ప ఇది ఎవరి ఒత్తిడిమీద పోస్ట్ చేసినవీడియో కాదనీ స్పష్టం చేశాడు. దీంతో ఇది వైరల్గామారింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక మహిళను షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో దాదాపు 18 గంటలు నిర్బంధించిన ఘటన, తీవ్ర నిరసనలువ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే.ఆన్లైన్లో ఆన్ రోడ్ ఇండియన్గా ప్రసిద్ధి చెందిన భారతీయ ట్రావెల్ వ్లాగర్ అనంత్ మిట్టల్ చైనాలో తనకెదురైన భయానక అనుభవాన్ని సోషల్మీడియాలో షేర్ చేశాడు. చైనాలో గతంలో నిర్బంధించబడిన అరుణాచల్ ప్రదేశ్ పౌరుడికి సంఘీభావం తెలిపే వీడియోను పోస్ట్ చేయడంతోనే తనను చైనా అధికారులు దాదాపు 15 గంటల పాటు నిర్బంధించారని ఆరోపించాడు. ఈ వీడియోపై యూట్యూబర్ క్షమాపణలు కూడా చెప్పాడు.నవంబర్ 16న మిట్టల్ చైనాలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. ఎపుడు మామూలుగా ప్రశ్నలిడిగి, క్లియర్ చేసే అధికారులు ఈ సారి ఇమ్మిగ్రేషన్ వద్ద తనను ఆపివేసినట్లు మిట్టల్ చెప్పారు. పాస్పోర్ట్పై వార్నింగ్ స్టిక్కర్ అంటించి, ఆ తరువాత పలువురు విదేశీ పౌరులను ఉంచిన నిర్బంధ ప్రాంతానికి తీసుకెళ్లారని తన సుదీర్ఘ వీడియోలో ఆరోపించాడు. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్తో తనకున్న భావోద్వేగ సంబంధం మూడేళ్లు అక్కడ చదువుకోవడంతో ఏర్పడిందనీ , చైనాలో ఒక అరుణాచల్ పౌరుడిని నిర్బంధించారని విన్న తర్వాత తాను తీవ్రంగా ప్రభావితమై దాని గురించి మాట్లాడిన వీడియో తన నిర్బంధానికి కారణమైందన్నాడు.దాదాపు రెండు గంటల పాటు ఏ అధికారి కూడా అతనితో మాట్లాడలేదు. తరువాత, అతన్ని మరొక గదిలోకి తీసుకెళ్లారు, అక్కడ ఏవీ రికార్డ్ చేయకుండా ఉండటానికి ఫోన్, కెమెరాను స్వాధీనం చేసుకున్న అధికారులు తన ఐప్యాడ్ను పట్టించుకోలేదని తెలిపాడు. తన నిర్బంధంపై పదే పదే అడిగినా సమాచారం ఇవ్వడానికి నిరాకరించమే కాదు నీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదు. ఒక్కసారి మాత్రమే కొద్దిగా నీళ్లిచ్చారు. అలా 12-13 గంటలయ్యేసరికి తనలో భయం మొదలైంది. దాదాపు 15 గంటల తర్వాత, ఒక చైనా అధికారి తిరిగి వచ్చి ప్రక్రియ పూర్తయిందని ,వెంటనే దేశం విడిచి వెళ్ళవలసి వచ్చిందని హెచ్చరించారు. ఇక దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదని అతను చెప్పాడు. ఎట్టకేలకు తాను సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చానని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by On Road Indian (@onroadindian) తానొక సాధారణ ట్రావెల్ వ్లాగర్ అని, తనకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని, చైనాలో తన స్టార్టప్ రోజుల నుండి స్నేహితులు ఉన్నారని కూడా అన్నారు. "నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. నేను అందర్నీ ప్రేమిస్తున్నాను, నా కళ్ళ ద్వారా ఈ ప్రపంచాన్ని మీతో పంచుకుంటాను. నాకు ఏ రాజకీయ ఎజెండాతో సంబంధం లేదు" అని ఇన్స్టాగ్రామ్లో రాశాడు. తనకు ఎటువంటి రాజకీయ అనుబంధాలు లేవని, అధికారులను రెచ్చగొట్టాలని ఎప్పుడూ ఉద్దేశించలేదని మిట్టల్ వాపోయాడు. ఇది రాస్తున్నంతసేపు కూడా తాను ఏడుస్తూనే ఉన్నాని కూడా రాసుకొచ్చాడు.భారత - చైనా రాయబార కార్యాలయాలు తాను అనుభవించిన భయాన్ని అర్థం చేసుకుంటాయని తాను ఆశిస్తున్నానని మిట్టల్ అన్నారు. ఇదీ చదవండి: చిన్నారిపై పిట్బుల్ దాడి, ఎలా విడిపించాడో చూడండి వైరల్ వీడియోకాగా గతంలో చైనాలో మహిళను నిర్బంధించిన ఘటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. భారతీయ వ్యక్తిని ఏకపక్షంగా నిర్బంధించడం తగదని హితవు చెప్పింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ "భారతదేశంలో అంతర్భాగం" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. చైనా ఎంత తిరస్కరించినా ఈ సత్యాన్ని మార్చలేమని కూడా స్పష్టం చేసింది. తాజా సంఘటనపై భారత అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
ఇటీవల కాలంలో బంగారం అంటేనే కొండెక్కి కూర్చునే ధర అనుకున్న వారికి, ఇప్పుడు వెండి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కేవలం ఏడాది కాలంలోనే సుమారు 120 శాతం పైగా రాబడి అందించి, కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2 లక్షలను దాటింది. అయితే, ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదు. 2026 జనవరి 1 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు అయిన చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించనుందనే వార్తలు గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి.సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోసం మైక్రోచిప్ల తయారీలో వెండి వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు కేవలం ఆభరణాలకే పరిమితమైన వెండి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారింది. సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 2026 ప్రారంభానికి ముందే కిలో వెండి ధర రూ.2.5 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు చైనా ఎగుమతుల కోత, ఇటు పెరుగుతున్న టెక్నాలజీ అవసరాల మధ్య వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లనున్నాయి.వెండి ఎగుమతులపై చైనా ఆంక్షలుప్రపంచంలో వెండి ఉత్పత్తిలోనూ, ఎగుమతిలోనూ చైనాది కీలక పాత్ర. అయితే జనవరి 1, 2026 నుంచి చైనా ప్రభుత్వం వెండి ఎగుమతులపై కొత్త నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. అయితే వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రతిపాదిత అంశాల ప్రకారం.. ఇకపై వెండిని ఎగుమతి చేయాలంటే కంపెనీలు ప్రత్యేక ప్రభుత్వ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇది 2027 వరకు అమలులో ఉండే అవకాశం ఉంది. ఏడాదికి 80 టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే చిన్న సంస్థలకు ఎగుమతి అనుమతులు నిరాకరించే అవకాశం ఉంది. కేవలం పెద్ద, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలకే ఈ అవకాశం దక్కుతుంది. చైనా తన దేశీయ అవసరాల కోసం (ముఖ్యంగా సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాలు) వెండి నిల్వలను కాపాడుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలను ప్రభావితం చేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.డిమాండ్ పెరగడానికి కారణాలుగ్రీన్ ఎనర్జీ విప్లవం.. వెండికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ. సౌర ఫలకాల తయారీలో వెండిని కీలకమైన సిల్వర్ పేస్ట్ రూపంలో వాడతారు. ప్రపంచం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతుండటంతో సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి డిమాండ్ 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు 150% పెరిగింది.ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ.. సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం చాలా ఎక్కువ. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సెన్సార్లు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ల విస్తరణ వల్ల అత్యాధునిక చిప్లు, సెమీకండక్టర్ల తయారీలోనూ వెండి వాటా పెరుగుతోంది.సరఫరాలో లోటు.. గడిచిన ఐదేళ్లుగా వెండి ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ద్వారా వచ్చే వెండి పరిమితంగా ఉంది. వెండి అనేది ఎక్కువగా రాగి, బంగారం, సీసం వంటి లోహాల వెలికితీతలో ఉప-ఉత్పత్తిగా ఉంది. కాబట్టి, డిమాండ్ పెరిగిన వెంటనే వెండి ఉత్పత్తిని పెంచడం మైనింగ్ సంస్థలకు సాధ్యం కావడం లేదు.సురక్షిత పెట్టుబడిగా వెండి.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల వల్ల పెట్టుబడిదారులు వెండిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది వెండి దాదాపు 120% పైగా రాబడిని ఇచ్చింది.2026 నాటి చైనా ఎగుమతి ఆంక్షలు అమలులోకి వస్తే గ్లోబల్ మార్కెట్లో వెండి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఆభరణాల రంగాన్నే కాకుండా ఆధునిక సాంకేతిక, ఇంధన రంగాలను కూడా ప్రభావితం చేస్తుంది. భారతీయ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, 2026 నాటికి వెండి ధరలు కిలోకు రూ.2.4 లక్షల నుంచి 2.5 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వెండి కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక వనరుగా మారబోతోంది.ఇదీ చదవండి: రూపాయి విలువ తగ్గినా మంచికే! -
చైనా కంపెనీ సరికొత్త రికార్డ్: 1.5 కోట్ల కారు విడుదల
భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో బీవైడీ కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ వాహన తయారీ సంస్థ చైనాలోని జినాన్ ఫ్యాక్టరీలో 15 మిలియన్ల (1.5 కోట్లు) కారును విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉత్పత్తి మాత్రమే కాకుండా.. బీవైడీ అమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు కంపెనీ 4.182 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది కంటే 11.3 శాతం ఎక్కువ. చైనాలో మాత్రమే కాకుండా.. సంస్థ ఇతర దేశాల్లో కూడా లక్షల కార్లను విక్రయించినట్లు వెల్లడించింది. మొత్తం మీద బీవైడీ ఆరు ఖండాల్లో.. 119 దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.BYD అభివృద్ధికి టెక్నాలజీ ఆవిష్కరణలు ప్రధాన కారణం. 2025 మొదటి మూడు త్రైమాసికాలలో.. కంపెనీ పరిశోధన, అభివృద్ధి వ్యయం 43.75 బిలియన్ యువాన్లకు చేరుకుంది, ఇది అంతకు ముందు ఏడాది కంటే 31% ఎక్కువ. "ఎలిగాన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీ" వంటి వాటితో.. డెంజా మోడల్ ద్వారా సింగపూర్, థాయిలాండ్, మలేషియాతో సహా బహుళ ఆసియా మార్కెట్లలో కంపెనీ విజయవంతంగా ప్రవేశించింది.భారతదేశంలో బీవైడీ కార్లుఆట్టో 3 ఎలక్ట్రిక్ కారుతో.. భారతదేశంలో అడుగు పెట్టిన బీవైడీ కంపెనీ.. ఆ తరువాత సీల్, ఈమ్యాక్స్ 7, సీలియన్ 7 వంటి కార్లను లాంచ్ చేసింది. ఈ కార్లు దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నాయి. ప్రత్యర్ధ కంపెనీలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. -
క్రీస్తుపూర్వం బడి... నేటికీ ఉంది తెలుసా?
పిల్లలూ! మీ స్కూల్ కట్టి ఎన్నేళ్లయ్యింది? పదేళ్లు, ఇరవై ఏళ్లు..మహా అయితే యాభై ఏళ్లు. అయితే వేల సంవత్సరాల క్రితమే ఉన్న బడి గురించి తెలుసా? మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నేటికీ అది నడుస్తోంది. అందులో విద్యార్థులు చదువుకుంటున్నారు. అదే చైనా దేశంలోని చాంటూ షూషే ఉన్నత పాఠశాల.ఈ పాఠశాలను క్రీ.పూ.143–141 సంవత్సరాల మధ్య హాన్ రాజవంశపు గవర్నర్ వెన్ వెంగ్ నిర్మించారు. చైనాలో స్థానిక ప్రభుత్వం నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వ పాఠశాల ఇదే. దీన్ని మొదట రాళ్లతో నిర్మించారు. అందుకే దీనికి ‘షూషే’ అంటారు. అంటే ’రాతి గది’ అని అర్థం. ఈ పాఠశాలను వెన్వెంగ్ షూషే అని కూడా పిలుస్తారు. చరిత్రలో నిలిచిన హాన్ రాజవంశ పండితుడు సిమా జియాంగ్రు ఈ పాఠశాలలోనే చదువుకున్నారు. అనంతరం ఈ పాఠశాల అగ్నిప్రమాదంలో ధ్వంసమైంది. ఆపై క్రీ.శ.199లో పునర్నిర్మించారు. 17వ శతాబ్దంలో మింగ్ రాజవంశం పతనమైనప్పుడు జాంగ్ జియాన్ జాంగ్ యొక్క తిరుగుబాటు దళం ఈ బడిని నాశనం చేసింది.1661లో క్వింగ్ రాజవంశం అదే ప్రదేశంలో బడిని తిరిగి స్థాపించింది. తరువాత కాలంలో సిచువాన్ విశ్వవిద్యాలయంగా మారిన జిన్జియాంగ్ అకాడమీ 1740లో ఈ పాఠశాలలోనే స్థాపించారు.1902లో ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానంలో ఇది ‘చెంగ్డు ఫుక్సు చెంగ్డు నార్మల్ స్కూల్’గా మారింది. ఆ తర్వాత 1904లో ఇది చెంగ్డు మిడిల్ స్కూల్గా మారింది. 1940లో దీన్ని చెంగ్డు షూషే మిడిల్ స్కూల్గా మార్చారు. 1948 మధ్యలో దేశవ్యాప్తంగా ఉన్న మాధ్యమిక పాఠశాలలకు ఒక నమూనాగా గుర్తించారు. 1952లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించిన తర్వాత ఈ పాఠశాల పేరును చెంగ్డు నంబర్ 4 మిడిల్ స్కూల్గా మార్చారు. చైనాలోని టాప్ 100 హైస్కూల్స్లో ఇదీ ఒకటిగా నేటికీ నిలబడింది. ఎంతోమంది చైనా ప్రముఖులు ఈ బడిలో చదువుకున్నారు. -
డబ్ల్యూటీఓలో భారత్పై చైనా ఫిర్యాదు
అంతర్జాతీయ వాణిజ్య వేదికపై భారత్, చైనాల మధ్య విభేదాలు మరోసారి ముదిరాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఉత్పత్తులు, సోలార్ రంగంలో భారత్ అందిస్తున్న సబ్సిడీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది భారత్కు వ్యతిరేకంగా చైనా డబ్ల్యూటీఓను ఆశ్రయించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.చైనా ప్రధాన ఆరోపణలుబీజింగ్లోని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారత్ అనుసరిస్తున్న విధానాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని చైనా ఆరోపించింది. భారత ప్రభుత్వ చర్యలు నేషనల్ ట్రీట్మెంట్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఇది డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం నిషేధించిన దిగుమతి ప్రత్యామ్నాయ రాయితీలను అనుసరిస్తుందని పేర్కొంది. భారత్ తన దేశీయ పరిశ్రమలకు నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు ఇస్తూ చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని తెలిపింది. తద్వారా భారతీయ కంపెనీలకు అన్యాయమైన పోటీ ప్రయోజనం కలుగుతోందని వాదించింది. డబ్ల్యూటీఓ కట్టుబాట్లను గౌరవించి ఈ రాయితీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదా సర్దుబాటు చేయాలని చైనా భారత్ను కోరింది.భారత్ వాదనచైనా ఫిర్యాదుపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ పరిణామాలపై అవగాహన ఉన్న ఉన్నతాధికార వర్గాల సమాచారం ప్రకారం.. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశాలు పరస్పరం సబ్సిడీలు, సుంకాలను ప్రశ్నించుకోవడం సాధారణమేనని అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి కొన్ని రంగాలు, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం (సోలార్), ఐటీ హార్డ్వేర్ రంగాలకు ప్రోత్సాహకాలు అవసరమని భారత్ చెబుతోంది. భారత్ ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్-పీఎల్ఐ) తయారీ రంగాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అవి నిబంధనలకు లోబడే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.వరుస ఫిర్యాదులతో పెరుగుతున్న ఉత్కంఠగత అక్టోబర్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), బ్యాటరీ రంగాల్లో భారత్ ఇస్తున్న సబ్సిడీలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసింది. గ్రీన్ ఎనర్జీ, హైటెక్ తయారీ రంగాల్లో ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగానే చైనా ఈ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం, రెండు దేశాలు సంప్రదింపుల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ చర్చలు విఫలమైతే డబ్ల్యూటీఓ వివాద పరిష్కార కమిటీ ఈ అంశంపై విచారణ జరుపుతుంది.ఇదీ చదవండి: ‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్తో యూపీఐ చెల్లింపులు.. ప్రత్యేకతలివే.. -
బరిలోకి అమెరికా.. చైనా వ్యూహం ఏంటి?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగియక ముందే.. చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం కలవరపెడుతోంది. ఇది చివరికి చైనా–అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ ద్వీపం పూర్తిగా తనదేనని ముందు నుంచీ చెబుతూ వస్తున్న చైనా ఈ మధ్య దూకుడు పెంచింది. దాన్ని తనలో కలిపేసుకునేందుకు అవసరమైతే బలప్రయోగానికీ వెనకాడేది లేదని హెచ్చరికలు చేస్తోంది.మరోవైపు.. తైవాన్కు రక్షణగా అగ్రరాజ్యం అమెరికా నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా తైవాన్కు 1,110 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించింది. ఈ భారీ ఆయుధ విక్రయ ప్యాకేజీలో భాగంగా ఆ దేశానికి మధ్య శ్రేణి క్షిపణులు, శతఘ్నులు, డ్రోన్లను అందించనుంది. ఒకవైపు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగిస్తుండగా మరోవైపు అమెరికా ప్రభుత్వం ఆయుధ విక్రయంపై ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ విక్రయానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ట్రంప్ ప్రభుత్వ ఈ ప్రకటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామం తమకు, అమెరికాకు మధ్య కుదిరిన దౌత్య ఒప్పందాలకు విఘాతం కలిగిస్తుందని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఇది చైనా సార్వభౌమాధికారానికి, భద్రతకు, ప్రాంతీయ సమగ్రతకు భంగం కలిగించి ప్రాంతీయ సుస్థిరతను భగ్నం చేస్తుందని పేర్కొంది.ఏమిటీ వివాదం?చైనా, తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దాంతో నాటి దేశ పాలకుడు, మావో ప్రత్యర్థి చియాంగ్కై షేక్ దేశం విడిచి తైవాన్లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచీ తైవాన్ దాదాపుగా స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 2.3 కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తూ వస్తోంది. దాన్ని చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా నిత్యం ఒత్తిడి తెస్తుంటుంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతిచ్చినందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుంది! కేవలం 16 దేశాలు మాత్రమే తైవాన్తో అధికారికంగా దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టతంటూ లేదనే చెప్పాలి.BREAKING; CHINA warns the United States to "immediately stop" arming TAIWAN.China strongly condemned the United States for approving a massive $11.1 billion arms sale package to Taiwan, with officials urging the US to "immediately stop" arming the island.Chinese Foreign… pic.twitter.com/bDstNkNDJk— Global Surveillance (@Globalsurv) December 19, 2025అమెరికాకు సంబంధమేంటి?చైనాలో విప్లవం నేపథ్యంలో 1970ల దాకా 30 ఏళ్ల పాటు తైవాన్ ప్రభుత్వాన్నే చైనా మొత్తానికీ ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. కానీ 1979లో చైనాతో అమెరికాకు దౌత్య తదితర సంబంధాలు ఏర్పాటయ్యాయి. దాంతో తైవాన్తో దౌత్య తదితర బంధాలకు, రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది. కానీ అనధికారంగా మాత్రం తైవాన్తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూనే వస్తోంది. చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్కు ఆయుధ విక్రయాలను కూడా కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది. అందుకోసం చైనా, తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన.చైనా దాడికి దిగేనా?తైవాన్ను విలీనం చేసుకునేందుకు బలప్రయోగానికి వెనకాడేది లేదని చైనా పదేపదే చెబుతూనే ఉంది. 2049కల్లా ‘అత్యంత శక్తిమంతమైన చైనా’ కలను నిజం చేసేందుకు తైవాన్ విలీనం తప్పనిసరని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రకటించారు కూడా. చైనా ఫైటర్ జెట్లు, బాంబర్లు, నిఘా విమానాలు నిత్యం తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇవన్నీ త్వరలోనే సైనిక ఘర్షణకు దారి తీసే అవకాశం లేకపోదని విశ్లేషకులు చెబుతున్నారు.యుద్ధ సవాళ్లు.. ఒకవేళ చైనా, తైవాన్, అమెరికా మధ్య యుద్ధం జరిగితే.. దీని ప్రభావం ఆసియాపై మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. తైవాన్ ప్రపంచంలోనే అత్యధికంగా సెమీకండక్టర్ ఉత్పత్తి చేసే దేశం. Taiwan Semiconductor Manufacturing Company (TSMC) ప్రపంచంలో అత్యంత ఆధునిక చిప్ తయారీదారుగా ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం జరిగితే టెక్నాలజీ రంగం దెబ్బతింటుంది. ఏఐ, స్మార్ట్ఫోన్ల తయారీ, రక్షణ రంగంపై ముఖ్యంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే, తైవాన్ సమస్యపై యుద్ధం జరిగితే అది కేవలం ద్వైపాక్షికంగా కాకుండా జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలను కూడా ప్రభావితం చేస్తుంది. తైవాన్ ఆర్థిక వ్యవస్థలో 60% కంటే ఎక్కువ భాగం ఎగుమతులపై ఆధారపడి ఉంది. తైవాన్కు అమెరికా, చైనా ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. మొత్తం మీద.. తైవాన్ భవిష్యత్తు కేవలం ఆసియా భద్రతకే కాదు, ప్రపంచ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకంగా ఉంది. -
తైవాన్కు రూ.లక్ష కోట్ల ఆయుధాలు
వాషింగ్టన్/బీజింగ్: చైనాతో టారిఫ్ల యుద్ధం ఓ వైపు కొనసాగిస్తూనే, మరో వైపు తైవాన్కు భారీగా అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్దమైంది. ఏకంగా రూ.1 లక్షా 188 కోట్లు(11.1 బిలియన్ డాలర్లు) విలువైన క్షిపణులు, హోవిట్జర్లు, డ్రోన్లు తదితర అత్యాధునిక ఆయుధాలను విక్రయించనున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్..విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలను గానీ, చైనా, తైవాన్ల గురించి గానీ ప్రస్తావించలేదు. ట్రంప్ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం తెలిపిన పక్షంలో.. తైవాన్కు అమెరికా అందించే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీగా నిలవనుంది. తైవాన్ రక్షణ శాఖతో కుదిరిన 8 ఒప్పందాల్లో 82 హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ వ్యవస్థలు(హైమార్స్), 420 ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్(అట్కామ్స్), 60 సెల్ఫ్ ప్రొపెల్డ్ హొవిట్జర్ వ్యవస్థలు, డ్రోన్లు, మిస్సైళ్లు ఉన్నాయి. ఎప్పటికైనా తైవాన్ తమ దేశంలో కలిసిపోవాల్సిందేనంటున్న చైనా.. ఇటీవల ఆ దిశగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, అమెరికా–చైనాల మధ్య సంబంధాలు ఇప్పటికే ఉప్పూనిప్పుగా సంబంధాలు కొనసాగుతున్న వేళ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై డ్రాగన్ దేశం తీవ్రంగా స్పందించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒకే చైనా విధానానికి అమెరికా తూట్లు పొడిచిందని, తమ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడింది. -
రూ. 2400 కోట్ల వివాదం, 87 ఏళ్ల వయసులో నాలుగో భార్యతో బిడ్డ
చైనాలో అత్యంత గౌరవనీయమైన , ప్రసిద్ధ కళాకారుడు ఫ్యాన్ జెంగ్. 87 ఏళ్ల వయసులో తాను ఒక బిడ్డకు తండ్రి అయినట్లు ప్రకటించాడు. తన భార్య 37 ఏళ్ల జు మెంగ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడించారు. అంతేకాదు ఏకైక జీవసంబంధమైన కొడుకు ఇతడే అంటూ తన ఇతర పిల్లలతో సంబంధాలను తెంచుకుని, మరోసారి కుటుంబ వివాదాలను సోషల్ మీడియాలో తెరపైకి తీసుకురావడం విశేషంగా నిలిచింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తనకు కొడుకు పుట్టినట్లు ప్రకటించడం మాత్రమే కాదు ఇతర పిల్లలతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు వెల్లడించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తన బిడ్డను "ఏకైక సంతానం"గా అభివర్ణించాడు. కొత్త ఇంట్లోకి మారాం, భార్య, కొడుకుతో చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. అలాగే వయసు పెరిగిన నేపథ్యంలో తన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తిగా జుకు అప్పగిస్తున్నట్లు చెప్పాడు. రూ 2400 కోట్ల వివాదం, లేటు వయసులోఫ్యాన్ బిడ్డను కనడం, ఇంటితో సంబంధాలను తెంచుకోవడం, సుదీర్ఘ కళా జీవితాన్ని మసకబారుస్తుందంటున్నారు నిపుణులు.ఫ్యాన్ కుటుంబంలో వివాదాలుగత కొన్నేళ్లుగా కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఫ్యాన్ కూతురు జియావోహుయ్, సవతితల్లి జుపై సంచలన ఆరోపణలు చేసింది. తమను, తండ్రిని కలవనివ్వడం లేదని, తన తండ్రి 2 బిలియన్ యువాన్లు (రూ. 2,400 కోట్ల) విలువైన కళాఖండాలను జు రహస్యంగా అమ్ముకుందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఫ్యాన్ జెంగ్ సంస్థ ఖండించింది.ఎవరీ ఫ్యాన్ జెంగ్ ఫ్యాన్ సాంప్రదాయ చైనీస్ పెయింటింగ్లు, కాలిగ్రఫీ నైపుణ్యంతో చైనాలో బాగా పాపులర్. జియాంగ్సు ప్రావిన్స్లో ఫ్యాన్ జెంగ్ జన్మించాడు. బీజింగ్ సెంట్రల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ప్రఖ్యాత కళాకారులు లి కెరాన్, లి కుచన్ వద్ద శిక్షణ పొందాడు.అద్భుతమైన కళాకృతులతో గొప్పకళాకారుడిగా, చైనాలోని ప్రముఖ కళాకారుడిగా తెచ్చుకున్నాడు. అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయంగా ప్రదర్శించబడుతున్నాయి. అయితే గత ఏడాది ఏప్రిల్లో, తన కంటే 50 ఏళ్ల చిన్నదైన జు మెంగ్ను వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఆయన నాలుగో భార్య జుతో కలిసి జీవిస్తున్నాడు. చైనీస్ మీడియా నివేదికల ప్రకారం, అతని రచనలు 2008 - 2024 మధ్య వేలంలో 4 బిలియన్ యువాన్లకు పైగా ఆర్జించాయి. పలు చిత్రాలు 10 మిలియన్ యువాన్లకు పైగా అమ్ముడయ్యాయి. వీటిలో 1991లో 2011లో బీజింగ్ వేలంలో 18.4 మిలియన్ యువాన్లకు అమ్ముడుపోవడం విశేషం. అతను సృష్టించే కాలిగ్రఫీ విలువ 0.11 చదరపు మీటరుకు 200,000 యువాన్ల ధర ఉంటుందట. -
‘బీజింగ్కు సాధ్యం.. ఢిల్లీకి అసాధ్యమా?’.. చైనా ‘మాస్టర్ క్లాస్’
న్యూఢిల్లీ: ఢిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు, వాయు కాలుష్యంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, చైనా తన విజయగాథను భారత్తో పంచుకుంది. ఒకప్పుడు ‘ప్రపంచ స్మోగ్ రాజధాని’గా పేరుగాంచిన బీజింగ్, కేవలం దశాబ్ద కాలంలోనే వాయు కాలుష్యాన్ని ఎలా తరిమికొట్టిదో వివరిస్తూ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వరుస పోస్ట్లు చేశారు. 2013లో 101.7 ug/m3గా ఉన్న బీజింగ్ వార్షిక PM 2.5 సగటు, 2024 నాటికి ఏకంగా 30.9 ug/m3కు పడిపోవడం గమనార్హం.బీజింగ్ అనుసరించిన వ్యూహాలివే!వాయు కాలుష్య నివారణకు వాహన ఉద్గారాల నియంత్రణే మొదటి మెట్టు అని జింగ్ పేర్కొన్నారు. యూరో 6 ప్రమాణాలకు సమానమైన 'చైనా 6NI' నిబంధనలను కఠినంగా అమలు చేయడం, పాత వాహనాలను దశలవారీగా తొలగించడం ద్వారా బీజింగ్ గణనీయమైన మార్పు సాధించింది. కేవలం నిబంధనలే కాకుండా, లైసెన్స్ ప్లేట్ లాటరీలు, బేసి-సరి వంటి కఠినమైన ట్రాఫిక్ నియమాలను అమలు చేస్తూనే.. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో, బస్సు నెట్వర్క్లను నిర్మించింది. విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని వేగవంతం చేయడం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.మరోవైపు పారిశ్రామిక పునర్నిర్మాణం ద్వారా బీజింగ్ విప్లవాత్మక మార్పులు చేపట్టింది. సుమారు 3000కు పైగా భారీ పరిశ్రమలను నగరం నుండి తొలగించడం లేదా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా చైనాలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ‘షోగాంగ్’ను వేరే ప్రాంతానికి తరలించడం ద్వారా గాలిలోని హానికారక కణాలు ఒక్కసారిగా 20 శాతం తగ్గాయి. ఖాళీ అయిన కర్మాగారాల స్థలాలను పార్కులుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చగా, మాజీ షోగాంగ్ సైట్ 2022 వింటర్ ఒలింపిక్స్కు వేదిక కావడం విశేషం.అయితే భారత్లో కూడా ఇటువంటి ప్రణాళికలు చర్చల్లో ఉన్నప్పటికీ, వాటి అమలు తీరులోనే ప్రధాన తేడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘మన వద్ద BS6 ప్రమాణాలు ఉన్నా, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు’ అని పర్యావరణ విశ్లేషకులు సునీల్ దహియా పేర్కొన్నారు. కేవలం కాలుష్యం పెరిగినప్పుడు మాత్రమే అత్యవసర చర్యలు తీసుకోవడం కాకుండా, బీజింగ్ మాదిరిగా ఏడాది పొడవునా కఠినమైన పారిశ్రామిక మార్పులు అమలు చేయాలి. ఇంధన పరివర్తన చేపట్టినప్పుడే ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: శిల్పకళా భీష్మాచార్యుడు రామ్ సుతార్ కన్నుమూత -
చైనా-పాక్ కటిఫ్..! కారణాలు తెలిస్తే షాకవుతారు..!!
-
చైనా డ్యామ్ కుట్ర.. భారత్కు పెను ముప్పు తప్పదా?
హిమాలయాల నుంచి భారత్, బంగ్లాదేశ్లలోకి ప్రవహిస్తూ, కోట్లాది మందికి జీవనాధారమైన బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. టిబెట్లోని యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై సుమారు $168 బిలియన్ల(సుమారు రూ. 1,51,860 కోట్లు) వ్యయంతో బీజింగ్ ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును చేపట్టింది. ఇది పర్యావరణానికే కాకుండా, భారత్ వంటి దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలను కూడా దెబ్బతీయనుంది.పర్యావరణ సమతుల్యతకు విఘాతంఈ ప్రాజెక్టులో భాగంగా నది సహజ ప్రవాహాన్ని మళ్లించేలా డ్యామ్లు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నది ఎత్తులో ఉండే 2,000 మీటర్ల మార్పును చైనా వాడుకోనుంది. అయితే ఈ జోక్యం వల్ల నది సహజ ప్రవాహం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చేపల వలసలు, అవక్షేపాల కదలికలు మారిపోయి, దిగువ ప్రాంతాల్లో వ్యవసాయం , జీవవైవిధ్యంపై కోలుకోలేని దెబ్బ పడే ప్రమాదం ఉంది.‘వాటర్ బాంబ్’ కానుందా?చైనా చర్యలను అరుణాచల్ ప్రదేశ్ తదితర సరిహద్దు రాష్ట్రాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. చైనా ఎప్పుడు నీటిని విడుదల చేస్తుందో, ఎప్పుడు నిలిపివేస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. అత్యవసర సమయాల్లో భారీగా నీటిని వదిలితే కృత్రిమ వరదలు, నిలిపివేస్తే కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును భారత్పై ప్రయోగించే ఒక ‘వాటర్ బాంబ్’గా ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు అభివర్ణించడం గమనార్హం.భౌగోళిక రాజకీయ వ్యూహాలుపర్యావరణ కోణంలోనే కాకుండా, ఈ ప్రాజెక్టు వెనుక చైనా రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లో సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను పెంచుకోవడం ద్వారా టిబెట్, భారత్ సరిహద్దులపై పూర్తి నియంత్రణ సాధించాలని బీజింగ్ యోచిస్తోంది. మెకాంగ్ నది విషయంలో కూడా చైనా ఇలాగే వ్యవహరించి.. వియత్నాం వంటి దేశాల్లో కరువుకు కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి.చెదిరిపోతున్న స్థానిక జీవనంఈ మెగా ప్రాజెక్టు కారణంగా టిబెట్లోని మోన్పా, లోబా వంటి స్థానిక తెగలకు చెందిన వేలాదిమంది ప్రజలు తమ పూర్వీకుల గృహాలను వదులుకోవాల్సి వస్తోంది. బలవంతపు తరలింపుల వల్ల స్థానిక సంస్కృతి, ఉపాధి వనరులు నాశనమవుతాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్థానికుల స్థానంలో ఇతర ప్రాంతాల వలస కార్మికులను తీసుకురావడం ద్వారా ఆ ప్రాంత జనాభా స్వరూపాన్ని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని టిబెట్ పాలసీ ఇన్స్టిట్యూట్ విమర్శించింది.భారత్ ముందస్తు చర్యలుచైనా కదలికలను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం, సరిహద్దు ప్రాంతాల పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకు సిద్ధమవుతోంది. చైనా డ్యామ్కు ప్రతిగా బ్రహ్మపుత్రపై సుమారు 11,200 మెగావాట్ల సామర్థ్యం గల భారీ డ్యామ్ను నిర్మించాలని భారత్ ప్రతిపాదించింది. అయితే ఇరు దేశాల మధ్య ఈ ‘డ్యామ్ నిర్మాణ రేసు’ పర్యావరణానికి మరింత ముప్పు తెస్తుందని, రెండు దేశాలు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘సెవెన్ సిస్టర్స్’పై దారుణ వ్యాఖ్యలు.. ‘బంగ్లా’పై భారత్ సీరియస్ -
నౌకా స్థావరంలో చైనా గూఢచార పక్షి
దొడ్డబళ్లాపురం: కర్ణాటకలోని కార్వార్లో అరేబియా సముద్ర తీరంలోని భారతీయ నౌకాదళ స్థావరంలో ఓ పక్షి అనుమానాస్పదంగా కనిపించింది. కదంబ నేవీ బేస్ పరిధిలో మంగళవారం జీపీఎస్ ట్రాకర్ కలిగిన సీగల్ బర్డ్ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పక్షికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇది చైనాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. చైనా భాషలో ఎకో ఎన్విరాన్మెంట్ అని రాసి ఉంది. చైనాలోని ఆ సంస్థతో సంప్రదించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. కార్వార్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గూఢచర్య పక్షిగా అనుమానాలను వ్యక్తం చేశారు. -
చైనా-పాకిస్థాన్కు మధ్య చెడింది ఇక్కడే..!
