breaking news
Politics
-
బీసీలపై ఎందుకీ కక్ష.. ఇదేనా రెడ్బుక్ పాలన?
నెల్లూరు: బీసీలను లక్ష్యంగా చేసుకుని ఏపీలో కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, దౌర్జన్యాలను ప్రశ్నిస్తున్న బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. రెడ్బుక్ పాలనపై ప్రజలు తిరబడే రోజు వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బీసీలే టార్గెట్.. ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్టులా? ఇదేనా రెడ్బుక్ పాలన? అంటూ ప్రశ్నించారు.''చంద్రబాబూ బీసీలంటే.. ఎందుకీ కక్ష? ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, చింతాడ రవి, జోగి రమేష్ కుటుంబ సభ్యులపై నమోదైన కేసులు యాదృచ్ఛికం కావు. ప్రజల తరఫున బలంగా గొంతెత్తుతున్న బీసీ నాయకత్వాన్ని బలహీనపర్చడానికే జరుగుతున్న టార్గెట్ రాజకీయాలే. అధికారం ఉంది కదా అని వెనుకబడిన వర్గాలను వేధిస్తే వెన్నుపోటు పార్టీపై బీసీల తిరుగుబాటు తప్పదు.బీసీ నాయకులను వేధించడం ఆపండి.. లేదంటే మీ బూడిద పార్టీని బీసీలు బూడిద చెయ్యడం ఖాయం.. ఖబడ్దార్. రెడ్బుక్ రాజకీయాలు శాశ్వతం కావు ప్రజాస్వామ్యమే శాశ్వతం. బీసీలపై కక్షసాధింపు పాలనకు ప్రజలే తగిన సమయంలో గట్టి సమాధానం చెబుతార''ని ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.చదవండి: కూటమి ప్రభుత్వంపై బొలిశెట్టి ఫైర్ -
ఉదయనిధి స్టాలిన్కు ఊరట
సాక్షి,చెన్నై: నటి త్రిషను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. ఉదయనిధికి స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, ఆయనను ఈ రోజే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.తంజావూరులో జరిగిన ఒక కార్యక్రమంలో నటి త్రిషను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయం దుమారం రేగింది. దీనిపై అధికార టీవీకే పార్టీతో పాటు పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.రంగంలోకి దిగిన పోలీసులు చెన్నై నీలాంకరైలోని ఉదయనిధి నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేయగా.. ఈ లోపు ఉదయనిధి స్టాలిన్ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మద్రాస్ హైకోర్టు మధ్యాహ్నం ప్రత్యేక విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా రాష్ట్ర అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. ఉదయనిధి స్టాలిన్ను కస్టడీలో ఉంచే ఉద్దేశం తమకు లేదని కోర్టుకు స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. పోలీసుల విచారణకు ఉదయనిధి పూర్తిస్థాయిలో సహకరించాలని సూచిస్తూనే, ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజే ఆయనను విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో డీఎంకే శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. -
అసంతృప్తి నేతలకు డీకే శివకుమార్ షాక్!
కర్ణాటక కాంగ్రెస్లో మంత్రి పదవుల కేటాయింపు తర్వాత మొదలైన అసంతృప్తి చర్చలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెక్ పెట్టారు. మంత్రి పదవులు దక్కకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకటించడంపై ఆయన నేరుగా స్పందించారు. ఈ క్రమంలో రాజకీయాల్లో రాజీనామాలు సర్వసాధారణమని.. దాన్నొక టీ కప్పులో తుపానుగా చూపించే ప్రయత్నం చేశారు.మంగళవారం ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. “రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరు” అంటూ వ్యాఖ్యానించారు. అయితే పార్టీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని, పదవులు రాకపోయినా నేతలు ఓపికగా ఉండాలని సూచించారు.ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రి పదవి దక్కని సీనియర్ నేత యశ్వంతరాయగౌడ వి. పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.ఈ పరిణామాలపై స్పందించిన డీకే శివకుమార్.. గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. ధర్మ్సింగ్, సిద్ధరామయ్య ప్రభుత్వాల సమయంలో తనకు మంత్రి పదవి దక్కని సందర్భాలు ఉన్నాయని.. అయినా పార్టీ కోసం ఓపికగా ఉన్నానని చెప్పారు. “నాకు కూడా అప్పట్లో అవకాశాలు రాలేదు. నేను రాజీనామా చేయలేదు. జీ. పరమేశ్వర కూడా ఓపికగా ఎదురుచూశారు. పార్టీలో ఉంటేనే భవిష్యత్ ఉంటుంది” అని డీకే వ్యాఖ్యానించారు.మరోవైపు మంత్రి పదవి దక్కని నేతలకు తగిన బాధ్యతలు అప్పగిస్తామని డీకే శివకుమార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రతి నాయకుడికి పదవి ఆశించడం సహజమేనని, అసంతృప్తిగా ఉన్న వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్లో అసంతృప్తి బయటపడటం అధిష్ఠానానికి కొత్త తలనొప్పిగా మారింది. అయితే నేతల మధ్య సమన్వయం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇదే సమయంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు.. పదవుల కోసం ఒత్తిడి తెస్తున్న నేతలకు స్పష్టమైన సంకేతంగా మారాయి. పార్టీని వీడే నిర్ణయం వ్యక్తిగతమైనదే అయినప్పటికీ.. రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్లోనే కొనసాగాలని ఆయన సూచించినట్లు కనిపిస్తోంది. -
ఉదయ్నిధి బాత్రూంలో ఉన్నారు.. కాస్త ఆగండి
డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చెన్నైలోని నివాసానికి వెళ్లిన సమయంలో చోటుచేసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులను కాస్త ఆగాలంటూ ఉదయ్నిధి భార్య కృతికా విజ్ఞప్తి చేసిన దృశ్యాలు చర్చకు దారితీశాయి.తంజావూరులో కావేరీ నీటి వివాదంపై జరిగిన డీఎంకే నిరసన కార్యక్రమంలో ఉదయ్నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని.. సీఎం విజయ్ను అవమానించేలా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయ్నిధిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.వైరల్గా మారిన వీడియోలో.. పోలీసులు ఉదయ్నిధిని కలిసేందుకు ఆయన ఇంట్లో వేచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో కృతికా ఉదయ్నిధి, డీఎంకే నేత మా. సుబ్రమణియన్ పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. “ఆయన టాయిలెట్లో ఉన్నారు. కాస్త సమయం ఇవ్వండి” అంటూ కృతికా పోలీసులను కోరారు. మరికొన్ని నిమిషాలు ఆగాలని విజ్ఞప్తి చేశారు.On Cam: Moments Before Udhayanidhi Stalin Arrest- TIMES NOW accesses the sequence of events- On Cam: Udhayanidhi's wife argues with policemen@dharannniii & @DEKAMEGHNA breaks down the details. pic.twitter.com/WMdaMW0r99— TIMES NOW (@TimesNow) August 4, 2026 VIDEO CREDITS:TimesNowదీనికి స్పందించిన ఓ పోలీసు అధికారి.. తాము చట్టపరమైన విధులు నిర్వహించేందుకు వచ్చామని, ఎక్కువ సమయం వేచి ఉండలేమని పేర్కొన్నారు. “ఎంతసేపు వేచి ఉండాలి? ఇది మా విధి. మేం చట్టాన్ని ఉల్లంఘించడం లేదు” అంటూ ఆయన చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది.మా. సుబ్రమణియన్ కూడా పోలీసులను మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఉదయ్నిధి సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలని, న్యాయవాది కూడా వస్తారని చెప్పారు. అలాగే ఉదయ్నిధిని తంజావూరుకు తీసుకెళ్లాల్సి ఉందని.. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుందని, బయలుదేరే ముందు కొంత సమయం ఇవ్వాలని మంత్రి కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం అనంతంగా వేచి ఉండలేమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.கைது செய்து தஞ்சாவூர் அழைத்து செல்லப்படும் எதிர்க்கட்சி தலைவர்.. ஜன்னல் ஓரத்தில் பெரும் யோசனையோடு அமர்ந்து செல்லும் உதயநிதிDMK | Udhayanidhi Arrest | Udhayanidhi Speech | #NewsTamil24x7 #UdhayanidhiStalin #PoliceArrest pic.twitter.com/6afl9S9XCo— News Tamil 24x7 (@NewsTamilTV24x7) August 4, 2026ఏ కేసులో అరెస్ట్?కావేరీ నీటి సమస్యపై తంజావూరులో జరిగిన డీఎంకే నిరసనలో ఉదయ్నిధి చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి కారణమైంది. నిరసన సమయంలో కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరును ప్రస్తావించగా.. ఉదయ్నిధి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం, ఉద్దేశపూర్వక అవమానం, బెదిరింపులు, కుట్ర తదితర ఆరోపణలతో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్లను కూడా చేర్చినట్లు సమాచారం.రాజకీయంగా ముదిరిన వివాదంఉదయ్నిధి అరెస్టు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో కొత్త దుమారానికి దారితీసింది. అధికార టీవీకే, బీజేపీ నేతలు ఉదయ్నిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డీఎంకే మాత్రం ఈ కేసును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది. కావేరీ సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారని డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
చంద్రబాబు బెదిరింపులకు భయపడం: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమని చంద్రబాబు సర్కార్పై మండిపడ్డారు.టీడీపీ నేతలు చేసిన తప్పులకు వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు. బెయిల్ రాకుండా ఉండేలా కఠినమైన సెక్షన్లతో కేసులు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.“ఆలూరులో టీడీపీ నేతే దాడి చేశారు”ఆలూరు ఘటనను ప్రస్తావించిన అంబటి.. అక్కడ అసలు తప్పు చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతే మహిళపై దాడి చేసి ఆమె బట్టలు చించేశారని, అయినా అధికార పార్టీ నేతలను కాపాడే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.“చంద్రబాబు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు”కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు కేసులు, అరెస్టులను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదని అంబటి స్పష్టం చేశారు. -
ఉదయ్నిధికే మా మద్దతు: ప్రేమలత విజయ్కాంత్
తమిళనాట ఉదయ్నిధి స్టాలిన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు పలువురు ఉదయ్నిధి వ్యాఖ్యల్ని తప్పుబడుతుంటే.. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్కాంత్ మాత్రం ఆ అరెస్ట్ను ఖండించారు.డీఎంకే నేత, ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్పై పోలీసు చర్యల నేపథ్యంలో మంగళవారం డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్నిధి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొంటూ.. ఆయనకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో రాజకీయ భిన్నాభిప్రాయాలను అరెస్టులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రేమలత విజయకాంత్ అన్నారు. ఒకరి వ్యాఖ్యలను మరో పార్టీ రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప.. అరెస్టులు పరిష్కారం కాదని పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో రాజకీయ వ్యాఖ్యలపై అరెస్టులు చేయడం ప్రజల్లో అసంతృప్తిని, ప్రజాస్వామ్యంపై అనుమానాలను పెంచుతుందని వ్యాఖ్యానించారు.“ఉదయ్నిధి మాట్లాడిన దాంట్లో తప్పు లేదు”ఉదయ్నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ప్రేమలత.. ఆయన మాటల్లో తప్పేమీ లేదని అన్నారు. రాజకీయ వేదికలపై ప్రతిపక్ష నేతలకు తమ అభిప్రాయాలను చెప్పే హక్కు ఉందని స్పష్టం చేశారు. “ఉదయ్నిధికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. అందులో అభ్యంతరకరం ఏంటో అర్థం కావడం లేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.నీటి కోసం మేం పోరాడుతుంటే..ఇదే సమయంలో తమిళనాడులోని రాజకీయ పోరాటాలపై కూడా ప్రేమలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై, ముఖ్యంగా కావేరీ జలాల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు నటుడు విజయ్ రాజకీయ పోరాటం చేస్తున్న తీరును ప్రస్తావిస్తూ.. “మేం నీటి కోసం పోరాడుతుంటే.. నటి కోసం విజయ్ పోరాడుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరురాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు అరెస్టులను ఉపయోగించడం సరైన విధానం కాదని ప్రేమలత విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఉన్న హక్కులే ప్రతిపక్షాలకు కూడా ఉంటాయని అన్నారు.అధికార పార్టీ, ముఖ్యమంత్రి తమ అభిప్రాయాలను రాజకీయ వేదికలపై వ్యక్తం చేయవచ్చని.. అదే విధంగా ప్రతిపక్షాలు కూడా తమ వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లే హక్కు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సింది రాజకీయంగానే కానీ.. అరెస్టులతో కాదని స్పష్టం చేశారు.చట్టం అందరికీ సమానంగా ఉండాలిఇటీవల రాణిపేటలో జర్నలిస్టులపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలను ప్రస్తావించిన ప్రేమలత.. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై మాత్రం తక్షణ చర్యలు తీసుకోవడం చట్ట అమలులో సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు ప్రతిపక్ష నేతపై అరెస్టు చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తగదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలని కోరారు. మొత్తంగా.. ఉదయ్నిధి స్టాలిన్ విషయంలో ప్రేమలత విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. -
కమల వ్యూహం బెడిసికొట్టింది అక్కడే..!
బిహార్ రాజకీయాల్లో ఓ చిన్న ఉప ఎన్నిక ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకీపూర్లో జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. ఇది కేవలం ఓ అభ్యర్థి గెలుపు మాత్రమే కాదు.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారింది. బీజేపీని ఓడించి తీరాలన్న కసి అక్కడి ఓటర్లలో కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కమల వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది? అనేది పరిశీలిస్తే.. పట్నా నగరంలోని బంకీపూర్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి బలమైన అడ్డాగా ఉంది. 1995 నుంచి ఈ స్థానంలో కమలం ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. తొలుత నితిన్ నబీన్ తండ్రి నవీన్ చంద్ర సిన్హా.. ఆ తర్వాత నితిన్ నబీన్ వరుస విజయాలతో ఈ సీటును బీజేపీ తన గుప్పిట్లో ఉంచుకుంది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి అనూహ్య ఫలితం వెలువడింది.జనసూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పీకేకు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 44,827 ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.అక్కడే బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్బంకీపూర్ ఫలితాల్లో బీజేపీ వ్యూహ లోపం ప్రధానంగా అభ్యర్థి ఎంపిక దగ్గరే కనిపించిందనే చర్చ జరుగుతోంది. తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ ‘బంటీ’ చివరి సమయంలో తప్పుకోవడంతో.. పార్టీ నీరజ్ కుమార్ సిన్హాను రంగంలోకి దించాల్సి వచ్చింది. బీజేపీకి బలమైన పట్టు ఉన్న స్థానంలో చివరి నిమిషంలో మార్పు జరగడం క్యాడర్లో కొంత గందరగోళానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీ వ్యతిరేక ఓటును ఒకే వేదికపైకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు సహజంగా ఆర్జేడీ వైపు మొగ్గు చూపేవారు. కానీ ఈసారి “బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయం ఎవరు?” అనే లెక్కలో కొంతమంది ఓటర్లు జనసూరాజ్ వైపు మళ్లినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.సంబంధిత వార్త: పీకే దాడికి ముందే బీజేపీ ప్లాన్ మార్చిందా?పీకే ఎంట్రీతో మారిన బిహార్ లెక్కలుఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. రాజకీయ నాయకుడిగా మాత్రం తొలి ప్రయత్నాల్లో పెద్ద విజయాన్ని అందుకోలేకపోయారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జనసూరాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో ఆయన వ్యూహం పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఒక్క నియోజకవర్గంపై పూర్తి దృష్టి పెట్టి.. స్థానిక అంశాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో ప్రచారం సాగించారు. ఫలితంగా బీజేపీ కంచుకోటనే బద్దలు కొట్టారు. ఈ విజయం జనసూరాజ్కు అసెంబ్లీలో తొలి అడుగు మాత్రమే కాదు.. బిహార్లో మూడో రాజకీయ శక్తిగా ఎదగాలనే పీకే ప్రయత్నాలకు కొత్త ఊపునిచ్చింది.బీజేపీకి దెబ్బ.. ఆర్జేడీకీ హెచ్చరికబంకీపూర్ ఫలితంలో మరో కీలక అంశం ఆర్జేడీ వెనుకబడటం. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆర్జేడీ.. ఈ ఎన్నికలో మూడో స్థానానికి పడిపోవడం ఆ పార్టీకి కూడా ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ బలంగా నిర్మించిన ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకు ఆర్జేడీకి ప్రధాన బలం. అయితే బీజేపీ వ్యతిరేక ఓటులో కొంత భాగం ఈసారి జనసూరాజ్ వైపు వెళ్లినట్లు కనిపించింది. ఈ ధోరణి కొనసాగితే.. ఆర్జేడీ రాజకీయ ఆధిపత్యానికి కూడా సవాల్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇద్దరిలో కారకులెవరూ?బంకీపూర్ ఓటమి ఇప్పుడు బీజేపీలో అంతర్గత చర్చకు దారితీసింది. బాధ్యత ఎవరిపై వేయాలన్న ప్రశ్నపై నితిన్ నబీన్, సమ్రాట్ చౌదరీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సొంత కుటుంబానికి మూడు దశాబ్దాలుగా పట్టున్న స్థానాన్ని కోల్పోవడం నితిన్ నబీన్కు వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అభ్యర్థి ఎంపిక, ప్రచార నిర్వహణ, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో లోపాలే ఓటమికి కారణమయ్యాయనే చర్చ సాగుతోంది.మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమ్రాట్ చౌదరీకి ఇది తొలి పెద్ద రాజకీయ పరీక్ష. ప్రశాంత్ కిషోర్ తన ప్రచారంలో చౌదరీ నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈ ఫలితం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఓ హెచ్చరికగా మారింది.అయితే ఒక్కరిని నిందించడం కంటే.. బంకీపూర్ ఓటమి బీజేపీ ఎన్నికల వ్యూహానికి వచ్చిన పరీక్షగా చూడాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.బంకీపూర్ ఇచ్చిన సంకేతం ఏంటి?బంకీపూర్ ఫలితం కేవలం ఓ ఉప ఎన్నిక తీర్పు కాదు.. బిహార్ రాజకీయాల్లో కొత్త పోటీకి సంకేతం. ఇంతకాలం బీజేపీ–ఆర్జేడీ మధ్య సాగిన పోరులోకి ఇప్పుడు జనసూరాజ్ ప్రత్యామ్నాయ శక్తిగా అడుగుపెట్టింది. బీసీ, అగ్రవర్ణాల ఓట్లు ఆ పార్టీకి మళ్లాయి. కమలానికి ఇది కంచుకోట కోల్పోవడమే కాదు.. బలమైన స్థానాల్లో కూడా ఓటర్ల నాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఫలితం. ఆర్జేడీకి తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవాల్సిన సవాలు ఎదురైంది.ప్రశాంత్ కిషోర్ గెలుపు ఒక్క సీటుతో మొదలైనప్పటికీ.. దీని ప్రభావం రాబోయే బిహార్ రాజకీయ సమీకరణాలపై ఎంతవరకు పడుతుంది? బీజేపీ తన కోటను ఎలా తిరిగి నిర్మించుకుంటుంది? జనసూరాజ్ ఈ విజయాన్ని ఎలా విస్తరిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ఉదయ్నిధి స్టాలిన్ అరెస్ట్
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ తమిళగ వెట్రి కగళం పార్టీ ఫిర్యాదు చేయంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టీవీకే నిరసనల నడుమ పోలీసులు ఆయన నివాసం వద్ద భారీగా మోహరించగా.. ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఈ మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టు విచారణ జరపనుంది.మంగళవారం ఉదయం ఉదయనిధి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్ట్ తర్వాత ఆయన్ని తరలించే క్రమంలో డీఎంకే శ్రేణులు పోలీసులకు అడ్డు పడ్డాయి. వాహనాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగాయి. అయినప్పటికి పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో ఉదయ్నిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఎవరి పేరును నేను ప్రస్తావించలేదు. ఈ కేసును న్యాయపరంగా తేల్చుకుంటా అని ఆయన అన్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని తరలించినట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే.. సోమవారం తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగిన డీఎంకే కార్యక్రమంలో ఉదయ్నిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో.. కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయ్నిధి.. కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా, ‘నీళ్లు’ మాత్రం అక్కడికి వెళ్తాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి డబుల్ మీనింగ్గా చేసిన వ్యాఖ్యలేనని టీవీకే ఆరోపిస్తోంది. Udhayanidhi Stalin has landed in controversy after making an alleged double-meaning remark during a Cauvery protest speech when the crowd began chanting "Trisha"The video has gone viral, ruling TVK calls the comment "disgusting" and BJP demands his arrest over the remark. DMK… pic.twitter.com/Ay4S0i9HCv— Nabila Jamal (@nabilajamal_) August 3, 2026కేసు నమోదు.. హైకోర్టులో పిటిషన్ఉదయ్నిధి వ్యాఖ్యల నేపథ్యంలో తంజావూర్ పీఎస్లో టీవీకే ఫిర్యాదు చేసింది. సీఎం విజయ్ను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనపై ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రావాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం.“బహిరంగ క్షమాపణలు చెప్పాలి”.. ఉదయ్నిధి వ్యాఖ్యలపై టీవీకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మహిళలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పార్టీ నేతలు స్పష్టం చేశారు. క్షమాఫలు చెప్పే దాకా ఉదయ్నిధి స్టాలిన్ను వదలబోమని అంటున్నారు.ఉదయ్నిధి ఇంటి వద్ద భారీ భద్రత.. ఆ వెంటనే అరెస్ట్టీవీకే నిరసనల నేపథ్యంలో చెన్నైలోని ఉదయ్నిధి స్టాలిన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను పెంచారు. ఆ సమయంలో డీఎంకే కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో హైడ్రామా నెలకొంది. అయితే ఆ తర్వాతే ఉదయ్నిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. మహిళా కమిషన్కు ఫిర్యాదు.. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ (NCW)ను టీవీకే ఆశ్రయించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పళా సెల్వకుమార్ ఫిర్యాదు చేస్తూ.. ఉదయ్నిధి ప్రసంగానికి సంబంధించిన వీడియోలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయ్నిధి నుంచి వివరణ కోరాలని, బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని మహిళా కమిషన్ను విజ్ఞప్తి చేశారు. అలాగే సంబంధిత చట్టాల కింద చర్యలు తీసుకునేలా పోలీసులకు సూచించాలని కోరినట్లు టీవీకే వెల్లడించింది.బీజేపీ సైతం డీఎంకేపై ఫైర్ఆ వ్యాఖ్యలు మహిళను(త్రిష) కించపరిచేలా ఉన్నాయని, రాజకీయ నాయకుల స్థాయికి తగవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తమిళనాడు బీజేపీ కూడా స్పందించింది. ఉదయ్నిధి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజా జీవితంలో ఉన్న నేతలు మహిళల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని బీజేపీ నేతలు పేర్కొన్నారు.రాజకీయ పోరుకు కొత్త అస్త్రంఇప్పటికే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే, డీఎంకే మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో త్రిష ప్రస్తావన వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. టీవీకే ఈ అంశాన్ని మహిళా గౌరవానికి సంబంధించిన అంశంగా తీసుకుని ముందుకు వెళ్తుండగా.. డీఎంకే లేదా ఉదయ్నిధి స్టాలిన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. -
సిద్దరామయ్య గైర్హాజరు దేనికో?
సాక్షి, బెంగళూరు: మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం సిద్దరామయ్య గైర్హాజరు ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం పదవిని ఆయన అయిష్టంగా వదులుకోవడం తెలిసిందే. అలాగే మంత్రుల ఎంపిక గురించి ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఫలితంగా రాలేకపోయినట్లు సమాచారం. దీనిపై తలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ గాయత్రి శాంతేగౌడ పేరును మంత్రుల జాబితా నుంచి చివరి నిమిషంలో తొలగించడం సిద్దరామయ్యకు ఆగ్రహం తెప్పించింది. ఆమెకు కుర్చీ ఇవ్వాలని సిద్దరామయ్య ప్రయత్నాలు చేశారని, తీరా తొలగించేసరికి అలిగారని పార్టీ వర్గాల కథనం. siddaramaiah-absent-karnataka-cabinet-oath-gayathri-santhegowdasiddaramaiah-absent-karnataka-cabinet-oath-gayathri-santhegowdasiddaramaiah-absent-karnataka-cabinet-oath-gayathri-santhegowda -
రేవంత్రెడ్డే క్రిమినల్ వేస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను, చదువుకున్న యువతను ‘క్రిమినల్ వేస్ట్’గా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొనడం అత్యంత అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న లక్షలాది మంది యువతను అవమానించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. నిజంగా క్రిమినల్ వేస్ట్ ఎవరైనా ఉంటే 89 కేసులు ఎదుర్కొంటున్న రేవంత్రెడ్డేనని, అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడమే కాంగ్రెస్ పార్టీ చేసిన అసలైన క్రిమినల్ వేస్ట్ అని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రాహుల్గాందీ, రేవంత్రెడ్డి కలిసి ఇచ్చిన గ్యారంటీలు, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేశారని విమర్శించారు. కనీసం తన ఎన్నికల అఫిడవిట్ను అయినా స్వయంగా నింపే సామర్థ్యం రేవంత్కు ఉందా? అని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రి బాధ్యత నుంచి వెంటనే తప్పుకోవాలని, రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవ¯న్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేణు సూసైడ్ లేఖ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు రాసిన సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పట్టే చార్జిషీట్ లాంటిదని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగాల హామీ అమలు కాకపోవడం వల్లే తాను తీవ్ర నిరాశకు గురయ్యానని వేణు తన లేఖలో పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని అన్నారు. అయితే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులపాటు నిర్వహించి యువతకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్ చేశారు. లేకుంటే యువతకు జరిగిన ద్రోహంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున గట్టిగా ప్రశ్నిస్తామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాళేశ్వరంపై అసత్య ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీరు ఎలా వస్తోందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. గాయత్రి, మేడారం పంపింగ్ వ్యవస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణను రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం సిద్ధం చేసిన రాయదుర్గం–ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టును రద్దు చేసింది రేవంత్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇటీవల దివంగతుడైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపైనా కేసులు పెట్టారని మండిపడ్డారు. పౌర సరఫరాలు, విద్యాశాఖ అవినీతి అంశాలను బయటపెట్టి ఈడీ, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడినందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. -
బీసీ నేతలపై రెడ్బుక్
చంద్రబాబు సర్కారు రెడ్బుక్ వేధింపులు పతాక స్థాయికి చేరాయి. అరాచక పాలనలో లాకప్డెత్లు.. ఆత్మహత్యలు.. మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇలా.. రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి మరోవైపు ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను వేధించడమే లక్ష్యంగా బాబు సర్కారు పోలీసులను పురిగొల్పి అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. డీఎస్సీ పేరుతో స్కామ్కు పాల్పడి నిరుద్యోగ యువతను దగా చేయడంపై సీబీఐతో విచారణ జరపాలనే డిమాండ్ వెల్లువెత్తుతుండటం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి రావడంతో ఈసారి వైఎస్సార్సీపీలోని బీసీ నేతలను బాబు టార్గెట్ చేశారు. సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం,సాక్షి ప్రతినిధి, కర్నూలు, ఆలూరు రూరల్: ఐదేళ్లు అద్భుతంగా పాలిస్తామని మోసపూరిత హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే చంద్రబాబు సర్కారు తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. మరోవైపు ఉద్యమ బాట పడుతున్న ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా, ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది. ఇవి చాలదన్నట్లు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేసి స్కామ్కు పాల్పడటంతో చంద్రబాబు సర్కారుపై యువత కన్నెర్ర చేస్తోంది. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ.. జెన్ జీని సన్నద్ధం చేస్తూ వైఎస్సార్సీపీ ఆందోళన బాట పట్టడంతో చంద్రబాబు యథావిథిగా మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు. అనుకున్నదే తడవుగా రెడ్బుక్ కుట్రలకు పదును పెట్టి పోలీసులను రంగంలోకి దించారు. ఈసారి వైఎస్సార్సీపీ బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు దిగారు. మెగా డీఎస్సీ స్కామ్లో సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్సీపీ బీసీ నేతలు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తుండటంతో చంద్రబాబు సర్కారు పరువు పాతాళానికి దిగజారిపోతోంది. వెనుకబడిన తరగతులకు చెందిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి(బోయ), చింతాడ రవికుమార్ (కాళింగ), మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు (మత్స్యకార), జోగి రమేష్ (గౌడ), మాజీ ఎమ్మెల్యే ముస్తఫా తదితర వైఎస్సార్సీపీ నేతలపై తీవ్రమైన నేరాలు మోపుతూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడంపై ప్రజలు విస్తుపోతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా.. మూడు ప్రాంతాల్లోను ప్రజల పక్షాన క్షేత్రస్థాయిలో చురుకైన పాత్ర పోషిస్తున్న వైఎస్సార్సీపీ నేతలను బాబు సర్కారు టార్గెట్ చేసిందని సర్వత్రా చర్చ జరుగుతోంది. బాబు రెడ్బుక్ రాజ్యాంగం అమలులో తలమునకలైన పోలీస్ వ్యవస్థ మరింత అబాసుపాలవుతోందని పేర్కొంటున్నారు. పరాకాష్టకు చేరుకున్న బాబు సర్కారు బరి తెగింపు కుట్రలు ఇలా ఉన్నాయి...! వారి దుస్తులు వారే చింపుకొని..!కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను టీడీపీ మూకలు బంధించి చితకబాదుతుంటే ప్రాణభయంతో వీడియో కాల్ చేసిన ఓ కార్యకర్త తమను రక్షించాలని ఎమ్మెల్యే విరూపాక్షిని వేడుకున్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఆ కార్యకర్తను విడిపించేందుకు అక్కడికి వెళ్లిన విరూపాక్షిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పచ్చముఠాల దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములుకు గాయాలయ్యాయి. ఈ కుట్రలు అంతటితో ఆగలేదు. టీడీపీ కార్యకర్త నాగరాజు తన భార్య నైటీని తానే చింపేసి దారుణంగా వైఎస్సార్సీపీ నేతలపై నిందలు వేశాడు. టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు, తదితరులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం (307) కింద అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో ఆదివారం తెల్లవారుజామున (రాత్రి 2.45 గంటల సమయంలో) పోలీసు బలగాలు భారీ ఎత్తున ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నాయి. తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఎమ్మెల్యే విరూపాక్షితోపాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్, ఇతర నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. ఈ విధ్వంస కాండకు ఆధారాలు దొరక్కుండా సీసీటీవీ హార్డ్ డిస్్కలను పోలీసులు దౌర్జన్యంగా స్వా«దీనం చేసుకున్నారు.చంద్రబాబు సర్కారు రెడ్బుక్ వేధింపులు పతాక స్థాయికి చేరాయి. అరాచక పాలనలో లాకప్డెత్లు.. ఆత్మహత్యలు.. మహిళలపై విచ్చలవిడిగా అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. మొన్న విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్డెత్.. శవం ఆనవాళ్లు కూడా దొరకకుండా బూడిద చేశారు! దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య..! కర్నూలులో దళిత మహిళ గంగమ్మ లాకప్డెత్..! ఉయ్యూరులో పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగక దంపతుల ఆత్మహత్యా యత్నం..! అనంతపురం జిల్లా మదిగుబ్బ తండాలో టీడీపీ కార్యకర్తల బెదిరింపులతో ఉరి పోసుకుని గిరిజన మహిళ ఆత్మహత్య..! తాజాగా పల్నాడులో ఎస్ఐ వేధింపులు భరించలేక మిర్చి వ్యాపారి భార్య ఆత్మహత్యాయత్నం..! రెడ్బుక్ రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు ఎంత భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఒకపక్క రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి మరోపక్క ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను వేధించడమే లక్ష్యంగా బాబు సర్కారు కుట్రలకు మరింత పదును పెడుతోంది. పోలీసులను పురిగొల్పి అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. మెగా డీఎస్సీ పేరుతో స్కామ్కు పాల్పడి నిరుద్యోగ యువతను దగా చేయడంపై సీబీఐతో విచారణ జరపాలనే డిమాండ్ వెల్లువెత్తుతుండటం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి రావడంతో ఈసారి వైఎస్సార్సీపీలోని బీసీ నేతలను చంద్రబాబు టార్గెట్ చేశారు. జోగి రమేష్ కుటుంబంపై తీవ్రమైన కేసుల్లో టీడీపీ నేతల ప్రమేయం! మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై తీవ్ర కేసులు నమోదు కావడం వెనుక టీడీపీ నేతల ఒత్తిళ్లు పనిచేశాయనే ఆరోపణలున్నాయి. జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన ఫిర్యాదును ఆసరాగా చేసుకుని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు గృహహింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం లాంటి తీవ్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసులో జోగి రమేష్, కుమారుడు రాజీవ్, సోదరుడు రాము, సోదరి రమతోపాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చారు. ఇది రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలో భాగమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వీడియోతో కుట్రలు బట్టబయలు... టీడీపీకి చెందిన మహిళ నైటీని స్వయంగా ఆమె భర్తే చింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ నేతలు తమ దుస్తులు తామే చింపుకొని, ఎమ్మెల్యేపై తప్పుడు ఫిర్యాదు చేయడంపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. చివరకు మంత్రులు సైతం వాస్తవాలను మరుగునపరిచి దీన్ని వైఎస్సార్సీపీకి ఆపాదించి రాజకీయ లబ్ధి పొందే యత్నాలు చేయడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టీడీపీ కుట్రలు బట్టబయలయ్యాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తదితరులపై అట్రాసిటీ, హత్నాయత్నం, వాహనం ధ్వంసం కేసులు నమోదు చేసి ఆలూరు కోర్టులో హాజరు పరచగా 14 రోజులు కర్నూలు జిల్లా జైలుకు రిమాండ్కు తరలించాలని జడ్జి ఆదేశించారు. ఘటనలో లేని వారిపైనా కేసులా..!మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్లో కలిసేందుకు శ్రీకాకుళం వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో జన ప్రభంజనాన్ని చూసి కంటిపై కునుకు కరువైన సీఎం చంద్రబాబు తప్పుడు కేసులకు పోలీసులను పురిగొల్పారు. మహిళా ఎస్ఐ ప్రవల్లికపై దాడి చేసినట్లు ఆమదాలవలస వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవితోపాటు మరో 20 మందిపై అక్రమ కేసులు పెట్టారు. అసలు ఆ రోజు ఘటనా స్థలంలోనే లేని వారిపై కేసులు బనాయించడంపై ప్రజలు విస్తుపోతున్నారు. తనపై కక్ష సాధించేందుకు కుట్రలకు తెరతీసి అక్కడలేని 20 మంది అమాయకులపై అక్రమ కేసులు బనాయించారని చింతాడ రవి వీడియో విడుదల చేయడంతో కలకలం రేగింది. ఏ–8గా చూపించిన లాయర్ ధనేటి రామ్మోహనరావు ఘటన సమయంలో ఆమదాలవలస కోర్టులోనే ఉన్నారు. ఆ కేసులో ఏ–9గా ఉన్న ప్రైవేట్ ఉద్యోగి తేజేశ్వరరావు ఘటన జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్లోనే లేరు. ఆయన తన కుమార్తెను యూనివర్శిటీలో చేర్చేందుకు పంజాబ్ వెళ్లారు. ఏ–11 డాక్యుమెంట్ రైటర్ సురేష్ ఆ రోజు సబ్–రిజి్రస్టార్ ఆఫీసులోనే ఉన్నారు. ఘటన సమయంలో దూరంగా ఉన్న, సంబంధం లేని వ్యక్తులనూ నిందితులుగా చేర్చడం కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని ప్రజలు తప్పుబడుతున్నారు.రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చేశారు..శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జూలై 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ బీసీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్లో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన దీన్ని ఏకంగా హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి అప్పలరాజును కూడా అరెస్టు చేసి రిమాండ్కు పంపడం రాజకీయ కక్షసాధింపు అని ప్రజలు తప్పుబడుతున్నారు. సాధారణ సెక్షన్లతో సరిపెట్టాల్సిన రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి చదువుకునే యువకుడిని, మాజీ మంత్రిని ఇబ్బందుల పాలుచేసేలా టీడీపీ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కోసం ఏలూరు బలగాల మోహరింపు..గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా అధికారపక్షం ఇదే తరహా రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఓ వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్కు అప్పగించినప్పటికీ పోలీసులు తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం? వైఎస్సార్సీపీ నాయకుడు కాబట్టే కేసు పెడతారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఏలూరు జిల్లాకు చెందిన పోలీసులు భారీ సంఖ్యలో గుంటూరు చేరుకుని ఐదు బృందాలుగా ఏర్పడి ముస్తఫాను అరెస్టు చేయడానికి చేస్తున్న యత్నాలు రెడ్బుక్ రాజ్యాంగంలో జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనం. -
‘తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ వచ్చే ప్రసక్తే లేదు’
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అన్ని వర్గాల ప్రజల మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ‘హైదరాబాదులో ఇల్లు కూలగొట్టే అధికారం ఎవరికి లేదు. హిట్లర్ ఎన్ని దుర్మార్గాలకు వడిగట్టాడు అందరికీ తెలుసు. అలాంటి హిట్లర్ నాకు ఆదర్శం, స్ఫూర్తి అని సీఎం రేవంత్ అంటున్నారు. హైడ్రా నల్లచెరువులో బుచ్చమ్మ అనే మహిళ చనిపోయింది. హైడ్రా పేదల ఇళ్లను కూల్చే , వేధించే సంస్థ వచ్చింది. హైదరాబాద్ పోలింగ్ పెడితే దాన్ని బట్టి తెలుస్తుంది. హైడ్రా ప్రజల గూడును కూల్చే సంస్థగా ముద్ర పడింది. 95% ప్రజలు హైడ్రా అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి మాట కూడా హైడ్రా వినలేని పరిస్థితుల్లో ఉందనే విధంగా ప్రవర్తించారు. కిడ్నీ డయాలసిస్ పేషెంట్లను వికలాంగులుగా గుర్తించాలి. వికలాంగుల చట్టం లో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లను చేర్చాలి. కిడ్నీ పేషెంట్ కుటుంబాలలో అంధకారం నెలకొంది. హైదరాబాదులో అనేక చెరువులు కుంటలు, మాయమయ్యాయి. వాగులు, డ్రైనేజీలు కెమికల్ వేస్ట్గా మారిపోయాయి. హైదరాబాద్ అభివృద్ధి లో అవుతున్న కొత్త కాలనీలు చెరువు పక్కన ఇల్లు ఉంటే దుర్గంధం అవుతున్నాయి’ అని స్పష్టం చేశారు. -
భయపడని 100 మందిని తీసుకుని రేపు వెళ్తాను: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు. తాను మంగళవారం ప్రధాని నివాసానికి వెళ్లి, ఇథనాల్ విధానానికి వ్యతిరేకంగా 2.33 లక్షల మందికి పైగా సంతకం చేసిన వినతిపత్రాన్ని స్వయంగా అందజేస్తానని చెప్పారు.మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "కొన్ని రోజుల క్రితం ప్రధానికి ఉద్దేశించి ఆన్లైన్ వినతిపత్రం ప్రారంభించాం. చాలా తక్కువ సమయంలోనే సుమారు 2,33,238 మంది దానిపై సంతకం చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నా కార్యాలయం నుంచి 100 మందితో కలిసి ప్రధాని నివాసానికి బయలుదేరుతాను.ఈ వినతిపత్రాన్ని ఆయనకు స్వయంగా అందించి, ఇథనాల్ విధానంలో ఉన్న లోపాల గురించి చర్చించాలని కోరతాం" అని అన్నారు.అంతకుముందు శనివారం న్యూఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ బయట నిర్వహించిన టౌన్హాల్ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "గతంలో ప్రధానికి ఉద్దేశించిన వినతిపత్రంపై సంతకం చేయాలని మిమ్మల్ని కోరాను. 2,00,000 మందికి పైగా ఆన్లైన్లో సంతకం చేశారు. ఆ సంతకాల ప్రింట్లను తీసుకున్నాను. మంగళవారం 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నేను స్వయంగా ప్రధాని నివాసానికి వెళ్లి ఆ వినతిపత్రాన్ని అందజేస్తాను" అని చెప్పారు.పెద్ద సంఖ్యలో ప్రజలు రావాల్సిన అవసరం లేదని, పోలీసుల చర్యలకు భయపడని వారిని మాత్రమే వెంట తీసుకెళ్తానని అన్నారు. "అందరూ రావాల్సిన అవసరం లేదు. పోలీసుల లాఠీచార్జీకి భయపడని 100 మందిని తీసుకెళ్తాను. జైలుకు వెళ్లడానికి భయపడని 100 మందిని తీసుకెళ్తాను. రావాలనుకునే వారు నాకు రాయండి, నన్ను ట్యాగ్ చేసి సందేశం పంపండి. 100 మందితో కలిసి ప్రధాని నివాసం వైపు పాదయాత్ర చేస్తాం. ఆ తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
పెమ్మసానిపై అంబటి రాంబాబు ఆగ్రహం
సాక్షి, గుంటూరు: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఖరిపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పే అభివృద్ధి ఏంటో ప్రజలు గమనించాలి. అర్ధరాత్రి వేళల్లో మహిళలు ఉన్న ఇళ్లలోకి చొరబడి, తలుపులు పగులగొట్టి పోలీసులు తనిఖీలు చేయడమేనా ఆయన తెచ్చే అభివృద్ధి? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.గుంటూరు జిల్లాలో హోం డిపార్ట్మెంట్ పూర్తిగా పెమ్మసాని జేబులోనే ఉందని, ఆయన కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం నడుస్తోందని ఆరోపించారు.నా ఇంటిపై దాడి చేయించారు. గతంలో తన ఇంటిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ అంబటి భావోద్వేగానికి గురయ్యారు. "నా ఇంటిపై దాడి చేసే సమయంలో 24 గంటల్లో సినిమా చూపిస్తా అని పెమ్మసాని ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయనకు తప్పు చేశాననే భావన ఉంది.. ఎందుకంటే ఆయన ఒక నేరస్థుడు అని మండిపడ్డారు.తాను నల్లపాడు పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్న సమయంలో జరిగిన ఒక అంతర్గత విషయాన్ని అంబటి బయటపెట్టారు. నేను నల్లపాడు స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడి ఇద్దరు సీఐలకు పెమ్మసాని స్వయంగా ఫోన్ చేశారా లేదా? ఒకవేళ ఆయన పోలీసులకు ఫోన్ చేయలేదని నిరూపిస్తే, నేను ఆయన కాళ్లకు దండం పెడతా అంటూ సవాల్ విసిరారు. పెమ్మసాని మీద తనకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని, కానీ తన ఇంటిపై దాడి చేయించి క్రూరత్వానికి పాల్పడినందుకే తాను తీవ్రమైన కడుపుమంటతో మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. నా ఇంటిపై దాడి చేసిన వారిలో ఇంతవరకు పోలీసులు ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? అని నిలదీశారు. -
జెన్ జీకి తొలి వికెట్.. ‘వైరస్’ అన్న నబీన్కు ఓటుతో బదులు
బిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ విజయ దుందుభి మోగించారు. బీజేపీ దాదాపు మూడు దశాబ్దాలుగా గెలుస్తున్న నియోజక వర్గంలో మరో పార్టీ గెలవడమంటే సామాన్యమైన విషయం కాదు. తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. జన్ సూరజ్ పార్టీకి ఇది తొలి అసెంబ్లీ విజయం. తొలిసారి చట్టసభలో అడుగుపెట్టనున్నారు ప్రశాంత్ కిశోర్. బీజేపీకి 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న బంకీపూర్లో కేవలం 30 రోజుల పాటు శ్రమించి (ఎన్నికల ప్రచారం చేసి) ఆయన గెలుపొందారు. బీజేపీ ఓటమి వెనుక పలు ముఖ్యమైన అంశాలున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల నిర్వహించిన ఆందోళనల నేపథ్యంలో బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితంపై చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలను జెన్ జీలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు ఇచ్చిన ఝలక్గా అభివర్ణిస్తున్నారు.4 సార్లు ఇక్కడే నబీన్ గెలుపురాజ్యసభకు వెళ్లేందుకు ఆయన స్వయంగా వదులుకున్న సొంత నియోజకవర్గం బంకీపూర్లోనే బీజేపీ ఓటమి చెందింది. అంతకుముందు బంకీపూర్ నియోజకవర్గంలో వరసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబీన్ గెలిచారు. అలాగే, 1995 నుంచి బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ ఎప్పుడూ కోల్పోలేదు. అంతగా బీజేపీకి పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఓడించారు.సీజేపీని వైరస్తో పోల్చిన నబీన్నితిన్ నబీన్ సీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ దానిని "వైరస్"తో పోల్చారు. ఆయన ఇటీవల మాట్లాడుతూ.. "దేశంలో వైరస్, కాక్రోచ్లాంటి పార్టీలు వస్తున్నాయి. ఇవి దేశాన్ని లోపల నుంచి బలహీనపరచాలని చూస్తున్నాయి. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే టుక్డే-టుక్డే గ్యాంగ్లో ఇవి భాగం" అని అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందిస్తూ.. "మమ్మల్ని టెర్రరిస్టులు, వైరస్ అని పిలుస్తున్నారు. కానీ మేము విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్నాం" అని చెప్పారు.జెన్ జీ ఎఫెక్ట్- సంప్రదాయ ఓటు బ్యాంక్లో చీలికబంకీపూర్లో బీజేపీ ఓటమి జెన్ జీ ఎఫెక్టే అంటూ నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. యువ ఓటర్ల తీర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ ఓటమికి జెన్ జీ ఉద్యమం ప్రభావం ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యువ ఓటర్లలో పెరిగిన అసంతృప్తి ఎన్నికల ఫలితంపై స్పష్టంగా కనిపించింది. జెన్ జీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత, విద్యా సంస్కరణల అంశాలను యువత బలంగా ప్రస్తావించింది. కాక్రోచ్ ఉద్యమంలో బిహార్ యువత కూడా పాల్గొన్నారు. జెన్ జీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ యువ ఓటర్లను చైతన్యపరిచింది. మొదటిసారి ఓటు వేసిన యువతలో గణనీయమైన మార్పు కనిపించింది. ప్రతిపక్షాలకు మద్దతుగా డిజిటల్ ప్రచారం ఊపందుకుంది. జెన్ జీ ఉద్యమం స్థానిక సమస్యలను ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చింది. దీంతో బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంక్లోనూ కొంత మేర చీలిక ఏర్పడినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ ఫలితం యువత రాజకీయ ప్రభావాన్ని మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. -
కర్ణాటక కాంగ్రెస్లో అసమ్మతి.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?
సాక్షి,బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన వేళ పార్టీలో తిరుగుబాటు వ్యక్తమైంది. కేబినెట్లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశవంతరాయగౌడ వి. పాటిల్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణికి అందజేశారు.మరోవైపు సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ సైతం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. తమతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేబినెట్లోకి కొత్తగా 20 మంది మంత్రులను చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల అసంతృప్తితో రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. -
‘డీఎస్సీ అక్రమాలను డైవర్షన్ చేయడానికే ఈ కుట్రలు’
తాడేపల్లి : తీవ్రవాదిని అరెస్టు చేసినట్లు ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన సీదిరి అప్పలరాజు, ముస్తఫాపై కూడా ఇలాగే దాడులు చేయించారని మండిపడ్డారు టీజేఆర్. ఈరోజు(సోమవారం, ఆగస్టు 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. బీసీ, ఎస్సీలపై చంద్రబాబు దురుద్దేశంతోనే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ‘ నాగరాజు తన భార్య నైటీని చించి, మాపార్టీ నేతలపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది. మంత్రులు పార్థసారధి, సంధ్యారాణి సిగ్గు లేకుండా మాపై ఆరోపణలు చేశారు. అధికార మదం తలకెక్కిన మాటలను మంత్రులు మాట్లాడుతున్నారు. లోకేష్ చేసిన డీఎస్సీ అక్రమాలను డైవర్షన్ చేయటానికే ఈ కుట్రలకు తెర తీశారు. తన కొడుకు కనపడటం లేదని కోర్టుకు వెళ్లిన మాల గంగమ్మను పోలీసులు కొట్టి చంపారు. చివరికి పోలీసుల పహరాలోనే ఆమె శవాన్ని దహనం చేయించారు. మా నిజ నిర్ధారణ కమిటీ గ్రామానికి వెళ్తే మమ్మల్ని వారి ఇంటికి కూడా వెళ్లనీయలేదు. గంగమ్మ మృతికి కారణమైన పోలీసులపై కేసు పెట్టాలి. తప్పుడు కేసుల పెట్టి వేధిస్తున్న ఏ పోలీసులనూ వదలం. గుంటూరులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై పోలీసులు అరాచకం చేశారు. తనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యాపారిపై ముస్తఫా ఫిర్యాదు చేస్తే ఆయనపైనే కేసు పెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు బెదిరింపులపై ఫిర్యాదు చేసిన మాదాలా శ్రీనివాస్ పైనే తిరిగి కేసు పెట్టారు. ఆముదాలవలస ఇంఛార్జి చింతాడ రవికుమార్ పై అక్రమ కేసులు పెట్టారు. ఎస్ఐ మీద అసభ్యకరంగా ప్రవర్తించింది పోలీసులే. ఆ పోలీసులను వదిలేసి, చింతాడ రవి మీద ఎలా కేసు పెడతారు?, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక మహిళా అధికారిని వేధిస్తే ఎందుకు కేసు పెట్టలేదు?, ఆ మహిళా అధికారి స్వయంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?, మహిళా ఎస్ఐ కేసులో ధనేటి రమ్మోహనరావు, తేజేశ్వర్రావు ఇద్దరూ స్థానికంగా లేకపోయినా కేసు పెట్టారు. ఎన్.సురేష్ అనే డాక్యుమెంట్ రైటర్ పైన కూడా అలాగే కేసు పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులతో రాష్ట్రం పరువు తీస్తున్నారునీట్ పేపర్ లీకైనందున కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే మరి లోకేష్ ఏం చేస్తున్నారు?, డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహించరా?, ఎమ్మెల్యే విరూపాక్షిని బేషరతుగా విడుదల చేయాలి. సీసీ కెమెరా హార్డ్ డిస్కులను భద్రపరచాలి. చింతాడ రవికుమార్ కేసులో అక్కడ లేని వారిపై కేసులను ఉపసంహరించుకోవాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
ఉపఎన్నికల ఫలితాలు.. బీజేపీకి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్
దేశంలోని బంకీపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరిగింది. బిహార్లోని బంకీపూర్ నియోజకవర్గంలో జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. ఆయన 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ నేత నీరజ్ కుమార్పై విజయం సాధించారు. అంతకుముందు బంకీపూర్ నియోజకవర్గంలో వరసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుత జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ గెలిచారు. అంతగా బీజేపీకి పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్ కిశోర్ ఓడించారు. గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ (సతీశ్ పటేల్) విజయం సాధించారు. ఆయనకు మొత్తం 55,481 ఓట్లు పడగా 30,630 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి భిఖంభాయి రబారీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ విజయం సాధించారు. ఆయనకు మొత్తం 66757 ఓట్లు రాగా, 6,016 తేడాతో బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై గెలుపొందారు. -
‘18 గంటల సీఎం’ ఏం సాధించారు?
