ఆకాశంలో కనిపించని యుద్ధం మొదలైందా..? శత్రువు కంటికి కనిపించకుండానే దాడి చేసే అత్యాధునిక యుద్ధ విమానాల కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న వేళ.. చైనా సామర్థ్యంపై వచ్చిన తాజా అంచనాలు రక్షణ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. చైనా వద్ద అత్యాధునిక జే-20 ‘మైటీ డ్రాగన్’ స్టెల్త్ ఫైటర్ల సంఖ్య ఇప్పటికే సుమారు 500 వరకు ఉండొచ్చని చైనా సైనిక వ్యవహారాల నిపుణుడు ఆండ్రియాస్ రుప్రెక్ట్ అంచనా వేశారు.
ఈ అంచనా నిజమైతే.. స్టెల్త్ యుద్ధ విమానాల తయారీలో చైనా ఊహించిన దానికంటే వేగంగా ముందుకు సాగుతున్నట్టే అవుతుంది. ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన యుద్ధ విమానాలను భారీ సంఖ్యలో తయారు చేయగల సామర్థ్యాన్ని చైనా సాధించినట్లు ఈ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామం భారత్కు కీలక హెచ్చరికగా మారింది. కారణం.. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద ఒక్క స్టెల్త్ ఫైటర్ కూడా లేదు. భవిష్యత్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించనున్న ఐదో తరం యుద్ధ విమానాల రంగంలో భారత్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.
🇨🇳 China’s J-36: Next-Gen Stealth Fighter
Insane footage of China’s J-36 stealth fighter: massive tailless trijet 6th generation design with advanced stealth shaping and powerful long-range capabilities. This is China pushing the frontier of air superiority.
Meanwhile the US… https://t.co/bbJW44bv4U pic.twitter.com/JkoJLcnHEn— GeoPaul626 (@Paull626) June 9, 2026
జే-20 సాధారణ యుద్ధ విమానం కాదు. రాడార్ వ్యవస్థలకు చిక్కకుండా శత్రు గగనతలంలోకి చొచ్చుకెళ్లడం, కీలక లక్ష్యాలను గుర్తించడం, శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను దెబ్బతీయడం దీని ప్రత్యేకతలు. యుద్ధం ప్రారంభమైన తర్వాత కాకుండా.. మొదటి దశలోనే ప్రత్యర్థి సామర్థ్యాలను బలహీనపరిచే శక్తి స్టెల్త్ విమానాలకు ఉంటుంది. చైనా ఇప్పటికే ఈ విమానాలను టిబెట్ ప్రాంతంలో మోహరించినట్లు గతంలో నివేదికలు వచ్చాయి. భారత్-చైనా సరిహద్దులకు సమీపంలో అత్యాధునిక యుద్ధ విమానాల ఉనికి వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్ అడుగులు..
మరోవైపు భారత్ కూడా ఈ సవాలును గుర్తించి ఐదో తరం స్టెల్త్ ఫైటర్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. దేశీయంగా రూపొందిస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్ భవిష్యత్లో భారత వాయుసేనలో కీలక పాత్ర పోషించనుంది. అయితే అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఇటీవలి సైనిక పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. భవిష్యత్ యుద్ధాల్లో కేవలం సైనిక బలం లేదా సంప్రదాయ ఆయుధాల సంఖ్య మాత్రమే విజయం నిర్ణయించవు. ఆకాశంపై ఆధిపత్యం సాధించే దేశమే వ్యూహాత్మకంగా ముందంజలో ఉంటుంది. అయితే స్టెల్త్ విమానాల సంఖ్యే మొత్తం యుద్ధ సామర్థ్యాన్ని నిర్ణయించదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్ కూడా శత్రు విమానాలను గుర్తించే అధునాతన రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, నిఘా సాంకేతికతలను బలోపేతం చేస్తోంది. ఇవి స్టెల్త్ విమానాల ప్రయోజనాన్ని కొంతవరకు తగ్గించగలవు. కానీ సంఖ్యలు కూడా యుద్ధంలో కీలకమే.
చైనా వందల సంఖ్యలో జే-20లను తయారు చేస్తుంటే.. భారత్ ఇంకా తన తొలి స్టెల్త్ యుద్ధ విమానం కోసం ఎదురుచూస్తోంది. ఈ అంతరం కేవలం విమానాల మధ్య కాదు.. రక్షణ తయారీ సామర్థ్యం, సాంకేతిక అభివృద్ధి, నిర్ణయాల వేగం మధ్య ఉన్న తేడాను కూడా చూపిస్తోంది. మరోవైపు.. చైనా జే-20ల సంఖ్య భవిష్యత్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అదే సమయంలో చైనా ఆరవ తరం యుద్ధ విమానాల అభివృద్ధిపైనా దృష్టి పెడుతోంది.
స్టెల్త్ యుద్ధ విమానాల సామర్థ్యం ఉన్న దేశాలు..
అమెరికా ప్రపంచంలో అత్యంత అధునాతన స్టెల్త్ టెక్నాలజీ కలిగిన దేశం.
ప్రధాన స్టెల్త్ విమానాలు:
F-22 Raptor – వైమానిక ఆధిపత్యం కోసం రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం.
F-35 Lightning II – ప్రపంచంలో అత్యధికంగా వినియోగంలో ఉన్న స్టెల్త్ ఫైటర్.
B-2 Spirit – స్టెల్త్ బాంబర్.
B-21 Raider – కొత్త తరం స్టెల్త్ బాంబర్ అభివృద్ధిలో ఉంది.
చైనా..
వేగంగా స్టెల్త్ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న దేశం.
ప్రధాన స్టెల్త్ విమానం: J-20 ‘Mighty Dragon’ – చైనా ఐదో తరం స్టెల్త్ ఫైటర్.
భారీ స్థాయిలో J-20 ఉత్పత్తి చేస్తూ సంఖ్యలను పెంచుతోంది.
భారత్ సరిహద్దులకు సమీపంలోని ప్రాంతాల్లో కూడా ఈ విమానాల మోహరింపు జరిగినట్లు నివేదికలు వచ్చాయి.
రష్యా..
ప్రధాన స్టెల్త్ యుద్ధ విమానం: Su-57 Felon
స్టెల్త్ సామర్థ్యం ఉన్నప్పటికీ ఉత్పత్తి సంఖ్యలు పరిమితంగా ఉన్నాయి.
అమెరికా F-35, చైనా J-20 స్థాయిలో పెద్ద ఫ్లీట్ లేదు.
U.S. Air Force F-35A stealth fighter aircraft are refueled by a KC-135 Stratotanker while flying patrols over the Middle East. pic.twitter.com/KSbmYTH2LT
— U.S. Central Command (@CENTCOM) July 16, 2026