‘దోస్త్ మేరా దోస్త్.. నువ్వే నా ప్రాణం’.. అంటూ ఏక కంఠంతో చెప్పిన చైనా-పాకిస్థాన్ మధ్య దోస్తీ ఇప్పుడు చెడిందా..! పాకిస్థాన్ ఆవిర్భావం నుంచి డ్రాగన్తో కలిసే ఉన్నా.. ఇంత సడెన్గా ఎందుకు చైనా దూరమవుతోంది..? షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ మాదిరిగా కలిసి ఉండే చైనా-పాకిస్థాన్లు ఇప్పుడు విడిపోవడానికి కారణాలేమిటి..? ఇంతకాలం చైనా నుంచి ఇతోధికంగా సాయం పొందిన పాకిస్థాన్.. ఉన్నఫళంగా ఎందుకు రూట్ మార్చింది..? భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జియోపాలిటిక్స్ ఇంత వేగంగా మారిపోవడానికి దోహదపడిన అంశాలేమిటి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..సిల్క్ రోడ్ మాదిరి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ను నిర్మించింది. దీని కోసం చైనా ఎన్నో బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనే షీ జిన్పింగ్ కలను సాకారం చేసే దిశలో పాకిస్థాన్ సీపీఈసీకి సహకరించింది. అంతేకాదు.. పాకిస్థాన్లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేసి, తనకు అనుకూలంగా మలచుకోవాలనుకుంది. భారత్కు ధీటుగా పాకిస్థాన్ను ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసింది. అంతెందుకు.. మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్య రాజ్య సమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది.పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై గళమెత్తిన ప్రతీసారి.. చైనా రొటీన్గా ఆధారాలేవి? అంటూ ప్రశ్నించేది. అలా పాలు-నీళ్లలా చైనా-పాకిస్థాన్ బంధం కొనసాగింది. భారత్కు చెక్ పెట్టేలా ఎప్పటికప్పుడు పాకిస్థాన్కు అధునాతన యుద్ధ విమానాలు, రక్షణ పరికరాలను సరఫరా చేయడంలో చైనా ముందంజలో ఉండేది. అంతెందుకు.. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు వాడే తూటలాలు.. ముఖ్యంగా స్టీల్ బుల్లెట్లు కూడా చైనా సరఫరా కావడం గమనార్హం..! సంక్షోభ సమయాల్లోనూ పాక్కు చైనా వెన్నంటే ఉంది.చైనా-పాకిస్థాన్ల చైనా బంధం దశాబ్దాలుగా కొనసాగింది. పాకిస్థాన్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పాలకులు మాత్రం చైనాకు అనుకూలంగా ఉండడం రివాజుగా మారింది. చివరకు సైనిక పాలన కొనసాగినా.. సైన్యాధికారులు చైనాకు తొత్తులగానే పనిచేసేవారు. నిజానికి చైనా మతరహిత సమాజాన్ని కోరుకుంటే.. పాకిస్థాన్ మాత్రం ఫక్తుగా ఇస్లామిక్ దేశం. ఇంకా చెప్పాలంటే.. చైనాలో మైనారిటీలుగా ఉన్న ముస్లింలపై మారణకాండ కొనసాగినా.. పాకిస్థాన్ మాత్రం చైనాకు వంతపాడేది.అంటే.. సిద్ధాంతపరంగా వేర్వేరు భావజాలాలున్నా.. ‘అవసరం’ అనే ఒకే ఒక్క పదం ఈ రెండు దేశాలను ఫ్రెండ్స్గా మార్చేశాయి. జియోపాలిటిక్స్ అనే రాజనీతితో ఇరుదేశాలు సఖ్యతను ప్రదర్శించాయి. బలూచిస్థాన్లో వ్యతిరేకత పెరిగినా.. పాకిస్థాన్ మాత్రం చైనా కోసం అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. బలూచిస్థాన్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను చైనాకు కట్టబెట్టేందుకు పాకిస్థాన్ ఇప్పుడు బలూచీలపై కత్తిదూస్తోంది. వారి ఆగ్రహ జ్వాలలకు సొంత సైన్యం, పోలీసులు బలవుతున్నా.. మొండిధోరణితో ముందుకు సాగింది.పాలు-నీళ్లుగా స్నేహ బంధంలో మునిగితేలిన చైనా-పాకిస్థాన్ ఇప్పుడు ఉప్పు-నిప్పులా మారిపోతున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’తో భారత రక్షణశాఖ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. భారత డిఫెన్స్తోపాటు.. అఫెన్స్ కెపాసిటీకి అగ్రదేశాలు సైతం అద్దిరిపోయాయి..! అందుక్కారణం.. ఈ రెండు అంశాల్లో భారతే టాప్ అన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేశాయి. డిఫెన్స్లో తోపులమనుకునే ఇజ్రాయెల్, రష్యా, అమెరికా కంటే.. ఎంతో ముందంజలో ఉన్నట్లు ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించింది.అమెరికా తయారీ ఎఫ్-16, చైనా తయారీ జే-10సీ వంటి అధునాతన యుద్ధ విమానాలున్నా.. పాకిస్థాన్ చతికిలపడిపోయింది. అదే సమయంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాంతో.. భారత్కు చెక్ పెట్టాలని అమెరికా నిర్ణయించింది. ఓవైపు సుంకాల భారం మోపుతూనే.. మరోవైపు పాకిస్థాన్ను పావులా వాడుకోవాలని వ్యూహాలు రచించింది. అదే సమయంలో చైనాకు పోటీగా పాకిస్థాన్లోని ఓ పోర్టును అభివృద్ధి చేసి, బలూచిస్థాన్లోని అపారమైన ఖనిజ సంపదను దోచుకోవాలని ప్లాన్ చేసింది. దాన్ని అర్థం చేసుకోకుండా.. తమకు పెద్దన్న పెద్దపీట వేస్తున్నాడనే ఉద్దేశంతో పాకిస్థాన్ ట్రంప్ను గుడ్డిగా నమ్మేసింది..!అమెరికాను బద్ధ శత్రువుగా భావించే చైనా.. ఇప్పుడు పాకిస్థాన్ నిర్ణయంతో షాక్ అయ్యింది. దాంతో.. పాకిస్థాన్ను పూర్తిగా పక్కన పెట్టేసింది. 2013 నుంచి వ్యూహాత్మకంగా గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసినా.. ఇప్పుడు పాక్కు దూరంగా ఉంటోంది. అయితే.. హోర్మూజ్ జలసంధి నుంచి గ్వాదర్ పోర్టు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనాకు సరఫరా అయ్యే చమురు ఈ పోర్టు మీదుగానే వస్తుంది. అక్కడి నుంచి సీపీఈసీ ద్వారా గిల్గిట్-బాల్టిస్థాన్కు.. అక్కడి నుంచి జిన్జియాంగ్కు చమురు చేరుకుంటుంది. వ్యూహాత్మకంగా శత్రుదేశాల యుద్ధ నౌకలను అడ్డుకునేందుకు గ్వాదర్ పోర్టును అడ్డాగా మార్చుకోవాలని చైనా భావించింది.ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకలు ఈ మార్గం మీదుగానే దక్షిణాసియాకు రావాల్సి ఉంటుంది. అయితే.. పాకిస్థాన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన చైనా.. ఇప్పుడు వాటిని అప్పుగా చూపించి, వసూలు చేసుకుంటుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పైగా.. బలూచిస్థాన్, ఖైబర్ పంఖ్తుంఖ్వాల్లో రోడ్లను చైనా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో లభించే అరుదైన ఖనిజ సంపదను అమెరికాకు ఎగుమతి చేసే దిశలో పాకిస్థాన్ అడుగులు వేస్తోంది. దీన్ని చైనా సహిస్తుందా??గ్వాదర్ పోర్టు నుంచి జిన్జియాంగ్ వరకు సీపీఈసీ, రైల్వేలు, విమానాశ్రయాలను అభివృద్ధి చేసిన చైనా.. వాటిని ఊరికే వదిలిపెడుతుందా??? ఇవన్నీ సమాధానాల్లేని ప్రశ్నలే..! గ్వాదర్కు సమాంతరంగా పజ్నీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ పరిణామాలకు చైనా ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే..!-హెచ్.కమలాపతిరావు 👉ఇదీ చదవండి:చిక్కుల్లో ఆసిమ్ మునీర్.. పాక్-అమెరికా స్నేహానికి చెల్లు -
ఢిల్లీ వాయు కాలుష్యం.. చైనా కీలక ప్రకటన
ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం తీవ్ర ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. వాయు కాలుష్యం పరిమితికి మించి ఉండడంతో ప్రభుత్వం సైతం పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో చైనా, భారత్కు ఒక ఆఫర్ ఇచ్చింది. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కొన్ని మెలకువలు పాటించాలని తెలిపింది. వాటిని ఒక్కొక్కటిగా వివరిస్తూ బీజింగ్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.ఢిల్లీ వాయుకాలుష్యం రోజురోజుకి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. గాలికాలుష్యం నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఢిల్లీలో పనిచేసే అన్ని సంస్థలకు 50శాతం వర్క్ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆంక్షలతో పనులు చేయలేకపోతున్న నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వం రూ. 10 వేలు పరిహారం అందిస్తుంది. అయినప్పటికీ గాలి నాణ్యత మెరుగవుతుందన్న ఆశలు పూర్తిస్తాయిలో లేవు.ఈ విషయమై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి సైతం తొమ్మిది నెలల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించలేమని అది సాధ్యమయ్యే ప్రక్రియ కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా ఢిల్లీకి ఒక సజేషన్ ఇచ్చింది ఒకప్పుడు చైనా రాజధాని బీజింగ్లో కూడా తీవ్రమైన వాయుకాలుష్యం ఉండేదని అయితే తగిన చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ఆపరిస్థితులు మారాయని తెలిపింది.ప్రస్తుతం చైనా-భారత్ రెండు దేశాలు పట్టణీకరణ కారణంగా విపరీతమైన వాయు కాలుష్యాన్ని ఎదురుకుంటున్నాయని చైనా ఎంబసీ స్పోక్స్ పర్సన్ యూ జింగ్ పేర్కొన్నారు. అయితే చైనా గత దశాబ్దకాలంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారు. భారత్ సైతం కొన్ని నియామాలు పాటిస్తే గాలి కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు.బీఎస్ 6 వెహికల్స్ మాత్రమే అనుమతించాలి.సర్సీస్ పూర్తి చేసుకున్న వాహనాలకు అనుమతి నిరాకరణ.కార్లపై పెరుగుదలపై ఆంక్షలు విధించాలి.వాహనాలు రోడ్డుపై రావడానికి సరిసంఖ్య, బేసిసంఖ్యలతో లాటరీ సిస్టమ్ తీయాలిమెట్రో నెటెవర్క్ను విస్తరించాలి.బస్సు సదుపాయాలని మెరుగుపరచాలి.ప్రస్తుత వాహనాలను ఎలక్ట్రిక్ విధానంలోకి మార్చాలి.అంతేకాకుండా కాలుష్య నియంత్రణకు బీజింగ్తో కలిసి పనిచేయాలని యూ జింగ్ తెలిపారు. డిసెంబర్ 15న ఢిల్లీ, బీజింగ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కు సంబంధించిన చిత్రాలను ఆమె ఎక్స్లో షేర్ చేసింది. దీనిలో ఢిల్లీ AQI 447గా ఉండగా, బీజింగ్ AQI 67 గా ఉంది. అయితే భారత్ 2020 ఏప్రిల్ 1నుండే ఢిల్లీలో బీఎస్6 వాహనాల వాడకం తప్పనిసరి చేసింది. -
చైనా ‘మ్యాప్’ రాజకీయం..!
చైనా.. మనకు పొరగునున్న దేశం. ఈ దేశం తీరు ఎవ్వరికీ అర్థం కాదు. ఒకవైపు మిత్రత్వం చేస్తూనే తమ సరిహద్దుల్లో ఉన్న భూభాగాల్ని తమదే అంటుంది. ఆ విషయం ఇటీవల రష్యా భూభాగాన్ని తన మ్యాప్లో చూపించడంతో చైనా వైఖరి మరోసారి బయటపడింది. అంతకుముందు భారత్ భూభాగాల్ని అనేకసార్ల తన మ్యాప్ల్లో చూపించింది చైనా.సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నా..చైనాతో ప్రస్తుతం భారత్ సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నప్పటికీ, అవకాశం వస్తే దొంగ దెబ్బ తీయడానికి కూడా వెనుకాడదు అనేది గతంలో చాలాసార్లు నిరూపణ అయ్యింది. గాల్వాన్ ఎపిసోడ్లో ఎంతటి రాద్దాంతం జరిగిందో అందరికి తెలిసిందే. 2020, జూన్ 15వ తేదీన భారత–చైనా గాల్వాన్ జరిగిన ఘటన హింసాత్మకమనే చెప్పాలి.ఈ సంఘటనలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది చైనా సైనికులు కూడా మరణించారు. ఇది 45 సంవత్సరాల తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద జరిగిన అత్యంత హింసాత్మక ఘర్షణగా నిలిచిపోయింది. ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో చైనా దూకుడు తగ్గించింది. అదే సమయంలో భారత్తో స్నేహ సంబంధాలకోసం చేతులు చాచింది. ఆ క్రమంలోనే ఇటీవల ఇరదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయి. ఐదేళ్ల తర్వాత భారత విమానాలు.. చైనా గగనతలంలోకి వెళుతున్నాయి.చైనా మారిందా.. నటిస్తుందా..?కానీ తన వైఖరిని పూర్తిగా మార్చుకుందా అనేది ప్రశ్నార్థకమే. ఎప్పుడు ఏదో వివాదంతో అగ్నికి ఆజ్యం పోయాలనే చూస్తూ, అవకాశం కోసం ఎదురుచూస్తూ తన పొరుగు దేశాలను ఏదో రకంగా గిల్లుతూనే ఉంటుంది. ఇప్పుడు రష్యా విషయంలో కూడా అదే జరిగింది. రష్యాతో స్నేహం నటిస్తూనే ఆ దేశ భూభాగాన్ని చైనా తన మ్యాప్లో చూపించింది. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే.. ప్రత్యర్థి దేశం ఏమాత్రం బలహీనంగా ఉన్నా వారిపైకి మెల్లగా తన అస్త్రాలను వదులుతుంది. రష్యా విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం రష్యా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఉక్రెయిన్తో సుదీర్గకాలంగా చేస్తున్న యుద్ధం కారణంగా రష్యా సైతం ఆర్థికంగా గాడిన పడటానికి అపసోపాలు పడుతోంది. ఇటువంటి తరుణంలో రష్యా భూభాగాన్ని తన మ్యాప్లో చూపించే యత్నం చేసింది డ్రాగన కంట్రీ. ఒక రాయి వేసి చూద్దాం అసలు ఏం జరుగుతుందా అనే వైఖరిని బాగా వంట బట్టించుకున్న చైనా.. అవకాశం వచ్చినప్పుడు ఈ జిత్తులు మారిన చేష్టలు చేస్తూనే ఉంటుంది.అమెరికాతో తీవ్రపోటీ..అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు ఆశాజనకంగా లేవనే సంగతిని పక్కన పెడితే. ఆ దేశంతో ఇటీవల కాలంలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది చైనా. పూర్తిగా ఇరు దేశాల మధ్య శత్వుత్వం లేకపోయినా తీవ్ర పోటీ ఉంది. ఆ క్రమంలోనే వారి మధ్య టారిఫ్ వార్ గట్టిగానే జరిగింది. ఇది కేవలం టారిఫ్ వార్గా అభివర్ణించినా, విషయం మాత్రం సీరియస్గానే ఉండటంతో మిత్రత్వం కోసం భారత్తో మిత్రత్వం కోసం పాకులాడింది.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి అనే భావన చైనాలో ఉండటమే కాదు.. అత్యంత నమ్మదగిన దేశాలలో భారత్ ఒకటి అనే విషయాన్ని కూడా చైనా బాగానే గ్రహించింది. దాంతోనే భారత్తో స్నేహం కోసం నిరీక్షించి మరీ ఆ దిశగా సక్సెస్ అయ్యింది. ఆ క్రమంలోనే ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గాడిలో పడ్డాయి.అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ..ఇటీవల చోటు చేసుకున్న ఘటనను చూసుకుంటే.. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళను చైనా ఎయిర్పోర్ట్లో ముప్పుతిప్పలు పెట్టారు చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు. తన పాస్పోర్ట్ను పరిశీలించే క్రమంలో అరుణాచల్ ప్రదేశే్-భారత్ అని ఉందేంటని ఆ అధికారులు ఆ మహిళను వేధింపులకు గురి చేశారు. యూకేలో ఉంటున్నభారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్పోర్ట్పై అరుణాచల్ప్రదేశ్-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్పోర్ట్ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను.పెమా వాంఘజామ్ థోంగ్డాక్ అనే లండన్ నుంచి జపాన్కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. కానీ అక్కడ భారత ఎంబాసీ అధికారులు జోక్యం చేసుకోవడంతో చివరకు ఆ మహిళ ఎలాగోలా బయటపడింది. మరి ఈ విషయం ప్రపంచానికి తెలిసినప్పుడు చైనా ప్రభుత్వానికి తెలియదా.. కచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి ఏమైనా మాట్లాడిందా అంటే అదీ లేదు. ఇది చిన్న విషయంగా కనిపించినా, ఇటువంటి వాటిని ఆదిలోనే తుంచేయాలి. అలాగే డ్రాగన్ కంట్రీపై సీరియస్గా భారత్ దృష్టిసారించి ఉండాల్సిందే.ఇదీ చదవండి: రష్యా భూభాగంపై జిత్తులమారి చైనా కన్ను! -
ఆ యువ సైక్లిస్ట్ గట్స్కి మాటల్లేవ్..! ఏకంగా 30 దేశాలు..
ఓ యువ సైక్లిస్ట్ ఖండాల మీదుగా అసాధారణ పర్యాటనకు పూనుకున్నాడు. ఏదో రికార్డు సృష్టించాలనో..తానెంటో ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనో కాదు. స్వలాభం ఆశించకుండా ఓ గొప్ప సందేశాన్ని అందించేలా సాహసోపేతమైన స్ఫూర్తిదాయక పర్యాటనను చేపట్టాడు ఆ యువకుడు. ఏకంగా 18 వేల కిలోమీటర్లు తొక్కి..తన టూర్ని సక్సెస్ఫుల్గా పూర్తిచేశాడు. తాను వయసులో చిన్న గానీ ఔదార్యంలో అందరికంటే మిన్నా అని చాటిచెప్పాడు. ఎవరా యువకుడు..ఏ లక్ష్యం కోసం ఇంత పెద్ద సాహసానికి పూనుకున్నాడంటే..ఫ్రాన్స్కు చెందిన 24 ఏళ్ల యువ సైక్లిస్ట్ కిలియన్ లే గయాడర్ తన స్వస్థలం నుంచి చైనాకు 18,000 కిలోమీటర్లు తొక్కుకుంటూ సైకిల్పై వెళ్లడం విశేషం. అతడు ఖండాలు మీదుగా చేపట్టి అసాధారణ టూర్ని చేపట్టి..ఏకంగా 30కి పైగా దేశాలు చుట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టూర్ని వాయువ్య ఫ్రెంచ్ నగరం రెన్నెస్ నుంచి ప్రారంభించి..నెలల తరబడి నిరంతరం ప్రయాణిస్తూ..ఇటీవలే చైనాకు చేరుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే..లే గయాడర్ తన జీవితంలో మర్చిపోలేని గొప్ప సాహసోపేతమైన పర్యాటనను విజయవంతంగా పూర్తిచేశాడు. ఇది తన లైఫ్లోనే అత్యంత చిరస్మరణీయ విజయాలలో ఒకటిని సమర్థవంతంగా పూర్తిచేయగలిగానంటున్నాడు. ఎందుకోసం ఈ పర్యాటన అంటే..అనారోగ్యంతో పోరాడుతూ కూడా మన డ్రీమ్స్ని, లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పేందుకే ఈ సాహసోపతమైన పర్యాటనకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక లె గయాడర్ 2023లో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. 14 ఏళ్ల ప్రాయంలో అడవిలో ఉండే బొరేలియా బాక్టీరియా కారణంగా లైమ్ వ్యాధి బారిన పడ్డాడు. దాన్నుంచి కోలుకునేందుకే నెలలు, సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత క్రమంగా శక్తిని పొంది, పూర్తిస్థాయిలో ఆరోగ్యంవంతుడయ్యేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాధిపై ప్రజలందిరికీ అవగాహన కలిగేలా చేయాలని.. ఇలా సైకిల్ యాత్రకు సంకల్పించాడు. తనలా మరెవ్వరూ ఇంతలాబాధ పడకుండా, ముందు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించేందుకే ఈ సాహస యాత్ర అని చెప్పుకొచ్చాడు. ఫ్రాన్స్ నుంచి యూరప్ ఆసియా అంతటా దాదాపు 10 వేల కిలోమీటర్లు పైనే ఒంటిరిగా సైకిల్ తొక్కాడు. టర్కీ, జానీయాల వరకు తన స్నేహితుడు తోడు రాగా, అక్కడ నుంచి లె గయాడర్నే ఒంటరిగా చైనాకు చేరుకున్నాడు. అయితే చైనాకు చేరుకునే మార్గం చాలా కఠినమైన భూభాగం, చాలా సవాళ్లుతో కూడిన వాతావరణమని అంటున్నాడు. ఏకంగా ఎనిమిది నెలలు..ఈ యాత్ర కోసం నిధులు సేకరించడానికి సుమారు ఎనిమిద నెలల పనిచేశాడు. అయితే ఈ మొత్తం పర్యాటకు అతడికి సుమారు రూ.15 లక్షలు పైనే ఖర్చయ్యింది. ఈ టూర్కి ఫ్రెంచ్ బ్యాంకు, స్థానిక కౌన్సిల్, సంస్థల నుంచి ఆర్థిక సహాయం సైతం అందింది లె గయాడర్కు. నిజానికి తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్గాలలో తాను ప్రయాణిచడం అత్యంత క్లిష్టమైన సవాలు, పైగా ప్రత్యేక అనుభవ కూడా అని అంటున్నాడు ఆ యువ సైక్లిస్ట్.లైమ్ వ్యాధి (Lyme disease) అంటే:ఇది బోర్రెలియా (Borrelia) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. అడవుల్లో, గడ్డిపొదల గుండా వెళ్లినప్పుడూ ఈ వ్యాధి బారిన పడతారట. దీని కారనంగా ఎర్రటి వలయాకారపు దద్దుర్లు , జ్వరం, తలనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు వస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే గుండె, నాడీ వ్యవస్థ, కీళ్లపై ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందట. (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలి
గోస్ట్ వేర్హౌస్లు గురించి చాలామంది వినే ఉంటారు. బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మనుషులు కనిపించరు, అందుకే వీటిని గోస్ట్ అని పిలుస్తారు. ఇక్కడంతా ఏఐ ఆధారిత రోబోట్స్ పనిచేస్తుంటాయి. 24/7 అలసట లేకుండా.. సెలవు లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి తరహా విధానం చైనాలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అన్ని పనుల్లో రోబోలే!పాస్కల్ బోర్నెట్ (Pascal Bornet) అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. కొన్ని ఏఐ ఆధారిత రోబోటిక్ వాహనాలు నెమ్మదిగా కదులుతూ.. కంటైనర్లను మోసుకెళ్తుండటం చూడవచ్చు. వీడియోలో ఒక్క మనిషి కూడా కనిపించడు. గిడ్డంగులలో సరుకులు ఎత్తడం, కదలించడం, ప్యాక్ చేయడం వంటివన్నీ ఏఐ రోబోలే చూసుకుంటారు. కాబట్టి మనుషుల అవసరం ఉండదు.అలీబాబా, జేడీ.కామ్ వంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి ఏఐ రోబోట్స్ వినియోగిస్తున్నాయి. ఇలాంటి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. కార్మిక కొరత ఉండదు, మానవుల మాదిరిగా తప్పులు జరగవు, ఖర్చులు తగ్గిన్చుకోవచ్చు, పని కూడా వేగంగా.. నిరంతరాయంగా జరుగుతుంది.Ghost warehouses aren’t science fiction anymore — they’re already humming quietly in ChinaThey are warehouses run entirely by AI-powered robots, operating 24/7 with zero human presence.China and much of Asia have already embraced this shift, and they’re not slowing down.… pic.twitter.com/Spxwfaq7TJ— Pascal Bornet (@pascal_bornet) December 12, 2025మనుషులు చేయాల్సింది!ఈ వీడియో షేర్ చేసిన.. పాస్కల్ బోర్నెట్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, పనులన్నీ రోబోలు చేస్తున్నాయి, మనుషులు ఏమి చేయాలో ఆలోచించాలని అన్నారు. రోబోలు ఎప్పుడూ ఒకే పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు డిజైన్, ఇన్నోవేషన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి వారిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. చివరగా మీరేమనుకుంటున్నారని.. ప్రశ్నిచారు.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..పని చేయడానికి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. చాలామంది ఉద్యోగావకాశాలు కోల్పోతారు. అయితే సంస్థలు కొత్త స్కిల్స్ రోబోల నుంచి ఆశించడం అసాధ్యం. రోబోట్స్ వినియోగం చైనా వంటి దేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి విధానం ప్రారంభం కావడానికి ఎంతోకాలం పట్టకపోవువచ్చు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ''మనుషులు కష్టపడే యంత్రాలు కాదు - ఆలోచించే సృష్టికర్తలు''. కాబట్టి మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి. -
రష్యా భూభాగంపై జిత్తులమారి చైనా కన్ను!
పొరుగు దేశాల భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపించే జిత్తుల మారి చైనా ఇప్పుడు రష్యాపై కన్నేసింది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చి.. మ్యాపులు విడుదల చేసే డ్రాగన్ దేశం ఇప్పుడు రష్యా-చైనా సరిహద్దుల్లోని ఓ ద్వీపం తమదేనని వాదిస్తోంది. దీనిపై రష్యా నిఘా వర్గాలు ఇది నిజమేనంటూ నివేదికలు అందజేశాయి. అసలు ఆ ద్వీపం కథేంటి? శతాబ్దన్నర క్రితం చైనా ఆ ద్వీపాన్ని కోల్పోవడానికి కారణాలేంటి? దీనిపై సాక్షి డిజిటల్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథనం ఇది..రష్యాలోని సైబీరియా ప్రాంతంలో.. ఉస్సూరీ-అమూర్ నదుల సంగమం వద్ద అతిపెద్ద ద్వీపం ఉంది. దీన్ని బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్గా పిలుస్తారు. 150 ఏళ్లుగా ఇది రష్యాలో అంతర్భాగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ ద్వీపంపై చైనా కన్నేసింది. ఈ ద్వీపాన్ని ఆక్రమించాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇటీవల రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్బీ 8 పేజీల నివేదికను అందజేసింది. ఆ నివేదికలో చైనాను శత్రువుగా పేర్కొంది. అమెరికా మ్యాగజైన్ ‘న్యూస్ వీక్’.. అదేవిధంగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక దీనిపై కథనాలను ప్రచురించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2023లో చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మ్యాపుల్లో ఈ ఐల్యాండ్ పూర్తిగా చైనాదేనని పేర్కొనడమే కాకుండా.. ఆ దీవి పేరును మార్చివేసింది. అంతేకాదు.. రష్యాలోని తూర్పు నగరం వ్లాడివోస్టోక్ కూడా తమ భూభాగమేనని చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ మ్యాప్ స్పష్టం చేస్తోంది.బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ ఒకప్పుడు చైనాలో భాగమే..! కానీ, 150 ఏళ్ల క్రితం.. అంటే.. 19వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం బలహీనపడింది. ఆ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైంది. భద్రత దృష్ట్యా ఈ దీవిని రష్యాకు అప్పగించింది. రష్యాకు కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ఈ దీవి అప్పట్లో అవసరంగా మారింది. 1958లో జరిగిన ఒప్పందం ప్రకారం అమూర్ నదికి ఉత్తరాన ఉన్న విశాలమైన ప్రాంతాన్ని రష్యాకు అప్పటించింది. 1860లో మరో యుద్ధంలో చైనా ఓడిపోవడం.. పాశ్చాత్య దేశాలకు రష్యా సహకరిస్తుందనే భయంతో ‘పెకింగ్ ఒప్పందం’ చేసుకుంది. ఈ రెండు ఒప్పందాల ప్రకారం ఈ దీవితోపాటు.. సువిశాలమైన భూభాగం రష్యా సొంతమైంది. ఆ వెంటనే రష్యా ఇక్కడ వ్లాదివోస్తోక్ నగరాన్ని నిర్మించింది.ఐదు దశాబ్దాల క్రితం నుంచి చైనా సంస్కరణల బాటలో దూసుకుపోతున్నది. రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా బలోపేతమవుతుండడంతో.. క్రమంగా ఈ ప్రాంతాలపై వివాదాలు రాజుకున్నాయి. రష్యా-చైనా మధ్య 4,200 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సరిహద్దు ఉంది. 60వ దశకంలో కూడా ఈ సరిహద్దు వెంబడి ఇరుదేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. 1990-2000 మధ్యకాలంలో ఈ వివాదం మరింత ముదిరింది. దాంతో.. పలు ఒప్పందాలు కుదిరాయి. అయినా డ్రాగన్ తన కవ్వింపు చర్యలకు ఫుల్స్టాప్ పెట్టకపోవడంతో 2008లో రష్యా కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్లో కొంత భాగం చైనాకు చెందుతుంది.ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఈ యుద్ధంతో రష్యా ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కకుపోయింది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో అతలాకుతలమమయ్యింది. దీంతో డ్రాగన్ మరోమారు కుయుక్తులకు తెరతీసింది. ఓ వైపు రష్యాను మిత్రదేశంగా పేర్కొంటునే.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను కాదని రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించింది. మరోవైపు బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ని హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఒకవేళ చైనా తన చర్యలను మరింత ముమ్మరం చేస్తే.. రష్యా దానిని ఎదుర్కోగలదా? ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతే.. అది ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -హెచ్.కమలాపతి రావు -
ఏఐని బెస్ట్గా వాడుతున్న దేశం ఏదో తెలుసా?