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ ‘18 గంటలు పని చేశానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి సాధించింది ఏముంది? కేవలం సర్వే నంబర్లు చూస్తూ, ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఆయన చేసిందేమీ లేదు’అని ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి పాలనలో కేవలం మద్యం ఆదాయంలో వృద్ధి తప్ప, మిగిలిన అన్ని రంగాలు వెనక్కి వెళ్ళిపోయాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధి గురించి మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సైతం తన పుస్తకంలో స్పష్టంగా ప్రస్తావించారని గుర్తుచేశారు. ఇదే సమయంలో పోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను అరెస్ట్ చేయకుండా తప్పించేందుకు, సీఎం రేవంత్ రెడ్డి బంధువు అయిన శరత్ రెడ్డికి వాటాలు ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో ఆశ్రయం కల్పించారు’ అని ఆరోపించారు.‘మాక్స్ బీన్’ కంపెనీ నుంచి మెడికవర్ ఆసుపత్రికి నిధులు మళ్లించారని, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగా పోరాడటం వల్లే పోలీసులు భగీరథ్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. లేకపోతే అతనికి బెయిల్ వచ్చేంత వరకు మెడికవర్ ఆసుపత్రిలోనే దాచిపెట్టేవారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తాము గమనిస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి లెక్కలు బయటకు తీస్తామని కేటీఆర్ హెచ్చరించారు. -
ఉత్తరాంధ్రలో జగన్ వెంటే జనం.. కూటమిలో కలవరం?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలి కాలంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అశేష జనం తరలివచ్చి ఆయనకు స్వాగతం చెబుతున్న తీరు సహజంగానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు ఆందోళన కలిగిస్తుంది. శ్రీకాకుళం వద్ద అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లారు. ఈ టూర్ను రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి ఉత్తరాంధ్రలో ప్రజల అభిమానం చూరగొనడం ఒక ఎత్తు అయితే, అప్పలరాజు కుటుంబాన్ని, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జగన్ వివరించిన వైనం మరో ఎత్తుగా ఉంది. విశాఖ వరకు విమానంలో వెళ్లి, అక్కడ నుంచి రోడ్డు మార్గాన వాహనంలో ప్రయాణం చేశారు. ఆ క్రమంలో వివిధ ప్రాంతాలలో ,రోడ్డు పక్కన జనం తండోపతండాలుగా గుమికూడడం, ఆయనతో కరచాలనం చేయాలని తహతహడలాడడం, పోలీసులు అడ్డుకుంటున్నా,పొలాలనుంచి వాగులు,వంకలు దాటుకుంటూ జగన్ కలుసుకోవడం గమనించిన వారెవరికైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఓడిపోయిందంటే నమ్మబుద్ది కాదు. ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ చెప్పినట్లు గత ఎన్నికలలో ఏభై లక్షల ఓట్ల గోల్ మాల్ తతంగం ఏదో జరిగి ఉండాలని చాలామంది విశ్వసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం జనానికి మేలు చేయకపోతే, ఈ స్థాయిలో వివిధ వర్గాలవారు ముఖ్యంగా,పేద,మద్య తరగతి ప్రజలు తరలిరారు. అంతేకాక కూటమి ప్రభుత్వం తన వాగ్దానాలను అరకొరగా మాత్రమే అమలు చేసి, అనేక హామీలను ఎగవేసిన వైనం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా క్షీణించడం, రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తుండడం వంటివి బాగా ప్రభావం చూపుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే జగన్ కోసం జనం అంత పెద్ద ఎత్తున వచ్చారనుకోవాలి. విశాఖ ఎయిర్ పోర్టు మొదలు ఆయా చోట్ల ఆయనను నిలిపి తమ సమస్యలను విన్నవించారు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఆయన వాహనం దిగి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భోగాపురం విమానాశ్రయం వద్ద ధాంక్యూ జగన్ సర్ అంటూ కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించారు.భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి జగన్ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు. కొన్ని చోట్ల దివ్యాంగులు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్ టూర్లో జనం లేకుండా చేయాలని పోలీసులు విశ్వయత్నం చేయకపోలేదు.అనేక చోట్ల రోడ్లపైకి రానివ్వకుండా, ఆయనను కలుసుకునే అవకాశం ఇవ్వకుండా తాడుతో వెనక్కి నెట్టేయడం వంటివి చేశారు. అయినా అభిమానులు వాటన్నిటిని తోసుకుంటూ జగన్ వెంట పరుగులు తీశారంటే అతిశయోక్తి కాదు. కూటమి ప్రభుత్వంపై ప్రజలలో కలిగిన విరక్తికి ఇది దర్పణం పడుతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి.జనం ఒత్తిడితో నిర్ణీత టైమ్ కన్నా జగన్ ఆలస్యంగా జైలు వద్దకు చేరుకోవడంతో అప్పలరాజును కలుసుకోలేకపోయారు. కాని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి జగన్ ధైర్యం చెప్పి వచ్చారు. వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.మరో కోణం చూస్తే అప్పలరాజు మాజీ మంత్రి. ఆయన మత్సకార వర్గానికి చెందినవారు. ఆయా అంశాలపై చక్కని క్లారిటీతో మాట్లాడుతుంటారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. ఎవరైతే సమర్దంగా వైఎస్సార్సీపీ పక్షాన పనిచేస్తుంటారో వారి గొంతు నొక్కడానికి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా రకరకాల కుట్రలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఏ చిన్న అవకాశం వచ్చినా వైఎస్సార్సీపీ మద్దతుదారులను జైళ్లలోకి పంపిస్తున్నారు.అయినా వారు వెనక్కి తగ్గకపోవడం కూటమి ప్రభుత్వానికి ఆందోళనగా మారింది. అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ నడుపుతున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దాని కారణంగా గొర్రెల కాపరి ఒకరు మరణించారు. అది దురదృష్టకర ఘటన. ఇంతవరకు కేసు పెట్టడాన్ని జగన్ తప్పుపట్టలేదు. కాని ఆ ఆరవ్ పై హత్యకేసు బనాయించడంపై జగన్ బాధపడ్డారు. ఆయన కొద్ది రోజుల క్రితం విశాఖ వచ్చినప్పుడు కూడా తప్పుపట్టారు.ఇక అప్పలరాజుపై సాక్ష్యాలు తారుమారు యత్నం చేశారంటూ కేసు పెట్టి జైలులో నిర్భంధించారు. ఆరవ్ కు బెయిల్ వచ్చింది కాని, అప్పలరాజు ఇంకా జైలులోనే ఉన్నారు.ఈ సందర్భంగా బాదిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అప్పలరాజు చేసిన ప్రయత్నాలను కూడా జగన్ వివరించారు.ఈ కేసును కుల వివాదంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనకు ప్రతిబింబమని ఆయన మండిపడ్డారు. మరణించిన వ్యక్తి యాదవ వర్గానికి చెందినవారు కనుక, మంత్రి పార్ధసారధిని పలాస పంపించిన వైనాన్ని, ఆ సామాజికవర్గానికి చెందిన కొందరితో ర్యాలీలు చేయించడాన్ని జగన్ ఆక్షేపించారు.పోనీ యాదవుల పట్ల ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా ఉందా అంటే ప్రకాశం జిల్లాలో ఒక ఘటనలో ఫిర్యాదు చేసిన యాదవులపైనే కూటమి ప్రభుత్వం ఎదురు కేసు పెట్టిన వైనాన్ని ఉదహరించారు.అంతేకాక విశాఖలో వైఎస్సార్సీపీ యాదవ మహిళకు మేయర్ పదవి ఇస్తే ,ఆమెను పదవినుంచి దించేశారని జగన్ విమర్శించారు. రోడ్డు ప్రమాద ఘటనలన్నిటిలోను ఒకే రకంగా వ్యవహరిస్తున్నారా?అని జగన్ వేసినప్రశ్న సమంజసంగానే ఉంది. చాలా కేసులు అసలు పోలీస్ స్టేషన్ వరకు రావు. కొన్ని కేసులలో అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందినవారెవరైనా ఇలాంటి ప్రమాద ఘటనలలో ఉన్నా,వారిపై కేసులే పెట్టరు.అందుకు కొన్ని ఉదాహరణలను కూడా జగన్ పేర్కొన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే కారులో ఉండగానే ప్రమాదం జరిగిందని, అలాగే పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు కారు నడుతుండగా యాక్సిడెంట్ అయిందని, ఆ ఘటనలలో ఎవరిపైన కేసులు పెట్టారని జగన్ వేసిన ప్రశ్నకు సమాధానం లేదు. ఒక్కొక్కరికి ఒక న్యాయం అమలు చేయడం అంటే విషపు విత్తనాలు నాటడమేనని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు హింసాత్మక సంఘటనలు జరిగినా, వాటిలో టీడీపీవారు నిందితులుగా ఉంటే తూతూ మంత్రంగా కేసులు పెట్టడం చేస్తున్నారు.లేదా అసలు కేసులే పెట్టడం లేదు. జనసేనకు చెందినవారు పోలీస్ స్టేషన్ లపై వరసగా నాలుగురోజుల పాటు దాడులు చేసినా కేసులు లేకపోవడాన్ని ప్రజలంతా గమనించారు. అప్పలరాజును పరామర్శించడానికి జగన్ వెళ్లడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. చిత్రమేమిటంటే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయా కేసులలో నిందితులను పరామర్శించడానికి వెళ్లారు.ఆయనే కాదు.ఇతర టీడీపీ నేతలు కూడా అలా చేసిన ఉదాహరణలు ఉన్నాయి.అదేమీ తప్పుకాదు.కాని వైఎస్సార్సీపీవారు చేస్తే మాత్రం టీడీపీ విమర్శలు చేస్తుంటుంది. ఇక తనపై ఉన్న కేసుల్లో సాక్ష్యులను మేనేజ్ చేసి వారితోనే కేసులను ఉపసంహరించేలా చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో ఆయా కేసులను చంద్రబాబు ఎత్తివేయించుకుంటున్న తీరును వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒక ఫ్యాక్షన్ హత్య జరిగితే,దానికి రాజకీయ రంగు పులిమి స్వయంగా చంద్రబాబే వెళ్లి ఆ హతుడి పాడె మోశారు.పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. ఆ సందర్భంలో పోలీస్ వాహనాన్ని కూడా దగ్ధం చేశారు. రాళ్లదాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ కేసు నిందితులను చంద్రబాబు పరామర్శించారా? లేదా? అవన్ని ఎందుకు చంద్రబాబుపైనే రెండు హత్యాయత్నం కేసులు నమోదు అయి ఉన్నాయే!అవి కాకుండా మరికొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంతసేపు ఎదుటివారిపై ఆరోపణలు చేసి చంద్రబాబు వాటి గురించి ఎందుకు మాట్లాడరు? గతంలో గౌరు వెంకటరెడ్డి అనే నేత కాంగ్రెస్ లో ఉండేవారు. ఆయనకు ఒక కేసులో శిక్షపడి జైలులో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శకు వెళితే, అప్పుడు కూడా చంద్రబాబు విమర్శలు చేశారు.ఆ తర్వాత కాలంలో గౌరు వెంకటరెడ్డి, చరిత దంపతులను టీడీపీలో చేర్చుకుని చరితకు టీడీపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అలా ఉటుంది ఆయన రాజకీయం. చంద్రబాబు ఏమి చేసినా రైటు, ప్రత్యర్ధులు ఏమి చేసినా తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇదంతా ఏమిటంటే మీడియా మేనేజ్ మెంట్ తనకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదన్నదే ఆయన నమ్మకం కాబట్టి అనుకోవాలి. సమయం అయిపోయిందని జైలులో ఉన్న అప్పలరాజును కలుసుకునే అవకాశం అధికారులు జగన్కు ఇవ్వలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా వెళితే, ప్రభుత్వం కొంత బ్రాడ్ మైండ్తో అప్పలరాజుతో ములాఖత్కు అవకాశం ఇచ్చి ఉంటే హుందాగా ఉండేది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వం నుంచి అలాంటివి ఆశించడం అత్యాశే అవుతుందేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో యువతను వాడుకోవడం.. ఆ తర్వాత నట్టేట ముంచటం కాంగ్రెస్కు ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య ఘటన ఆవేవన కలిగించిందన్న ఆయన.. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ యువతను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కానీ, ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారు. కానీ, రెండున్నరేళ్లుగా జాబ్క్యాలెండర్ ఇవ్వలేదు. తెలంగాణ యువత.. ప్రత్యేకించి నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో వేణు అనే యువకుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వేణు తన లేఖలో రాశాడు. అలాగే బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారని కూడా గుర్తు చేశాడు. వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ రాశాడు. బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల 42 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. హైదరాబాద్లో 142 ఫ్లైఓవర్లు నిర్మించిందెవరు? సచివాలయం కట్టించింది ఎవరు? బీఆర్ఎస్ హయాంలో చివర 48 వేల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చాం.రేవంత్ పాలనలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానవతా దృక్ఫతం లేకుండా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడారు. విద్యార్థుల విలువ సీఎం రేవంత్కు ఏం తెలుసు?. అసలు నిరుద్యోగులకు ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. పోలీసు ఉద్యోగాలు 20 వేలు ఖాళీ ఉన్నాయి. 7 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఎందుకిచ్చారు?. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ 24 హామీలు ఇచ్చింది. అశోక్ నగర్లో సాక్షాత్తు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు విలువ లేదు. ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా రాహుల్ పట్టించుకోరా? ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులపై దాడులు జరిగితే వెళ్తున్న ఆయన.. అసలు హైదరాబాద్కు ఎందుకు రావడం లేదు?. తెలంగాణ వైపు చూసే దమ్మే ఆయనకు లేదా?కాంగ్రెస్, బీజేపీ యువతను వాడుకుంటోంది. రాహుల్, రేవంత్ తెలంగాణ యువతను మోసం చేశారు. వాళ్లు ఇద్దరు ప్రకటించిన డిక్లరేషన్లు, కార్డులు క్రిమినల్ వేస్ట్. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయడం క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తి సీఎం కావడం క్రిమినల్ వేస్ట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. వేణు సూసైడ్కు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని కేటీఆర్ నిలదీశారు.ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫారాలు నింపడం రాదని రేవంత్ అన్నారు. ఆ మాటలకు మేం బాధపడ్డాం. అసలు ఆయనకు ఎన్నికల అఫిడవిట్ ఫారం నింపడం వచ్చా?. ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్మాణాలు తెలుసు.. కాంగ్రెస్కు ఎలా సమాధి కట్టాలో తెలుసు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరుతున్నాం. మళ్లీ పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా.. ముందు ఆ హామీని నెరవేర్చండి. యువత సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రండి అని కేటీఆర్ రేవంత్ సర్కార్కు సవాల్ విసిరారు. -
మారిన సీన్.. ధర్మేంద్ర ప్రధాన్కు బిగ్ చాన్స్?
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్కు.. మరో చాన్స్ దక్కనుందా?. స్వరాష్ట్రంలో లభించిన ఘన స్వాగతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. బీజేపీలో కీలక నేతగా ఎదిగిన ఆయనకు ఇకపై ఎలాంటి బాధ్యతలు దక్కబోతున్నాయన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆయనకు బిగ్చాన్స్ దక్కే అవకాశం ఉందన్న విశ్లేషణలు జోరందుకున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ బలానికి 2024 సంబల్పూర్ విజయం ఒక ఉదాహరణగా నిలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన ఒడిశాలోని సంబల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏకంగా 1,19,836 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నితేశ్ గంగా దేవ్ కేవలం 9,162 ఓట్ల స్వల్ప ఆధిక్యంతోనే గెలిచారు. ఐదేళ్ల వ్యవధిలో సంబల్పూర్లో బీజేపీ బలం ఎంతగా పెరిగిందో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పు వెనుక ధర్మేంద్ర ప్రధాన్ చేసిన సంస్థాగత కృషి కీలకమని పార్టీ వర్గాలు భావిస్తాయి. చాలా కాలం ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఒడిశాలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందారు.మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఒడిశాకు తిరిగి వచ్చిన సమయంలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ పరిణామమే ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది. ఇది కేవలం ఓ నేతకు ఇచ్చిన స్వాగతమేనా? లేదంటే భవిష్యత్లో కీలక బాధ్యతలకు సంకేతమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఆయనకు జాతీయ రాజకీయాల్లో మరో అవకాశం కష్టమనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.రాజీనామా.. అవకాశంగా మారిందా?NEET వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయనకు మరో మంత్రి పదవి ఇవ్వడాన్ని.. అటు ఆందోళనకారులు, ఇటు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఆయనకు మరో అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. అయితే.. సాధారణంగా ఒక మంత్రి పదవి నుంచి తప్పుకోవడం రాజకీయంగా ప్రతికూల పరిణామంగానే భావిస్తారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.రాజీనామా తర్వాత ఆయనకు లభించిన స్వాగతం, పార్టీ నేతల బహిరంగ మద్దతు.. ఆయన రాజకీయ ప్రాధాన్యం ఇంకా తగ్గలేదనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రజల్లో “ఒడిశాకు చెందిన కీలక నేత కేంద్రంలో బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు తిరిగి రాష్ట్రానికి వచ్చారు” అనే భావన కూడా ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.అయితే మరోవైపు.. NEET వివాదం ప్రభావం పూర్తిగా తగ్గిందా? అనేది కూడా ప్రశ్నగానే ఉంది. ముఖ్యంగా యువతలో ఆయనపై ఉన్న అభిప్రాయం ఎలా ఉందన్నది భవిష్యత్ రాజకీయాల్లో కీలకం కానుంది.ఒడిశాలో అసలు బలం ఎంత?జాతీయ రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్కు ఒడిశా రాజకీయాలపై పట్టు లేదనే వాదనకు ఆయన రాజకీయ ప్రయాణమే సమాధానంగా నిలుస్తుంది. విద్యార్థి దశలో ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ఒడిశాలో బీజేపీ ఒక చిన్న శక్తిగా ఉన్న సమయంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు చెబుతాయి.ప్రత్యేకంగా పశ్చిమ ఒడిశాలో పార్టీ విస్తరణ, కార్యకర్తల నెట్వర్క్ పెంచడం, ఎన్నికల వ్యూహాల్లో ఆయన పాత్ర ఉందనే గుర్తింపు ఉంది. 2024లో సంబల్పూర్లో వచ్చిన భారీ విజయం కూడా ఆయనకు ఉన్న క్షేత్రస్థాయి అనుబంధానికి నిదర్శనంగా బీజేపీ నేతలు చెబుతున్నారు.అయితే ఆయన బలం ఎక్కువగా సంస్థాగత రాజకీయాలు, వ్యూహ రచన, పార్టీ నాయకులతో సమన్వయం చేయడంలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాల్లో ఉండే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఇమేజ్ను మాత్రం మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.సీఎం రేసులో మళ్లీ ధర్మేంద్ర ప్రధాన్?2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి ఒడిశాలో అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీని వెనుక గిరిజన ఓటు బ్యాంక్, సామాజిక సమీకరణాలు కీలకంగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు భావించారు.ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే.. ఆయనకు ఉన్న అనుభవం, ఢిల్లీ నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ వెంటనే సీఎం మార్పు చేయడం మాత్రం పార్టీకి అంత సులభమైన నిర్ణయం కాదని భావిస్తున్నారు.ఎందుకంటే మోహన్ చరణ్ మాఝీ ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి కావడంతో ఆయనను మార్చడం మరో రాజకీయ సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది.బీజేపీలో కొత్త సమీకరణాలు?ధర్మేంద్ర ప్రధాన్ పేరు మళ్లీ తెరపైకి రావడంతో ఒడిశా బీజేపీలో అంతర్గత సమీకరణాలపై కూడా చర్చ మొదలైంది. రాష్ట్ర బీజేపీలో అపరాజిత సారంగి, బైజయంత్ పాండా, మన్మోహన్ సామల్ వంటి నేతలు కూడా కీలక స్థానాల్లో ఉన్నారు. అందువల్ల ప్రధాన్ పాత్రను పెంచే విషయంలో పార్టీ అధిష్ఠానం సమతుల్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్కు పార్టీలో ఉన్న అనుభవం, జాతీయ స్థాయి పరిచయాలు ఆయనకు ప్రత్యేక బలంగా మారుతున్నాయి.ముందున్న దారులు ఏంటి?ధర్మేంద్ర ప్రధాన్ ముందు ప్రధానంగా రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. బీజేపీలో జాతీయ స్థాయిలో మరింత కీలకమైన సంస్థాగత బాధ్యతలు చేపట్టడం. ఎన్నికల వ్యూహాలు, పార్టీ విస్తరణలో ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవడం. రెండోది.. ఒడిశా రాజకీయాల్లోకి మరింత చురుగ్గా ప్రవేశించి రాష్ట్రంలో పార్టీకి మార్గనిర్దేశం చేయడం.వెంటనే ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా.. భవిష్యత్లో ఆయనకు కీలక బాధ్యతలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకవైపు ఆయనపై వచ్చిన విమర్శలకు కారణమైనప్పటికీ.. మరోవైపు ఒడిశాలో ఆయన రాజకీయ బలాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చింది. సానుభూతి ఎంతవరకు పనిచేస్తుంది? బీజేపీ అధిష్ఠానం ఆయనకు ఎలాంటి పాత్ర ఇస్తుంది? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. -
పెన్షన్ కోసం పాత ఉద్యోగంలో చేరిన మాజీ ఎంపీ!
అధికారం, పదవులు ఎప్పటికీ శాశ్వతం కావు.. కానీ నేర్పించిన విద్య మాత్రం జీవితాంతం తోడుంటుంది. పార్టీకి ఆ ప్రాంత ముఖంగా.. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఓ మాజీ ఎంపీ.. ఇప్పుడు మళ్లీ తరగతి గదిలోకి అడుగుపెట్టారు. పదవి పోయిందని, అవమానాలు జరిగాయని కుంగిపోకుండా.. తనకు తెలిసిన విద్యా బాటనే ఎంచుకున్నారు. రాజకీయ కార్యకలాపాలకు దూరమై.. తిరిగి ఉపాధ్యాయ వృత్తిలో చేరడం ఆయన వ్యవహారం.. అందుకు చెప్పిన ఆసక్తికర కారణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.త్రిపురలోని తూర్పు త్రిపుర లోక్సభ నియోజకవర్గం నుంచి 2019లో బీజేపీ తరఫున గెలిచిన రిబతి త్రిపుర(49).. తాజాగా అగర్తలాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మళ్లీ ఉపాధ్యాయుడిగా చేరారు. రాజకీయాల్లో అనుకున్నంత క్రియాశీల పాత్ర లేకపోవడం, పార్టీ పదవుల్లో చోటు దక్కకపోవడంతో ఆయన తన పాత వృత్తి వైపు మళ్లినట్లు తెలుస్తోంది.ఎంపీగా ఎదిగిన ఉపాధ్యాయుడురిబతి త్రిపుర స్వస్థలం ధలాయ్ జిల్లా. చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆయన రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2001లో అగర్తలాలోని మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేసిన ఆయన 2014లో బీజేపీలో చేరారు. గిరిజన ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎదిగారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు తూర్పు త్రిపుర టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు.రాజకీయంగా తగ్గిన ప్రాధాన్యంఅయితే కాలక్రమేణా ఆయన రాజకీయ ప్రాధాన్యం తగ్గింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు బదులుగా తిప్రా మోతా పార్టీ అధినేత ప్రద్యోత్ కిశోర్ దెబ్బర్మన్ సోదరి కృతి దేవి దెబ్బర్మన్ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆ తర్వాత కూడా రిబతి త్రిపుర బీజేపీ కోర్ కమిటీలో కొనసాగినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా చురుకుగా కనిపించలేదు. తాజాగా పార్టీ ప్రకటించిన కొత్త కార్యవర్గ జాబితాలోనూ ఆయన పేరు లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మరింత స్పష్టత వచ్చినట్లు అయింది. అయితే ఉద్దేశపూర్వకంగా ఆయన్ని పార్టీ పక్కన పెట్టిందనే ప్రచారం అక్కడ వినిపిస్తూ వచ్చింది. దానికి తగ్గట్లే ఆయన కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు.‘రెండున్నరేళ్లుగా పని లేదు.. అందుకే తిరిగొచ్చా’అయితే తన నిర్ణయంపై రిబతి త్రిపుర మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లుగా పార్టీ కోర్ కమిటీ సభ్యుడిగా తనకు ప్రత్యేక బాధ్యతలు ఏమీ లేవని తెలిపారు. “రాజకీయంగా నాకు ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక బాధ్యత లేదు. అందుకే నా పాత వృత్తి అయిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి తిరిగి వచ్చాను” అని ఆయన పేర్కొన్నారు.తిరిగి బోధనలో సౌకర్యంగా ఉంటే కొనసాగుతానని, లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ గురించి ఆలోచిస్తానని చెప్పారు. అదే సమయంలో ఉపాధ్యాయ ఉద్యోగం తనకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కూడా ఇస్తుందని తెలిపారు. నెలకు సుమారు రూ.50 వేల వరకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.రాజకీయాల నుంచి.. తరగతి గదికిరిబతి త్రిపుర తిరిగి పాఠశాలలో చేరడాన్ని సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతించినట్లు తెలుస్తోంది. ఆయన నిబద్ధతతో బోధిస్తున్నారని పాఠశాల అధికారులు తెలిపారు. ఎంపీగా ప్రజా సమస్యలను ప్రస్తావించిన వ్యక్తి.. ఇప్పుడు మళ్లీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలోకి రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.రాజకీయాల్లో విజయాలు, పరాజయాలు సహజమే. కానీ తనకు తెలిసిన రంగంలో తిరిగి అడుగుపెట్టి స్థిరత్వాన్ని ఎంచుకున్న రిబతి త్రిపుర నిర్ణయం.. పదవి కంటే వృత్తి విలువను గుర్తుచేస్తోంది. -
కావేరీ కత్తి.. విజయ్కు తొలి పరీక్ష!
తమిళనాడు రాజకీయాల్లో కావేరీ జల వివాదం మరోసారి వేడి పుట్టిస్తోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద రాజకీయ సవాల్గా మారింది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి.. ఒకటి కర్ణాటకతో నీటి హక్కుల పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? రెండోది.. రాష్ట్రంలో ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?కావేరీ అంశం తమిళనాడులో కేవలం నీటి సమస్య మాత్రమే కాదు.. ఇది రైతుల జీవనాధారం, ప్రాంతీయ హక్కులు, రాజకీయ ప్రతిష్ఠతో ముడిపడిన సున్నితమైన అంశం. అందుకే ఈ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తుంటాయి.అఖిలపక్ష సమావేశం కోసం డీఎంకే ఒత్తిడికావేరీ వివాదంపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డీఎంకే సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు డ్యామ్ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం కూడా అన్ని పార్టీలను కలుపుకుని వ్యూహం రూపొందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.డీఎంకే వాదన ప్రకారం.. కావేరీ వంటి కీలక అంశాల్లో రాజకీయ భేదాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలి. ముఖ్యమంత్రి విజయ్ అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని డీఎంకే ప్రశ్నిస్తోంది.‘ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాం’అయితే టీవీకే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల డిమాండ్ను అంగీకరించడం లేదు. టీవీకే సీనియర్ నేత, మంత్రి సీటీఆర్ నిర్మల్కుమార్ మాట్లాడుతూ.. కావేరీ అంశంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగిందని, అన్ని పార్టీల మద్దతుతో తీర్మానం కూడా ఆమోదించామని తెలిపారు. అసెంబ్లీలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని టీవీకే ఆరోపిస్తోంది.చర్చల నుంచి రాజకీయ విమర్శల దిశగా.. కావేరీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించిన విజయ్ ప్రభుత్వ వైఖరిలో ఇప్పుడు రాజకీయ దూకుడు కూడా కనిపిస్తోంది. విజయ్ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన కొద్ది రోజులకే.. మంత్రి ఆర్. నిర్మల్కుమార్ కర్ణాటక సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. డీకే శివకుమార్ కర్ణాటక ప్రయోజనాల కంటే డీఎంకే నాయకత్వం ప్రభావంతో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. “ఆయన సొంత పార్టీ నేతగా కాకుండా డీఎంకేతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది” అంటూ విమర్శలు చేశారు.అయితే కావేరీ వంటి సున్నితమైన అంశంలో ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత వేడెక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.విజయ్ వ్యూహం వెనుక..అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు గతంలో కావేరీ వివాదం తీవ్రంగా మారిన ప్రతిసారి అఖిలపక్ష సమావేశాలను ఆశ్రయించాయి. అయితే విజయ్ ప్రభుత్వం మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంటోంది. సమస్యను నేరుగా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది.కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ కోసం బెంగళూరు వెళ్లాలని విజయ్ భావించినట్లు సమాచారం. అయితే కర్ణాటకలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. ఇక్కడే విజయ్కు అసలు పరీక్ష మొదలవుతుంది.రాజకీయ అనుభవం ఉన్న పార్టీల మాదిరిగా ఉద్యమాల మార్గాన్ని ఎంచుకోవాలా? లేక చర్చల ద్వారా పరిష్కారం సాధించే ప్రయత్నం చేయాలా? అనే విషయంలో ఆయన నిర్ణయం కీలకం కానుంది.కావేరీ నీటి వివాదం దశాబ్దాలుగా తమిళనాడు-కర్ణాటక మధ్య కొనసాగుతున్న సమస్య. ఇది మరీ ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ భావోద్వేగ అంశమే. డెల్టా ప్రాంత రైతులకు కావేరీ నీరు అత్యంత కీలకం. నీటి విడుదలలో ఆలస్యం జరిగిన ప్రతిసారి తమిళనాడులో రైతుల ఆందోళనలు, రాజకీయ నిరసనలు తీవ్ర స్థాయికి చేరుతాయి. అందుకే ఈ అంశంలో ఏ ప్రభుత్వం బలహీనంగా కనిపించినా ప్రతిపక్షాలకు అది రాజకీయ ఆయుధంగా మారుతుంది.డీఎంకే ఆందోళనతో మరింత వేడికావేరీ నీటి సమస్య, రైతుల అంశంపై టీవీకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని డీఎంకే ఆగస్టు 3న తంజావూరులో భారీ నిరసనకు సిద్ధమవుతోంది. ఈ ఆందోళన ద్వారా విజయ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డీఎంకే భావిస్తోంది. మరోవైపు టీవీకే మాత్రం తమ ప్రభుత్వం తమిళనాడు హక్కుల విషయంలో రాజీ పడదని చెబుతోంది.విజయ్ ముందు రెండు మార్గాలుప్రస్తుతం కావేరీ వివాదం విజయ్ రాజకీయ నాయకత్వానికి తొలి పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాల ఒత్తిడి.. మరోవైపు కర్ణాటకతో సున్నితమైన జల వివాదం.. ఇంకోవైపు రైతుల అంచనాలు.. ఈ మూడు అంశాలను సమతుల్యం చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి విజయ్కు ఎదురైంది. కావేరీ విషయంలో విజయ్ తీసుకునే నిర్ణయం కేవలం ఒక నీటి వివాదానికి పరిష్కారం చూపడమే కాదు.. ఆయన పరిపాలనా శైలి, రాజకీయ పరిపక్వతకు కూడా తొలి కొలమానంగా మారనుంది. -
వివేక్, మాధవన్పై ప్రముఖ నేత ఆగ్రహం.. సంపాదన కోసమే దేశమా?
ముంబై: నటులు ఆర్ మాధవన్ (మ్యాడీ),వివేక్ ఓబెరాయ్పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే విమర్శలు గుప్పించారు. భారత్పై అంత ప్రేముంటే విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్లో ప్రతీదీ అద్భుతంగా మార్చిందని భావిస్తే వాళ్లెందుకు విదేశాల్లో ఉంటున్నారని అన్నారు.ముంబైలో ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగం ‘మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన’ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలు విదేశాలకు వెళ్లిపోయారని అన్నారు. మోదీ బయోపిక్లో నటించి, ఆయన పాత్రను పోషించిన వివేక్ ఓబెరాయ్ కూడా ఇప్పుడు దుబాయ్లోనే నివసిస్తున్నారు. పీఎం మోదీని ప్రశంసించిన ఆర్ మాధవన్ ఎక్కడ ఉంటున్నారు? ఆయన కూడా దుబాయ్లోనే ఉంటున్నారు.మీకు భారత్పై అంత ప్రేమ ఉంటే పీఎం మోదీని అంతగా అభిమానిస్తే, దేశాన్ని మోదీ అభివృద్ధి చేస్తున్నారని నమ్మితే.. మరి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? తమ కుటుంబాలతో కలిసి దుబాయ్లో ఎందుకు నివసిస్తున్నారు? అని థాకరే నిలదీశారు.వారు ఇక్కడికి వస్తారు, ప్రభుత్వం స్పాన్సర్ చేసే ‘ధురంధర్’లాంటి సినిమాల్లో నటిస్తారు. ఆ తర్వాత మళ్లీ దుబాయ్కి వెళ్లిపోతారు’ అని ఆయన ఆరోపించారు. అయితే, తన కుమారుడి స్విమ్మింగ్ కెరీర్ కోసం కోవిడ్-19 మహమ్మారి సమయంలో తాను దుబాయ్కి మారినట్లు ఆర్ మాధవన్ గతంలో పేర్కొనగా, తన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు దుబాయ్ వెళ్లినట్లు వివేక్ ఓబెరాయ్ చెప్పారు. -
ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి : కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైఎస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు! ప్రశ్నిస్తే అరెస్టులు ! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం?ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?చంద్రబాబు… నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది. చిప్పగిరి మండలం నేమకళ్లులో వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు.ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో… కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో… ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో… ప్రజలకు తెలియకూడదనే హార్డ్డిస్కులను తీసుకెళ్లారా? చంద్రబాబు.. సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్కు అప్పగించినప్పటికీ… తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైఎస్సార్సీపీ నాయకుడని కేసు పెడతారా?రాష్ట్రంలోని Gen-Z తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? అని. కాని, ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేష్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.చంద్రబాబు.. గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా… ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా… ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా… ఎన్ని పోలీసు బలగాలను దించినా… వైఎస్సార్సీపీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజల వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు’ అని పునరుద్ఘాటించారు. నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం!దాడి చేసినవారికి రక్షణ… బాధితులపై కేసులతో రాజకీయ కక్ష!@ncbn గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైయస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2026 -
కాంగ్రెస్తో పొత్తుకు ఆప్ రెడీ.. నెక్ట్స్ జరిగేదేంటి?
గోవాలో 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏర్పాటుపై ప్రాథమిక చర్చలు ప్రారంభించాయి. కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ చర్చలు ప్రారంభించగా, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.గోవా అసెంబ్లీలో 40 మంది సభ్యులు ఉంటారు. అసెంబ్లీ ఎన్నికలు 2027 ఫిబ్రవరి-మార్చిలో జరిగే అవకాశం ఉండటంతో పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో బీజేపీ ఇప్పటికే కనీసం 30 స్థానాలు గెలిచి రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీశ్ చోడంకర్ మాట్లాడుతూ.. కూటమి ఏర్పాటుపై గోవా ఫార్వర్డ్ పార్టీ అధినేత విజయ్ సర్దేశాయితో చర్చలు జరిపినట్లు తెలిపారు. శనివారం దక్షిణ గోవాలోని ఫటోర్డాలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్, జీఎఫ్పీ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.శనివారం జరిగిన చర్చలు ప్రాథమిక స్థాయిలో మాత్రమే జరిగాయని, కూటమిని కొనసాగించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చోడంకర్ తెలిపారు. "మళ్లీ సమావేశమై సీట్ల సర్దుబాటు సహా ఇతర విషయాలను ఖరారు చేస్తాం" అని ఆయన చెప్పారు.ఇదిలా ఉండగా, ఆప్ గోవా అధ్యక్షుడు వాల్మీకి నాయక్ పొత్తుపై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటు చేసిన పార్టీ కమిటీని కలిశారు. ఆప్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న పార్టీలతో పొత్తుకు సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే ప్రధాన లక్ష్యమని నాయక్ మీడియాతో చెప్పారు.ప్రస్తుతం గోవాలో 33 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇందులో 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాల్లో 20 స్థానాలు గెలిచింది. ఆ తర్వాత ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది.ప్రస్తుతం కాంగ్రెస్కు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఆప్కు ఇద్దరు ఎమ్మెల్యేలు, గోవా ఫార్వర్డ్ పార్టీ, రివల్యూషనరీ గోవన్స్ పార్టీకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. చర్చలు ప్రారంభం కావడంతో 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి వ్యూహాన్ని పరిశీలించడం ప్రారంభించాయి. -
AP: ఆలూరు నియోజకవర్గంలో టెన్షన్.. టెన్షన్..
సాక్షి, కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు. అన్ని ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎవరిని రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే వీరుపాక్షిపై అట్రాసిటీ కేసు బనాయించేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.చిప్పగిరి పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళనవిరూపాక్షిని చిప్పగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. విరూపాక్షి అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కూటమి సర్కార్కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పీఎస్కు వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు.. పోలీస్స్టేషన్కు వచ్చే అన్నిదారులు మూసివేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా..కాగా, వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా అక్రమ అరెస్ట్లు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి.. వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2.45 గంటలకు భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరినీ చిప్పగిరి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా హార్డ్ డిస్క్లను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఇది జరిగింది..టీడీపీ నాయకుడు నాగరాజు.. వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే వీరుపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ విరుపాక్షిపై సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం, ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు.. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన విరూపాక్షి, చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. -
ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్
అప్డేట్స్:విరూపాక్షికి రిమాండ్ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్విరూపాక్షితో పాటు 17 మందికి రిమాండ్ విధింపు రిమాండ్ విధించిన ఆలూరు జూనియర్ సివిల్ కోర్టు 307 సెక్షన్ కింద కేసు నమోదుఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విరూపాక్షితో పాటు మరో 34 మంది కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపువిరూపాక్షిని కోర్టుకు తరలించిన చిప్పగిరి పోలీసులుజడ్జి ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులుసాక్షి, కర్నూలు జిల్లా: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో రాత్రి 2.45 గంటల సమయంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఎమ్మెల్యే నివాసం తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించడం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ నేతలు ఎస్వీ మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ ఎ. మధుసూధన్, బీవై. రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు.చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నాయకుడు నాగరాజు, అతని అనుచరులు దాడికి తెగబడితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే విరూపాక్షి వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ గూండాలు ఎమ్మెల్యేపై రాళ్లు రువ్వడంతో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనపై టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా, గొడవకు ఎమ్మెల్యేనే కారణమంటూ సీఐ రవిశంకర్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు.దాడికి పాల్పడిన టీడీపీ నాయకులను అరెస్టు చేయకుండా, బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రజాప్రతినిధిపై కేసులు పెట్టడం పోలీసు వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసినట్లు పోలీసు బలగాలు వ్యవహరించడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం, తలుపులు పగులగొట్టి విరూపాక్షితో పాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్టు చేసి చిప్పగిరి పోలీస్స్టేషన్కు తరలించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.ఎమ్మెల్యే నివాసంలోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లను పోలీసులు తీసుకెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వాస్తవాలను బయటకు రానివ్వకుండా సాక్ష్యాలను మాయం చేసేందుకే హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకున్నారా? అని ప్రశ్నించారు. వాటిలోని దృశ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వంసం చేయకుండా భద్రపరచాలని, ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుబంధ విభాగంలా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ శ్రేణులను బెదిరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పార్టీ భయపడేది లేదని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు నాగరాజుతో పాటు నిందితులందరినీ అరెస్టు చేయాలని, సీఐ రవిశంకర్రెడ్డి ఏకపక్ష వ్యవహారశైలిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. చిప్పగిరిలో శాంతిభద్రతలను పరిరక్షించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
పోటాపోటీగా పొర్లు దండాలు..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: హూ ఈజ్ మోదీ.. అయామ్ ఫాదరాఫ్ లోకేశ్.. నౌ టెల్ మీ.. హూ ఈజ్ మోదీ.. తల్లిని చూడలేనివాడు దేశాన్ని చూస్తాడా.. గోద్రా నరహంతకుడు మోదీ దేశానికి ప్రధానిగా ఎలా పనికొస్తాడు అంటూ అప్పట్లో హూంకరించిన చంద్రబాబేనా ఈయన.. కొంపదీసి డూప్ చంద్రబాబు గట్రా స్టేజి మీద ఉన్నారా అని ఒక్క క్షణం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరైన జనానికి అనిపించింది. ఈ దేశానికి మోదీలాంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది.. అసలు మోదీ అవసరం దేశానికీ ఉంది.. ఆయన లేకపోతే దేశం లేదు.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీలాంటి నాయకుడిని చూడలేదు అంటూ బాబు ఉన్నఫళంగా మోదీ దండకం అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీని ఏదో మర్యాదకోసం... ప్రొటోకాల్ కోసం అభినందించడం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు పూర్వకంగా రెండు మాటలు మాట్లాడడం సహజమే.. కానీ శనివారం చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ ఒక్కొక్కరు ఒక్కో రేంజిలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ మోదీ భజన చేస్తుంటే... అసలు ఇది విమానాశ్రయ ప్రారంభమా ? మోదీ భజన కోసం ఇన్ని వేలమందిని తరలించారా అనే సందేహం అందరిలోనూ కలిగింది. లోకేశ్ చిడతల భజన చంద్రబాబు, పవన్ ఒక్కోరేంజిలో భజన చేయడంతో... ఇక లోకేశ్ కూడా తనవంతు పాత్ర గట్టిగానే పోషించేశారు. మోదీజీ విజన్.. చంద్రబాబు ఎగ్జిక్యూషన్ అంటూ పావుగంటసేపు చిడతలు వాయించేశారు. ఉన్న సమయమంతా మోదీని పొగడడానికి సరిపెట్టేశారు. రాష్ట్ర, దేశ ప్రగతికి మోదీ చేస్తున్న సేవలు.. ఆయన కృషి అంటూ మొదలెట్టి పలు పథకాలు.. రకరకాల ప్రాజెక్టుల పేర్లు చెబుతూ మోదీజీకి జై అనేలా ప్రజలను బతిమాలి మరీ జై కొట్టించారు. వచ్చీరాని మాటలు, అర్ధంలేని ప్రసంగాలతో తనదైన ‘ముద్ర’ను ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ముగ్గురూ ఒకరిని మించి ఒకరు ప్రధానమంత్రి మోదీని ఉబ్బించేసి తాము ఉబ్బిపోయి వేదిక దిగిపోయారు. పవన్కు కన్నీళ్లు వచ్చేశాయి సముద్రం ఒకరి కాళ్లదగ్గర మోకరిల్లదు .. పర్వతం ఎవరికీ సలాం చేయదు అంటూ విప్లవ డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ సైతం ఈ రోజు పదిపన్నెండు మెట్లు దిగి మోదీకి భజన కొట్టారు. ప్రభుత్వ వైఫల్యాల మీద యువత మోదీని తిడుతుంటే తనకు కన్నీళ్లొచ్చేశాయి అంటూ సెంటిమెంట్ పండించారు. మోదీని కొట్టేవాళ్లు దేశంలోనే లేరని, ఆయనకు నచ్చినన్నాళ్లు ప్రధాని పదవిలో ఉండచ్చని చెబుతూ ఆయనకు బోర్ కొడితే మాత్రమే పదవిని వదులుకోవాలన్నారు. అలాంటి ప్రధాని సారథ్యంలో పని చేయడం తనకు జన్మజన్మల పుణ్యఫలం అని చెబుతుంటే... గతంలో మనం ఢిల్లీ వాళ్ల ముందు తలవంచుతామా ? ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా అంటూ గొంతు చించుకుని అరచిన పవన్ కల్యాణ్ జనానికి గుర్తొచ్చారు. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.. పని చేస్తున్నందుకే మోదీజీకి ఈ నిందలు అంటూ పవన్ మ్రాన్పడిపోవడాన్ని చూసి సభికులు విస్తుపోయారు. నటనా చాతుర్యం బాగుందని కితాబిచ్చారు.యువత దుమ్మెత్తిపోస్తుంటే... దేశవ్యాప్తంగా జెన్జీ యువత అటు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తోంది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్ర«దాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో దేశంలో మోదీ ప్రభ కాస్త మసకబారుతోందన్న సూచనలు సైతం సమాజంలోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు తణమూల్ కాంగ్రెస్ నుంచి పలువురు ఎంపీలు బీజేపీలో కలుస్తుండడంతో ఈ అవకాశవాద చంద్రబాబును మోదీ పక్కనబెడతారు.. ఇక బాబుకు ప్రాధాన్యం తగ్గుతుందన్న వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు అత్యవసరంగా లోకేశ్ను సీఎంగా చేయాలన్న ఇంటిపోరు సైతం మొదలైంది. మోదీ అనుమతి లేకుండా లోకేశ్ను సీఎం చేయడంకుదరని పని. దీంతో అటు తృణమూల్ రూపంలో కేంద్రంతో తన ప్రాధాన్యాన్ని ముంచుకొచ్చిన ముప్పును తప్పించుకుంటూ ఇంకా మోదీకి విధేయత చూపడానికి బాబు ఎక్కడలేని తంటాలు పడ్డారు. మేకిన్ ఇండియా.. ఆత్మనిర్భర భారత్.. బులెట్ ట్రైన్, డిజిటల్ పేమెంట్స్.. రోడ్లు.. విమానాశ్రయాలు.. జాతీయ రహదారులు అంటూ పలు ప్రాజెక్టులు, పథకాల పేర్లు చెబుతూ వెనువెంటనే మోదీమోదీ అంటూ అరవాల్సిందిగా బాబు సభికులకు ప్రాథయపడ్డారు. ఒకానొకదశలో బాబు పూనకం వచ్చినట్లు గొంతు చించుకుని మోదీమోదీ అని అరవడాన్ని చూసి వీఐపీ గ్యాలరీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విస్తుపోయారు. ఉన్నఫళంగా ఈ స్థాయి పూనకానికి కారణం ఏమిటో అర్థంకాక ఒకరి మోకాలు ఒకరు చూసుకున్నారు. లోకేశ్ను సీఎంను చేసేందుకే ఇంత ప్రాపకమా అన్న విషయం తెలిసుకున్నాక ముక్కనవేలేసుకున్నారు.సీఎం పవన్ సారథ్యం అవసరం: శ్రీనివాస వర్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుల నాయకత్వం ఎంతో అవసరం అని కేంద్ర పరిశ్రమల శాఖ శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదిక మీద ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో దోహదపడుతోందన్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఘనత సాధించడానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్య మంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కాంబినేషన్ ఇలాగే ఉండాలని అభిలషించారు. పొరపాటున ఆయన ఇలా అన్నారేమో అనుకుని సభికులు కలవరపడ్డారు. ముఖ్యమంత్రి పవన్ అని కేంద్రమంత్రి అనగానే జనంలోంచి కాస్త గుసగుసలు.. కేకలు, అరుపులు వినిపించాయి... కానీ కేంద్ర మంత్రి ఏకంగా రెండుమూడు సార్లు పవన్ను ముఖ్యమంత్రి అని, చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి అని సంబోధించడం వెనుక బీజేపీ నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో మోదీ ఈయనతో ఇలా మాట్లాడించారా అనే గుసగుసలు వినిపించాయి.రాష్ట్రమంత్రులకు నో మైక్ విమానాశ్రయం ప్రారంభ వేదిక మీద కేవలం ప్రధాని మోదీ, లోకేశ్, పవన్ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, రామ్మోహన్ నాయుడు మాత్రమే ప్రసంగించారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ రాష్ట్ర మంత్రులు టీడీ జనార్దన్, జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్, హోం మంత్రి అనితకు మైక్ దక్కలేదు. ఆఖరుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కానీ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ప్రసంగించేందుకు అవకాశం దక్కలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ , గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సైతం వేదిక మీద ఆసీనులయ్యారే తప్ప మాట్లాడేందుకు మైక్ అందలేదు. -
‘ప్రభుత్వానికి-గాంధీ భవన్కు ఎలాంటి విభేదాలు లేవు’
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి- గాంధీ భవన్కు ఎలాంటి విభేదాలు లేవన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని, అందులో చిన్న చిన్న సమస్యలు సహజమన్నారు. పార్టీకి-ప్రభుత్వానికి మధ్య అన్నదమ్ముల పంచాయతీ మాత్రమే ఉందన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుందని, దాన్ని గ్యాప్ అనడం కరెక్ట్ కాదన్నారు. కోఆర్డినేషన్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఢిల్లీలో జరిగిందన్నారు. తమ అంతర్గత పంచాయతీలలో ఇతరులు దూరితే వాళ్లకే నష్టమన్నారు పొంగులేటి. ధరణి టెండర్ నుంచి భూ భారతి వరకూ SET(ప్రత్యేక విచారణ బృందం) విచారణ చేస్తుందన్నారు. ప్రోహిబిటెడ్ లిస్ట్లో బీఆర్ఎస్ ఎంత పెట్టింది - కాంగ్రెస్ ఎలా చేసింది లెక్కలు SET తీస్తుందన్నారు. రీ -సర్వే వల్ల 90శాతానికి పైగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. -
‘వెన్నుపోటు కూటమి అసత్య ప్రచారాలను భూస్థాపితం చేయాలి’
తాడేపల్లి: వెన్నుపోటు కూటమి అసత్య ప్రచారాలను భూస్థాపితం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 1వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాయీ బ్రాహ్మణులతో సమావేశం నిర్వహించారు సజ్జల. ఈ కార్యక్రమానికి నాయీ బ్రాహ్మణ విభాగం నేతలతో పాటు ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు హాజరయ్యారు.దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘నాయీ బ్రాహ్మణులను రాజకీయంగా ప్రోత్సహించింది జగనే. వెన్నుపోటు కూటమి అసత్య ప్రచారాలను భూస్థాపితం చేయాలి. వైఎస్సార్సీపీ కమిటీల్లో 10 వేల మంది నాయీ బ్రాహ్మణులకు స్థానం. పార్టీ నిర్మాణంలో బీసీలకు 60 శాతానికి పైగా ప్రాతినిధ్యం.జగన్ హయాంలో 15–20 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమం అందింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.3 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టింది.అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్నారు. డీఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూటమి అబద్ధాలను తిప్పికొట్టాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో మరిన్ని పదవులుంటాయి. 2029లో జగన్ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా పని చేయాలి. టీటీడీ బోర్డులో నాయీ బ్రాహ్మణులకు జగనే అవకాశం కల్పించారు. దేవాలయ పాలక మండళ్లలో నాయీ బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించిందీ జగనే. దేవాలయాల్లో ఉద్యోగులుగా గుర్తింపు, రూ.20 వేల జీతం ఖరారు చేశాం. ప్రతి షాపుకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. కరోనా సమయంలో ఒక్క బటన్తో రూ.50 కోట్ల సాయం చేశాం. నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్తో పాటు కీలక పదవులు ఇచ్చిన ఘనత జగన్దే. జగన్ చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని స్పష్టం చేశారు. -
‘పార్లమెంట్ సాక్షిగా కూటమి కుట్రలు బహిర్గతం’
సాక్షి, విజయవాడ: అమరావతి రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు నివసించే చోటే లేకుండా వెన్నుపోటు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు కనీసం ఒక్క ఇంటి స్థలం కూడా కేటాయించలేదని, కేంద్ర ప్రభుత్వానికి కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదని పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు వెల్లడయ్యాయని విమర్శించారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 51 వేల మంది పేద మహిళల పేరిట 1,400 ఎకరాల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు చేయిస్తే, వెన్నుపోటు కూటమి ప్రభుత్వం రాగానే ఆ ఇళ్లను, స్థలాలను రద్దు చేసి పేదల కళ్లలో నీళ్లు తెప్పించారని మండిపడ్డారు. అమరావతిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, స్వంత మనుషులకు, బినామీలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని దేవినేని అవినాశ్ ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..వైఎస్ జగన్ ఇచ్చిన 51 వేల ఇళ్ల పట్టాలు రద్దు చేశారుకేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ద్వారా ఈ కూటమి ప్రభుత్వ నైజం బయటపడింది. 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY - అర్బన్ 2.0)' కింద ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది ఇళ్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ, అమరావతి ప్రాంతంలో నివసించే పేదల కోసం ప్రభుత్వం ఒక్క ఇల్లు లేదా స్థలం ప్రతిపాదన కూడా పంపలేదు. జూన్ 2026 నాటికి 107 పట్టణాల్లో 12 వేల ఇళ్లకు ఆమోదం లభిస్తే, అమరావతిలో ఒక్క పేద కుటుంబానికి కూడా ఇల్లు కేటాయించకపోవడం దారుణం.అమరావతి అందరిదీ, ప్రపంచ రాజధాని అని గొప్పలు చెప్పే చంద్రబాబు.. అక్కడ పేదవాళ్లు నివసించడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? గతంలో వైఎస్ జగన్ హయాంలో సీఆర్డీఏ చట్టం సెక్షన్ 53(1)(డి) ప్రకారం 5 శాతం భూమిని పేదలకు కేటాయించి.. 51 వేల మంది మహిళల పేరిట 1,400 ఎకరాల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు చేయించాం. కానీ మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను, స్థలాలను రద్దు చేసి పేదల కళ్లలో నీళ్లు తెప్పించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బినామీల కోసమే తపన రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ చంద్రబాబు.. అమరావతిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, తన సొంత మనుషులకు, బినామీలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. 'మావిగన్' (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు-తెనాలి) అర్బన్ కారిడార్ అభివృద్ధిపై వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతిపాదనతో షాక్కు గురైన చంద్రబాబు, చివరకు అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే కాదని, విజయవాడ-గుంటూరు కూడా అమరావతిలో భాగమేనంటూ ఒప్పుకోక తప్పలేదు. అమరావతి కోసం తెచ్చిన రూ.47 వేల కోట్ల అప్పులకు, అసలు-వడ్డీలు కట్టడానికి ప్రజల ఖజానా సొమ్మునే వాడుతూ, సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని ప్రజలను మోసం చేస్తున్నారు.చంద్రబాబు, మీరందరూ వైఎస్ జగన్ పాలనా అనుభవాన్ని చూసి నేర్చుకోవాలి. ఆయన ప్రతిపాదించి శంకుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్పోర్టులో ప్రతి ఇటుకపైనా వైఎస్ జగన్ పేరే ఉంటుంది. అమరావతిలో ఇళ్లు రద్దు చేసిన ఆ 50 వేల మంది మహిళలకు, పేదలకు ఈ కూటమి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని దేవినేని అవినాశ్ హెచ్చరించారు. -
విద్యార్థులకు కావాల్సింది క్షమాభిక్ష కాదు మోదీజీ: రాహుల్
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష కాదు, క్షమాపణ చెప్పాలని అన్నారు."భారత్ విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష అవసరం లేదు. వారికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది" అని రాహుల్ చెప్పారు. విద్యార్థులు తనపై చేసిన వ్యాఖ్యలను "క్షమిస్తున్నాను" అన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాహుల్ ఇలా అన్నారు.నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను రాహుల్ కలుసుకుని ఓదార్చారు. ఈ భేటీ చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరిగింది. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు దుఃఖంలో ఉండటాన్ని చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదని రాహుల్ అన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి యువకుడు, యువతి వెనుక జీవితాంతం బాధ మోసే కుటుంబం ఉంటుందని చెప్పారు.పలుసార్లు ప్రశ్నపత్రాల లీకులు జరగడం, పరీక్షలు రద్దు కావడం, ఎన్నో సంవత్సరాల సన్నాహాలు ఒక్క రాత్రిలో వృథా కావడం విద్యా వ్యవస్థలోని వైఫల్యాన్ని బయటపెట్టాయని అన్నారు. నిజాయితీగా లేని వ్యవస్థలో విద్యార్థులు నిజాయితీగా శ్రమించాలని అడుగుతున్నారని చెప్పారు.ప్రశ్నపత్రం లీక్ కారణంగా భవిష్యత్తు కోల్పోయిన ఒక్క విద్యార్థినైనా, దుఃఖంలో ఉన్న ఒక్క తల్లిదండ్రినైనా ప్రధాన మంత్రి కలవలేదని ఆయన విమర్శించారు. విద్యార్థులు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న వేదనను కేంద్ర ప్రభుత్వం గుర్తించడంలో విఫలమైందని అన్నారు. -
‘భోగాపురం’ పూర్తి క్రెడిట్ వైఎస్ జగన్దే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్ట్పై చంద్రబాబువి అబద్ధపు ప్రచారాలని.. వైఎస్ జగన్ చేసిన మేలు అంతా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్, భోగాపురం వరకు అన్నీ క్రెడిట్ చోరీ. ఒక వైపు క్రెడిట్ చోరీ చేస్తూనే మరోవైపు మాపై విష ప్రచారం’’ అంటూ ఆయన మండిపడ్డారు.‘‘డమ్మీ సీఎం చంద్రబాబు, డిఫ్యాక్టో సీఎం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్తోపాటు ఇప్పుడు కొత్తగా ఇంకో సీఎం రామ్మోహన్ నాయుడు వచ్చారు. వేల ఎకరాలు ఎయిర్ పోర్టుకు ఎందుకని ఒక యువతి అడిగిందని జగన్ చెప్పారు. దానికి కూడా చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. కొబ్బరి కాయ కొట్టిందీ, గుమ్మడి కాయ కట్టిందీ నేనే అని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకున్నారు. భోగాపురం పేరుతో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం వైఎస్ జగన్ రూ.1200 కోట్లు ఖర్చు చేశారు...2026 జూన్ లో విమానాలు ఎగురుతాయని జగన్ ఆరోజే చెప్పారు. జగన్ హయాంలోనే 75-80 శాతం పూర్తయింది. కరోనా లేకపోతే మా హయాంలోనే పూర్తయ్యేది. ఎయిర్ పోర్టు కలను సాకారం చేసింది వైఎస్ జగన్. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసినా మాకు ఇబ్బంది లేదు. కానీ మాపై విష ప్రచారం చేయటం ఎందుకు?. రూ.6,300 కోట్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి గట్కారీ ప్రకటించారు. కానీ చంద్రబాబు వచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ ఆ రోడ్డు నిర్మాణానికి అతీగతీ లేదు. భోగాపురం నుండి విజయవాడకు విమానంలో వెళ్లటం కష్టంగా మారింది. దానికంటే రైలు మార్గంలో వెళ్లటం తేలిక అని కూటమి నాయకుడే చెప్పారు. అప్పటికీ చంద్రబాబుకు బల్బు వెలగలేదు..దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ కడపకు తెచ్చింది వైఎస్ జగన్. ఆయన స్వయంగా దాల్మియాతో మాట్లాడి ఫ్యాక్టరీ తెప్పించారు. స్టీల్ ప్లాంట్ కూడా వైఎస్ జగన్ తెప్పిస్తే పారిశ్రామిక వేత్తలను బెదిరించి తరిమేశారు. చంద్రబాబు రూ.30 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారు. తన బంధువు ఎంపీ భరత్ కు రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. వైఎస్ జగన్ రిషి కొండ మీద బిల్డింగులు కట్టిస్తే తన కోసమే అన్నట్టు ప్రచారం చేశారు. మరి నిజంగా ఆ బిల్డింగులు వైఎస్ జగన్వే అయితే ఇప్పుడు అందులో ఎందుకు నివాసం ఉండటం లేదు?. చంద్రబాబు విష ప్రచారాన్నే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు..మహిళా ఎస్ఐ మీద అసభ్యంగా ప్రవర్తించారంటూ మా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జై జగన్ నినాదాలతో ఎస్ఐ చెవులు మూసుకుంటే దాన్ని కూడా తప్పుదారి పట్టించారు. పైగా అన్ని రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్ఐను బెదిరించి మరీ బలవంతంగా కేసు పెట్టించారు. నిజానికి ఆ ఎస్ఐతో తప్పుగా ప్రవర్తించిందే పోలీసులు’’ అంటూ సజ్జల వివరించారు. -
ఈ20కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాల్సిందే: కేజ్రీవాల్
ఢిల్లీ: ఈ20 పెట్రోల్ కి వ్యతిరేకంగా ఢిల్లీలో శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ సదస్సు నిర్వహించింది. మాజీ సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆఫ్లైన్, ఆన్లైన్లో కలిసి మొత్తం 6 లక్షల మందికి పైగా హాజరయ్యారు. E20ని వ్యతిరేకిస్తూ ప్రధానికి రాసిన పిటిషన్ పై 2 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. ప్రధానికి మంగళవారం (ఆగస్టు 4) స్వయంగా పిటిషన్ అందజేస్తానని కేజ్రీవాల్ అన్నారు. లాఠీఛార్జీకి భయపడని 100 మందితో కలిసి వెళ్తానని తెలిపారు. ఈ20కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాల్సిందేనని తెలిపారు.‘‘ఎవరూ భయపడొద్దు.. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయాలి. ఇథనాల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతుంది, పాడవుతున్నాయి. ప్రభుత్వం స్టడీ చేసిన రిపోర్ట్ బయటపెట్టాలి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, ఆయన కొడుకులకు మేలు చేసేందుకే ఇథనాల్ తీసుకువచ్చారు.అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్లో భాగంగా దేశంపై ఇథనాల్ ను రుద్దుతున్నారు. మేం చదువుకున్నవాళ్లం.. మీ డిగ్రీ ఎలాగో నకిలీది.. మా డిగ్రీ అసలైంది. ఆర్టీఐ ద్వారా నా డిగ్రీ వివరాలు కూడా తీసుకున్నారు. ప్రశ్నిస్తే FIR లు నమోదు చేస్తున్నారు. E20లో ఏదో గందరగోళం ఉంది. లేదంటే ప్రశ్నిస్తే మాట్లాడాలి కానీ కేసులు పెట్టడం ఏంటి?పెట్రోల్, డీజిల్ వాహనాల కొనుగోలు ఆపేయండి. కొంటే ఎలక్ట్రిక్ వాహనాలను కొనండి. E20 విషయంలో ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు పెడుతున్నాం. 1.ప్రతి పెట్రోల్ బంక్ లో వినియోగదారుడికి ఆప్షన్ ఉండాలి. 2. ప్యూర్ పెట్రోల్ కంటే, E20 పెట్రోల్ ధర తక్కువగా ఉండాలి. 3.పెట్రోల్ ధరను 84 రూపాయలే ఉంచాలి’’ అని అన్నారు.పెట్రోల్ ధర రూ. 125 అయ్యేది!ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్కు 135 డాలర్లకు పెరిగినప్పుడు, ఇంధనంలో ఇథనాల్ కలపకపోతే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.125 అయ్యేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇథనాల్ వల్ల, వినియోగదారులు లీటరుకు రూ. 94.77 మాత్రమే చెల్లించారని తెలిపింది. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజీ, ఇంజిన్ పై ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. చమురు సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ఇథనాల్ వినియోగం ఒక మార్గమని తెలిపింది. -
పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు: పెద్దారెడ్డి
సాక్షి, అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డైరక్షన్ లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడి.. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నేత హనుమంతరెడ్డిని కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి.. 24 మంది వైఎస్సార్సీపీ నేతలను అంతం చేస్తామని హిట్ లిస్ట్ ప్రకటించి.. దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దురదృష్టకరమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత పోలీసులకు లేదా? అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. జేసీ అస్మిత్రెడ్డి, ప్రభాకర్రెడ్డి ఆగడాలు శృతిమించాయని.. పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీజేపీకి గుడ్బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
షెహజాద్ పూనావాలా.. బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.షెహజాద్ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్ బయోలో మోదీకి తాను “లైఫ్ లాంగ్ ఫాలోవర్” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.జెన్జీ నిరసనల ఎఫెక్ట్తోనేనా?షెహజాద్ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఎవరీ షెహజాద్ పూనావాలా?1987 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్ పూనావాలా, తల్లి యాస్మిన్ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరున్న తహసీన్ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్లో పంచాయితీతో.. షెహజాద్ పూనావాలా తొలుత కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.బీజేపీకి బలమైన వాయిస్.. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. -
‘ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టండి’
తాడేపల్లి :ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియాను గ్రామస్థాయి నుంచి విస్తృతంగా వాడుకోవాలన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం సమావేశం నిర్వహించారు సజ్జల. దీనికి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ, నగర అధ్యక్షులు హాజరయ్యారు.దీనిలోభాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్కు తావివ్వకూడదు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టండి. గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి. అక్రమ కేసులు, వేధింపులన్నీ ‘డిజిటల్ డైరీ’ లో నమోదు చేయాలి. ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వివరణలు ఇచ్చే పరిస్థితి నుంచి అటాకింగ్ మోడ్లోకి రావాలి. సోషల్ మీడియా కార్యకర్తలు ఒక వన్ మ్యాన్ ఆర్మీలా పని చేయాలి. పదునైన కంటెంట్తో నిజాన్ని పదిమందికి చేరవేయాలి. ప్రజల గొంతుకగా, క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రతినిధులుగా పని చేయాలి. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, సిద్ధాంతాలను, లైన్ ఆఫ్ థింకింగ్ను వదులుకోకుండా నిలబడాలి. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగాన్ని తొలిసారిగా ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థగా గ్రామ స్థాయి వరకు బలోపేతం చేశాం. చంద్రబాబుకు ప్రజాబలం లేదు.. కేవలం భ్రమలు కల్పించే మీడియా వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, కుట్రలతో అధికారం చలాయిస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న మనపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను తీవ్ర అప్పుల ఊబిలోకి నెట్టి, అబద్ధాలతో స్వర్గం చూపిస్తున్నది. పాలనలో విఫలమై, ప్రశ్నించే వారిపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల ఆకాంక్షలే శ్రీరామరక్షగా మన పార్టీ ధృఢంగా నిలబడింది.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. నాయకత్వ నిబద్ధత, కార్యకర్తల కృషితో 2029లోభారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం’ అని స్పష్టం చేశారు. -
‘భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ఎవరు చేశారు?’
