ఆకస్మిక వరదలతో 10 మంది మృతి
బీజింగ్: నౌల్ తుపాను చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. వాయవ్య చైనాలోని గన్సు ప్రావిన్స్లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు 10 మంది మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు. పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. జాతీయ సమగ్ర అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ హుయిజౌ నగర సమీపంలో ఆదివారం తెల్లవారుజామున తుపాను తీరం దాటింది.
దీంతో గంటకు 162 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. తుపాను తీవ్రతను ఊహించిన హోం శాఖ 28 తాత్కాలిక శిబిరాలు ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రవాణా వ్యవస్థ దెబ్బతిని వందలాది విమానాలు, హైస్పీడ్ రైలు సరీ్వసులు రద్దయ్యాయి. గ్వాంగ్జౌ, షెన్జెన్లలో 700కు పైగా విమానాలను నిలిపేశారు.