ఒకప్పుడు కంటికి కనిపించే మరయంత్రాలు.. ఇప్పుడు కానరాకుండానే అద్భుతాలు చేస్తున్నాయి. నిమిషాల్లో.. కాదు చిటికేసేలోపే పనులన్నీ చక్కబెట్టేస్తున్నాయి. ఆఖరికి.. మనం తీసుకునే నిర్ణయాలనూ ప్రభావితం చేసేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) అనేది ఇప్పుడు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తి కూడా. ఆరోగ్యం నుంచి విద్య వరకు.. బ్యాంకింగ్ నుంచి వినోదం దాకా.. ప్రతీ రంగంలోనూ ఏఐ తన ముద్రను వేసేసుకుంది. క్రితంతో పోలిస్తే 2025లో వాడకం బాగా పెరిగింది. ఏఐ అభివృద్ధి, పరిశోధన, మోడల్ డెవలప్మెంట్లో ప్రపంచంలోకెల్లా అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. సిలికాన్ వ్యాలీ, ఎంఐటీ, స్టాన్ఫోర్డ్ వంటి పరిశోధనా కేంద్రాలు కొత్త మోడళ్లను రూపొందిస్తూ.. ఏఐ ఆవిష్కరణల్లో అగ్రరాజ్యాన్ని ముందంజలో ఉంచాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా.. 87% కంపెనీలు ఏఐని తమ వ్యాపార ప్రణాళికల్లో ప్రధాన ప్రాధాన్యంగా గుర్తించాయి. మొత్తంగా 76% సంస్థలు కనీసం ఒక విభాగంలో ఏఐని వాడుతున్నాయివాస్తవ వినియోగం విషయంలో మాత్రం అత్యధిక జనాభా ఉన్న చైనా (58%), భారతదేశం (57%) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నాయి. చైనాలో ఆరోగ్యం, తయారీ, ప్రభుత్వ సేవల్లో AI విస్తృతంగా అమలవుతోంది. భారతదేశంలో బ్యాంకింగ్, ఈ-కామర్స్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ రెండు దేశాలు పెద్ద జనాభా, విస్తృత మార్కెట్ కారణంగా AIని ప్రాక్టికల్గా ఉపయోగించడంలో ముందున్నాయి. అదే సమయంలో.. ఎంటర్టైన్మెంట్ విభాగంలో చూస్తే చైనా కంటే మన దేశమే ముందంజలో ఉంది. అయితే.. ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తున్న దేశాలు ఏంటో తెలుసా?.. ఏఐ వినియోగంలో చిన్న దేశాలు వెనుకబడలేదు. యూరప్లోని చిన్న కంట్రీ అయిన ఎస్టోనియా ప్రపంచంలోనే ఏఐని అతి సమర్థవంతంగా వినియోగించుకుంటున్న దేశంగా గుర్తింపు దక్కించుకుంది. డిజిటల్ పాలసీలతో పాటు ఈ-పౌరసత్వం, డిజిటల్ ఐటీ వంటి ప్రాజెక్టుల కోసం పూర్తిగా ఏఐనే ఉపయోగించుకుంటోందా దేశం. ఈ లిస్ట్లో తర్వాత సింగపూర్ ఉంది. అక్కడి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, పబ్లిక్ సర్వీసుల్లోనూ AIని అత్యుత్తమంగా ఉపయోగిస్తున్నారు. స్పష్టమైన పాలసీలు, సమర్థవంతమైన అమలుతోనే ఇది సాధ్యమైందని సింగపూర్ ఈ మధ్యే గొప్పగా ప్రకటించుకుంది కూడా. ఇక.. మన దేశంలో ఏఐని విచ్చలవిడిగా వాడుతోంది చూస్తున్నదే!. అయితే యూరప్లో మాత్రం ఏఐ తరహా కంటెంట్ వాడకంపై ఆంక్షలు ఉన్నాయి. ఈయూ AI Act ద్వారా ఎథికల్ AI వినియోగానికి(ఎలా పడితే అలా వాడడానికి వీల్లేకుండా..) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలు ఏఐని తక్కువేం వాడడం లేదు. ఏఐ కంప్యూటింగ్ పవర్లో భారీగా పెట్టుబడులు పెడుతూ.. భవిష్యత్తులో గ్లోబల్ AI హబ్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దక్షిణ కొరియాలో ప్రభుత్వం ఉద్యోగులకు AI అక్షరాస్యతలో భాగంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.మొత్తంగా.. ప్రపంచ ఏఐ దృశ్యం ఇప్పుడు పెద్ద దేశాల ఆధిపత్యంతో పాటు చిన్న దేశాల సమర్థవంతమైన వినియోగం అనే ద్వంద్వ రూపంలో ఉందని చెప్పొచ్చు. -
చైనీయులకు సులువుగా బిజినెస్ వీసాలు
న్యూఢిల్లీ: భారత్ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా బిజినెస్ వీసాలు జారీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను సడలించింది. వీసా దరఖాస్తులను ఇకపై వేగంగా ఆమోదించబోతున్నారు. లద్దాఖ్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్–చైనా సంబంధాలు ఇటీవల మళ్లీ గాడిన పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షలు, టారిఫ్ల నేపథ్యంలో చైనాతో వాణిజ్య సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే బిజినెస్ వీసా నిబంధనల్లో తాజాగా మార్పులు చేసింది. తక్కువ కాలంపాటు భారత్ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా వీసాలు ఇవ్వడం ద్వారా వారి సేవలు ఉపయోగించుకోవచ్చని, చైనాతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, వీసా దరఖాస్తుదారుల తనిఖీ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఆమోదంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. చైనా వృత్తి నిపుణులకు గతంలో ఎంప్లాయ్మెంట్ వీసాలు(ఈ వీసాలు) జారీ చేస్తుండేవారు. వీటి కాలపరిమితి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ. బిజినెస్ వీసాలకు సంబంధించి మార్పు చేసిన నిబంధనలు అన్ని దేశాల దరఖాస్తుదారులకు వర్తిస్తాయి. అయితే, ఈ నిర్ణయం వల్ల చైనీయులు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఈ వీసాల జారీ ప్రక్రియను నాలుగు వారాల్లోపే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చైనా పరికరాలు, యంత్రాలతో ఉత్పత్తి కార్యకలాపాలు సాగించే భారతీయ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లాభం చేకూరనుంది. చైనా నిపుణులు బిజినెస్ వీసాలపై ఇండియాకు వచ్చి, సదరు కంపెనీలకు సహకరించే వీలుంది. చైనా పౌరులకు టూరిస్టు వీసాలను జారీ చేసే ప్రక్రియను ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వాగతించిన చైనా విదేశాంగ శాఖ చైనా నిపుణులకు బిజినెస్ వీసాలను సులువుగా, వేగంగా జారీ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ శుక్రవారం స్వాగతించారు. ఇదొక సానుకూలమైన ముందడుగుగా అభివరి్ణంచారు. ప్రయాణాలను సులభతరం చేస్తే ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు. భారత్, చైనా ప్రజల మధ్య అనుబంధం బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. -
కోర్–5 సూపర్ క్లబ్
వరల్డ్ ఆర్డర్. ఒక్క వాక్యంలో చెప్పాలంటే బలం, సామర్థ్యం ఆధారంగా వరుస క్రమంలో దేశాల అమరిక. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలే శాసించే ఈ వరల్డ్ ఆర్డర్ త్వరలో పెను మార్పులను చవిచూడనుందా? ఇప్పటిదాకా అత్యంత బలోపేతమైన కూటమిగా ఉన్న జీ7 వైభవం గతించనుందా? దాన్ని తోసిరాజనేలా అతి శక్తిమంతమైన సరికొత్త కూటమి ఒకటి శరవేగంగా పురుడు పోసుకుంటోందా? అన్ని రంగాల్లోనూ నిర్నిరోధంగా దూసుకుపోతున్న నయా భారత్ ది అందులో అతి కీలక పాత్ర కానుందా? అంటే, అవుననే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముఖ్యంగా కొద్దిరోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు, చేతలు, చాప కింద నీరులా ఆయన చకచకా సాగిస్తున్న ప్రయత్నాలు ఇందుకు ప్రబల సంకేతాలేనని చెబుతున్నారు. కోర్–5 పేరిట కొత్త కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిజిటల్ వార్తా పత్రిక పొలిటికో రాసి కథనం అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టిస్తోంది. అమెరికా, భారత్, మరో రెండు ఆసియా దిగ్గజాలైన చైనా, జపాన్ తో పాటు ఆశ్చర్యకరంగా రష్యా కూడా ఇందులో భాగస్వామి కానుందని పొలిటికో కథనం సారాంశం. అమెరికాకు సంబంధించిన రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాలను అత్యంత కచి్చతత్వంతో నివేదించే డిఫెన్స్ వన్ సైట్ ను ఉటంకిస్తూ అది ఈ మేరకు పేర్కొంది. ఈ కోర్ గ్రూప్నకు ముద్దుగా ’సీ5 సూపర్ క్లబ్’ గా నామకరణం కూడా చేసింది! నిజంగా గనుక అదే జరిగితే చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి ఇదే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో ప్రచురించకుండా రహస్యంగా ఉంచిన భాగంలో సీ5 గురించి వివరంగా ఉన్నట్టు వాషింగ్టన్, వైట్ హౌస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి! ట్రంప్ తీసుకువస్తున్న సరికొత్త సీ 5 ప్రతిపాదనలపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, జపాన్ ప్రధాని తకాయిచీ స్పందనలేమిటో తెలియాల్సి ఉంది. యూరప్ దేశాలకు చెక్? జీ7 కూటమిలో అమెరికా, కెనడా , జపాన్ ను మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ రూపంలో నాలుగు యూరప్ దేశాలే ఉన్నాయి. పలు అంశాల్లో వాటి దూకుడు పట్ల ట్రంప్ కొద్దికాలం గుర్రుగా ఉన్నారు. చీటికిమాటికి అన్ని విషయాల్లోనూ తమ మాటే నెగ్గాలనే ఒంటెత్తు పోకడతో అవి శిరోభారంగా మారాయని భావిస్తున్నారు. వాటికి చెక్ పెట్టేందుకే ఈ కొత్త కూటమికి ఆయన తెర తీస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా విదేశాంగ విధానంలోనే ఇది పెను మార్పు కానుంది! అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టిన గత 80 ఏళ్లలో నిత్యం యూరప్ ను తన అతి సన్నిహిత భాగస్వామిగానే పరిగణిస్తూ రావడం తెలిసిందే.ట్రంప్ సంకేతాలు సీ 5 గ్రూప్ గురించి నిజానికి ట్రంప్ కొంతకాలంగా స్పష్టమైన సంకేతాలే ఇస్తూ వస్తున్నారు. గత జూన్ లో జరిగిన జీ7 శిఖరాగ్రాన్నే ఇందుకు ఆయన వేదికగా మలచుకోవడం విశేషం. జీ7 కూటమిలో రష్యా కొనసాగి ఉండాల్సిందని, ఆ మాటకొస్తే చైనాకూ ఎన్నడో చోటు దక్కాల్సిందని ఆయన కుండబద్ధ్దలు కొట్టారు. తొలుత జీ8గా ఉన్న ఈ కూటమి కాస్తా, 2014లో క్రిమియాను ఆక్రమించిన కారణంగా రష్యాకు ఉద్వాసన పలకడంతో జీ7గా మారింది. ‘నిజానికి అతి పెద్ద తప్పిదమది. అలా చేయకుంటే నేడు ఇంత భారీ యుద్ధమే జరుగుతుండేది కాదు‘ అని ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఉదేశించి జీ7 వేదికగానే ట్రంప్ కుండబద్ధ్దలు కొట్టారు. సి5 మరీ సత్యదూరం ఏమీ కాకపోవచ్చని బైడెన్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా మండలిలో కీలకపాత్ర పోషించిన టోరీ తౌసిగ్ చెప్పడం విశేషం. ‘ట్రంప్ కు సిద్ధాంతాలపై పెద్దగా నమ్మకం లేదు. తన ఆలోచనలకు, వ్యూహాలకు, ప్రణాళికలకు ఏది పనికొస్తే అదే అప్పటికి ఆయన సిద్ధాంతం! ఆ లెక్కన కొంతకాలంగా తనకు శిరోభారంగానే గాక అమెరికాకు ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా భారంగానే పరిణమిస్తున్న యూరప్ దేశాలను వదిలించుకునేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు.అప్పుడే ఎజెండా రెడీ? అవుననే అంటోంది పొలిటికో. జీ7 మాదిరిగా తర చూ భేటీ కావాలని, అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించాలని ట్రంప్ భావిస్తున్నట్టు అది వివరించింది. అంతేకాదు, పశ్చిమాసియా భద్రతే సీ5 తొలి ఎజెండా అని కూడా డిఫెన్స్ వన్ ను ఉటంకిస్తూ చెప్పేసింది! ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య ఉప్పూ నిప్పుగా ఉన్న సంబంధాలను సరిదిద్దడం సీ5 ’తొలి అసైన్ మెంట్’ అని చెప్పుకొచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా
బీజింగ్ : రూ.1,404 కోట్ల అవినీతి , లంచం తీసుకున్న నేరాలకు సంబంధించిన కేసు చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. దోషిగా తేలిని సీనియర్ బ్యాంకర్ను ఉరి శిక్షను అమలు చేసింది.సుప్రీం పీపుల్స్ కోర్టు మునుపటి తీర్పును సమర్థించిన తర్వాత టియాంజిన్లో మరణశిక్ష అమలు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. బాయి టియాన్హుయ్ వేలకోట్ల అక్రమాలు, దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఒకటి పాపులర్ ఈ కేసు చైనాలో , అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది.చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్లో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బాయి టియాన్హుయ్ 1.1 బిలియన్ యువాన్లకు(దాదాపు రూ.1,404 కోట్లు) పైగా చట్టవిరుద్ధమైన చెల్లింపులు పొందారని కోర్టులు తేల్చిన తర్వాత చైనా అతణ్ని ఉరితీసింది . ఆర్థిక సంస్థలు మరియు రాష్ట్ర-సంబంధిత సంస్థలలో అవినీతికి వ్యతిరేకంగా బీజింగ్ కొనసాగుతున్న ప్రచారంలో భాగంగా ఈ శిక్షను అమలు చేసింది.చైనా గతంలో ప్రధాన కేసుల్లో శిక్షను అమలు చేసినప్పటికీ, అవినీతి కేసుల్లో మరణశిక్షలు అరుదనే చెప్పాలి.చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్మెంట్ ఛైర్మన్గా పనిచేసిన లై షియోమిన్ 1.79 బిలియన్ యువాన్ల లంచం తీసుకున్నందుకు దోషిగా తేలిన తర్వాత 2021లో ఉరితీశారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం సుప్రీం పీపుల్స్ కోర్టు మునుపటి తీర్పును సమర్థించిన నేపథ్యంలో టియాంజిన్లో బాయి టియాన్హుయ్ మరణశిక్ష అమలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. అక్రమ డబ్బు పరిమాణం , దేశంలోని ప్రధాన ఆర్థిక సమూహాలలో ఒకదానిలో బాయి ఒకప్పుడు కలిగి ఉన్న స్థానం కారణంగా ఈ కేసు చైనాలో మరియు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది. టియాంజిన్ సెకండ్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు తొలుత బాయికి 2024 మేలో మరణశిక్ష విధించింది. అతని వ్యక్తిగత ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. బాయి టియాన్హుయ్ అందుకున్న లంచాల మొత్తం , నేరాల స్థాయి చాలా తీవ్రమైనవిగా కోర్టు పరిగణించింది. బాయి ప్రవర్తన దేశప్రయోజనాలను దెబ్బతీయడం తోపాటు, ప్రజలకు హాని కలిగించిందని, చట్టం ప్రకారం అతన్ని కఠినంగా శిక్షించాలని కూడా పేర్కొంది.సుప్రీం పీపుల్స్ కోర్ట్ ఈ పరిశోధనలను ఆమోదించింది సాక్ష్యాలు స్పష్టంగా, నిర్ణయాత్మకంగా ఉన్నాయని అతనికి ఈ శిక్ష "తగినది" అని పేర్కొంది. SCMP ప్రకారం, బాయి 2014 - 2018 మధ్య చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్లో జనరల్ మేనేజర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్గాపనిచేశారు. ఆ కాలంలో, అతను ఫైనాన్సింగ్ ఏర్పాట్లు మరియు ప్రాజెక్ట్ సంబంధిత లావాదేవీల ఆమోదం కోసం అక్రమాలకు పాల్పడ్డాడు. ఇది చివరికి 1.1 బిలియన్ యువాన్లకు (రూ. 1,404 కోట్లు) పైగా అక్రమ లాభార్జనకుదారితీసింది. -
శాస్త్రవేత్తలే విస్తుపోయేలా 92 అడుగుల భారీ డైనోసార్
దక్షిణ చైనాలో భారీ ఎముకలతో, కనీవినీ ఎరుగని పెద్ద డైనోసార్ శిలాజాలను గుర్తించారు. ఈ భారీ శిలాజం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. ఇది దాదాపు 92 అడుగుల (సుమారు 28 మీటర్లు) పొడవు ఉంటుందని అంచనా. టోంగ్నాన్లాంగ్ జిమింగి (Tongnanlong zhimingi) అనే పేరుపెట్టారు. ఈ భారీ 92 అడుగుల సౌరోపాడ్ (Sauropod) జాతి డైనోసార్ ఇపుడు భూమిపై అతిపెద్ద భూ జంతువులలో ఒకటిగా నిలుస్తోంది.న్యూ జురాసిక్ డైనోసార్ టోంగ్నాన్లాంగ్టోంగ్నాన్ జిల్లా తవ్వకాలలో శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. డైనోసార్ శిలాజాలకు భౌగోళిక హాట్స్పాట్ అయిన సిచువాన్ బేసిన్లోని ప్రాంతమైన చాంగ్కింగ్లోని టోంగ్నాన్ జిల్లాలో నిర్మాణ పనుల సమయంలో ఈ అవశేషాలను మొదటిసారిగా 1998లో తవ్వారు. కానీ ఇటీవలే శాస్త్రవేత్తలు పీర్-రివ్యూడ్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో పూర్తి విశ్లేషణను ప్రచురించారు. పొడవాటి మెడ, తోక, చిన్న తల ఉండే శాకాహారి డైనోసార్ ఇది. అవశేషాలలో అవయవాలు, వెన్నుపూసలు ,భుజం ఎముకలు కూడా ఉన్నాయి. ఈ భాగాలు ఇది సౌరోపాడ్ సమూహం అయిన మామెన్చిసౌరిడేకు చెందినదని నిర్ధారించారు. గతంలో నమోదు చేయబడిన వాటి కంటే పొడవైన భుజం బ్లేడ్ పొడవు 1.8 మీటర్ల కంటే ఎక్కువ. ఇది డైనోసార్ల పరిమాణ పరిమితులను ప్రశ్నిస్తోందనీ, ఎందుకంటే ఇంత పెద్దవిగా పెరగడం చాలా కష్టమని భావిస్తున్నారు. అస్థిపంజరం సుయినింగ్ ఫార్మేషన్ రాక్ బెడ్ లోపల ఉంది. ఇది సుమారు 147 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. అక్కడ వరదలు సంభవించిన సంఘటనలు అక్కడ చాలా త్వరగా మృతదేహాలను పాతిపెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు.మూడు డోర్సల్ వెన్నుపూస, ఆరు కాడల్ వెన్నుపూస పూర్తి స్కాపులా , కోరాకోయిడ్ టిబియా, ఫైబులా, మెటాటార్సల్స్ మరియు గోళ్ల భాగాలు తదితరాలు ఈ తవ్వకాల్లో గుర్తించినవాటిల్లో ఉన్నాయి. డైనోసార్ ఇంత భారీ పరిణామంలో ఎలా?ఈ జంతువులు విపరీతమైన పరిమాణం ఇంత భారీ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటి? వాటి చిన్న పుర్రెలు, చాలా పొడవైన, సరళమైన మెడకు సపోర్ట్గా నిలవడంతోపాటు, కారగాలితో నిండిన ఎముకలు భారీ శరీరాన్ని చాలా తేలికగా ఉంచుతాయి. సమర్థవంతమైన శ్వాస వ్యవస్థలు వాటి లోపల ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరిచాయి. ఈ లక్షణాలు కాలక్రమేణా పరిమాణానికి బాటలు వేశాయి. నేడు కనిపించే ఆధునిక పక్షులలో కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయని అధ్యయనవేత్తలు అంటున్నారు. ఈ పరిణామ మిశ్రమం స్థిరమైన పెరుగుదలను ప్రోత్సహించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ జెయింట్స్ ఎలా వృద్ధి చెందాయో వివరించడానికి కొత్త శిలాజం సహాయపడుతుందట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అసలు అధ్యయన ప్రచురణలో పొందుపర్చారు. -
మెక్సికో 50 శాతం సుంకాలు, స్పందించిన చైనా
అమెరికా భారతదేశంపై చాలా వస్తువులపై 50 శాతం సుంకాలను విధించిన నాలుగు నెలల తర్వాత, అమెరికా పొరుగునే ఉన్న మెక్సికో కూడా ఈ వరుసలో చేరింది. భారతదేశం ,చైనాతో సహా ఆసియా దేశాల నుండి కొన్ని రకాల ఉత్పత్తుల దిగుమతిపై 50 శాతం వరకు సుంకాలను విధించింది. ఈ మేరకు మెక్సికో ఒక బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది. ఇవి 2026 జనవరి 1 నుండి అమల్లోకి వస్తాయి. ప్రతిపాదిత సుంకాల ద్వారా 3.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33,910 కోట్లు) అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. మెక్సికోతో వాణిజ్య ఒప్పందం లేని దేశాలు భారతదేశం, దక్షిణ కొరియా, చైనా, థాయిలాండ్ , ఇండోనేషియా వంటి దేశాలపై ప్రభావం చూపుతాయి. ఈ టారిఫ్స్పై చైనా స్పందించింది. ఏకపక్ష సుంకాల పెంపుదలను వ్యతి రేకిస్తున్నామని పేర్కొంది. మెక్సికో ఇలాంటి తప్పుడు పద్ధతులను త్వరగా సరిదిద్దుకోవాలని కోరింది. ఎందుకంటే 2024లో 130 బిలియన్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిన చైనా ఎక్కువగా ప్రభావితమవుతుంది.ఇండియాతో పాటు పలు దేశాలపై మెక్సికో 50 శాతం టారిఫ్లను విధించింది. ఆ దేశంతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం లేని ఇండియా, చైనా, దక్షిణ కొరియా, థాయ్లాండ్, ఇండోనేషియా వంటి దేశాలపై ఈ ప్రభావం పడనుంది. ప్రధానంగా ఆటో విడిభాగాలు, తేలికపాటి కార్లు, దుస్తులు, ప్లాస్టిక్లు, ఉక్కు, గృహోపకరణాలు, బొమ్మలు, వస్త్రాలు, ఫర్నిచర్, పాదరక్షలు, తోలు వస్తువులు, కాగితం, కార్డ్బోర్డ్, మోటార్సైకిళ్లు, అల్యూమినియం, ట్రైలర్లు, గాజు, సబ్బులు, పరిమళ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు వంటి వస్తువులపై సుంకాలు 5 నుంచి 50 శాతం అమలు కానున్నాయి. మెక్సికన్ ప్రభుత్వం ఆసియా దేశాల నుండి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనేది మెక్సికో ప్రధాన లక్ష్యం. మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ దేశ పరిశ్రమకు ఎక్కువ రక్షణ కల్పించాలని, దేశీయ ఉత్పత్తిని పెంచాలని భావిస్తున్నారు. ముఖ్యంగా చైనాతో దాని వాణిజ్య అసమతుల్యత గణనీయంగా ఉంది. ముఖ్యంగా భారత్నుంచి ఆటోమొబైల్స్ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. వీటి విలువ 1 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. వోక్స్వ్యాగన్, హ్యుండాయ్, నిసాన్, మారుతి సుజుకీ వంటి కంపెనీల ఎగుమతులపై ఈ ప్రభావం ఉండనుంది. కార్లపై టాక్స్ 20 శాతం నుంచి 50 శాతానికి పెరగనుంది. దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత మెక్సికోకు మూడో అతిపెద్ద కార్ల ఎగుమతి మార్కెట్ భారత్దే దీంతో భారతదేశంలోని అతిపెద్ద వాహన ఎగుమతిదారులకు భారీ షాక్ అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపాదిత సుంకాల పెంపు భారత ఆటోమొబైల్ ఎగుమతులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్న నేపథ్యంలో మెక్సికన్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా భారత ప్రభుత్వ మద్దతును కోరుతున్నామని సుంకం ఖరారు కావడానికి ముందు ఆటో ఇండస్ట్రీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. -
బాల్కనీకి వేలాడింది..
అది చైనాలోని ఒక నగరం. అందులో ఓ హై–రైజ్ అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు.. అకస్మాత్తుగా ఓ మహిళ బాల్కనీ నుంచి వేలాడటం కనిపించింది. అది చూసినవారంతా హడలిపోయారు. చెమటలు పట్టించిన ఈ దృశ్యం వెనుక కథ తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఒక వ్యక్తి భార్య లేని సమయంలో.. అతని ఇంటికి ప్రియురాలు వెళ్లింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో.. భార్య హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చేసింది. దీంతో భయపడిన ఆ వ్యక్తి.. తన ప్రియురాలిని దాచిపెట్టే ప్రయత్నంలో ఆమెను బాల్కనీలోకి నెట్టేశాడు. పది అంతస్తుల ఎత్తులో ఆ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేలాడటం మొదలుపెట్టింది. అది చుట్టుపక్కల వారు గమనించారు, పట్టు కోల్పోకుండా నిలబడటానికి ఆమె విఫలయత్నం చేసింది. ఇది గమనించిన వారు అరుపులతో, ఆందోళనతో గంటల తరబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంట్లో ప్రియుడు.. బయట ప్రియురాలు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ఫ్లాట్ లోపల ఉన్న ప్రియుడు.. కిటికీలోంచి ప్రియురాలితో ఏదో మాట్లాడటం కనిపించింది. ఇంతకీ ఆమె వేలాడటానికి కారణం ఏంటంటే... ఆ మహిళ ప్రియుడి భార్యకు దొరక్కుండా దాక్కోవడానికి ప్రయతి్నంచడమే.. తన భార్య రాగానే ప్రియుడు ఆ మహిళను హడావిడిగా బాల్కనీ వైపు నెట్టేశాడని, దాక్కోవాలని సూచించాడని స్థానిక మీడియా పేర్కొంది. పరువు పోతుందనే భయం.. ఆమెను చావు అంచుల్లోకి నెట్టింది. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళ చేతిలో ఫోన్ పట్టుకునే ఉంది. ఏం చేయాలో తోచక, చివరికి బలం తెచ్చుకుని.. డ్రైన్పైప్లను, కిటికీ అంచులను పట్టుకుని ధైర్యంగా కిందకు దిగడం ప్రారంభించింది. పక్కింట్లో ఆపద్బంధువు!భవనం పక్క గోడకు వేలాడుతూ, అతి కష్టం మీద ఓ వాటర్ పైప్ పట్టుకుని పక్క ఫ్లాట్ కిటికీ వైపు ఆమె జారింది. పక్క ఫ్లాట్ యజమాని కిటికీ తట్టగా.. చివరకు ఆ ఆపద్బాంధవుడు ఆమెను లోపలికి సురక్షితంగా లాగాడు. ఎట్టకేలకు ప్రాణాలను దక్కించుకున్నా.. ఈ సంఘటన మాత్రం ఆమె పరువును, ప్రియుడి పరువును నిలువునా బజారున పడేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్కు ‘బంగ్లా’ దౌత్య ద్రోహం.. పాక్, చైనాలతో జతకట్టి..
న్యూఢిల్లీ: పాకిస్తాన్-చైనా నేతృత్వంలోని కొత్త ప్రాంతీయ కూటమిలో చేరేందుకు బంగ్లాదేశ్ అమితమైన ఆసక్తి చూపిస్తున్నదనే వార్తలు ఇటీవలి కాలంలో విరివిగా వినిపిస్తున్నాయి. ఇది దక్షిణాసియాలో కీలక వ్యూహాత్మక మార్పును సూచిస్తున్నది. భారతదేశం లేకుండా, పాకిస్తాన్తో కలిసి ప్రాంతీయ కూటమిలో చేరడం బంగ్లాదేశ్కు వ్యూహాత్మకంగా సాధ్యమే అని బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఢాకా, బీజింగ్, ఇస్లామాబాద్లతో కూడిన కొత్త త్రైపాక్షిక సమూహంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సూచన చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది.యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారధ్యంలో..2024ఆగస్టులో షేక్ హసీనా పదవీచ్యుతి అనంతరం పాకిస్తాన్-బంగ్లాదేశ్ సంబంధాలు వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాల రంగాలలో విస్తరిస్తూ వస్తున్నాయి. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారధ్యంలో ఈ రెండు దేశాల మధ్య సహకారం పెరుగుతోంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం.. న్యూఢిల్లీ, బీజింగ్, వాషింగ్టన్లను నొప్పించకుండా సమతుల్య సంబంధాలను చాకచక్యంగా కొనసాగించింది. నాడు భారతదేశం ఒక కీలక భాగస్వామిగా ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితులలో ఢాకా.. ఇస్లామాబాద్, బీజింగ్ వైపు మొగ్గు చూపుతూ, భారత్తో సమతుల్య భాగస్వామ్యాన్ని కోల్పోయింది.చైనాలోని కున్మింగ్లో మంతనాలుఈ ప్రాంతీయ కూటమి చర్చలు గత ఏడాది నుండి వేగం అందుకున్నాయి. గత జూన్లో చైనా, బంగ్లాదేశ్,పాకిస్తాన్లు చైనాలోని కున్మింగ్లో తమ మొదటి అధికారిక త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, మౌలిక సదుపాయాలు , రుణ నిర్వహణలో సహకారాన్ని పెంపొందించేందుకు మూడు పక్షాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. మరోవైపు పాకిస్తాన్ తాజాగా భారతదేశాన్ని మినహాయించి, చైనాను భాగస్వామిగా చేర్చుకుంటూ, విస్తృతమైన దక్షిణాసియా కూటమిని ప్రతిపాదిస్తున్నది. ఈ నేపధ్యంలో ఇస్లామాబాద్- బీజింగ్ మధ్య ఈ అంశంపై చర్చలు జరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.‘త్రైపాక్షిక సంబంధం’తో కొత్త చిక్కులు?భారతదేశం కీలక సభ్యురాలిగా ఉన్న సార్క్ (SAARC) స్థానంలో కొత్త ప్రాంతీయ కూటమిని సృష్టించేందుకు పాకిస్తాన్- చైనాలు పనిచేస్తున్నాయనే వార్తలు కూడా కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యూహాత్మక కూటమి ఏర్పాటు దక్షిణాసియాలో చైనాకు పెరుగుతున్న ఆధిపత్యాన్ని స్పష్టంగా సూచిస్తున్నది. భారతదేశాన్ని మినహాయించి, చైనాను భాగస్వామిగా చేర్చుకుంటూ పాకిస్తాన్ ప్రతిపాదిస్తున్న ఈ కూటమి, కొత్త భౌగోళిక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.ఈ అభివృద్ధి చెందుతున్న త్రైపాక్షిక సంబంధం (బంగ్లాదేశ్-చైనా-పాకిస్తాన్) ప్రాంతీయ దౌత్యానికి, భవిష్యత్తులో దక్షిణాసియా కూటమికి చిక్కులను తీసుకువచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: Tamil Nadu: విజయ్-రంగస్వామి మెగా ప్లాన్.. -
‘సోషల్’స్వరాలు మూగబోయిన దేశాలు
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు.. జీవితంలో ఒక అంతర్భాగం. Facebook, Instagram, YouTube, X (గతంలో Twitter) తదితర ప్లాట్ఫారమ్లు కుటుంబ సభ్యుల ఫోటోలను పంచుకోవడం మొదలు.. సామాజిక ఉద్యమాలను నిర్వహించడం వరకు నెరవేరుస్తూ.. ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల పౌరులకు ఈ డిజిటల్ స్వేచ్ఛ అందుబాటులో లేదు. పలు దేశాలు జాతీయ భద్రత, నైతికత తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, సామాజిక నెట్వర్క్లపై కఠినమైన నిబంధనలను విధించడం లేదా పూర్తి నిషేధాలను కొనసాగించడం చేస్తున్నాయి. ఏఏ దేశాలు ఈ తరహా వైఖరిని కలిగివున్నాయి? ఎటువంటి చర్యలు చేపట్టాయనే వివరాల్లోకి వెళితే..చైనాలో ‘గ్రేట్ ఫైర్వాల్’ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఇంటర్నెట్ నియంత్రణలను అమలు చేస్తున్న దేశం చైనా. ‘గ్రేట్ ఫైర్వాల్’ విధానంతో Facebook, X, Instagram, YouTube వంటి ప్రధాన అంతర్జాతీయ ప్లాట్ఫారమ్లను చైనా పూర్తిగా బ్లాక్ చేసింది. దేశీయ ప్రత్యామ్నాయాలు (WeChat, Weibo వంటివి) ఉన్నప్పటికీ, అవి ప్రభుత్వ పర్యవేక్షణ, సెన్సార్షిప్కు లోబడి ఉంటాయి. జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వం పేరుతో ఈ ఆంక్షలను విధిస్తోంది. ఫైర్వాల్ను దాటేందుకు వీపీఎన్లను వాడటం సాంకేతికంగా చట్టవిరుద్ధం. ఫలితంగా జరిమానాలు లేదా నిర్బంధంలాంటి శిక్షలు ఉంటాయి.ఉత్తర కొరియా.. బాహ్య కమ్యూనికేషన్కు దూరం ప్రపంచ ఇంటర్నెట్ యాక్సెస్పై ఉత్తర కొరియా పూర్తి నిషేధం విధించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఏవీ ఈ దేశంలో అందుబాటులో లేవు. పౌరులకు విదేశీ వార్తలు లేదా బాహ్య కమ్యూనికేషన్కు ఎలాంటి యాక్సెస్ ఉండదు. దేశీయ కమ్యూనికేషన్ కోసం ప్రభుత్వం ఆమోదించిన కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వీటిలో కఠినంగా నియంత్రించిన ఇంటర్నెట్ను మాత్రమే ఉపయోగిస్తారు. బాహ్య ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేసే స్థానికులకు కఠిన శిక్షలు ఉంటాయి.ఇరాన్.. కానరాని అంతర్జాతీయ సోషల్ మీడియాఇరాన్ దేశం పలు అంతర్జాతీయ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది. Facebook, YouTube, X వంటివాటికి చాలా పరిమితమైన యాక్సెస్ ఉంటుంది. 2022 సామూహిక నిరసనల తర్వాత Instagramను కూడా నిషేధించారు. టెలిగ్రామ్, వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్లపై తరచూ నిబంధనలను విధిస్తుంటారు. ప్రజా నైతికత, జాతీయ భద్రత, నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించేందుకు ఈ ఆంక్షలు అవసరమని ప్రభుత్వం తెలిపింది. అయితే బ్లాక్ చేసిన ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేసేందుకు ఇరానియన్లు వీపీఎన్లపై ఆధాపడుతుంటారు. అటువంటి సందర్భాల్లో వారికి ప్రభుత్వం జరిమానాలు వడ్డిస్తుంటుంది. వీపీఎన్ అంటే ‘వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్’. దీని ద్వారా ఇంటర్నెట్ను రహస్యంగా వినియోగిస్తుంటారు.తుర్క్మెనిస్తాన్.. నిత్యం పర్యవేక్షణ తుర్క్మెనిస్తాన్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ యాక్సెస్కు అనేక పరిమితులున్నాయి. Facebook, వాట్సాప్, X వంటి ప్లాట్ఫారమ్లను తరచూ బ్లాక్ చేస్తుంటారు. అలాగే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రొవైడర్ల ద్వారా ఫిల్టరింగ్తో పర్యవేక్షిస్తుంటారు. వీపీఎన్ల ద్వారా బ్లాక్ చేసిన ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేయడం సర్వసాధారణం అయినప్పటికీ, ఇది జరిమానాలకు దారితీసే అవకాశం ఉంది.ఆఫ్ఘనిస్తాన్.. ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు పెరిగాయి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిత్యం నిఘా ఉంటుంది. కొన్ని ప్రావిన్సులలో అధికారులు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. నైతిక లేదా మతపరమైన పాలనా నియమాలకు విరుద్ధమైన కంటెంట్పై పూర్తి నిషేధం అమలులో ఉంది.టర్కీ.. జాతీయ విలువల కోసం.. దేశంలో రాజకీయ అశాంతి, నిరసనలు, భద్రతా సంక్షోభాల సమయంలో టర్కీ.. సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం విధిస్తుంటుంది. ఉగ్రవాద దాడులు, రాజకీయ ప్రదర్శనల సమయంలో వాట్సాప్, యూట్యూబ్, ‘ఎక్స్’ లాంటి ప్లాట్ఫారమ్లను కొన్ని రోజుల పాటు బ్లాక్ చేశారు. భద్రత, తప్పుడు సమాచారం నివారణ లేదా జాతీయ విలువలను కాపాడేందుకు ఇలా చేశామని అధికారులు తెలిపారు. టర్కీ చట్టాల ప్రకారం ఈ ప్లాట్ఫారమ్లు దేశంలో తమ ప్రతినిధులను నియమించాలి. స్థానికంగానే డేటాను నిల్వ చేయాల్సి ఉంటుంది.మయన్మార్.. తిరుగుబాటు తర్వాత.. 2021 ప్రారంభంలో జరిగిన తిరుగుబాటు తరువాత, మయన్మార్ సైనిక పాలన నిరసనలు లేదా అశాంతియుత కాలంలో సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లపై (ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మొదలైనవి) నిషేధం విధించింది. ఈ నిషేధం.. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకేనని ప్రభుత్వం తెలిపింది. రష్యా.. వీడియో కాలింగ్పై నిషేధంరష్యాలో సోషల్ మీడియాపై నిషేధాలు తక్కువే అయినప్పటికీ, పలు పరిమితులు ఉన్నాయి. చట్ట అమలుకు సహకరించడం లేదనే ఆరోపణలతో WhatsApp, టెలిగ్రామ్ వంటి విదేశీ మెసేజింగ్ యాప్లలోని వాయిస్ లేదా వీడియో కాలింగ్ ఫీచర్లు పరిమితం చేశారు. ఆయా ప్లాట్ఫారాలు స్థానిక కార్యాలయాలను తెరవాలని, తీవ్రవాద కంటెంట్ను నియంత్రించాలని రష్యా డిమాండ్ చేస్తున్నది.నేపాల్.. పునరాలోచనసోషల్ మీడియా కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో విఫలం కావడంతో Facebook, Instagram, YouTube, ‘ఎక్స్’ తో సహా 26 ప్రధాన ప్లాట్ఫారమ్లపై నిషేధాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం నిరసనలకు దారితీసింది. దీంతో ఈ నిషేధాన్ని కొద్ది రోజుల్లోనే ఎత్తివేశారు. అయితే ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తున్నదని సమాచారం.ఇది కూడా చదవండి: వణికిస్తున్న సూపర్ఫ్లూ.. రికార్డు స్థాయి కేసులు -
అమెరికా టారిఫ్స్: చరిత్ర సృష్టించిన చైనా..!