విశాఖ: భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్తో పాటు, ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డే కారణమని, వారు చేసిన కృషి వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ తుదిరూపు దిద్దుకుందని పార్టీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నానని, విశాఖ ఎయిర్ పోర్ట్ విస్తరణ ప్రత్తిపాధన వచ్చినప్పుడు భోగాపురం, యలమంచిలి వద్ద స్థలాలు చూసామన్నారు. ఈ విషయాలు చంద్రబాబుకి, అశోక్ గజపతిరాజుకి సైతం తెలుసని బొత్స తేల్చిచెప్పారు. ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) విశాఖపట్నం నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన బొత్స.. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ఎవరు చేశారు? ఎవరు పరిహారం ఇచ్చారో లెక్కలు తీయమని సవాల్ విసిరారు. కొత్త ఎయిర్ పోర్ట్ ఆలోచన చంద్రబాబుది అని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు బొత్స. ఆయన హయాంలో ఒక్క ఎకరా భూమిని కూడా సేకరించలేదని, అటువంటప్పుడు ఆలోచన ఆయనది ఎలా అవుతుందన్నారు. ‘2019 వరకు భూ సేకరణ ఎక్కడ జరిగింది..?, 15 వేల ఎకరాలు కావాలని చెప్పిన చంద్రబాబు.. ఒక్క ఎకరమైనా సేకరించారా..?, భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భూ సేకరణ ఎవరు చేశారు..?, పరిహారం ఎవరు ఇచ్చారు..? , లెక్కలు తియ్యండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ నుంచి నిర్మాణం వరకూ మా నాయకుడు వైఎస్ జగనే చేశారు’ అని స్పష్టం చేశారు. -
‘సీఎం విజయ్.. మీరు మా రాష్ట్రానికి రావొద్దు’
సాక్షి, బెంగళూరు: కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో జరగాల్సిన చర్చలను కర్ణాటక రద్దు చేసుకుంది. ఈ క్రమంలో తమిళనాడు సీఎం విజయ్, ఆయన బృందం ఇప్పుడు కర్ణాటకకు రావడం అంత మంచిది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ కర్ణాటక పర్యటనను వాయిదా వేసుకోవాల్సిందిగా తాము తమిళనాడు ప్రభుత్వానికి సలహా ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు సీఎం విజయ్ ఇక్కడికి వస్తే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 12న కర్ణాటక వ్యాప్తంగా బంద్కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి.ఈ వివాదం ప్రభావం సినిమాలపైనా పడింది. కర్ణాటకలో తమిళనాడు సీఎం విజయ్ నటించిన తాజా చిత్రం ‘జనగాయన్’ ప్రదర్శనను థియేటర్లలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లపై కన్నడ సంఘాలు దాడులు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఔను.. ‘భోగాపురం’ ఘనత వైఎస్ జగన్దే
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్పోర్ట్ను తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ కొట్టేయాలన్న చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఎయిర్పోర్టుకు భూసేకరణ పూర్తి చేసి.. అనుమతులు తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అయితే, చంద్రబాబుదే క్రెడిట్ అంటూ ఆంధ్రజ్యోతి రాతలపై కారుమూరి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ తప్పుడు రాతలను దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ ‘భోగాపురం’ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందంటూ ఎల్లో మీడియా రాతలపై కారుమూరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తే 2019 కంటే ముందే మీరు కట్టేయొచ్చుగా.. విమానాశ్రయానికి సంబంధించి ఎన్నికలకు రెండు నెలలు ముందు చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేయటమే తప్ప ఏ ప్రాజెక్టుని పూర్తి చేసిన దాఖలాలు ఉండవు.. ఆ ప్రాజెక్టులను వదిలేస్తాడు. ఎవరైనా అన్ని అనుమతులు తీసుకొని వచ్చి శంకుస్థాపన చేస్తారా? ఏం అనుమతులు తీసుకురాకుండా కోర్టు కేసులు పెండింగ్ ఉండగా శంకుస్థాపన చేస్తారా? రాధాకృష్ణ సమాధానం చెప్పాలి కదా?..2200 ఎకరాలలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను భోగాపురంలో కట్టాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టులో పెండింగ్ కేసులను పరిష్కరించి.. అక్కడ నాలుగు గ్రామాల్లో 404 కుటుంబాలు నిర్వాసితులను వేరే ప్రాంతాలకు తరలించి కాలనీలు నిర్మించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం భూసేకరణ చేసి.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్వోసీ తీసుకొచ్చింది. 2023 మే 3న వైఎస్ జగన్ భూమి పూజ చేశారు...విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించారు. నేడు భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయిందంటే అది వైఎస్ జగన్ ముందు చూపు వల్లే.. ఆ విషయం గుర్తుపెట్టుకో రాధాకృష్ణ. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసిన ప్రజలకు వాస్తవాలు తెలుసు’’ అని కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
‘డీఎస్సీ నియామకాల్లో క్రీడా కోటా పేరిట భారీ అక్రమాలు’
మచిలీపట్నం: కూటమి ప్రభుత్వంలో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో స్పోర్ట్స్ కోటా పేరిట అనర్హులకు, పచ్చ చొక్కాల అనుచరులకు అడ్డదారిలో ఉద్యోగాలు కట్టబెడుతూ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు నియామాకల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం తక్షణమే సీబీఐ తో విచారణ జరిపించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...జీవోల రద్దు – అడ్డదారిలో సరికొత్త 'పచ్చ' క్రీడలు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనాదిగా అమలవుతున్న జీవో నెంబర్ 74, 75 ల ప్రకారం ఉద్యోగ నియామకాలలో 2% స్పోర్ట్స్ కోటా అమలు జరిగేది. కానీ, సరిగ్గా డిఎస్సీ ప్రకటన వెలువడే ఏప్రిల్ 19వ తేదీన ఆ పాత జీవోలను రద్దు చేసి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా జీవో నెంబర్ 4, జఏడీ ద్వారా జీవో నెంబర్ 47 తీసుకొచ్చారు. ఈ రెండు జీవోల ముఖ్య సారాంశం ఏంటంటే... స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం రావడానికి ఎలాంటి డిగ్రీ చదవక్కర్లేదు, టెట్ (TET) రాయక్కర్లేదు, ఆఖరికిడీఎస్సీ పరీక్ష కూడా రాయాల్సిన అవసరం లేదు.టీడీపీ నాయకుల చేతుల్లో క్రీడా సంఘాలు – సర్టిఫికెట్ల విక్రయంఈ జీవోల ప్రకారం క్రీడల్లో పాల్గొన్నట్లు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టేస్తున్నారు. ఇలా మొత్తం 400 చిల్లర పోస్టుల్లో ఇప్పటికే 380 కి పైగా ఉద్యోగాలను నియామకం చేశారు. ఈ సర్టిఫికెట్లు ఇచ్చే క్రీడా సంఘాలు, అసోసియేషన్ల అధ్యక్షులుగా ఉన్నది ఎవరయ్యా అంటే... కూటమి ప్రభుత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, లోకేష్ గారి అనుచరులు, టీడీపీ జెండాలు మోసిన నాయకులే! జూడో, సాఫ్ట్ బాల్ వంటి క్రీడా సంఘాల నుంచి ఒక్కో దానికి 38, 39 చొప్పున సర్టిఫికెట్లు ఇప్పించుకుని తమ సొంత మనుషులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు.అంతర్జాతీయ మెడలిస్టులకు సున్నామన దేశం, రాష్ట్రం గర్వపడేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తే ఏమాత్రం తప్పులేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? అసలు గ్రౌండ్లో అడుగుపెట్టకుండా, కేవలం నాలుగు కాలేజీలు కలిసి ఆడుకున్న ఆటల్లో బయట కూర్చుని నీళ్ల సీసాలు, బాల్స్ అందించిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఉద్యోగం రాక కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అడ్డదారిలో వచ్చిన కూటమి కార్యకర్తలకు మాత్రం ఉద్యోగాలు పంచిపెట్టడం అత్యంత దారుణం.ద్వంద్వ నీతి..30-35 ఏళ్లుగా విద్యార్థులకు పాఠాలు చెప్పి, మరో రెండేళ్లలో రిటైర్ అయ్యే 60 ఏళ్ల వయసున్న ఉపాధ్యాయులను మాత్రం నైపుణ్య పరీక్షల పేరిట 'టెట్ రాయండి' అని వేధిస్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారు మాత్రం తన కంటి సైగలతో డిఎస్సీలో 400 చిల్లర మందికి టెట్ లేదు, డిఎస్సీ పరీక్షా లేదు అని అడ్డదారి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఇది నిరుద్యోగ యువతను, కష్టపడి చదివిన అభ్యర్థులను తీవ్రంగా మోసం చేయడమే. దొడ్డిదోవన పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో పొందిన 380కి పైగా నియామకాలను వెంటనే రద్దు చేసి, అర్హులైన ప్రతిభావంతులకు, నిజమైన క్రీడాకారులకు న్యాయం చేయాలి.వైఎస్సార్సీపీ డిమాండ్లివే... ఈ నేపధ్యంలో జీవో నెంబర్ 4, 47 ల మరుగున జరిగిన ఉపాధ్యాయ నియామకాల అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు.. విద్యావ్యవస్థను, నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
ఆనాడు అసలు వైఎస్ జగన్ ఏమన్నారంటే..
భోగాపురం ఎయిర్ పోర్టును వైఎస్ జగన్ వ్యతిరేకించినట్లు పచ్చగుంపు అబద్దపు ప్రచారం చేస్తోంది. ఆయన ఏనాడూ ఎయిర్ పోర్ట్ను వ్యతిరేకించలేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు సొంత భాష్యాలు చెబుతూ.. ఎల్లో మీడియా చెలరేగిపోతోంది. అయితే, విమానాశ్రయానికి సీఎం హోదాలో వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారనే అసలు వాస్తవానికి మాత్రం ముసుగేసింది.ఆనాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ కేవలం శంకుస్థాపనకే పరిమితం కాలేదు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న న్యాయపరమైన వివాదాలన్నిటినీ పరిష్కరించారు. కావాల్సిన అనుమతులన్నీ తెప్పించారు. అన్నీ చేసిన తరవాత... 30 నెలల్లో పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థకు లక్ష్యం విధించి మరీ కొబ్బరికాయ కొట్టారు. కానీ ఎల్లో మీడియా మాత్రం ఎయిర్ పోర్ట్ను వ్యతిరేకించారంటూ దుష్ప్రచారం చేస్తోంది.ఆనాడు అసలేం జరిగిందంటే..భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం చంద్రబాబు 2015లో రైతుల నుంచి 15,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఈ ఆందోళనతో వైఎస్ జగన్ కూడా ఏకీభవించారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అన్ని ఎకరాల భూమి దేనికంటూ నిలదీశారు. 2,300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ‘‘చెన్నై ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? ఢిల్లీ ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? అని ప్రశ్నిస్తూ వైఎస్ రైతులకు మద్దతుగా నిలిచారు.చివరకు చంద్రబాబు ప్రభుత్వం సేకరించాల్సిన భూమిని తొలుత 6,000 ఎకరాలకు.. ఆ తర్వాత 2,700 ఎకరాలకు కుదించుకుంటూ వచ్చింది. చివరకు 2017లో 2,700 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో పాటు.. ఇందుకోసం ఏర్పాటు చేసిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ కంపెనీ పేరుమీద రూ.1,500 కోట్ల అప్పును హడ్కో నుంచి తీసుకోవడానికి అనుమతిస్తూ జీవో ఇచ్చారు. అయితే బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇవేమీ పట్టని ఎల్లో గ్యాంగ్.. నాడు భూసేకరణను వ్యతిరేకించి.. ఎయిర్పోర్ట్ను అడ్డుకున్నారంటూ అసత్యాలు ప్రచారాలు చేస్తోంది. -
సంతాప సభలకూ రాజకీయ రంగు.. చంద్రబాబు వైఖరిపై ప్రశ్నలు!
రాష్ట్ర రాజకీయాలలోనే కాదు.. దేశ రాజకీయాలలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్గా ఉన్నారు. ఆ విషయం ఆయన కూడా పలుమార్లు చెప్పుకుంటారు. ఆ సీనియారిటీని ఆయన సమాజ హితవు కోసం, వివిధ వర్గాల ఐక్యత కోసం ఉపయోగించాలని ఎవరైనా కోరుకుంటారు. దురదృష్టవశాత్తు ఈ వయసులో కూడా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే, కాపు వర్గ నేత బోండా ఉమామహేశ్వరరావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాని, వైఎస్సార్సీపీని పదేపదే అనుచిత భాషతో ప్రస్తావించడం కాని, సామాజిక కార్యక్రమాలలో సైతం ఆయా పార్టీలవారు శత్రువుల మాదిరిగా చూసుకోవాలన్నట్లుగా చేస్తున్న సూచనలు కాని ఏ మాత్రం సమంజసమైనవని అనిపించవు. బోండా ఉమా పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తుంటే పిలిచి మాట్లాడవచ్చు. అలాకాకుండా పార్టీలోని ఇతర నేతలకు కూడా ఒక సంకేతం వెళ్లేలా చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్ టీడీపీలోనే చర్చనీయాంశం అయింది.మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణించిన తర్వాత వివిధ పార్టీలకు చెందినవారు ఆయన స్వస్థలం కిర్లంపూడి వెళ్లి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముద్రగడకు కాపు సామాజికవర్గంలో ఉన్న గుర్తింపు రీత్యా వివిధ ప్రాంతాలలో సంతాప సభలు జరిగాయి. ఇవి పార్టీలకు అతీతంగా జరగడం గమనించదగ్గ అంశం. ఆ సభలు పెద్దగా రాజకీయ ప్రస్తావన లేకుండానే సాగాయి. ఒక సంతాప సభలో బోండా ఉమా, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఈ ఘట్టాన్ని వైఎస్సార్సీపీ నాయకత్వం సీరియస్గా తీసుకోలేదు. అంబటిని కాని మరెవ్వరిని కాని తప్పు పట్టలేదు. కాని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం బోండా ఉమాపై సీరియస్ అయినట్లు తెలుగుదేశం పత్రికలలో ప్రముఖంగా వార్తా కథనాలు వచ్చాయి.ఈ సందర్భంగా గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు చెప్పారని ఎల్లో మీడియాలో ఒకటైన ఈనాడు పత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. చంద్రబాబు ఎప్పుడైనా విమర్శల కోసం ఒకసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే అదో తరహా. కాని నిత్యం గొడ్డలి అని అభ్యంతరకర పదం వాడుతున్నారంటే ఏమని అనుకోవాలి? గొడ్డలితో హత్య చేసింది ఎవరు? అతను ఎల్లో మీడియాలో కూర్చుని డిబేట్లలో ఎలా పాల్గొన్నారు. ఆయనకు లాయర్ను పెట్టిందెవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ, చంద్రబాబు మాత్రం గొడ్డలి పదాన్ని వాడడం మానడం లేదు. ఆ కేసులో జగన్కు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ చెప్పినా అదే దుష్ప్రచారం చేయడం కూడా సీనియర్ రాజకీయ నేతకు తగిన విషయమేనా? ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా వైఎస్సార్సీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చెప్పడం అంటే మరీ అతిగా లేదా?పెళ్ళిళ్లు, పబ్బాలు, చావులు, సంతాప సభలలో వివిధ రాజకీయ పక్షాలవారు కలవకుండా ఉంటారా? వారు మాట్లాడుకోకుండా ఉంటారా? అది కూడా తప్పే అవుతుందా? ముద్రగడ చనిపోయే సమయానికి వైఎస్సార్సీపీలో ఉన్నా, ఆయన కాపు ఉద్యమ నేతగానే జనంలో నిలిచారు. ఆయన ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు వద్దని అంతిమ లేఖలో చెప్పి ఉండవచ్చు. అందువల్లే ఆయన సంతాప సభలలో పాల్గొన్న టీడీపీ నేతలను తప్పుపట్టవచ్చా? కాపులంతా ఒక చోట సమావేశం అవుతుంటే, అలాంటి వేదికలను ఆ వర్గానికి చెందిన ఆయా పార్టీ నేతలు ఎలా పంచుకోకుండా ఉంటారు. అలా చేస్తే కులానికి దూరం అవుతామోమో అన్న భయం వారిలో ఉండవచ్చు.ఇంకో విషయం చెపాలి. ఈ మధ్య ఒక సదస్సులో అంబటి రాంబాబు, టీడీపీకి గతంలో పెద్ద మద్దతుదారు అన్న పేరున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అంత మాత్రాన వారిద్దరూ ఒకటైపోయినట్లవుతుందా? కొద్ది సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో అప్పటి వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి, చంద్రబాబు పక్కపక్కన కూర్చుని మాట్లాడుకున్నారే! ఒకప్పుడు చంద్రబాబు ఏమని ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. మిగిలిన సమయం అంతా అభివృద్ది, పాలనపైనే దృష్టి పెట్టాలని అనేవారు. అలా చేసినా, చేయకపోయినా కనీసం మాటవరసకైనా ప్రసంగించేవారు. కాని ఇప్పుడేమో వైఎస్సార్సీపీవారికి ఏమి చేయవద్దు.. వైఎస్సార్సీపీవారితో కలవవద్దు, వేదికలు పంచుకోవద్దని అంటున్నారు. తద్వారా చంద్రబాబు సీనియారిటీకే అప్రతిష్ట అవుతుంది తప్ప మరొకటి కాదు.రాజకీయాల కోసం బంధుత్వాలు, స్పేహాలు కూడా వదలుకోవాలా! అన్నప్రశ్న రాదా? సంతాప సభలో ఉమా ప్రసంగిస్తూ కాపులలో అలజడి ఆరంభమైందని వ్యాఖ్యానించారు. కాపులను పట్టించుకోవాలని, వారి డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని ఆయన పేర్కొన్నారు. కాపు ఉద్యమం చేస్తున్న తరుణంలో ముద్రగడను నిర్లక్ష్యం చేయడం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. బహుశా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న సందేహం చంద్రబాబుకు కలిగి ఉండవచ్చు. అయినా ఇంత ఓపెన్గా టెలికాన్ఫరెన్స్లో వైఎస్సార్సీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని అనడం ద్వారా చంద్రబాబు వ్యక్తిత్వానికే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఏర్పడింది. దీనికి ప్రతిగా బోండా ఉమా మరో వాదన తెరపైకి తీసుకువచ్చారు.వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏర్పాటు చేసిన సంతాప సభకు టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వంటివారు వెళ్లినప్పుడు లేని అభ్యంతరం తను వెళితేనే వచ్చిందా అన్నది ఆయన ప్రశ్నగా ఉంది. బొత్స, తోట త్రిమూర్తులు వంటి వైఎస్సార్సీపీ నేతలతో కూడా టీడీపీ నేతలు ఆ కార్యక్రమాలలో సన్నిహితంగా మెలిగారు కదా అని ఉమా ఎత్తిచూపారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, బీజేపీ నేత సోము వీర్రాజు వంటివారు కూడా ఆ సభలో పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారట. తాను వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లలేదని, కాపు నేత దాసరి రాము నిర్వహించిన సభకు వెళ్లానని, అక్కడ అంబటి రాంబాబు కలిసి పలకరిస్తే, సంస్కారంగా తాను కూడా మాట్లాడానని, తానేమీ పార్టీని ఇబ్బంది పెట్టలేదన్నది ఆయన అభిప్రాయంగా ఉంది.ఈ నేపథ్యంలో బోండా ఉమాను పిలవడానికి ఒక కమిటీనే చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వద్దకు వెళ్లిన బోండా ఆ తర్వాత కాస్త తగ్గి మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇకపై వైఎస్సార్సీపీవారితో వేదిక పంచుకోనని ఆయన అన్నారని వార్తలు వచ్చాయి. అంటే ఇది ఉమా తన వ్యక్తిత్వాన్ని తానే కించపరచుకోవడమే అవ్వదా! మొత్తం మీద ఏదో రకంగా ఉమాను భయపెట్టి ఉండాలి. జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాల జోలికి పార్టీ అధిష్టానం ఎందుకు వెళ్లలేదో తెలియదు.ఈ మధ్యకాలంలో కాపులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విశ్వాసం సడలుతోంది. ఆ వర్గంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడుతోందన్న ప్రచారం జరుగుతుండడానికి తోడు ఇలాంటి వివాదాల వల్ల తెలుగుదేశం పార్టీ మరింత ఇరుకున పడే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉన్నా సామాజిక కార్యక్రమాలలో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కలిసినంతమాత్రాన ఏదో జరిగిపోతుందని భయపడి వాటిపై ఆంక్షలు పెట్టడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరీ సంకుచిత స్థాయికి చంద్రబాబు తీసుకువెళ్లినట్లు అవుతుందని చెప్పాలి. గతంలో ఇలాంటి వాతావరణం ఎన్నడూ లేదు. ఇది అత్యంత దురదృష్టకరం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నరసాయమ్మ.. మరో గీతాంజలి కాకూడదు!
రాజకీయాల్లో మాటలు ఒక్కోసారి ఆయుధాలుగా మారుతాయి. ఒకరి వ్యాఖ్యలు మరొకరి ప్రచారానికి అస్త్రాలవుతాయి. కానీ ఆ మాటల వెనుక ఉన్న మనిషి జీవితం, ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రం చాలాసార్లు కనిపించవు. భోగాపురం ఎయిర్పోర్టు వ్యవహారంలో ఇప్పుడు చర్చకు వచ్చిన నరసాయమ్మ విషయంలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.దాదాపు పదేళ్ల క్రితం భోగాపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు సర్కార్ చేపట్టిన భూసేకరణ, రైతులకు పరిహారం అంశాలను ప్రస్తావిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే..నరసాయమ్మ తన భూమి కోల్పోతున్న ఆవేదనను వేదికపై వ్యక్తం చేసింది. ఎర్రబస్సు రాని చోటుకి ఎయిర్బస్ ఎందుకు? సర్.. అంటూ మాట్లాడింది( ఈ వ్యాఖ్యలనే జగన్ ప్రస్తావిస్తే.. జగనే ఆ మాట అన్నారని టీడీపీ మీడియా, సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది). ఆనాడు అయ్యన్నపాత్రుడి భూముల జోలికి పోకుండా.. ప్రభుత్వం తన కుటుంబానికి ఉన్న రెండెకరాల భూమి బాబు సర్కార్ లాక్కుంటుందనే విషయం ప్రస్తావించి.. న్యాయం కావాలని జగన్ సమక్షంలో వేడుకుంది.అయితే భోగాపురం ఘనత ఎవరిది? అనే ప్రస్తుత చర్చ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు, ప్రచారాలకు వేదికగా మారాయి. ఎయిర్పోర్టు విషయంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరి నిర్ణయాల వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లింది? ఎలా పూర్తైంది? అనే క్రెడిట్ వార్లో నరసాయమ్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. నరసాయమ్మ ఎక్కడ?.. ఎయిర్బస్సు వచ్చింది చూడమ్మా?.. జగన్ నీ నెత్తిన చెయ్యి పెట్టాడు.. అంటూ ఇలా ఆమెపై అభ్యంతకర సందేశాలు కనిపిస్తున్నాయి పలు పేజీల్లో.భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో వైస్సార్సీపీ, కూటమి నేతలు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు భూసేకరణలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేశామని, పరిహారం సైతం ఇప్పించామని, శంకుస్థాపనతో పనులు ప్రారంభించిందే తమ ప్రభుత్వమని వైఎస్సార్సీపీ లెక్కలతో చెబుతుంటే.. మరోవైపు ప్రాజెక్టు ప్రతిపాదన చేసింది తమదే కాబట్టి ఎంటైర్ క్రెడిట్ తమదేనని చంద్రబాబు పార్టీ చెబుతోంది. వాస్తవానికి విశాఖ ఎయిర్పోర్ట్ ఉండగా.. బలవంతపు భూసేకరణతో రైతులకు అన్యాయం చేయడం ఎందుకని? మాత్రమే జగన్ అన్నారు. అంతేగానీ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో ఏమాత్రం కాదు. ఆ ఉద్దేశమే ఉంటే.. ఉత్తరాంధ్రను అసలు పట్టించుకునేవారే కాదు కదా!. అధికారంలోకి రాగానే భోగారం ఎయిర్పోర్ట్ భూసేకరణను తగ్గించి.. నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇప్పించి.. అన్ని అనుమతులతో శంకుస్థాపన చేసే వారా?.. అయితే ఈ రాజకీయ వాదోపవాదాల మధ్య పాపం నరసాయమ్మ సోషల్ మీడియాకు ఎక్కింది.గతంలో తెనాలికి చెందిన గీతాంజలి ఘటనను గుర్తు చేసుకుంటే.. సోషల్ మీడియా చర్చలు, ట్రోలింగ్లు ఒక వ్యక్తి జీవితంపై ఎంతటి ప్రభావం చూపగలవో అర్థమవుతుంది. వైఎస్ జగన్ వల్లే తన కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పినందుకు.. ఆమెను నెట్టింట తెగ ట్రోల్ చేశారు. అది చేసింది ఎవరో అందరికీ తెలుసు. అది తట్టుకోలేక మనస్థాపంతో బలన్మరణానికి పాల్పడిందామె. అంతకు ముందు బెండపూడి విద్యార్థిని విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు.. నరసాయమ్మను ఆ స్థాయిలోనే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సాధారణ మహిళ మాట్లాడిన మాటలను రాజకీయ కోణంలో చూసి వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రమాదకర ధోరణి. భోగాపురం విషయంలోనూ నరసాయమ్మను ఒక రాజకీయ ప్రతీకగా మార్చకుండా.. ఆమె ఒక సాధారణ మహిళ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. రాజకీయ విమర్శలు ఉండొచ్చు.. కానీ ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం సాగకూడదు.క్రెడిట్ కోసం ఒక మహిళను పావుగా మార్చే రాజకీయ ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, నరసాయమ్మ విషయంలోనైనా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త అవసరం. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకునే సంస్కృతి ఎంతటి పార్టీకైనా, ఏ వర్గానికైనా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తుల జీవితాలపై కాదు. రాజకీయ లాభాల కోసం ఆమెను తెరపైకి తీసుకొచ్చి, తమకు అనుకూలమైన కథనాన్ని నిర్మించే ప్రయత్నాలు జరిగితే అది మరో అన్యాయమే అవుతుంది. -
వైఎస్ జగన్ పట్టుదలకు సాక్ష్యం ఇదిగో..
చంద్రబాబే మొత్తం భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు ఎల్లో గ్యాంగ్ తెగ బిల్డప్ ఇస్తోంది. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డుపరంగా ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు కూటమి నేతలు నానా పాట్లు పడుతున్నారు. వైఎస్ జగన్ పడిన కష్టమేంటి?. ఆయన శ్రమ ఎలా ఫలించింది? అసలు వాస్తవం ఏంటో? పరిశీలిస్తే..వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుంబిగించారు. 2023 మే 3న భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. దాని వెనుక వైఎస్ జగన్ పడిన శ్రమను గుర్తుచేసుకుంటే.. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరో వైపు, రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు.హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు. విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం వైఎస్ జగన్.. ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరో వైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు.ఇదే క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాసప్యాకేజీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్షిప్లను తలదన్నేలా రెండు కాలనీలను వారి కోసం నిర్మించింది. -
జెన్జీ నిరసనలపై మౌనం వీడిన రాఘవ్ చద్దా
రాఘవ్ చద్దా.. గతంలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రతీ అంశంపైనా ప్రశ్నించారనే పేరుంది. ప్రత్యేకించి జెన్జీకి కనెక్ట్ అయ్యే ప్రతీ అంశంపైనా ఆయన నిలదీశారు. ఈ క్రమంలో ఆయన గురించి నెట్టింట కూడా పెద్ద చర్చ జరిగింది. ఆ క్రేజ్తో ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగింది. అయితే ఆ మధ్య ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఎందుకనో సైలెంట్ అయిపోయారు..న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలు.. జెన్జీ పోరాటంపై ఆయన ఎక్కడా స్పందించింది లేదు. ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తొలిసారి స్పందించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన.. ఇప్పుడు తన పాత్ర మారిందని, అందుకే కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా పరిష్కారాల కోసం పనిచేస్తున్నానని తెలిపారు.పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో రాఘవ్ చద్దా కాస్త ఘాటుగా ప్రసంగించారు. పేపర్ లీక్ల వంటి సమస్యలను మీడియా ముందు చేసే ప్రకటనలతో పరిష్కరించలేమని.. బలమైన వ్యవస్థాగత మార్పులు అవసరమని అన్నారు.‘అందుకే ఇన్నాళ్లు మాట్లాడలేదు’నీట్ పేపర్ లీక్ అంశంపై తాను ఎందుకు స్పందించలేదని చాలామంది ప్రశ్నించారని చద్దా చెప్పారు. “నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై ప్రశ్నలు అడగడం నా బాధ్యత. ఆ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాను. ఇప్పుడు నా పాత్ర మారింది. అధికార పక్షంలో ఉన్నందున ప్రశ్నలు వేయడం కంటే పరిష్కారాలు చూపించడం నా బాధ్యత” అని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా హెడ్లైన్ల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదని.. సమస్యకు పరిష్కారం దొరికే సమయంలోనే స్పందించాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు.జెన్జీ బాధ న్యాయమే.. నీట్ అభ్యర్థులు, ఆందోళన చేస్తున్న విద్యార్థుల ఆవేదనను చద్దా సమర్థించారు. “మీ కోపం న్యాయమే.. మీ భావోద్వేగాలు న్యాయమే.. మీ బాధ కూడా న్యాయమే” అని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. నీట్ పరీక్ష అనేది కేవలం ఒక పరీక్ష కాదని.. లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు అది ఒక మార్గమని అన్నారు. కోటా, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు కుటుంబాలకు దూరంగా ఉంటారని, తల్లిదండ్రులు కోచింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తారని గుర్తుచేశారు.గతంలో యువత గొంతుకగా గుర్తింపురాఘవ్ చద్దా గతంలో ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో పలు అంశాలపై దూకుడుగా మాట్లాడిన నేతగా గుర్తింపు పొందారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం, యువతకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడం ద్వారా సోషల్ మీడియాలోనూ ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే రాజకీయ పరిణామాలు మారడంతో ఆయన వైఖరిలోనూ మార్పు కనిపిస్తోందనే చర్చ మొదలైంది. గతంలో ప్రశ్నించే గొంతుకగా ఉన్న ఆయన.. ప్రస్తుతం వ్యవస్థలో భాగంగా పరిష్కారాలపై దృష్టి పెడుతున్నానని చెబుతున్నారు.‘పేపర్ లీక్ ఒక దీర్ఘకాలిక వ్యాధి’పేపర్ లీక్లను రాజకీయ కోణంలో చూడకూడదని చద్దా అన్నారు. ఇది దేశాన్ని వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్య అని, ఏ రాష్ట్రంలో జరిగినా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. “జవాబుదారీతనం, నైతికత రాజకీయాలకు మించి ఉండాలి” అని అన్నారు.కేంద్ర చర్యలకు మద్దతునీట్ వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని చద్దా తెలిపారు. విద్యార్థులు తమ సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఉంచినప్పుడు ఆయన ఒక సంరక్షకుడిలా స్పందించారని అన్నారు. నీట్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు వేగంగా జరిగిందని, కేవలం 75 రోజుల్లోనే ఫాస్ట్ట్రాక్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో నీట్ పరీక్షలను ఓఎంఆర్ షీట్లకు బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.Cancer is not cured by Crocin. Paper Leak is not cured by soundbites. It needed a real institutional fix, and today we gave it one.That is why I stood in support of the Public Examination Amendment Bill 2026. Because this is India's first real, institutional answer to paper… pic.twitter.com/qKeI5xFSM5— Raghav Chadha (@raghav_chadha) July 31, 2026మాజీ పార్టీ ఆప్పై విమర్శలుపేపర్ లీక్లపై మాట్లాడిన చద్దా తన మాజీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా విమర్శించారు. పంజాబ్ ఫార్మసీ ఆఫీసర్ నియామక పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని ప్రస్తావించారు. బ్లూటూత్ పరికరాల ద్వారా కొందరు అభ్యర్థులకు సహాయం చేశారని, మోసపూరిత పరీక్షల కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.13 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఎస్ఎస్ఎల్సీ ప్రశ్నపత్రం లీక్ ఘటనను కూడా ప్రస్తావించారు.‘విద్యార్థులు మాట్లాడారు.. ప్రభుత్వం విన్నది’ పేపర్ లీక్లను అరికట్టేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం దేశ పరీక్షా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తుందని రాఘవ్ చద్దా అన్నారు. యువతలో నమ్మకాన్ని తిరిగి తీసుకురావడం, కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో ప్రశ్నలతో ముందుకు వచ్చిన రాఘవ్ చద్దా.. ఇప్పుడు పరిష్కారాల రాజకీయాలపై దృష్టి పెడుతున్నానని చెప్పడం.. జెన్జీ తరం ఆందోళనల మధ్య ఆయన రాజకీయ ప్రయాణంపై మరోసారి చర్చకు దారితీసింది. -
ఇప్పుడు చెప్పండి తమ్ముళ్లు.. ‘భోగాపురం’ క్రెడిట్ ఎవరిదో?
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో చంద్రబాబు క్రెడిట్ చోరీపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హైదరాబాద్ను నేనే కట్టాను.. సెల్ ఫోన్ను కూడా నేనే కనిపెట్టాను.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చానంటూ డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తన ఖాతాలోనే వేసుకున్నారు. 2023 మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమించారు. అయితే, ఈ క్రెడిట్ అంతా వైఎస్ జగన్కు దక్కకూడదని ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం మొదలుపెట్టింది.నిజాలు కళ్లముందు కనబడుతున్నా.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా.. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి.. ఎల్లో ముఠా అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లో ఇదే భ్రమలతో విషం కక్కుతున్నారు. సంక్షేమం, అభివద్దిని పక్కనపెట్టి వైఎస్ జగన్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా చంద్రబాబు సర్కార్ పెట్టుకుంది.అసలు జరిగింది ఇదే.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించి అంశాలపై ఫోకస్ పెట్టింది. కోర్టు వివాదాలు, కేసుల్ని పరిష్కరించడంతో పాటుు.. భూసేకరణను 2,750.78 ఎకరాలకు కుదించింది. భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మించి పునరావాసం కల్పించారు. అనంతరం భోగాపురం విమానాశ్రయం పనులకు సంబంధించి జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎయిర్పోర్ట్కు అవసరమైన ఎన్వోసీలు సహా మిగిలిన అనుమతుల్ని పొందారు. (Bhogapuram Airport Real Story)ఇది కదా వాస్తవం.. 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్కు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో పాటు మరో వైపు, క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు.భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం చెల్లించారు. డి.పట్టా భూములకు జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో రైతులు చాలా మంది పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది.విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. (Bhogapuram Airport Timeline)ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడ వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది. కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది. రెట్టింపు పరిహారం ఇచ్చింది. ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్షిప్ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలు నిర్మించింది. -
ఏసీబీ కోర్టు: లక్ష పూచీకత్తు సమర్పించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఇవాళ్టి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ ముగిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) విచారణ కోసం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్తో పాటు అరవింద్కుమార్, బీఎల్ఎన్ రెడ్డి రూ.లక్ష పూచీకత్తు సమర్పించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై విచారణ కొనసాగుతోంది. ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహిస్తే రాజకీయ కక్షతో నేరంగా చిత్రీకరిస్తున్నారని కేటీఆర్ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ను ఏ1గా పేర్కొంటూ 77 పేజీల ఛార్జ్షీట్ను మార్చి 23న దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో మొత్తం 14 మంది సాక్షులను ఏసీబీ ప్రస్తావించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ కోర్టు వచ్చే నెల(ఆగస్టు) 25కి వాయిదా వేసింది.ఐదుగురిపై అభియోగాలుఈ కేసులో కేటీఆర్ సహా ఐదుగురిపై అభియోగాలు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) సంస్థ ప్రతినిధి అల్బెర్టోకు సైతం కోర్టు సమన్లు జారీ చేసింది. మే 14న ఏసీబీ కోర్టు ఛార్జ్షీట్ను విచారణకు స్వీకరించింది.అనుమతులు లేకుండానే.. ఏసీబీ ఛార్జ్షీట్ ప్రకారం.. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి అవసరమైన అనుమతులు పొందకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది. కేబినెట్, ఆర్థిక శాఖ, న్యాయశాఖ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లారని పేర్కొంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ)పై సంతకం జరిగేలా కేటీఆర్ వ్యవహరించారని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారని, ప్రభుత్వంపై సుమారు రూ.600 కోట్ల భారం పడిందని ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు తెలిపింది.ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలుఫార్ములా ఈ రేసు కోసం రూ.75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఏసీబీ ఆరోపించింది. క్విడ్ప్రోకో అంశంతో పాటు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని కూడా ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. బీఆర్ఎస్కు వచ్చిన రూ.44 కోట్ల విరాళాల అంశాన్ని కూడా ఏసీబీ తన అభియోగాల్లో పేర్కొన్నట్లు సమాచారం. రాజకీయంగా ప్రాధాన్యంఫార్ములా ఈ-రేసు కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇదొక లొట్ట పీసు కేసు అని అభివర్ణించారు. ఎలాంటి అవినీతి జరగలేదని.. ఎలాంటి రహస్య ఒప్పందాలు, లావాదేవీలు లేవని చెప్పారాయన. ఇప్పుడు.. నాంపల్లి కోర్టు విచారణ నేపథ్యంలో కేసు తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. -
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
హైడరాబాద్: యువ ఇంజనీర్లపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యువ ఇంజనీర్లను అవమానించే హక్కు రేవంత్కు ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. యువ ఇంజనీర్లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టం: హరీష్ఉద్యోగులకు సీఎం రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్రావు. ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ, డీఏ హామీలు ఏమయ్యాని ఆయన నిలదీశారు. ఉద్యోగుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందన్నారు హరీష్రావు. -
అమిత్ షా రాజీనామా చేయాలి: ‘సీజేపీ’ అభిజీత్ దిప్కే
న్యూఢిల్లీ: పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరు కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశాలతోనే జరిగిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అమిత్ షా రాజీనామా చేయాలని గురువారం డిమాండ్ చేశారు.మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో విలేకరులతో దీప్కే మాట్లాడుతూ.. “నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడి, రక్తం కారేలా చేయడం అమిత్ షా ఆదేశాలు లేకుండా జరిగి ఉండదు” అని అన్నారు.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా నిరసనకారులపై తీసుకున్న చర్యలకు షానే బాధ్యుడని ఆరోపిస్తూ ఆయన రాజీనామా కోరిన నేపథ్యంలో దీప్కే సైతం ఇదే డిమాండ్ చేశారు. తాను కూడా రాహుల్ గాంధీ అభిప్రాయాన్నే సమర్థిస్తున్నానని చెప్పారు. “ఆయన (షా) రాజీనామా చేయాలని నేను కూడా భావిస్తున్నాను” అని అన్నారు.సీజేపీ విదేశీ నిధులు పొందుతోందన్న ఆరోపణలను దీప్కే కొట్టిపారేశారు. “హోంశాఖ బాధ్యతలు షా వద్ద ఉన్న సమయంలోనే మాకు విదేశీ నిధులు వస్తున్నాయంటే అది కూడా ఆయన వైఫల్యమే. అప్పుడు మీరు ఎలాంటి చాణక్యులు? అలాంటప్పుడు షా కూడా రాజీనామా చేయాలి” అని చురకలు అంటించారు.బీజేపీలో చేరాలని ఒత్తిడి నిరసనకారులపై చర్యలు తీసుకోవడానికి కారణం చూపించేందుకే ఢిల్లీ పోలీసులు రాళ్లదాడిని సృష్టించారని దిప్కే ఆరోపించారు. “రాళ్లదాడికి ఢిల్లీ పోలీసులు ప్రణాళిక వేశారు. బీజేపీ గూండాలు వచ్చి రాళ్లు విసిరారు. దానికి విద్యార్థులనే బాధ్యుల్ని చేశారు” అని ఆయన అన్నారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చేందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని దిప్కే ఆరోపించారు. “నన్ను బెదిరించారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చేందుకు నా తల్లిదండ్రులను కూడా బెదిరించారు. పార్టీలో చేరండి లేకపోతే పరిణామాలు ఎదుర్కోండి అని చెప్పారు” అని అన్నారు.ఆరోపణలను ఖండించిన బీజేపీదిప్కేపై బీజేపీ నేత కేశవ్ ఉపాధ్యే విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మార్గంలో నడవాలనుకుంటే దీప్కే కాంగ్రెస్లో చేరాలని అన్నారు. “అతను ఒక నిరసన ఉద్యమానికి ముఖచిత్రం. ప్రశ్నపత్ర లీకుల నిరోధక బిల్లు తీసుకురావడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అంగీకరించడం ద్వారా అతని డిమాండ్లను అంగీకరించింది బీజేపీ ప్రభుత్వమే. దాన్ని గౌరవించాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ మార్గాన్ని అనుసరించాలనుకుంటే కాంగ్రెస్లో చేరాలి” అని అన్నారు. -
“ఏసీ గదుల నుంచి మిమ్మల్ని బయటకు ఈడ్చుకొస్తాం”
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విద్యార్థులు పెల్లెట్ దాడుల్లో గాయపడిన ఘటనపై ప్రతిపక్షం సిగ్గుపడుతోందని, కొందరు చూపు కోల్పోయారని ఆరోపిస్తూ, ప్రభుత్వం కూడా అదే భావనతో ఉందా అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు చేస్తూ.. ఏదో ఒక రోజు ప్రతిపక్షం “మిమ్మల్ని ఏసీ గదుల నుంచి బయటకు ఈడ్చుకొచ్చి” ప్రజల ముందుకు తీసుకొస్తుందని ఖర్గే అన్నారు. దీంతో రాజ్యసభలో దుమారం చెలరేగింది. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా... ఖర్గే పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన పదాలు వాడారని ఆరోపించారు. ప్రసంగించే సమయంలో భావోద్వేగాలకు లోనుకావద్దని ఆయన సూచించారు.ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే మళ్లీ స్పందిస్తూ.. “మిమ్మల్ని ఏసీ గదుల నుంచి బయటకు ఈడ్చుకొస్తాం” అన్న తన వ్యాఖ్య విద్యార్థులు, మహిళలు, ప్రజల శక్తిని ఉద్దేశించిందేనని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారిని చివరకు వారి గదుల నుంచి బయటకు వచ్చేలా చేసేది ప్రజాశక్తేనని ఆయన అన్నారు.విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యల అంశంపై మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బిహార్లో ఏకే-47లు ఎందుకు వినియోగించారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్కు పార్లమెంట్ ప్రాంగణంలో “యుద్ధ వీరుడి” తరహాలో ఎలా స్వాగతం పలికుతారని కూడా ఆయన ప్రశ్నించారు.విద్యార్థుల నిరసనలను చల్లార్చేందుకే ప్రశ్నపత్ర లీకుల నిరోధక బిల్లును ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిందని ఖర్గే ఆరోపించారు. సవరణ బిల్లును ప్రతిపక్షం స్వాగతిస్తోందని మల్లికార్జున ఖర్గే అన్నారు. అయితే ప్రశ్నపత్ర లీకులను ఎలా అడ్డుకుంటారో ఇందులో స్పష్టంగా చెప్పలేదని, అందువల్ల ఇది అసంపూర్ణంగానే ఉందని పేర్కొన్నారు. లీకులను ఎదుర్కొనే వ్యూహాన్ని వివరించకుండా, శిక్షలకు సంబంధించిన సంఖ్యలను మాత్రమే ప్రభుత్వం మార్చిందని ఆయన ఆరోపించారు. ప్రశ్నపత్ర లీకుల నిరోధక బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. “మీ నోరు కుట్టేశారా?” అంటూ ఆయన ప్రశ్నించారు. -
యువతను ఆకట్టుకునే పనిలో బీజేపీ అగ్రనేతలు!