అమెరికా టారిఫ్లు చైనా వాణిజ్య జైత్రయాత్రకు బ్రేకులు వేయలేకపోయాయి. ప్రపంచ దేశాలతో వాణిజ్యం ఎలా చేయాలో తనను చూసి నేర్చుకోండన్నట్టుగా.. డ్రాగన్ వాణిజ్య మిగులును అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.90 లక్షల కోట్లు) వాణిజ్య మిగులును సాధించిన తొలి దేశంగా చైనా చరిత్రను సృష్టించింది.ఈ ఏడాది చైనా 3.6 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, ఇదే సమయంలో 2.6 ట్రిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. 2010లో ప్రపంచ దేశాలతో చైనా వాణిజ్య మిగులు 0.18 ట్రిలియన్ డాలర్లుగానే ఉంది. 2015 నాటికి 0.59 ట్రిలియన్ డాలర్లు, 2025 నాటికి 1.08 ట్రిలియన్ డాలర్లకు పెంచుకోవడం ద్వారా తయారీలో సూపర్ పవర్గా కొనసాగుతోంది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగానే చైనాపై టారిఫ్లు బాదేయడం తెలిసిందే. ఈ టారిఫ్ల కారణంగా అమెరికాకు చైనా వస్తు ఎగుమతులు నవంబర్లో 29 శాతం పడిపోయాయి. వరుసగా ఎనిమిదో నెల చైనా నుంచి యూఎస్కు ఎగుమతులు క్షీణతను చూశాయి. అమెరికా బెదిరింపులకు డ్రాగన్ ఏమాత్రం బెదరలేదు. సరికదా తన వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకోవడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. -
130 అడుగుల కొండ, వయ్యారంగా సెల్ఫీ..కట్ చేస్తే
పర్యాటక ప్రదేశానికి వెళ్లినపుడు, అక్కడి ప్రకృతిని ఆస్వాదించడం కంటే, సెల్పీ తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం పైనే దృష్టి. ప్రాణాలకు తెగించి మరీ సెల్ఫీ తీసుకునేటపుడు పొంచి ఉన్న ప్రమాదాలపై ఎన్నిమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ ఈ ధోరణి మాత్రం మారణం లేదు. అత్యంత ప్రమాదకరమైన 130 అడుగులు కొండపై నుంచి నడుస్తున్నపుడు సెల్ఫీ తీసుకుంటూ జారీ పడ్డాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.ది సన్ కథనం ప్రకారం, చైనాలోని గ్వాంగ్'ఆన్లోని హువాయింగ్ పర్వతంపై ఈ సంఘటన జరిగింది. బ్లేడ్ రాక్ అనే పర్యాటక ప్రదేశంలోని 130 అడుగుల కొండ శిఖరం వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారి పడిన పర్యాటకుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్గా మారింది. దీని ప్రకారం అతను ఫోన్ పట్టుకుని కొండ అంచున నడుస్తున్నాడు. రాళ్లపై తన అడుగులు ఎక్కడ పడుతున్నాయో చూసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. సెల్పీ కోసం ఇటు తిరిగాడు. అంతే క్షణాల్లో, అతని పాదాల కింద ఉన్న రాయి జరిగిరి, అదుపు తప్పి, ఠక్కున జారిపడ్డాడు. అలా కింద ఉన్న చెట్ల పొదలలోకి పడిపోయాడు.ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్ఇది చూసి తోటి హైకర్లు దెబ్బకి షాక్అయ్యారు. కేకలు పెడుతూ కొండ అంచున పరుగులుపెట్టారు. కానీ పడిపోయిన వ్యక్తి దాదాపు 15 మీటర్ల ఎత్తులో ఉన్న అడవిలో పడిపోయాడు. ఆ భయంకరమైన జలపాతం నుండి తీవ్రమైన గాయాలు లేకుండా , ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.⚠️ Important Video shows the terrifying moment as a tourist, in China, plunges off a 130ft high cliff while taking a selfie pic.twitter.com/0chRYp0Ban— Open News© (@OpenNewNews) December 8, 2025 ఆ దేవతలే కాపాడారు ఈ విషయాన్ని సదరు పర్యాటకుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ WeChatలో పోస్ట్ చేశాడు. చచ్చిపోతాననే అనుకున్నా.. కానీ ఆ పర్వత దేవతలే నన్ను ఆశీర్వదించారు. చాలా అదృష్టవంతుడిని. 40 మీటర్ల ఎత్తైన కొండపై నుండి పడి దాదాపు 15 మీటర్లు వాలుపైకి దొర్లాను అని రాసుకొచ్చాడు. మరోవైపు ప్రమాదం జరిగిందని చెబుతున్న బ్లేడ్ రాక్ ర్యాటక ప్రదేశం సుందరమైన ప్రాంతం , సరిహద్దుల్లో లేదు. వారు ఈ ప్రాంతాన్ని "దూరం నుండి మాత్రమే వీక్షించడానికి అనుమతి ఉంది , ఎక్కడానికి అనుమతి లేదు అని చెప్పారు అధికారులు. హైకింగ్ చేస్తున్నప్పుడు నిబంధనలను పాటించాలని, ఇలాంటి ప్రమాదకరమైన ప్రాంతాలలోకి ప్రవేశించకూడదని సందర్శకులకు గుర్తు చేశారు.ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు -
ఆ విపత్తు ముడివేసిన వైవాహిక బంధం..!
కొన్ని వివాహాలు విధి ఆడిన వింత నాటకంలా ఉంటాయి. డెస్టినీ అంటారే అలా..ఒకరితో మనకు రాసిపెట్టి ఉంటే..ఎలాగైనా..ఎన్నేళ్లైనా..మళ్లీ ఒక్కచోటుకి చేర్చి కలిపేస్తుంది.అందుకు నిదర్శనం ఈజంట. బహుశా వీళ్లిద్దరిని విధి ముడివేసిన జంట అనొచ్చేమో. కాదు కాదు.. విపత్తు ముడివేసిన జంట అనాలేమో..!.అసలేం జరిగిందంటే..నవంబర్ 29న హునాన్ ప్రావిన్స్లో ఐదవ వార్షిక హాన్ శైలి సామూహిక వివాహ వేడుక సందర్భంగా 37 జంటలు వైవాహిక బంధంతో ఒక్కటికానున్నాయి. ఆ నేపథ్యంలో ఓ జంట కథ వెలుగులోకి వచ్చింది. లియాంగ్ జిబిన్, లియు జిమెయ్ అనే జంట 15 ఏళ్లక్రితం అసాధారణ పరిస్థితుల్లో ప్రారంభమైన తమ లవ్స్టోరీని పంచుకున్నారు. రెండు జీవితాలను మార్చిన రక్షణ బాధ్యత..2008లో వెంచువాన్లో భూకంపం సంభవించినప్పుడు 22 ఏళ్ల లియాంగ్ అత్యవసర సహాయక చర్యల కోసం సైనికుడిగా పనిచేస్తున్నాడు. అప్పటికి పది సంవత్సరాల వయసున్న లియు, ఒక కూలిపోయిన భవనం రెండొవ అంతస్తులో ఉక్కు కడ్డీలు, ఇటుకల కింద చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ ఉంది. అది చూసిన లియాంగ్ అతడి బృందం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను కాపాడారు. ఆ తర్వాత చికిత్స కోసం తక్షణమే ఆస్ప్రతికి తరలించారు. అయితే ఆ చిన్నారి కోలుకున్నాక తన తల్లిదండ్రులతో కలిసి హునాన్లోని జుజౌకు వెళ్లిపోయారు. అయితే తనను కాపాడిని సైనికుడి గురించి ఏదో స్పల్ప జ్ఞాపకమే ఉందామెకు. అదీగాక ఆ ఘటన జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతగా ఆ సైనికుడి ముఖం అంతగా గుర్తులేదామెకు. అయితే 2020లో 22 ఏళ్ల లియు చాంగ్షాలో తన తల్లిదండ్రులతో భోజనం చేస్తున్నప్పుడు ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాళ్ల టేబుల్కి సమీపంలోని మరో టేబుల్ వద్ద కూర్చొన్న వ్యక్తిని చూసి లియు తల్లి గుర్తుపట్టి పలకరించింది. "మీరు మా బిడ్డ లియుని కాపాడిన బ్రదర్ లియాంగ్ మీరేనా అని అడుగుతుంది. పదేళ్ల వయసులో ఆ అమ్మాయి కాస్తా చాలా మారిపోవడంతో గుర్తుపట్టలేక ఇబ్బందిపడతాడు లియాంగ్. ఆ ఘటన గుర్తుంది కానీ ఆ చిన్నారి రూపు రేఖలు చాలా మారిపోవడంతో పోల్చుకోలేకపోతున్నానని చెబుతాడు లియు తల్లితో". అప్పటి నుంచి లియు ఆ సైనికుడు లియాంగ్తో క్రమంతప్పకుండా మాట్లాడుతూ ఉండేది. ఆమె భావల లోతుని అర్థం చేసుకుంటాడు లియాంగ్. అంతేగాదు లియుకి కూడా అతడి దృఢత్వం, విధేయత ఎంతగానో నచ్చుతాయి. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.లియుని తన జీవితంలోని ఆశాకిరణంగా భావిస్తాడు లియాంగ్. తాను నిరుత్సాహంగా ఉన్నప్పుడల్లా లియు సానుకూలత తనను పైకి లేపుతుందని ప్రగాఢంగా విశ్వసించడమే కాదు జీవితంటే ఆశతో నిండి ఉందని గుర్తు చేస్తుంటాదామె అని భావోద్వేగంగ చెబుతున్నాడు లియాంగ్ విధి ముడివేసిన బంధం..తమ జర్నీ గురించి చెబుతూ..విధి చాలా అద్భుతమైనది. పన్నేడేళ్ల క్రితం ఆమెను రక్షించాను. పన్నేండేళ్ల తర్వాత ఆమె నా జీవితంలోకి వచ్చింది. భలే చిత్రంగా ఉంది తలుచుకుంటుంటే అని నవ్వుతూ చెబుతున్నాడు లియాంగ్.(చదవండి: ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్..! అంత ఖరీదా..?) -
ఆ విషయంలో చైనా స్పష్టతనివ్వాలి
ఇటీవల చైనా షాంగై ఎయిర్ పోర్టులో ఇండియాకు చెందిన ఓ మహిళను చైనా అధికారులు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఆ విషయంపై చైనాను వివరణ కోరింది. భారతీయులు చైనా దేశం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని తెలిపింది. ఈ మేరకు డ్రాగన్ దేశం నమ్మకం కలిగేలా హామీ ఇవ్వాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తరచుగా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటుంది. ఆ ప్రాంతం చైనాదేనని చెప్పడం అంతేకాకుండా ఆదేశ మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్ భాగంగా చూపడంతో తరచుగా ఈ అంశంలో ఇరు దేశాలకు ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఓ మహిళ యూకే నుండి జపాన్ ప్రయాణిస్తుండగా మార్గం మద్యలో షాంఘై విమానాశ్రయంలో ఆగింది. ఆసమయంలో అక్కడి ప్రభుత్వాలు ఆమె అరుణాచల్ ప్రదేశ కు మహిళ అని తెలిసి తనను వేధించారని తెలిపింది. అంతే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనాలో భాగం అన్నారని పేర్కొంది. ఈ ఘటనను భారత్ ఆసమయంలోనే ఖండించింది.తాజాగా భారత్ చైనాను ఒక వివరణ కోరింది. భారత విదేశాంగ కార్యదర్శ రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ " భారతీయులు చైనా మీదుగా వెళ్లేటప్పుడు వారినే టార్గెట్ గా చేసుకొని ఇబ్బందులు పెట్టమని చైనా తెలపాలి. ఆ మేరకు నమ్మకం కలిగేలా అధికారులు ప్రకటన చేయాలి. ఇష్టానుసారంగా వ్యవహరించకుండా అంతర్జాతీయ ప్రయాణ చట్టాలను గౌరవించాలి. చైనా మీదుగా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు భారతీయులు జాగ్రత్తగా ఉండాలి" అని రణధీర్ జైశ్వాల్ తెలిపారు.అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని ఇది వరకే చాలా సార్లు భారత్ చెప్పింది. దాని గురించి మరోసారి మాట్లాడదలుచుకోలేదని రణధీర్ జైశ్వాల్ అన్నారు. అయితే ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని సహృద్భావ వాతరణంలో ఇరు దేశాల మైత్రి సాగుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. -
చైనానే ఆదర్శం 3 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తాం.. స్ట్రాటజీ బయటపెట్టిన రేవంత్ రెడ్డి
-
భారత్, చైనాలు మా సన్నిహిత మిత్రులు
బీజింగ్: భారత్, చైనాలు తమకు సన్నిహిత మిత్రదేశాలంటూనే ఆ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు తమకు లేదన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలను చైనా మీడియా ప్రముఖంగా ప్రచురించింది. పుతిన్ భారత్ పర్యటనకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వని చైనా ఈ విషయాన్ని మాత్రం హైలైట్ చేసుకుంది. రష్యాకు ఇటీవలి కాలంలో బాగా దగ్గరైన చైనా భారత్లో పుతిన్ పర్యటనపై అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ‘భారత్, చైనా రెండు కూడా మాకు సన్నిహిత మిత్రులే. ఆ సంబంధాన్ని మేము ఎంతగానో గౌరవిస్తాం.ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు మాకుందని నేను భావించడం లేదు’అని పుతిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్, చైనా నేతలు తమ మధ్య ఉన్న అత్యంత సున్నితమైనవి సహా అన్ని విభేదాలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉన్నారు. వీటిపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరేలా ఇద్దరు నేతలు ప్రయతి్నస్తారని నమ్మకం ఉంది. అదే సమయంలో, ఆ సమస్యలు రెండు దేశాలకు సంబంధించినవి అయినందున రష్యాకు కలుగజేసుకునే హక్కు లేదు’అని ఆయన చెప్పిన విషయాన్ని చైనా మీడియా ప్రస్తావించింది. రష్యాతో సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగా ఉన్న చైనా.. భారత్, రష్యాలు దగ్గరవడంపై మాత్రం అసహనంతో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.చైనాతో సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేసుకుంటూనే, భారత్తోనూ ఎప్పటిలాగానే మైత్రిని కొనసాగించారు పుతిన్. 2020లో లద్దాఖ్లో ఉద్రిక్తతల సమయంలోనూ ఇదే విధమైన బ్యాలెన్స్ను పుతిన్ కొనసాగించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. దీంతోపాటు, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ట్రంప్ ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడులపై పుతిన్ చేసిన వ్యాఖ్యలను కూడా చైనా మీడియా ప్రస్తావించింది. తమ నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అమెరికాకు, భారత్ చమురు కొనడంపై ఎందుకు అభ్యంతరమని పుతిన్ ప్రశ్నించారని కూడా తెలిపింది. ప్రస్తావించాల్సిన అంశమేమంటే..భారత్లో పర్యటనకు కొద్దిరోజుల ముందే చైనా, రష్యాలు ఆసియా పసిఫిక్తోపాటు పొరుగుదేశాల్లో భద్రతా పరమైన ప్రయోజనాలే లక్ష్యంగా వ్యూహాత్మక చర్చలు జరపడం..! -
వీల్పవర్ యాంకర్
కొన్ని విజయగాథలు ఎలా ఉంటాయంటే చక్రవర్తుల గెలుపులు కూడా దాని ముందు వెలవెలబోతాయి. చైనా అమ్మాయి లియాంగ్ యీ జీవితం వీల్చైర్కే పరిమితం. అయినా సరే రెండు చక్రాలు కదిలితేనే తన జీవితం కదిలేలా ఉండకూడదు అనుకుంది. ప్రయత్నించింది. పోరాడింది. నేను నాలానే ఉంటూ యాంకర్ అవగలను అని నమ్మి ప్రపంచాన్ని ఒప్పించింది. చైనా మొదటి వీల్చైర్ యాంకర్ లియాంగ్ స్ఫూర్తి గాథ నేడు ప్రత్యేకం.పట్టు పట్టనేకూడదు. పడితే విడవనూ కూడదు. అంతరాయాల అడ్డుగోడలను బద్దలుకొట్టి ముందుకు సాగడమే పని. లియాంగ్ను చూడండి. తను టీవీలో యాంకర్గా పని చేయాలనుకుంది. యాంకరే అయింది. అయితే ఆమెను విధి వీల్చైర్కు పరిమితం చేసింది. అయినా సరే మళ్లీ యాంకరే అయ్యింది. కాకపోతే ఈసారి వీల్చైర్ యాంకర్. గ్లామర్ రంగంలో వీల్చైర్తో ముందుకు వచ్చి స్క్రీన్ మీద కనపడి ఒప్పించడానికి చాలా స్థయిర్యం ఉండాలి. ఆ స్థయిర్యంతోనే చైనాలో ఫస్ట్ వీల్చైర్ యాంకర్గా గౌరవం పొందుతోంది లియాంగ్.ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే..చైనాలోని హునాన్లో జన్మించిన లియాంగ్కు ఒకటే కోరిక. టీవీ వ్యాఖ్యాతగా మారాలి అని. ఆ విధంగానే చదువు పూర్తి చేసి చైనాలో ప్రసిద్ధి చెందిన ‘హ్యూమన్ టీవీ’లో యాంకర్గా ఉద్యోగం సంపాదించుకుంది. చలాకీతనం, చక్కని చిరునవ్వు కలగలిసిన ఆమె యాంకరింగ్ అందర్నీ ఆకట్టుకుని ఈ రంగంలో ఆమె రాణిస్తుందని భావించేలా చేసింది. కానీ నాలుగు నెలల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఓ ్రపోగ్రామ్కి సిద్ధమవుతున్న సమయంలో స్టేజీ వెనుక ఆమె స్పృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆమె వెన్నెముకలో సమస్య కారణంగా నాడీవ్యవస్థ దెబ్బతిని పక్షవాతం సోకినట్లు వైద్యులు వివరించారు. దీంతో లియాంగ్ ఆశల ప్రపంచం కుప్పకూలిపోయింది. భవిష్యత్తు అంధకారంగా మారింది.ఆసుపత్రిలో చూపిన ఆదరణతో..అప్పటికి లియాంగ్ వయసు 21. జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితం కావాలన్న నిజాన్ని తట్టుకోవడం ఆమెకు కష్టమైంది. అతి కష్టం మీద చికిత్స వల్ల ఆమె ఛాతీ పైభాగంలో కదలికలు వచ్చినా కింద భాగమంతా పక్షవాతం నుంచి కోలుకోలేకపోయింది. తనకా జీవితం వద్దని, తొందరగా మృత్యువును చేరుకుంటే బాగుండునని లియాంగ్ భావించింది. తీవ్ర నిర్వేదానికి గురైంది. అయితే ఆసుపత్రిలో ఇతర రోగుల తీరు ఆమెలో మార్పు తెచ్చింది. అక్కడందరూ ఆమెను ప్రేమతో చూసేవారు, పలకరించేవారు, తమ కష్టాలను ఆమెకు వివరించేవారు. ఈ ప్రపంచంలో తనకు మాత్రమే కష్టాలు లేవని, అందరూ ఏదో ఒక రకమైన కష్టంతో బాధపడుతున్నారని లియాంగ్కు అర్థమైంది.తల్లి సహకారంతో మున్ముందుకు..‘ఎవరూ నా మీద జాలిపడటం నాకు ఇష్టం లేదు. నన్ను అందరితో సమానంగా చూడండి. అదే నాకు ఇష్టం’ అంటారు లియాంగ్. గత పదేళ్లుగా ఆమె అనేక టీవీ, రేడియో కార్యక్రమాల్లోపాల్గొన్నారు. పుస్తకాలు రాశారు. అనేక కార్యక్రమాల్లో తన జీవితం గురించి వివరించి తోటివారితో స్ఫూర్తి నింపారు. ఇవాళ్టికీ టీవీలో కార్యక్రమం ఉందంటే మూడు గంటల ముందే ఇంటి నుంచి బయలుదేరి స్టూడియోకు చేరుకుంటారు. ‘పనిలో చిన్న ΄÷రపాటు జరగడం కూడా నాకు ఇష్టం ఉండదు.అందుకే అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకుంటాను’ అంటారామె. ఆమె రోజూ వచ్చి పని చేసేందుకు తల్లి అండగా నిలబడ్డారు. లియాంగ్ కోసం వీల్ చెయిర్ మోసుకొస్తూ, అనేకమార్లు సహాయకురాలిగా వ్యవహరించారు. తన తల్లి తనకు అందించే మద్దతు వల్లే తాను తిరిగి ఈ స్థాయిలో ఉన్నానని అంటారు లియాంగ్. ‘పని లేకపోతే నా స్థితి నాకింకా గుర్తుకొచ్చి ఇబ్బంది పెడుతుంది. పనిలో పడితే నా ఇబ్బందిని పూర్తిగా మర్చిపోతాను. ఉత్సాహంగా పని చేస్తాను’ అంటున్నారు లియాంగ్. ఆలోచనలను మార్చిన చైనీస్ రచయితలియాంగ్ ఆరోగ్యం కొంత మెరుగైన తర్వాత ప్రఖ్యాత చైనీస్ రచయిత షి టీషెంగ్ని కలిసింది. ఆయన కూడా ఒక ప్రమాదం కారణంగా 21 ఏళ్లకే చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. అయితే తనలోని ప్రతిభను ఆ సమస్య అడ్డుకోలేదని నిరూపిస్తూ అనేక పుస్తకాలు రాశారు. ఆయన లియాంగ్కి కౌన్సెలింగ్ ఇచ్చారు. జీవితం ఇక్కడితో ముగిసిపోలేదని, భయపడి పారిపోవడం విజేతల లక్షణం కాదని హెచ్చరించారు. దీంతో లియాంగ్ ఆలోచనల్లో మార్పు మొదలైంది. కష్టపడి చదివి, బ్రాడ్ కాస్టింగ్ అండ్ హోస్టింగ్లో మాస్టర్స్ పూర్తి చేసింది. తిరిగి టీవీ ముందుకు వచ్చి‘వీల్చెయిర్ యాంకర్’గా తన ప్రత్యేకత చాటుకుంది. -
పాక్తో పాటు చైనా వెన్నులో వణుకు పుట్టేలా..
బెలూచిస్తాన్ రీజియన్లో గత 10 రోజులుగా నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెబల్ గ్రూప్స్ వరుస దాడులతో పాక్ సైన్యం వణికిపోతోంది. తాజాగా బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ మునుపెన్నడూ లేని రీతిలో కొత్త తరహా దాడికి దిగింది. ఈ దాడిలో భారీగానే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.జరీనా రఫీయా అలియాస్ ట్రాంగ్ మహూ.. బెలూచ్ వేర్పాటువాద సంస్థల దృష్టిలో ఆమె వీర మహిళ. చగయ్ సమీపంలో చైనా మైనింగ్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం ఓ బాంబుతో ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో చైనాకు ఆస్తినష్టం జరపడంతో పాటు ఆరుగురు పాక్ సైనికుల మరణించారు. అందుకే.. ఆమె త్యాగాన్ని అంతగా కీర్తిస్తున్నారు.బీఎల్ఎఫ్ ఈ తరహా మానవ బాంబు దాడులకు(fidayeen strike) దిగడం ఇదే తొలిసారి. అందునా ఒక మహిళతో దాడి చేయించడంతో ప్రముఖంగా నిలిచింది. ఈ మేరకు మహూ ఫొటోను టెలిగ్రామ్ ద్వారా రిలీజ్ చేసింది.చగయ్ జిల్లాలో చైనా అతిపెద్ద రాగి, బంగారపు మైన్ కార్యాకలాపాల సంబంధిత కార్యాలయాన్ని నెలకొల్పింది. ఇందుకోసం అక్కడ పాక్ భారీగా సైన్యాన్ని మోహరించింది. మహూ తొలుత ఆత్మాహుతి దాడి జరిపి కాపలాగా ఉన్నవాళ్లను హతమార్చింది. ఆపై రెబల్స్లోకి ప్రవేశించి తమ దాడిని సులువుగా కొనసాగించారు. అయితే ఈ దాడిలో తమ సైనికులు మరణించిన విషయాన్ని పాక్ సైన్యం ధృవీకరించలేదు.మరో వైపు.. ఈ మధ్యకాలంలో జరిగిన వరుస దాడులు తమ పనేనని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) ప్రకటించుకుంది. ఈ దాడుల్లో పాక్ ఇంటెలిజెన్స్.. ఆర్మీ అధికారులు పలువురు మరణించారు.ఎందుకీ దాడులంటే..బెలూచిస్తాన్లో తిరుగుబాట్లు (Baloch Insurgency) దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా జాతి స్వతంత్రత, వనరుల దోపిడీ, రాజకీయ నిర్లక్ష్యం, మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి కారణాలతో ఇవి మొదలయ్యాయి. నెమ్మదిగా.. చైనా పెట్టుబడులు (CPEC ప్రాజెక్టులు), పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడుల రూపంలో మరింత తీవ్రమవుతున్నాయి. BLA (Baloch Liberation Army), BLF (Baloch Liberation Front) వంటి గ్రూపులు చైనా ప్రాజెక్టులు, పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇందుకోసం చైనా ప్రాజెక్టులపై దాడులు, తాత్కాలిక భూభాగం ఆక్రమణలు.. ఇప్పుడు ఏకంగా సూసైడ్ దాడుల్లాంటి వ్యూహాలు అవలంబిస్తున్నాయి.ప్రధాన కారణాలు ఏంటంటే..బలూచిస్తాన్లో గ్యాస్, ఖనిజాలు, పోర్టులు ఉన్నప్పటికీ స్థానికులకు లాభం తక్కువ(ఆర్థిక దోపిడీ). వీటికి తోడు.. స్థానిక నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం(రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం). పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దాడులు, అపహరణలు, జాతి స్వతంత్రత(మానవ హక్కుల ఉల్లంఘనలు).. బలూచ్ జాతి వేర్పాటువాద పోరాటం.. చైనా పెట్టుబడులు (CPEC) పెడుతుండడాన్ని అక్కడి వాళ్లు భరించలేకపోతున్నారు. అందుకే తిరుగుబాటు గ్రూపుల ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు మారాయి. ఇది సాధారణంగానే పాక్ సైన్యంతో పాటు చైనాకు గుబులు పుట్టిస్తోంది.బలూచిస్తాన్ తిరుగుబాట్ల చరిత్ర👇మొదటి తిరుగుబాటు (1948): ఖాన్ ఆఫ్ కలాత్ పాకిస్తాన్లో విలీనాన్ని వ్యతిరేకించడంతో ప్రారంభమైంది.రెండో దశ తిరుగుబాటు (1958–59): భూస్వామ్యం, స్వతంత్రత డిమాండ్లతో మళ్లీ అల్లర్లు.మూడో దశ తిరుగుబాటు (1962–63): గిరిజన నాయకులు, పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు..నాలుగో దశ తిరుగుబాటు (1973–77): పెద్ద ఎత్తున సైనిక చర్యలు, వేలాది మరణాలు..ఐదో దశ తిరుగుబాటు (2004–ప్రస్తుతం): అత్యంత దీర్ఘకాలంగా.. ప్రస్తుతం కొనసాగుతున్నాయి. -
చైనా ప్రభుత్వాన్ని వణికిస్తున్న రోబోలు!
రోబోటిక్స్ టెక్నాలజీలో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న చైనా ప్రభుత్వాన్ని ఇప్పుడవే రోబోలు వణికిస్తున్నాయి. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసే కంపెనీల వేగవంతమైన విస్తరణ ఆ దేశ అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళిక సంస్థను ఆందోళనకు గురిచేస్తోంది.ఏకంగా 150 కి పైగా కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోల తయారీలోకి దిగడంతో పరిశ్రమ వేడెక్కే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.మార్కెట్లోకి ఒకేవిధమైన రోబోలు ఇబ్బడిముబ్బడిగా రావడంపై చైనా అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళికా సంస్థ నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ (ఎన్డీఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ ప్రతినిధి లీ చావో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "వేగం, బుడగలు ఎల్లప్పుడూ ఎదుర్కోవాల్సిన సమస్యలు" అని వ్యాఖ్యానించారు.ఈ రోబో తయారీ కంపెనీలలో సగానికి పైగా ఇతర పరిశ్రమల నుండి రోబోటిక్స్ లోకి విస్తరించిన ఇటీవలి స్టార్టప్ లు లేదా సంస్థలే కావడం గమనార్హం. ఈ వైవిధ్యం ఒకప్పుడు ఆవిష్కరణకు ఒక వరంగా కనిపించినప్పటికీ, ఒకే లాంటి ఆవిష్కరణలు మార్కెట్ ను ముంచెత్తితే నిజమైన పరిశోధన, అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎన్డీఆర్సీ హెచ్చరిస్తోంది. దీనిపై ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ కూడా ఇప్పటికే హెచ్చరించారు.చైనాలో రోబోలు ఎందుకింతలా పెరుగుతున్నాయి..?హ్యూమనాయిడ్ రోబోటిక్స్ ను "మూర్తీభవించిన ఏఐ"గా పేర్కొంటున్న చైనా భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి కీలకమైన చోదకంగా ప్రకటిస్తూ ఈ రంగాన్ని పెంపొందించడానికి ప్రోత్సాహకాలు, నిధులు, విధానపరమైన మద్దతును అందిస్తోంది. దీంతో ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. కొత్త కంపెనీలు, పెట్టుబడులు వరదలా పోటెత్తున్నాయి. అనేక సంస్థలు వీలైనంత త్వరగా హ్యూమనాయిడ్ మోడళ్లను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ పరుగులు దాదాపు సారూప్య - రోబోల విస్తరణకు దారితీస్తున్నాయి.ముఖ్యంగా కంపెనీలు తయారు చేసిన రోబోల డెమోలు, ప్రోటోటైప్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ అవి కర్మాగారాలు, గృహాలు లేదా ప్రజా సేవలలో పెద్ద ఎత్తున వినియోగించదగిన రోబోలుగా మాత్రం అందుబాటులోకి రావడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. హైప్, వాస్తవ యుటిలిటీ మధ్య అసమతుల్యత.. డిమాండ్ కార్యరూపం దాల్చడంలో విఫలమైతే బూమ్ కుప్పకూలుతుందనే భయాలను పెంచింది. -
పేరులో ఏముంది? విడాకుల వరకూ తీసుకెళ్లింది
కసి ఉండటానికి కారణాలు అవసరం లేదు కానీ, విడిపోవడానికి చాలా వెతుక్కోవచ్చు. తమ పిల్లాడికి పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయం లేక చైనాలో ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. షాంఘైలోని పుడాంగ్ న్యూ ఏరియాలో ఓ జంటకు 2023లో వివాహమైంది. మరుసటి ఏడాది బాబుకు జన్మనిచ్చారు. అయితే, ఆ పిల్లాడి నామకరణం పెద్ద రణంగా మారింది. నేను చెప్పిన పేరే పెట్టాలని ఇరువురూ పట్టుబట్టారు. చివరకు కలిసి ఉండలేం అని కోర్టుకెక్కారు. కేసు పూర్వాపరాలు చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. బాబుకు ఏడాది వయసు దాటినా ఇంకా జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడం, పేరు పెట్టకపోవడం వల్ల టీకాలు వేయడానికీ కుదరకపోవడం మైనర్ హక్కుల ఉల్లంఘనే అని హెచ్చరించారు. భావోద్వేగ సంఘర్షణలలో పిల్లలను బేరసారాలుగా ఉపయోగించకూడదని మందలించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయానికి రావాల్సిందేనని చెకప్పారు. ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేరులో ఏముంది అని అంటారు.. కానీ ఎంత ఉందో చూశారా? -
చైనాలో ఘోర రైలు ప్రమాదం
చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో 11మంది రైల్వే సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి గాయాలయినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ కున్మింగ్ నగరంలో ఘోరరైలు ప్రమాదం జరిగింది. భూకంపాల గుర్తింపును పరీక్షిస్తున్న ఒక టెస్ట్ ట్రైన్, రైలు ట్రాక్ పై విధులు నిర్వహిస్తున్న రైల్వే సిబ్బందిపై పట్టాలు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారని, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ మీడియా సంస్థలు తెలిపాయి. దీంతో ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.ఈ రైలు ప్రమాదం దశాబ్ద కాలంగా చైనాలో జరిగిన రైలు ప్రమాదాలలో అతి పెద్దదని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2011లో చివరిసారిగా ఒక భారీ ట్రైన్ ప్రమాదం జరిగిందని ఆ ఘటనలో 40 మంది మృతిచెందగా 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.Train Crash in China Kills 11 After Test Engine Ploughs Into Maintenance CrewThe deadly incident occurred along a curved section of track at Luoyangzhen station in Kunming, the capital of Yunnan province, early on Thursday morning.Two other workers were injured in the crash.… pic.twitter.com/gKNDQtNJFt— RT_India (@RT_India_news) November 27, 2025 -
ప్రియమైన కుమారుడికి మీ అమ్మ వ్రాయునది...
తన టీనేజ్ కుమారుడు అదేపనిగా ఫోన్లో మునిగివడం, ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఆ తల్లిని బాగా బాధ పెట్టింది. మందలిస్తే ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడింది. అయితే తన మనసులోని ఆవేదనను మాత్రం ఒక కాగితంపై పెట్టింది. ఆ కాగితం ఆమె నుంచి ఎలా మిస్ అయిందో తెలియదుగానీ ఇటు వెళ్లి అటు వెళ్లి సోషల్ మీడియాకు చేరింది.తన ఉత్తరంలో టీనేజర్ల మితిమీరిన స్క్రీన్ టైమ్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన మహిళ.చాలా స్కూల్స్లో మొబైల్ ఫోన్ను అనుమతించనప్పటికీ విద్యార్థులు వాటిని రహస్యంగా వాడుతున్నారు. అధిక స్క్రీన్ టైమ్ వలన వారి చదువు దెబ్బతింటుంది. చైనాకు చెందిన ఆ తల్లి ఉత్తరంపై ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ‘ఇది చైనా తల్లి సమస్య మాత్రమే కాదు ఎన్నో దేశాలలోని తల్లుల సమస్య’ ‘ఆ తల్లి ఉత్తరాన్ని ఎన్నో దేశాల ప్రజలు చదివి ఉంటారు. ఆమె కుమారుడు కూడా చదివే ఉంటాడు. అతడు మారుతాడని ఆశిద్దాం’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. (చదవండి: ఒరిజినల్ సర్టిఫికెట్లు వారి దగ్గర ఉంచుకునే అధికారం లేదు) -
‘అరుణాచల్’ వివాదం: చైనా వాదనపై భారత్ మండిపాటు
న్యూఢిల్లీ: చైనాలోని షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక భారత మహిళను 18 గంటలకు పైగా నిర్బంధించడంపై భారత్ తన దౌత్యపరమైన నిరసన తెలియజేసింది. చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే భారత పాస్పోర్ట్ ఉన్నప్పటికీ, ప్రేమా వాంగ్ థాంగ్డాక్.. లండన్ నుండి జపాన్కు వెళ్తుండగా ట్రాన్సిట్ సమయంలో అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలయ్యింది.చైనా అధికారులు ప్రేమా వాంగ్ థాంగ్డాక్ జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అయినందును ఆమె పాస్పోర్ట్ చెల్లదని ప్రకటించి, ఆమెను వేధింపులకు గురి చేశారు. కాగా ఈ ఘటన అంతర్జాతీయ విమానయాన నిబంధనలు, చైనా వలస నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించినట్లున్నదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)పేర్కొంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం చైనా తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. ఈ వివాదం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనతో మరింత తీవ్రమైంది. ‘జాంగ్నాన్ చైనా భూభాగం. భారతదేశం చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ను చైనా ఎప్పుడూ అంగీకరించలేదు’ అని చైనా ప్రతినిధి పేర్కొన్నారు.దీనికి ప్రతిస్పందనగా ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. ‘అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం. ఇది విడదీయరాని భాగం. ఇది వాస్తవం. చైనా వైపు నుండి ఎంత తిరస్కరణ వచ్చినా, ఈ వాస్తవాన్ని మార్చలేం’ అని స్పష్టం చేశారు. ప్రయాణికురాలు థాంగ్డాక్ తన అనుభవాన్ని ‘ఎక్స్’లో వివరిస్తూ, తన జన్మస్థలాన్ని లక్ష్యంగా చేసుకొని వేధించారని, పదేపదే ప్రశ్నించారని, విరుద్ధమైన సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన భారత్ ప్రభుత్వం చైనా అధికారులు హాస్యాస్పద కారణాలతో ప్రేమా వాంగ్ థాంగ్డాక్ను నిర్బంధించారని ఆరోపించింది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. భారత పౌరులను లక్ష్యంగా చేసుకోవడం సహించదగినదికాదని, అరుణాచల్ ప్రదేశ్ స్థితిపై చర్చకు అవకాశం లేదని న్యూఢిల్లీ స్పష్టంగా చైనాకు తన సందేశం పంపింది.ఇది కూడా చదవండి: 360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే! -
ఏప్రిల్లో ట్రంప్ చైనా పర్యటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏప్రిల్లో చైనాలో పర్యటించనున్నారు. టారిఫ్ వార్ తరువాత రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తాను ఫోన్లో సంభాషించానని, వచ్చే ఏడాది చివర్లో అమెరికా పర్యటనకు జిన్పింగ్ను ఆహ్వనించానని ఎక్స్వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. చైనాతో అమెరికా సంబంధం బలంగా ఉందని, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడేందుకు సహాయపడుతుందని వెల్లడించారు. నెల రోజుల కిందట ఇద్దరు నాయకులు దక్షిణ కొరియాలో భేటీ అయ్యారు. అనంతరం ఫోన్లో సంభాíÙంచారు. ఉక్రెయిన్, ఫెంటానిల్, అమెరికన్ సోయాబీన్స్ కొనుగోళ్లు వంటి అంశాలపై చర్చించామని ట్రంప్ తెలిపారు. పర్యటనలు ప్రస్తావించని చైనా అయితే ముందుగా ఫోన్ కాల్ గురించి ప్రకటించిన చైనా మాత్రం పర్యటనల గురించి వెల్లడించలేదు. కేవలం ఇరు దేశాల మధ్య వాణిజ్యం, తైవాన్, ఉక్రెయిన్ గురించి చర్చించారని పేర్కొంది. ‘‘చైనా ప్రధాన భూభాగానికి తైవాన్ తిరిగి రావడం ‘యుద్ధానంతర అంతర్జాతీయ క్రమంలో అంతర్భాగం’అని జిన్పింగ్ ట్రంప్తో అన్నారు. ట్రంప్ తన పోస్ట్లో ప్రస్తావించని బీజింగ్కు ఇది కీలకమైన సమస్య. ఫాసిజానికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం విజయాన్ని సంయుక్తంగా కాపాడుకోవాలని జిన్పింగ్ ట్రంప్తో అన్నారు. తెవాన్ ప్రశ్న చైనాకు ఎంత ముఖ్యమో అమెరికా అర్థం చేసుకుంటుంది.’’అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్కు సాయంపై అమెరికా అస్పష్టత వాణిజ్య యుద్ధాన్ని తగ్గించడానికి వరుస చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. రెండు అగ్రరాజ్యాల మధ్య వైరుధ్యాలు కొనసాగుతున్నాయని రెండు వైపుల నుంచి వచి్చన ప్రకటనల్లోని లోపాలు సూచిస్తున్నాయి. తైవాన్పై చైనా చర్య తీసుకుంటే, అమెరికాకు కీలకమైన మిత్రదేశమైన జపాన్లోని సైన్యం జోక్యం చేసుకోవచ్చని జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో చైనా–జపాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తకైచి వ్యాఖ్యలను బీజింగ్ ఖండించింది. ఎవరూ తాకకూడని ఎర్ర గీతను జపాన్ దాటిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు.స్వయం పాలనలో ఉన్న తైవాన్ సార్వభౌమాధికారంపై అమెరికా ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ తైవాన్ను స్వా«దీనం చేసుకోవడానికి బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తుంది. ఏదైనా సాయుధ దాడిని నిరోధించడానికి ద్వీపానికి సాయంగా అమెరికా దళాలను పంపే విషయంలో స్పష్టత లేదు. తైవాన్ తన రక్షణ బడ్జెట్ను పెంచాలని అమెరికా చెబుతోంది. తైవాన్కు 330 మిలియన్ డాలర్ల ఆయుధ అమ్మకాలకు అమెరికా ఈ నెలలో ఆమోదం తెలిపిందని తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో యుద్ధ విమానాల విడిభాగాలు కూడా ఉన్నాయి. దీనిపై చైనా నిరసన వ్యక్తం చేసింది. -
షాంఘై ఎయిర్పోర్ట్లో మహిళకు వేధింపులు : చైనా రియాక్షన్ ఇదే
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన ఘటనలో చైనా స్పందించింది. షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళను వేధించారనే ఆరోపణలను చైనా ఖండించింది. థాంగ్డోక్కు ఎదురైన అనుభవంపై స్పందన కోరగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆ మహిళ ఆరోపించినట్లుగా ఎటువంటి తప్పనిసరి చర్యలు, నిర్బంధం లేదా వేధింపులకు లేవని పేర్కొన్నారు.లండన్ నుంచి జపాన్కు ప్రయాణిస్తున్నకి షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో భారతీయ మహిళలను అడ్డుకున్న దుమారం రేగిన ఒక రోజు తరువాత డ్రాగన్ కంట్రీ దీనిపై వివరణ ఇచ్చింది. నవంబర్ 21న లండన్ నుండి జపాన్కు ప్రయాణిస్తున్న యూకేకి చెందిన భారతీయ పౌరురాలు పెమా వాంగ్జోమ్ థాంగ్డాక్, పాస్పోర్ట్లో జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని పేర్కొనడంపై ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తనను ఆపారని తెలిపింది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకున్న చర్యలు చట్టాలు , నిబంధనల ప్రకారం ఉన్నాయని పేర్కొంటూ ఈ సందర్భంగా వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. కాగా అరుణాచల్ చైనా భూభాగం అంటూ షాంఘైలో విమానంలో దిగిన థాంగ్లో పాస్పోర్ట్ను చూసిన చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం, కనుక ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదని వాదించి అవమానించి వేధింపులకు గురిచేశారు. తదుపరి విమానం ఎక్కకుండా, కనీసం ఆహారం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె థాంగ్డోక్ తన స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారతీయ కాన్సులేట్కు సమాచారం అందించింది. భారతీయ అధికారుల జోక్యం తర్వాత ఆమెను రాత్రి ఆలస్యంగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. -
అరుణాచల్ ప్రదేశ్ మాది..!
అరుణాచల్ ప్రదేశ్.. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. అయితే చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్పై ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. మనతో స్నేహం అంటూనే భారతదేశంలో సూర్యుడు ఉదయించే తొలి ప్రాంతం అరుణాచల్ను తరచు తమది అంటోంది. తాజాగా వారి అరాచకం మరోసారి బయటపడింది. యూకేలో ఉంటున్నభారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్పోర్ట్పై అరుణాచల్ప్రదేశ్-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్పోర్ట్ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను. పెమా వాంఘజామ్ థోంగ్డాక్ అనే లండన్ నుంచి జపాన్కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. పాస్పోర్ట్ కౌంటర్లో అరుణాచల్ ప్రదేశ్-భారత్ అని ఉందేంటని ప్రశ్నించారు. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ భాగమని ఆమె వాదించగా, కాదంటూ వారు వాగ్వాదానికి దిగారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమంటూ వితండ వాదం చేశారు. మూడు రోజుల క్రితం అంటే నవంబర్ 21వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె.. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకి స్పష్టం చేసింది. తనను చైనా అధికారుల ఎంతటి వేధింపులకు గురి చేశారో వెల్లబుచ్చింది. గత ఏడాది తాను చైనా మీదుగా ప్రయాణించినా ఎటువంటి ఇబ్బంది రాలేదని, అలాగే లండన్లో ఉన్న చైనా ఎంబాసీ కూడా ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. తాజాగా ఎదురైన అనుభవంతో తాను షాక్కు గురైనట్లు ఆమె వాపోయింది. ఈ కారణంగా తాను కేవలం కొంత పరిధి వరకే పరిమితమయ్యానని, టికెట్లను రీబుక్ చేసుకోలేకపోయానని, భోజనం కూడా కొనలేకపోయానని, ఆఖరకు టెర్మినల్స్ మధ్య కదలడానికి కూడా వీల్లేకుండా పోయిందని తెలిపింది. చైనా ఈస్టర్న్లో ప్రత్యేకంగా కొత్త టికెట్ కొనాలని అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని, అలా చేసిన తర్వాతే తన పాస్పోర్ట్ తిరిగి ఇస్తామన్నారని పేర్కొంది. దీనివల్ల పలు ఆటంకాలు ఏర్పడి ఆర్థిక నష్టం చవిచూడాల్సి వచ్చిందన్నారు. చివరకు లండన్లో ఉన్న తన ఫ్రెండ్ సాయంతో షాంఘైలో ఉన్న బారత ఎంబాసీని కలిశానని, ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో తాను చైనాను వీడి వెళ్లే అవకాశం దక్కిందన్నారు. ఇదొక భయానక ఘటనగా ఆమె అభివర్ణించారు.ఇదీ చదవండి: మీరు మాకు చెప్పాల్సింది: ప్రధాని మోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడుసరిహద్దులు మారొచ్చు.. రాజ్నాథ్ సింగ్ -
అణు దాడులను తట్టుకునేలా ‘ఐస్లాండ్’
చైనా దేశం మరో భారీ నిర్మాణానికి సిద్ధమయ్యింది. ప్రపంచంలోనే తొలిసారిగా భారీ కృత్తిమ ద్వీపం నిర్మాణాన్ని డ్రాగన్ కంట్రీ చేపడుతుంది. ఈ ద్వీపాన్నిఅణు బాంబు దాడులను సైతం తట్టుకునేలా నిర్మిస్తున్నట్లు ఆ దేశ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.కొత్త కొత్త నిర్మాణాలతో ప్రపంచ దేశాలని ఆశ్చర్యపరిచే డ్రాగన్ కంట్రీ మరో భారీ నిర్మాణం చేపడుతుంది. అణుబాంబు దాడులను సైతం తట్టుకునేలా భారీ కృత్తిమ ద్వీపనిర్మాణం నిర్మిస్తున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఐస్ లాండ్ ఆరు నుంచి తొమ్మిది మీటర్ల ఎత్తైన అలలను తట్టుకోవడంతో పాటు కఠినమైన తుఫానులను సైతం ఎదుర్కొనేలా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఏర్పరిచిన సామాగ్రి 238 మందికి నాలుగు నెలల పాటు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ద్వీపంలో అన్ని రకాల ఎమర్జెన్సీ కంపర్ట్ మెంట్ లు నిర్మిస్తున్నామని, వాటిలో ఎమర్జెన్సీ పవర్, కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుందని తెలిపారు. ఈ ద్వీపం 138 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పుతో నీటి మట్టానికి 45 మీటర్ల ఎత్తు ఉండేలా దీని నిర్మాణం చేపడుతున్నట్లు చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీని బరువు 78 వేల టన్నులుని తెలిపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా దీని నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. డీప్-సీ ఆల్-వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీగా ఫిలవబడే ఈ ద్వీప నిర్మాణం 2028 వరకూ పూర్తి చేయనున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు.కాగా ఇటీవలే చైనాలో నిర్మించిన ఓ భారీ వంతెన ప్రారంభించిన కొద్ది రోజులకే కూలిపోయింది. దీంతో నాసిరకం నిర్మాణాలు చేపట్టారని ఆ దేశ ఇంజినీర్లపై విమర్శలు వ్యక్తమయ్యాయి. -
చైనా ఎంబసీకి యూకే ప్రధాని పచ్చజెండా
లండన్: లండన్ నడిబొడ్డున చైనా నిర్మించతలపెట్టిన వివాదాస్పద సూపర్ ఎంబసీకి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించనుంది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మరికొద్ది నెలల్లో చైనాలో పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఎంబసీ ప్రణాళికకు ఆమోదం తెలపాలని నిర్ణయించింది. స్టార్మర్ ప్రతిపాదనకు హోం శాఖ, విదేశాంగ శాఖలు అడ్డుచెప్పే అవకాశాలు లేవని ది టైమ్స్ కథనం పేర్కొంది.అయితే, జాతీయ భద్రతా ప్రయోజనాలకు లోబడి ఇందులో కొన్ని మినహాయింపులుండొచ్చని తెలిపింది. డిసెంబర్ 10వ తేదీలోగా అధికారికంగా అనుమతి లభించవచ్చని పేర్కొంది. చైనా నిర్మించాలనుకుంటున్న భారీ దౌత్య కార్యాలయం తమ దేశంలో గూఢచర్యానికేనని యూకే అనుమానిస్తోంది. అయితే, ఎంబసీ ప్రణాళికను ఆమోదించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని చైనా హెచ్చరికలు చేయడం గమనార్హం. -
బొద్దింక కాఫీ ..! ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదట..
కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండారు. అబ్బా దాని వాసనే కాఫీ తాగనివాళ్లను సైతం నోరూరిస్తుంది. అలాంటీ టేస్టీ కాఫీని ఇంత వెరైటీగా తాగాలనుకుంటే మాత్రం దెబ్బకు వాంతులు అవ్వడం కాయం. ఏమైంది అనుకోకుండి.. చైనా ఓ సరికొత్త కాఫీ టేస్ట్ని పరిచయం చేయనుంది. అదెలాగో తెలిస్తే ఛీ...య్యాక్ అనేస్తారు. బీజింగ్లోని ఒక మ్యూజియం కాఫీని మాములు వెరైటీగా కాఫీప్రియులకు అందిచడం లేదు. అది సర్వ్ చేసే విధానం చూస్తే బాబోయ్ అనిపించే రేంజ్లో..అత్యంత విలక్షణంగా అందింస్తోంది కస్టమర్లకు. ఇలాంటి ఆలోచనలు ఎక్కడ నుంచి వస్తాయ్ అబ్బా అని అనుకోకుండా ఉండరు ఎవ్వరైనా. ఇంతకీ ఎలాగంటే..బొద్దింకలను పైన జల్లి, ఎండిన పసుపు మీల్ వార్మ్లు కూడా జోడిస్తారు. ఆమ్యూజియం పేరు క్రిమీ మ్యూజియం అట. అందుకని ఆ పేరుకు తగ్గట్టు కస్టమర్లకు ఇలా సర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదండోయ్ ఈ కాఫీ పేరు రోచ్ కాఫీ అట.కప్పు కాఫీ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 542లు పలుకుతుందట. ఇలాంటి కాఫీ కేవలం ఆ మ్యూజియంలోనే దొరకుతుందట. అలాగే ఇలాంటి వెరైటీ పానీయాలు మరికొన్ని కూడా ఉన్నాయి. జీర్ణ రసంతో తయారు చేసిన పానీయాలు, హాలోవీన్ సందర్భంగా యాంట్(చీమల) డ్రింక్వంటి పలు విభిన్నడ్రింక్స్ ఉన్నాయట. అయితే ఆ మ్యూజియం వీటిని నిర్భయంగా తాగొచ్చని, ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదని కస్టమర్లకు హామీ ఇవ్వడం మరింత విశేషం. ఆ పానీయాల తయారీకి సంబంధించిన ముడిసరకును మొత్తం సాంప్రదాయ చైనీస్ ఔషధ (TCM) మూలికా దుకాణం నుంచి కొనుగోలు చేస్తామని సదరు మ్యూజియ అధికారులు చెబుతుండటం గమనార్హం. అంతేగాదు చైనీస్ ఔషధం ప్రకారం..బొద్దింక పొడి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడేతుందట. అలాగే ప్రొటీన్ అధికంగా ఉండే మీల్వార్మ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయట. కాగా, కొందరు చీమల పానీయం పుల్లని రుచి కలిగి ఉండగా, రోచ్ కాఫీ సాధారణ కాఫీలానే ఉందని చెబుతున్నారు.(ఆ పెయింటింగ్ ధర ఏకంగా రూ.487 కోట్లు!..అందులో ఇంత కథ ఉందా!) -
‘చిప్’లు చేస్తున్నాం... చైనావే కొంటున్నాం!
చైనాలో తయారైన ‘సెక్యూరిటీ–చిప్’లకు... ఇండియా డేటాను నేరుగా చైనాకు పంపే ‘వెనుక తలుపులు’ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఇండియాలోని ప్రతి మూలలో జరిగే ప్రతిదీ తెలుసుకునే పనిలో ఉన్న ఆ దేశం నుండి వచ్చే హార్డ్వేర్పై ఆధారపడటం ప్రమాదకరం.పెరటి ‘చిప్’లు పనికిరావా?‘‘ప్రపంచం కోసం మన దేశం చిప్లను తయారుచేస్తుంది. కానీ మనం వాటిని ఉపయోగించం! నిజానికి ఇండియా ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద చిప్ డిజైనర్ హబ్ కూడా! ఎన్విడియా, ఇంటెల్, మీడియా టెక్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలకు ఇండియాలో చిప్ డిజైన్ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఈ అద్భుతమైన చిప్ డిజైన్లన్నీ ప్రపంచం కోసం! ప్రపంచ దేశాలకు ఎగుమతి కోసం! మన సొంత ఉపయోగం విషయానికి వస్తే, మనం దాదాపుగా 100 శాతం వరకు చిప్లను దిగుమతి చేసుకుంటున్నాం. ఇదొక వైరుద్ధ్యం. చిప్ల వృద్ధిలో సాంకేతికతల్ని రూపొందించే మెదళ్లు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. కానీ మనం సొంత అవస రాల కోసం ఆ మెదళ్లను ఉపయోగించటం లేదు మనం!ఒప్పందం వల్ల దెబ్బ తిన్నాం!‘‘వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్లు్య.టి.ఒ.) ఒప్పందం మన ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను చావు దెబ్బ తీసింది. 1999లో డబ్లు్య.టి.ఒ. ఐటీ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 2005 నుండి ఇండియా ఆ ఒప్పందాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఒప్పందం మన మార్కెట్కు బార్లా తలుపులు తెరిచింది కానీ, మన సొంత ఎలక్ట్రానిక్స్ తయారీని దుర్బలం చేసింది. అదే సమయంలో చైనా, బ్రెజిల్ వంటి దేశాలు తమ పరిశ్ర మలను రక్షించుకుని, వాటిని వృద్ధి చేసుకున్నాయి.అంటే, పాశ్చాత్య దేశాలు మనల్ని ఈ ఒప్పందం ఉచ్చులోకి లాగి, అవి లబ్ధి పొందాయి. చదవండి: రైలు ఏసీ కోచ్లో మ్యాగీ : వీడియో వైరల్, నెటిజన్లు ఫైర్ పేరుకే అన్నట్లుంది ప్రావీణ్యం!‘‘ఎంత సేపటికీ మనం విడి పరికరాలను కలపటంతోనే సరిపెట్టుకుంటున్నాం. ‘మేక్ ఇన్ ఇండియా’ అంటే కేవలం నట్లు, బోల్ట్లు, స్క్రూలు బిగించటమేనా? డిజైన్ చేయటం కాదా! అదెందుకు అర్థం చేసుకోలేకపో తున్నాం? కేవలం భాగాలను కలిపే నైపుణ్యం మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. మనకు ఎలాంటి గుర్తింపునూ తీసుకురాదు. మనకు ఏ డిమాండునూ కల్పించదు. మేక్ ఇన్ ఇండియాకు ప్రస్తుతం మనం జోడిస్తున్న విలువ సున్నా. దిగుమతి చేసుకున్న భాగాలను కూర్చటం మాత్రమే చేస్తున్నాం. అలా కాకుండా మనమే ఇక్కడ డిజైన్కు, తయారీకి మారాలి. అప్పుడే మనం సెమీకండక్టర్లు, డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల వంటి తుది ఉత్పత్తులను సృష్టించగలం. ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!చైనా మీద అనుమానాలు‘‘చైనీస్ చిప్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు మన జాతీయ భద్రతకు ప్రమాదం. మనం ఉపయోగించే ప్రభుత్వ హాజరు యంత్రాలు (చైనా నుంచి దిగుమతి చేసు కున్నవి) చైనాకు మన డేటాను పంపుతున్నట్లు మేము కనిపెట్టాం. దేశ భద్రతకే ముప్పు తెచ్చిపెట్టే సమస్య ఇది. ప్రభుత్వ పరికరాలు మాత్రమే కాదు, మన స్మార్ట్ఫోన్లలో ఎక్కువ భాగం– ఏటా అమ్ముడవుతున్న 15 కోట్ల ఫోన్లలో దాదాపు 60 శాతం – చైనా˘కంపెనీలవే! భారతదేశంలోని ప్రతి మూలలో జరిగే ప్రతిదీ తెలుసుకునే పనిలో ఉన్న ఆ దేశం నుండివచ్చే హార్డ్ వేర్పై ఆధారపడటం దేశ సమగ్రతకే ప్రమాదం. ‘సేవలు’ తగ్గి, ఉత్పత్తి పెరగాలి!‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా సేవా రంగాలపై ఆధారపడి ఉంది, ఇది దాదాపు 60 శాతం. మనం స్వయం సమృద్ధిగా ఉండాలనుకుంటే, ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం రూపాంతరం చెందాలి. మొదటిసారిగా, ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని ‘పరిశోధన–అభివృది’్ధ నిధిగా రూ. 1 లక్ష కోట్లను కేటాయించింది. అది చాలా పెద్ద మొత్తం. మనం చేయవలసింది ఏమిటంటే, సాంకేతిక ఉత్పత్తుల కోసం ఆర్డర్లను పొందటం. వాటి తయారీకి భార తీయ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వడం. బలమైన, స్వదేశీ సాంకేతిక పరిశ్రమను నిర్మించడానికి ఇది చాలా అవసరం’’.- ఎడిటోరియల్ టీమ్పాడ్కాస్ట్:ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఎ.ఎన్.ఐ.)అతిథి:అజయ్ చౌధరీ, టెక్ విజనరీ, హెచ్.సి.ఎల్. కో–ఫౌండర్హోస్ట్:స్మితా ప్రకాశ్, ఎ.ఎన్.ఐ. ఎడిటర్సంభాషణలో అజయ్ చౌధరీ వెల్లడించిన ముఖ్యాంశాలు: -
పోరులో పాక్ గెల్చిందట!
న్యూఢిల్లీ: పహల్గామ్లో ఉగ్రవాదుల పాశవిక దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ జరిపిన దాడులకు పాకిస్తాన్ దీటుగా బదులిచ్చిందని, ఆ నాలుగు రోజుల పోరులో పాక్ పైచేయి సాధించిందని అమెరికా సెనేట్లో సమర్పించిన ఓ నివేదికపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది మోదీ సర్కార్ దౌత్యవైఫల్యానికి ప్రబల నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ గురువారం ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ వేళ కొనసాగిన పరస్పర సైనిక చర్యల్లో భారత్పై పాక్ విజయం సాధించిందని అమెరికా–చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్ మంగళవారం అమెరికా ఎగువసభ అయిన సెనేట్లో 800 పేజీల నివేదికను సమర్పించింది. ‘‘108, 109 పేజీల్లో ఏప్రిల్లో పహల్గాం దాడి వెనుక పాక్ హస్తముంది. ఆపరేషన్ సిందూర్ వేళ చైనా అందించిన అత్యాధునిక ఆయుధాలతో భారత్ను పాక్ ఓడించింది. చైనా అత్యాధునిక ఆయుధాలు, నిఘా సాయంతో పాక్ పైచేయి సాధించింది. పాక్ సైన్యం మాటున చైనా తన అధునాతన ఆయుధ సంపత్తిని నేరుగా భారత్ పరీక్షించుకునే సువర్ణావకాశాన్ని సద్వినియోగంచేసుకుంది. తద్వారా తమ ఆయుధాల పనితీరును ప్రపంచానికి చాటిచెప్పి అంతర్జాతీయ ఆయుధ, రక్షణ రంగ మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని చూసింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘ అమెరికా సెనేట్లో సమర్పించిన నివేదికను చూశాకైనా ప్రధాని మోదీ మౌనం వీడతారా? భారత విదేశాంగ శాఖ తన అభ్యంతరాలను వ్యక్తంచేస్తుందా?’’ అని జైరాం రమేశ్ సూటి ప్రశ్న వేశారు. -
996 ఫార్ములా: ఇన్ఫోసిస్ నారాయణమూర్తిపై ఆగ్రహం!
వారానికి 72 గంటల పని మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఈ వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కొందమంది సమర్ధించారు. మరికొందరు విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ నిలవాలంటే.. 996 నియమం చాలా అవసరం అని ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఏమిటీ 996 రూల్?చైనాలో పాటిస్తున్న 9-9-6 నియమాన్ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 996 ఫార్ములా ప్రకారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని, వారానికి 6 రోజులను సూచిస్తుంది. అంటే రోజుకు 12 గంటలు.. 6 రోజులు చేయాలన్నమాట. ఇలా మొత్తానికి వారానికి 72 గంటలు పనిచేయాలన్నమాట.చైనాలోని చాలా కంపెనీలు ఈ నియమాన్ని పాటిస్తున్నాయి. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. కొన్ని సంస్థలు ఈ నియమాన్ని రద్దు చేసినప్పటికీ.. ఇంకొన్ని అమలు చేస్తూనే ఉన్నాయి. కాగా చైనా ప్రభుత్వం కూడా దీనిని క్రమంగా నియంత్రించడానికి తగిన చర్యలను తీసుకుంటోంది. అలాంటి ఈ విధానాన్ని నారాయణమూర్తి ప్రస్తావించడం.. కొంత మందిలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది.ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే.. తప్పకుండా యువత మరింత నిబద్దతతో పనిచేయాలి. భారత్ వృద్ధి రేటు 6.57 శాతం. దీని కంటే ఆరు రెట్లు పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన చైనాతో మనం పోటీ పడాలంటే.. పనిగంటలు పెంచాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారానికి 100 గంటలు పనిచేస్తారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. పేదలకు అవకాశాలు కల్పించడానికి యువత కష్టపడి, తెలివిగా పనిచేయడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.నెటిజన్ల రియాక్షన్నారాయణమూర్తి వ్యాఖ్యలపై చాలామంది నెటిజన్లు స్పందించారు. ఒకరు చైనా స్థాయి జీతాలు, మౌలిక సదుపాయాలు & జీవన వ్యయం ఇవ్వండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అని అన్నారు. భారతదేశానికి 72 గంటల వారాలు అవసరం లేదు. అద్దె, కిరాణా సామాగ్రి, పాఠశాల ఫీజులు & పెట్రోల్కు సరిపోయే జీతాలు భారతదేశానికి అవసరం. ప్రజలు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారని మరొక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: టెక్ కంపెనీ కొత్త చర్య.. భయపడుతున్న ఐటీ ఉద్యోగులు!యూరప్ దేశంలో 10-5-5 విధానం నడుస్తోంది. దీని గురించి మీకు తెలుసా అంటూ.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పని, వారానికి 5 రోజులు మాత్రమే. ఈ దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారాంతాల్లో సంతోషంగా జీవితం గడుపుతారు అని ఇంకొక యూజర్ అన్నారు. ఇలా ఒక్కొక్కరు.. ఒక్కోలా నారాయణమూర్తి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.🚨 "There is a saying in China, 9, 9, 6. You know what it means? 9 am to 9 pm, 6 days a week. And that is 72 hours work-week, " said Narayana Murthy. pic.twitter.com/FCeNFynG1F— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2025 -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై దాదాపు 500 శాతం సుంకాలు విధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. రెండు దేశాల యుద్ధం ముగించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో భేటీ కూడా అయ్యారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది సాధ్యం కాకపోవడంతో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ పెద్దమొత్తంలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా దాదాపు విఫలం కావడంతో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం తమ దేశానికి వేరే మార్గం లేదని ట్రంప్ పేర్కొన్నారు.రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్లు విధిస్తానన్నారు. సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ దేశాల జాబితాలో భారత్, చైనా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ను కూడా ఇందులో చేర్చనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తున్నామన్నారు. భారత్, చైనాలే ఆ దేశం నుంచి 70శాతం చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడనుంది. BREAKING:US president Trump approves bill allowing tariffs up to 500% on countries trading with Russia. pic.twitter.com/Lko3wXVuLU— Recon & surveillance (@Recon_surv) November 17, 2025 -
ఆసియా పసిఫిక్లో కీలకంగా భారత్
బ్యాంకాక్: ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ వృద్ధికి భారత్, చైనా కీలకంగా నిలుస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఆసియా పసిఫిక్ ఎయిర్లైన్స్ (ఏఏపీఏ) వెల్లడించింది. ప్యాసింజర్, కార్గోలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో 2026లో కూడా పరిశ్రమ వృద్ధి సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఏఏపీఏ డైరెక్టర్ జనరల్ సుభాష్ మీనన్ తెలిపారు. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ 10 శాతం పెరిగిందని వివరించారు. 2025 తొలి ఆరు నెలల్లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే, వచ్చే ప్రయాణికుల సంఖ్య 16 శాతం వృద్ధి చెందిందని 69వ అసెంబ్లీ ఆఫ్ ప్రెసిడెంట్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశీ మార్కెట్ విస్తరించేందుకు భారీగా అవకాశాలు ఉన్నాయని చెప్పా రు. చారిత్రకంగా చూస్తే భారతీయ విమానయాన దిగ్గజం ఎయిరిండియా చాలా కీలకమైనదని, అది నిలదొక్కుకోవడానికి కాస్త సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని మీనన్ చెప్పారు. సరఫరా వ్యవస్థపరంగా అంతరాయాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆసియా పసిఫిక్ ఎయిర్లైన్స్ డిమాండ్కి తగ్గ స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయ న పేర్కొన్నారు. ఏఏపీఏలో ఎయిరిండియా సహా 18 విమానయాన సంస్థలకు సభ్యత్వం ఉంది. నాలుగు తీర్మానాల ఆమోదం.. సదస్సు సందర్భంగా ఏఏపీఏ నాలుగు తీర్మానాలను ఆమోదించింది. సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లను అధిగమించడం, విమానాల్లో లిథియం బ్యాటరీలను తీసుకెళ్లడం, పన్నులు..చార్జీలు, పర్యావరణహితమైన విధంగా ఏవియేషన్ కార్యకలాపాలు సాగించడంలాంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ప్రాంతీయంగా ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్) కార్యకలాపాలు పెరిగేలా నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవడం, తయారీ సామర్థ్యాలు పెంచుకునేందుకు ఊతమివ్వడం, నిర్దిష్ట పెట్టుబడులకు ప్రోత్సాహకాలివ్వడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఏఏపీఏ కోరింది. అలాగే పునరి్వనియోగానికి పనికొచ్చే ఎయిర్క్రాఫ్ట్ మెటీరియల్స్ను రీసైకిల్ చేసేలా సర్క్యులర్ ఎకానమీ విధానాలను అమల్లోకి తేవొచ్చని పేర్కొంది. ఎయిర్లైన్స్కి అండగా ఉండాలి: ఐఏటీఏ సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లతో విమానాల డెలివరీలకు అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఎయిర్లైన్స్కి విమానయాన పరిశ్రమలోని వివిధ విభాగాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్‡్ష తెలిపారు. టారిఫ్లు, ఇతరత్రా అంశాల కారణగా విమానాల తయారీ సంస్థలు (ఓఈఎం) ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్లైన్స్ మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయని, మరోవైపు ఓఈఎంల మార్జిన్లు అధిక స్థాయిలో ఉంటాయని వాల్‡్ష తెలిపారు. మిగతా వర్గాలు లాభాలార్జించడంపై తమకే అభ్యంతరం లేదు కానీ పరిశ్రమలో సమతౌల్యత అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సరఫరా వ్యవస్థపై టారిఫ్లు ప్రతికూల ప్రభావం చూపుతాయని సుభాష్ మీనన్ చెప్పారు. వీటి వల్ల విమానయాన సంస్థల ఇంధనేతర వ్యయాలు కూడా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. టారిఫ్ల వల్ల ఇటు సరఫరా, అటు డిమాండ్ మీద ప్రభావం పడుతుందన్నారు. కన్సలి్టంగ్ సంస్థ ఆలివర్ వైమాన్తో కలిసి ఐఏటీఏ నిర్వహించిన అధ్యయనం ప్రకారం సరఫరా వ్యవస్థ సవాళ్ల కారణంగా 2025లో అంతర్జాతీయంగా ఎయిర్లైన్స్ పరిశ్రమపై 11 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. అక్టోబర్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇంధనం అధికంగా వాడాల్సి రావడం, అదనపు మెయింటెనెన్స్, మరింత ఎక్కువగా ఇంజిన్లను లీజుకు తీసుకోవడంలాంటి అంశాలపై విమానయాన సంస్థలు గణనీయంగా వెచి్చంచాల్సి రానుంది. 20 ఏళ్లలో 19,560 విమానాలు అవసరం: ఎయిర్బస్ అంచనాలు వచ్చే 20 ఏళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 19,560 చిన్న, పెద్ద విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ వెల్లడించింది. అంతర్జాతీయంగా 20 ఏళ్లలో 42,520 విమానాలు అవసరం కానుండగా, ఇది అందులో దాదాపు సగమని వివరించింది. భారత్, చైనాలో విమానయానానికి డిమాండ్ పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ఎయిర్బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీ చెప్పారు. ప్రాంతీయంగా ప్యాసింజర్ల సంఖ్య ఏటా 4.4 శాతం వృద్ధి చెందనుందని, ఇది అంతర్జాతీయ సగటు 3.6 శాతం కన్నా అధికమని వివరించారు. ఆసియా–పసిఫిక్లో సరికొత్త వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని స్టాన్లీ పేర్కొన్నారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుదల, నెట్వర్క్ విస్తరణ, చౌక విమానయాన సంస్థల రాక, మౌలిక సదుపాయాలు మెరుగుపడటం మొదలైనవి విమానయాన వృద్ధికి దోహదపడే అంశాలని చెప్పారు.కొత్తతరం విమానాలతో 25 శాతం ఇంధనం ఆదా.. తమ కొత్త తరం వైడ్–బాడీ విమానాలు 25 శాతం మేర ఇంధనాన్ని ఆదా చేస్తాయని, కర్బన ఉద్గారాలను కూడా ఆ మేరకు తగ్గిస్తాయని ఎయిర్బస్ తెలిపింది. ఏఏపీఏ సదస్సు సందర్భంగా ఎయిర్బస్ వెల్లడించిన అంచనాల ప్రకారం ఆసియా పసిఫిక్లో వచ్చే రెండు దశాబ్దాల్లో 3,500 పెద్ద విమానాలు అవసరం కానున్నాయి. ఇది అంతర్జాతీయంగా పెద్ద విమానాలకున్న డిమాండ్లో సుమారు 43 శాతం. మరోవైపు, ప్రాంతీయంగా 16,100 చిన్న విమానాలు కావాల్సి ఉంటుంది. గ్లోబల్ డిమాండ్లో దాదాపు 47 శాతం. దాదాపు 32 శాతం విమానాలు పాత మోడల్స్ స్థానాన్ని భర్తీ చేయనుండగా, మిగతావి ఫ్లీట్ విస్తరణకు ఉపయోగపడనున్నాయి. -
'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...