ఫేస్బుక్, ఎక్స్, వాట్సప్లకు ఇక కాలం చెల్లినట్లే! రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా బీజేపీ వారు ఇక ఇన్స్టా మార్గం పట్టనున్నారు. రీల్స్ రాజకీయమే భేషన్న ప్రధాని మాటలు వారిపై సీరియస్ ప్రభావమే చూపాయి. జెన్–జీ ప్రియ నేస్తం ఇన్స్టాగ్రామ్పై కేంద్ర మంత్రులు సహా కాషాయ పార్టీ నేతల విన్యాసాలు ఎంతమేరకు రక్తికట్టిస్తాయో చూడాలి మరి! కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుణ్యమా అని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలకు తమ రాజకీయాన్ని పండించుకునేందుకు కొత్త అస్త్రం దొరికింది. నిన్న మొన్నటివరకూ అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ సందేశాన్ని వినిపిస్తూ వచ్చిన కాషాయ పార్టీ నీట్ ప్రశ్న పత్రాల లీకేజీలపై విద్యార్థుల ఆందోళనల తరువాత రూటు మార్చింది. ఇన్స్టాగ్రామ్పై తన దృష్టిని కేంద్రీకరించింది. ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇన్స్టా సందేశం పంపడం, జెన్–జీని ఆకట్టుకోవాలంటే ఇదే మేలి మార్గమని ఆయన స్వయంగా ప్రకటించడం ఆ పార్టీ నేతల్లో జోష్ నింపిందని చెప్పాలి. అందుకేనేమో... ఒక్కరొక్కరుగా కేంద్ర మంత్రులు కూడా రీల్స్ చేయడం మొదలుపెట్టారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత కొత్త విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఓ నాలుగు పోస్టులు పెట్టారు అందులో. ప్రస్తుతానికి ఆయనకున్న ఫాలోయర్లు కేవలం 23 మంది మాత్రమే. మోదీ సందేశం, తనను విద్యాశాఖ మంత్రిగా నియమించడం, కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్తో చర్చలు, ప్రశ్న పత్రాల లీకేజీ విషయమై అధికారులతో చర్చలు మాత్రమే ఆయన పోస్టులు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, సీజేపీతో చర్చలు జరిపిన బీజేపీ నేత జేపీ నడ్డా, మాజీ మంత్రి జితేంద్ర సింగ్లు గతంలో వారానికి నాలుగైదు పోస్టులు మాత్రమే పెడుతూంటే.. తాజాగా ప్రతిరోజు బోలెడన్ని ఇన్స్టా పోస్టులు పెడుతున్నారు. ఇన్స్టాను వాడుకోండి అన్న ప్రధాని పిలుపునకు ముందు జేపీ నడ్డా ఇన్స్టాపై చివరగా పోస్టు చేసింది జూలై నాలుగున. అంతకు ముందు జూన్ 27న ఒక పోస్టు చేశారు. ఇప్పుడు మాత్రం రోజూ పోస్టులే పోస్టులు! పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా కొన్ని రోజులుగా ఇన్స్టా వేదికగా ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లుపై పలు పోస్టులు చేస్తున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ అంశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా వర్ణించిన రిజిజు చర్చకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలకు చేసిన విజ్ఞప్తులను రీల్స్గా పోస్ట్ చేశారు.చదవండి: నీలేకనికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఇన్స్టా బాట పట్టారు. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం సత్వర చర్యలకు దిగిందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హామీ ఇచ్చిందని ఆమె ఈ మధ్యే పోస్టు పెట్టారు. ఇక బీజేపీని డిజిటల్ మార్గం పట్టించిన ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మలవీయా కూడా జెన్–జీకి దగ్గరైన ఇన్స్టాగ్రామ్పైకి రాక తప్పలేదు. సీజేపీ నిరసనల్లో అసంబద్ధమైన నినాదాలు ఉన్నాయని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రశ్న పత్రాల లీకేజీలపై వారెవరూ మాట్లాడకపోవడాన్ని ప్రశ్నించారు.టాప్లో పీఎం... భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి ఇన్స్టాగ్రామ్లో చురుకుగా ఉన్నారు. పది కోట్ల మందికిపైగా ఫాలోయర్లు ఉండగా... సీజేపీ నిరసనల సందర్భంగా అర్ధ రాత్రి చేసిన సెల్ఫీ వీడియోతో ఫాలోయర్ల సంఖ్య సుమారు పది లక్షల మంది పెరిగారు. మూడు నెలల క్రితం భారతీయ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్కు 9.5 లక్షల మంది ఫాలోయర్లు ఉండగా సీజేపీ కొన్ని గంటల్లోనే ఈ సంఖ్యను దాటిపోయింది. తరువాత సీజేపీ హ్యాండిల్పై నిషేధం వేటు పడటం.. కోర్టు కేసుల తరువాత హ్యాండిల్ మళ్లీ దక్కడం తెలిసిన విషయమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నువ్వెంత.. నీ స్థాయెంత
కృష్ణాజిల్లా: టీడీపీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు బట్టబయలయ్యాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరుపై ఆధిపత్యం కోసం తమ్ముళ్లు తన్నుకునే వరకూ వెళ్లారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఎదుటే ఒకరిపై ఒకరు వాదులాటకు దిగి దుర్భాషలాడుకున్నారు. నువ్వెంత...నీ స్థాయెంత అంటూ తోపులాటకు దిగారు. మంగళవారం రాత్రి టీడీపీ చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం వేదికగా తమ్ముళ్ల మధ్య పోరు నెలకొంది. ఉయ్యూరు టీడీపీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. అధికారం, కాంట్రాక్టులు, ఆదాయ వనరుల అజెండాగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి తమ్ముళ్ల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. కార్యక్రమాలు కూడా ఒంటెత్తు పోకడలుగా సాగుతుండటంతో శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. మున్సిపాలిటీ వేదికగా సాగుతున్న ఈ తంతు ఇంటింటికీ తెలుగుదేశంలో బహిర్గతమైంది. కాపుల రామాలయం సెంటరులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ సమక్షంలోనే పార్టీ నాయకులు వంగవీటి శ్రీనివాసప్రసాద్, కూనపరెడ్డి వాసు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దూషణలకు దిగి తోపులాట వరకూ వెళ్లారు. అధికారం, పదవులు, కాంట్రాక్టులు అన్నీ ఒకరిద్దరికే ఎలా కట్టబెడతారంటూ వంగవీటి ఆరోపించారు. ఆరోపణలపై వాసు అదే స్థాయిలో స్పందించి పార్టీలో కష్టపడ్డ వారికే ప్రాధాన్యం ఇస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. అదుపుతప్పే పరిస్థితి నెలకొనటంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జోక్యం చేసుకుని ఇరువురికీ సర్దిచెప్పి కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోయారు. జనసేన గళం టీడీపీ నేతల వ్యవహార తీరుపై జనసేన నేతలూ తమ అసంతృప్తి వెళ్లగక్కారు. జనసేన నేత బొప్పన శివప్రసాద్ తమ పార్టీకి సరైన ప్రాధాన్యం లేదని ఎమ్మెల్యే ఎదుటే టీడీపీ నేతలను నిలదీయటంపై చర్చ జరుగుతోంది. జనసేనకు సముచిత స్థానం కలి్పంచటం లేదని బొప్పన ఆరోపించటం గమనార్హం. -
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్గా ‘దుర్గం’ ఎమ్మెల్యే అమిలినేని
అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వివాదాస్పద వైఖరిపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలిసింది. అక్రమ వ్యవహారాలపై నివేదికలు సేకరించినట్లు టీడీపీ నాయకుల్లోనే చర్చ సాగుతోంది. అధికారంలోకి వచ్చాక వివాదాల పర్వంలో మచ్చుకు... నెల క్రితం శింగనమల మండలంలోని సి. బండమీద పల్లి సమీపంలో వైఎస్సార్సీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాహనాన్ని రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఎమ్మెల్యే అమిలినేనికి చెందిన ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్దిగా గుర్తించారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిని కప్పిపుచ్చేందుకు కుట్రలకు తెరలేపడం చర్చనీయాంశమైంది. ఐదు నెలల క్రితం అన్నమయ్య జిల్లాలోని గండ బోయిన పల్లి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు హల్చల్ చేశారు. వాహనాన్ని ఆపారంటూ మహిళా సిబ్బందిపై ఏకంగా దాడికి దిగారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే టోల్ రుసుము కూడా కట్టలేని స్థితిలో ఉన్నారా అంటూ ప్రతిపక్షాలు అప్పట్లో దుమ్మెత్తిపోశాయి. ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్లో అనంతపురంలోని రామ్నగర్లో ఎలైట్ అపార్ట్మెంట్ వద్ద ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు, ఆయన అల్లుడు నానా యాగీ చేశారు. అకారణంగా తమపై దాడి చేశారంటూ అక్కడి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్ భార్య సుజాత ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. గత ఏడాది జూన్లో ఎస్ఆర్సీకి సంబంధించి వెలుగుచూసిన ఈ స్టాంప్ డ్యూటీ గోల్మాల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి యూనియన్ బ్యాంకు నుంచి రూ.900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి మరో రూ.20 కోట్లు రుణం తీసుకున్నారు. స్టాంప్ డ్యూటీ ఎగవేతతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కన్నం పడింది. తప్పుడు డాక్యుమెంట్లతో మోసం చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ కుంభకోణంపై మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, సీఐడీ, ఈడీతో విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. దీనిని కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. చంద్రబాబు దృష్టికి వ్యవహారం అమిలినేని వివాదాస్పద వ్యవహారాలపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు నివేదికలు వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. మద్యం షాపులను బలవంతంగా లాక్కోవడం, ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో బెల్టుషాపులు నిర్వహించడం, ఇసుకను భారీ ఎత్తున అక్రమంగా తరలించడం వంటి వాటిపై కూడా నివేదికలు సేకరించినట్లు సమాచారం. అక్రమ కేసులతో భయపెడుతూ..అమిలినేని తీరును, నియోజకవర్గంలో ఆయన మేనల్లుళ్లు సాగిస్తున్న అక్రమాలను ప్రశి్నస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అన్యాయాలపై ప్రశ్నించే వారిని పోలీసు యంత్రాంగం ద్వారా భయపెడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకులతో పాటు సొంత పార్టీ నేతలను కూడా భయపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. -
కూటమికి దిమ్మతిరిగిపోయేలా.. ఉత్తరాంధ్రలో జనసంద్రం
సాక్షి, విశాఖపట్నం: జగన్ పర్యటనలో జనం లేరు అని చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నం మరోసారి ఘోరంగా విఫలమైంది. గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనకు భారీ స్పందన లభించింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో సాగిన జగన్ ప్రయాణంలో దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇది మొదలైంది. పలుచోట్ల కాన్వాయ్ ఆగడంతో జగన్ వాహనం దిగి ప్రజలకు అభివాదం చేశారు. ఆప్యాయంగా వాళ్లను పలకరించి.. సమస్యలను విన్నారు. ఈ క్రమంలో ఆయన వాహనం నెమ్మదిగా ముందుకు కదలింది. జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పోలీసు వ్యవస్థను ప్రయోగించింది. గత రెండేళ్లలో ఏనాడూ లేని రీతిలో.. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు అటువైపు రావొద్దని జనాలను హెచ్చరించారు. కేవలం 8 వాహనాల కాన్వాయ్తో.. సీదిరి అప్పలరాజుతో ములాఖత్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఉల్లంఘిస్తే కేసులు పెడతామని బెదరించారు. అయినప్పటికీ జనం తగ్గలేదు.ఈ క్రమంలో గురువారం ఉదయం అటు వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి కాపలా కాశారు. కానీ, జనం మాత్రం ‘జగన్ వెంటే మేం’ అని కదిలారు. ఆంక్షలను దాటుకుని జగన్ దగ్గరకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్టు ప్రాంగణంలో మొదలైన జన వాహిని.. శ్రీకాకుళం దారి పొడవునా కనిపించింది. మహిళలు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్కు స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ తన పర్యటనను కొనసాగించారు. భారీగా తరలివచ్చిన జనసందోహంతో ‘కూటమి సర్కార్ మైండ్ బ్లాక్’ అయ్యిందనే కామెంట్లు ఇటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు రహదారుల వెంట కనిపించిన ప్రజల తాకిడి.. జగన్పై ఉన్న అభిమానానికి నిదర్శనంగా కనిపించింది. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. జగన్కి ఉన్న ప్రజాదరణను అడ్డుకోలేరని మరోసారి రుజువు చేసింది. -
ఇదేం విచిత్రమో.. ఆ లాజిక్కు మిస్సయ్యిందా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కోర్టులో ఇకనైనా వేగంగా సాగుతుందా? ఈ కేసు ఈ ఏడేళ్లలో అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. నిందితులుగా ఉన్న వివేకా రక్త సంబంధికులు ఈ కేసు సత్వరమే విచారణకు రావాలని కోరుతుంటే, స్వయంగా వివేకా కుమార్తె సునీత ఈ విచారణ జాప్యం అవడానికి కారణం అవుతున్నట్లు వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సీబీఐ విచారణపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆమె తరచు వేస్తున్న పిటిషన్లు ఈ జాప్యానికి కారణంగా కనిపిస్తున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. ఆమె ఏకంగా కొత్తగా ప్రైవేట్ కేసును సీబీఐ కోర్ట్లో వేసి మళ్లీ మొదటినుండి సీబీఐ విచారణ కోరడం చూసి కోర్ట్ వారు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్ చట్టపరంగా మెయిన్టెయినబుల్ కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆమె లేవనెత్తిన అంశాలకు కోర్టువారు 70 పేజీలలో ఉత్తర్వులు ఇచ్చారు.. ఆమెకు ఎవరిమీద కోపం ఉంటే వారిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారన్న విమర్శ వచ్చింది.సీబీఐ తమను అక్రమంగా కేసులో చేర్చిందని కొంతమంది నిందితులు వాపోతుంటే, తానే వివేకాను చంపాను అన్న నిందితుడు ఆప్రోవర్గా మారడం విశేషంగా కనిపిస్తుంది. సునీత ఏ లాయర్నైతే నియమించుకున్నారో, ఆయనే ఇతనికి లాయర్గా ఉండడం, సుప్రీంకోర్టులో కేసులు వేయడం చిత్రంగా ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వివేకా హత్య జరిగిన తర్వాత కొంతకాలం పాటు ఆమె చేసిన ఆరోపణలకు, ఆ తర్వాత కాలంలో చేసిన అభియోగాలకు ఎందుకు తేడా వస్తోందంటే ఏమి చెబుదాం. వర్తమాన రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అన్న భావన కలుగుతుంది. ఇందులో బంధాలు, అనుబందాల కన్నా, ఇతరత్రా లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తుండవచ్చు. తన తండ్రిని హత్య చేశానని బహిరంగంగా ప్రకటించిన దస్తగిరి అనే నిందితుడికి బెయిల్ రావడానికి సునీత సహకరించారన్న ప్రచారం ఆమె ప్రతిష్ట మసకబారేలా చేసిందనిపిస్తుంది. అలాగే అన్నిటిని మించి వరుసకు తన సోదరుడయ్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో తగాదాపడి, తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న చదరంగంలో ఆమె ఒక పావుగా మారిందన్న ఆరోపణను వైఎస్సార్సీపీ నేతలు చేస్తుంటారు.ఈ కేసులో టీడీపీ చేసే విమర్శలు, ఈమె చేసే ఆరోపణలు గమనిస్తే అది నిజమేనేమో అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్ను, ఆయన సతీమణిని ఎలాగైనా ఈ కేసులోకి తీసుకురావాలని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకు ఆమె వెళ్లారు. ఆ సందర్భంగా కోర్టు సూచన మేరకు సీబీఐ మళ్లీ, మళ్లీ విచారణ చేసినా, ఎక్కడా ఎలాంటి కొత్త ఆధారాలు కనిపించలేదు. దాంతో ఎవరెవరిమీదో తోచిన ఆరోపణల్లా చేయడం, ఆ కోణంలో సీబీఐ విచారణ జరపడం నిత్యకృత్యంగా మారింది.ఈ కేసులో సీబీఐ కూడా ఒక కీలకమైన కోణాన్ని వదలిపెట్టిందన్నది నిందితుల తరపు న్యాయవాదుల వాదన. వివేకా రెండో పెళ్లి చేసుకున్నారా? లేదా? ఆమెకు ఈయన ద్వారా సంతానం కలిగిందా? లేదా? ఆమె వేసిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకుంటారా?లేదా? దస్తగిరి తరపున వాదించిన లాయర్ కాని, సునీత పక్షాన వాదన చేసిన లాయర్ కాని టీడీపీ తరపున పనిచేసేవారే కావడంలోని ఆంతర్యం ఏమిటి? వారికి ఢిల్లీలో లక్షల రూపాయల చొప్పున ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. అవన్ని ఎవరు సమకూర్చారు?వివేకా హత్య కేసులో ఆయన సమీప బంధువుల ప్రమేయం ఉందా? లేక వ్యక్తిగత స్నేహితుల హస్తం ఉందా? రియల్ ఎస్టేట్ లావాదేవీలు, సంబంధిత డబ్బు కారణంగా ఈ హత్య జరిగిందా? లేక ఎంపీ సీటుకు పోటీ వస్తాడన్న కారణంగా హత్య జరిగిందా?ఇక్కడ ఒక లాజిక్ సీబీఐ కూడా మిస్ అవుతోందన్న అభిప్రాయం ఉంది. అవినాశ్ రెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీగా కొనసాగుతున్న సమయంలో 2019 ఎన్నికలలో కూడా ఆయనే అభ్యర్ధి అని అందరికి తెలుసు. నిజంగా వివేకా ఎంపీ సీటు ఆశించి ఉంటే, అవినాశ్ తరపున ప్రచారానికి ఎందుకు వెళతారు? ఇలాంటి మిస్సింగ్ లింకులన్నీ విచారణ సందర్భంగా ఒక కొలిక్కి వస్తాయోమో తెలియదు. హత్య జరిగిన రోజు వివేకా రాసిన లేఖ, ఆయన పీఏ. కృష్ణారెడ్డి వాదన, సీబీఐ అధికారులను మార్చిన వైనం మొదలైనవి ఎన్నో శేషప్రశ్నలుగా ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరుతెన్నులపై పరిశోధన జరిగితే మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయేమో చెప్పలేం.అంతేకాదు... వివేకా హత్య కేసులో జగన్కు ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు స్పష్టమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్లు పదేపదే ఆయనపై ఎందుకు ఆరోపణలు చేశారు? ఇప్పటికీ ఎందుకు చేస్తూనే ఉన్నారు. అంతేకాక వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీగా ముద్రవేసి లబ్ది పొందాలని ఎందుకు యత్నిస్తున్నారు? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసి బూడిద కూడా మాయం చేసిన నేపథ్యంలో టీడీపీకి బూడిద పార్టీ అని మాజీ మంత్రి కొడాలి నాని పేరు పెట్టి కౌంటర్ ఇచ్చి ఉండవచ్చు. అది వేరే విషయం.ఇన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన ఒక తీర్పు సునీతకు, బహుశా టీడీపీకి, ఎల్లో మీడియాకు ఆశాభంగం కలిగించి ఉండాలి. మరోసారి విచారణ చేయండని సీబీఐ కోర్టు ఆదేశించి ఉంటే ఆ పేరుతో మరికొంతకాలం గడిచేదేమో! కాని చట్టం ప్రకారం అది కరెక్టు కాదని గౌరవ న్యాయస్థానం అభిప్రాయపడి సునీత పిటిషన్ను తోసిపుచ్చింది. సీబీఐ విచారణ సరిపోలేదని సునీత అంటున్నా, కొత్త ఆధారాలు ఏమీ వెలుగులోకి రాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు ఎలా చేయాలో తాము నిర్దేశించజాలమని కూడా కోర్టు స్పష్టం చేసింది.రోజువారీ విచారణ జరగాలని ఒకవైపు కోర్టును కోరుతూ, సీబీఐ దర్యాప్తు మరింత లోతుగా జరపాలని మరో వైపు కోర్టులలో ఆమె పిటిషన్లు వేస్తున్నారని నిందితుల తరపున న్యాయవాదులు పేర్కొంటున్నారు. క్రిమినల్ కేసుల్లో నిరంతర దర్యాప్తు జరగదని, సుప్రీంకోర్టు కూడా వేగవంతంగా ఈ కేసును విచారించాలని ఆదేశించిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. కుమార్తె అన్న సానుభూతి పొందడానికి ఆమె ప్రయత్నిస్తున్నారా? లేక చిత్తశుద్దితో తన తండ్రి హత్య కేసు విచారణ సత్వరమే జరగాలని కోరుకుటున్నారా? అన్న ప్రశ్నలను ప్రతివాదులు వేస్తున్నారు.విశేషం ఏమిటంటే ఏ కేసులో అయినా నిందితులు విచారణ జాప్యం కావాలని ప్రయత్నిస్తుంటారు. కాని ఈ కేసులో మాత్రం స్వయంగా వివేకా కుమార్తె పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణ జాప్యానికి కారణం అవుతున్నారన్న భావన ప్రజలలో కలుగుతోంది. ఆ విషయాన్ని ఆమె గ్రహిస్తే మంచిదన్న అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా దురుద్దేశాలతోనో, కక్ష కట్టి ఎవరిపైనో కేసును బనాయించాలని ప్రయత్నించడం సమంజసం కాదని పలువురి వ్యాఖ్యగా ఉంది. పైగా ఇందులో రాజకీయంగా తన తండ్రి ప్రత్యర్థుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారన్న విమర్శలు రావడం కూడా ఆమెకు మంచిది కాదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మేం మీలా కాదు.. అంగళ్లు ఘటన మరిచిపోయారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. పోలీసులు ఏర్పాటు చేస్తున్న నిబంధనలు భద్రతా చర్యల పేరుతో రాజకీయ నిర్బంధంగా మారుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.జగన్ శ్రీకాకుళం పర్యటనకు సంబంధించి కాన్వాయ్ను పరిమితం చేయడం, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయడం, నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడం.. రాజకీయ నిర్బంధం కిందకే వస్తుందని, అది ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమేనని వైఎస్సార్సీపీ అంటోంది. "జగన్ ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది" అని పార్టీ నేతలు చెబుతున్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని, ఆ జనాదరణ చూసే ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ఇటు.. సీదిరి అప్పలరాజు వ్యవహారంలో కూడా ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ అంటోంది. అలాగే ఒక ప్రజా ప్రతినిధితో ములాఖత్ కోసం వెళ్లే కార్యక్రమాన్ని కూడా రాజకీయ అంశంగా మార్చి ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొంది. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కార్యక్రమాలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగాయని, ఎక్కడా హింసాత్మక ఘటనలకు తమ పార్టీ కారణం కాలేదని నేతలు స్పష్టం చేశారు.అదే సమయంలో అధికార పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ వైఎస్సార్సీపీ విమర్శలు గుప్పించింది. అంగళ్లు తరహా ఘటనల్లో పోలీసులపై దాడులు, వాహనాల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. తమ కార్యక్రమాలపై మాత్రమే ఆంక్షలు విధించడం వివక్షపూరిత వైఖరి అని ఆరోపించింది. "ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పటికీ.. అధికార యంత్రాంగం అనవసర ఆంక్షలతో వ్యవహరిస్తోంది. ప్రజల మధ్యకు వెళ్లే హక్కును ఎవరూ అడ్డుకోలేరు" అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు.చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా.. అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో రాజకీయ ఘర్షణలు చోటుచేసుకుని రాళ్ల దాడులు జరిగాయి. టీడీపీ శ్రేణులు జరిపిన దాడుల్లో.. పలువురు పోలీసులు గాయపడగా, ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఒక కన్ను చూపు శాశ్వతంగా కోల్పోయారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై అప్పట్లో కేసు కూడా నమోదు అయ్యింది. -
‘డీఎస్సీలో అక్రమాలు నిజం.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్’
సాక్షి, నెల్లూరు జిల్లా: ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో అన్నీ కోతలే.. ఉద్యోగులు కూడా ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. రైతుల మీద కేసులు బనాయించిన ఏకైక ప్రభుత్వం టీడీపీ’’ అంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘విద్యా వ్యవస్థను భష్టు పట్టించేందుకే లోకేష్కి ఆ శాఖ ఇచ్చారు. సీబీఐ విచారణ జరిపిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి..? అక్రమాలు జరిగాయి కాబట్టే.. దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. లోకేష్తో చర్చించేందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని పంపిస్తాం.. లోకేష్ రాగలడా..?. మేము అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పాలి. అబద్ధానికి చొక్కా, ప్యాంట్ వేస్తే అది చంద్రబాబే. ఎమ్మెల్యే సోమిరెడ్డి జీవితం గురించి ఒక పుస్తకం రాయొచ్చు’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు. ‘‘టీడీపీ నేతల విమర్శలకు భయపడే రోజులు పోయాయి. ధర్మేంద్ర ప్రధాన్కి నైతిక విలువ ఉన్నాయి కాబట్టే రాజీనామా చేశారు. నారా కుటుంబానికి నైతిక విలువలు ఉండవని లోకేశ్ నిరూపించారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి.. రిలే నిరహార దీక్షలకు సిద్ధమవుతున్నాం’’ అని కాకాణి పేర్కొన్నారు. -
బంకీపూర్ బైపోల్.. బీజేపీ కంచుకోటలో పీకే సవాల్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా నేడు మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఆగస్టు 3న జరగనుంది.అయితే ఈ మూడు ఉపఎన్నికల్లో బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ స్థానం దేశవ్యాప్తంగా అత్యధిక రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా అభ్యర్థిగా బరిలో దిగుతుండటంతో ఈ పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. మరోవైపు ఈ స్థానం బీజేపీకి బలమైన కోటగా ఉండటంతో పార్టీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఆర్జేడీ తన సంప్రదాయ ముస్లిం–యాదవ్ (ఎం-వై) ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహించింది.బంకీపూర్ స్థానం ఖాళీ కావడానికి బీజేపీ సీనియర్ నేత నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడమే కారణం. గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా స్థానాల్లో కూడా ఖాళీలు ఏర్పడటంతో ఎన్నికల సంఘం ఉపఎన్నికలను ప్రకటించింది. ఈ ఉపఎన్నికల ఫలితాలు అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ బలాబలాలను అంచనా వేయడమే కాకుండా, ఆయా రాష్ట్రాల్లో భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.#WATCH | Patna, Bihar: Voting begins for the by-election of Bankipur Assembly constituency.(Visuals from Bihar State Library) pic.twitter.com/wXhhIuUpCJ— ANI (@ANI) July 30, 2026ఇక, బంకీపూర్లో బీజేపీకి పట్టు ఉన్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు సర్వేల ప్రకారం బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇటీవలి పరిణామాలు ప్రశాంత్ కిషోర్ ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జన్ సురాజ్ ఓటు శాతం గణనీయంగా పెరగడం, బీజేపీ ఓటు శాతం తగ్గడం విశేషం. అదే సమయంలో ఆర్జేడీ ఓటు బ్యాంకు కూడా క్షీణించినట్లు పలు సర్వేల్లో వెల్లడైంది.బీజేపీకి ప్రతిష్ఠాత్మక ఎన్నికఈ నియోజకవర్గం దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీ ఆధీనంలో ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించింది. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ సహా పలువురు సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలో ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి గుప్తా మధ్య నెలకొంది. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, పోటీ ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యే కొనసాగుతోంది.యువ ఓటర్లే నిర్ణయాత్మకంబ్యాంకీపూర్లో సుమారు 3.69 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లు దాదాపు 1.25 లక్షల మంది ఉన్నారు. యువతలో ప్రశాంత్ కిషోర్కు ఎక్కువ మద్దతు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. మరోవైపు మహిళలు, వయోజన ఓటర్లలో బీజేపీకి బలమైన మద్దతు కనిపిస్తోంది. -
టార్గెట్ సీదిరి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నేరపూరిత హత్య..నేర పూరిత కుట్ర.. తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం.. సాక్ష్యాలను మాయం చేయడం..నేరస్తుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం.. అబద్ధమని తెలిసినా సమాచారాన్ని అధికారులకు ఇవ్వడం.. నేరానికి ప్రేరేపించడం..’ఇవీ రోడ్డు ప్రమాదం కేసులో సంబంధం లేని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై మోపిన అభియోగాలు. అసలు యాక్సిడెంట్ సమయంలో అప్పలరాజు అక్కడ లేరు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని వెళ్లిన అప్పలరాజే పోలీసులకు సమాచారం అందించారు. అలాంటప్పుడు అప్పలరాజుపై అభియోగాలు మోపడం రాజకీయ కుట్ర కాకపోతే ఏమనాలి.. కక్ష సాధింపులో భాగమని అనడానికి ఇంకేం చెప్పాలి.. రోడ్డు ప్రమాదంలో దానయ్య చనిపోవడానికి కారణం సిద్ధార్ద్ త్యాడి కాదని, సీదిరి తనయుడు ఆరవ్ వర్మ కారకుడని పోలీసులు అప్పలరాజుకు చెప్పివుంటే, ఆ తర్వాత కూడా కొడుకును తప్పించడానికి త్యాడిని ఇరికించి ఉంటే కచ్చితంగా నేరమవుతుంది. లేదూ దానయ్య మరణాన్ని దాచేసి అసలు అటువంటిది జరగలేదని బుకాయిస్తే అది ఇంకా పెద్ద నేరమవుతుంది. కానీ, సీదిరి కుమారుడు ఆరవ్ ఫోన్ నుంచే సంఘటన స్థలం నుంచి 108కు ఫోన్ వెళ్లింది. ఇక సీసీ టీవీలు ప్రైవేటు వ్యక్తులవే అయినా అందులో ఫుటేజ్ ఏమాత్రం పోలేదు. అలాంటప్పుడు ఇందులో హత్య కోణం ఎక్కడుందో పోలీసులు..వారిని ప్రేరేపించిన పాలకులే చెప్పాలి. ఇన్ని సెక్షన్లా? సీదిరి అక్రమ అరెస్టు కేసులో నమోదైన సెక్షన్లు చూసిన వారెవరైనా రోడ్డు ప్రమాదం కేసులో ఇన్ని సెక్షన్లు పెట్టొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. న్యాయ కోవిదులు కూడా పోలీసుల తీరును ఆక్షేపిస్తున్నారు. యు/ఎస్ 105 ఆర్/డబ్లూ 61(2) అఫ్ బీఎన్ఎస్, 231,238,240, 242,249 ఆర్/డబ్ల్యూ 49బిఎన్ఎస్ సెక్షన్లను సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు బనాయించారంటే దానివెనక ఎంత రాజకీయం నడించిందో ఇట్టే అర్ధమవుతుంది. పాలకులు కావల్సినట్టు పోలీసులు వ్యవహరించారని స్పష్టమవుతుందంటూ ఆరోపణలు ఉన్నాయి. 41 నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్పై విడుదల చేయాల్సిన ఘటన కేసులో తొలుత కుమారుడిని, ఆ తర్వాత తండ్రిని అరెస్టు చేశారంటే ఎంత క«థ నడిచిందో అర్ధమవుతోంది. చంద్రబాబు అండ్కో పగ.. వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది. సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది. పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు. -
‘డీఎస్సీపై లోకేష్తో చర్చకు సిద్ధం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరారు.ఇసుక దోపిడీకి బాధ్యత వహిస్తూ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై లోకేష్ తో బహిరంగ చర్చకు తాను కూడా సిద్ధమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:డీఎస్సీపై లోకేష్తో చర్చకు సిద్ధం:టీచర్ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా సిద్ధమైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను అక్రమాలతో కలుషితం చేసింది. స్పోర్ట్స్ కోటాలో అర్హులను పక్కనపెట్టి అధికార పార్టీకి చెందిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు జీవోలను మార్చారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను మా పార్టీ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే, విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకుని స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా సీబీఐతో విచారణ జరిపించాలి. డీఎస్సీ నియామకాలలో మెరిట్ లిస్టులు, రోస్టర్లు బహిరంగంగా ప్రకటించలేదు. ఇది పారదర్శకత లోపానికి నిదర్శనం. డీఎస్సీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను.కొండపిలో టీడీపీ నాయకుల ఇసుక అక్రమ మైనింగ్:రాష్ట్రంలో గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఇసుక, గ్రావెల్, రేషన్ బియ్యం దోపిడీకి పాల్పడుతోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 37 సార్లు ఆధారాలతో అక్రమ ఇసుక తవ్వకాల అంశాన్ని ప్రస్తావించినా ప్రభుత్వం స్పందించలేదు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం పాలేరు నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై గనుల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.మైనింగ్ శాఖ అధికారులే స్వయంగా టిడిపి మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇంచార్జులు, మాజీ ఎంపిపిల పేర్లను (అనుమోలు సుధా, పోకూరి రవి, దాసరి కృష్ణారావు, ఎర్ర నరేంద్ర, కొండగుంట శ్రీనివాసరావు మొదలైనవారు) రాస్తూ, వీరిపై పిడి యాక్ట్ పంపాలని లేదా మండల బహిష్కరణ చేయాలని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు లేఖలు రాసినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి, పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినా, స్థానిక మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అండదండలు ఉండటంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. మైన్స్ అండ్ జియాలజీ శాఖ టీడీపీకి చెందిన పలువురు స్థానిక నాయకుల పేర్లతో పోలీసులకు లేఖలు రాసి, వారిపై పీడీ చట్టం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయినప్పటికీ అవి అమలు కాలేదు. హైకోర్టు పలుమార్లు ప్రశ్నించినా అధికార యంత్రాంగంలో ఎలాంటి మార్పు రాలేదు.మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాజీనామా చేయాలి:కొండేపి నియోజకవర్గంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని లెక్కించాలి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమ మైనింగ్పై కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. హైకోర్టు ఆదేశాలు, మైన్స్ శాఖ నివేదికలు, అధికారిక పత్రాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రి ఆదేశాలతోనే అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేదా సీఎం చంద్రబాబే ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కూటమి క్యాబినెట్ అంతా ‘దోచుకో, పంచుకో, తినుకో విధానంతో నడుస్తోంది. యువత మరియు ప్రజల హక్కు సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో మరిన్ని రూపాల్లో తీవ్రతరం చేస్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. -
ఓ పొలిటికల్ డిజైన్ ఉంది.. ఆ నెలలో చెబుతా: జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ల మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ‘‘నేనేదైనా మాట్లాడాలనుకుంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కి రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాతే బయటికి వచ్చి మాట్లాడుతా. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే వ్యక్తిని కాదు’’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.‘‘మూడున్నరేళ్ల క్రితం మా పార్టీలో లోపాలు ఉంటే బయట మాట్లాడాను. కార్యకర్తల వ్యవహారం, పార్టీ అంశాలపై అంతర్గతంగా, బహిరంగంగాను చర్చించాను. ఈ మధ్య పీఏసీ మీటింగ్లో అంతర్గతంగా మాట్లాడే విషయాలు కూడా బయటికి వస్తున్నాయని సమావేశానికి పోవడమే మానేశాను. పీఏసీ మీటింగ్కి వెళ్లి ఉంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఏఐసీసీ ఇంచార్జ్, సీఎం దృష్టికి తీసుకెళ్లేవాణ్ని. మళ్ళీ నేను మాట్లాడిన అంశాలు బయటకి వచ్చేవి.. అందుకే పోలేదు. ఈ మూడున్నర ఏళ్లుగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలను ఎక్కడ బహిరంగంగా, అంతర్గతంగా చర్చించలేదు’’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.‘‘ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ 40 మంది కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిచారు. అందులో నాకు ఆహ్వానం అందింది. ఆ సమావేశంలో రాహుల్ గాంధీతో 15 నిమిషాలు మాట్లాడాను. నేను సంగారెడ్డి రాంనగర్లోని రాంమందిర్ నుంచి విద్యార్థి నేతగా నా రాజకీయ ప్రయాణం మొదలై.. నేడు ఢిల్లీలో మీ నివాసానికి వచ్చి మీ ముందు కూర్చునే వరకు సాగిందని చెప్పాను. మీ ముందు ఒక రోజు ఇలా కూర్చొని మాట్లాడాలని అనుకున్నా.. ఇప్పుడు మాట్లాడుతున్నా నేను అనుకున్నది సాధించాను అని చెప్పాను..ఏ పార్టీ నుంచి ప్రధాన మంత్రి ఉన్నా అధికారంలో ఉన్నన్ని రోజులే గుర్తుపెట్టుకుంటారని చెప్పా. పదవులతో పని లేకుండా గుర్తు పెట్టుకునే వారిలో మీ కుటుంబమే ఉంటుందని చెప్పా. కానీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని దేశ ప్రజలు చిరకాలం గుర్తి పెట్టుకుంటారని కూడా చెప్పాను. రాహుల్ గాంధీ నన్ను పక్కకి పిలిచి ఓ మాట చెబుతాను వింటావా అని అడిగారు. మీకు ఎవరిపై అయిన కోపం ఉంటే మీడియా ముందు మాట్లాడకండి. ఢిల్లీకి వచ్చి నాతో మాట్లాడండి అన్నారు. ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ళ మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదు..రాజకీయంగా నాకు మనసులో ఓ కోరిక ఉంది. నాకు ఓ పొలిటికల్ డిజైన్ ఉంది. అది నవంబర్లో చెబుతా. ఈ మూడు నెలల కాలంలో రాజకీయంగా నాకు ఓ క్లారిటీ వస్తుంది. నాకు ఫ్యామిలీ కంటే పబ్లిక్, పాలిటిక్సే ముఖ్యం. నేను 24 గంటల పాటు పబ్లిక్, పాలిటిక్స్ గురించే ఆలోచిస్తా’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
‘నా వ్యాఖ్యల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను’
సాక్షి,ఢిల్లీ: లోక్సభలో తనకు మాట్లాడే అవకాశం లేదని తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, క్షమాపణలు చెప్పబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారు. బుధవారం రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యకు కేంద్రహోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలి. పోలీసులు మేకులున్న లాఠీలతో విద్యార్థులను చావబాదారు. పెల్లెట్ గన్ తగిలి ఓ యువకుడు కన్ను పోవాల్సిన పరిస్థితి వచ్చింది.మహిళలు, మైనర్లపై కూడా దాడులు చేశారు. పోలీసులకు అమిత్షా ఆదేశాలైనా ఇచ్చి ఉండాలి.. ఆయనకు తెలియకుండా జరిగుండాలి’అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీల నిరసనల సందర్భంలో, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల కాల్పులు, లాఠీఛార్జీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అమిత్ షా ఆదేశాలు ఇచ్చారనడానికి రాహుల్ గాంధీ దగ్గర ఏవైనా రాతపూర్వక ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని, లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు సభకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని, అలాంటప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. -
పొన్నూరులో టీడీపీకి భారీ షాక్
సాక్షి, తాడేపల్లి: పొన్నూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మండవ గౌతమ్, మండవ లక్ష్మీ నీరజ బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వారు వైఎస్సార్సీపీలో చేరారు.ఈ సందర్భంగా మండవ గౌతమ్, మండవ లక్ష్మీ నీరజలను వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సమర్థంగా, అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ ప్రస్థానం తమను ఎంతగానో ఆకర్షించాయని మండవ గౌతమ్, మండవ లక్ష్మీ నీరజ వెల్లడించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. మండవ గౌతమ్ పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడిగా, నియోజకవర్గ టీడీపీ బూత్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. సుదీర్ఘకాలం సొసైటీ అధ్యక్షుడిగా, పొన్నూరు మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మండవ లక్ష్మీ నీరజ టీడీపీ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీపై పోటీ చేశారు.ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతోపాటు స్థానిక పార్టీ నాయకులు గుంటుపల్లి అంజయ్య, వేజండ్ల శివకృష్ణ, నూతలపాటి కృష్ణ, కిలారి రమేష్, త్రిపురనేని వెంకటస్వామి, రావిపాటి పవన్, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం చేసింది. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న అన్ని జిల్లాల కలెక్టర్లకు వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రాలు సమర్పించనున్నారు. వచ్చే నెల ఆగస్టు 3, 4 తేదీలలో అన్ని నియోజకవర్గాలోనూ టౌన్ హాలు సమావేశాలు నిర్వహించడంతో పాటు 6 నుండి 9 వరకు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. 10న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని తెలిపారు.కాగా, మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిన్న (మంగళవారం) పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు.ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కదంతొక్కారు. డీఎస్సీలో అక్రమాలపై కళ్ల ముందే ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులను దగాకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. -
డీఎస్సీలో అక్రమాలు.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
సాక్షి, తాడేపల్లి: విద్యాశాఖను భ్రష్టు పట్టించడానికే నారా లోకేష్.. విద్యాశాఖను వాడుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటలు కోటలు దాటుతున్నాయి.. లోకేష్ విద్యాశాఖను తప్పితే అన్ని శాఖలను పట్టించుకుంటారు’’ అంటూ దుయ్యబట్టారు.‘‘ఎస్ఈఆర్టీ కన్వీనర్, డీఎస్సీ కన్వీనర్ ఒక్కరే!. పరీక్ష పేపర్ తయారీ హెడ్, పరీక్ష నిర్వహించే హెడ్ ఒక్కరే. డీఎస్సీలో పారదర్శకతకు నారా లోకేష్ పాతరేశారు. ఎస్ఈఆర్టీ ఉన్న వ్యక్తులే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అత్యంత గోప్యంగా జరగాల్సిన వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో డీఎస్సీ ప్రశ్నపత్రం అప్లోడ్ చేయించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కి టాప్ ర్యాంక్ వచ్చింది. నవీన్ని టాపర్గా ప్రకటించి మళ్ళీ లిస్ట్లో మార్పులు చేశారు. నవీన్ని ఎందుకు తీసేసారో సమాధానం చెప్పాలి’ అని పేర్ని నాని నిలదీశారు.‘‘పేపర్ లీక్ అయ్యిందని ఒప్పుకున్నట్టే కదా?. లీకేజీని కప్పి పెట్టడానికే నవీన్ పేరు తొలగించారు. బరితెగించి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీ, టెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్ ముందురోజు 4, 47 జీవోలను తెచ్చారు. అర్హత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తే పిల్లలు భవిష్యత్ ఏమవ్వాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చిన టీచర్లతో లోకేష్ కొడుక్కి పాఠాలు చెప్పించగలరా..?. నారా లోకేష్కి దమ్ముంటే దేవాన్స్కి ఈ టీచర్లతో పాఠాలు చెప్పించాలని ఛాలెంజ్ చేస్తున్నా. డీఎస్సీ అయిపోగానే మళ్ళీ జీవో మార్చేశారు. ఇక మీదట స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాస్తేనే ఉద్యోగం ఇస్తాం అని మార్చారు. డీఎస్సీలో అక్రమాలకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.?‘‘ఐఏఎస్ అధికారులు కొందరు సిగ్గులేకుండా తప్పులు చేసినోళ్లకు వంత పాడుతున్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బ్రిడ్జ్ అనేది పేకాట కాదా..?. జోకర్ లేకుండా ఆడే పేకాట బ్రిడ్జ్ కాదా..?. దానికి ఉద్యోగం ఇస్తామన్నది వాస్తవం కాదా?. ఆ విమర్శ చేశానని నా మీద కేసు పెడతారా..?. కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజులు వస్తాయి. పోస్టులు అమ్ముకుంటు బేరాల వీడియోలు బయటకొచ్చినా సమగ్ర విచారణ జరపలేదు. డీఎస్సీలో అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం. జిల్లా కలెక్టర్ల కు 31 న వినతిపత్రాలు ఇస్తాం. వచ్చే నెల 6 నుండి 9 వరకు 4 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహారదీక్షలు చేస్తాం. ఆగస్టు 10 అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగ భృతి విడుదల చేయాలని కోరతాం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. -
జనసేన పార్టీ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులను పవన్ కల్యాణ్ రద్దు చేశారు. పార్టీ నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరు టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని పవన్ ఆదేశించారు. నూతన కమిటీలు ప్రకటించే వరకు మీడియాలో జనసేన పార్టీ పేరుతో పాల్గొనవద్దంటూ జనసేన పేర్కొంది. నూతన కమిటీ నియామకం తర్వాతే టీవీ డిబేట్లలో పాల్గొనాలని పేర్కొన్న పవన్ కల్యాణ్.. మీడియాలో జనసేన పేరు వాడకూడదంటూ ఆదేశాలు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. -
ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: చేయనిది చెప్పుకోవడం.. వేరొకరు చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ రాజకీయ క్రెడిట్ వార్లో భాగంగా.. ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్పోర్ట్ పునాది నుంచి నిధుల కేటాయింపుల దాకా అప్పటి జగన్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు.బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ధర్మాన.. భోగాపురం ఎయిర్పోర్ట్పై కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపై స్పందించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందించిందని, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు.భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన కీలక అనుమతులను వైఎస్ జగన్ హయాంలోనే సాధించామని ధర్మాన తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేసి, నిర్మాణానికి అనుకూల వాతావరణం కల్పించామని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ కోసం జగన్ ప్రభుత్వం రూ.1200 కోట్ల నిధులు కేటాయించిందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు.జగన్ ప్రభుత్వం వేసిన పునాదులే ఇవిభోగాపురం ఎయిర్పోర్ట్ను తామే పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని ధర్మాన విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని అన్నారు. "భోగాపురం ఎయిర్పోర్ట్కు జగన్ ప్రభుత్వం పునాది వేసింది. అవసరమైన అనుమతులు, సదుపాయాలు, నిధుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది" అని ధర్మాన పేర్కొన్నారు.భోగాపురంపై కొనసాగుతున్న క్రెడిట్ ఫైట్ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక ప్రాజెక్టుగా నిలిచిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. వైఎస్ జగన్ హయాంలోనే ప్రాజెక్టు వేగం పుంజుకుందని వైఎస్సార్సీపీ చెబుతుండగా.. కూటమి ప్రభుత్వం అదంతా తమ క్రెడిటేనంటూ సోషల్ మీడియాలో ఉత్త ప్రచారం చేసుకుంటోంది. కీలక వ్యాఖ్యలుఉత్తరాంధ్ర నిధులను అమరావతికి ఖర్చు పెడుతున్నారు. ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా అమరావతిలో పెట్టుబడుతు పెడుతున్నారు. చంద్రబాబు విధానాలతో మళ్లీ విభజన వాదం బలపడే పరిస్థితులు వచ్చాయి. మరో రాష్ట్ర విభజన డిమాండ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. -
డిప్యూటీ సీఎంగా సౌమ్య అన్బుమణి?
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమని , ఎమ్మెల్యే సౌమ్య మంత్రి కానున్నారన్న చర్చ ఊపందుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలోకి నలుగురు ఎమ్మెల్యేల్ని కలిగిన పీఎంకే చేరబోతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. టీవీకేతో ఇటీవల కాలంలో పీఎంకే సన్నిహితంగా ఉంటూ వస్తోంది. తాజాగా పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు, అధికారాలు అన్బుమణికి ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు అప్పగించేశారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడేందుకు పీఎంకే సిద్ధమవుతున్నట్టు చర్చ ఊపందుకుంది. అదే సమయంలో సౌమ్య అన్బుమనికి మంత్రి పదవి అప్పగించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం సీఎం విజయ్ మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్టు ఇప్పటికే చర్చజోరుగా సాగుతుండటం గమనార్హం. -
‘గూగుల్లో వెతికా.. ఎంత పనికిమాలినోడివో!’
జెన్-జీ నిరసనలపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో ఉన్న బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. తాజాగా సీజీపీ (Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను విమర్శించిన సౌరవ్ దాస్కు కౌంటర్గా.. అతడిని ‘‘పనికిమాలినోడు, ఉద్యోగం లేనివాడు’’ అంటూ మండిపడ్డారు. తన కెరీర్ విజయాలను ప్రస్తావిస్తూ విమర్శలకు బదులిచ్చారు.సౌరవ్ దాస్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కంగనా.. ‘‘గూగుల్లో ఈ వ్యక్తి గురించి వెతికాను. అతడి వయసు 28 ఏళ్లు. అతనో పనికిమాలినోడు అని అర్థమైంది. అలాంటి వ్యక్తి తనను తాను విద్యార్థి అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే కావచ్చు. కానీ ప్రజా జీవితంలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. అతడి వయసులోనే నేను రెండు జాతీయ అవార్డులు సాధించాను’’ అని పేర్కొన్నారు.నటిగా, ఎంపీగా నా ప్రయాణం వేరుతాను కేవలం రాజకీయ నాయకురాలిని మాత్రమే కాదని కంగనా అన్నారు. నటిగా, చిత్ర నిర్మాతగా, స్క్రీన్రైటర్గా, వ్యాపారవేత్తగా కూడా తన ప్రయాణం కొనసాగిందని తెలిపారు. ‘‘కొత్త ఎంపీగా బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో ఒత్తిడి ఎదురైంది. ఎందుకంటే నేను ఫిల్మ్మేకర్, పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, నిర్మాత, రచయిత్రి, వ్యాపారవేత్తగా కూడా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. ఎప్పుడూ డిమాండ్లో ఉండటం అంటే ఏమిటో సౌరవ్ దాస్ లాంటి వారు అర్థం చేసుకోలేరంటూ విమర్శించారు.‘ముందు నైపుణ్యం నేర్చుకో’సౌరవ్ దాస్ను ఉద్దేశించి కంగనా మరింత ఘాటుగా స్పందించారు. ‘‘నీ సమస్యలు వ్యక్తిగతమైనవి. నువ్వు విద్యార్థివి కాదు. నువ్వు కేవలం పనికిమాలిన వ్యక్తివి. ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు’’ అంటూ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.జెన్-జీ నిరసనలపై కంగనా వ్యాఖ్యలునీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించిన కొన్ని వీడియోలపై కంగనా గతంలో తీవ్రంగా స్పందించారు. ‘‘నా జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడూ చూడలేదు. జెన్-జీ నిరసనకారుల రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయి. వారు మాట్లాడే విధానం, ఉపయోగించే భాష నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ విమర్శించారు. ‘‘ఇలాంటి వారిని ఎవరు కంటున్నారు? ఎవరు పెంచుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.విపక్షాల నుంచి తీవ్ర విమర్శలుకంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎంఐఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గఢీ స్పందిస్తూ.. జెన్-జీ యువత నుంచి కంగనాకు త్వరలోనే సమాధానం వస్తుందని అన్నారు. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా కంగన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందేందుకు ఒక మహిళా ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.సౌరవ్ దాస్ కౌంటర్కంగనా వ్యాఖ్యలకు ముందు సౌరవ్ దాస్ కూడా ఆమెపై విమర్శలు చేశారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘కంగనాను ఆమె సొంత పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోరు. ఆమెను సీరియస్గా తీసుకోనప్పుడు మేమెందుకు తీసుకోవాలి?’’ అని అన్నారు. జెన్-జీ, జెన్ ఆల్ఫా తరాలు కంగనా వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ‘‘జెన్-జీ ఈ దేశానికి మీకంటే ఎక్కువ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యంపై మళ్లీ నమ్మకం కలిగించే పని యువత చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనలతో మొదలైన వివాదంనీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో సీజీపీ కీలక పాత్ర పోషించింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఆందోళనల తర్వాత కేంద్రం కొన్ని డిమాండ్లను అంగీకరించింది. బాధిత కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పరిణామాల తర్వాత అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశమైంది.కొనసాగుతున్న మాటల యుద్ధంనిరసనలు ముగిసినా.. కంగనా, సీజీపీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఒకవైపు కంగనా నిరసనకారుల తీరును ప్రశ్నిస్తుండగా.. మరోవైపు సీజీపీ నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా సౌరవ్ దాస్పై కంగనా చేసిన ఘాటు వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. -
హైడ్రా ఒక వేట కుక్క
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి హైడ్రా ఒక వేట కుక్కలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ఆ వేట కుక్కను పంపించి, దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హైడ్రా ద్వారా బడా బాబులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారని, ఆ డబ్బులో కొంత వాటా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాం«దీకి, మరికొంత వాటా బీజేపీకి ఇస్తున్నారని ఆరోపించారు. ‘హైడ్రా అనేది తొమ్మిది తలల విషసర్పం అని హైకోర్టే చెప్పింది.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతకంటే చెంపపెట్టు ఏముంటుంది? సీఎంకు సిగ్గుండాలి..’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘హైడ్రా అనేది నువ్వు చెప్పినట్టు సంస్కరణ అయితే, మీ అన్న తిరుపతిరెడ్డి ఇల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుల ఇళ్లు ఎందుకు కూల్చడం లేదు?..’అని నిలదీశారు. కేటీఆర్ మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జగదీశ్వర్రెడ్డి, ఎంపీ దామోదరరావులతో కలసి రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ వద్దిరాజు నివాసంలో అందరితో కలిసి మీడియాతో మాట్లాడారు. నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు ‘హైడ్రాపై 65 సార్లు హైకోర్టు చెప్పినా వినవా? ఇంకా ఎవరు చెప్తే వింటావ్? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లర్ అనుకొని, హిట్లర్కు ఇష్టమైన పదం ‘‘హైడ్రా’’ఐ డిమాలిíÙంగ్ ఎవ్రీథింగ్, ఇరాన్, ఇజ్రాయెల్ మాదిరిగానే ఉంటాను అంటావా? హైదరాబాద్ను శిథిలావస్థలోకి తీసుకునిపోతావా?ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? మమ్మల్ని కబ్జాకోరులు అని అంటున్నావ్. మేం కాదు ..నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు. అందరికంటే ఎక్కువ ఆస్తి దోచుకుంటున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులే.హైకోర్టు చెప్పి 24 గంటలైనా ఇంకా రంగనాథ్ను కొనసాగించొచ్చా? మా హయాంలో ఉన్న ‘ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్’(ఈవీడీఎం) పేరు మార్చి, అన్నిటికీ రంగులేసినట్టు, సున్నాలేసినట్టు దీనికి కూడా వేసి పోజులు కొట్టడం తప్ప పీకిందేమీ లేదు. కేవలం దాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్రెడ్డి అతిపెద్ద బ్లాక్ మెయిలర్గా మారారు. వాస్తవానికి అధికారంలోకి రాకముందే పెద్ద బ్లాక్ మెయిలర్. ఆర్టీఐని అడ్డం పెట్టుకొని బతికినోడు. ఇప్పుడు హైడ్రాని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాడు..’అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీ రహస్య మిత్రులు బీజేపీ వాళ్లే.. రేవంత్ ఢిల్లీలో ఉన్నప్పుడే కేటీఆర్ కూడా ఉంటున్నారంటూ బీజేపీ ఎంపీ «ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్రెడ్డి కేసులు పెట్టేది మా మీద. తెల్లారి లేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్రెడ్డి రహస్య మిత్రులు బీజేపీ వాళ్లని రాష్ట్రంలో అందరికీ తెలుసు. కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకుని 9 రోజులు అరెస్టు చేయకుండా కాపాడింది రేవంత్రెడ్డే అనే విషయం అందరికీ తెలుసు. అమృత్ పథకంలో రేవంత్రెడ్డి బావమరిదికి కాంట్రాక్టులు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు. సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే, అక్కడ సృజన్రెడ్డి నాయకత్వంలో, రేవంత్రెడ్డి బావమరిది నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే, మేము వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2014లో కూడా బకాయిలున్నాయి.. ‘మేము అధికారంలోకి వచి్చనప్పుడు 2014లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.4 వేల కోట్లు ఉన్నాయి. వాటిని మేం చెల్లించలేదా? బకాయిలు అనేది నిరంతర ప్రక్రియ..’అని కేటీఆర్ వివరణ ఇచ్చారు. ‘చెల్లని నాణేనికి గీతలు ఎక్కువ, చేతగానోడికి మాటలు ఎక్కువ..’అంటూ ఎద్దేవా చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాల పునరి్వభజన చేపట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావాలంటే లోక్సభ స్థానాల కంటే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే స్థానాలను పెంచాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చే సంస్కరణలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, అయితే కొత్త బిల్లులు తెచ్చేముందు గతంలో నియమించిన కమిటీల సిఫార్సుల అమలుపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే డివిజన్, వరంగల్లో ఏఐ సెంటర్ కాజీపేటలో ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. కొత్తగూడెం రైల్వే డివిజన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, సిరిసిల్ల, వేములవాడ స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో చేర్చాలని కోరామన్నారు. వరంగల్లో ఇండియా ఏఐ సెంటర్ లేదా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటుచేయాలని, కరీంనగర్ లేదా ఖమ్మంలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎస్టీపీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. -
కదంతొక్కిన యువజనం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కదంతొక్కారు. డీఎస్సీలో అక్రమాలపై కళ్ల ముందే ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులను దగాకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. టెట్, డీఎస్సీ రాత పరీక్ష లేకుండా ఏకంగా జీవోలు జారీ చేసి, తమ వారికి దొడ్డి దారిన ఉద్యోగాలు కట్టబెట్టడం అత్యంత దుర్మార్గమని నిప్పులు చెరిగారు. అర్హులను పక్కనపెట్టి, డిగ్రీలు లేని వారికి సైతం ఉద్యోగాలివ్వడం బరితెగింపునకు పరాకాష్ట అని.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి బకాయిలతో సహా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రీతిలోనే డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలుచోట్ల పోలీసులు ర్యాలీలను అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. అందరి నోట అదే డిమాండ్ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్ని జిల్లా కేంద్రాలు మంగళవారం యువత ప్లకార్డులతో నిర్వహించిన ర్యాలీలతో హోరెత్తాయి. పలు చోట్ల వైఎస్సార్సీపీ నేతలను, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్ల ముందస్తు అరెస్ట్లు చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేశారనీ, మీరెప్పుడు చేస్తారని లోకేశ్ను నేతలు సూటిగా ప్రశ్నించారు. గుంటూరులో నిరుద్యోగుల బాధలను స్కిట్ రూపంలో ప్రదర్శించారు. రాజమండ్రిలో పోలీసులు అడ్డుకోవడంతో నేతలు, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసుల వలయాన్ని దాటుకుని ర్యాలీ కొనసాగించారు. శ్రీకాకుళంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్.. మహిళలు, నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని.. మంత్రి లోకేశ్ రాజీనామా చేసేంత వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు. -
నెటిజన్ల ఫైర్.. ఎన్టీఆర్ గాయాలపై స్పందించని చంద్రబాబు, లోకేశ్
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల గాయాలపాలయ్యారు. తన భుజానికి గాయం తగలడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. దాంతో వైద్యులు ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.అయితే ఈ ఘటనపై ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఈ విషయం ప్రస్తుతం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. కానీ ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ లీడర్ ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ వెంటనే ట్వీట్లు చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ గాయాలపై మాత్రం మౌనం వహించడంతో వారికి మానవత్వం లేదా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులపై చూపిన ప్రేమాభిమానాల్లో కనీసం పదో వంతు కూడా అత్యంత దగ్గరి బంధువైన ఎన్టీఆర్పై చూపలేదని చంద్రబాబు, లోకేశ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘సీబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?’
తాడేపల్లి : పరీక్షలు రాయకపోయినా టీడీపీ సభ్యత్వం ఉంటే చాలన్నట్టు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఏపీలోనే చూస్తున్నామని ధ్వజమెత్తారు. ఈరోజు(మంగళవారం, జూలై 28వ తేదీ) ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలతో చంద్రబాబు ప్రభుత్వం కూసాలు కదిలాయాన్నారు. డీఎస్సీ అక్రమాలపై గట్టిగా ఉద్యమించామని, పోలీసుల అడ్డంకులను అధిగమించి మరీ పోరాడామన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..‘డీఎస్సీలో అర్హులకు అన్యాయం జరిగింది. అందుకే ఈ నిరసన ర్యాలీలు చేపట్టాం. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు తెచ్చుకున్న వారికీ ఉద్యోగాలు ఇచ్చారు. పరీక్షలు రాయకపోయినా టీడీపీ సభ్యత్వం ఉంటే చాలన్నట్టు ఉద్యోగాలు ఇచ్చారు. ఇలాంటి దిక్కు మాలిన ప్రభుత్వాన్ని ఏపీలోనే చూస్తున్నాం. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేదా?, సక్రమంగా ఉద్యోగాలు ఇస్తే సీబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?నారా లోకేష్ ఉత్తర ప్రగల్భాలు పలకడం తప్ప చేసిందేమీ లేదు. జగన్తో చర్చించే స్థాయి నారా లోకేష్కు లేదు. లోకేష్తో చర్చకు మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు చాలు. డేట్, ప్లేస్, టైం చెబితే చర్చకు మేము రెడీ. నీట్ పేపర్ లీకైన కేసులో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అలాగే నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
సీఎంగా విజయ్.. తమిళ హీరోలు ఇలా బయటపడుతున్నారేంటి?
రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నటీనటులు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, విజయ్ లాంటి వాళ్లు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు. అయితే హీరో విజయ్.. తమిళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈయన కొన్ని సీట్లు గెలిస్తే గొప్ప అనుకున్నారు. కానీ సీఎం అయ్యేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఈయనకు అధికారం రావడం మాటేమో గానీ తమిళ హీరోలు ఒకరి తర్వాత రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని బయటపెడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి విశాల్ చేరిపోయాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా.. తెలుగులోనూ)రీసెంట్ టైంలో కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ తనకున్న రాజకీయ ఆసక్తిని బయటపెట్టేలా మాట్లాడగా.. హీరో ధనుష్ ఏకంగా పెద్ద సభని ఏర్పాటు చేశాడు. తాజాగా విశాల్ కూడా ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తాను సొంతం చేసుకున్న మంచి పేరును ప్రజా సేవకు ఉపయోగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా. మీరు చూపిన అభిమానానికి.. మీకు తిరిగి ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నా. ఇకపై నా ప్రయాణం సాధారణంగా ఉండదు. ఎలాంటి అడ్డదారులు లేకుండా నేరుగా, నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నా. ఆ మార్గంలో ప్రయాణిస్తూ అన్ని రంగాల్లో మీకు అండగా ఉంటానని విశాల్ అన్నాడు. దీంతో ఈ హీరో కూడా త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఇస్తారని మాట్లాడుకుంటున్నారు.అయితే విజయ్కి కలిసొచ్చినట్లు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మిగతా తమిళ హీరోలకు పరిస్థితులు కలిసొస్తాయా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే విజయ్కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. ధనుష్, విశాల్ లాంటి హీరోలకు ఉన్న అభిమాన గణం వేరు. చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లోకి చాలామంది హీరోలు వచ్చేలా కనిపిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: రామ్ చరణ్కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)#Vishal 🔥 pic.twitter.com/L6gFlHmgab— Cine World Entertainment 🌍 (@CineWorldEnt) July 28, 2026 -
కంగనా రనౌత్లా మారిన సాయోని ఘోష్ : ఏకిపారేస్తున్న నెటిజన్లు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా, మమతకు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన టీఎంసీ ఎంపీ, నటి సాయోని ఘోష్ (Saayoni Ghosh), రెబల్ వర్గంలోకి చేరిన తరువాత మరింతగా వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీపై తీవ్ర విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సాయోని ఘోష్ తాజాగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సీజేపీ ఆందోళన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్రప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన "పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026" (పేపర్ లీకేజీల నిరోధక బిల్లు)కి మద్దతుగా కేంద్రానికి మద్దతుగా గళమెత్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చకు కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రతిపాదన వక్తగా ఎంపిక చేసింది.ఈ సందర్బంగా లోక్సభలో విపక్షాల ఆందోళనల మధ్య బిల్లుపై చర్చ ఆగిపోవడంపై సాయోని ఘోష్ మండిపడ్డారు. మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా విపక్షాలు చర్చ నుంచి పారిపోతున్నారంటూ విమర్శించారు. సభలో ప్రతి నిమిషం చాలా విలువైంది. దేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఈ కొత్త బిల్లులోని సంస్కరణల గురించి తెలిసే హక్కు ఉందన్నారు. పార్లమెంట్ అనేది రాజకీయ ఘర్షణలకు వేదిక కాకూడదని, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో సమిష్టి చర్చలు జరగాలని ఆమె పిలుపునిచ్చారు. విపక్షాలు కేవలం రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.She was an intellectual, gave brilliant speeches when she was in TMCAs soon as she flipped and became “ Chaddi” , she started sounding like Kangana Ranaut.Aak Thoo @sayani06 , ashamed to have ever praised you. pic.twitter.com/QuINjM4UPR— Roshan Rai (@RoshanKrRaii) July 27, 2026 2024 లోక్సభ ఎన్నికల్లో జాదవ్పూర్ నుంచి గెలిచిన సాయోని, పార్లమెంట్లో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడేవారు. తాము రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని పోరాడతాం.. చేతుల్లో కత్తులు పట్టుకుని కాదంటూ చేసిన వ్యాఖ్యలు గతంలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్డీఏ మద్దతు దారుగా ఇప్పుడు అదే సాయోని ఘోష్, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగా సమర్థిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడటం గమనార్హం.నెటిజన్లు స్పందనఆమె తాజా కామెంట్లపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ప్రవర్తన బీజేపీ గురించేకాదు ఆమె వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెబుతోందని , అసలు నైతిక విలువలే లేవని మండిపడ్డారు. ఇలాంటి నీచమైన వారిని మమతా బెనర్జీ పెంచి పోషించారని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులుఆమె ఎప్పుడూ అలాగే ఉంటుంది! తన పార్టీకి సంబంధించి తనకు ఉన్న ప్రస్తుత అవగాహన సరైనదని ఆమె నిజంగా నమ్మితే, ఆమె ఆలోచన సరైనదే కావచ్చు. కానీ అందుకు ఆమెకు అత్యున్నత స్థాయి నిజాయితీ, చిత్తశుద్ధి అవసరమన్నారు మరొకరు. టీఎంసీ ఎంపీగా గెలిచి, ఇపుడు వ్యతిరేకంగా మారడం మీనియోజకవర్గ ప్రజలు పన్ను చెల్లింపుదారులకు , ఓటర్లకు చేసిన ద్రోహం అని ఒకరు కామెంట్ చేశారు. అంతేకాదు ఆమె 12వ తరగతి అతి కష్టమ్మీద పాస్ అయ్యింది, ఆమె మాటల్లో దూకుడు ఉండేది కానీ, ఆమె మేధావి కాదు అని మరొకరు మండిపడ్డారు. ఇదీ చదవండి: షాకింగ్ : భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్!ఆమెకు, ఆమె లాంటి వారికి ఎలాంటి చిత్తశుద్ధి గానీ, వ్యక్తిత్వం గానీ లేవు. సిగ్గులేని అవకాశవాదులు. పార్టీ మారిన వెంటనే ఆమె భావజాలం, సూత్రాలు అన్నీ మారిపోయాయా? బహుశా ఆమెకు మొదట్నుంచే ఎలాంటి బలమైన నమ్మకాలు లేవేమో. లేకపోతే అంత తీవ్రంగా తన ఆత్మను ఎలా అమ్ముకోగలరు? మీలాంటి భజనపరులను 'ద్రోహులు' (ధోకేబాజ్) అంటారు.చాలా మంది అవకాశవాదులు మమత పని అయిపోయిందని భావిస్తున్నారు. ఆమె విధానాలు లేదా కొన్ని వర్గాల పట్ల ఆమె అనుసరించే ధోరణితో విభేదాలు ఉండవచ్చు, కానీ బెంగాల్ కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్నప్పుడే మమత తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే, ఆమె సొంత పార్టీవారే ఆమెకు ఎలా ద్రోహం చేశారో ప్రజలు గుర్తుంచు కుంటారన్నారు మరొకరు.అంత గొప్పవారైతే, రాజీనామా చేసి బీజేపీ టికెట్పై మళ్లీ ఎన్నికై ఉండాల్సింది అని ఒకరంటే, నిజానికి ఆమె ఒక పరిణతి చెందిన నటి. అప్పుడు నటించింది, ఇప్పుడు కూడా నటిస్తోంది. ఆమెకు కేవలం సరదాగా గడపాలని మాత్రమే ఉందనంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.కాగా ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో TMC ఘోర పరాజయం పాలైన తర్వాత, మమతా బెనర్జీపై తిరుగు బాటు చేసి ఆమె పార్టీని వీడారు. ఆ తర్వాత ఆమె కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP/NCPI)లో చేరి, ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకి మద్దతుదారుగా మారారు. -
వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీల విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం
తాడేపల్లి : డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలపై వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీల విజయవంతంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ బారీగా జరిగిన నిరసన ప్రదర్శనపై వీడియోను పోస్టు చేశారు వైఎస్ జగన్.‘చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసిందన్నారు. విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతమయ్యాయని, డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపైన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వ.. డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తా ఉన్నా సీఎం చంద్రబాబు కానీ, విద్యాశాఖమంత్రి లోకేష్ కానీ ఇప్పటివరకూ వాటిమీద నోరుమెదపలేదు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన… pic.twitter.com/C0ZpLL2hC3— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2026ఇదీ చదవండి: ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలుదగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం (ఫొటోలు) -
‘జరిగిందే మాట్లాడాను’.. త్రిసభ్య కమిటీ ముందు ఎమ్మెల్యే బోండా ఉమా
సాక్షి,అమరావతి: కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై, అక్కడ చేసిన వ్యాఖ్యల విషయమై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. సంస్మరణ సభలో వైఎస్సార్సీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడం, అలాగే ముద్రగడ పద్మనాభం చేసిన కాపు ఉద్యమం వల్లే టీడీపీ ఓడిపోయిందంటూ బొండా ఉమా చేసిన కామెంట్లు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై బొండా ఉమా నుంచి వివరణ సేకరించాల్సిందిగా పార్టీకి చెందిన త్రిసభ్య (త్రీమెన్) కమిటీని ఆదేశించారు.ఈ నేపథ్యంలో పార్టీ నోటీసుల మేరకు టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు హాజరైన బొండా ఉమా.. తాను జరిగిన వాస్తవమే మాట్లాడానని, అందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. సంస్మరణ సభలో మాట్లాడిన మాటలకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని త్రిసభ్య కమిటీ ఎదుట ఆయన గట్టిగా తన వాదనను వినిపించారు. తాను ఎటువంటి తప్పుడు ప్రకటనలు చేయలేదని, జరిగిన వాస్తవ పరిస్థితులనే ప్రస్తావించానని వెల్లడించారు. -
కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చింది. కంగనా వ్యాఖ్యలను ఆమె పార్టీ కూడా సీరియస్గా తీసుకోదని సౌరవ్ దాస్ అన్నారు. నేతలు ఉపయోగించే భాష గౌరవప్రదంగా ఉండాలని కోరారు. దేశ ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా జెన్జీ చేసింది.అంతకుముందు సీజేపీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసన వీడియోలు వాంతి వచ్చేలా ఉన్నాయని సోషల్ మీడియా పోస్టులో అన్నారు. కాక్రోచెస్ మాట్లాడే విధానం,వాడుతున్న భాష అసభ్యంగా ఉన్నాయి. 75ఏళ్ల ప్రధాని, ఆయన తల్లిపైనా నోరుపారేసుకున్నారు. అలా మాట్లాడే వారిని ఏ కోణంలో విద్యార్థులుగా చూడాలి’అని పోస్టులో పేర్కొంది. కంగనా చేసిన వ్యాఖ్యలపై సీజేపీ పైవిధంగా స్పందించింది. -
ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ఈ లేఖలో కోరారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు మురుగునీటి నిల్వ/డ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆ సమాధానం ఇచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి మాట్లాడుతూ, కావేరీ నదిపై ఏదైనా నిర్మాణాన్ని చేపట్టే ముందు కర్ణాటక రాష్ట్రం ఇతర దిగువ రాష్ట్రాల (తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పులో స్పష్టంగా ఎక్కడా పేర్కొనలేదని సమాధానమిచ్చారు.అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సమాధానం తీవ్ర నిరాశకు గురిచేసిందని సీఎం విజయ్ పేర్కొన్నారు. అంతరాష్ట్ర నీటి వివాదాలలో ఇప్పటికే స్థిరపడిన చట్టాలు మరియు చట్టపరమైన సూత్రాలను పరిశీలించకుండానే కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారని విజయ్ విమర్శించారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరిగిన ఆలమట్టి డ్యామ్ వివాదంలో, దిగువన ఉండే రాష్ట్రం యొక్క అనుమతి ఖచ్చితంగా అవసరమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.కావేరీ నీటి వివాదాల ట్రిబ్యునల్ అవార్డు, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఉంటే తప్ప, మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుకు ఎటువంటి పరిపాలనాపరమైన లేదా చట్టపరమైన అనుమతులు మంజూరు చేయకుండా చూడాలని సీఎం విజయ్ ప్రధానమంత్రిని కోరారు. అలాగే, 2018లో సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ తీర్పును సమర్థించినప్పుడు, రాష్ట్రాలు తమ పరిధిలోని నీటిని ట్రిబ్యునల్ ఆదేశాలకు లోబడి మాత్రమే నియంత్రించుకోవచ్చని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.గతంలో కేరళకు చెందిన పాంబార్ హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విషయంలో కూడా దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉమ్మడి ఒప్పందాలు అవసరమని ట్రిబ్యునల్ పేర్కొన్న విషయాన్ని విజయ్ గుర్తు చేశారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యసభలో ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని, దిగువ రాష్ట్రాల హక్కులను రక్షించాలని ఈ ప్రాజెక్టుపై సమగ్ర చట్టపరమైన, సాంకేతిక పరిశీలన జరపాలని డిమాండ్ చేశారు. -
‘లోకేష్.. చాలెంజ్ చేసి పారిపోవడం సిగ్గుచేటు’
తాడేపల్లి : ఏపీ మంత్రి నారా లోకేష్వి ఉత్తర కుమార ప్రగల్భాలని, చాలెంజ్ చేసి పారిపోవడం ఆయనే చెల్లిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధథి పుత్తా శివశంకర్ విమర్శించారు. నాలుగు గోడల మధ్య కూర్చుని ప్రగల్భాలు పలకడం నిజంగా సిగ్గుచేటన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగినందునే భయంతో సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం, జూలై 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్.. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేశారని, అదే ఎన్డీయేలో భాగమైన టీడీపీ మంత్రి డీఎస్సీ అక్రమాలపై ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ‘నారా లోకేష్ వ్యవహార శైలిపై జెన్ జీ ఆగ్రహంతో ఉంది. అందుకే ఈరోజు మా పార్టీ నిర్వహించిన నిరసనల్లో జెన్ జీ పెద్ద ఎత్తున పాల్గొంది. జెన్ జీ రెస్పాన్స్ చూసి టీటీడీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ఆధారలతో సహా బయట పెట్టారు. ఆయన వేసిన ప్రశ్నలకు ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలేకపోయారు. నారా లోకేష్ ఉత్తరకుమార ప్రగల్భాలు తప్ప సరైన సమాధానమే చెప్పలేదు. డీఎస్సీలో అక్రమాలు జరిగినందునే నారా లోకేష్ తోక ముడిచారు. జగన్కు ఛాలెంజ్ చేసే స్థాయి లోకేష్కి లేదు. లోకేష్కు మా పార్టీ అధికార ప్రతినిధులు చాలు. మే8వ తేదీన నారా లోకేష్కు పేర్ని నాని ఓపెన్ చాలెంజ్ చేశారు. అయినా సరే లోకేష్ స్పందించలేదు. ఇప్పటికైనా లోకేష్ స్పందించి పేర్ని నానితో చర్చకు రావాలి.. లేదంటే జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
నీలేకనికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి.. ఎందుకంటే!
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ముఖం లేని సంపన్నుడు (ఫేస్లెస్ బిలియనీర్) అంటూ నీలేకనిపై గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్నారు. గతంలో విమర్శలు చేసిన వ్యక్తికి ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పజెప్పడం మోదీ రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని దుయ్యబట్టారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం మోదీ ఏమైనా చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు.''నందన్ నీలేకనికి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి. మీ రాజకీయాలకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకరిని 'ముఖం లేని బిలియనీర్' అని ముద్ర వేసి, మీ ప్రభుత్వం విఫలమైనప్పుడు అదే వ్యక్తికి భారతదేశ పరీక్షా విధానాన్ని సంస్కరించే బాధ్యతను అప్పగించలేరు. ఇది నందన్ నీలేకని సామర్థ్యాన్ని ప్రశ్నించడం గురించి కాదు, మేము ఎల్లప్పుడూ ఆయన సామర్థ్యాలను గుర్తించాము. ఇది రాజకీయ కపటత్వం, జవాబుదారీతనం గురించిన విషయం. మన నాయకులు స్థిరంగా ఉండాలి, దేశానికి సేవ చేసే వారిని గౌరవించాల''ని ఎక్స్లో హరిప్రసాద్ పేర్కొన్నారు.నీలేకణికి ముఖం వచ్చిందా? "ప్రధానిగారూ... ఇప్పుడు నందన్ నీలేకణికి ముఖం వచ్చిందా? లేక అప్పట్లో చేసిన ఆరోపణలే ఇప్పుడు అర్థరహితమయ్యాయా? ఆ ఆరోపణలు నిజమే అయితే కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఆయన చేతుల్లో ఎలా పెడుతున్నారు? అవి అబద్ధమైతే, బహిరంగ వేదికపై ఒక ప్రతిభావంతుడిని అవమానించినందుకు ఎప్పుడు క్షమాపణ చెబుతారు?" అని హరిప్రసాద్ ప్రశ్నించారు."ఇది నాయకత్వం కాదు. ప్రతిపక్షంతో ఉన్నారని దేశ ప్రతిభను అవమానించడం, తర్వాత తమ ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అదే ప్రతిభను ఆశ్రయించడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం. నందన్ నీలేకణి సామర్థ్యంపై మాకు ఎలాంటి సందేహం లేదు. ప్రశ్నించాల్సింది ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ నిబద్ధతనే" అని హరిప్రసాద్ విమర్శించారు.నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం రేపిన కలకలం నేపథ్యంలో పరీక్షల్లో సంస్కరణల కోసం హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నందన్ నీలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్ను నియమించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పటిష్ట, పారదర్శక పరీక్ష విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఈ టాస్క్ఫోర్స్ సూచనలు ఇస్తుందని వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో పరీక్షల విశ్వసనీయతను మరింత పెంచేలా చర్యలు చేపడతామన్నారు.చదవండి: ప్రధాని మోదీకి మాజీ ఐఏఎస్ వింత విజ్ఞప్తినందన్ నీలేకణి యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తొలి ఛైర్మన్గా పనిచేసి, ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ ఆధార్ రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, బీజేపీ నేత హెచ్ఎన్ అనంత్కుమార్ చేతిలో ఓడిపోయారు. -
ఈనెల 30న శ్రీకాకుళంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటనకు సిద్ధమయ్యారు. గురువారం (జులై30) శ్రీకాకుళం వెళ్లనున్న జగన్.. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు.సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా జగన్ ఆయనకు సంఘీభావం తెలిపేందుకు జైలుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణులకు ధైర్యం, భరోసా కల్పించడంతో పాటు.. కార్యకర్తలకు తాము అండగా ఉన్నామనే సందేశాన్ని జగన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అప్పలరాజు అరెస్టుపై వైఎస్సార్సీపీ ఆగ్రహంమాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పెట్టిన కేసు రాజకీయ కక్షతోనేనని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందని మండిపడుతున్నారు. యాక్సిడెంట్ కేసును.. హత్య కేసుగా మార్చడం, అందులో సీదిరిని ఏ3గా చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం పర్యటనపై ఆసక్తిజగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి అరెస్టు అంశంపై పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడంతో పాటు.. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకర్తలతోనూ ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
నారా లోకేష్కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణాజిల్లా: డిఫాక్టో సీఎం లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు కట్టిపెట్టాలంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే చర్చకురండని సవాల్ చేయడం కాదు.. చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్ వస్తారు. లోకేష్ చర్చకు వస్తే నేనే వస్తా’’ అంటూ ఆయన సవాల్ విసిరారు.‘‘విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెడతాడు. కంపెనీలు తెచ్చా, ఉద్యోగాలు కల్పించా అంటాడు. రెడ్ బుక్ రుచి చూశారా అంటాడు. చీమ చిటుక్కుమన్నా తనవల్లే అంటాడు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించడానికి వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడాడు. లోకేష్ మాటలు కోటలు దాటుతాయి. దేనికైనా సమవుజ్జీ కావాలి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచావ్. నీకు సత్తా ఉంటే డీఎస్సీ అక్రమాల పై నాతో చర్చకు రా. నీ వెంట తిరిగిన కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘పవిత్రమైన టీచర్ ఉద్యోగాల్లో పాపాలు చేశారు. ఈ డీఎస్సీ దిక్కుమాలిన డీఎస్సీ. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అన్ని పాత్రలు మీరే పోషిస్తారు. జిల్లా కలెక్టరేట్లలో ఎందుకు మెరిట్ లిస్ట్లు పెట్టలేకపోయారు. గోల్డ్ మెడల్ కొట్టినోడికి కాకుండా పాల్గొన్నవారికి పోస్టులు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్పై కోర్టు విచారణ చేయమని చెప్పింది. దమ్ముంటే విచారణ జరిపించండి. మీలో నిజాయితీ ఉంటే రాజీనామా చేయండి. మంత్రి పదవి కోసం బోండా ఉమా ముచ్చట పడుతున్నారు కదా. మీరు రాజీనామా చేసి ఇవ్వండి ఆయనకు మంత్రి పదవి’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
కాదంబరీ జత్వానీ కేసు.. కూటమి ప్రభుత్వానికి బూమరాంగ్ అయిందా?
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఎవరికైనా ఆందోళన కలిగిస్తాయి. శాంతిభద్రతల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష, కక్షపూరిత వైఖరివల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతున్నట్లు కనబడుతుంది. అందువల్లే కేంద్ర హోం శాఖ ఇచ్చిన నివేదికలో ఏపీకి 26వ ర్యాంకు వచ్చింది. ఒకప్పుడు ఏపీ పోలీసు శాఖకు మంచి పేరు ఉండేది. మొదటి ఐదు ర్యాంకులు సాధించిన రాష్ట్రాలలో ఏపీకి స్థానం లభించేది. అలాంటిది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన మొదలయ్యాక, రెడ్బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తున్నట్లుగా ఈ నివేదిక వల్ల అర్థం అవుతుంది.తాజా ఉదాహరణ మోసకారి నటిగా పేరొందిన కాదంబరి జత్వాని కేసును ప్రభుత్వం డీల్ చేసిన పద్దతిని తీసుకువచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఎలాగైనా గత జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న లక్ష్యంతో కూటమి పెద్దలు రకరకాల ప్లాన్లు వేశారు. అందులో పోలీసు శాఖను అడ్డు పెట్టుకుని పలు తప్పుడు కేసులు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి కక్షపూరితంగా వ్యవహరిస్తూ చట్టాన్ని తుంగలో తొక్కిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ అదే ధోరణిని ప్రభుత్వం కొనసాగిస్తోంది.జత్వాని కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు అనే డీజీపీ స్థాయి అధికారిని జైలులో పెట్టారు. కొద్దికాలం వైఎస్సార్సీపీలో పనిచేసి, తదుపరి రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యాపార వేత్త అయిన కుక్కల విద్యాసాగరరావు ఎక్కడో డెహ్రాడూన్లో ఉంటే అరెస్టు చేసి తీసుకువచ్చారు. జత్వానికి కూటమి ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. స్వయంగా హోం మంత్రి అనిత సంఘీబావం తెలిపారు. ఎల్లో మీడియా అయితే రెచ్చిపోయి, తామే శోధించామని చెబుతూ శరభ, శరభ అంటూ పూనకం వచ్చినట్లు గంతులేశాయి.జగన్ ప్రభుత్వంలో ఒక నటీని అక్రమంగా అరెస్టు చేశారని అభియోగం మోపుతూ, ఆమెను ముంబై నుంచి రప్పించి కేసు నమోదు చేసి ఐపీఎస్లను సస్సెండ్ చేసేవరకు వెళ్లారు. అసలు కేసేమిటి? ఈమె తనను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజుతున్నదని, ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని బెదిరిస్తున్నదని విద్యాసాగరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడం కదా. ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ వంటివారిని ముంబై, ఢిల్లీ వంటి నగరాలలో ఆ నటి బ్లాక్ మెయిల్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం తొలుత జిందాల్ను కూడా కేసులో ఇరికించాలని యత్నించింది. కారణం తెలియదు కాని, ఆ తర్వాత రోజుల్లో ఆయన జోలికి వెళ్లలేదు. బహుశా ఆయనతో రాజీ కుదుర్చుకుని ఉండవచ్చని ఎక్కువమంది భావిస్తున్నారు. స్వయంగా ఎల్లో మీడియానే ఈ తరహా వ్యాఖ్య చేయడం గమనార్హం.విద్యాసాగరరావు పెట్టిన కేసును పక్కనబెట్టి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు జత్వాని పక్షాన కొత్త కేసు పెట్టి కథ నడిపించారు. అన్యాయంగా జత్వానిని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జైలులో పెట్టారని, ఆమె తల్లిదండ్రులను కూడా వేధించారని ఎదురు కేసు పెట్టారు. దీనిని రాష్ట్ర సమస్యగా మార్చి జత్వానికి అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తన ప్రసంగాలలో పలుమార్లు అప్పట్లో ప్రస్తావించి వైఎస్సార్సీపీపై బురద చల్లేవారు. విద్యాసాగరరావు కొన్నాళ్లు జైలులో ఉన్న తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా అలాగే బెయిల్ పొందారు. విశాల్ గున్నీ, కాంతీలాల్ రాణ అనే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ముందస్తు బెయిల్పై రక్షణ పొందారు. రెడ్బుక్ అరాచకాలలో భాగంగానే ఇలా తప్పుడు కేసు పెట్టారన్న ప్రచారం అప్పట్లో జరిగింది.ఈ తరుణంలో సడన్గా కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. జత్వానికి వ్యతిరేకంగా సీఐడీ కోర్టుకు ఛార్జీషీట్ సమర్పించింది. ఇది సంచనలంగా మారింది. అంటే కూటమి ప్రభుత్వం విద్యాసాగరరావుపైన, ముగ్గురు ఐపీఎస్లపైన తప్పుడు కేసు పెట్టినట్లు ఒప్పుకున్నట్లయిందన్న విశ్లేషణ వచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం పరువు పోయినట్లయింది. ఈ కేసులో జిందాల్ వంటి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తపై కూడా తప్పుడు అభియోగాలు మోపే యత్నం జరగడంతో దేశం అంతటా పారిశ్రామికరంగంలో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చినట్లయింది.జగన్ ప్రభుత్వం మోసకారి నటి జత్వానిపై చర్య తీసుకుని ఆమె బ్లాక్ మెయిల్కు అడ్డుకట్ట వేస్తే, చంద్రబాబు ప్రభుత్వం జత్వానిని అడ్డుపెట్టుకుని, వైఎస్సార్సీపీనో, ఎవరినో సాధిద్దామనుకుని సెల్ఫ్ గోల్ వేసుకుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ నష్టాన్ని గమనించిన ఎల్లో మీడియా వెంటనే మళ్లీ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి డామేజి కంట్రోల్కు ప్రయత్నించింది. విద్యాసాగరరావు పెట్టిన కేసులో జత్వాని చేసింది తప్పని తేలిందని, కాని ఆమెపై కేసు పెట్టిన తీరు, హాండిల్ చేసిన విధానాల్లో లోపాలు ఉన్నాయని, అది వేరే కేసు అని, ఆ కేసులో ఐపీఎస్లను సస్పెండ్ చేయడం జరిగిందని ఎల్లో మీడియా కవరప్ యత్నం చేసింది. పోనీ ఆ అధికారులు చేసిన అక్రమం ఏమిటో అందులో వివరించినట్లు కనబడలేదు.ఒక మోసకారి నటి ఆట కట్టించడం ఆ ఐపీఎస్లు చేసిన తప్పన్నమాట. జత్వానిపై అన్యాయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని కదా కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణ! ఇప్పుడు జత్వానీనే బ్లాక్ మెయిలర్ అని, కోటి ముప్పై లక్షల రూపాయలకు పైగా విద్యాసాగర్ నుంచి అక్రమంగా పొందిందని, ఆధార సహితంగా రుజువు అయింది కదా! ఇందులో పోలీసు అధికారుల తప్పు ఏమి ఉంటుంది? చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పును కవర్ చేసేందుకు ఈ కేసు వేరు, ఆ కేసు వేరు అంటూ కొత్త కథను ఆరంభించారన్నమాట.ఏది ఏమైనా వైఎస్సార్సీపీ నేతలపైన, అప్పట్లో యాక్టివ్గా పనిచేసిన అధికారులపైన, సోషల్ మీడియావారిపైన, జర్నలిస్టులపైనా కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెడుతోందనడానికి ఇది పెద్ద ఉదాహరణ అవుతుంది కదా! దీనివల్ల కూటమి సర్కార్ అప్రతిష్ట పాలవుతున్నా ప్రభుత్వ ధోరణిలో పెద్దగా మార్పు రాకపోవడం దురదృష్టకరం. ఇలాంటి తప్పుడు కేసులతోనే ఏపీ పోలీసు వ్యవస్థ ర్యాంకు ఇతర రాష్ట్రాలతో పోల్చితే అంత ఘోరంగా 26 వ ర్యాంకుకు పడిపోయిందని అనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘చంద్రబాబు ప్రాణం ఆంధ్రజ్యోతి పేపర్లో ఉంది’
సాక్షి, తిరుపతి: మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాల్సిందేనని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలపై విచారణ జరిపించాలని.. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ఆమె మండిపడ్డారు. డీఎస్సీ స్కాం బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటూ ఎస్వీ యూనివర్సిటీ సెకండ్ గేట్ వద్ద వైఎస్సార్సీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. రూ. 7 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని మండిపడ్డారు. డీఎస్సీ పేపర్ లీకేజీ, రిక్రూట్ మెంట్లో అనర్హులకు పట్టం కట్టారు. 420 జీవో తీసుకొచ్చి.. 427 పోస్టులు అనర్హులకు ఇచ్చారు. డీఎస్సీ అక్రమాలు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది’’ అని ఆర్కే రోజా తేల్చి చెప్పారు.‘‘191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులకు మూడు వేలు భృతి ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. కోటిన్నరకు పైగా నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. జగనన్న ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబును అడుగు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మహిళలు జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. చంద్రబాబు.. నీ కొడుకు లోకేష్తో రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది..లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం సాగుతుంది. జగనన్న పాలనలో లక్ష 30 వేల పోస్టులు. ఆంధ్రజ్యోతి పేపర్కు, చంద్రబాబుకు మధ్య అవినాభావ సంబంధం బయట పడింది. చంద్రబాబు నాయుడు ప్రాణం ఆంధ్రజ్యోతి పేపర్లో ఉంది. ఆడ పిల్లలలపై అత్యాచారం జరిగితే కేసులు లేవు. భజన పత్రికలు కోసం చంద్రబాబు పనిచేస్తున్నారు’’ అని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చివరి నిమిషంలో కేంద్రం ప్లాన్ బెడిసి కొట్టిందా?
నీట్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం.. మరో ఆసక్తికర మలుపు తిరిగింది. రాజీనామా కంటే ముందే కేంద్రం మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తప్పించకుండా.. ఆయన శాఖను మార్చే ప్రతిపాదనను కేంద్రం చేసిందట. ఇదే విషయాన్ని ఆ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా ద్వారా ప్రకటించగా.. అది వాస్తవమేనన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం, సీజేపీ మధ్య జరిగిన చర్చల్లో కీలక ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్లు సమావేశమైన సమయంలో.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించినట్లు సమాచారం. మిగతా రెండు డిమాండ్లను ఎలాంటి షరతుల్లేకుండా అంగీకరిస్తూ.. ఈ ఒక్క డిమాండ్ విషయంలోనే పంతం వీడాలని కోరినట్లు సమాచారం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు దాన్ని తిరస్కరించినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలుగులోకి వచ్చింది.ఒక మంత్రిని కొనసాగించాలా? లేదంటే శాఖ మార్చాలా? అన్నది ప్రధానమంత్రి పరిధిలోని నిర్ణయమని కేంద్ర ప్రతినిధులు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని సమాచారం. కేవలం శాఖ మారిస్తే సరిపోదని.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమ డిమాండ్ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.రాజీనామా తప్ప మరో మార్గం లేదన్న సీజేపీనీట్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని సీజేపీ మొదటి నుంచీ డిమాండ్ చేసింది. విద్యార్థుల్లో నమ్మకం పునరుద్ధరించాలంటే నాయకత్వ మార్పు అవసరమని వాదించింది. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అంగీకరించలేదని తెలుస్తోంది. ఇటు రాహుల్ కూడా.. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక. ఆయన రాజీనామా చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం అనైతికం. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆయన శాఖను మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది. కానీ, ఆయన్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే. లేకుంటే ఆందోళనలను విరమించం అని రాహుల్ గాంధీ ఆ సమయంలో మీడియా ద్వారా వెల్లడించారు. అటు నిరసనకారులు.. ఇలా విపక్షాలు . రాజీనామాపైనే పట్టుబట్టడంతో చివరకు ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.రాజీనామా తర్వాత రాజకీయ వేడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీయే నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. పార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అదే సమయంలో ప్రతిపక్షాలు.. ఆయన రాకపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా ప్రసంగం ఇచ్చారు. ఉద్యమం తర్వాత కొత్త దశధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరినప్పటికీ.. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశం మరో వివాదంగా మారింది. దీనిపై కేంద్రంతో చర్చలు జరిపిన సీజేపీ.. కేసుల ఉపసంహరణ, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరుతోంది. మొత్తంగా నీట్ వివాదం కేవలం పరీక్షల నిర్వహణ అంశానికే పరిమితం కాకుండా.. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాల వరకు ప్రభావం చూపింది. -
Gen Z ఎఫెక్ట్.. బీజేపీకి కంచుకోటలో టెన్షన్!