కూతురు కోసం ఏ తండ్రైనా దేన్నైనా త్యాగం చేస్తాడు..ఎంత కష్టమైనా భరిస్తాడు. తమ కంటిపాప కంటే తమేకేది ఎక్కువ కాదు అనేంత ప్రేమను చూపిస్తారు. కానీ ఈ నాన్నలా ఇంతలా ప్రేమించడం మాత్రం కష్టమే. అందరి నాన్నల కంటే ఈ తండ్రి ప్రేమ అంతకుమించి..అని చెప్పొచ్చు. ఇతడి కూతురి ప్రేమను చూడగానే ఆకాశమంత మూవీలోని ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది. "ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా..ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా.. అమ్మరా..మేఘాల పల్లకి తెప్పిస్తా.. లోకాన్ని కొత్తగ చూపిస్తా.. వెన్నెలే తనపై కురిపిస్తా.." అంటూ సాగే పాట కళ్లముందు కదలాడుతుంది. ఆ సినిమాలో మాదిరిగానే ఈ తండ్రికి కూడా పై చదువుల కోస దూరంగా వెళ్తున్న కూతురిని విడిచిపెట్టి ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఆమె అక్కడ భోజనం విషయంలో ఇబ్బంది పడుతుందని తెలిసి..మొత్తం మకాం ఆమె వద్దకు మార్చేశాడు. కూతురు పక్కన లేనిదే జీవితం వృధా అని మొత్తం తన లైఫ్నే త్యాగం చేసేశాడు. మరి ఆ ఆసక్తికరమైన ఆ పేరెంట్ కథేంటో చూసేద్దామా..!చైనాకు చెందిన లీ బింగ్డ్ అనే టీనేజర్ జిలిన్ ప్రావిన్స్లో జిలిన్ నార్మల్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. దాదాపు ఒక ఏడాది తర్వాత బింగ్డ్ తన యూనివర్సిటీ క్యాంటిన్లో భోజనం అస్సలు బాగుండటం లేదని తండ్రి లీతో చెప్పింది. తాను ఇంటి భోజనం చాలా మిస్సవ్వుతున్నానని వాపోయింది. అంతే ఆ తండ్రి బార్బెక్యూ రెస్టారెంట్లో చేస్తున్న ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసి..వంట మంచిగా చేయడం ఎలాగో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత కూతురు ఉండే యూనివర్సిటీ సమీపానికి తన మకాం మార్చేసి..అక్కడే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపన్ చేశాడు. మొదటి రోజు అతడు వండిన వంటకాలకు స్వలంగానే లాభం పొందాడు. అది తన కూమార్తె బింగ్డ్ ట్యూటర్గా సంపాదించే దాంతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. తండ్రి శ్రమను చూసి చలించిపోయిన ఆ కూతురు..తన కథను సోషల్మీడియాలో షేర్ చేసింది. అంతేగాదు తన తండ్రి శుభ్రమైన వంటకు ప్రాధాన్యత ఇస్తాడని, అతని అమ్మకాలు మరింత మెరుగుపడాలంటే తగిన సలహాలు ఇవ్వగలరు అని పోస్ట్లో జోడించింది. వెంటనే ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే గాక..తండ్రి ఫుడ్స్టాల్ వద్ద జనాలు క్యూలో నిలబడేలా రద్దీగా మారేందుకు దారితీసింది. కొత్తమంది కస్టమర్లు ఆమె తండ్రి వ్యాపారానికి మద్దతిచ్చేలా మరిన్ని ఆర్డర్లు కోరారు. అంతేగాదు ఆ తండ్రికి కూతురుపై ఉన్న అచంచలమైన ప్రేమకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు కూడా.లాభం కంటే కూతుర చెంత చాలు..స్టాల్ రద్దీగా మారిపోవడంతో లీ తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించింది. గత నెలలో స్టాల్ నడుపుతున్నప్పుడూ చాలాచలిగా అనిపించిందని, కానీ ఇప్పుడూ కస్టమర్ల తాకిడితో అది వెచ్చగా మారిపోయిందని చమత్కరిస్తోంది లీ. తన తండ్రి పెద్దపెద్ద లాభాలనేమి ఆశించడం లేదని, కేవలం తన కూతురుకి దగ్గరగా జీవించాలన్నదే తన ఆశ అని వివరించింది. తన తల్లి కొన్నేళ్ల క్రితమే లుకేమియాతో మరణించిందని, దాంతో తాము ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమను పెంచేసుకున్నామని బింగ్డ్ చెప్పుకొచ్చింది. చాలామంది నా తండ్రి లీ ప్రేమను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ..నాకు మాత్రం ఆయనప్రేమ సూర్యుడి వలే వెచ్చని హాయిని అందిస్తుందని సంతోషభరితంగా చెబుతోంది కూతురు బింగ్డ్.(చదవండి: హాట్టాపిక్గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?) -
చైనాలో కలకలం.. భారీ శబ్ధంతో కుప్పకూలిన బ్రిడ్జి
చైనాలో ఇంజినీరింగ్ వైఫల్యం బట్టబయలైంది. చైనా-టిబెట్ను కలిపెందుకూ ఇటీవలే ప్రారంభించిన హాంగ్ కీ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. చైనా సియాచిన్ ప్రావిన్స్ లో నిర్మించిన ఈ బ్రిడ్జి 758 మీటర్ల పొడవైంది. వంతెన కూలడానికి గల కారణాలు తెలవాల్సి ఉంది.చైనా సియాచిన్ ప్రావిన్స్ లో టిబెట్-చైనాను కలుపుతూ నిర్మించిన హాంగ్ కీ బ్రిడ్జీని కొద్దిరోజుల కిందటే ప్రారంభించారు. కాగా మంగళవారం ఉదయం సమయంలో బ్రిడ్జి ప్రారంభంలోని భాగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపైనుంచి వాహనాలు ఏమి వెళ్లకపోవడం, అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే వంతెన కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. 758 మీటర్ల పొడవైన ఈ వంతెన సెంట్రల్ చైనాను టిబెట్ తో కలుపుతుంది. వంతెన కూలిన సమయంలో భారీగా శిథిలాలు నదిలో పడిపోయి పెద్ద ఎత్తున వ్యర్థాలు పైకి లేచాయి. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇండస్ట్రీయల్ సెక్టర్ లో తామెప్పుడూ ముందుంటాం అనే చెప్పుకునే డ్రాగన్ దేశంలో ఇంత పెద్ద వంతెన నిర్మించిన కొద్ది రోజుల్లోనే కూలిపోవడం ఏంటని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. Chinese Engineering Failure- The 758-metre-long Hongqi bridge collapsed in southwest China, months after opening. China isn’t as smart as everyone makes them out to be. They couldn’t copy this design. The ground shifted on one of the approaches. Luckily it was noticed the day… pic.twitter.com/ZJDDdwgCP9— Peter Lemonjello (@KCtoFL) November 11, 2025 -
చైనా అమ్ముల పొదిలో అత్యాధునిక నౌక
బీజింగ్: వాణిజ్యంలోనూ, సైనిక శక్తిలోనూ అమెరికాను ఢీకొడుతున్న చైనా.. తన నౌకాదళాన్ని మరింత శక్తిమంతం చేసే చర్యల్లో మరో ముందడుగు వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫుజియాన్ విమాన వాహక నౌకను నౌకాదళానికి అందించింది. ఇందులో అత్యంత ఆధునికమైన ఎలక్టోమ్య్రాగ్నటిక్ వ్యవస్థ (ఈమల్స్)ను అమర్చారు. ఈ వ్యవస్థ ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో మాత్రమే ఉంది. ఇటీవల హైనాన్ ప్రావిన్స్లోని సన్యా పోర్టులో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్వయంగా ఈ నౌకను నౌకాదళానికి అందించినట్టు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది. అయితే, ఈ నౌకలో ఇంకా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడారన్న విషయాన్ని చైనా అత్యంత గోప్యంగా ఉంచుతోంది. అయితే, ఆ దేశ మీడియా రిపోర్టుల ప్రకారం ఈ నౌకపై జే–15టీ, జే–35, కాంగ్జింగ్–600 వంటి యుద్ధ విమానాలను మోహరించనున్నట్టు తెలిసింది. నౌకపై ఈ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ టెస్టులు పూర్తయ్యాకే కమిషనింగ్ చేశారని జిన్హువా పేర్కొంది. ఈ నౌక బరువు 80 వేల టన్నులు. ఎమిటీ ఈమల్స్? విమాన వాహక నౌక పైనుంచి యుద్ధ విమానాలు రాకపోకలు సాగించటమే అత్యంత కీలకమైన అంశం. చాలా తక్కువ నిడివి ఉండే రన్వే పై టేకాఫ్ కావటం, ల్యాండింగ్ చేయటం క్లిష్టమైన పని. సంప్రదాయ విమానవాహక నౌకలో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో విమానాన్ని బయటి నుంచి నియంత్రించేందుకు టర్బైన్ టెక్నాలజీని వాడుతారు. గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, ఫుజియాన్లో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ టెక్నాలజీని వాడారు. ఈ వ్యవస్థ ద్వారా యుద్ధ విమానం తక్కువ సమయంలో ఎక్కువ శక్తి పుంజుకుని గాల్లోకి ఎగిరేందుకు బయటి నుంచి శక్తిని అందిస్తారు. ల్యాంగింగ్ సమయంలోనూ విమానం నిర్దేశిత ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్లి సముద్రంలో పడిపోకుండా ఈ అయస్కాంత శక్తి నియంత్రిస్తుంది. సంప్రదాయ టెక్నాలజీలతో పోల్చితే ఎలక్టోమ్య్రాగ్నటిక్ వ్యవస్థ సాంకేతికంగా క్లిష్టమైనదే అయినప్పటికీ.. దాని నిర్వహణ సులభం. అయితే, ఏవైనా సమస్యలు వస్తే మాత్రం రిపేర్లకు చాలా ఖర్చవుతుంది. అమెరికాను మించి చైనా నౌకాశక్తి ప్రపంచంలో అత్యంత భారీ నౌకాదళం ఉన్న దేశంగా అమెరికాను వెనక్కు నెట్టి చైనా అవతరించింది. అమెరికా వద్ద ప్రస్తుతం 219 యుద్ధ విమానాలు ఉండగా, చైనా వద్ద 234 ఉన్నాయి. చైనా వద్ద ఇప్పటికే ఉన్న మూడు విమాన వాహక నౌకలు సంప్రదాయ ఇంధన శక్తితో పనిచేస్తాయి. దీంతో ఆ దేశం కొత్తగా అణుశక్తితో నడిచే దలియాన్ అనే నాలుగో విమాన వాహక నౌకను నిర్మిస్తోంది. భారత్ వద్ద ఐఎస్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే రెండు విమాన వాహక నౌకలు ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణ చైనా సముద్రంతోపాటు సుదూర సముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చాటుకొనేందుకు చైనా నౌకా శక్తిని భారీగా పెంచుతోందని చైనా మిలిటరీ వ్యవహారాల నిపుణుడు ఝాంగ్ జున్షే ఆ దేశ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్తో తెలిపారు. -
ఆ సమావేశాల్లో తేలిందేమిటి?
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు ఏడు రోజులలో ఆసియాలో కీలకమైన ఆర్థిక సమావేశాలు వరుసగా జరిగాయి. జరిగింది ఆసియాలోని మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలలో అయినా, అమెరికా, చైనా, రష్యా సహా ప్రపంచ దేశాలు పాల్గొన్నాయి. ఆ సమావేశాలలో జరిగిన చర్చలు, జరిగిన ఒప్పందాలు మొత్తం ప్రపంచ వాణిజ్య, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల విషయమై భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనా ధోరణులు ఏ విధంగా ఉండనున్నాయో ఆ సమావేశాలలో స్పష్టమైంది. కానీ, అగ్రస్థాయి ఆసియా దేశం అయి ఉండి, ఆర్థిక పరిమాణంలో నాల్గవ స్థానానికి చేరిన ఇండియా ప్రధాని మోదీ మాత్రం ఆ సమావేశాలలో పాల్గొనక అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు ప్రభుత్వం అధికారికమైన వివరణ కూడా ఏమీ ఇవ్వక ఊహాగానాలకు వదలివేసి మరింత ఆశ్చర్యపరిచింది.ట్రంప్ వర్సెస్ ఇతర దేశాలుమొదట మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ‘ఆసియాన్’, ఆర్సీఈపీ (రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్), తర్వాత దక్షిణ కొరియా నగరం బూసాన్లో ఏపీఈసీ (ఆసియా– ఫసిఫిక్, ఎకనమిక్ కో–ఆపరేషన్) శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. అమెరికా, చైనా అధ్యక్షులు విడిగా సమావేశమయ్యారు. వీటి మధ్య అమెరికా అధ్యక్షుడు జపాన్ వెళ్లి అక్కడి ప్రధానితో చర్చలు జరిపారు. ‘ఆసియాన్’లో 11 దేశాలకు, ఆర్సీఈపీలో 15 దేశాలకు, ఏపీఈసీలో 21 దేశాలకు సభ్యత్వం ఉంది. మొత్తం అన్ని ఖండాలకు చెందిన ఈ దేశాలను కలిపి చూస్తే, ప్రపంచ జనాభాలో, ఆర్థిక శక్తిలో, వాణిజ్యంలో అత్యధిక భాగస్వామ్యం వాటిదే. చర్చలు, తీర్మానాలు, ఒప్పందాల చివరన రెండు ధోరణులు స్పష్టంగా తేలాయి. ఒకటి – అమెరికా తన ‘అమెరికా ఫస్ట్’ నినాదా నికి అనుగుణంగా ఆ యా దేశాలతో విడివిడిగా చర్చించి ద్వైపాక్షిక ఒప్పందాలు మాత్రమే చేసుకోవటం. చైనా మినహా మరెవరిపై సుంకాలు తగ్గించకపోవటం. ఆ యా సంస్థల సామూహిక చర్చలలో అధ్యక్షుడు ట్రంప్ అసలు పాల్గొనక పోవటం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల పట్ల విముఖత చూపటం. ఇందుకు భిన్నంగా, అమెరికాకు సన్నిహితంగా భావించే వాటితో సహా తక్కిన అన్ని దేశాలు, ఎటువంటి మినహాయింపు లేకుండా, స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టు బడులు వర్తమాన ప్రపంచానికి తప్పనిసరి అవసరమని తీర్మానించాయి. వారిలో కొందరు ఒత్తిడి కారణంగానైతేనేమి, సైద్ధాంతిక మైత్రి వల్లనైతేనేమి అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసు కున్నారు. ప్రధానంగా అరుదైన లోహాలు, ఖనిజాలు, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, రక్షణ, రవాణా పరికరాలకు సంబంధించి! అదే సమయంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుకూలిస్తూ, ఒత్తిడులను వ్యతిరేకిస్తూ తీర్మానించారు. పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ – ప్రొటెక్షనిజాన్నీ, ప్రపంచం తిరిగి ఆటవిక రాజ్య స్థితికి వెళ్లటాన్నీ విమర్శించారు. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలలో ఒకటైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ అయితే తాము వాణిజ్య పరంగా అమెరికాపై ఆధారపడే సాంప్రదాయిక స్థితి నుంచి దూరంగా జరగదలచుకున్నామనీ, రాగల కాలంలో అమెరికా బయటి దేశాలతో వాణిజ్యాన్ని రెట్టింపు చేయగలమనీ ప్రకటించారు. ఆ వెంటనే చైనా అధ్యక్షునితో సమావేశమై, ‘మరింత సుస్థిరమైన, సమ్మిళితమైన అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణానికి’ చైనాతో కలిసి పనిచేయగలమన్నారు. త్వరలో చైనా సందర్శనకు అంగీకరించారు.ప్రాంతీయ సంబంధాల సరళతరంవాస్తవానికి ఒకవైపు అమెరికా, మరొకవైపు తక్కిన ప్రపంచపు ఈ విధమైన ధోరణులు కొంత కాలంగా కనిపిస్తున్నవే. అది ట్రంప్కు తెలియనిది కాదు. ఆయన తన విధానాలను ఈ ఆసియా సమావేశాల సందర్భంగా మార్చుకోగలరని కూడా ఎవరూ ఆశించి ఉండరు. అయితే రెండు ధోరణులు కూడా ఈ వారం రోజుల సమా వేశాల కాలంలో మరింత స్థిర రూపం తీసుకోవటమన్నది గమనించదగ్గది. అంతా మన మంచికే అన్న సామెత వలె, ఈ పరిణామాలు ప్రపంచ దేశాల మధ్య బహుముఖ సంబంధాలు, బహుళ ధ్రువ ప్రపంచ ఆవిష్కరణకు మార్గాన్ని మరింత సుగమం చేయగలవు.ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. అవి – సాధారణంగా అమెరికా పలుకుబడి కింద పని చేస్తాయనే పేరున్న ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎంఎఫ్) ఈ సమావేశాలకు ముందు చెప్పిన మాటలు. నిబంధనలకు విరుద్ధంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల దృష్ట్యా వివిధ దేశాలు తమ ప్రాంతీయ వాణిజ్య సంబంధాలను సరళతరం చేసుకోవాలని ఐరాస వాణిజ్య విభాగం అధికారులు సూచించారు. తర్వాత ఆసియా ప్రాంతీయ ఆర్థిక పరిస్థితులపై ఐఎంఎఫ్ ఒక నివేదికను విడుదల చేస్తూ– ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధి ప్రధానంగా వాణిజ్యంపై ఆధార పడి ఉందనీ, అందువల్ల అక్కడి దేశాలు సుంకాలు కాని ఇతర వాణిజ్య ఆంక్షలను తగ్గించుకోవటం, ప్రాంతీయ వాణిజ్యాన్ని సమీ కృత పరచుకోవటం, ఆ విధంగా అమెరికా సుంకాల ఒత్తిడి నుంచి తప్పించుకోవటం, ప్రపంచ ఆర్థిక ఒడుదొడుకులను తట్టుకోవటం చేయాలనీ చెప్పింది. ఇండియా ఏం చేస్తున్నట్టు?ఇంత ముఖ్యమైన సమావేశాలకు కిందిస్థాయి అధికారులను మాత్రమే పంపిన భారత ప్రభుత్వం దీనంతటి నుంచి గ్రహించవలసింది చాలానే ఉంది. ఉదాహరణకు మనం ‘లుక్ ఈస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’ అని చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాము గానీ, ఆర్సీఈపీలో సభ్యత్వమైనా లేదు. ఆసియాన్లో సభ్యత్వం లేకున్నా ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి’ హోదా ఉంది. ‘ఆసియాన్’ కూటమితో వాణిజ్య, ఆర్థిక సంబంధాల గణనీయమైన అభివృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ ఆ పని మందకొడిగానే సాగుతున్నది. చైనా 771 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, మన వాణిజ్యం విలువ 131 బిలియన్లు మాత్రమే. భౌతికంగా, డిజిటల్ పరంగా సంబంధాలు చాలా పరిమితం. పోతే... ఐరాస, ఐఎంఎఫ్ సూచనలను అన్వయించుకుని చూస్తే – ఇండియా ఉన్న దక్షిణాసియాలో, ‘సార్క్’లో ఆర్థిక సమన్వయం, వాణిజ్య సంబంధాలు పాకిస్తాన్తో సమస్య వల్ల అథమ స్థాయిలో ఉన్నాయి. ‘బిమ్స్టెక్’ అనే మరొక సంస్థను పాకిస్తాన్ను మినహాయిస్తూ ఏర్పాటు చేసినా పరిస్థితి మెరుగుపడటం లేదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అంతరిక్షంలో వంట.. అదెలా!
న్యూయార్క్: అంతరిక్ష కేంద్రం. ఏ చిన్నపాటి నిప్పురవ్వ అంటుకున్నా రోదసీలోనే అంతా అంటుకుని అగ్నిగోళంగా మండిపోయే అత్యంత సున్నిత ప్రాంతం. అలాంటి అంతరిక్ష కేంద్రంలోనూ వేడివేడి చికెన్ వింగ్స్ను అది కూడా ఎలాంటి పొగరాని ప్రత్యేక ఓవెన్ను వండుకుని చైనా వ్యోమగాములు చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోని ఓ ప్రైవేట్ స్పేస్స్టేషన్లో ఇలా ఓవెన్లో చికెన్ను వండుకుని తినడం ఇదే తొలిసారి. అసలు అంతరిక్ష కేంద్రంలో వంటచేయడం కూడా ఇదే ప్రప్రథమం. తాము అభివృద్ధి చేసిన స్పేస్ కిచెన్ సాంకేతికతను చైనా ఇలా విజయవంతంగా పరీక్షించింది. పరీక్షించడమేకాదు పనిలోపనిగా ఆ వేడివేడి చికెన్ను వ్యోమగాములంతా తిని భారరహిత స్థితిలో మాంసాహార వంటకంలోని మజాను ఆస్వాదించారు. ఇందుకు తియాంగాంగ్ స్పేస్స్టేషన్ ( Tiangong Space Station) వేదికైంది. కనీసం 500 సార్లు భూమి మీద విస్తృతస్థాయిలో పరీక్షించాక దానిని తియాంగాంగ్ స్పేస్స్టేషన్కు తీసుకొచ్చారు. తాజాగా ఆహారం దిశగా పయనం వ్యోమనౌక ద్వారా తీసుకొచ్చిన అతిశీతల ఆహార పదార్థాలకు మళ్లీ వేడి చేసి తినడానికి బదులుగా అప్పుడే వండిన వేడివేడి ఆహారం తినాలనే ఆశ నుంచి హాట్–ఎయిర్ ఓవెన్ ఆలోచన పుట్టుకొచ్చింది. ఓవెన్లో పెట్టే వస్తువులను పట్టి ఉంచే పట్టీ, వేడిచేసే మెష్, ఉడికించే ట్రే, సమంగా కాల్చే రోటేటింగ్ బుట్టలతో వినూత్న ఓవెన్ను తయారుచేశారు. ‘‘ఓవెన్ గరిష్ట ఉష్ణోగ్రతను 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 190 డిగ్రీ సెల్సియస్కు పెంచాం. దీంతో చికెన్, మటన్ వంటి పదార్థాలను అప్పటికప్పుడు వేడివేడిగా తినొచ్చు’’అని చైనా శాస్త్రవేత్త, చైనా ఆస్ట్రోనాట్ రీసెర్చ్, ట్రైనింగ్ సెంటర్లో పరిశోధకుడు యువాన్ యోంగ్ చెప్పారు. ఈ ఓవెన్ను ఇటీవల షెంజువాన్–21 వ్యోమనౌక ద్వారా భూమి నుంచి తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కు తీసుకొచ్చారు. తాజాగా దీనిని చికెన్, మటన్ ముక్కలను బేక్ చేసి పరీక్షించారు. చికెన్ వింగ్స్ను చైనా షెంజువాన్–21, షెంజువాన్–22ల వ్యోమగాములు (astronauts) ఎంచక్కా ఆరగిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.పొగరాకుండా ఏర్పాట్లు భారరహిత స్థితిలో పొగ కమ్మితే అది ఎప్పటికీ బయటకు పోదు. దాంతో వ్యోమగాముల ఆరోగ్యంపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వంటలను వండినప్పుడు పొగ వెలువడకుండా ఓవెన్లో ప్రత్యేక ఏర్పాటుచేశారు. బహుళ పొరల ఫిల్టర్లను దానిలో అమర్చారు. అత్యధిక వేడిమిని ఇచ్చే రసాయన చర్యలు, సాంకేతికత మేళవింపుతో ఓవెన్ను తయారుచేశారు. భారరహిత స్థితిలోనూ అది సవ్యంగా పనిచేయడం విశేషం. అంతరిక్ష కేంద్రంలోనూ వాడగల ప్రపంచంలోనే మొట్టమొదటి ఓవెన్ ఇదేనని ఆస్ట్రోనాట్స్ సిస్టమ్లో డెప్యూటీ చీఫ్ డిజైనర్ లూ వీబో చెప్పారు. మొక్కజొన్న పొత్తులు వేయించుకునేందుకూ ఇందులో ఏర్పాటు ఉంది. కేక్ (Cake) సైతం తయారు చేసుకోవచ్చు.చదవండి: షట్డౌన్ తెచ్చిన ఆహార సంక్షోభంతయాంగాంగ్ స్పేస్స్టేషన్లో ఉన్నప్పుడు ఏదైనా చైనా జాతీయ ప్రత్యేక దినోత్సవాలు వచ్చినప్పుడు వేడుకల్లో భాగంగా ఈ వంటకాలను ఇందులో తయారుచేయొచ్చు. దీర్ఘకాల అంతరిక్ష ప్రాజెక్టుల్లో వ్యోమగాములకు రుచికరమైన ఆహారం అందించే లక్ష్యంతో ఈ ఓవెన్ను తయారుచేసినట్లు చైనా తెలిపింది. స్పేస్ బార్బెక్యూతో పసందైన వంటకాలను తినబోతున్నామని చైనా వ్యోమగాములు చెప్పారు. గతంలో రష్యా, అమెరికా, చైనా సంయుక్తంగా నిర్మించిన, ప్రస్తుతం విధుల్లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చాక్లెట్చిప్ కుకీలను బేక్ చేసినా అందుకు చాలా సమయం పట్టింది. కానీ చైనా వ్యోమగాములు కేవలం 28 నిమిషాల్లోనే చికెన్ వింగ్స్ను సంపూర్ణంగా ఉడికించి శెభాష్ అనిపించుకున్నారు. మటన్ ముక్కలనూ బేక్ చేశారు. -
పాక్ చైనా అణుపరీక్షలు చేస్తున్నాయి
వాషింగ్టన్: దశాబ్దాల క్రితంనాటి తొలితరం అణుబాంబు ధాటికే హిరోషిమా, నాగసాకి నగరాలు తుడిచిపెట్టుకుపోయిన దారుణోదంతాలను చవిచూసిన ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో చెడువార్తను మోసుకొచ్చారు. గత ఒడంబడికలను బుట్టదాఖలుచేస్తూ ఇకపై తాము అణుపరీక్షలు చేపడతామని ట్రంప్ సోమవారం ప్రకటించారు. తాము మాత్రమే అణుపరీక్షలు చేయట్లేమని, ఇప్పటికే పాకిస్తాన్, చైనా ఈ పని మొదలెట్టాయని ఆయన కొత్త విషయం చెప్పారు. సీబీసీ న్యూస్ ఛానల్ వారి నోరా ఓ డేనియల్ ఇంటర్వ్యూలో ట్రంప్ పలు విషయాలను వెల్లడించారు. ‘‘ రష్యా అణు పరీక్షలు చేస్తోంది. చైనా తక్కువేం తినలేదు. అదికూడా అణుపరీక్షలు చేస్తోంది. ఈ విషయాన్ని అవి బహిరంగంగా చెప్పట్లేవు. మేం అలా కాదు. మేం అన్నీ చెప్పేస్తాం. అమెరికా సైతం అణుపరీక్షలు చేయబోతోంది. ఎందుకంటే వాళ్లంతా చేస్తున్నారుగా. ఉత్తర కొరియా ఇప్పటికే అణుపరీక్షలు చేసేసింది. పాకిస్తాన్ ఇప్పుడు చేస్తోంది’’ అని ట్రంప్ చెప్పారు. ‘‘ కొన్ని దేశాలు తమ అణు పరీక్షల వివరాలను బహిర్గతంచేయట్లేవు. ఆ అణుపరీక్షలు భూగర్భంలో జరుగుతున్నాయో. దాంతో అవి ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయో ఎవరికీ తెలీవు. కేవలం సూక్ష్మస్థాయిలో ప్రకంపనలు మాత్రమే వస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికా పరీక్షలు జరపడం సబబే’’ అని ట్రంప్ తన నిర్ణయాన్ని సమరి్థంచుకున్నారు. ‘‘అణ్వాయుధాలను తయారుచేశాక వాటిని పరీక్షించకుండా ఉంటే ఎలా? అవి పనిచేస్తున్నాయో లేదో తెలియాలంటే పరీక్షించాలి కదా. అయినా ఇతర దేశాలు అణుపరీక్షలు జరుపుతూ అణ్వ్రస్తాలను పెంచుకుంటున్నాయి. అమెరికా సైతం తగు నిల్వలను సముపార్జించాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్కు పొంచి ఉన్న ముప్పు చైనా, పాక్లు కొత్తగా అణుపరీక్షలు జరుపుతోందన్న ట్రంప్ వ్యాఖ్యలతో సరిహద్దున పొరుగుదేశంతో భారత్కు అణుముప్పు పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే భారత్ కంటే అత్యధికంగా చైనా వద్ద ఏకంగా 600 అణ్వాయుధాలు ఉన్నాయి. మరో ఐదేళ్లలో వీటి సంఖ్య 1,000కి చేరుకోనుంది. పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలున్నాయి. భారత్ వద్ద 180 అణువార్హెడ్లు ఉన్నాయి. అంతర్జాతీయ అధికారిక రికార్డ్ల ప్రకారం రష్యా 1990తర్వాత అణుపరీక్షలు జరపలేదు. చైనా 1996 తర్వాత, భారత్ 1998 మే తర్వాత అణుపరీక్షలు చేయలేదు. -
బీజింగ్లో రామాయణ నృత్య రూపకం
బీజింగ్: ప్రముఖ చైనా పండితుడు, దివంగత ప్రొఫెసర్ జి.జియాన్లిన్ అనువదించిన రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ఆది కావ్యం–మొదటి కవిత’అనే నృత్య రూపకాన్ని చైనా కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. భారత నాట్యంలో నిపుణురాలైన చైనా కళాకారిణి జిన్ షాన్షాన్ దర్శకత్వంలో, 50 మందికి పైగా ప్రతిభావంతులైన స్థానిక కళాకారులతో కూడిన బృందం ఈ నాటకాన్ని శనివారం ఇక్కడి భారత రాయబార కార్యాలయంలో ప్రదర్శించింది. ఇది ‘అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనం’.. అని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్లో అభివరి్ణంచింది. ఈ ప్రదర్శనను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. ఈ నృత్య రూపకాన్ని బీజింగ్లో ప్రదర్శించడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో మొదటిసారి ప్రదర్శించారు. గత నెలలో, రాయబార కార్యాలయం ’సంగమం–భారతీయ తాతి్వక సంప్రదాయాల సమ్మేళనం’ అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించింది. ఇందులో ప్రముఖ చైనా పండితులు భగవద్గీత, భారతీయ నాగరికతా విలువలపై ప్రసంగించారు. -
చరిత్ర సృష్టించిన కేరళ.. కడు పేదరికానికి పుల్స్టాప్
కేరళ రాష్ట్రం చరిత్ర సృష్టించింది. దేశంలో కడు పేదరికాన్ని(extreme poverty) నిర్మూలించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు దక్కించుకుంది. శనివారం ఆ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక ప్రకటన చేశారు. తద్వారా చైనా దేశం తర్వాత అలాంటి ఘనత పొందిన రెండో ప్రాంతంగా కేరళ నిలిచింది.ఇది కేవలం గణాంకాల విషయం కాదు.. మానవీయ విజయం అంటూ శనివారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో పినరయి విజయన్ ప్రకటించారు.ఇవాళ(నవంబర్ 1న) “కేరళ పిరవి” (Kerala Piravi) దినోత్సవం(రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం). ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగ్గా.. పలువురు రాజకీయ, సినీ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మేం చెప్పినదాన్నే అమలు చేశాం. వాస్తవాలు తెలియజేస్తున్నాం అంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టారాయాన. అయితే ప్రభుత్వ ప్రకటనను మోసపూరితంగా అభివర్ణిస్తూ ఈ సెషన్ను ప్రతిపక్షాలు బహిష్కరించాయి.2021లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే “అత్యంత పేదరిక నిర్మూలన” లక్ష్యంగా నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్లే.. 4 లక్షల మంది ఎన్యూమరేటర్లు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి 1,03,099 మంది అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తించారు. ప్రతి కుటుంబానికి ప్రత్యేక మైక్రో ప్లాన్ రూపొందించి.. కుడుంబశ్రీ(కుటుంబశ్రీ), స్థానిక సంస్థలు, సామాజిక సంక్షేమ శాఖ కలిసి అమలు చేశాయి.చైనా తర్వాత కేరళనే.. 2019లో అత్యంత దుర్భర పేదరికం నిర్మూలించిన దేశంగా చైనా నిలిచింది. ప్రపంచ బ్యాంక్, UNDP, మరియు చైనా ప్రభుత్వ నివేదికలు ద్వారా గుర్తింపు పొందింది. ఆ తర్వాత.. ఇప్పుడు కేరళ ఆ ఘనత సాధించడం గమనార్హం. ప్రతి వ్యక్తికి ఆహారం, నివాసం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రాథమిక అవసరాలు అందుతున్నాయని కేరళ ఈ సందర్భంగా ప్రకటించుకుంది.కేరళ రాష్ట్రం భారతదేశంలో 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అంతేకాక, దేశంలో మొట్టమొదటి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా, పూర్తిగా విద్యుతీకరణ పొందిన రాష్ట్రంగా కూడా నిలిచింది. ఇప్పుడు.. అత్యంత దుర్భర పేదరికం (extreme poverty) నిర్మూలనలో భారతదేశంలో తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. -
‘భారతీయులే కీలకం.. హెచ్-1బీ వీసాపై మరో ట్విస్ట్’
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ(H-1B) వీసాలపై ఫీజు పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీసాలపై ప్రకటనను పునఃపరిశీలించాలని అమెరికా చట్టసభ సభ్యుల బృందం.. తాజాగా ట్రంప్ను కోరడం విశేషం. ఫీజు పెంపుల అంశం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండగా.. ఏఐ(AI) సాంకేతిక నాయకత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా చట్టసభ సభ్యుల బృందం ప్రతినిధులు జిమ్మీ పనెట్టా, అమీ బెరా, సలుద్ కార్బజల్, జూలీ జాన్సన్ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లేఖ రాశారు. ఈ లేఖలో హెచ్1-బీ వీసాల ఫీజుల పెంపు గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. లేఖలో..‘హెచ్-1బీ గ్రహీతల్లో అత్యధిక వాటాను భారతీయులు కలిగి ఉన్నారు. వారిలో ఎక్కువ మంది సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు(AI)లో అమెరికా నాయకత్వానికి కేంద్రంగా ఉన్నారు. వీసాల విషయం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు కూడా ఎంతో కీలకం. ఇలాంటి వీసా విధానం ఇండో-పసిఫిక్లో అమెరికాకు అత్యంత సన్నిహిత ప్రజాస్వామ్య మిత్రదేశాలలో ఒకటైన భారత్తో సంబంధాలను దెబ్బతీస్తుంది. వీసాల అమలు వల్ల కీలకమైన ప్రజాస్వామ్య భాగస్వామితో వ్యూహాత్మకంగా అమెరికా భాగస్వామ్యం బలపడుతుంది.మరోవైపు.. ఏఐ, అధునాతన సాంకేతికతలలో చైనా దూకుడుగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో మనం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడాన్ని కొనసాగించాలి. హెచ్-1బీ వీసాల అమలు అంటే కేవలం ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయడం కాదు. ఇది 21వ శతాబ్దంలో ప్రపంచ శక్తిని నిర్వచించే పరిశ్రమలలో అమెరికా నాయకత్వాన్ని చూపించడం. వీసాల ఫీజు పెంపు పెద్ద కంపెనీలకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ.. నైపుణ్యంపై ఆధారపడే స్టార్టప్లు, పరిశోధన సంస్థలను గుదిబండగా మారుతుంది’ అని హెచ్చరించారు. లేబర్ డిపార్ట్మెంట్ వీడియో..ఇదిలా ఉండగా.. హెచ్-1బీ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తున్నారని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఆరోపించింది. హెచ్-1బీ వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ యువత తమ అమెరికన్ డ్రీమ్స్ కోల్పోతున్నారని, పరిస్థితిని సరిచేసి ఆ కలను తిరిగి అమెరికా ప్రజలకు ఇవ్వాలని సంకల్పించామని పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా వీడియో విడుదల చేసింది.ఈ వీడియోలో చూపించిన గణాంకాల ప్రకారం, హెచ్-1బీ వీసాలలో 72 శాతం భారతీయులకే జారీ అవుతున్నాయని వెల్లడించింది. వీసా కింద అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య కార్మికుల్లో అధికశాతం భారత్ నుంచే వెళ్తున్నారని తెలిపింది. వీసా వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయా అని గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్వాల్ పేరిట ఆడిట్ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమిస్తూ, స్థానిక అమెరికన్లకు నష్టం కలిగించే కంపెనీలను గుర్తించడమని పేర్కొంది. -
‘తాత్కాలిక సంధి’ కాలం!
ఎట్టకేలకు అమెరికా–చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు దక్షిణ కొరియాలోని బూసాన్లో గురు వారం చర్చించాక ఇరు దేశాల మధ్యా తాత్కాలిక సంధి కుదిరింది. వాణిజ్య కీచులాట లకు రెండు దేశాలూ ఏడాది పాటు విరామం ప్రకటించాయి. చైనా దిగుమతులపై విధించిన సుంకాల్లో 10 శాతం తగ్గించాలని అమెరికా నిర్ణయించింది. అలాగే అపురూప ఖనిజాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని చైనా నిర్ణయం తీసుకుంది.దాంతోపాటు అమెరికా నుంచి సోయాబీన్స్ కొనుగోళ్లను పునరుద్ధరించటానికి అంగీకరించింది. రెండు దేశాల దోబూచులాట ట్రంప్ ఆగమనంతో మాత్రమే మొదలుకాలేదు. ఆ రెండింటి మధ్యా అంతకుముందే ఉన్న వాణిజ్య ఆధిపత్య పోటీ జో బైడెన్ హయాంలో తీవ్రతరమైంది. దాన్ని ట్రంప్ మరింత ఎగదోశారు. మొన్న ఏప్రిల్లో చైనాపై 145 శాతం సుంకాలు విధించారు. ఈ బ్లాక్మెయిల్కు తలొగ్గబోమనీ, తుదివరకూ పోరాడతామనీ చైనా జవాబిచ్చింది. ఈ పోటీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలన్నీ సతమతమయ్యాయి. కానీ తాజా చర్చల వల్ల తాత్కాలికంగానైనా అవి సద్దు మణగటం మంచి పరిణామం. ఈ చర్చలు మరిన్ని చర్చలకు దారితీసి వాణిజ్య సంధికి దారితీయొచ్చన్న ఆశాభావం కూడా అందరిలో వ్యక్తమవుతోంది. ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్నప్పుడు చిరునవ్వులు రువ్వుకోవడం, ఎక్కువసేపు కరచాలనాలతో ఫొటోలకు పోజులివ్వటం రివాజే. ట్రంప్, జిన్పింగ్లిద్దర్నీ అంచనా వేయటం అంత సులభం కూడా కాదు. అందులోనూ ట్రంప్ 24 గంటలు తిరగకుండా మాట మార్చటంలో సిద్ధహస్తుడు. అందువల్ల బూసాన్ సమావేశంపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైగా చర్చల అనంతరం ట్రంప్ ప్రకటించినంతస్పష్టంగా చైనా వైపు నుంచి వివరణ లేదు. ‘కీలక ఆర్థిక, వాణిజ్య అంశాలపై అధినేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య దృఢమైన పునాది కోసం ట్రంప్తో కలిసి పనిచేయటానికి షి సంసిద్ధత చూపారు’ అని చైనా ప్రకటన చెబుతోంది. అపురూప ఖనిజాల సంగతేమీ అందులో లేదు. కాకపోతే చైనా వాణిజ్య శాఖ ప్రకటన ‘అక్టోబర్ 9 నాటి ఎగుమతుల నియంత్రణలను’ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలి పింది. అందులో అపురూప ఖనిజాలు కూడా ఉన్నాయి. కార్లు, సెమీ కండక్టర్లే కాక సైనిక ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు తేలినందువల్లే నియంత్రణ విధించామని చైనా లోగడ తెలిపింది.ట్రంప్ తగ్గించామంటున్న సుంకాల విషయంలోనూ తకరారు ఉంది. మాదక ద్రవ్యాల తయారీకి తోడ్పడే ఫెంటానిల్ రసాయనాన్ని చైనా ఎగుమతి చేస్తోందని ఆరో పిస్తూ చైనా సరుకులపై ట్రంప్ 20 శాతం సుంకాలు విధించారు. ఇప్పుడు 10 శాతం తగ్గించటమంటే దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని అర్థం. తాము కూడా సుంకాలు సవరిస్తామని చైనా అంటున్నది. తమ ఎన్విడియా కంపెనీ చిప్లను చైనా కొనుగోలు చేయొచ్చని ట్రంప్ అన్నప్పటికీ బ్లాక్వెల్ చిప్ల విషయం చర్చకు రాలేదంటున్నారు.అంటే ఈ సంధిలోనూ అపరిష్కృత సమస్యలు దాగున్నాయి.రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలూ అగ్రభాగాన ఉన్నాయన్న మాటేగానీ మాంద్యంతో యాతన పడుతున్నాయి. ట్రంప్ సుంకాల యుద్ధంతో సోయాబీన్స్ను బ్రెజిల్ నుంచి చైనా కొనుగోలు చేయటం మొదలెట్టింది. దాంతో అమెరికా రైతులు దివాలా స్థితికి చేరారు. అది ట్రంప్ను ఊపిరాడకుండా చేస్తోంది. అందుకే జిన్పింగ్తో చర్చల్లో తైవాన్ సమస్య జోలికి పోలేదు. అటు చైనా 2021 నాటి స్థిరాస్తి మార్కెట్ సంక్షోభం నుంచి బయటపడలేదు. దేశంలో కొనుగోలు శక్తి పడిపోవటంతో సరుకు అమ్ముడు కాక మార్కెట్లు నేలచూపు చూస్తున్నాయి. 2035 నాటికి ఏఐలో అగ్రగామిగా మారి తిరిగి పుంజుకోవాలనుకుంటున్నా అమెరికా నియంత్రణలు అడ్డంకిగా మారాయి. విద్య, నైపు ణ్యాల్లో భారీగా వ్యయం చేయాలనుకుంటున్న చైనా అందుకవసరమైన పెట్టుబడుల కోసం చూస్తోంది. అపురూప ఖనిజాల నియంత్రణ ద్వారా ఇప్పటికైతే అమెరికాను దారికి తెచ్చుకుంది. వచ్చే ఏప్రిల్లో బీజింగ్ సందర్శిస్తానని ట్రంప్ అంటున్నారు గనుక ఆ లోగా ఈ ‘తాత్కాలిక సంధి’ సామరస్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
చైనాకు ట్రంప్ గుడ్న్యూస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. చైనాపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గురువారం దక్షిణ కొరియా బుసాన్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. జిన్పింగ్తో భేటీ అద్భుతంగా జరిగిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం.. 2018 దాకా చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 0-5 శాతంగా ఉండేవి. అయితే 2021లో అది 20 శాతానికి చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టి టారిఫ్ వార్ మొదలుపెట్టాక చైనా విషయంలోనూ పెంపు ఉండొచ్చని అంతా భావించారు. అందుకు తగ్గట్లే అది 57 శాతానికి చేరింది. అయితే ఆ పెంపు 155 శాతం దాకా ఉంటుందని.. నవంబర్ 1వ తేదీ నుంచి అమలు అవుతుందని ఆయన హెచ్చరించారు కూడా. ఈలోపు..పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా గురువారం ఈ ఇరు దేశాధినేతలు రెండు గంటలపాటు సమావేశం కాగా, చర్చలు ఫలవంతం అయ్యాయి. తాజా తగ్గింపుతో సుంకాలు 47 శాతానికి చేరాయి. ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక అద్భుతమైన ఆరంభం అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. టారిఫ్ తగ్గింపుతో పాటు సోయాబీన్ కొనుగోళ్ల పునరుద్ధరణ, అలాగే.. రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి ఇంతకు మించి ఏం చెప్పలేనన్న ఆయన.. ముఖ్యమైన అంశాలకు సంబంధించి వివరాలను కాసేపట్లో విడుదల చేస్తామని మీడియాకు తెలిపారు. -
మాది గొప్ప సంబంధం.. మళ్లీ కలవడం ఆనందంగా ఉంది
వాణిజ్య ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ముఖాముఖి మాట్లాడుకున్నారు. దక్షిణ కొరియా బుసాన్లో గురువారం ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా ఈ ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత.. కరచలనం చేసుకుంటూ నవ్వుకుంటూ ఇద్దరూ మీడియా ముందు ఫోజులిచ్చారు. ఆపై ఇరు దేశాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ జరిపారు.‘‘మా మధ్య మంచి పరిచయం ఉంది. మాది గొప్ప సంబంధం. మళ్లీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగానే కుదిరే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మీరు తిరిగి అధ్యక్షుడయ్యాక మూడుసార్లు ఫోన్లో మాట్లాడాం, చైనా-అమెరికా ఆర్థిక సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. అమెరికాను గొప్ప దేశంగా మార్చే దృష్టితో చైనా అభివృద్ధి సాగుతోంది అని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. ఇరు దేశాల సంబంధాలు స్నేహపూర్వకంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అదే సమయంలో.. BREAKING 🚨 China’s President stuns the world THANKING President Trump for promoting PEACE "Mr President you care a lot about world peace. You are very enthusiastic about settling regional hotspot issues”I AM IN TOTAL SHOCK 🔥 pic.twitter.com/yEkzCdigUf— MAGA Voice (@MAGAVoice) October 30, 2025చైనా-అమెరికా.. రెండు ప్రపంచ శక్తులు. అవి ఎప్పుడూ ఒకే అభిప్రాయంలో ఉండకపోవడం సహజం. పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం కూడా సహజమే. కానీ వాటిని ద్వైపాక్షిక సంబంధాల చర్చల ద్వారా అధిగమించి ముందుకు ఎలా సాగుతామనేదే ముఖ్యం అని జిన్పింగ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. మరోవైపు.. గాజా కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రపై జిన్పింగ్ ప్రశంస గుప్పించారు. ప్రపంచ శాంతికి ఈ ఒప్పందం మీరు చేసిన గొప్ప కృషి అని అన్నారాయన. ఇలాంటి శాంతి చర్చలకు చైనా మద్దతు తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. అంతకు ముందు.. JUST IN: 🇺🇸🇨🇳 President Trump officially meets with Chinese President Xi Jinping to discuss trade deal. pic.twitter.com/lIB0O68Wo7— Watcher.Guru (@WatcherGuru) October 30, 2025తమ భేటీ విజయవంతం అవుతుందనే ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నాకు ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన(జిన్పింగ్) చాలా కఠినమైన చర్చాకర్త. అది ఏమాత్రం మంచిది కాదు’’ అంటూ అక్కడ నవ్వులు పూయించారు. ఇదిలా ఉంటే.. 2018లో ప్రారంభమైన ట్రంప్-చైనా వాణిజ్య యుద్ధం 2025లో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసింది. ట్రంప్ సుంకాల బెదిరింపులు.. చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" ఎగుమతులపై నియంత్రణలను విధించడంతో పరిస్థితి క్షీణించసాగింది. ఈ తరుణంలో.. తాజా భేటీ చైనా–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు దారితీసే అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చిస్తారని, ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో జరుగుతున్న భేటీ సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అయితే ట్రంప్-జిన్పింగ్ల భేటీ కంటే ముందే ట్రేడ్ డీల్కు సంబంధించిన ఒప్పందం ఖరారైనట్లు సంకేతాలు అందుతున్నాయి. దీని ప్రకారం.. అమెరికా సుంకాలను నిలిపివేయడం, అలాగే.. చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" నియంత్రణలను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయడం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
ట్రంప్కి ఊహించని ఎదురుదెబ్బ!
పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి..అంతర్జాతీయ సమాజంలో ఒంటరితనం.. వెరసి ఒత్తిడికి గురైన ఇరాన్-రష్యాలు.. ఇప్పుడు అమెరికా సైతం అడ్డుకోలేని మార్గాన్ని ఎంచుకున్నాయి అదే 162 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ప్రపంచ వాణిజ్యాన్ని శాశ్వతంగా మార్చివేయగల ఈ పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది.. ఇరాన్-రష్యాల మధ్య రష్ట్ నుంచి అస్తారా వరకు నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గం ఇనుము, కాంక్రీటుతో కూడిన ఉత్త నిర్మాణం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC)లో అత్యంత కీలక భాగం. మొత్తం 7,200 కిలోమీటర్ల పరిధిలోని ఈ కారిడార్ వాణిజ్య ఖర్చులను ఈ రైల్వే లైన్ 30 శాతం తగ్గించడమే కాదు.. రవాణా సమయాన్ని కూడా 37 రోజుల నుండి 19 రోజులకు తగ్గించగలదు. పైగా సుయాజ్ కాలువ మార్గంతో పోలిస్తే సగం సమయం మాత్రమే!.ఇరాన్తో ఈ ఏడాది జనవరిలోనే రష్యా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కీలక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 1.6 బిలియన్ యూరోల(మన కరెన్సీలో 1,641 కోట్ల రూపాయలు) నిధులను ఒక్క రష్యానే ఈ ప్రాజెక్టు కోసం సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టు గనుక అందుబాటులోకి వస్తే.. ప్రతి ఏడాది 20 మిలియన్ టన్నుల సరుకులు(నూనె, గ్యాస్, ఉక్కు, ఆహారం, యంత్రాల వంటివి) రవాణా చేయొచ్చు. అయితే..రష్యా-ఇరాన్ ఈ రైలు ప్రాజెక్ట్ వ్యూహాత్మకమేనన్న అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ఏర్పడిన ఒంటరితనాన్ని అధిగమించి, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రధారులుగా మారాలని రష్యా, ఇరాన్లు భావిస్తున్నాయనేది స్పష్టం అవుతోంది. పైగా సూయాజ్ కాలువ, మలక్కా జలసంధి పాశ్చాత్య దేశాలు అడ్డుపడదగిన మార్గం కాదు కూడా.ఏయే దేశాలు చేతులు కలపొచ్చు?చైనా ఈ అభివృద్ధిని ఆసక్తిగా గమనిస్తోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో(BRI) ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం నుండి బాల్టిక్ వరకు నిరంతర వాణిజ్య మార్గాన్ని పర్యవేక్షిస్తోంది. పాశ్చాత్య ఆంక్షలను తిరస్కరిస్తున్న ఈ బ్లాక్.. భవిష్యత్తులో INSTCతో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. 2024లో రష్యా అధికారికంగా గుర్తించిన తాలిబన్ పాలిత అఫ్గనిస్తాన్ కూడా ఈ కారిడార్లో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది పాకిస్థాన్ను పక్కనపెట్టి దక్షిణాసియాలోకి మార్గాన్ని విస్తరించనుంది. ఇదే సమయంలో భారత్ ప్రతిపాదించిన IMEC కారిడార్(అమెరికా, భారత్, ఇజ్రాయెల్, యూరప్ కలిసి ప్రతిపాదించిన మార్గం) ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. దీంతో.. భారత్ కూడా ఈ మార్గాన్ని పరిశీలించవచ్చనే అంచనాలున్నాయి. ప్రభావం..ఈ రైలు మార్గం (Rasht–Astara) పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా అమెరికా ప్రభావాన్ని తగ్గించడంలో కీలకమే చెప్పొచ్చు. పైగా ఈ కారిడార్ ద్వారా చైనా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో రష్యా-ఇరాన్ సంబంధాలు బలపడతాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరచే దిశగా సాగుతుంది. బ్రిక్స్, SCO బలమైన మద్దతుతో.. పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అడ్డుకోగలరా?ఇంతటి వ్యూహాత్మకమైన రైలు మార్గాన్ని ట్రంప్ దీన్ని నేరుగా అడ్డుకోవడం చాలా కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. అయితే.. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రొత్సహించడమో(IMEC కారిడార్ త్వరగతిన పూర్తయ్యేలా చూడడం) లేదంటే ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లతో ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇదీ చదవండి: ప్రపంచానికి దారిదీపం భారతే! -
కిడ్నీ మార్పిడి కోసం కేన్సర్ రోగిని పెళ్లాడింది..కట్చేస్తే..!
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ ...అన్న పాట గుర్తుకొస్తుంది ఈ ఘటన. ఏదో వ్యాధుల కారణంగా.. అవసరార్థం పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి ప్రేమ, ఇష్టం వంటివి లేదు. రోగాల కారణంగా ఒక్కటయ్యారు..కానీ వారి మధ్య విడదీయరానంత ప్రేమ చిగురించేలా చేసి..అద్భుతమే చేసింది ఆ దంపతుల మధ్య. ఎవరా ఆ జంట..? ఏమా కథ చూసేద్దామా..!2014లో చైనాలోని షాంగ్జీకి చెందిన 24 ళ్ల వాంగ్ జియావో అనే మహిళ యురేమియా అనే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి ఎంతలా ఉందంటే..ఆమెకు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స జరగకపోతే.. ఒక్క ఏడాదికి మించి బతకదని తేల్చి చెప్పేశారు వైద్యులు. అయితే ఆమెకు కిడ్నీ దానం చేసేందుకు సన్నిహితులు, బంధువులు ముందుకొచ్చినా..వాళ్లెవ్వరిది ఆమెకు సరిపోలేదు. ఓ పక్క సమయం మించిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు కేన్సర్ పేషెంట్ అయిన జాంగ్ లియాంగ్ అనే వ్యక్తి ఓ విచిత్రమైనా ఆఫర్ ఇచ్చాడామెకు. "తాను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, చనిపోయేంతవరకు చికిత్స సమయంలో తనను ప్రేమగా చూసుకునే తోడు కోసం ఆశిస్తున్నానని, అందుకు ప్రతిగా తను మరణించాక కిడ్నీని ఇస్తానని చెబుతాడు". ఇక్కడ వాంగ్కి మరో ఛాన్స్లేదు. పైగా తక్కువ వ్యవధి ఉంది. మరోవైపు జాంగ్కి సంరక్షణ, ఒక తోడు కావాలి. దాంతో బాగా ఆలోచించి వాంగ్ ఓ ఒప్పందం ప్రకారం..జాంగ్ని పెళ్లి చేసుకుంది. ఒకరు మనుగడ కోసం, మరొకరు సంరక్షణ ఆశిస్తూ చేసుకున్న ఈ వివాహం వారి జీవితాను ఊహించిన మలుపు తిప్పింది.అద్భుతం చేసిన ప్రేమ..మొదట్లో ఒప్పందాల పెళ్లి కాస్త. .బలమైన బంధంగా మారిపోయింది. అతడి కోసం వంట చేసి, కీమోథెరపీ చికిత్సలలో జాంగ్ కోరిన సంరక్షణను అందించింది. వైద్య సమస్యల కారణంగా పరిచయమైన ఈ అపరిచిత జంట వారాలు గడుస్తున్న కొద్ది.. ఇద్దరి మధ్య అనురాగం ఏర్పడి..విడిచి ఉండలేనంతగా ప్రేమ చిగురించింది. అచ్చం ప్రేమికులు మాదిరిగా అయిపోయారు ఆ దంపతులు. దూకుడుగా ఉన్న జాంగ్ కేన్సర్ వాంగ్ సహచర్యం ప్రేమ కారణంగా మెరుగవ్వుతూ..వైద్యులే విస్తుపోయేలా తగ్గిపోయింది. మొత్తానికి ఆ మహమ్మారి కేన్సర్ని జయించాడు జాంగ్. అతడు బాగుండటమే చాలు అన్నంత స్థితికి వాంగ్ వచ్చేసింది కూడా. మొదట్లో తాను బతకాలని ఆశించినా .. రాను రాను అతడు ఉంటేనే తన ప్రాణం ఉంటుంది అన్నంతగా ప్రేమను పెంచేసుకుంది. ఇక్కడ వాంగ్కి జాంగ్ కిడ్నీ రాలేదు, అయినా అలా వ్యాధితో పోరాడతూనే ఉండాలనే ఫిక్స్ అయ్యింది. విచిత్రం ఏంటంటే..ఆ వ్యాధులు ఇద్దరిని దంపతులుగా చేసి, వాటిని క్యూర్ అయ్యేలా చేశాయి. ఇక్కడ వాంగ్కి కూడా మూత్రపిండాల వ్యాధి సివియర్గా లేదని మెరుగవ్వుతుందని, మందులతో నిర్వహించొచ్చని వైద్యులు చెప్పడం విశేషం. ఇలా జరుగుతుందని ఊహించను కూడా లేదని ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ జంట. ఈ స్టోరీ ప్రేమ గొప్పతనం ఏంటో చెప్పకనే చెబుతోంది. పైగా జీవిత పరమార్థమే తానని చెప్పకనే చెప్పేసింది ఈ రెండక్షరాల ప్రేమ ..! మనం కోసం ఓ వ్యక్తి ఉన్నారు అంటే ఎంతటి అగాథాన్ని అయినా..సవాలునైనా అధిగమించి సునాయసంగా బటయపడగలం అనేందుకు ఈ దంపతులే ఉదాహరణ. ఇక్కడ ఆ జంట విషయంలో ప్రేమ అద్భుతమే చేసింది కదూ..!. (చదవండి: Delhi Police constable Sonika Yadav: వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!) -
భారత్తో లోతైన చర్చలే జరిపాం: చైనా
చైనా-భారత్ నడుమ సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇరు దేశాల సైన్యాలు ఈ మేరకు లోతైన చర్చలే జరిపినట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ వర్గాలు ఈ ప్రకటనను ధృవీకరించాల్సి ఉంది.పశ్చిమ సరిహద్దు ప్రాంతాల నిర్వహణపై కీలక చర్చలు జరిగాయని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో సైనిక , దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపింది. ఈ సమావేశం అక్టోబర్ 25వ తేదీన భారత వైపు ఉన్న ఒక నిర్దిష్ట సమావేశ స్థలంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఇదే తరహాలో జూలైలో కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) పరిసర ప్రాంతాల్లో పరిస్థితులపై చర్చలు జరిగాయి. చైనా ఈ చర్చలను కూడా “స్పష్టమైన”విగా పేర్కొంది. ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుతంగా, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుతున్నాయని తెలిపింది.2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సైనిక మోహరింపుతో నాలుగేళ్ల పాటు ఉద్రిక్త పరిస్థితులే కొనసాగాయి. అయితే.. 2024 అక్టోబర్లో కుదిరిన ఒప్పందం తర్వాత ఇండియా-చైనా సంబంధాలు మెరుగవుతున్న సూచనలు కనిపించాయి. ఈలోపు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ , చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య తియాంజిన్లో షాంగై సమ్మిట్ సందర్భంగా చారిత్రక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, “భారత్-చైనా ప్రత్యర్థులు కాదు, భాగస్వాములు” అని ఇరు దేశాధినేతలు స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడుకోవడం, పరస్పర గౌరవం, సహకారం అందించుకోవడంపై రెండు దేశాలు అంగీకరించాయని ఆ సందర్భంలో మోదీ తెలిపారు. ఈ భేటీ వేదికగా.. వాణిజ్య, పౌరవిమానయాన, పెట్టుబడుల పరంగా పరస్పర సహకారం పెంచేందుకు 12 అంశాలపై అవగాహన ఏర్పడింది.అయితే ఈ ఒప్పందాల తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారతాయని భావించినప్పటికీ.. అలాంటిదేం కనిపించేదు. ప్రస్తుతం.. తూర్పు లడాఖ్లో LAC వెంబడి ఇరు దేశాలు సుమారు 50,000–60,000 సైనికులను మోహరించాయి. అయితే తాజా చర్చల పురోగతితో ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: పాక్ ఇంక మారదా?.. మళ్లీ పిచ్చి ప్రేలాపనలు -
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చెక్మేట్!
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. వీళ్లను ఏమాత్రం తక్కువ చేయడానికి వీల్లేదు. మన దేశంలో 35 నుంచి 45 లక్షల మంది ద్వారా గత ఏడాది కాలంలో రూ.3,500 కోట్ల వ్యాపారం జరిగిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే.. ఇలా అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లకు చెక్ పెట్టేందుకు మన పొరుగు దేశం చైనా ఓ అద్భుతమైన ప్రణాళిక అమలు చేయబోతోంది. ఏదో ఒక వీడియోతో ఓవర్నైట్ సెన్సేషన్ అయిపోవడం ఈరోజుల్లో సర్వసాధారణంగా మారింది. అలా భారత్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు.. ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇదే అదనుగా తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్లను కంపెనీలు ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. భారత్తో పాటు పలు దేశాల్లో వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల్లో ఇప్పుడు వాళ్లదే కీలక పాత్ర. పైగా సెలబ్రిటీలకి బదులు తక్కువ బడ్జెట్తో ఆ పని చేస్తుండడం కంపెనీలకు కలిసొస్తోంది. ఫ్యాషన్, ఫిట్నెస్, ఫుడ్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో విస్తృతంగా కంటెంట్ రూపొందిస్తున్నారు. ఉదాహరణకు.. ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలోయింగ్ ఉన్న ఓ వ్యక్తి ఓ కంపెనీ పరుపులను అదే పనిగా ప్రమోట్ చేయడం!. అయితే ఏఐ జమానాలో.. ప్రజలను తప్పుదోవ పట్టించే కంటెంట్ కూడా అదే స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అందుకే చైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రొఫెషనల్ విషయాలపై మాట్లాడాలంటే ఇన్ఫ్లుయెన్సర్లకు అర్హతలు తప్పనిసరి చేసింది. వైద్యం, ఆర్థికం, న్యాయం, విద్య వంటి సున్నితమైన రంగాల్లో కంటెంట్ రూపొందించే ముందు ఇన్ఫ్లుయెన్సర్లు తమ విద్యా అర్హతలు, శిక్షణ పత్రాలు లేకుంటే ప్రొఫెషనల్ అనుభవాన్ని చూపించాల్సి ఉంటుంది. అక్కడి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు (ఉదాహరణకు.. Douyin, Weibo, Bilibili వంటి ప్రముఖ ప్లాట్ఫారమ్లు) ఈ అర్హతలనూ ధృవీకరించాల్సి ఉంటుంది. అలా చేయకుంటే.. ఇన్ఫ్లుయెన్సర్ల సో.మీ. అకౌంట్లను నిలిపివేయడమే కాదు.. శాశ్వత నిషేధం విధించే అవకాశం లేకపోలేదు. అలాగే.. 100,000 యువాన్ (₹11 లక్షల వరకు) జరిమానా విధించబడుతుంది. చైనా సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CAC) ఈ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ రూల్స్లో ఇన్ఫ్లుయెన్సర్లు లగ్జరీ లైఫ్స్టైల్ను ప్రదర్శించడంపై కూడా నిషేధం.ఇన్ఫ్లుయెన్సర్ల వ్యక్తిగత అకౌంట్లు మాత్రమే కాదు.. వాళ్లు నిర్వహించే మల్టీ-చానల్ నెట్వర్క్ (MCN)లకు కూడా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ సంస్థలు తమ టాలెంట్ను రాజకీయంగా, ప్రొఫెషనల్గా సమర్థవంతంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదే సమయంలో.. కంపెనీ బ్రాండ్లు కూడా ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కంపెనీలు లేదంటే సో.మీ. ప్లాట్ఫారమ్లు ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ను స్పష్టంగా లేబుల్ చేయాలి. ఈ లేబుల్స్ను తొలగించడం లేదంటే తారుమారు చేయడం కఠినమైన నేరంగా పరిగణిస్తారు. లేబులింగ్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధిస్తారు. భారత్లో ఇలా.. భారత్లో చైనా తరహా కఠిన నిబంధనలు (అర్హతల ధృవీకరణ, ప్లాట్ఫారమ్లపై బాధ్యత, భారీ జరిమానాలు) అమల్లో లేవు. కానీ.. స్పాన్సర్డ్ కంటెంట్కి డిస్క్లోజర్ తప్పనిసరిగా ఉంది. అంటే.. ఏఎస్సీఐ (Advertising Standards Council of India) ప్రకారం, #ad, #sponsored వంటి ట్యాగ్లు తప్పనిసరిగా ఉండాలి. అలాగే తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తే, ఇన్ఫ్లుయెన్సర్తో పాటు బ్రాండ్ కూడా Consumer Protection Act (CCPA) ప్రకారం బాధ్యత వహించాలి. ఈ ఏడాదిలో ఏర్పాటైన ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ గవర్నెన్స్ కౌన్సిల్ (IIGC).. నైతిక ప్రమాణాలు, కంటెంట్ నైతికత, వినియోగదారుల హక్కులు వంటి అంశాలపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అయితే..ఏఐ ఆధారిత కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్సహా ఇతర దేశాలు కూడా చైనా విధించిన నిబంధనలను పరిశీలించే అవకాశం ఉంది. స్వేచ్ఛా భావప్రకటనకు ఇది అడ్డంకిగా మారుతుందన్న విమర్శలు ఉన్నప్పటికీ, ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు ఇది అవసరమన్న వాదనలు కూడా ఉన్నాయి. -
ప్రధాని మోదీపై హత్యకు కుట్ర?.. పుతిన్ రక్షించాడా?