అది బీజేపీకి బలమైన కంచుకోట.. వరుస విజయాలతో పార్టీకి అండగా నిలిచిన నియోజకవర్గం. కానీ ఇప్పుడు అదే స్థానంలో ఫలితం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అందుకే బంకీపూర్లో పార్టీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సాధారణంగా గెలుపు ఖాయంగా భావించే ఈ సీటులో ఈసారి మాత్రం బీజేపీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కారణం.. ఒకవైపు జన సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం.. మరోవైపు జెన్ జీ (Gen Z) విద్యార్థుల ఉద్యమం రాజకీయ చర్చకు కేంద్రంగా మారడం.బిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఈసారి సాధారణ పోరుగా కాకుండా.. బీజేపీ ఆధిపత్యానికి పరీక్షగా మారింది. జులై 30న పోలింగ్ జరగనుండగా.. ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా పోటీ చేస్తుండగా.. జన సూరాజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిశోర్ బరిలో ఉన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నప్పటికీ.. ప్రధాన పోరు బీజేపీ, జన సూరాజ్ మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ కంచుకోటలో కొత్త సవాల్బంకీపూర్ నియోజకవర్గం చాలాకాలంగా బీజేపీకి అనుకూలంగా ఉంది. గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే నితిన్ నబీన్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీజేపీ తన సంప్రదాయ బలాన్ని నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా తరఫున ప్రచారం చేస్తున్న నితిన్ నబీన్.. ప్రజల్లో పార్టీపై విశ్వాసం కొనసాగుతోందని చెబుతున్నారు. “యువత ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం సామ్రాట్ చౌధరీ, ఎన్డీయేకు మద్దతుగా ఉంది. ప్రజల ఆశీర్వాదం బీజేపీకి కొనసాగుతుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.పీకే ఎంట్రీతో ఆసక్తికర పోరురాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్.. జన సూరాజ్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సూరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. బంకీపూర్ ఉప ఎన్నిక ఆయనకు కీలక పరీక్షగా మారింది. ఈ ఎన్నిక ద్వారా బిహార్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో జన సూరాజ్ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యువ ఓటర్లు, పట్టణ ప్రాంత ప్రజలు, సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయం కోరుకునే వర్గాలపై ప్రశాంత్ కిశోర్ దృష్టి పెట్టారు.యువ ఓటర్లే నిర్ణాయక శక్తిబంకీపూర్ ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. నీట్ వివాదంపై ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఉద్యమం, ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అటు బిహార్లోనూ నీట్ నిరసనల సందర్భంగా కేసులు, అరెస్టుల వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో యువతలో ఈ అంశాలపై ఉన్న అభిప్రాయం ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? అన్న చర్చ మొదలైంది. పరీక్షల పారదర్శకత, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల సమస్యలు యువ ఓటర్ల నిర్ణయంలో కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది.జెన్ జీ ఉద్యమ ప్రభావం ఉంటుందా?జెన్ జీ ఉద్యమ ప్రభావం బంకీపూర్ ఎన్నికలపై ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నారు. యువత తమకు మద్దతుగానే ఉందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు బలమని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల ఆందోళనలను ప్రస్తావిస్తూ యువతలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జెన్ జీ ఉద్యమం కేవలం నిరసనగానే మిగిలిపోతుందా? లేక ఓటు రూపంలో ప్రభావం చూపుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.బంకీపూర్ ఫలితం ఎందుకు కీలకం?బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం ఒక సీటు గెలుపోటములకే పరిమితం కాదు. బీజేపీ తన కంచుకోటను నిలబెట్టుకుంటుందా? లేక ప్రశాంత్ కిశోర్ జన సూరాజ్ ప్రభావాన్ని చాటుతుందా? అన్నది బిహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితం బీజేపీ బలాన్ని మాత్రమే కాకుండా.. యువ ఓటర్ల మూడ్, ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఉన్న అవకాశాలను కూడా సూచించే అవకాశం ఉంది. అందుకే బంకీపూర్ బైపోల్ ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. -
2031 నాటికి రాజకీయాల్లోకి ధనుష్?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే నటుడు విజయ్ సీఎంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ తనదైన మార్కు చూపిస్తూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగా, ఇప్పుడు తమిళ సినీ రంగంలో మరో స్టార్ హీరో ధనుష్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ప్రచారం జోరందుకుంది. తమిళనాడు వ్యాప్తంగా తన అభిమాన సంఘాలకు ప్రత్యేకమైన జెండా,చిహా్నలను (తెలుపు, ఎరుపు రంగు నక్షత్రం) కేటాయించడం, జిల్లాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. 2031 నాటికి ధనుష్ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమం మారింది. ధనుష్ వ్యాఖ్యల చర్చ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పరిధిలో నిర్వహించిన నిధుల సేకరణ, రక్తదాన శిబిరం , విద్యా సహాయ వితరణ కార్యక్రమంలో నటుడు ధనుష్ పాల్గొని అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. 2002 నుంచి 24 సంవత్సరాలుగా తనకు అండగా నిలిచారని అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.అభిమానులు తనకు విస్తృతమైన కుటుంబం. జీవితంలో ఎవరు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో చెప్పలేం, అందుకే మానసికంగా, శారీరకంగా బలంగా ఉండండి అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అభిమానులకు పలు ఉపదేశాలు ఇస్తూనే ఆయన జాతీయ అవార్డుల గురించి స్పందించి ఉండటం తాజాగా చర్చకు దారి తీసింది. కాగా, ధనుష్ చూపిన బాటలోనే నడుస్తామని, తమ నాయకుడు ధనుష్ చెప్పినట్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామని, ఆయన మార్గదర్శకత్వంలో తమిళనాడు అంతటా పర్యటించి, ప్రజలకు సేవ చేస్తామని, . 2031 నాటికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడులో మంచి మార్పు తీసుకువస్తారని ఆశిస్తున్నామని అభిమానులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు.. నేనూ బాధితుడినే: తమ్మినేని
సాక్షి, శ్రీకాకుళం: భూ కొనుగోలు వ్యవహారంలో గత కొన్నిరోజులుగా తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. తాను ఎప్పుడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని, భూమి కొనుగోలులో ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతే భూమిని కొనుగోలు చేశామని తెలిపారు.భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని తమ్మినేని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాల పరిశీలన అనంతరం రిజిస్ట్రేషన్ జరిగిందని, ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదని చెప్పారు.వివాదం తెలిసిన వెంటనే కోర్టును ఆశ్రయించాంకొనుగోలు చేసిన భూమిపై వివాదం ఉన్న విషయం తెలిసిన వెంటనే తాము కూడా చట్టపరమైన మార్గాన్ని ఎంచుకున్నామని తమ్మినేని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంగా ఈ వ్యవహారం సివిల్ కోర్టులో విచారణలో ఉందని చెప్పారు. ‘‘ఈ భూ వ్యవహారంలో మేము కూడా బాధితులమే. సివిల్ వివాదం కొనసాగుతుండగానే క్రిమినల్ కేసు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాంతనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి చట్టపరంగా కోర్టు ముందు వాదనలు వినిపిస్తామని తమ్మినేని తెలిపారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని, అవసరమైన అన్ని పత్రాలను సమర్పిస్తామని చెప్పారు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందన్న నమ్మకం ఉందని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మాజీ స్పీకర్ పేర్కొన్నారు.భూ వ్యవహారంపై రాజకీయంగా చర్చతమ్మినేని సీతారాం వ్యాఖ్యలు ప్రస్తుతం శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భూ కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు, కేసుల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. అయితే చట్టపరమైన ప్రక్రియ ద్వారా అన్ని విషయాలు స్పష్టమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తమ్మినేని దంపతులను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని రిజిస్టర్ చేయించుకున్నారన్న ఆరోపణలపై శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు నమోదు చేసిన కేసులో తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణికి హైకోర్టు ఊరట లభించింది. వారిద్దరికీ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వరకు వారిద్దరినీ అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని ఆయన్ని ఆదేశించింది. ఈ నెల 29న 10 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. వాణి వయసు 65 ఏళ్లు కావడంతో ఆమె విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు తేల్చి చెప్పింది. కాగా, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సీతారాం కుమారుడు వెంకట శ్రీరాం చిరంజీవి నాగుకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భూమి రిజిస్ట్రేషన్తో సీతారాం, ఆయన భార్య వాణికి సంబంధం లేదన్న సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. -
సమన్వయం లేదు.. కలహాలు పెరిగాయి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు, అంతర్గత పోరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కొరవడటం.. జిల్లాల్లో మంత్రుల ఏకఛత్రాధిపత్యం.. ఎమ్మెల్యేల నియోజకవర్గాల స్థాయి అభివృధ్ధి పనుల్లో జాప్యంపై వరుసగా వస్తున్న ఫిర్యాదులపై రాష్ట్ర నాయకత్వాన్ని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. కొన్ని నెలలుగా జిల్లాల స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలించిన కాంగ్రెస్ హైకమాండ్, ప్రభుత్వం–పార్టీ మధ్య సమన్వయం గాడి తప్పుతోందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జితో జరిగిన సమావేశంలో పార్టీ వ్యవహారాలపై స్పష్టమైన హెచ్చరికలు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అందరిదీ సొంత అజెండానే.. రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి, సంస్థాగత వ్యవహారాల, ఎస్ఐఆర్ కొనసాగుతున్న తీరుపై రెండు గంటలపాటు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి తెప్పించుకున్న నివేదికలు, ఇంచార్జీలు ఇచ్చిన నివేదికలపై అధిష్టాన పెద్దలు సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ శ్రేణులకు చేరడం లేదని, పార్టీ నుంచి వచ్చే అభిప్రాయాలు ప్రభుత్వానికి వెళ్లడం లేదని, మంత్రులు–ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడిందని వచ్చిన నివేదికలపై గట్టిగానే చర్చ జరిగినట్లు సమాచారం. చాలామంది మంత్రులు తమ తమ శాఖలు, నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని, జిల్లాల వారీగా పార్టీని సమన్వయం చేసే బాధ్యత కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రులు సొంత నియోజకవర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, నిధుల కేటాయింపుల్లోనూ వారికి ప్రాధాన్యమిచ్చుకుంటూ జిల్లా ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు అందాయని రాష్ట్ర నేతల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. మంత్రుల స్థాయిలోనూ, కార్పొరేషన్ పదవుల్లో ఉన్న నేతలు తమ సొంత అజెండా, సొంత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాలు తప్ప, పార్టీ ఇమేజ్కు పెద్దగా దోహదం చేయడం లేదన్న అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగానే ఎస్ఐఆర్ ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల భాగస్వామ్యం కొరవడిందన్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. షబ్బీర్..సామేల్..డీసీసీల వ్యవహారాలపై ప్రశ్నలు తమకు అందించిన నివేదికల్లోని అంశాలను ప్రస్తావిస్తూ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతల నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. ముఖ్యంగా యాదాద్రి దేవస్థాన పాలకమండలి ఎంపికలో జిల్లా నేతల అభిప్రాయాలను కోరకపోవడం, జిల్లా నేతలను విస్మరించారని ఫిర్యాదులు రావడం, పీసీసీని లక్ష్యంగా చేసుకుంటూ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యలు చేయడం, యూత్ కాంగ్రెస్ నేత వ్యవహారంలో జరిగిన వివాదం, ఇటీవల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చుట్టూ జరిగిన పరిణామాలు, ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రంగా స్పందించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. మండల కమిటీల ఏర్పాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న ఆరోపణలతో అనేక జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా మాట్లాడినట్లు తెలిసింది. అభివృద్ధి నిధుల కేటాయింపు, అధికార యంత్రాంగం స్పందన, స్థానిక సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేల సూచనలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాలపైనా అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. రంగంలోకి హైకమాండ్ రాష్ట్ర పరిస్థితిని గాడిన పెట్టేందుకు హైకమాండ్ రంగంలోకి దింగింది. పార్టీ సమన్వయాన్ని కాపాడే క్రమంలో మొదటి అడుగుగా బుధవారం ఢిల్లీలో పార్టీ పీసీసీ సమన్వయ కమిటీ భేటీని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతోపాటే.. మీనాక్షికి పార్టీ–ప్రభుత్వ సమన్వయాన్ని బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించడం, విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించడం, బహిరంగ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోమని స్పష్టమైన కేతాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ నేతల విషయంలో అవసరమైతే హైకమాండ్ నేరుగా జోక్యం చేసుకుంటుందని, ఏఐసీసీ పరిశీలకులను పంపి అవసరమైన చర్యలకు దిగుతామనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. -
‘హైడ్రాను బ్యాన్ చేయాలి’
హైదరాబాద్: హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగించాలనే హైకోర్టు తీర్పును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు స్వాగతించారు. హైకోర్టు తీర్పు సీఎం రేవంత్కు చెంపదెబ్బ అంటూ మండిపడ్డ రాంచందర్రావు.. హైడ్రాను సైతం బ్యాన్ చేయాలన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసింది రేవంత్రెడ్డేనని, అధికారాన్ని పావులా వాడుకున్నారని ధ్వజమెత్తారు. దీనికి పూర్తి బాధ్యత రేవంత్రెడ్డినే వహించాలన్నారు. ‘హిట్లర్ స్పూర్తితో హైడ్రా తెచ్చాం అని రేవంత్ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటికీ 63 సార్లు కన్టెంప్ట్ ఎదుర్కున్నారు రంగనాథ్. హైడ్రా కేవలం పేదల ఇండ్లు కూల్చడానికి ఉంది.. పెద్దల జోలికి పోవట్లేదు. అసలు హైడ్రాను బ్యాన్ చేయాలి’ అని డిమాండ్ చేశారు రాంచందర్రావు. -
‘రాజ్యాంగ బద్ధంగా బతికే పరిస్థితి ఏపీలో లేదు’
తాడేపల్లి: రాజ్యాంగ బద్ధంగా బతికే పరిస్థితి ఏపీలో లేదని, రాజ్యాంగాన్నే సవాల్ చేసే చర్యలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఈరోజు( సోమవారం, జూలై 27వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘ సాయికృష్ణ కేసులో సిట్ విచారణ ఏమైంది?, సాయికృష్ణ తల్లి సీబిఐ విచారణ కోసం వేసిన పిటిషన్ను ఎందుకు వెనక్కు తీసుకున్నారు?, క్రాంతికుమార్ ఆత్మహత్యకు కారణం ఏంటి?, పోలీసు వేధింపులే ఈ సంఘటనలన్నిటికీ కారణం. మాల గంగమ్మ కేసులో హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు అయ్యాయి. చివరికి ఆమె చనిపోయినా ప్రభుత్వంలో కదలిక లేదు. తన కుమారుడు కనపడలేదని ఫిర్యాదు చేసి చివరకు ఆ తల్లే చనిపోయింది. ఈ ఎపిసోడ్లో దర్గయ్య అనే వ్యక్తిని తెచ్చి అతన్నీ చిత్రహింసలకు గురి చేశారు. ఒక తప్పును కప్పి పుచ్చుకోవటానికి మరెన్నో తప్పులు చేస్తున్నారు. పోలీసులే శిక్షలు వేసుకుంటూ పోతే ఇక కోర్టులు ఎందుకు?, యధేచ్చగా లాకప్డెత్లు,, వాటర్ డెత్లు, ఆత్మహత్యలు జరుగుతుండటం పోలీసుల వైఖరికి అద్దం పడుతున్నాయి. వీటన్నిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
మరో సంచలనం.. సీజేపీ కీలక నిర్ణయాలు.. మళ్లీ ఆందోళనలు?
న్యూఢిల్లీ: విద్యార్థులపై దాడులు చేసిన పోలీసులపై కేసులు పెడతామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తెలిపింది. న్యూఢిల్లీలో ఆ పార్టీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆందోళన సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చర్చల సమయంలోనూ కేసులు ఎత్తేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తమకు తెలిపారని చెప్పారు.ఒప్పందం అమలు చేయకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని కేంద్రానికి సీజేపీ వార్నింగ్ ఇచ్చింది. ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్కు ఉద్దేశించి ఎక్స్లో కూడా సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా ఓ పోస్ట్ చేశారు. బిహార్, పశ్చిమ బెంగాల్లో విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో పోలీసులు దాడులు చేయడాన్ని ప్రస్తావించారు."జేపీ నడ్డా, జితేంద్ర సింగ్.. ఆందోళనకారులపై పోలీసు చర్యలు ఉండవని జరిగిన ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని మేము గమనిస్తున్నాం. బిహార్, బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో వందలాది మందిపై నిఘా పెట్టి వేధిస్తున్నారు. ఆందోళనకారులకు లాజిస్టిక్స్ సాయం అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలను ఢిల్లీలో అదుపులోకి తీసుకుంటున్నట్టు ఎన్నో నివేదికలు వస్తున్నాయి. ఆందోళనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించాలి. విద్యార్థులను విడుదల చేయాలి. ఇకపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, భాజపా మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదు. మా ఒప్పందానికి అనుగుణంగా ఇదంతా అమలు కావాలి. లేదంటే మేము మళ్లీ ఆందోళనలో కూర్చోవాల్సి వస్తుంది. చట్టపరమైన కేసులపై రాతపూర్వక ఒప్పందాన్ని భారత ప్రభుత్వంతో నిర్ణయించిన గడువులతో పాటు రేపటిలోగా మాకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం" అని రాంకా తెలిపారు.జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఈ ఆందోళన విరమించారు. ఆ సమయంలో సీజేపీ, ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్తో జరిగిన ఒప్పందంలో కేసులు ఎత్తివేయడం, పోలీసుల వేధింపులు అడ్డుకోవడం, ప్రశ్నపత్రాల లీక్లను అరికట్టే చట్టం తీసుకురావడం వంటి అంశాలకు ప్రభుత్వం అంగీకరించింది.అంతకుముందు రోజే సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్.. అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్లో విద్యార్థులు, ఇతర ఆందోళనకారులను అరెస్టు చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేసి, ఎఫ్ఐఆర్లను ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరారు."అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్లో విద్యార్థులు, ఇతర ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం జరుగుతోందని మాకు ఎన్నో నివేదికలు వస్తున్నాయి. ఇది మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది" అని దాస్ తెలిపారు. -
‘హైకోర్టు తీర్పు సీఎం రేవంత్కు చెంప దెబ్బ’
హైదరాబాద్ హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ తీర్పు సీఎం రేవంత్కు చెంప దెబ్బగా అభివర్ణించిన ప్రవీణ్కుమార్.. హైడ్రా పేరుతో ప్రభుత్వం ఎన్నో దారుణాలు చేసిందన్నారు. హిట్లర్ ఆదర్శమంటూ హైడ్రాను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్.. క్రూరమైన 99 జీవో తీసుకొచ్చారన్నారు. హిట్లర్ రక్తపాతం చేసినట్లు హైడ్రాతో హైదరాబాద్లో విధ్వంసం సృష్టించారన్నారు. ‘దివ్యాంగుల కాలనీని కూడా హైడ్రా నేలమట్టం చేసింది. అమీన్పూర్లో ఎన్నో బిల్డింగ్లను కూల్చేశారు. ఘోరమైన, క్రూరమైన చరిత్ర హైడ్రాకు ఉంది. జీవో నంబర్ 99లో చెప్పినట్లు హైడ్రా నడుచుకోలేదు. కూల్చివేతలు వద్దని హైకోర్టు చెప్పినా బిల్డింగ్లను నేలమట్టం చేశారు. కోర్టులకు సెలవులు ఉన్నప్పుడు చూస్కొని హైడ్రా విరుచుకుపడేది. హైడ్రా పేరుతో ఎన్నో దారుణాలు చేశారు. పిల్లల పుస్తకాలు చిందర వందర చేశారు, ముసలమ్మను ఈడ్చిపడేశారు. దిగువ మధ్యతరగతి, పేదల ఇళ్లపై హైడ్రా విరుచుకుపడింది. ధనవంతుల బిల్డింగ్ల జోలికి హైడ్రా వెళ్లలేదు. సీఎం రేవంత్ సోదరుడు ఇల్లును హైడ్రా కూల్చలేదు. రంగనాథ్ కాకపోతే మరొకరు వస్తారు.. అసలు చేపిస్తున్నది ఎవరు..?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రవీణ్ కుమార్. -
‘మరి రేవంత్ రాజీనామా చేయరా?’
ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ విద్యాశాఖ మంత్రిగా ఉండగానే టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అయ్యిందని, మరి నీతులు మాట్లాడుతున్న ఆయన ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించారు. ముందు సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన కిషన్రెడ్డి.. దేశ హితం కోసం ఏ వ్యవస్థ వచ్చినా తప్పులేదని, దేశానికి నష్టం చేసే వ్యవస్థ మాత్రం ఉండకూడదన్నారు. నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్ అని అన్నారు. దేశం డిజిటల్ చెల్లింపుల్లో అగ్రస్థానంలో ఉందన్నారాయన. తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో చాలా మార్పులు వస్తాయన్నారు కిషన్రెడ్డి. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయని, భవిష్యత్తులో ప్రధాని ,హోంమంత్రి అందరూ నేతలు తెలంగాణలో పర్యటిస్తారన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్కి భూమి పూజ చేయాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు ప్లానింగ్ జరుతుందన్నారు. -
ఉత్కంఠ రేపుతున్న కార్పొరేషన్ల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధి పెరిగింది. ‘క్యూర్’లో మూడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. గతంలో 150గా ఉన్న కార్పొరేటర్ల సీట్లు 300కు పెరిగాయి. ఆ సీట్లలో కూర్చునేందుకు పలువురు లీడర్లు ఉవ్విళ్లూరుతున్నారు. పూర్వ జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగిసినప్పటి నుంచీ, కొత్తగా ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో స్పెషలాఫీసర్ పాలన నడుస్తోంది. చట్టం మేరకు రద్దయిన పాలకమండళ్లకు ఆర్నెళ్లలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చేనెల పదో తేదీతో ఆ గడువు ముగియనుంది. కానీ, ఇంతవరకు ఎన్నికల అలికిడి లేదు.ఈ సంవత్సరం చివర్లో ఈ ఎన్నికలు జరగనున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుండగా, దానిపై కూడా సందేహాలు నెలకొన్నాయి. అందుకు కారణం కొత్తగా క్యూర్ చట్టం రానుండటం, డీలిమిటేషన్పై కోర్టు కేసులుండటం, తదితరమైనవిగా చెబుతున్నారు. దాదాపు 70 ఏళ్లనాటి జీహెచ్ఎంసీ స్థానే క్యూర్ వరకు కొత్త చట్టం తెచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఆమేరకు ముసాయిదా బిల్లు విడుదల చేసింది. ప్రజల సూచనలు, అభ్యంతరాలకు ఈ నెల 24 వరకు గడువుంది. అనంతరం బిల్లు.. చట్టరూపం దాల్చేందుకు సమయం పట్టనుంది. వార్డుల విభజన వివాదం గత డీలిమిటేషన్పై హైకోర్టులో కేసులున్నాయి. వార్డుల విభజనలో లోపాలున్నాయనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అభ్యంతరాలు ముగిసేంత వరకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వార్డుల సంఖ్య పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ కార్పొరేషన్లో 76 వార్డులు, మల్కాజిగిరి కార్పొరేషన్లో 74 వార్డులున్నాయి. ఒక్కో కార్పొరేషన్లో వంద చేస్తారనే ప్రచారం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో ఇప్పటికే 150 వార్డులున్నాయి. ఏ కార్పొరేషన్లోని వార్డుల్ని పెంచినా, వార్డులు, సరిహద్దులు మారతాయి. మరోవైపు మల్కాజిగిరి కార్పొరేషన్ (Malkajgiri Corporation) పరిధి చాలా ఎక్కువగా ఉండటంతో అక్కడ అధికారులకు సమస్యలు తలెత్తుతున్నాయి. తెర వెనుక వ్యూహం ప్రస్తుతం ఓటరు జాబితా ప్రక్షాళనకు సంబంధించిన ‘సర్’ కార్యక్రమం నడుస్తోంది. ఓటరు జాబితా అక్టోబర్ 10వ తేదీన వెలువడనుంది. ఆ తర్వాతే ప్రభుత్వం స్థానిక ఎన్నికల వైపు దృష్టి సారించే అకాశం ఉంది. అయినప్పటికీ, ఎన్నికల చూపుతోనే ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసింది. ముఖ్యంగా, కొత్తగా ఏర్పడిన సీఎంసీ (CMC), ఎంఎంసీల్లో (MMC) వేల కోట్ల పనులు ప్రారంభించింది. ఆ పనుల పురోగతి కనిపించాక ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని రెండు భారీ ఫ్లై ఓవర్లు వచ్చేనెల ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇవన్నీ ఎన్నికల చూపుతోనే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల బలం లేదు. ఈ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే, అందుకు కార్పొరేషన్ల ఎన్నికలే పరీక్షగా భావిస్తున్నారు. చదవండి: జై జవాన్.. జై కిసాన్.. జై 'యువ'ప్రతిపక్షాలు సైతం.. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ (BJP) గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాయి. తిరిగి వాటిని నిలబెట్టుకోవడమే కాక, సీట్లు పెరిగినందున మరిన్ని ఎక్కువ సీట్లు పొందే యోచనలో ఇప్పటికే పరోక్షంగా ప్రచారం నిర్వహిస్తూ, ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ల ఎన్నికలెప్పుడు అన్నది వివిధ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కోర్టు కేసులు, కొత్త చట్టం పూర్తయ్యాకే అయినా..త్వరితంగానా లేక జాప్యంతోనా అన్నదే ఇప్పుడు అందర్ని తొలుస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా ట్రిపుల్ కార్పొరేషన్ల ఎన్నికలే రాబోయే రోజుల్లో ఆయా పార్టీలకు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల భవితవ్యాన్ని తెలుపనున్నాయి. -
‘కాక్రోచ్’ ఉద్యమం కుదిపేసిన రాజకీయాలు.. అమరావతి వరకు సెగ!
రాజకీయాలలో ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నది ఒక అభిప్రాయం. అన్నిసార్లు కాకపోయినా, కొన్నిసార్లు బొద్దింకలు కూడా తిరగబడతాయన్న సత్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పక్షాన యువత రుజువు చేసింది. ఎంత బలాఢ్యుడైనా ఆ తిరుగుబాటుకు తలొగ్గక తప్పదని రుజువైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్వం దేశానికే ఒక స్పూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి లీక్లు జరిగినా, లేదా స్కామ్ల ఆరోపణలు ఆధారాలతో సహా బయటపడినా సంబందిత బాధ్యులు పదవి నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ యువత ఆందోళన తేల్చి చెప్పింది.కేంద్రంలోనేనా ఇలా రాజీనామాలు జరగవలసింది? మరి రాష్ట్రాలలో జరిగే లీక్లు, ఇతర కుంభకోణాల పరిస్థితి ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా తెరపైకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణ, టీచర్ల ఎంపికలో అవకతవకలు, స్పోర్ట్ కోటా టీచర్ల ఎంపికలో అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారసహింతంగా ఆరోపణలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. బహుశా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తున్న యువతపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శకు గురయ్యారు.కాక్రోచ్ ఉద్యమానికి కాంగ్రెస్ తదితర విపక్షాలు రంగంలోకి దిగడంతో తీవ్రరూపం దాల్చింది. ఒకరకంగా రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ప్రధాని ఇంటిముందు ధర్నాకు దిగడంతో బీజేపీ కంగుతిన్నట్లనిపించింది. సీజేపీతో చర్చలకు సిద్దమని బీజేపీ కూడా చెప్పవలసి వచ్చింది. రాహుల్ గాంధీపై విమర్శలు చేసినా, బీజేపీ కొంత డిఫెన్స్లో పడినట్లయింది. కాక్రోచ్ ఉద్యమంతో పాటు, కాంగ్రెస్ ధర్నా ప్రభావం వివిధ రాష్ట్రాలలో కూడా పడింది. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యాయి. వారికి పోటీగా బీజేపీ కూడా ఎదురుదాడి చేయడానికి యత్నించింది.ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇదో గొడవగా మారింది. తెలంగాణలో రెండు పార్టీలు కర్రలతో ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్పై బీజేపీ దాడికి యత్నించడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయినా, ఈ అవకాశం ద్వారా తమ ఉనికి కోసం ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.23 లక్షల మంది విద్యార్ధులు మెడికల్ కాలేజీలలో సీట్ల నిమిత్తం రాసిన నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వైనం, ఆ తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ చేసిన ఒక అనవసర వ్యాఖ్యతో దేశంలో కొత్తగా పుట్టుకువచ్చిన క్రాకోచ్ జనతాపార్టీ యువతను ఆకర్షించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్కు సంబంధించి కొందరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కాని తొలి నీట్ పరీక్ష రద్దు కావడంతో సుమారు ఇరవైమంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించినప్పటికీ, నీట్ ప్రశ్నాపత్రాల లీక్కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ను కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వీరు కోరారు.ఇలా వివిధ డిమాండ్లతో సాగుతున్న వీరి ఉద్యమం ఒక దశలో ముగిసిపోయిందని అనుకున్నారు. కాని వాంగ్ చుక్ అనే ఉద్యమకారుడు నిరాహారదీక్షకు దిగడంతో తిరిగి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాదిగా తరలివచ్చిన యువత పార్లమెంటు ముట్టడికి వెళ్లడం, ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడం వంటివి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. పోలీసులు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పలువురిని లాఠీలతో కొట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది సంబంధం లేని పిల్లలను కూడా పోలీసులు కొట్టిన తీరు విమర్శలకు గురి అయింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.ప్రధాని మోదీ తొలిసారిగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్పై స్పందించి అది మహాపాపమని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి యత్నించారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఇతరత్రా ఆరోపణలు చేసినా, ప్రధాని ఆ యువతను స్నేహితులు అని అడ్రస్ చేయడం విశేషం. ఈ కేసులో నిందితులకు సత్వరమే శిక్ష పడడానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. వాంగ్ చుక్ దీక్ష విరమించినా, ఉద్యమం కొనసాగడం, దేశం అంతటా దీని ప్రభావం పడుతుండడం గమనించి మోదీ స్పందించారు. వెంటనే డామేజ్ కంట్రోల్కు చర్యలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించినట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. దాంతో కాక్రోచ్ సంబరాలు అంబరాన్ని అంటాయి.నిజానికి కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మొదట తేలికగా తీసుకున్నట్లుగా ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కొన్ని వందలమంది దేశ యువతకు ప్రతినిధులుగా కేంద్రం ఆలోచించలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారంటే, 18 మెట్రో రైల్వేస్టేషన్లను బంద్ చేశారంటేనే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఇదంతా యువత స్వచ్చందంగా చేసిందే.కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రైతుల ఆందోళన కుదిపేసింది. వారు కోరినట్లు కొన్ని చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. అయినా ఆనాడు సమర్థంగా హాండిల్ చేశామన్న భావన కేంద్ర పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఆ పరిస్థితి వేరు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి వేరు. ఒక్కసారి యువతలో గూడుకట్టిన అసంతృప్తి ఎగసిపడితే, అది దేశ వ్యాప్తంగా పాకితే ఎంత ప్రమాదమో బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. అందులోనూ పలు ఇతర దేశాలలో యువత ఈ మధ్యకాలంలో ఎంతటి క్రియాశీలకపాత్ర పోషించి ప్రభుత్వాలే మారిపోయేలా చేసిందో ఇటీవలి చరిత్రే.ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాలలో సహజంగానే విపక్షం దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మంత్రి ప్రధాన్ రాజీనామాకు విపక్షం కూడా పట్టుబట్టింది. ఎప్పుడో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సంచలనం అయింది. తర్వాతకాలంలో కొందరు కేంద్ర మంత్రులు వివిధ కారణాలతో రాజీనామాలు చేయకపోలేదు. రైల్వే ప్రమాదాల కారణంగానే నితీష్ కుమార్, మమత బెనర్జీ వంటివారు రాజీనామా చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ పదవి నుంచి తప్పుకున్నారు.అలాగే, ఆయా స్కామ్ల ఆరోపణలపై దయానిది మారన్, ఎ.రాజా తదితరులు రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యా మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజీనామా చేశారు. క్యాబినెట్ ఎజెండాను లీక్ చేశారన్న కారణంగా 31 మంది మంత్రుల నుంచి ఎన్టీరామారావు రాజీనామాలు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్లో వివిధ ఆరోపణలు వచ్చినా ఆయన నైతిక బాధ్యత వహించడానికి సిద్దపడలేదు. గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట కారణంగా 29 మంది మరణిస్తే, చంద్రబాబు ఎదురు బుకాయించారు తప్ప బాధ్యత తీసుకోలేదు. పూరి జగన్నాథ రథయాత్రలో జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో మరణించడం లేదా అంటూ డబాయించారు. ఆ ఘటనలో ఒక్క కానిస్టేబుల్పై కూడ కేసు రాకపోవడం చిత్రంగానే అనిపిస్తుంది.తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్ కౌంటర్కు గురి కావడం వివాదాస్పదం అయినా, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినా, ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసే లేకుండా చేసుకోగలిగారు. ఒకప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ జరిగితే అప్పటి మంత్రి కోనేరు రంగారావుతో రాజీనామా చేయించారు. తదుపరి ఆ ఆరోపణలు రుజువు కాలేదని తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలకు వైఎస్సార్సీపీ ఎన్నో ఆధారాలు చూపి సీబీఐ విచారణ కోరుతోంది. వాటికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా నేరుగా జవాబు ఇవ్వలేదు. టీడీపీ ఇతర నేతలతో ఎదురుదాడి చేయించారు.ఈ నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై ఉద్యమించాలని వైఎస్సార్సీపీ తలపెట్టింది. దీనికి యువత కూడా తోడైతే అది సీరియస్గా మారవచ్చు. అయితే వారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇది ఏ రూపు దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోకేష్పై ఒత్తిడి పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమం చేసిన కాక్రోచ్ యువతపై కక్ష కట్టకుండా ఉండాలని ఆశిద్దాం. ఏది ఏమైనా కాక్రోచ్లే కదా అని తేలికగా చూడరాదన్న విషయం అర్థం అవుతోంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పార్లమెంట్కు ధర్మేంద్ర ప్రధాన్.. కారు దిగగానే!
సాక్షి, న్యూఢిల్లీ: యువత నిరసలతో దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు కదా. ఇవాళ ఎంపీ హోదాలో ఆయన పార్లమెంట్ సమావేశాలకు కోసం వచ్చారు. అయితే ఆయన రాక సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నినాదాల పోరు కనిపించింది.సోమవారం ఉదయం పార్లమెంట్కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కారు దిగి దిగగానే ఎన్డీయే ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా “ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. ఆయనను హీరోలా స్వాగతిస్తూ.. నెత్తిన టోపీ పెట్టి ఎన్డీయే ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. ఫొటోలు కూడా దిగారు. అదే సమయంలో.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసిన ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం కొద్దిసేపు హోరెత్తింది. అయితే ఎన్డీయే ఎంపీలు అవేం పట్టనట్లు తమ పని తాము చేసుకుంటూ పోయారు. అలా.. ఒకేసారి డబుల్ వెల్కమ్ దక్కింది ఆయనకు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నీట్ వ్యవహారంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 36 రోజుల తర్వాత నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను నైతిక బాధ్యత తీసుకున్న నిర్ణయంగా ఎన్డీయే నేతలు అభివర్ణిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు మాత్రం నీట్ అవకతవకలకు ఆయన రాజీనామా చేయడం సరైందేనని అంటున్నాయి. #WATCH | Delhi: Former Union Education Minister and BJP MP Dharmendra Pradhan arrives at the Parliament. BJP-NDA MPs sloganeer "Dharmendra Pradhan zindabad" as they receive him here. pic.twitter.com/7DHXIzMkvI— ANI (@ANI) July 27, 2026 -
కూటమిలో చిచ్చు.. మాకే ఆహ్వానం లేదా!?
సాక్షిప్రతినిధి, విజయనగరం: మన ఊరిలో మీటింగ్ పెట్టి మనకు ఆహ్వానం లేకపోవడమా..? వంటలన్నీ మనతో చేయించి మనకు పళ్లెం వేయకపోవడమా? మనతో ఫంక్షన్ కుర్చలు సర్దించి మనను చివరకు గుమ్మం బయట నిలబెడితే ఎలా ఉంటుంది? అచ్చం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరిస్థితిలానే ఉంది. బయటకు చెప్పలేక.. ఎవరికీ చెప్పుకోలేక.. క్యాడర్ ముందు బిల్డప్ కొట్టుకోలేక.. అబ్బబ్బ ఈ కష్టాలు.. అవమానాలు పగవాడిక్కూడా రావద్దు సుమీ..! అన్న వ్యాఖ్యలు నెల్లిమర్ల నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు వస్తున్నారు. ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ ప్రారంభించనుండగా డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు పాల్గొంటున్నట్టు ఎయిర్పోర్టు నిర్వహణ సంస్థ జీఎమ్మార్ ఆహ్వాన పత్రికను విడుదల చేసింది. అందులో స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి పేరులేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ఫోర్ట్ ప్రారంభానికి ముందు ప్రధాని పర్యటన ఏర్పాట్లు అంటూ రోజూ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లడం.. ఏర్పాట్లు.. పర్యవేక్షణ అంటూ హడావుడి చేయడం తప్ప ఆఖరుకు జీఎంఆర్ వారు వేసిన ఆహ్వాన పత్రంలో కూడా ఎమ్మెల్యే పేరు లేకపోవడం పార్టీ క్యాడర్ను ఆవేదనకు గురిచేస్తోంది. ఎయిర్పోర్టు రానీయండి.. వేలల్లో ఉద్యోగాలు..ఇక మీ జీవితాలు మారిపోతాయి.. ఇంటికో ఉద్యోగం.. రెండు చేతుల్లో డబ్బులు గలగలా అంటూ చెప్పుకొచ్చిన ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రంలో పేరు లేకపోవడం చూసి.. ఆమె స్థాయి ఇంతేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, దీనివెనుక స్థానిక టీడీపీ నేతల కుతంత్రం ఉందన్న వ్యాఖ్యలు జనసేన క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు లేని ప్రాధాన్యం లోకేశ్కు ఎలా ? ఎంతపెద్ద నాయకుడు వచ్చినా స్థానిక నాయకత్వానికి అయితే ప్రత్యేక ప్రొటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు వేదిక మీద సీట్లు ఉంటాయి. కానీ ప్రధాని కార్యక్రమానికి మాత్రం స్థానిక ఎమ్మెల్యే మాధవికి ప్రత్యేక ఆహ్వానం లేకపోవడం ఆమెను జీఎమ్మార్ లైట్ తీసుకున్నట్లే అంటున్నారు. ఇదిలా ఉండగా అసలు ఈ ప్రాంతానికి, ఆ ప్రాజెక్టుకు సాంకేతికంగా ఎలాంటి అనుబంధం లేని లోకేశ్, పవన్ కల్యాణ్ వంటివారికి ఎలా ప్రాధాన్యం ఇచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి. -
ముద్రగడ సంస్మరణ సభకు మళ్లీ వెళ్తావా?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైనందుకు టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సంస్మరణ సభకు వెళ్లడాన్ని తప్పుబడుతూ ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఆదివారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా.. చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. వివరణ తీసుకునే బాధ్యతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించినట్లు సమాచారం. రగిలిపోతున్న కాపులు ఈ పరిణామంపై టీడీపీలోని కాపు నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన ఒక దివంగత నేత సంస్మరణ సభకు హాజరుకావడాన్ని కూడా తప్పుగా చూడటమేంటన్న ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది. పారీ్టలోని కాపు నేతలపైనే ఇలా ఆంక్షలు పెడుతుండటాన్ని తాము సహించలేకపోతున్నామని వారంటున్నారు. ముద్రగడ మరణించాక కూడా ఆయనపై శత్రుత్వ భావాన్ని కొనసాగించడంపై చర్చ పార్టీలో మొదలైంది. బతికున్నప్పుడు ఆయన ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయతి్నంచి.. ఇప్పుడు ఆయన సంస్మరణ సభకు వెళ్లిన సొంత ఎమ్మెల్యే పైనే చర్యలకు సిద్ధపడటంపై కాపు సామాజికవర్గంలో అసంతృప్తిని మరింత పెంచుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరణించిన నాయకుడికి నివాళి అర్పించే విషయంలో కూడా రాజకీయ రంగులు పులమడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
నన్ను అడగొద్దు.. డిలీట్ చేయను: బీజేపీ ఎంపీ కూతురి సంచలన పోస్ట్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆయన స్వంత రాష్ట్రం ఒడిశాకే చెందిన ఓ బీజేపీ ఎంపీ కూతురు సంచలన పోస్ట్తో రాజకీయ దుమారం రేపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబురంగా ఆమె ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ తొలగించాలంటూ తనపై ఒత్తిడి వస్తోందంటూ ఆమె అందులో పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సారంగి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఓ వార్తా హెడ్డింగ్ స్క్రీన్షాట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అర్చిత.. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. “డీపీ (ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశించి..) పీఏ నా తల్లికి మెసేజ్ చేసి ఈ స్టోరీని డిలీట్ చేయమని అడుగుతారని తెలుసు.. కానీ నేను డిలీట్ చేయను. ఇలాంటి విషయం ఇంతకుముందు కూడా జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. కాబట్టి అడగాల్సిన అవసరం లేదు.. నేను డిలీట్ చేయను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయినట్లు సమాచారం.ఎవరీ తల్లీకూతుళ్లు?అర్చిత సారంగి తల్లి అపరాజిత సారంగి ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో భువనేశ్వర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న అపరాజిత సారంగి.. బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక అర్చిత ఎంబీఏ పూర్తి చేసుకుంది. అంతకు మించి ఆమె గురించి వివరాలేవీ నెట్టింట సమాచారం. అయితే తన కుమార్తె చేసిన పోస్ట్ విషయంలో ఆమె మాత్రం ధర్మేంద్ర ప్రధాన్కు మద్దతుగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమె సమర్థిస్తూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.Our daughter, Archita, has been selected for the MBA course at UNIVERSITY OF OXFORD. We convey our deep sense of gratitude to all our friends and well wishers.Jai Jagannath ! 🙏 pic.twitter.com/sNejUZYf6s— Aparajita Sarangi, MP,( Lok Sabha) Bhubaneswar (@AprajitaSarangi) March 9, 2024ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు?ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అవకతవకలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆయన.. విద్యార్థుల ఆకాంక్షలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కొత్త చర్చకు కారణంమంత్రికి మద్దతుగా ఆమె తల్లి నిలబడగా.. అదే సమయంలో కుమార్తె మాత్రం రాజీనామా వార్తను షేర్ చేయడం, దాన్ని తొలగించనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అటు అస్సాంలోనూ ఎన్డీయే కూటమి మంత్రి కేశబ్ మహంతా(అస్సాం గణ పరిషత్ పార్టీ) కూతురు దిసాబా కూడా ఇలాగే నీట్ నిరసనల్లో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ నినాదాలు చేశారు. ఇలా కుటుంబంలోనే.. అదీ అధికార పార్టీలకు చెందిన వాటిలో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. -
పాపం ధనుష్.. ఆ మాటలకే ఇన్ని తిట్లా?
సినీ పరిశ్రమకు, రాజకీయాలకు మధ్య అనుబంధం తమిళనాట కొత్తేమీ కాదు. తెరపై భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న పలువురు నటులు.. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వేదికగా మార్చుకుని.. ఆ తర్వాత రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ప్రయాణం ఇప్పుడు మరికొందరు సినీ ప్రముఖుల భవిష్యత్తుపైనా ఆసక్తి పెంచింది.ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో ధనుష్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. అభిమానుల్లో, నెటిజన్లలో కొత్త చర్చకు కారణమయ్యాయి. అయితే ధనుష్ అసలు రాజకీయాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆయన మాటలను కొందరు పొలిటికల్ యాంగిల్లో విశ్లేషిస్తున్నారు. తన అభిమానులను ఉద్దేశించి ధనుష్ మాట్లాడుతూ.. కేవలం సినిమా వేడుకలు, అభిమానుల సమావేశాలకే పరిమితం కాకుండా.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.“ఒకచోట ఇంతమంది కలవడం వెనుక ఎంతో శక్తి ఉంది. ఆ శక్తికి ఒక లక్ష్యం ఉండాలి. ఆడియో లాంచ్లు, మీటింగ్స్కే పరిమితం కాకుండా.. మీ చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయండి. మీ ప్రాంతంలోని కుటుంబాలకు అండగా నిలవండి. మీపై నేను మరింత గర్వపడేలా చేయండి” అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.ఇక్కడి నుంచే అసలు చర్చ మొదలైంది. “ఇది కేవలం అభిమానులకు ఇచ్చిన సామాజిక సందేశమా? లేదంటే భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి సంకేతమా?” అని చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ చర్చకు మరో కారణం విజయ్ రాజకీయ ప్రయాణమే. విజయ్ కూడా గతంలో తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ధనుష్ కూడా అదే దారిలో వెళ్తున్నారా? అంటూ కొందరు పోల్చడం మొదలుపెట్టారు.ఇటు విజయ్ అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. “విజయ్ బాటను కాపీ చేస్తున్నారా?” అంటూ కొందరు సోషల్ మీడియాలో ధనుష్ను ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ధనుష్ను ఆయన మాజీ మామ, సూపర్స్టార్ రజినీకాంత్తో పోలుస్తూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఏళ్ల తరబడి ఊహాగానాలు వచ్చినప్పటికీ.. చివరకు ఆయన వెనక్కి వెళ్లిపోయారు. విజయ్ గెలుపు సమయంలోనూ అభినందించకుండా ‘అసూయ’ను ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో “రజినీకాంత్ వల్లే కాలేదు.. ఇంక ధనుష్ ఏం చేస్తారు?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే ధనుష్ అభిమానులు మాత్రం సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం మాత్రమే రాజకీయ ఎంట్రీకి సంకేతం కాదని, ప్రతి హీరో వ్యాఖ్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదంటున్నారు. రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇప్పటిదాకా ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు అభిమానులను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరిన సందేశంగానే కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో సినీ హీరోలకు ఉన్న ప్రజాదరణ, అభిమాన సంఘాల ప్రభావం కారణంగా ఇలాంటి చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి. -
బాబు పాలన అన్నిటా అథమం!
సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా అప్పు చేయనిదే పూట గడవని దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బిహార్, జార్ఖండ్ కంటే దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వెల్లడించింది. 2024– 25 ఏపీ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి కేవలం 1.97 శాతానికే పరిమితమైంది. అదే బిహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాల పరంగా మేఘాలయ, త్రిపుర, సిక్కిం, కేరళ కంటే తక్కువగా 22వ స్థానానికి పరిమితమైనట్లు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రెండేళ్లలోనే ఏపీ అప్పులు మాత్రం ఏకంగా రూ.3,59,157 కోట్లకు ఎగబాకాయి. ద్రవ్య, రెవెన్యూ లోటు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రెండేళ్లలో రాష్ట్రంలోకి రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయని చంద్రబాబు సర్కారు నమ్మబలికినా అందులో ఏమాత్రం నిజం లేదని, వచ్చినవి రూ.6,962 కోట్లేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే రెడ్బుక్ వేధింపులు, కప్పం కట్టలేక రెండేళ్లలో ఏపీ నుంచి బయటకు వెళ్లిపోయిన కంపెనీల పెట్టుబడుల విలువ ఏకంగా రూ.6,215 కోట్లు కావడం గమనార్హం. ఇక రెండేళ్ల క్రితం వరకు సులభతర వాణిజ్యంలో మొదటి స్థానంలో నిలబడటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ ఇప్పుడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్లో ఏకంగా ఎనిమిదవ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగం గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి దేశంలో 36 రాష్ట్రాలు ఉంటే పోలీస్ వ్యవస్థ పనితీరులో మన రాష్ట్రం 26వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కొలమానంగా భావించే కొన్ని వ్యవస్థలు గత రెండేళ్లలో ఎంత దారుణంగా పతనమయ్యాయో ఒకసారి పరిశీలిస్తే.. జీఎస్డీపీలో తగ్గిపోయిన జీఎస్టీ వాటా రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి.. లక్షలాది మందికి ఉపాధి లభించింది... రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు రాష్ట్రంలో ప్రతి నెలా నమోదవుతున్న జీఎస్టీ గణాంకాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. గత రెండేళ్లుగా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జీఎస్టీ వాటా గణనీయంగా పడిపోతుండటమే దీనికి నిదర్శనం. స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2023–24లో రాష్ట్ర జీఎస్డీపీలో 2.20 శాతంగా ఉన్న జీఎస్టీ గడిచిన రెండేళ్ల కాలంలో 30 బేసిస్ పాయింట్లు తగ్గి 1.90 శాతానికి పడిపోయింది. 2025–26లో జీఎస్డీపీ రూ.17,62,357 కోట్లుగా ఉంటే అందులో జీఎస్టీ రాబడి కేవలం 1.9 శాతం అంటే రూ.34,301 కోట్లు మాత్రమేనని కేంద్రమంత్రి లోక్సభలో వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలో ఎటువంటి వృద్ధి నమోదు కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. సంపద సృష్టిస్తే జీఎసీడీపీలో జీఎస్టీ వాటా పెరగాలి కానీ ఎందుకు తగ్గిందని ఆర్థికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతా అప్పులే.. ఆస్తుల్లేవ్ రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దొరికిన చోటల్లా అప్పులు చేయడమేగానీ ఆస్తుల కల్పన ఊసే మరిచారు. అన్ని అప్పులు చేస్తున్నా సంక్షేమాన్ని ప్రజలకు అందించడం లేదు. రెండేళ్లలో చంద్రబాబు సర్కారు బడ్జెట్ లోపల, బయట, రాజధాని పేరుతో చేసిన అప్పులు రూ.3,59,157 కోట్లకు చేరాయంటే ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారో ఊహించవచ్చు. అంటే రోజూ రూ.492 కోట్లు అప్పు చేయనిదే బాబు సర్కారుకు పూట గడవడం లేదు. సంపద సృష్టి మాటే లేదు. అప్పులతో పాటు నిత్యం చేబదుళ్లు, ఓడీలతో పాలన కొనసాగుతోంది. శాంతి భద్రతల్లో 26వ స్థానం రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. రాష్ట్ర పోలీసుల పనితీరు దేశవ్యాప్తంగా కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 36 రాష్ట్రాలతో పోలిస్తే 26వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. పోలీసు సంస్కరణలు, నేర, న్యాయ చట్టాల అమల్లో రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థాయికి పడిపోయిందనే విషయాన్ని ఈ నివేదిక కళ్లకు కట్టినట్లు చూపించింది. కీలకమైన శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఏపీ పోలీసుల పనితీరు అత్యంత నాసిరకంగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు గాను రాష్ట్రానికి కేవలం 29.88 పాయింట్లే వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే అక్రమ కేసులు బనాయించడం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, కోర్టులు మొట్టికాయలు వేసినా పట్టించుకోకపోవడం లాంటి అంశాలలో కనుక ర్యాంకులు ప్రకటిస్తే మొదటి స్థానం దక్కేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ద్రవ్య, రెవెన్యూ లోటుల్లో అగ్రస్థానంద్రవ్య, రెవెన్యూ లోటులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్న విషయాన్ని కాగ్ కుండబద్ధలు కొట్టింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్ట నిబంధనలను ఉల్లంఘించి ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తారస్థాయికి చేరుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ –5.09 శాతం ద్రవ్యలోటుతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కాగ్ వెల్లడించింది. ఇదే సమయంలో రెవెన్యూలోటు ఏకంగా రూ. –60,285 కోట్లతో దేశంలో ఏ రాష్ట్రానికి అందనంత ఎత్తులో నిలిచింది. 2024–25లో భారీగా అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ అందులో మూలధన వ్యయానికి కేవలం 27 శాతమే వ్యయం చేసినట్లు కాగ్ పేర్కొంది. చేసిన అప్పులను మూలధన వ్యయానికి కాకుండా ఇతర రెవెన్యూ వ్యయాలకు వెచ్చించటాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక నిర్వహణ విధానం ఎంత దారుణంగా ఉందో వెల్లడవుతోంది. వచ్చినవి రూ.6,962 కోట్లే పోయినవి రూ.6,215 కోట్లు.. రాష్ట్రంలోకి రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి.. రెండేళ్లలో 24 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించేశామంటూ చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైంది. గత రెండేళ్లలో ఏపీకి కేవలం రూ.6,962 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. డీపీఐఐటీ, ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత రెండేళ్లలో రాష్ట్రంలోకి మొత్తం పది ప్రాజెక్టులు రాగా అందులో రెండు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, మిగిలిన 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ప్రసాద తాజాగా లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి రూ.6,962 కోట్లని, వీటి ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. ఇదే సమయంలో చంద్రబాబు సర్కారు కప్పం వసూళ్లకు తట్టుకోలేక ఏపీ నుంచి వెళ్లిపోయిన కోకోకోలా, జ్యూపిటర్, అజాద్ మొబిలిటీ, ఐస్పేస్, జిన్ఫ్రా లాంటి కంపెనీల పెట్టుబడులు రూ.6,215 కోట్లుగా ఉండటం గమనార్హం. అంతేకాదు.. లోక్సభలో కేంద్రం మరో ప్రశ్నకు సమాధానమిస్తూ గడిచిన రెండేళ్లలో ఏపీలో 4,520 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని, తద్వారా 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండేళ్లలో 22,167 ఉద్యోగాలు వస్తే ఇదే సమయంలో 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే ఈ రెండేళ్లలో కొత్తగా ఒక్క ఉద్యోగం రాకపోగా ఉన్న 26,310 మంది ఉద్యోగులను రాష్ట్రం కోల్పోయింది. పెట్టుబడుల స్నేహపూర్వక రాష్ట్రాల్లో 8వ స్థానంరెండేళ్ల క్రితం దాకా పెట్టుబడుల ఆకర్షణలో మొదటిస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా ఎనిమిది మెట్లు దిగజారిపోయింది. పెట్టుబడిదారుల అభిప్రాయాలను సేకరించి ర్యాంకులను ప్రకటించడం మొదలు పెట్టిన 2019 నుంచి 2023 వరకు సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ స్థానంలో తీసుకొచ్చిన ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్లో 8వ స్థానానికి పడిపోయింది. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 131 మంది పారిశ్రామికవేత్తల నుంచి ఎనిమిదికిపైగా రంగాల పనితీరు ఆధారంగా ఆ ర్యాంకులను ప్రకటించారు. పెట్టుబడుల స్నేహశీల రాష్ట్రాల ర్యాంకుల్లో గుజరాత్ 56.6 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 48.7 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఎనిమిది రంగాల డేటా విశ్లేషణ ద్వారా ఏపీకి 26.5 పాయింట్లు వస్తే సర్వేలో 22.2 పాయింట్లు లభించాయి. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్కే వచ్చాయని, రెండేళ్లలో రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం నిజమైతే పారిశ్రామికవేత్తలు అంత ఘోరమైన ర్యాంకు ఎందుకు ఇస్తారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. -
జై జవాన్.. జై కిసాన్.. జై 'యువ'
సాక్షి, హైదరాబాద్: వికసిత్ భారత్ 2047, సబ్కా సాథ్ సబ్కా వికాస్ వంటి నినాదాలతో మాత్రమే మార్పు రాదని, యువశక్తిని సరైన దిశలో నడిపించి దేశ భవిష్యత్తుతో వారిని అనుసంధానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ఒకప్పుడు ‘జై జవాన్, జై కిసాన్‘ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ‘జై జవాన్, జై కిసాన్, జై యువ‘ అనే నినాదంతో ముందుకెళుతుందని చెప్పారు. యువశక్తి ఇక రోడ్లపై పోరాడటమే కాదు, పార్లమెంట్లోకి రావడానికీ సిద్ధంగా ఉందని, చట్టాలను కేవలం పాటించడానికే కాదు, రూపొందించడానికీ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాల్లో లోక్సభ స్థానాల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో పాటు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గించే అంశంపై కూడా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నాలుగు అంశాలపై ఒకేసారి చర్చ జరగాలని, ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం ఉంటే ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలు, భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలు తీసుకుని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం జాతీయ మీడియాతో మాట్లాడారు. విని, ఆలోచించి, చట్టం చేయాలి ‘ప్రదానమంత్రికి తెలంగాణ ప్రభుత్వం తరఫున నా డిమాండ్ ఒక్కటే. సీట్ల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్తో పాటు ఎన్నికల వయసు తగ్గింపు అంశాన్ని కూడా చర్చించండి. దేశంలో లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ.. ఇలా ఎక్కడ ఎన్నికల వ్యవస్థ ఉన్నా అక్కడ చర్చ జరగాలి. ప్రజల స్వరమే దీనిపై తుది నిర్ణయానికి ఆధారం కావాలి. ప్రధాని మోదీ ఎప్పుడూ మాట్లాడడమే కాదు వినడమూ అలవర్చుకోవాలి. మీ పార్టీ, మీ వ్యవస్థలో మీరు చెప్పేది అందరూ వింటారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ‘మన్ కీ బాత్‘ పేరుతో ఆకాశవాణిలో మాట్లాడుతూనే ఉంటారు. మీకు మాట్లాడడం మాత్రమే అలవాటు. వినే అలవాటు లేదు. కానీ ఇప్పుడు వినడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే దేశం మారుతోంది. దేశ ప్రజలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడడం ప్రారంభించారు. మీరు కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. విని, ఆలోచించి, చట్టం చేయాలి. యువశక్తిని రాజకీయ వ్యవస్థలోకి తీసుకొస్తే దేశ భవిష్యత్తు మారిపోతుంది. 21, 25 సంవత్సరాలకు తగ్గించాలి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఇంకా 25 సంవత్సరాలుగానే ఎందుకు ఉండాలి? అందుకే ఆగస్టు నెలను చరిత్రాత్మక నెలగా మార్చాలని నిర్ణయించాం. తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించి, ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు, రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 25 సంవత్సరాలకు తగ్గించాలని తీర్మానం చేసి ఆమోదించాలని నిర్ణయించాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మోదీకి ఇది రెండో పరాజయం ‘దేశంలోనే అత్యంత శక్తివంతుడు తానేనని భావించే మోదీకి ఇది రెండో పరాజయం. రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తెచ్చినప్పుడే రాహుల్గాంధీ హెచ్చరించారు. ఈ చట్టాలను దేశ ప్రజలు అంగీకరించరని, విరమించుకోవాలని సూచించారు. కానీ మోదీ తనను ఏమీ చేయలేరని భావించారు. రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని నాడు రాహుల్గాంధీ చెప్పినా వినలేదు. చివరకు దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమబాట పట్టారు. ప్రాణాలు పోయినా వెనక్కు తగ్గకుండా ఉద్యమించి మోదీని వెనక్కు తగ్గించారు. ఆ మూడు నల్లచట్టాలను విరమించుకునేలా చేసి రైతులకు క్షమాపణలు చెప్పించారు. దాన్ని ఒక పాఠంగా తీసుకుని మోదీ మారతారని, ప్రతిపక్షానికి గౌరవం ఇస్తారని భావించాం. కానీ మారలేదు. పాత ధోరణినే కొనసాగించారు. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి విద్యా రంగంలోనూ అదే పరిస్థితి కనిపించింది. యూజీసీ–నెట్ సహా అనేక పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పరీక్షలు రాసిన విద్యార్థులు విఫలం కాలేదు.. పరీక్షలను సక్రమంగా నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వమే విఫలమైంది. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ, నార్కోటిక్స్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరించి విద్యార్థులను, వారి పక్షాన మాట్లాడిన వారిని నియంత్రించాలని ప్రయత్నించారు. దేశమంతా వీధుల నుంచి పార్లమెంట్ వరకు తమ శక్తిని యువత చాటింది. 56 అంగుళాల ఛాతీ అంటూ గొప్పలు చెప్పుకున్న అహంకారాన్ని ఓడించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదు.. నీట్ ఘటనల్లో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు కేంద్రం ఆర్థికసాయం అందించాలి. విద్యార్థులపై పెట్టిన అన్ని క్రిమినల్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. రాహుల్గాంధీ కోరినట్టు అది జరగకపోతే యువశక్తి మరో ఉద్యమం చేపడుతుంది..’ అని రేవంత్రెడ్డి హెచ్చరించారు. ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులదే.. ‘మొదట దేశం, తర్వాత ప్రజలు, చివరగా పార్టీ. దేశ ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు కాంగ్రెస్ ముందు నిలబడుతుంది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, నిజాం పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసింది, స్వతంత్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు యువత చేసిన ఉద్యమాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావించడం లేదు. ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులు, యువతదే. వారికి అండగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకుంది. పేదలను మరింత పేదలుగా మార్చడం బీజేపీకి ఎప్పుడూ అలవాటు. అందుకే చిన్న రాష్ట్రాలన్నింటికీ నష్టం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతోంది. దీనికి శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనాలి..’ అని సీఎం అన్నారు. -
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్రావు. ఓటు హక్కు వయస్సు, ఎన్నికల నిబంధనలు వంటి అంశాలను నిర్ణయించే అధికారం భారత ఎన్నికల సంఘం (Election Commission of India) మరియు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఇటువంటి అంశాలపై ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధికి తగదన్నారు. అదేవిధంగా, రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని,. ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం కావడంతో విద్యార్థులు తమ విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఇతర అంశాలపై దృష్టి మళ్లించడం సరైంది కాదన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నామన్నారు. -
‘నిరుద్యోగుల జీవితాలతో కూటమి సర్కార్ ఆటలు’
సాక్షి, విజయనగరం: నిరుద్యోగుల జీవితాలతో కూటమి ఆటలాడుతోందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘జీవోలు ఇష్టం వచ్చినట్లు మార్చేశారు. కూటమి పాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు’’ అని బొత్స నిలదీశారు.‘‘డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకత లేదు. కేంద్రంలో కూడా నీట్ పరీక్షలు లీక్పై ఇలాంటి కబుర్లు చెప్పారు. అక్కడ ఏమైంది?. విద్యా దీవెన పథకం వైఎస్సార్ తీసుకొచ్చిన పథకం. తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు. వైఎస్ జగన్ ఇస్తామంటే ఎన్నికలు వచ్చాయని కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. అందుకే బకాయి ఉంది. అవి ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా? లేదా?..స్పోర్ట్స్ కోటాలో నచ్చిన వ్యక్తులకు డీఎస్సీలో నచ్చిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చేశారు. నియామకాలు అయిపోయాక ఆ జీవోను రద్దు చేశారు. ఏ ఒక్కరికి అయిన నిరుద్యోగ భృతి ఇచ్చారా?. విద్యార్థులు, నిరుద్యోగులను వేదిస్తున్నారు. నాడు-నేడు స్కూళ్లను కొనసాగించాల్సిన బాధ్యత లేదా?. పిల్లలు చెట్లు కింద చదువు కుంటున్నారు. ఎంత అప్రతిష్ట.. ఒక పక్కన విద్యాదీవెన లేదు, నిరుద్యోగ భృతి లేదు, డీఎస్సీలో అక్రమాలు.. ఇంత దారుణమా?..భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ఏమైనా ఉద్దారించారా?. విభజన చట్టం ప్రకారం భోగాపురం ఎయిర్ పోర్ట్కి అనుకూలమని కేంద్రం అనుమతులు ఇచ్చారు.. ఎయిర్పోర్ట్కి చంద్రబాబు 15 వేలు ఎకరాలు కావాలని అన్నారు. ఆ తరువాత 5 వేల ఎకరాలు లాక్కోవాలని చూశారు. మేం పోరాటం చేసాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక 2203 ఎకరాలకు కుదించి అనుమతులు ఇవ్వడంతో పనులు ప్రారంభమయ్యాయి...విజయవాడ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇంకా విస్తరణ పూర్తి చేయలేదు. ప్రధాని మోదీ పర్యటన తరువాత భోగాపురంలో మేము సభ పెట్టి అన్ని వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం. ఎయిర్పోర్ట్ భూసేకరణ చేయలేకపోయారు. జిల్లా వైఎస్సార్సీపీ ఆఫీస్ విషయంలో అశోక్ గజపతి రాజు జోక్యం చేసుకోవడం తగదు. గురివింద గింజ సామెత గుర్తు పెట్టుకోండి.. మీ గౌరవం కాపాడుకోండి’’ అని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. -
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (79) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆదివారం ప్రకటించారు. వయసు పెరగడం, ఆరోగ్యం బలహీనపడటం, రాజకీయాల్లో అవినీతి పెరగడమే ఇందుకు కారణమని చెప్పారు.ఎక్స్లో చేసిన పోస్టులో సిద్ధరామయ్య, ప్రజా జీవితంలో చురుగ్గా కొనసాగుతానని, కానీ ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. "రాజకీయ రంగం అవినీతిమయంగా మారిపోయింది. అందుకే నేను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అయితే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజల కష్టసుఖాలకు గొంతుకగా నిలుస్తాను" అని పేర్కొన్నారు.తన వరుణ నియోజకవర్గ ప్రజలు మరోసారి పోటీ చేయాలని కోరుతున్నారని, కానీ ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. తన నిర్ణయానికి కారణం వివరిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి తన వయసు 81 లేదా 82 ఏళ్లు ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు."ఇప్పుడు నా వయసు 79 ఏళ్లు. మా ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అప్పటికి నాకు 81-82 ఏళ్లు వస్తాయి. నా ఆరోగ్యం గతంలో ఉన్నంత బలంగా లేదు. ఇంతకుముందులా అదే ఉత్సాహంతో పని చేయడం ఇక సాధ్యం కాదు" అని అన్నారు.సిద్ధరామయ్య తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి కూడా ప్రస్తావించారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ప్రజా జీవితంలో అడుగుపెట్టానని, 2028తో ఆ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు."ఓటములు, విజయాలు రెండూ చూశాను. కానీ నేను నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఎప్పుడూ వ్యవహరించలేదు. నా మనస్సాక్షిని ఎప్పుడూ మోసం చేయలేదు అన్న సంతృప్తి నాకు ఉంది" అని చెప్పారు. ఎన్నికల రాజకీయాల తీరు మారిపోయిందని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు."ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రాజకీయాలు పూర్తిగా అవినీతిమయంగా మారిపోయాయి. నిజాయితీ రాజకీయాలకు నిలదొక్కుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను" అని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలు ప్రకటించినా, ప్రజల కోసమే పని చేస్తానని సిద్ధరామయ్య చెప్పారు. "50 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు నన్ను తమలో ఒకడిగా భావించి ప్రేమతో నడిపించారు. ఆ రుణం నా మీద ఉంది. అందుకే నా మిగిలిన జీవితం కూడా ప్రజాసేవకే అంకితం" అని పోస్టులో పేర్కొన్నారు. -
‘లోకేష్ రాజీనామా చేయాల్సిందే’
కాకినాడ: డీఎస్సీ స్కామ్పై అన్ని ఆధారాలు చూపించామని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ ఒక్కటే సరైనదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. డీఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగిందని ఆధారాలతో సహా చూపించామని, అయినా ఇప్పటివరకూ విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ, ప్రభుత్వం కానీ స్పందించలేదన్నారు. లోకేష్ గతంలో చాలెంజ్ విసిరితే తాము సిద్ధమయ్యామని, మీరు మాత్రం తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిత్వ హననం చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. యువత పోరాటానికి కూటమిలో బీజేపీ మంత్రి నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. మరి డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేలిన తర్వాత లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు కురసాల కన్నబాబు. లోకేష్ నైతిక బాధ్యత లేదా? అని నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు వేయడం లేదని కన్నాబాబు ప్రశ్నించారు.డీఎస్సీలో స్కామ్ అనేది నిజంవిజయవాడ: డీఎస్సీలో పెద్ద స్కామ్ జరిగిందనేది వాస్తవమని, మెగా డీఎస్సీ కాదు.. ఇది దగా డీఎస్సీ అని యువతే అంటున్నారని ఎమ్మెల్యే కల్పలతరెడ్డి ధ్వజమెత్తారు. డీఎస్సీపై వచ్చింది ఆరోపణలు కాదని, నిజం అనే విషయం తెలుస్తుందన్నారు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారని, అందుకోసం జీవోలు మార్చారని మండిపడ్డారు. నిజంగా డిఎస్పీ కోసం చదివిన అభ్యర్ధులు మాత్రం నష్టపోయారని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయడాలని డిమాండ్ చేశారు. ఒక్కో పోస్ట్కి రూ. 15 లక్షలు అంటూ ఆడియోలు కూడా వచ్చాయని, ఇది వాస్తవం కాదా? అని నిలదీశారు. డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
‘తప్పు చేయకపోతే.. లోకేష్కు ఎందుకంత భయం’
సాక్షి, నెల్లూరు జిల్లా: నీట్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఏపీ డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. ఇంతపెద్ద అవినీతి జరిగితే నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయరు? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణ కోరితే కనీసం జరిగిన అక్రమాలపై స్పందన లేదని మండిపడ్డారు.‘‘డీఎస్సీ అక్రమాలపై గత 4 నెలలు నుంచి పోరాటాలు చేస్తున్నాం. డీఎస్సీ అక్రమాలపై ఇప్పటివరకు ఒక ఎంక్వైరీ వేయలేదు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున పోరాటం చేసింది. డీఎస్సీ అవకతవకల వైఎస్సార్సీపీ సాక్ష్యాధారాలతో చూపింది. నేటికి ఒక్క అంశంపై పారదర్శకమైన విచారణ కానీ.. స్పందన కానీ లేదు. లోకేష్ ఏ తప్పూ చేయకపోతే.. సీబీఐ ఎంక్వైరీ అంటే ఎందుకు అంత భయం?’’ అంటూ చంద్రశేఖర్రెడ్డి నిలదీశారు. -
10 గంటల్లో 12 కోట్ల వ్యూస్.. సోషల్ మీడియాలో సీజేపీ సెన్సేషన్!
న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోషల్ మీడియాలోనూ భారీ ఆదరణ పొందుతోంది. సీజేపీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఓ వీడియో కేవలం 10 గంటల్లోనే 12 కోట్ల (120 మిలియన్) వ్యూస్ను సాధించి రికార్డు సృష్టించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారనే సమాచారం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు ఫోన్లో అందిన క్షణాలను వీడియోగా చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. అది కాస్తా వైరలైంది. ఈ వీడియోకు వచ్చిన స్పందనతో సోషల్ మీడియాలో సీజేపీ ప్రభావం ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది.నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ప్రారంభమైన ఉద్యమం తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో యువతను ఆకర్షించింది. రాయిటర్స్ కథనం ప్రకారం, సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పటికే 2.2 కోట్ల మంది ఫాలోవర్లు చేరడం విశేషం. ముఖ్యంగా యువతతో అనుసంధానం కావడానికి ఇన్స్టాగ్రామ్ ఈ ఉద్యమానికి ప్రధాన వేదికగా మారింది.అయితే సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్, లైక్లు ఉద్యమానికి ఉన్న రాజకీయ మద్దతును పూర్తిగా ప్రతిబింబించవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, భారత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇదిలా ఉండగా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు సీజేపీ నాయకులు ఆసక్తికరంగా స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ భారత్లో దేనికీ 'నో' చెప్పకూడదు. ప్రస్తుతం మాత్రం మా దృష్టి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంపైనే ఉంది అని అన్నారు. DEMOCRACY WINS! 🇮🇳Education minister Dharmendra Pradhan has resigned. pic.twitter.com/DsB6hCHUzP— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 -
'నో చెప్పలేం'.. రాజకీయ ఎంట్రీపై కాక్రోచ్ జనతా పార్టీ బిగ్ హింట్!
ఢిల్లీ: బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరూపించింది. నీట్-యూజీ పేపర్ లీకేజీపై సీజేపీ చేసిన ఐదు వారాల ఉధృత పోరాటానికి దిగివచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఈ చారిత్రాత్మక విజయం అనంతరం..ఓ జాతీయ మీడియా సంస్థ ..‘సీజేపీ ప్రతినిధుల్ని మరి మీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా?’..అని అడగ్గా.. భారత్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి దేనినైనా పూర్తిగా కొట్టిపారేయలేం’ అంటూ సీజేపీ నాయకత్వం తాము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే బలమైన హింట్ ఇచ్చింది.ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరించిన వెంటనే జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తమ ఉద్యమ భవిష్యత్తు గురించి, అలాగే తమ బృందం భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందా అనే అంశాలపై మాట్లాడారు.ఇప్పుడు నా మనసులో ఉన్న ఏకైక ఆలోచన ఇంటికి వెళ్లి నిద్రపోవడం, కాస్త విశ్రాంతి తీసుకోవడం,నా కుటుంబాన్ని కలవడం మాత్రమే. గత కొన్ని నెలలుగా నేను ఇంటికి దూరంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటూ గత రెండు నెలల్లో జరిగిన పరిణామాల గురించి ఆలోచించుకోవాలని అనుకుంటున్నాను. ఇదంతా మా అందరికీ ఒక పెద్ద అనుభూతిని కలిగించే విషయం. ఇది గర్వపడాల్సిన సమయం. ఊరట పొందే సమయం ఇది. ఆ తర్వాత, పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం’ అని రంకా చెప్పారు.ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేస్తున్నారా అని అడిగినప్పుడు ‘భారత్లో దేనికీ నో అని చెప్పకూడదనేదే నా అభిప్రాయం అని ఆయన బదులిచ్చారు. అయితే, రాజకీయాలు సీజేపీ బృందం తక్షణ లక్ష్యం కాదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.ప్రస్తుతం మా దృష్టి చాలా స్పష్టంగా ఉంది. ఈ ఉద్యమం క్షేత్రస్థాయికి వెళ్లాలి. ఎందుకంటే ఇప్పటికే 750-800 రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ వాటిలో ఏదీ యువత ఆకాంక్షలను నెరవేర్చ లేకపోతోంది. అధికారంలో ఏ పార్టీ లేదా నాయకుడు ఉన్నా సరే వారు యువత కోసం పనిచేసేలా వారి డిమాండ్లను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అదే మా ప్రస్తుత అజెండా’ అని దాస్ చెప్పారు. -
SBI బ్యాంక్ మేనేజర్ చెంప చెళ్లుమనిపించిన మాజీ కేంద్రమంత్రి కుమార్తె
సాక్షి,చెన్నై: మాజీ కేంద్ర మంత్రి కుమార్తె విచక్షణ కోల్పోయారు. విధుల్లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్పై చేయిచేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వివరాల్లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్పై దాడి చేసిన ఆరోపణలపై మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి కుమార్తె కయల్విళి అళగిరిపై చెన్నై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉన్న ఎస్బీఐ ఎన్ఆర్ఐ బ్రాంచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. అడయార్లోని ఎస్బీఐ బ్రాంచ్ నడుస్తున్న కమర్షియల్ భవనానికి కయల్విళి యజమాని. ఆ బిల్డింగ్లోని లిఫ్ట్ చాలా రోజులుగా పనిచేయకపోవడంతో, దానిని బాగు చేయాల్సిందిగా బ్యాంక్ మేనేజర్ హర్షీన్ సింగ్ నేరుగా కయల్విళికి ఫోన్ చేసి కోరారు. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూలై 20న ఆమె నేరుగా బ్యాంక్ బ్రాంచ్కు వచ్చారు.బ్యాంకులో మేనేజర్తో కయల్విళి వాగ్వాదానికి దిగారు. మాటల మధ్యలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె అకస్మాత్తుగా లేచి మేనేజర్ చెంప చెల్లుమనిపించారు. ఈ దృశ్యాలన్నీ బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారడంతో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై ఎస్బీఐ చీఫ్ మేనేజర్ నమశ్శివాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్ను దూషించడం, దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అడయార్ పోలీసులు కయల్విళిపై పలు సెక్షన్ల కింద కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. On Camera, Ex-Union Minister's Daughter Slaps SBI Branch Manager In ChennaiRead more: https://t.co/Olg38adgA8 pic.twitter.com/rF9Rp9Ispj— NDTV (@ndtv) July 25, 2026 -
మాకు ఆత్మగౌరవం కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దళిత ప్రజా ప్రతినిధులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడ్డారు. పార్లమెంటు సభ్యులుగా, శాసనమండలి, శాసన సభ్యులుగా ప్రజాక్షేత్రంలో గెలిచినప్పటికీ... ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద కనీస మర్యాద లేకపోవడం పరాజయం కంటే ఘోర అవమానంగా భావిస్తున్నట్లు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా గెలిచినందుకే ఈ అవమానాలు పడాల్సి వస్తుందా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రజాప్రతినిధుల మాదిరిగా తమకు కూడా గౌరవ మర్యాదలు దక్కాలని, అందరితో సమానంగా ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యం పొందాలని వారు కోరుతున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ ప్రజాప్రతినిధుల కమిటీ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, కన్వీనర్ మల్లు రవి నేతృత్వంలో ఎస్సీ ఎంపీలు కడియం కావ్య, గడ్డం వంశీ, ప్రభుత్వ విప్లు అద్దంకి దయాకర్, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఏఆర్ నాగరాజు, మట్టా రాగమయి, మందుల సామేల్, కడియం శ్రీహరి తదితరులు శనివారం ప్రజాభవన్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి గోడును వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో గెలిపిస్తే... ఆయా ఎస్సీ ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం దక్కడం లేదంటూ ఉపముఖ్యమంత్రి ఎదుట వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ నియోజకవర్గాల్లో డివిజన్ స్థాయి అధికారి నుంచి మండల స్థాయి అధికారి వరకు ఎవరికి బదిలీ అయినా తమ దృష్టికి రావడం లేదని, కనీసం కొత్త అధికారులకు పోస్టింగ్ ఇస్తున్న విషయం కూడా కనీస సమాచారం ఉండడం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల పర్యటన వివరాలు కూడా తమకు తెలిడయం లేదని వివరించారు. ఈ అంశంపై జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు, చివరకు కలెక్టర్ను అడిగినా స్పందన రావడం లేదని, సచివాలయంలోని సంబంధిత శాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే వారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఎస్సీ ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా భట్టి ముందు విన్నవించారు. ప్రాధాన్యత ఇస్తేనే నియోజకవర్గంలో పార్టీకి మరింత మంచిపేరు వస్తుందని, తదుపరి ఎన్నికల్లో మరింత మెజార్టీ వస్తుందన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి భారీగా పెరుగుతోందని, కొందరు అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, వారితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వివరించారు. ఈ అవినీతిని అరికట్టకుంటే, అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని వ్యవహారాన్ని కట్టడి చేయకుంటే భవిష్యత్లో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందనే అంశాన్ని కూడా వివరించినట్లు తెలిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం అయ్యాయని, ఎస్సీ నియోజకవర్గాల్లో అదనంగా మరో వెయ్యి ఇళ్లు చొప్పున యూనిట్లు పెంచాలని ఎస్సీ ప్రజాప్రతినిధులు కోరారు. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధి ఇవ్వాలని కూడా వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పర్యటించాలని కోరినట్లు తెలిసింది. ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీ కూడా చర్చకు వచి్చనట్లు సమాచారం. ఎస్సీ ప్రజాప్రతినిధుల సమస్యలను సావధానంగా విన్న భట్టి వారికి నచ్చజెప్పినట్లు తెలిసింది. ఎస్సీ ప్రజాప్రతినిధుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భట్టి వారికి సూచించారు. అందరి ఐక్యతే పార్టీకి బలం అని, పార్టీకి నష్టం కలిగించే ఏ పనీ చేయవద్దన్నారు. తన పూర్తి సహకారం ఉంటుందని వారికి స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టీనేతల మధ్య సమస్యలు వస్తే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని, లేకుంటే పార్టీ అధ్యక్షుడు, లేదా తన దృష్టికి తీసుకురావాలని, అలా కాకుండా రచ్చకెక్కితే మంచిది కాదంటే తుంగతుర్తి వ్యవహారంపై స్పందించినట్లు తెలిసింది. -
ఎన్నో సాక్ష్యాలున్నా డీఎస్సీ స్కామ్పై బుకాయింపా?
సాక్షి, అమరావతి: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై దేశ వ్యాప్తంగా యువత ఆందోళనకు దిగడంతో ఎట్టకేలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నష్టపోయిన డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో టెట్, డీఎస్సీ పరీక్ష, అసలు డిగ్రీనే లేకున్నా బరితెగించి టీచర్ పోస్టులు కట్టబెట్టడంపై సాక్షాధారాలతో రుజువైనా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నాపత్నం అప్లోడ్ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టు సిబ్బందే డీఎస్సీ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా నిలవడం.. మొదటి జాబితాలో ఉన్న వారి పేర్లు రెండో జాబితాలో మాయం కావడం.. ఆపై అభ్యర్థి కోర్టుకు వెళ్లడం.. అతని ఐడీని బ్లాక్ చేయడం.. ఒక్కో పోస్టు రూ.15 లక్షలు అంటూ అంగట్లో సరుకులా బేరం పెట్టి అమ్మిన ఆడియోలు బట్టబయలు కావడం.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి పోస్టులు ఇవ్వకపోవడం.. కేవలం జిల్లా, జోన్ స్థాయి ఆటల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం.. ఆ సర్టిఫికెట్లు కూడా టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలే ఇవ్వడం.. ఇలా ఎన్నో సాక్ష్యాధారాలు స్కామ్ను బట్టబయలు చేశాయి. ఈ స్కామ్ను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సర్కార్ చేసిన విన్యాసాలు.. తప్పుమీద తప్పులు చేయడాలు.. అధికారులతో అబద్ధాలు చెప్పించడాలు అందరికీ తెలిసిందే. ఇంత అరాచకంగా, లెక్కలేనితనంతో సాగించిన ఈ స్కామ్.. నీట్ పేపర్ లీక్ కంటే రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించింది. డీఎస్సీ బాధితులు రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు చేశారు. అయినప్పటికీ బాబు సర్కార్ కనీస బాధ్యత వహించలేదు. తాజాగా నీట్ లీక్కు బాధ్యత వహిస్తూ ప్రధాన్ రాజీనామా చేసిన క్రమంలో డీఎస్సీ స్కామ్కు లోకేశ్ బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందేనని నిరుద్యోగులు పట్టుబడుతున్నారు.జాతీయ స్థాయి క్రీడాకారులకు అన్యాయం రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ–2025ను బాబు ప్రభుత్వం నిర్వహించింది. 16 వేల పోస్టుల్లో 3 శాతం పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద రిజర్వు చేసింది. స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమాలకు పాల్పడి కావాల్సిన వారికి దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చేశారు. ఈ కుంభకోణం కోసమే జీవో 4.. 47 తెచ్చారు. తద్వారా టెట్, రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా టీచర్ పోస్టు కట్టబెట్టే దారుణానికి బరితెగించారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేస్తూ చంద్రబాబు బంధువు.. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చైర్మన్గా ఉన్న క్రీడా సంఘాలు జారీ చేసిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా తమ వాళ్లకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసుకున్నారు. ఒక్కో టీచర్ పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు అమ్మేసుకునే బేరసారాలకు సంబంధించిన వీడియో, ఆడియో సాక్ష్యాలు బయటకు వచ్చాయి. మరోవైపు సాధారణ డీఎస్సీ కింద టీచర్ పోస్టుల భర్తీలోను పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన స్పోర్ట్స్ డీఎస్సీ కుంభకోణంతో నిజమైన క్రీడాకారులం నష్టపోయామని ఎందరో రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన తనకు టీచర్ ఉద్యోగం రాలేదని పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు దుర్గయ్య వంటి వారెందరో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ వాళ్లకు ఉద్యోగాలన్నీ ఇచ్చేసుకున్న తర్వాత జీవో 23.. 25.. 56 జారీ చేసి.. అంతకు ముందు ఇచ్చిన జీవో 4.. 47ను రద్దు చేసేశారు. ఇలా స్పోర్ట్స్ కోటా డీఎస్సీ రూపంలో జరిగిన స్కామ్ రాష్ట్ర ప్రజల కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. దుర్గయ్య తరహాలో మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులెందరో స్పోర్ట్స్ డీఎస్సీలో దగాకు గురయ్యారు. నష్టపోయిన వీరంతా తమకు అన్యాయం జరిగిందని ఎక్కడికక్కడ నిలదీసినా చంద్రబాబు సర్కార్లో కనీస చలనం లేదు. ఐడీ బ్లాక్ చేసి.. వివరాలు తొలగించి..ఈ కుంభకోణం కోసమే పక్కా స్కెచ్లో భాగంగా డీఎస్సీ కన్వీనర్ను చంద్రబాబు ప్రభుత్వం తొలుతే పక్కన పెట్టేసింది. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించింది. గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంకర్గా నిలిచాడు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) తెలుగు పరీక్షలో కూడా జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. డీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ అయిందనడానికి ఇదే పెద్ద నిదర్శనం. నవీన్ విషయం బయటకు వస్తే గుట్టురట్టు అవుతుందని అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదని చెప్పింది. తీరా అతని ఐడీని బ్లాక్ చేసి.. వివరాలు డీఎస్సీ డేటాలోనే లేకుండా ప్రభుత్వం చెరిపేసి కుట్రకు పాల్పడింది. అయితే మెరిట్ సాధించినా తనకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదని నవీన్ కోర్టును ఆశ్రయించడంతో బాబు సర్కార్ కుట్రలు బెడిసికొట్టాయి. ఈ ఘటన అనంతరం డీఎస్సీ పేపర్ లీక్.. నవీన్ ఒక్కడితో ఆగలేదని, సీబీఐ విచారణ చేసి వాస్తవాలను నిగ్గు తేల్చాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. 1:1 నిష్పత్తిలో పిలిచి మొండి చేయిడీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. పోస్టుల భర్తీకి 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. అన్ని నిబంధనలు, జీవోలను పరిగణనలోకి తీసుకుని.. డీఎస్సీ కమిటీ మెరిట్, రోస్టర్ను సిద్ధం చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రూల్ నంబర్ 20 చెబుతోంది. ఈ నిబంధన ఆధారంగా ఒక పోస్టుకు ఒకరి చొప్పున కాల్ లెటర్ పంపి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచింది. ఈ క్రమంలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నట్టు తేల్చిన అభ్యర్థుల్లో పలువురికి పోస్టులు దక్కలేదు. సెలక్షన్ లిస్ట్లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పించారు. ఇలా డీఎస్సీ ప్రక్రియలో ఆద్యంతం అక్రమాలు, అన్యాయాలు, బరితెగింపులు చోటు చేసుకున్నాయి. జరిగిన ప్రతి అక్రమం పక్కా సాక్ష్యాలతో బట్టబయలు అయింది. నష్టపోయిన అభ్యర్థులు కళ్లెదుటే కనిపిస్తున్నారు. వారంతా సీబీఐ విచారణ చేపట్టి అక్రమాలను నిగ్గు తేల్చాలని, లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకుండా పోయింది. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో లోకేశ్ సైతం అదే బాటలో రాజీనామా చేసి, డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహించాలని రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత డిమాండ్ చేస్తున్నారు.వీటినేమంటారు?⇒ స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిఫేట్ చేసిన సర్టిఫికెట్స్తో 270 పోస్టులు ఇచ్చేశారు. ⇒ ఆయా గేమ్స్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటెన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.⇒ వివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వివిధ యూనివర్సిటీల నుంచి పార్టిసిపేట్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. ⇒ ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షలు అంటూ బేరసారాలు ఆడిన వీడియో బయటపడింది. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం అన్నింటికంటే దారుణం. ⇒ ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలు, ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్లిస్టల్ క్లియర్గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. అందుకే థర్డ్ పార్టీ ఎంక్వైరీ.. అంటే సీబీఐతో విచారణ జరిపించాలి. -
ఈ సునామీ ఇంతటితో ఆగొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘రోడ్లపై జరిగిన మీ పోరాటం మళ్లీ ఇంటికి వెళ్లొద్దు. జంతర్మంతర్ నుంచి నేరుగా లోక్సభ, రాజ్యసభకు వెళ్లాలి. ఈ సునామీ ఇంతటితో ఆగొద్దు. ఇక్కడ వినిపించిన గళం చట్టసభల్లో ప్రవేశించాలి. మీ ఆలోచన ప్రపంచానికి చాటిచెప్పాలి. నాడు రాజీవ్గాంధీ హయాంలో రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే దేశ యువతకు ఓటు హక్కు కల్పించారు. 21 ఏళ్లకే ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు. కానీ, ఈ దేశ యువత లోక్సభకు, అసెంబ్లీకి వెళ్లాలంటే 25 ఏళ్ల వరకు, రాజ్యసభకు, శాసనమండలికి వెళ్లాలంటే 30 ఏళ్ల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. అందుకే దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలి. ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనసభ, మండలిని ప్రత్యేకంగా సమావేశపరుస్తా. 21 ఏళ్లకే చట్టసభల్లోకి ప్రవేశం కల్పించేలా అన్ని పక్షాలతో చర్చించి రాష్ట్రం తరఫున తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. రాహుల్, ఖర్గే సహకారంతో పార్లమెంటులో ఆమోదానికి ప్రయత్నిస్తాం’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని అయితే జెన్జీ నాయకుడికి కేంద్ర విద్యా శాఖ మంత్రిగా అవకాశం వస్తుందని, అలా ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని, ఇండియా కూటమి పక్షాలతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పారు. నీట్ పేపర్ లీక్కు నిరసనగా, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ, విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా టీపీసీసీ ఆధ్వర్యలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో రేవంత్రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రులు పొంగులేటి, అజహరుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్తో పాటు పలువురు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోదీ మెడలు వంచారు... ఇందిరాగాంధీ విగ్రహం వద్ద యువతనుద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడుతూ.. లాఠీలు, తూటాలు విద్యార్థి ఉద్యమ స్ఫూర్తిని నిలువరించలేకపోయాయని, ప్రధాని మోదీని ఓడించి ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించిన విద్యార్థుల పోరాట స్ఫూర్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. 56 అడుగుల చాతీ సాగిలపడిందని ఎద్దేవా చేశారు. సోమవారంలోపు విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇక్కడకు వచ్చిన యువకులెవరూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాదని రేవంత్ అన్నారు. పోరాడి దేశ యువత సాధించిన విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదల్చుకోలేదన్నారు. ఈ పోరాటం, విజయం యువతదే అని చెప్పారు. 21 ఏళ్లకే ప్రధాని కావచ్చు ‘శాసనసభతోపాటు లోక్సభ, స్థానిక సంస్థలు చట్టసభల్లో ప్రధానమైనవి. ఈ స్థానిక సంస్థల్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతకు జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లుగా అవకాశం వస్తోంది. తెలుగు అమ్మాయి శ్రీలక్ష్మి నాడు 21 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన డి. అనన్య అనే అమ్మాయి 21 ఏళ్లకే ఐఏఎస్ అయింది. 32 ఏళ్ల క్రితం తన 22 సంవత్సరాల వయసులోనే డీజీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్ అయ్యారు. కానీ, అసెంబ్లీ, లోక్సభకు వెళ్లాలంటే 25 ఏళ్ల వరకు, రాజ్యసభ, శాసనమండలికి వెళ్లాలంటే 30 ఏళ్ల వరకు ఆగాల్సి వస్తోంది. జర్మనీ, గ్రేట్ బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏళ్లు పూర్తయితే చట్టసభలకు వెళ్లడమే కాకుండా దేశ ప్రధానులుగా, అధ్యక్షులుగా కూడా కావచ్చు. సింగపూర్లో 21 ఏళ్లకే ప్రధాని కావచ్చు. కానీ, మనదేశంలో ఆ పరిస్థితి లేదు. అందుకే 25 ఏళ్ల వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో విద్యా, ఐటీ శాఖలు 60, 70 ఏళ్లున్న వారు కాదు.. 21 ఏళ్ల వయసున్న యువకులు మంత్రులుగా నిర్వహించాలి. జెన్జీ యువ కెరటాలకు చట్టసభల్లో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి’అని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ నుంచే ప్రారంభం: మహేశ్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ ‘దేశ వ్యాప్తంగా విద్యార్థి లోకం ఒక్కటైంది. 56 ఇంచుల చాతీ అని చెప్పుకునే ప్రధాని మోదీ నీట్ పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితి దేశంలో ఏర్పడింది. యువతకు చట్టసభల్లో మాట్లాడే అవకాశం వచ్చేంతవరకు ఇలాంటి లీకేజీలు జరుగుతుంటాయి. రాహుల్ ప్రధాని అయితే జెన్జీ నుంచి ఒకరు విద్యా మంత్రి అవుతారు. ఉభయసభలను సమావేశపరిచి 21 ఏళ్లకే చట్టసభల్లోకి ప్రవేశించే విధంగా తీర్మానం చేయాలని సీఎం రేవంత్ను కోరుతున్నా. దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేసే ఆలోచన తెలంగాణ నుంచే ప్రారంభం కావాలి’అని వ్యాఖ్యానించారు. ర్యాలీలో పాల్గొన్న ఒక విద్యార్థిని మాట్లాడుతూ తాను కూడా నీట్పరీక్ష రాశానని, అయితే నీట్ గత రెండేళ్లుగా లీక్ అవుతోందని, కానీ ఈ సంవత్సరమే వెలుగులోకి వచ్చిందని చెప్పారు. సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డి మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామిక విజయమని అన్నారు. కాగా, కార్యక్రమం ముగిసిన తర్వాత యువతతో రేవంత్ సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు దిగారు. -
‘నారా లోకేష్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి’
తాడేపల్లి: నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే, రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీనేతలు డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరు? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? అంటూ రాష్ట్ర యువత ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీనేతలు మీడియాతో మాట్లాడారు.వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీనేతలు ఏమన్నారంటే..డీఎస్సీ దగాకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలిగుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రినిరుద్యోగుల ఆశలతో చెలగాటమాడుతూ డీఎస్సీ నియామకాలను వివాదాలమయం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇక తప్పించుకోలేరు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన నియామక ప్రక్రియలో అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత లోకేష్పై లేదా? డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరు? అభ్యర్థులకు న్యాయం చేసేది ఎవరు? లోకేష్ ఇంకా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు? రాష్ట్ర నిరుద్యోగ యువత అడుగుతున్న ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలి. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.ఎన్డీఏలో ఒక న్యాయం.. ఏపీలో మరో న్యాయమా?: పేట్ల ఉమాశంకర్ గణేష్, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యేనీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో, లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ అక్రమాల ఆరోపణలు కూడా అంతే తీవ్రమైనవి. డీఎస్సీలో జరిగిన అక్రమాలను శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో బయటపెట్టినా చంద్రబాబు, లోకేష్ స్పందించడం లేదు. ఔట్సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్, స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి.మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారుబింగి హరికిరణ్రెడ్డి, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీఅధికార ప్రతినిధిమెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను దగా చేసింది. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడిన అభ్యర్థుల కలలను ఛిద్రం చేసింది. డీఎస్సీలో జరిగిన అవకతవకలను శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో బయటపెట్టినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనం వీడటం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలి. యువత రోడ్డెక్కే పరిస్థితి రాకముందే నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ విద్యాశాఖ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి.డీఎస్సీ ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలిమద్దూరు సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్సీపీరాష్ట్ర కార్యదర్శిడీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీక్ సహా తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం దారుణం. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. లోకేష్కు ఏమాత్రం నైతికత ఉన్నా విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి, డీఎస్సీ వ్యవహారంలోని వాస్తవాలను ప్రజల ముందుంచాలి.కేంద్రంలో ఒక న్యాయం.. రాష్ట్రంలో మరో న్యాయమా?: బెందాళం పద్మావతి, వైఎస్సార్సీపీరాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిడీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకల ఆరోపణలు వచ్చినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనం వీడకపోవడం దారుణం. ఔట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ టాప్ ర్యాంక్ రావడం, ఆ తర్వాత ఆ డేటా తొలగించడం, స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు వచ్చినట్లు ఆరోపణలు రావడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో ప్రశ్నించినా చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్పందించడం లేదు? డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలంటే సీబీఐ దర్యాప్తు జరిపించాలి. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.చంద్రబాబు, లోకేష్ స్పందించకపోవడం దారుణం: తాలే రాజేష్, వైఎస్సార్సీపీరాజాం నియోజకవర్గ సమన్వయకర్తడీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ ఆధారాలు బయటపెట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం దారుణం. నిబంధనల మార్పు, స్పోర్ట్స్ కోటా నియామకాలు, విద్యాశాఖలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి. నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి.యువత భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ప్రభుత్వానికి లేదుచిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట మాజీ ఎమ్మెల్యేడీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు, విద్యాశాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, నిబంధనలను మార్చి నియామకాలు చేపట్టారన్న అంశాలపై వాస్తవాలను బయటపెట్టాలి. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. -
ఇది మేము ఇస్తున్న వార్నింగ్: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. శనివారం మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ... ఇది విద్యార్థుల విజయమని తెలిపారు. దేశ భవిష్యత్తును విద్యార్దులు నిర్ణయిస్తారని చెప్పారు.‘‘ఇది భారత విద్యార్థుల నుంచి, ప్రతిపక్షం నుంచి వస్తున్న వార్నింగ్. ఇప్పటి వరకు మీరు దేశాన్ని నడిపిన తీరులోనే ఇకపై నడపలేరు. ఇది మీ వ్యక్తిగత అంశం కాదు. ఇది మీ సొంత ఆస్తి కాదు. ఈ దేశం భారత ప్రజలది. భారత రాజ్యాంగానిది. ఈ సంస్థలన్నీ మీ సొంతం కాదు. ఇదే దారిలో మీరు ముందుకు సాగితే, ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు పెద్ద స్థాయిలో ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇదే మా ప్రధాన సందేశం.మన విద్యా వ్యవస్థ ఎంతో గొప్పది. భారత విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ నాశనం చేసింది. విద్యార్ధులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. భారత విద్యార్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. విద్యార్థులపై దాడికి అమిత్ షా బాధ్యత వహించాలి. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులపై కాల్పులను అనుమతించము. ప్రజలు ఏం అనుకుంటున్నారో ప్రభుత్వం వినాలి. ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక. పేపర్ లీకులపై తీసుకొచ్చే బిల్లులపై విపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు. నా తరఫున మద్దతు ఎప్పుడూ ఉంటుంది. విద్యార్థులకు రక్షణగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దేశ భవిష్యత్తు కచ్చితంగా గతాన్ని ఓడిస్తుంది. విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి. విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించింది. విద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే. విద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. విద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి’’ అని రాహుల్ గాంధీ చెప్పారు. -
‘డీఎస్సీలో అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి’
ప్రకాశం: డీఎస్సీలో అక్రమాలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు డిమాండ్ చేశారు. ఆంధ్రాలో డీఎస్సీలో అవకతవకలకి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన లోకేష్ పదవిలో ఉండటానికి వీల్లేదన్నారు. లోకేష్ రాజీనామా డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత ఉద్యమించాలన్నారు. ఈ నెల 28వ తేదీన లోకేష్ రాజీనామా కోరుతూ ఆంధోళనలను ప్రారంభిస్తామన్నారు జూపూడి. డిఎస్సి అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించి...లోకేష్ రాజీనామా కూడా చేయాలన్నారు. రాష్టంలోను కాక్రోచ్ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు జూపూడి. -
‘డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తుంటే.. డైవర్షన్ పాలిటిక్స్’
సాక్షి, తాడేపల్లి: నీట్ పరీక్షల వైఫల్యాలకు బాధ్యత వహించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని.. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారని ఏపీ జెన్-జి అడుగుతోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా వైఎస్ జగన్ బయటపెట్టారు. చంద్రబాబు ఇప్పటి వరకూ నోరు మెదపలేదన్నారు.లోకేష్ కనీసం ప్రెస్మీట్ పెట్టలేకపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మేం స్వాగతిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ను ఆదర్శంగా తీసుకుని లోకేష్ కూడా రాజీనామా చేయాలి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు. డీఎస్సీ అవకతవకలపై 300లకు పైగా కేసులు కోర్టులో ఉన్నాయి. డీఎస్సీ అభ్యర్ధుల ఎదురుచూపులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. మాయమాటలు చెప్పి తమకు నచ్చిన అభ్యర్థులకు జీవోలు తెచ్చి ద్వారాలు తెరిచారు’’ అంటూ ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.‘‘పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారు. స్పోర్ట్స్ అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ల ప్రకారం ఉద్యోగాలిచ్చేశారు. డీఎస్సీలో మోసం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. నారా లోకేష్ ఏపీ జెన్-జికి సమాధానం చెప్పాలి. డీఎస్సీ అక్రమాలపై జూలై 28న నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎప్పుడు రాజీనామా చేస్తారో నారా లోకేష్ సమాధానం చెప్పాలి. డీఎస్సీ అక్రమాలపై మా పోరాటం కొనసాగిస్తాం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి’’ అని ఆదిమూలపు డిమాండ్ చేశారు. -
2018 తర్వాత, ఇలా రిజైన్ చేసిన తొలి కేంద్ర మంత్రి ఈయనే
సాక్షి,న్యూఢిల్లీ: సీజేపీ ఆందోళనల నేపథ్యంలోఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీమానా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించారు. అలాగే తన లేఖ కాపీని మంత్రి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ధర్మేంద్ర రాజీనామాకు దారితీసిన పరిస్థితులతో పాటు, 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలతో అప్పటి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీనామా అంశం ఇపుడు నెట్టింట హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు దేశ వ్యతిరేక శక్తుల చేతిలోకి వెళ్లకుండా చూడటం, జాతీయ ఐక్యతను కాపాడటం తన బాధ్యత. భారతీయ విద్యార్థుల భవిష్యత్తు సుదీర్ఘ న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, వారు ప్రశాంతంగా తమ చదువులపై, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే గౌరవ ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించాను అని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హయాంలో ఒక మంత్రి ప్రజల లేదా విపక్షాల నిరసనల కారణంగా రాజీనామా చేయడం అత్యంత అరుదైన పరిణామం. గత చరిత్రను పరిశీలిస్తే, 2018 తరువాత అప్పటి కేంద్ర సహాయ మంత్రి ఎమ్జే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నెక్ట్స్ విద్యాశాఖ మంత్రి ఎవరు? 2018 ఎమ్జే అక్బర్మోదీ హయాంలో వివాదాలు ఎదురైనప్పటికీ మంత్రులు రాజీనామా చేయరని, ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే #MeToo ఉద్యమంలో పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలతో 2018లో కేంద్ర సహాయమంత్రిగా ఎమ్జే అక్బర్ రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన అక్బర్, "ఆరోపణలు వైరల్ ఫీవర్లా మారాయి" అని వ్యాఖ్యానించారు. అయితే, వ్యక్తిగత హోదాలో కోర్టులో న్యాయపోరాటం చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు.కాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమానికి, పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం జరుగుతున్న పోరాటానికి ఒక మైలురాయిగా నిలిచింది ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP), విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలకు ఈ రాజీనామా ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. -
సీజేపీ ప్రభంజనం ఇలా మొదలైంది.. ఇది ఇక ఆగదు
వ్యంగ్యంగా పుట్టింది... విప్లవంగా మారింది. ఒక పోస్టుతో మొదలైన ఉద్యమం లక్షలాది యువత గొంతుకగా నిలిచింది. జంతర్ మంతర్ నుంచి దేశమంతా ప్రతిఘటన జ్వాలలు రగిలించి, అధికారాన్ని ప్రశ్నించే యువశక్తికి ప్రతీకగా ఎదిగింది. కాక్రోచ్ జనతా పార్టీ... యువత ఆగ్రహాన్ని జాతీయ ఉద్యమంగా మలిచిన విప్లవ చరిత్రగా నిలిచింది.‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఈ వ్యాఖ్య సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఆ వ్యాఖ్య వల్లే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుట్టుకొచ్చింది. సుప్రీంకోర్టులో మే 15న సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చి బెంచ్ జరిపిన విచారణ సమయంలో దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారు. దీనిపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చినప్పటికీ ఆ వ్యాఖ్యల ప్రభావం ఏ మాత్రమూ తగ్గలేదు. అప్పట్లో తన వ్యాఖ్యల గురించి సూర్యకాంత్ మాట్లాడుతూ... మీడియా తన వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసిందని తెలిపారు. తాను నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చలేదని, నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియా వంటి వాటిలోకి వచ్చిన వారిని తప్పుబట్టానని చెప్పారు. ఓ పనికిమాలిన కేసులో విచారణ జరుపుతున్న సమయంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపించిందని ఆయన తెలిపారు. వృత్తిలో... ఉపాధి దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అటువంటివారే సోషల్ మీడియా, ఆర్టీఐ ఉద్యమాల వైపు వెళ్తున్నారని తెలిపారు తన వ్యాఖ్యల భావాన్ని వక్రీకరించారని సూర్యకాంత్ పలుసార్లు తెలిపినప్పటికీ ఆయన కామెంట్లను యువత సీరియస్గా తీసుకుంది.‘‘బొద్దింకలు’’ కామెంట్లతో కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుట్టుకే విచిత్రంగా జరిగింది. ఇది సాంప్రదాయ రాజకీయ పార్టీ కాదు. ఇది వ్యంగ్య (సటైరికల్) ఉద్యమంగా ప్రారంభమై, తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమానికి ప్రతీకగా మారింది. దీని ఆవిర్భావం, పరిణామం, ప్రభావం ఇలా ఉన్నాయి. 2026లో వరుసగా వెలుగులోకి వచ్చిన నీట్ ప్రశ్నపత్రం లీకులు, పరీక్షల నిర్వహణపై ఆరోపణలు, నిరుద్యోగ యువతలో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో కొందరు యువ కార్యకర్తలు, సామాజిక మాధ్యమాల సృష్టికర్తలు కలిసి ఒక వ్యంగ్య రాజకీయ వేదికను ప్రారంభించారు.ప్రజలు రాజకీయ పార్టీలపై నమ్మకం కోల్పోయారని, అవినీతి వ్యవస్థను ఎద్దేవా చేయాలనే ఉద్దేశంతో "కాక్రోచ్ జనతా పార్టీ" అనే పేరు పెట్టారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత అణచివేత జరిగినా ఉద్యమం ఆగదనే సంకేతంగా కాక్రోచ్ అనే పేరును పెట్టారు.సీజేపీని ఎవరు ప్రారంభించారు? సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే. ఆయన 30 ఏళ్ల రాజకీయ కమ్యూనికేషన్ వ్యూహకర్త. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో చదువుతున్న సమయంలోనే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 2026 మే 16న ఆయన ఎక్స్లో కేవలం ఆరు పదాలతో ఒక పోస్టు చేశారు. "What if all cockroaches come together?" ("బొద్దింకలంతా ఒక్కటైతే?") ఆ పోస్టు కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. అదే సీజేపీ ఉద్యమానికి బీజం వేసింది.ఆ తర్వాత ఏం జరిగింది?ఢిల్లీకి చెందిన యూట్యూబర్ మేఘనాథ్ ఎస్ ఆ పోస్టును చూసి, మరో స్నేహితుడితో కలిసి కృత్రిమ మేధ సాయంతో "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో ఒక వ్యంగ్య వెబ్సైట్ రూపొందించారు. అది లక్షలాది మంది యువతకు ఒక వేదికగా మారింది.ఎక్స్ ఖాతాలో ఎంతమంది చేరారు?ప్రారంభ రోజుల్లోనే సీజేపీ ఎక్స్ ఖాతాకు మిలియన్ల మందికి పైగా చేరారు. అనంతరం ప్రభుత్వ చర్యలతో ఆ ఖాతాను భారత్లో నిలిపివేశారు. ఇన్స్టాగ్రామ్లో అయితే మరింత భారీ స్పందన వచ్చింది. కొన్ని రోజుల్లోనే 22 మిలియన్ మంది అనుచరులు చేరారు. ఆ తర్వాత అది 25 మిలియన్లకు పెరిగింది.ఉద్యమంలో ప్రముఖంగా కనిపించిన వ్యక్తులు..అభిజీత్ దిప్కే – వ్యవస్థాపకుడు, జాతీయ కన్వీనర్.సోనం వాంగ్చుక్ – ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేసిన పర్యావరణ ఉద్యమకారుడు.మేఘనాథ్ ఎస్ – ఉద్యమాన్ని ఆన్లైన్లో వ్యాపించడంలో కీలక పాత్ర పోషించిన యూట్యూబర్.నకుల్ ధుల్ – నిరసనలకు సంబంధించిన వీడియోలతో వైరల్ అయిన కంటెంట్ సృష్టికర్త.ఆయేషా ఖాన్ – ఉద్యమానికి మద్దతుగా ప్రచారం చేసిన యువ కార్యకర్త.మొదట సామాజిక మాధ్యమాల్లో చిన్న ప్రచారంగా మొదలైన సీజేపీ ఉద్యమం కొన్ని రోజుల్లోనే వేలాది మంది విద్యార్థులను ఆకర్షించింది. నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యార్థుల ఆత్మహత్యల సమస్యను సీజేపీ ఎత్తిచూపింది. దీనికి పరిష్కారం కోసం విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరసన ప్రారంభించారు.వారి ప్రధాన డిమాండ్లుసీజేపీ తాజాగా డిమాండ్ల జాబితా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి (పూర్తైంది)ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి – పెండింగ్నిరసనల్లో పాల్గొన్న ఏ విద్యార్థిపైనా చర్యలు తీసుకోకూడదు – పెండింగ్ఆర్ఏఎఫ్, ఢిల్లీ పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి – పెండింగ్.ఉద్యమంలో కీలక పరిణామాలుజంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు చేరారు."చలో పార్లమెంట్" పిలుపుతో భారీ ర్యాలీ చేపట్టారు.ఢిల్లీ పోలీసులు పలుమార్లు నిరసనకారులను అడ్డుకున్నారు.లాఠీచార్జ్, వాటర్ కానన్ల ప్రయోగం జరిగింది.వందలాది మంది అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.కొన్ని సమయాల్లో మెట్రో స్టేషన్లు మూసివేశారు.కొన్ని సమయాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ప్రముఖుల మద్దతు దక్కిందిఉద్యమానికి ప్రముఖుల మద్దతు పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారుసామాజిక కార్యకర్త అన్నా హజారే మౌన ఆందోళన నిర్వహించారు.పలువురు ప్రతిపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు.దేశ విదేశాల్లోని విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.అంతర్జాతీయంగానూ స్పందన వచ్చిందిపాక్లోనూ ఇలా..భారత్లో జరుగుతున్న ఈ నిరసనలు పాకిస్థాన్ సహా పలు దేశాల్లో చర్చనీయాంశమయ్యాయి.పాకిస్థాన్కు చెందిన కొందరు పాత్రికేయులు, కంటెంట్ సృష్టికర్తలు భారత విద్యార్థుల ఉద్యమాన్ని ప్రశంసిస్తూ వీడియోలు విడుదల చేశారు."భారత్లో యువత ఇలా పోరాడుతోంది... మన దేశంలో ఎందుకు జరగడం లేదు?" అనే చర్చ పాకిస్థాన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.సీజేపీ ఏం సాధించింది? నీట్ ప్రశ్నపత్రం లీకుల అంశం జాతీయ చర్చగా మారింది.పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.విద్యా వ్యవస్థలో సంస్కరణలపై విస్తృత చర్చ జరిగింది.ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాయి.దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్యత పెరిగింది.విదేశీ మాధ్యమాలు కూడా ఈ ఉద్యమాన్ని ప్రస్తావించాయి.ఉద్యమం కోరిన అన్ని డిమాండ్లు నెరవేరాయిముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారుపరీక్షా సంస్కరణలు వంటి డిమాండ్లు నెరవేరుతున్నాయివిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చివరకు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ తొలి ప్రధాన డిమాండ్ నెరవేరింది. విద్యార్థుల ఉద్యమం దేశవ్యాప్తంగా ఒత్తిడి తీసుకురావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాజీనామాను తమ పోరాటానికి తొలి విజయంగా సీజేపీ ప్రకటించింది. మిగిలిన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది.సీజేపీ ఎందుకు ప్రత్యేకం?సాధారణ రాజకీయ పార్టీలా కాకుండా, వ్యంగ్యాన్ని ఆయుధంగా తీసుకుని యువతను పెద్ద ఎత్తున ఒక వేదికపైకి తీసుకురావడం సీజేపీ ప్రత్యేకత. సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తూ, నిరసనలను సృజనాత్మకంగా నిర్వహించడం వల్ల ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో కూడా దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి ఉద్యమాలకు సాధారణంగానే అంతు అనేది ఉండదు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నెక్ట్స్ విద్యాశాఖ మంత్రి ఎవరు?