భారత ప్రధాని నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ భారీ హత్య కుట్రను భారత, రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా అడ్డుకున్నాయని ఓ సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికాకు చెందిన ఓ స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లు తెలుస్తోంది.మలయాళ మీడియా సంస్థ 'మాతృభూమి', రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) మౌత్ పీస్ ఆర్గనైజర్ కథనాల ప్రకారం, ఆగస్టు 31వ తేదీ రాత్రి ఢాకాలోని ఓ విలాసవంతమైన హోటల్లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ మృతదేహం లభ్యమైంది. బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చానని అధికారికంగా చెప్పినప్పటికీ, అతని ప్రొఫైల్ నిఘా వర్గాలలో అనుమానాలు రేకెత్తించింది. అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లలో అనుభవమున్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అసాధారణం. అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించి నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి. దీంతో జాక్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఉందని భావించారు.Modi’s life was under threat during SCO summit.An american operative was in Bangladesh for the job.Putin invited him to travel in his car.That was the moment 😲Assassin@tion was planned on China's land to blame China. The Russian spy agency saved him. pic.twitter.com/u9TD7pjnZj— Defense Scope🔭 (@DefeScope) October 22, 2025పుతిన్ రక్షించాడా?ఇదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీని తన అత్యంత భద్రత కలిగిన 'ఆరస్ లిమోసిన్' కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇద్దరూ సుమారు 45 నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు. ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడలేవు. సంభాషణలను రికార్డ్ చేయడం గానీ, ట్రాక్ చేయడం గానీ అసాధ్యం. మోదీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారని సమాచారం.25th October 2025. CIA Links Surface After Putin Shielded Modi During SCO Meet.According to Defence News, President Putin saved Indian Prime Minister Modi, from possible assassination attempt at hands of Western Intelligence Agencies. Speculations revolve around direct… pic.twitter.com/yCaigh7heN— Sense and Sensibility (@UNIT_Diplomat) October 25, 2025భారత నిఘా సంస్థ 'రా' (RAW), రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ 'ఎస్విఆర్' (SVR) కొద్దిరోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లను పసిగట్టాయి. పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఆగస్టు 30 రాత్రికే ముప్పును గుర్తించి, నిందితుల కదలికలపై నిఘా పెట్టి కుట్రను అమలు కాకముందే నిర్వీర్యం చేశాయి. ఆ మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.మోదీ వ్యాఖ్యల అర్థమేంటి?చైనా పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ ‘సమీకాన్ ఇండియా’ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి, “నేను చైనాకు వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా? లేక తిరిగొచ్చినందుకా?” అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనం గుర్తుచేసింది. తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డాననే విషయాన్ని ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని కథనం విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో, పలు డిజిటల్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి."Mai gaya tha isliye Tali baja rahe ho YA Laut aaya hu isliye Tali baja rahe ho?"REPORTEDLY, it was planned to turn SCO Summit into Tashkent Summit, but President Putin saved PM Modi Ji from meeting Lal Bahadur Shastri Ji's fate.Ps- China didn't have any hand in it. Same old… pic.twitter.com/3sYLogtyi1— BhikuMhatre (@MumbaichaDon) October 11, 2025ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం, ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉండటం వంటివి అమెరికాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చడంలో అమెరికాకు చరిత్ర ఉందని, ఈ నేపథ్యంలోనే ఈ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
ప్రపంచ జ్ఞానామృతం భగవద్గీత
బీజింగ్: భగవద్గీత జ్ఞానామృతమంటూ ప్రశంసలు చైనా పండితులు కురిపించారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొనే ఆధ్యాత్మిక, భౌతిక సమస్యలకు సమాధానాలు ఇందులో ఉన్నాయన్నారు. భగవద్గీత భారతీయ నాగరికత సూక్ష్మ చరిత్ర వంటిదంటూ శ్లాఘించారు. ఈ ప్రాచీన భారతీయ గ్రంథరాజంపై చైనీయులు ఇలా బహిరంగంగా గౌరవాన్ని ప్రకటించడం అరుదైన విషయంగా చెబుతున్నారు. శనివారం చైనా రాజధాని బీజింగ్లో భారత దౌత్యకార్యాలయం ‘సంగమమ్– భారతీయ తాత్విక సంప్రదాయాలు’అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో పలువురు పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గీతను భారతీయ తత్వశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా అభివరి్ణంచారు. ఆధ్యాత్మిక, భౌతిక అన్వేషణల మధ్య సామరస్యాన్ని సాధించేందుకు భగవద్గీత ఎంతో సాయంగా ఉంటుందన్నారు. భగవద్గీతను చైనీస్ భాషలోకి తర్జుమా చేసిన ప్రొఫెసర్ ఝాంగ్ బావోషేంగ్(88) ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. భగవద్గీతను భారతదేశ ఆధ్యాత్మిక ఇతిహాసం, తాత్విక విజ్ఞాన సర్వస్వంగా ఆయన పేర్కొన్నారు. ఇది నేటికీ భారతీయ జీవనాన్ని తీర్చిదిద్దుతోందని చెప్పారు. ప్రొఫెసర్ ఝాంగ్ భారత్లో 1984–86 సంవత్సరాల మధ్య గడిపిన తన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దక్షిణాగ్రాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న గోరఖ్పూర్ వరకు ప్రతిచోటా శ్రీకృష్ణుని ఉనికిని, ఒక సజీవ నైతిక, ఆధ్యాత్మిక ఆదర్శాన్ని ప్రత్యక్షంగా గమనించానన్నారు. జెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఓరియంటల్ ఫిలాసఫీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వాంగ్ ఝి–చెంగ్ మాట్లాడుతూ.. 5 వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతీయ యుద్ధరంగంలో జరిగిన సంభాషణ అయిన భగవద్గీత, నేడు ప్రజలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, అనేక గందరగోళాలకు సైతం సరైన సమాధానాలను ఇస్తూ కాలాతీతంగా మారిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన పండితులకు భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ఘనస్వాగతం పలికారు. గతేడాది తమ దౌత్య కార్యాలయం రామాయణంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
పటిష్టంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడినట్టు ఆర్బీఐ అక్టోబర్ బులెటిన్ తెలిపింది. ‘‘అమెరికాలో వాణిజ్య, ఆర్థిక పరమైన అనిశ్చితులు పెరిగాయి. అయినప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కుదురుగా ఉంది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తలెత్తడం, అమెరికా ప్రభుత్వం షట్డౌన్ కొనసాగుతుండడంతో అక్టోబర్లో పెట్టుబడిదా రుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపించింది. పట్టణ డిమాండ్ కోలుకుంటున్నట్టు, గ్రామీణ వినియోగం బలంగా ఉన్నట్టు ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ భా రత ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్త ప్రతికూలతలకు దూరంగా ఉండలేదు. కానీ, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరడం, బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, తగినంత విదేశీ మారక నిల్వలు, విశ్వసనీయమైన ద్రవ్య, పరపతి కార్యాచరణతో భారత్ గట్టిగా నిలబడగలిగింది’’అని ఆర్బీఐ తన బులెటిన్లో పేర్కొంది. సంస్కరణల మద్దతు అక్టోబర్ 1 నాటి మానిటరీ పాలసీ కమిటీ తీర్మానం ప్రకారం వృద్ధి అవకాశాలు బలంగానే ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. దేశీ చోద కాలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. దేశీయంగా చేపడుతున్న సంస్కరణలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డాలర్తో రూపాయి విలువ ఇటీవల క్షీణించినట్టు పే ర్కొంటూ.. వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు స్థిరంగా బయ టకు వెళుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వరుసగా మూడో నెల సెపె్టంబర్లో ప్రతికూలంగా నమోదైనట్టు తెలిపింది. ఈ బులెటిన్లోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, అధికారికమైనవి కావని ఆర్బీఐ పేర్కొంది. -
భారత్లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో..
ఒక దేశంలో అధిక ఇళ్లు ఉండి.. కొనుగోలుదారులు లేక సంక్షోభంలో కూరుకుపోతుంటే, మరో దేశంలో కోట్లాదిమందికి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. చైనాలో దాదాపు 90 శాతం మంది ప్రజలకు సొంత ఇళ్లు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. భారతదేశంలో మాత్రం 31 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలకు ఇంకా సొంత గూడు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మన దేశ గృహనిర్మాణ రంగాన్ని, దాని చుట్టూ అల్లుకున్న సవాళ్లకు ఇది అద్ద పడుతుంది. అసలు చైనాలో ఇంత అధిక సంఖ్యలో ప్రజలకు సొంతిల్లు ఉండటానికి కారణాలేమిటి? అదే సమయంలో భారత్లో సొంతింటి కల ఎందుకు సాకారం కావడం లేదో కారణాలను పరిశీలిద్దాం.చైనాలో సొంతిల్లు ఉండటానికి కారణాలుగత ప్రభుత్వ విధానాలు, మార్కెట్ సంస్కరణలు1998కు ముందు చైనాలో పట్టణ గృహనిర్మాణ రంగం దాదాపు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. 1998లో ప్రభుత్వం గృహనిర్మాణ సంస్కరణలను చేపట్టి ప్రజలు ఇళ్లను సొంతం చేసుకోవడానికి అనుమతించింది. అంతకుముందు ఉన్న ఇళ్లను అతి తక్కువ ధరలకు ఇతరులకు విక్రయించారు. దాంతో పెద్దమొత్తంలో సొంతింటి కల నెరవేరింది.సంపద పోగుచేసుకోవడంలో..చైనాలో ప్రజలు సంపదను పోగుచేయడానికి ఇళ్లను అత్యంత సురక్షితమైన, ప్రధాన సాధనంగా భావిస్తారు. విదేశీ పెట్టుబడులకు ఇతర మార్గాలు పరిమితంగా ఉన్నప్పుడు స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ఒక సాంప్రదాయక పద్ధతిగా మారింది. ఇది ఇళ్ల కొనుగోలుకు ఉన్న డిమాండ్ను భారీగా పెంచింది.పట్టణీకరణవేగవంతమైన పట్టణీకరణ కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు తరలివచ్చారు. పెరిగిన డిమాండ్ను తీర్చడానికి స్థానిక ప్రభుత్వాలు భూమిని స్థిరాస్తి డెవలపర్లకు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకున్నాయి. డెవలపర్లు భారీ స్థాయిలో గృహ నిర్మాణాలను చేపట్టారు. కొన్ని సందర్భాల్లో ఇది జనాభా అవసరాల కంటే అధిక సంఖ్యలో ఇళ్లను నిర్మించడానికి దారితీసింది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో అధిక గృహ లభ్యత ఏర్పడింది.Breaking🇨🇳90% of people in China now own their own homes.Most Homeless People (2025)🇮🇳 India – 3.1M+🇺🇸 United States – 580K+🇳🇬 Nigeria – 500K+🇷🇺 Russia – 440K+🇵🇭 Philippines – 420K+🇧🇷 Brazil – 390K+🇮🇩 Indonesia – 380K+🇲🇽 Mexico – 320K+🇿🇦 South Africa – 280K+🇫🇷… pic.twitter.com/ZykA0EBKMX— World updates (@itswpceo) October 22, 2025భారత్లో ఇలా..స్థిరాస్తి ధరలు అధికం, ఆదాయాలు తక్కువపట్టణ ప్రాంతాల్లో భూమి, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరగడం వల్ల ఇళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయ వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో సిటీలు, టైర్-1 నగరాల్లో ఇది ప్రధాన సమస్య.బ్యాంక్ రుణాలు, ఫైనాన్సింగ్ సవాళ్లుగృహ రుణాలు అందుబాటులో ఉన్నప్పటికీ రుణం కోసం అవసరమయ్యే భారీ డౌన్ పేమెంట్ను చెల్లించలేని పరిస్థితులున్నాయి. తక్కువ ఆదాయ వర్గాల వారికి బ్యాంకు రుణాలు పొందడంలో కఠినమైన షరతులు, క్రెడిట్ హిస్టరీ లేకపోవడం అడ్డంకులుగా మారుతున్నాయి.భూమి కొరత, భూ సేకరణ సమస్యలుపెరుగుతున్న జనాభాకు సరిపడా భూమి లభ్యత లేదు. పట్టణ ప్రాంతాల్లో భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది గృహనిర్మాణ ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుతున్నాయి. భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివాదాలు కూడా ప్రాజెక్టుల ఆలస్యానికి, ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.సామాజిక కారణాలుపట్టణ వలస, మురికివాడలుమెరుగైన ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది నిరంతరం నగరాలకు వలస వస్తున్నారు. ఈ వలసలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో గృహ లభ్యత, మౌలిక వసతులు లేకపోవడం వల్ల మురికివాడలు (స్లమ్స్) ఏర్పడుతున్నాయి. ఈ వర్గాలకు సొంతింటి కల సుదూరంగానే ఉంటోంది.ప్రభుత్వ పథకాల అమలు సవాళ్లుకేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY)’ వంటి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ లబ్ధిదారులను గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. ఇది పథకాల అమలు ఆలస్యం అవ్వడానికి కారణమవుతోంది.మౌలిక వసతుల లేమిప్రభుత్వం నిర్మించే తక్కువ ధర గృహాలు కొన్నిసార్లు నగరాలకు దూరంగా ఉంటున్నాయి. చాలావరకు కనీస మౌలిక వసతులు (రవాణా, నీరు, విద్యుత్) అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉండటం వల్ల వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు.భారత్లో సొంతింటి కలను సాకారం చేయాలంటే ప్రభుత్వాలు తక్కువ ఆదాయ వర్గాలకు తగినంత ఫైనాన్సింగ్ సహాయం అందించాలి. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడం, పట్టణ ప్రాంతాల్లో గృహ లభ్యతను పెంచడం వంటివి చేయాలి. భూమి ధరల పెరుగుదలను నియంత్రించడం వంటి సమగ్ర విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: 400 సెల్ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా? -
భారత్ పక్కలో బల్లెంలా చైనా.. సరిహద్దుల్లో ఆయుధాలు
-
భారత్ పక్కలో చైనా మిసైల్ బల్లెం
న్యూఢిల్లీ: కయ్యాలమారి చైనా ఒకవైపు భారత్కు స్నేహ హస్తం అందిస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. టిబెట్లోని పాంగాంగ్ సరస్సు తూర్పు ఒడ్డున, వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అత్యాధునిక గగన రక్షణ వ్యవస్థ బేస్ను నిర్మిస్తోంది. సకల వసతులతోపాటు భారీ ఆయుధాలు, క్షిపణులు మోహరించేలా దీని నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తోంది. ఈ బేస్ను మొదట అమెరికాకు చెందిన ఆల్సోర్స్ అనాలిసిస్ అనే సంస్థ గుర్తించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా బేస్ను కనిపెట్టింది. 2020లో భారత్–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన గస్తీ పాయింట్కు ఈ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గార్ కౌంటీలో ఉన్న ఈ కేంద్రం భారత్లో ఇటీవల ఆధునీకరించిన న్యోమా ఎయిర్ఫీల్డ్కు సరిగ్గా ఎదురుగా ఉంటుంది. భారీ క్షిపణులకు కేంద్రంగా.. ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే ఈ కాంప్లెక్స్లో భారీ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యార్లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు, రాడార్ సిస్టంలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షిపణి లాంచింగ్ వాహనాలను రహస్యంగా దాచి ఉంచేందుకు భారీ బంకర్ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు ముందుకు వెనుకకు జరుపగల పైకప్పును అమర్చినట్లు నిపుణులు గుర్తించారు. అంటే ఆ భవనంలో దాగి ఉన్న వాహనం నుంచి క్షిపణిని ప్రయోగించాలనుకుంటే వెంటనే భవనం పైకప్పు పక్కకు జరుగుతుంది. క్షిపణి ప్రయోగం పూర్తికాగానే మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. శత్రువు నిఘాకు దొరక్కుండా తమ క్షిపణి వ్యవస్థలను దాచేందుకు ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఒక్కో బంకర్ రెండు వాహనాలను నిలిపి ఉంచగల భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ బంకర్ భవనాల్లో చైనా దీర్ఘశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ (భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి) హెచ్క్యూ–9 క్షిపణి వ్యవస్థలను మోహరించనున్నట్లు ఇంటెలిజెన్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ ఈ కాంప్లెక్స్ను బహిర్గతం చేసిన తర్వాత అమెరికాకే చెందిన గగనగల ఇంటెలిజెన్స్ కంపెనీ వంటార్కు చెందిన ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ టీం (ఓఎస్ఐఎన్టీ) మరింత కచ్చితమైన చిత్రాలను సేకరించింది. సెపె్టంబర్ 29న తీసిన శాటిలైట్ చిత్రాల్లో కొన్ని బంకర్ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండగా, కొన్నింటికి మూసి ఉండటం కనిపించింది. ‘ఈ రకమైన భవనాలు చైనా క్షిపణి వ్యవస్థలకు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శత్రువుల ఎదురుదాడి నుంచి తన క్షిపణి వ్యవస్థలను రక్షిస్తాయి. మామూలు సమయంలో అక్కడ మిసైల్ లాంచర్స్ ఉన్నట్లు గుర్తించటం కూడా కష్టమే’అని ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ పేర్కొంది. చైనా గతంలో ఇలాంటి భవనాలనే దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల్లో నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా చేపట్టిన ఈ నిర్మాణాలను గత జూలైలోనే డామియెన్ సైమన్ అనే జియోస్పేషియల్ పరిశోధకుడు గుర్తించాడు. కానీ, అప్పుడు అక్కడ ఏం నిర్మిస్తున్నారన్నది తెలియలేదు. -
ట్రంప్ ‘ఏడువారాల నగలు’
మహారాణులకు, ఏడువారాల నగల వలె, అమెరికా మహారాజు డోనాల్డ్ ట్రంప్కు ఏడువారాల వ్యూహాలుంటాయి. ఈ స్థితిని ప్రపంచం పలు విషయాలలో గమనిస్తున్నది. గమనించి మొదట భయ పడింది. తర్వాత అయోమయానికిగురైంది. చివరకు పరిస్థితి కొంత వినోదాత్మకంగా మారగా, ప్రేక్షకులలో కొందరు ట్రంప్ తలపై ఆయన ఇటీవల స్వయంగా ధరించి పోస్ట్ చేసిన రాజు గారి కిరీటానికి బదులు సర్కస్ క్లౌన్ టోపీని చూస్తున్నారు. కొందరు ఏమిచేయాలో తోచక విసుగెత్తి తలలు పట్టుకుంటున్నారు.అమెరికా అధ్యక్షుని గురించి పైన చేసిన వ్యాఖ్యలేవీ కాలక్షేపపు ఊహాగానాలు కావు. ప్రతి ఒక్కటీ వాస్తవంగా జరుగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకుని అన్న మాటే. అట్లా పరిగణించిన విష యాలు ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, భారత దేశంతో ఆర్థిక – వ్యూహాత్మక సంబంధాలు, చైనాతో వాణిజ్య – వ్యూహాత్మక తగవులు. వీటికి సంబంధించి కొన్ని మాసాల నుంచి మొదలుకొని నేటివరకు మాట్లాడుతున్నవి, చేస్తున్నవి, చేస్తానని చేయనివి, తాను చేయకున్నా ఇతరులు చేయాలనేవి, ఇతరులు చేయాలంటూ తిరిగి అందుకు మార్పులు చేసేవి, తాను చేస్తాననే వాటిలో మార్పులు తెచ్చేవి... అన్నింటినీ ఒక కాలక్రమంలో పేర్చి పెట్టి చూస్తే, మొత్తం మీద కనిపించేది ట్రంప్ చక్రవర్తి ‘ఏడువారాల నగలు’. మనంఅంటున్న ఈ మాట ఆయనకు చేరే అవకాశం లేదుగానీ, ఇటీవల అమెరికన్ పౌరులు ‘నో కింగ్’ అంటూ పెద్ద ఎత్తున జరిపిన నిరసనలను హాస్యాస్పదంగా చూపేందుకు తానే హాస్యాస్పద వేషధారణ చిత్రాన్ని పోస్ట్ పెట్టినట్లు, ఏడువారాల నగలతో ఏడు పోస్టులు పెట్టే వారేమో!చక్రవర్తి ఎందుకు?ట్రంప్ చేస్తున్నదంతా ఒక వ్యూహంలో భాగమని ఆయన అంతే వాసులు ప్రచారం చేసి లోకాన్ని నమ్మించజూశారు. వారు చెప్పిన దాని ప్రకారం ఆయన ఒక విషయమై అవతలి వారిని పిచ్చుకపై వేస్తాను సుమా బహ్మాస్త్రం అన్నట్లు మొదటే భయపెడతారు. అట్లా వేయటం నిజంగా తన ఉద్దేశం కాదు. కానీ అట్లా భయపెడితే అవతలి వారు బ్రహ్మాస్త్ర ప్రయోగం నిజంగానే జరగవచ్చునని భయ పడిపోయి, తన ఆదేశాలను శిరసావహించగలరన్నది ట్రంప్ అంచ నాలట! దానిని వారు బ్రహ్మాస్త్ర వ్యూహమన్నారు. ఇది యథాతథంగా వినేందుకు గొప్పగా తోస్తుంది. మధ్యయుగాల నాటి ‘బెనెవెలెంట్ డిక్టేటర్ (ఉదార నియంత) లక్షణాల తరహాలో కనిపిస్తుంది. ట్రంప్ వ్యక్తిత్వంలో, వ్యవహరణలో నిజంగానే ఈ లక్షణాలు ఉన్నాయన్నది కొందరి అభిప్రాయం. పరిస్థితి అంతవరకే అయితే ఫరవాలేదు. నిజం చెప్పాలంటే ‘ఉదార నియంత’ భావన ఆధునిక ప్రజాస్వామ్య భావనలకు సరిపడేది కాదుగానీ, ఒకోసారి అందువల్ల కొంత మంచి కూడా జరుగుతుంటుంది. అదే సమయంలో ఎక్కువసార్లు బెడిసి కొడుతుంది. ఈ రెండింటిలో ఏమి జరిగేదీ అవతలి పక్షాల పైనా, వాస్తవ పరిస్థితుల పైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, కిరీటం ధరించిన ‘కింగ్ ట్రంప్’ గారి ‘బెనెవె లెంట్ డిక్టేటర్’ వ్యూహం కొద్ది సందర్భాలలో తప్ప పనిచేయదు. వాస్తవానికి ఈ హెచ్చరిక ఆయనకు అందరికన్నా ముందు చేసినవాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా. అయినదానికి కాని దానికి ట్యారిఫ్లు పెంచుతూ, వాణిజ్య ఒప్పందాల గురించి బెది రిస్తూ, చివరకు బ్రెజిల్ ప్రతిపక్ష నాయకుడు బోల్సొనారోపై చర్యల విషయంలోనూ జోక్యం చేసుకొనజూసినపుడు, ‘‘ప్రపంచం చక్ర వర్తిని కోరుకోవటం లేదు. అమెరికన్లు ట్రంప్ను ఎన్నుకున్నది చక్ర వర్తి అయేందుకు కాదు’’ అని ఘాటుగా మాట్లాడారాయన. పరిస్థి తిని ట్రంప్ అర్థం చేసుకోలేదన్నది వేరే విషయం! మార్చేందుకే మాట ఉన్నది...ప్రస్తుతానికి వచ్చి, పైన పేర్కొన్న వేర్వేరు విషయాలను గమనిస్తే, అమెరికా అధ్యక్షుడు నాలుగు రోజులకు ఒక విధంగా మాట మార్చటం చూస్తున్నాం. ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటలలో ఆపివేయగలనంటూ మొదలుపెట్టిన ఆయన, ఇపుడు ఏమిచేయాలో తోచక, టేబుల్కు రెండు వైపులా తానే నిలిచి తనతో తానే పింగ్పాంగ్ ఆడుతున్నారు. ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని, సోమవారం నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ను హెచ్చరిస్తారు. డోన్బాస్ను వదలుకోవాలని మంగళవారం ఆదేశించి క్రిమియాను సైతం స్వాధీన పరచుకునేందుకు జెలెన్స్కీకి తోమహాక్లు అంద జేయగలనంటూ బుధవారం నాడు పుతిన్ను భయపెట్టజూస్తారు. గురువారంరోజు ఇద్దరితోనూ ఖనిజ ఒప్పందపు చర్చలు నడుపు తారు. శుక్రవారం యూరోపియన్ దేశాలను మీ దారి మీదేనని చెప్పి, శనివారం నాడు ‘నాటో’ను అందరం కలిసి బలోపేతం చేద్దామంటారు. ఈ విధంగా ఉక్రెయిన్ విషయమై ప్రపంచం గమనించి అబ్బు రపడుతున్న ‘ఏడువారాల నగల ప్రదర్శన’ వంటిదే ఇతర సంద ర్భాల్లోనూ చూస్తున్నాము. ఉక్రెయిన్ వలెనే మరొక యుద్ధమైన గాజాను గమనించండి. గతాన్ని కొద్దిసేపు అటుంచి ఇటీవలి పరిణామాలనే గమనిస్తే– 20 అంశాల ప్రకటన, షర్మ్ అల్ షేక్ సంతకాలతో మొత్తం పశ్చిమాసియాలోనే ‘శాశ్వత శాంతి’ సిద్ధించిందని ప్రకటించారు ట్రంప్. అది తొందరపాటనీ, మొదటి దశ అయిన కాల్పుల విరమణే ఇంకా స్థిరపడవలసి ఉందనీ అందరూ ఎత్తిచూపారు. కానీ అధ్యక్షుడు మాత్రం నోబెల్ శాంతి ప్రకటన ముగిసినదే తడవు హమాస్కు హెచ్చరికలు మొదలుపెట్టారు.అంతర్గత అరాచక శక్తులను అదుపు చేసేందుకు హమాస్ ఆయు ధాలను ఉంచుకోవచ్చునని ఒకరోజు ప్రకటించి, ఒకరోజు తిరిగే సరికి అస్త్రసన్యాసం చేస్తారా లేక ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ‘సర్వనాశనం’ చేయాలా అని బెదిరింపులు మొదలుపెట్టారు. ఇజ్రా యెల్ బాంబింగులు, సహాయ సరఫరాల నిలిపివేతలపై మౌనం వహిస్తున్నారు. గతంలోకి వెళితే, ఆయన గాజా, పాలస్తీనా విధా నాలు, రకరకాల ప్రకటనలు తెలిసినవే గనుక ఇక్కడ రాయ నక్కర లేదు. 20 అంశాల ప్రకటన అయితే బయటి వారితో తాత్కా లిక ప్రభుత్వం, బయటి దళాలతో భద్రతావ్యవస్థ, బయటి వారి ప్రణాళికల మేరకు అభివృద్ధి అని చెప్పటం మినహా, స్వతంత్ర పాలస్తీనా గురించి నిశ్చితంగా ఏమీ పేర్కొనక పోవటం తెలిసిందే. వీటన్నింటి చుట్టూ తిరుగుతూ ట్రంప్ వేర్వేరు మాటలతో ఏడు వారాల నగలు ధరిస్తూనే ఉన్నారు. మధ్యయుగాల క్రీడభారత దేశం, చైనాలతో ట్యారిఫ్లు, వాణిజ్య ఒప్పందాలకుసంబంధించి కూడా సరిగా ఇదే జరుగుతున్నది. ఒక రోజు బెదిరింపులు, ఈసడింపులు, మరునాడు సానునయమైన మాటలు. ఒక రోజు సంయుక్త సమావేశపు ప్రతిపాదనలు, మరొకరోజు వాయి దాలు... ఇది ఈ రెండు ఆసియన్ దేశాల విషయంలోనూ జరుగు తున్నది. ట్రంప్కు సమస్య ఎక్కడ వస్తున్నదంటే, కొద్ది తేడాలతో రెండు దేశాలు కూడా ఒక పరిమితిని దాటి తమ జాతీయ ప్రయో జనాలను వదులుకునేందుకు సిద్ధంగా లేవు. చైనా అయితే తన ఆర్థిక బలిమి వల్ల, కొన్ని రంగాలలో అమెరికాను పూర్తిగా ధిక్కరించ గలగటం ట్రంప్కు పాలుపోని పరిస్థితి అయింది. అయినా చైనా, ఇండియాలను గెలవనివ్వకూడదు గనుక, తరచూ ‘నగల మార్పిడి’ చేసుకుంటూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు అర్థం చేసుకుని మారవలసింది ఏమంటే, తన వ్యూహంలో బలహీనతలు అనేకం ఉన్నాయి. ప్రపంచం ఒకప్పటి వలె లేదు. అందువల్ల, మధ్య యుగపు రాజువలె కిరీట ధారణ, రాణివలె ఏడువారాల నగలు చూసి చిత్తభ్రమలకు లోనై లొంగిపోయే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతున్నది.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా డీల్
స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలు రక్షణ, అంతరిక్ష రంగంలో కీలక ఉపకరణాల దాకా అన్నింటి తయారీకి అత్యావశ్యకమైన ఖనిజాల సరఫరాపై చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. విదేశాలకు తమ అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయాలంటే కఠిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని చైనా మొండికేయడం తెల్సిందే.దీంతో చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా, ఆస్ట్రేలియా రూ.75,000 కోట్ల విలువైన చరిత్రాత్మకమైన ‘అరుదైన ఖనిజాల ఒప్పందం’కుదుర్చుకున్నాయి. అధ్యక్షభవనంలో డొనాల్డ్ ట్రంప్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు.‘‘గత కొన్ని నెలలుగా చర్చలు జరిపి ఎట్టకేలకు నేడు ఒప్పందం కుదుర్చుకున్నాం. మరో ఏడాదిలోగా మా రెండు దేశా లు భారీ ఎత్తున అరుదైన ఖనిజ నిల్వలను సాధించనున్నాయి. ఈ నిల్వలతో మేమేం చేస్తామో మీకు కూడా తెలీదు’’అని వ్యాఖ్యానించారు.తొలి ఆరు నెలల్లో ఇరు దేశాలు చెరో 3 బిలియన్ డాలర్ల మేర ఖనిజాల తవ్వకాల ప్రాజెక్ట్ల్లో పెట్టుబడులు పెడతాయి. ఉపగ్రహాలు, ఎంఆర్ఐ యంత్రాలు, గైడెన్స్ వ్యవస్థలు, లేజర్లు, జెట్ ఇంజిన్లదాకా అన్నింటి తయారీలోనూ అరుదైన భూ మూలకాలనే ఉపయోగిస్తారు. -
China: ఈ బుల్లెట్ ట్రైన్ ‘‘మెరుపు తీగే’.. గంటకు ఎంత వేగమంటే..
న్యూఢిల్లీ: బుల్లెట్ రైళ్ల వేగంలో చైనా మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. చైనా తయారు చేసిన తాజా బుల్లెట్ రైలు సీఆర్ 450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైలు ట్రయల్ రన్లోనే గంటకు 453 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంది.బుల్లెట్ రైలు సీఆర్ 450ను ప్రస్తుతం షాంఘై- చెంగ్డు మధ్య హై-స్పీడ్ రైలు మార్గంలో టెస్ట్ చేస్తున్నారు. ఈ రైలు వాణిజ్యపరంగా గంటకు 400 కి.మీ. వేగంతో నడిచేలా రూపొందించారు. ఇది ప్రస్తుతం సేవలలో ఉన్న సీఆర్ 400 ఫక్సింగ్ రైళ్ల కంటే 50 కి.మీ. వేగవంతమైనది. ఈ పాత మోడల్ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో నడుస్తాయి. సీఆర్ 450కి ముందు ఈ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంతో నడిచే రైళ్లుగా గుర్తింపు పొందాయి.సీఆర్ 450ను స్మార్ట్ డిజైన్తో రూపొందించారు. దీని నోస్ కోన్ 15 మీటర్లు. నూతన మోడల్లో ఏరోడైనమిక్ నిరోధకతను 22 శాతం మేరకు తగ్గించారు. దీంతో వేగం, ఇంధన సామర్థ్యం మరింత మెరుగుపడ్డాయి. ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో 0 నుండి 350 కి.మీ./గం. వరకు వేగవంతం అవుతుంది. ట్రయల్స్ సమయంలో, రెండు సీఆర్ 450 రైళ్లు గంటకు 896 కిమీ వేగంతో పరుగులు తీశాయి. ప్రయాణ వేగంలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాయి. ఈ రైలును రూపొందించిన ఇంజనీర్లు స్పోర్ట్స్ కార్ల డిజైన్ ప్రేరణతో ఏరోడైనమిక్ మెరుగుదలపై ఐదేళ్లు పనిచేశారు. #China's CR450 high-speed train, the world's fastest bullet train, has set a new record by reaching a top speed of 453 km/h during testing. It can accelerate from a standstill to 350 km/h within 5 minutes! #highspeedtrain pic.twitter.com/2AtK0LFZb1— CCTV Asia Pacific (@CCTVAsiaPacific) October 22, 2025 ఇది కూడా చదవండి: మెహుల్ ఛోక్సీ అప్పగింతకు ఓకే: బెల్జియం కోర్టు -
భారత్ పథకాలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు
ఎలక్ట్రిక్ వాహనాలు (EV), అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్, ఆటోమొబైల్స్ విభాగంలో భారత్ కంపెనీలకు అందిస్తున్న ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాలకు వ్యతిరేకంగా చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఉన్న ఈ పథకాలను డబ్ల్యూటీఓ వేదికపై సమర్థించుకోవాల్సిన అవసరం భారత్కు ఏర్పడింది.చైనా ఆరోపణలుచైనా తన ఫిర్యాదులో భారతదేశం ఈవీ ప్రోత్సాహకాలు, పీఎల్ఐ పథకాలు చైనీస్ కోర్ వస్తువులపై వివక్ష పూరితంగా ఉన్నట్లు ఆరోపించింది. ఈ పథకాల కింద దేశీయ విలువ జోడింపునకు సంబంధించిన అంశాలు WTO కీలక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని చైనా పేర్కొంది. అందులో సబ్సిడీలు, కౌంటర్వైలింగ్ చర్యలపై ఒప్పందం (SCM అగ్రిమెంట్-రాయితీలకు వ్యతిరేకం), సుంకాలు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (GATT 1994), వాణిజ్య సంబంధిత పెట్టుబడి చర్యల ఒప్పందం (TRIM)ను భారత్ బేఖాతరు చేసినట్లు చైనా తెలిపింది.భారతదేశం వైఖరిఈ పథకాలను అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’కు అనుగుణంగా ఈ పథకాలు ఉన్నాయని భారత్ చెబుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయ ప్రోత్సాహకాలు డబ్ల్యూటీఓ చట్టంలో ‘గ్రే ఏరియా’(పారిశ్రామిక రాయితీలు, టెక్నాలజీ ప్రమోషన్ పథకాలు, పర్యావరణ, అభివృద్ధి లక్ష్యాలను పేర్కొంటూ చట్టంలో స్పష్టంగా నిషేధించబడని విధాన చర్యలను సూచిస్తుంది)లో ఉన్నాయి. అందువల్ల పారిశ్రామిక అభివృద్ధి కోసం విధానాలు రూపొందించే హక్కు భారత్కు ఉంది.డబ్ల్యూటీఓ వివాద ప్రక్రియడబ్ల్యూటీఓ వివాద పరిష్కార విధానంలో భాగంగా సమస్యను పరిష్కరించేందుకు భారత్, చైనాలు ముందుగా ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంటుంది. సంప్రదింపులు విఫలమైతే చైనా తీర్పు ఇవ్వడానికి విధాన ప్యానెల్ను అభ్యర్థించవచ్చు. భారతదేశానికి ప్రతికూల తీర్పు వస్తే అప్పీల్ చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం -
ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం
చైనా ప్రత్యేక ఎరువుల ఎగుమతులను మళ్లీ నిలిపివేయడం ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగం ఈ నిర్ణయంతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. చైనా చర్యల వల్ల భారత్లో ఎరువుల లభ్యత, ధరలపై ప్రభావం పడునుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.చైనా ఎగుమతి నిలిపివేతఅక్టోబర్ 15, 2025 నుంచి టెక్నికల్ మోనోఅమ్మోనియం ఫాస్ఫేట్ (TAMP), యాడ్ బ్లూ (యూరియా సొల్యూషన్), డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP), సాంప్రదాయ యూరియా వంటి ప్రత్యేక ఎరువుల ఎగుమతులను చైనా నిలిపివేసింది. ఈ సస్పెన్షన్ సుమారు 5-6 నెలల పాటు ఉంటుంది. అంటే ఈ నిలిపివేత మార్చి 2026 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ చర్య వల్ల అంతర్జాతీయ ఎరువుల మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని అనుసరించి సరఫరా గొలుసులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంపై దీని ప్రభావంభారతదేశం ఈ ప్రత్యేక ఎరువుల్లో దాదాపు 95% చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇది ఏటా సుమారు 2.5 లక్షల టన్నులు, అంటే 60-65% రబీ సీజన్లో ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఎరువుల దిగుమతులపై ఆధారపడుతుండడం వల్ల చైనా ఏకపక్ష నిర్ణయాలు భారతదేశ వ్యవసాయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.చైనా నిర్ణయం వల్ల కఠినమైన ప్రపంచ సరఫరా, అనిశ్చితి ఫలితంగా ఎరువుల ధరలు 10-15% వరకు పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదలతో అంతిమంగా రైతులపై భారం పడనుంది. దాంతో పంట ఉత్పత్తి వ్యయం పెరుగనుంది. కొందరు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుత రబీ సీజన్ (అక్టోబర్-మార్చి) కోసం భారతీయ వ్యాపారుల వద్ద ఇప్పటికీ నిల్వలున్నాయి. కాబట్టి తక్షణ ఎరువుల కొరత లేనప్పటికీ భవిష్యత్తులో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.గతంలో ఇలా..చైనా గతంలో కూడా 2023 మధ్యలో, మే-జూన్ 2025లో (భారతదేశ ఖరీఫ్ సీజన్ను ప్రభావితం చేస్తూ) ఎగుమతులను నిలిపివేసింది. ఆగస్టు 2025లో దౌత్య చర్చల తర్వాత తాత్కాలికంగా వీటిపై నిషేధం ఎత్తివేశారు. తిరిగి అక్టోబర్ 15 నుంచి మళ్లీ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సస్పెన్షన్ మార్చి 2026 తర్వాత కూడా కొనసాగితే భారతదేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడం, స్థిరమైన ప్రత్యామ్నాయ సరఫరాదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడం, ఎరువుల వినియోగంలో సామర్థ్యాన్ని పెంచే విధానాలను అమలు చేయడం వంటి చర్యలు అత్యవసరం.ఇదీ చదవండి: పాకిస్థాన్లో కేజీ టమాటా రూ.700