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై సీజేపీ, విద్యార్థులు గత 23 రోజులుగా చేపట్టిన ఉద్యమం విజయం సాధించింది. వీరి ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా యువతలో ఆనందోత్సాహలు నెలకొన్నాయి. నీట్ పరీక్షల నిర్వహణలో ఎదురైన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపధ్యంలోఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రాజీనామా నేపథ్యంలో ఆయన స్థానంలో విద్యాశాఖను ఎవరు చేపట్టబోతున్నారు, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనే అంశాలపై చర్చ తీవ్రమైంది.కొత్త విద్యామంత్రి ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం రాలేదు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పేరును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ లోపుగా ప్రధానమంత్రి సాధారణంగా ఒక సీనియర్ క్యాబినెట్ మంత్రికి ఆ శాఖను అదనపు బాధ్యత (Additional Charge) కింద అప్పగిస్తారు. విద్యాశాఖ బాధ్యతలను ఏదైనా సీనియర్ క్యాబినెట్ మంత్రికి అదనపు బాధ్యతగా అప్పగించవచ్చు లేదా ఆదివారం సాయంత్రం నాటికి కొత్త నియామకం ఉత్తర్వులు రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాజీనామా అనంతరం ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుందని మరో అంచనా. సినియర్ క్యాబినెట్ మంత్రులకు అదనపు బాధ్యతలను మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా, లేదా భూపేందర్ యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా లాంటి సమర్థవంతమైన పాలనా అనుభవం ఉన్న సీనియర్లకు అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తరువాత విద్యాశాఖ మంత్రి పదవిని స్వయంగా ప్రధానమంత్రే స్వీకరిస్తారా? లేక సీనియర్ మంత్రి నితిన్ గడ్కరీ, లేదా ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్కి అప్పగిస్తారా అనే వాదన కూడా వినిపిస్తోంది. ఫడ్నవీస్కు పిలుపుమరోవైపు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు ఢిల్లీ పెద్దలనుంచి పిలుపు రావడం మరింత ప్రధాన్యతను సంతరించుకుంది. ఫడ్నవీస్తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా ఢిల్లీకి బయలుదేరినట్టు తెలుస్తోంది. అలాగే మేధావి, విద్యావంతుడైన ఫడ్నవీస్ విద్యా శాఖమంత్రిగా అర్హుడని శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడం విశేషం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు, విద్యాశాఖలో కీలక సంస్కరణల నేపథ్యంలో ప్రత్యా మ్నాయంగా, విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న సహాయ మంత్రుల్లో (జయ్ చౌదరి లేదా సుకాంత్ మజుందార్) ఒకరికి స్వతంత్ర హోదా (Independent Charge) ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అంచనా. విద్యాశాఖను తాత్కాలికంగా ఎవరికి అప్పగిస్తారు? లేదా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా సస్పెన్స్ తప్పదు. -
కోమటిరెడ్డి బ్రదర్స్తో అదే చెప్పా: ఎమ్మెల్యే సామెల్
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్లో తుంగతుర్తి పంచాయితీ మరోసారి తీవ్ర విభేదాలను బయటపెట్టింది. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా పర్యటనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. తనకు టికెట్ ఇచ్చింది రాజగోపాల్రెడ్డి కాదని, ఏఐసీసీ అని స్పష్టం చేశారు.తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంలో రాజగోపాల్రెడ్డి పాత్ర లేదని ఎమ్మెల్యే సామెల్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టికెట్ నా చేతిలో లేదు.. రాజగోపాల్రెడ్డి చేతిలో అంతకన్నా లేదు. ఏఐసీసీ నాకు టికెట్ ఇచ్చింది. నన్ను గెలిపించింది రాజగోపాల్రెడ్డి కాదు.. పార్టీ’’ అని పేర్కొన్నారు.‘నాకు తెలియకుండా ఎలా?’తన నియోజకవర్గంలోకి రావాలంటే కనీస సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని సామెల్ అన్నారు. ‘‘నాకు తెలియకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారు?’’ అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గౌరవం ఉండాలని పేర్కొన్నారు. ‘పార్టీలో నేనే ముందున్నా’కాంగ్రెస్లో తానే ముందునుంచి ఉన్నానని ఎమ్మెల్యే సామెల్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో రాజగోపాల్రెడ్డిని గెలిపించేందుకు తన కేడర్ ఎంతో కష్టపడిందని, అయితే ఇప్పుడు అదే కేడర్ బాధపడుతోందని అన్నారు. ‘‘మునుగోడులో ఆయన్ను గెలిపించినందుకు నా కార్యకర్తలు బాధపడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. రాజగోపాల్రెడ్డి గతంలో తన గెలుపుపై వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ‘‘నేను గెలుస్తా అని గతంలో రాజగోపాల్రెడ్డి చెప్పారు. అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చారు’’ అని విమర్శించారు.కులాల ఓట్లపై ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల సమయంలో సామాజిక వర్గాల ఓట్లపై కూడా సామెల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజగోపాల్రెడ్డికి మాదిగలు ఓటు వేశారు.. నాకు రెడ్లు ఓటేశారు’’ అని అన్నారు.‘ఎన్నిసార్లు కలిసినా రోడ్లు ఇవ్వలేదు’గతంలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ‘‘నేను ఎన్నోసార్లు కలిశాను. రోడ్లు కావాలని అడిగాను. చివరకు అటెండర్తో ఫోన్ చేయించినా వెళ్లి కలిసేవాడిని’’ అని పేర్కొన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్పై వ్యాఖ్యలుకోమటిరెడ్డి సోదరులు నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తాను చెప్పినట్లు సామెల్ వెల్లడించారు. ‘‘కోమటిరెడ్డి బ్రదర్స్ను ఇన్వాల్వ్ కానివ్వొద్దని చెప్పా. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఇకనైనా అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అన్నారు. మొత్తంగా మునుగోడు కాంగ్రెస్లో ఎమ్మెల్యే సామెల్, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి తెరపైకి రావడంతో రాజకీయాలను మరింత వేడెక్కించాయి. -
నీట్ సెగ.. ధర్మేంద్ర ప్రధాన్పై కీలక నిర్ణయం?
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా.. కేంద్రం వరుస చర్యలు చేపట్టింది. ఎన్టీఏలో మార్పులు, ఉన్నతాధికారుల బదిలీలు, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. నిరసనలు మాత్రం తగ్గడం లేదు. కీలకమైన మూడు డిమాండ్లలో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానేనని అటు విద్యార్థి సంఘాలు.. నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకుంటేనే తమ పోరాటానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆందోళనలు విరమిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో.. ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించేందుకు కేంద్రం సుముఖంగా కనిపించడం లేదని సమాచారం. ఇదే ప్రధాన ఎజెండాగా నిన్న కేబినెట్ భేటీలోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వివాదం నేపథ్యంలో ఆయన్ని మరో శాఖకు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా శాఖ మార్పును పరిశీలిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ ఉదయం ప్రెస్మీట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. నీట్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను అవినీతికి ప్రతీకగా అభివర్ణించిన ఆయన.. మరో శాఖకు మార్చడం పరిష్కారం కాదని అన్నారు. విద్యార్థులు కోరుకుంటున్నట్లు ఆయనను కేబినెట్ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. పైగా ఈ వ్యవహారంపై తనకు సమాచారం ఉందని పేర్కొన్న ఆయన.. పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అర్ధరాత్రి వీడియోలు చేయడంతో లాభం లేదని.. మంత్రిని తొలగించి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.#WATCH | LoP, Lok Sabha, Rahul Gandhi says, "...Students have three demands, and these are not negotiable demands... The first demand is that the Education Minister, who is corrupt, incompetent, and misaligned, has to be sacked... There's some talk going on in Mr. Modi's cabinet… pic.twitter.com/hKoXOQ4SSz— ANI (@ANI) July 25, 2026మరోవైపు కేంద్ర ప్రభుత్వం నీట్ వివాదం నేపథ్యంలో పలు చర్యలు చేపట్టింది. పేపర్ లీక్ కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఏలోని 47 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్ వివాదం వేళ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించింది.అయితే ఈ చర్యలు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయాయి. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పిదాలకు కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం సరిపోదని, రాజకీయ బాధ్యత కూడా ఉండాలని సీజేపీ, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇదే సమయంలో విద్యార్థి సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రి రాజీనామా డిమాండ్పై మాత్రం విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు జరుగుతుందా? లేదంటే ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు విద్యార్థులు రాజీనామా డిమాండ్పై పట్టుబడుతుండగా.. మరోవైపు కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. నీట్ వివాదం రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. -
ఎన్డీయే మంత్రి కూతురు.. కేంద్రంపై నిరసన స్వరం
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతుండగా.. తాజాగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు.అస్సాం రెవెన్యూ మంత్రి కేశబ్ మహంతా కుమార్తె దిబిసా మహంతా గువాహటిలో జరిగిన విద్యార్థుల నిరసనలో పాల్గొందంటూ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాచల్ ప్రాంతంలో గురువారం నిర్వహించిన ఈ ఆందోళనలో ఆమె విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.దిబిసా మహంతా నిరసనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసోం గణ పరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా.. బీజేపీ నేతృత్వంలోని అసోం ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. మిత్రపక్ష ప్రభుత్వంలో భాగమైన సీనియర్ నేత కుమార్తె.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై డిమాండ్లతో జరుగుతున్న నిరసనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కూతురి నిరసనపై తండ్రి స్పందించాల్సి ఉంది. అయితే ఢిల్లీలో కొనసాగుతున్న నీట్ నిరసనలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం తాజాగా స్పందించారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, వారి డిమాండ్లు, వాదనలను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం అసోం వరదలతో తీవ్రంగా ప్రభావితమైందని, ప్రకృతి విపత్తుపై కూడా అందరూ దృష్టి పెట్టాలని కోరారు.ఇదిలా ఉండగా, నీట్ నిరసనలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రాజకీయ, క్రీడా, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు.. ఆందోళనలకు మద్దతుగా విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నారు. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నీట్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యులపై చర్యలు, విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో నిరసనకారులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగానూ, సామాజికంగానూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.#WATCH: Assam Cabinet Minister Keshab Mahanta's daughter, Dibisa Mahanta, was among those who joined the CJP protest in Guwahati, where demonstrators demanded education reforms and the resignation of Union Education Minister Dharmendra Pradhan.#Assam #CJPProtest… pic.twitter.com/CJP2hjZFIc— Northeast Now (@NENowNews) July 24, 2026 -
‘చంద్రబాబు వ్యవసాయానికి హానికరం’
తాడేపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిందని, సాగునీరు అందక రాష్ట్రంలో రైతాంగం తీవ్ర వంచనకు గురైందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జూలై 1వ తేదీన ప్రకాశం బ్యారేజీ వద్ద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చేత ఖరీఫ్కు సాగునీరు విడుదల చేయించి, తీరా 24 రోజుల తర్వాత కృష్ణా డెల్టాకు వరి సాగుకు నీళ్లు ఇవ్వలేమని మంత్రుల చేత ప్రకటించడం ఘోరమైన దగా అని మండిపడ్డారు. కలెక్టర్ మాటలు నమ్మి కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోని 23 నుంచి 25 లక్షల ఎకరాల్లో ఎకరాకు రూ. 15,000 చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు నిలువునా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ముందస్తు ప్రణాళికా రాహిత్యం వల్ల రైతాంగానికి జరిగిన రూ. 3,750 కోట్ల నష్టాన్ని తక్షణమే ప్రభుత్వమే చెల్లించాలని మరియు ఈ మోసానికి బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..ముఖ్యమంత్రి ఆదేశాలతోనే రైతులను ముంచే నిర్ణయాలుఈ రాష్ట్రంలో రైతన్నలకు, వ్యవసాయ రంగానికి మేలు జరిగితే చూసి ఆనందించే మొదటి వ్యక్తి వైఎస్.జగన్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రభుత్వం తన నిజరూపాన్ని చూపిస్తోంది. నిన్నటి క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు వెల్లడించిన నిర్ణయాలు రైతులను పీడించేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియకుండా, ఆయన ఆదేశాలు లేకుండా ఏ ఒక్క మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టరు. కాబట్టి రైతులను ముంచే ఈ నిర్ణయాలన్నీ చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే జరిగాయి.జూలై 1న నీళ్లు వదిలి.. జూలై 24న ఇవ్వలేమనడం ఘోర వంచనఖరీఫ్ సీజన్కు కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నామని, 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జూలై 1వ తేదీన ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తి అధికారికంగా ప్రకటించారు. కలెక్టర్ మాటలు నమ్మిన కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోని సుమారు 23 నుంచి 25 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు సాంప్రదాయబద్ధంగా ఏరువాక సాగిస్తూ వ్యవసాయం మొదలుపెట్టారు.నాట్లు వేసేందుకు ఎకరాకు సగటున రూ. 15,000 వరకు పెట్టుబడి పెట్టారు. తీరా 24 రోజులు గడిచాక, నిన్నటి మంత్రివర్గ సమావేశం తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి పార్థసారథి వచ్చి కృష్ణా డెల్టాకు వరి పంటకు నీళ్లు ఇవ్వలేమని, కేవలం తాగునీటికి మరియు ఆరుతడి పంటలకు మాత్రమే వాడుకోవాలని చెప్పడం రైతుల వెన్ను విరిచడమే. కలెక్టర్ ప్రకటన ఆధారంగా ఇప్పటికే 70 శాతం మంది రైతులు నాట్లు వేశారని మంత్రి ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు నీళ్లు ఇవ్వలేమని చెబితే, రైతులు పెట్టిన రూ. 3,750 కోట్ల పెట్టుబడి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?"డెల్టా ఆయకట్టు సంక్షోభం• ప్రభావిత ఆయకట్టు : 23 నుండి 25 లక్షల ఎకరాలు (కృష్ణా, గోదావరి)• నాట్లు వేసిన విస్తీర్ణం : 70% (ప్రభుత్వ సమాచారం ప్రకారం)• ఎకరాకు సగటు పెట్టుబడి : రూ. 15,000• రైతాంగానికి జరిగిన నష్టం: రూ. 3,750 కోట్లువిజనరీ చంద్రబాబుకు వర్షాభావం ముందు తెలియదా?అన్ని విద్యలు నాకే తెలుసని, ఐటీ రంగాన్ని, టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడాకారులను నేనే తయారు చేశానని, రష్యా కూలింగ్ టెక్నాలజీ నుంచి ఇస్రో సాంకేతికత వరకు నాకే తెలుసని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈ సీజన్లో వర్షాభావం ఉంటుందని ముందుగా అంచనా వేసే సోయి లేదా? మే, ఏప్రిల్ మాసాల్లోనే వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఏ పంటలు వేయాలో, ఏవి వేయకూడదో రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?సీలేరు ప్రాజెక్టుల నీటిని సమర్థవంతంగా నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. చంద్రబాబుకు కేవలం సంపదను ఎలా కొల్లగొట్టాలి, ఇసుక, మట్టిని తన ఎమ్మెల్యేలతో ఎలా దోచుకోవాలనే శ్రద్ధ ఉంది తప్ప రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే ధ్యాస లేదు.వైఎస్సార్సీపీ హయాంలో గిట్టుబాటు ధరలువైఎస్.జగన్ పాలనలో విప్లవాత్మకమైన ఆర్బికే (RBK) వ్యవస్థను తెచ్చి, విపత్తులు వస్తే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి, ప్రతీ పంట చివరి గింజ వరకు గిట్టుబాటు ధర కల్పించాం. ధైర్యంగా కాలర్ ఎగరేసి మా పాలన గురించి చెప్పుకోగలము. కూటమి ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే మేము ఇచ్చిన మద్దతు ధరల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చామని నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ఉచిత సిలిండర్ల హామీలో తీవ్ర దగా..ఎన్నికల ముందు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ముందస్తుగానే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఈనాడు పత్రిక సాక్షిగా ప్రకటనలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 13 నెలలు దాటినా ఇప్పటివరకు తొమ్మిది సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రెండింటితో సరిపెట్టారు. ఇప్పుడు ప్రతి 4 నెలలకోసారి బుక్ చేసుకున్నాక డబ్బులు ఇస్తామని నిబంధనలు మారుస్తూ విచిత్రమైన నాటకాలు ఆడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి.ఉత్తరాంధ్ర దోపిడీ – ప్రాజెక్టుల నిలిపివేతఉత్తరాంధ్ర అభివృద్ధి అని డప్పు కొట్టుకునే కూటమి ప్రభుత్వం, విశాఖపట్నంలో రూ. 30 వేల కోట్ల విలువైన భూములను తమ బంధువులకు కట్టబెట్టే పనిలో పడింది. మా హయాంలో ప్రారంభించిన పాడేరు, విజయనగరం మెడికల్ కాలేజీలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్ కాలేజీలు, కురుపం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పనులను నిలిపివేశారు. ఉద్ధానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను నిర్వీర్యం చేస్తున్నారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలన్న నిబంధనలను పక్కనపెట్టడంతో నిర్వాసితులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ నేపధ్యంలో తీవ్ర సంక్షోభంలో ఉన్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కంటితుడుపు చర్యలు మాని, నష్టపోయిన ప్రతీ రైతుకూ ఎకరాకు రూ. 15,000 చొప్పున మొత్తం రూ. 3,750 కోట్ల పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. అదేవిధంగా, రద్దయిన 'సున్నా వడ్డీ పంట రుణాలు' పథకాన్ని పునరుద్ధరించి, అన్ని పంటలకూ మద్దతు ధర కల్పిస్తూ సిండికేట్ దోపిడీని అరికట్టాలని లేని పక్షంలో రైతులకు న్యాయం జరిగే వరకు, వారి హక్కుల సాధన కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోరాటాల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుందని హెచ్చరించారు. -
‘నా నియోజకవర్గానికి వస్తే మీకు మర్యాద దక్కదు’
యాదాద్రి: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్పై సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనకు సమాచారం లేకుండా తన నియోజకవర్గంలో అడుగుపెట్టే అధికారం ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. ప్రొటోకాల్ పాటించాలని తెలియదా, తన నియోజకవర్గానికి వస్తే మర్యాద దక్కదంటూ హెచ్చరించారు. రెండు కిలోమీటర్ల రోడ్డు కోసం మంత్రి కోమటిరెడ్డి చుట్టూ వందసార్లు తిరిగాను. ఆర్ అండ్ బీ మినిస్టర్గా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏం చేశారు?, రాజగోపాల్రెడ్డికి తుంగతుర్తి గురించి ఎందుకు?, నా నియోజకవర్గం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ వస్తే ప్రొటోకాల్ పాటించాలని తెలియదా?, నాకు సమాచారం లేకుండా నా నియోజకవర్గంలో అడుగుపెట్టే అధికారం నీకు ఎవరు ఇచ్చారు. మీ నియోజకవర్గాల్లో మీ సక్కదనం చూసుకోండి. మీ దగ్గర మేం చేతులు చాపలేదు. తుంగతుర్తిలో మందుల సామేలే ఉంటాడు ఖబర్దార్. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఎందుకు చేరాడో సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ సోనియా గాంధీని రాజగోపాల్ తిట్టాడు. పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి నికార్సైన కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల గురించి మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. ముందు మీ నియోజకవర్గాల సంగతి చూసుకోండి’ అంటూ విమర్శించారు. -
బొద్దింకలను ఏరిపారేయండి.. మాజీ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంధ్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాక్రోచ్లను శాశ్వతంగా అంతం చేయాలని ప్రధాని మోదీని కోరారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్ఞాఠాకూర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో .. గతంలో ఎక్కడ బొద్దింకలు కనిపించినా వాటిని చీపురుతో ఊడ్చి పారవేసేవారని, కానీ ఇప్పుడు ఆ చీపురు, బొద్దింక స్నేహితులయ్యాయయని, తద్వారా దేశవ్యాప్తంగా మురికి వ్యాపిస్తోందని అన్నారు. ప్రధాని మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దేశ నాయకుడు ఇకపై చీపురును నమ్మకూడదు. దానికి బదులుగా, బొద్దింకలను నిర్మూలించడానికి శాశ్వత ఏర్పాట్లు చేయాలి. దేశాన్ని శుభ్రంగా ఉంచాలి’అని పేర్కొన్నారు.ఠాకూర్ గతంలోనూ తన వ్యాఖ్యల కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఠాకూర్కు లోక్సభ టికెట్ నిరాకరించింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు, అశోక చక్ర గ్రహీత, మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరేను, ఠాకూర్ పురాణాల్లోని ప్రతినాయకులైన రావణుడు, కంసుడితో పోల్చారు.26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో కర్కరే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో కర్కరే తనను అన్యాయంగా ఇరికించారని.. తాను శపించడం వల్లే ఆయన చనిపోయారని’ఠాకూర్ ఆరోపించారుమాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్ధోషి2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలోని మసీదు సమీపంలో మోటర్ సైకిల్కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ప్రగ్యాసింగ్ ఠాకూర్తో సహా ఏడుగురు నిందితులను గతేడాది జూలై నెలలో నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది -
డీఎస్సీ దగాపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టం: జూపూడి
సాక్షి, తాడేపల్లి: నీట్పై ప్రధాని స్పందిచగా లేనిది, డీఎస్సీ అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో తేల్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివి, ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఉద్యోగ నియామకాలపై జరిగిన అవకతవకలపై ఆధారాలతో సహా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీసినా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.తాము తప్పు చేయనప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాల్సిందేనని జూపూడి ప్రభాకర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..నీట్పై కేంద్రం కదిలింది.. డీఎస్సీపై మీరెందుకు కదలరు?దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. పార్లమెంట్లో చర్చ జరిగే పరిస్థితి వచ్చింది. విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరు, ఉద్యోగ నియామక ప్రక్రియపై తీవ్ర విమర్శలు, ఎన్నో ప్రశ్నలు వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదు? నెలలుగా వైఎస్ జగన్ నిలదీస్తున్నా ఎందుకు సమాధానం చెప్పడం లేదు?నీట్పై కేంద్రం స్పందించిన తీరు చూసైనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. డీఎస్సీలో అధిక మార్కులు సాధించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కకుండా ఎందుకు చేశారు? క్వాలిఫై కానివారికి ఉద్యోగాలు ఇచ్చారనే ప్రశ్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? నిజంగా అర్హత సాధించిన అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిపక్ష నాయకుడి దృష్టికి తీసుకొస్తున్నారు. ఇన్ని అనుమానాలు తలెత్తుతున్నప్పుడు సీబీఐ విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి భయమెందుకు?దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించండిడీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు సిద్ధపడాలి. లేదంటే కనీసం న్యాయ విచారణ అయినా జరిపించాలి. నెలలుగా ఇదే విషయాన్ని అడుగుతున్నా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ముడిపడిన అంశంపై మౌనం వహించడం కాదు.. వాస్తవాలను ప్రజల ముందుంచాలి.జీవో 4, 47, జీవో 56 వెనుక ఏముంది?ఉద్యోగ నియామకాలాల్లో ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ప్రతి నిరుద్యోగికి ఉంది. డీఎస్సీ ప్రక్రియకు సంబంధించిన జీవో 4, 47, నియామకాల ప్రక్రియ పూర్తయ్యే సమయంలో తీసుకొచ్చిన జీవో 56పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ప్రక్రియ ప్రారంభించేటప్పుడు ఒక నిబంధన, ముగిసే సమయంలో మరో నిబంధన ఎందుకు? ఈ జీవోలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలి.ప్రజలే వేదికగా వైఎస్ జగన్ పోరాటంప్రతిపక్షం అంటే అసెంబ్లీలో మాత్రమే మాట్లాడటం కాదు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా తీసుకొని వాటిపై పోరాడటమే నిజమైన ప్రతిపక్ష పాత్ర. వైఎస్ జగన్ గారు విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, దళితులు సహా ప్రతి వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అసెంబ్లీని వేదికగా చేసుకునే అవకాశం ఇవ్వకపోయినా ప్రజలనే వేదికగా చేసుకుని పోరాటం కొనసాగుతుంది.ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, ఉద్యమించే విద్యార్థులను భయపెట్టడం ద్వారా ప్రజల గొంతును అణచివేయలేరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు, విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు. ప్రభుత్వం దిగివచ్చి సమాధానం చెప్పేదాకా ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటాం. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజాస్వామ్యవాదులు ఈ ప్రజా ఉద్యమానికి అండగా నిలవాలి.28న విద్యార్థులు, యువతతో రాష్ట్రవ్యాప్త ఉద్యమండీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతతో కలిసి వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుంది. విద్యార్థుల పక్షాన నిలిచిన వారిపై కేసులు పెట్టినా, సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిని వేధించినా వెనక్కి తగ్గేది లేదు. విద్యార్థులు, నిరుద్యోగుల గొంతుకగా వైఎస్సార్సీపీ నిలబడుతుందని జూపూడి ప్రభాకర్రావు హెచ్చరించారు. -
మరోసారి పరువు పోయిందిగా..!
నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8.. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై వచ్చిన ఒక వార్తా కథనం. అంటే దీని అర్థం వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ మొదటి స్థానంలో ఉంటే, ప్రస్తుతం కూటమి పాలనలో అది ఎనిమిదో ర్యాంకుకు దిగజారిందన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆధారంగానే సాధారణంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్లు పదేపదే ఒక మాట చెబుతున్నారు. ఏపీకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఒకసారి, వచ్చేశాయని మరోసారి అంటారు. అలాగే 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా ఏడెనిమిది శాతం అధికంగా పెట్టుబడులు వస్తున్నట్లుగా ఊదరగొడుతుంటారు. మనెవ్వరికి కనబడకుండా ఈ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయి? పరిశ్రమలు వచ్చేశాయా?ఉద్యోగాలు వచ్చేశాయా? వస్తున్నాయా? అని ఆశ్చర్యపోవడం ప్రజలకు అలవాటైపోయింది. ఇది నిజమేనేమోలే అని నమ్మేవారు కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా ఊపిరి ఆడకుండా స్టోరీలు అల్లి వడ్డిస్తుంటాయి.నిజంగా ఏ రాష్ట్రానికి అయినా పెట్టుబడులు వస్తుంటే అంతా సంతోషిస్తారు. కాని అతి ప్రచారం చేసుకుంటే మాత్రం ఇలాంటి నెగిటివ్ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విషయం పార్లమెంటులో కూడ వెల్లడైపోయింది. లోక్ సభలో వైఎస్సార్సీపీ నేత మిధున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఏడువేల కోట్ల లోపే అని స్పష్టం చేసింది. దీంతో కూటమి సర్కార్ పరువు మరింత దిగజారినట్లయింది.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ ఒన్ స్థానంలో ఏపీ ఉందంటే దానికి కారణం ఉంది. ఆ రోజుల్లో జగన్ ఆయా పరిశ్రమలవారితో మాట్లాడినప్పుడుకాని, సదస్సులలోకాని ఒక స్పష్టమైన ప్రకటన చేసేవారు. ఏ పారిశ్రామికవేత్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్క పోన్ కాల్ చేస్తే వెంటనే స్పందిస్తానని భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఎంతవరకు చేస్తున్నారో తెలియదు కాని పారిశ్రిమికవేత్తలను భయపెట్టడంలో మాత్రం రెడ్బుక్ బాగానే పనిచేస్తోందన్న విమర్శ ఉంది.మోసకారి నటి జత్వాని కేసును తీసుకోండి. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ను కూడా ఇరికించి ముగ్గురు ఐపీఎస్లను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్కు సజ్జన్ సన్నిహితంగా ఉండి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండేవారు. అలాంటి వ్యక్తిపై వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం నానా రభస చేసింది. దాని ఫలితంగా జిందాల్ ఏపీ వైపు చూడకుండా, తాము మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గతంలో ప్రకటించారు. దీంతో ఏపీకి ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పైగా పారిశ్రామిక సర్కిల్స్లో ఏ స్థాయిలో ప్రచారం జరిగి ఉండవచ్చో ఊహించుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయనతో రాజీ కుదుర్చుకున్నా జరగవలసిన డామేజీ జరిగి ఉంటుంది.అంతేకాదు.. విశాఖ వంటి కీలక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడం కూడా ప్రభుత్వ పరువు తీసి ఉండాలి. ఏపీకి పరిశ్రమలు రావడానికి వెనుకాడుతున్నందున వీరు ఈ భూమిని ఇంత కారుచౌకగా, వేల కోట్ల లాభాలు వచ్చే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్న సంకేతం కూడా నష్టం చేసిందేమో తెలియదు. పైగా కొన్ని సంస్థలకే ఇలా ఇవ్వడం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. కార్పొరేట్ సంస్థల మాటున తమకు కావల్సినవారికి కూడా కారుచౌకగా ప్రభుత్వ భూములు ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇక ప్రభుత్వపరంగా పాలనకన్నా, ప్రతీకార రాజకీయాలకు, రెడ్బుక్ పేరుతో అరాచకాలకు ప్రోత్సాహం ఇస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాంతో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్న భావన సర్వత్రా ఏర్పడింది.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పలు నివేదికలలో ఏపీ ర్యాంకింగ్ బాగా తగ్గిపోయింది. అదే క్రమంలో నీతి అయోగ్ ఇచ్చిన తాజా నివేదికలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒకటి నుంచి ఎనిమిదికి పడిపోయినట్లు వెల్లడైంది. నిజంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా, వచ్చినా నీతి అయోగ్ ర్యాంక్ ఇంత దిగజారిపోవడం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా అందరికి తెలిసిపోతుంటాయి. మరో వైపు జగన్ 17 మెడికల్ కాలేజీలను తెస్తే, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడితే, వాటిని ప్రైవేటువారికి కట్టబెట్టే ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.రామాయంపట్నం పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్కు పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. వీటికి ప్రభుత్వం నుంచి సరైన జవాబు ఉండడం లేదు. జగన్ కాలంలో రెండేళ్ల కరోనా ఉన్నా, అన్ని వాగ్దానాలు అమలు చేసినా, ఆ ప్రభుత్వ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఎంతో సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ప్రభుత్వం రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసేసింది. ఇక పరిశ్రమలవారి నుంచి కొందరు కూటమి ఎమ్మెల్యేలు కప్పం వసూలు చేస్తున్న వైనం కూడా ఏపీ పరువు తీస్తోంది.కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి బూడిద రవాణాపై ఒక బీజేపీ ఎమ్మెల్యే, మరో టీడీపీ నేత మధ్య జరిగిన రగడ ఇంత, అంతా కాదు. స్వయంగా బీజేపీ ఎంపీనే దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఎమ్మెల్యే తనకు మామూళ్లు ఇవ్వకపోతే వారి ఉత్పత్తులు రవాణా కానివ్వబోమని బెదిరించారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల కూటమి ఎమ్మెల్యేలు, నేతల అరాచకాలు పెచ్చుమీరాయి. పైగా టీడీపీ కార్యకర్తలు నేరాలు చేసినా కేసులు పెట్టవద్దని ఒక మంత్రే బహిరంగంగా చెబుతున్నారు. ఈ మధ్య మహిళలపై జరుగుతున్న ఘాతుకాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. చివరికి ఒక టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేయడం, అతనిపై కేసు లేకుండా చేయడానికి పార్టీ నేతలు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడం తెలిసిందే. ఇక లాకప్ మరణాలు సరేసరి. పోలీస్ వ్యవస్థ ధర్మంగా పనిచేయడం లేదన్న భావన నెలకొంది.జగన్ టైమ్లో పలు పరిశ్రమలు వచ్చినా, రానట్లుగా, ఆయన కాలంలో తరిమేసినట్లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారం ఇప్పటికీ ఆపడం లేదు. తాజాగా అమరరాజా ఎప్పుడో తెలంగాణలో మరో పరిశ్రమ పెట్టుకుంది. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరిమివేయడం వల్లే జరిగిందని చెబుతూ లోకేష్ ఆ యాజమాన్యానికి క్షమాపణ చెప్పడం పిల్ల చేష్టగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. అమరరాజా సంగతి సరే! జగన్ టైమ్లో అది ఎక్కడకు వెళ్లలేదు. మరి హెరిటేజ్ ప్లాంట్ విస్తరణ తెలంగాణలో ఎందుకు చేశారు? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చాయి. దీనికి చంద్రబాబు, లోకేష్ల నుంచి సమాధానం లేదు.రెండేళ్ల కూటమి పాలన తర్వాత ఏపీ ర్యాంకు ఎనిమిదో స్థానానికి పడిపోవడానికి జగన్ పాలనలో జరిగిన విధ్వంసమని టీడీపీ నిస్సుగ్గుగా చెబుతోంది. ఇది చిత్రంగా అనిపించదూ! నిజంగా జగన్ పాలనలో విధ్వంసం జరిగి ఉంటే అప్పుడు నెంబర్ ఒన్ ర్యాంక్ ఎలా వస్తుంది? ప్రస్తుతం అంతా సజావుగా ఉంటే ర్యాంకు ఎందుకు పతనం అవుతుంది? ఈ మాత్రం లాజిక్ లేకుండా టీడీపీ నేతలు మాట్లాడడం అంటే వారి అతి తెలివితేటల ర్యాంకింగ్ కూడా ఆ స్థాయికి దిగజారిందని అనుకోవాలా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చేతకాకపోతే బయటకు వెళ్లిపోండి..!
వైఎస్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరు తెలుగుదేశంపార్టీలో ఆధిపత్య పోరు, ముఠా కక్షలు పరాకాష్టకు చేరాయి. నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, హెచ్చరికలు స్థానిక అధికార కూటమిలో భూకంపం సృష్టించాయి. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం రక్తం చెమటోడ్చిన నిజమైన కార్యకర్తలను తొక్కుకుంటూ, ఏకపక్ష రాజకీయం నడుపుతున్న ఆరోసారి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వైఖరిపై లోకేష్ వేదికపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపైనే లోకేష్ ‘గేట్ పాస్’ వార్నింగ్‘కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుని, కలుపుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిదే’ అని లోకేష్ స్పష్టం చేశారు. వరదరాజులరెడ్డి తన పక్కనే వేదికపై కూర్చొని ఉండగానే లోకేష్ అసలు ట్విస్ట్ ఇస్తూ.. ’ ఒకవేళ అందరినీ కలుపుకొని వెళ్లడం చేతకాకపోతే, అలాంటి వారు పార్టీ వదిలి బయటకు వెళ్లడానికి టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి అంటూ ‘గేట్ పాస్’ హెచ్చరిక ఇవ్వడం సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వలేదన్న కోపంతో, వరదరాజులరెడ్డి బహిరంగంగా టీడీపీ జెండాలను తగలబెట్టించిన ఉదంతం అందరికీ తెలుసు. 2024 ఎన్నికల ముందు వచ్చి టికెట్ దక్కించుకుని గెలిచారు. కానీ, గెలిచినప్పటి నుండి పాత తమ్ముళ్లను పక్కన పెట్టడంపై క్యాడర్ లోకేష్ దృష్టికి ఆవేదనను తీసుకెళ్లింది. గ్రూపుల కుమ్ములాటలు.. వేర్వేరుగా ఆఫీసులు! వరదరాజులరెడ్డి మొదటి నుంచీ తనదైన ఏకపక్ష శైలితో వ్యవహరిస్తారనే ముద్ర ఉంది. ఆయన ఏ పారీ్టలో ఉన్నా నెహ్రూ రోడ్డులోని తన సొంత కార్యాలయమే పార్టీ ఆఫీస్గా నడుస్తుంటుంది.పార్టీలో ప్రతి ఒక్కరూ తాను చెప్పినట్లే వినాలనే మనస్తత్వం వల్లే ప్రొద్దుటూరులో టీడీపీ గ్రూపుల వారీగా విడిపోయింది. పార్టీ ఉమ్మడి కడప జిల్లాకు రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డిని వరదరాజులరెడ్డి ఏనాడూ కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కారణంగానే మల్లెల లింగారెడ్డి, వరదరాజులరెడ్డి వేర్వేరుగా కార్యాలయాలను నడుపుతున్నారు. ప్రవీణ్కుమార్రెడ్డికి పదవి గండం.. మరోవైపు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్కుమార్రెడ్డి ఐదేళ్లూ పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి, గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం సాగింది. అయితే, ఎన్నికల సమయంలో ప్రవీణ్ పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించలేదని, లోపాయికారీగా వ్యతిరేకంగా పనిచేశారని వరదరాజులరెడ్డి వర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల కూటమి ముఖ్య నేతలు అమరావతికి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనకు పదవి రాకుండా పోయింది. దీంతో ప్రవీణ్ నిరంతరం చంద్రబాబు, లోకేష్ లను కలుస్తూ తనపై ఉన్న వ్యతిరేక ముద్రను చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పరాకాష్టకు చేరిన కక్షలు.. తమ పదవిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డిపై ప్రవీణ్కుమార్రెడ్డి బహిరంగంగానే ఎదురుదాడికి దిగారు. కొండారెడ్డికి చెందిన “ఎస్ఎస్ మాల్’, “సన్రైజ్ కౌంటీ’లపై ప్రవీణ్ ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలకు వచ్చారు. సొంత పార్టీ నేతే తమ వ్యాపారాలపై అధికారులను ఉసిగొల్పడాన్ని జీరి్ణంచుకోలేని వరదరాజులరెడ్డి ముఖ్య అనుచరులు నేరుగా ప్రవీణ్కుమార్రెడ్డి ఇంటిపైకి వెళ్లి రాళ్లతో దాడికి తెగబడ్డారు. తమ్ముళ్లలో అయోమయం.. కార్యకర్తల సమావేశానికి ప్రవీణ్ ఆహా్వనించిన పాత కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర దుమారం రేపింది. లోకేష్ ఇచ్చిన వారి్నంగ్ తర్వాత ప్రొద్దుటూరు తమ్ముళ్లలో సరికొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు వేర్వేరు వర్గాలుగా విడిపోయిన ముగ్గురు నేతలు ఇకనైనా కలిసి నడుస్తారా? అది సాధ్యమేనా? అని విశ్లేషకులు ప్రశి్నస్తున్నారు. ఈ పాత కక్షల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో క్యాడర్ ఎవరి వెంట నడవాలో తెలియక తీవ్ర అయోమయంలో కొట్టాడుతోంది. టీఢీపీప్రొద్దుటూరు: పట్టణ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సబ్ స్టేషన్ నిర్మాణ స్థల వివాదం తారస్థాయికి చేరుకుంది. స్థానిక శ్రీనివాసనగర్లోని ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నిధులు మంజూరు చేసి, సగం పనులు పూర్తి చేశారు. అయితే, ఈ స్థలం ప్రైవేట్ వ్యక్తులదని, ఇక్కడ నిర్మాణం చేపట్టవద్దని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి పార్టీ పెద్దలకు విన్నవించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల పనులను నిలిపివేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, పనులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో శనివారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వివాదంపై విద్యుత్ శాఖ డీఈ చాంద్ బాషా మాట్లాడుతూ సదరు స్థలం ఎవరిదనేది తేల్చి, హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం పోలీస్, రెవెన్యూ, విద్యుత్ అధికారులు ఆగిన పనులను పరిశీలించి చర్చించారు. -
రాజ్యసభలో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఐదో రోజు అదే సీన్ రిపీట్ అయ్యింది. నీట్పై చర్చకు సిద్ధమని కేంద్రం చెబుతున్నా.. ముందు మంత్రి రాజీనామా చేశాకే చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో.. ఓసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభను స్పీకర్ ఓంబిర్లా సోమవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు.. కార్గిల్ అమర వీరులకు నివాళులర్పించిన అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను సభను ప్రారంభించారు. అయితే ఆ కాసేపటికే విపక్షాల నినాదాలతో సభ మారుమోగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా తర్వాతే నీట్ లీక్ వ్యవహారంపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమైందని.. ఈ తరుణంలో సభ కార్యాకలాపాలకు ఆటంకం సరికాదని కేంద్రం తరఫున ప్రకటన వెలువడింది. ఈ తరుణంలో విపక్షాల శాంతిచకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12గం. దాకా వాయిదా వేశారు. అయితే తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. లోక్సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. నీట్ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. విపక్ష నేత కే.సీ. వేణుగోపాల్తో మరోసారి చర్చించానని చెప్పారు. ప్రధాని మోదీ కూడా దేశానికి హామీ ఇచ్చారని, సోనమ్ వాంగ్చుక్ సైతం నిరాహార దీక్ష విరమించి చర్చ జరపాలని కోరారని రిజిజు పేర్కొన్నారు. నీట్పై చర్చకు అవకాశం ఇవ్వకపోతే అది దేశానికి సరైన సంకేతం ఇవ్వదని అన్నారు. అయినా విపక్షాలు శాంతించకపోవడంతో.. స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. Union Minister for Parliamentary Affairs Kiren Rijiju speaks in Lok Sabha. He says, "I have requested KC Venugopal ji once again today, when we are all of the opinion that there should be a discussion on NEET. The PM has assured the nation. Sonam Wangchuk has broken his hunger… pic.twitter.com/1HcLc0a5ep— ANI (@ANI) July 24, 2026ఇక.. రాజ్యసభలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. సభ కాసేపు సాగినట్లే కనిపించినా.. ఆ వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాకు డిమాండ్ చేయడం, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. రాజ్యసభ ముందుకు వందేమాతరం బిల్లుస్వాతంత్ర్య సమర కాలం నుంచి జాతీయ భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ‘వందేమాతరం’ గీతానికి మరింత గుర్తింపు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. వందేమాతర గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.అంతకు ముందు.. పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ఎందుకని?.. ప్రకటన చేయాలనుకుంటే సభలో చేయాలని.. పార్లమెంట్లో మాట్లాడితే తాము సంతోషిస్తామని.. ఆ చర్చలో తాము పాల్గొంటామని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. నీట్ లీకును తీవ్ర నేరంగా చూస్తున్నామని.. నిందితులను వదిలే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. పేపర్లీక్లపై ఉక్కుపాదం మోపుతామని.. ఇందుకోసం కఠిన చట్టాలు తెస్తామని.. సోమవారం ఆ బిల్లును ప్రవేశపెడతామని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు మాత్రం మంత్రి రాజీనామా తర్వాత ఏదైనా అని పట్టుబడుతున్నాయి. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించారు.వైఎస్సార్సీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సభ్యునిగా పీవీఎల్ నరసింహరాజును నియమించారు. పార్టీ కార్యక్రమాలు, రాజకీయ వ్యూహాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే PACలో ఆయనకు స్థానం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో.. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగీంద్రకుమార్ (బాబు)ను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం వంటి బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.గత ఎన్నికల అనంతరం పార్టీని పునర్వ్యవస్థీకరించే పనిలో ఉన్న వైఎస్సార్సీపీ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అనుభవం ఉన్న నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలు పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్తారని వైఎస్సార్సీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వచ్చే రోజుల్లో మరిన్ని సంస్థాగత మార్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నరసింహారాజు గారిని, మంతెన యోగీంధ్ర కుమార్ (బాబు) గారిని వివిధ హోదాల్లో నియమించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు. pic.twitter.com/lkepRLg5sY— YSR Congress Party (@YSRCParty) July 23, 2026 -
విజయ్ బ్రో.. వెరీ రాంగ్ బ్రో!
తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం కొత్త విషయం కాదు. కానీ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓ నటుడిగా విజయ్కి ఉన్న క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఆయన నటించిన ‘చివరి చిత్రం’ జన నాయగన్ విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో.. ఈ కోలాహలం ఇటు రాజకీయ చర్చకూ దారితీసింది.‘జన నాయగన్’ విడుదల సందర్భంగా విజయ్ అభిమానుల నుంచి భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ అభిమానంలో పాలకులు సైతం పోటీ పడ్డారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు తమిళనాడు మంత్రులు, అధికార పార్టీ నేతలు థియేటర్లకు తరలివెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ నుంచి పలువురు మంత్రుల వరకు సినిమా వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు అభిమానులతో కలిసి థియేటర్లలో సందడి చేయగా.. మరికొందరు సోషల్ మీడియాలో సినిమాకు ప్రచారం చేశారు.మంత్రి టీకే ప్రభు సినిమా స్టిక్కర్లను ఇళ్ల తలుపులు, ఆటోలకు అంటించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరో మంత్రి సినిమా చూస్తూ భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. రాష్ట్రంలో కీలక సమస్యలు బోలెడన్ని పెండింగ్లో ఉన్నాయని.. పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సినిమా వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైందేనా? అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.నీట్ నుంచి రైతుల వరకు..నీట్పై అభ్యంతరాలతో మొదటి నుంచి కేంద్రం నుంచి పోరాడుతోంది తమిళనాడునే. అసలు ఆ పరీక్షను రద్ద చేయాలనే డిమాండ్ మొదలైంది కూడా అక్కడి నుంచే. అలాంటి రాష్ట్రంలో.. నీట్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో తమది మొదటి నుంచి ఒకే మాట అని విజయ్ టీవీకే చెబుతోంది.అయితే నిరసనల్లో మాత్రం ఆ పార్టీకి చెందిన నేతలెవరూ కనిపించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్న వేళ.. విజయ్ సినిమా వంకతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టు, కావేరీ నీటి విడుదల, డెల్టా రైతుల సమస్యలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సినిమా విడుదల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించడం విమర్శలకు కారణమైంది.వెరీ రాంగ్ బ్రో.. ఇటీవల తమిళనాడులో వరుసగా కస్టడీ మరణాల ఆరోపణలు కలకలం రేపాయి. పోలీసుల వేధింపులతో నలుగురు మరణించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలీసు దౌర్జన్యాలపై గళమెత్తిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.గతంలో కస్టడీ బాధిత కుటుంబాలను కలిసిన విజయ్.. పోలీసు సంస్కరణలు తీసుకురావాలని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినిమా హీరో కావొచ్చు, కానీ..విజయ్ రాజకీయ ప్రయాణం మొత్తం ప్రజా సమస్యల చుట్టూనే సాగింది. అవినీతి, పరిపాలనా లోపాలు, ప్రజల హక్కుల కోసం పోరాడతానని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ముందున్న అసలు పరీక్ష.. అభిమానుల సీఎంగా కాకుండా ప్రజల సీఎంగా నిరూపించుకోవడం. సినిమా విజయోత్సవాలు రాజకీయంగా నష్టం చేయకపోయినా.. ప్రజా సమస్యలపై స్పందన ఆలస్యమైతే ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా సినీ మత్తు వీడి రంగంలోకి దిగాలనే అభిప్రాయమై వ్యక్తమవుతోంది. View this post on Instagram A post shared by Chennai Live (@chennailive1048) -
చంద్రబాబుకు ఎమ్మెల్యే గుమ్మనూరు ఝలక్
అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేసి పెద్ద ఝలక్ ఇచ్చారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. వివరాలు.. స్థానిక భాగ్యనగర్లోని ఎస్జేపీ హైస్కూల్ సమీపంలో డీఎంఎఫ్ నిధులు దాదపు రూ.50 లక్షలతో ఉర్దూ హైస్కూల్ ను ఆధునికీకరణ చేశారు. గురువారం జరిగిన భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే స్టేజ్పై వెనుకల ఏర్పాటు చేసిన భారీ బ్యానర్లో కానీ, శిలాఫలకం మీద కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ఎక్కడా కనపడలేదు. స్టేజ్పై ఏర్పాటు చేసిన బ్యానర్లో కేవలం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి చిత్రాలు మాత్రమే దర్శనమిచ్చాయి. శిలాఫలకంలో జయరాం చిత్రపటంతో పాటు కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తదితరుల పేర్లు ఉన్నాయిగాని సీఎం చంద్రబాబు పేరు మాత్రం గల్లంతవడం చర్చనీయాంశమైంది. -
మోదీ వీడియో.. వాంగ్చుక్ దీక్ష విరమణపై సీజేపీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నీట్ నిరసనల్లో భాగంగా చేపట్టిన తన దీక్షను విరమించారు. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఆయనకు స్వయంగా నీళ్లు తాగించారు. ఆ సమయంలో వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. అయితే.. వాంగ్చుక్ దీక్ష ముగింపుపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పందించింది. వాంగ్చుక్ దీక్ష విరమించడంతో తాము కాస్త ఉపశమనం పొందామని, ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వాంగ్చుక్ దీక్ష విరమణతో ఆందోళనలు ఆగిపోతాయా? అనే అనుమానాలకు అభిజిత్ పుల్స్టాప్ పెట్టారు. అసాధారణ ధైర్యం.. గొప్ప త్యాగం“26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో, త్యాగంతో పోరాడిన సోనమ్ సర్కు ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచించేలా చేశారు. ఈ దేశానికి మీ జీవితం ఎంతో విలువైనది” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అయితే వాంగ్చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది. We are relieved and grateful that Sonam sir has ended his hunger strike after 26 days.Thank you, sir, for your extraordinary courage and sacrifice. By putting your own life on the line, you awakened the conscience of an entire nation. Your life is far too precious to this…— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కేంద్రం తీసుకునే కఠిన చర్య. అది నెరవేరే దాకా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన శాంతియుత నిరసనలు కొనసాగుతాయి అని స్పష్టం చేశారాయన. వీ సపోర్ట్ వాంగ్చుక్ అనే డీపీని అభిజిత్ ఇంకా ఎక్స్ కొనసాగిస్తుండడం గమనార్హం.కేంద్రం ఇచ్చిన హామీలేంటి?వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించినట్లు సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. దేశంలో హింస చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని షరతులతో దీక్షను ముగించినట్లు వెల్లడించారు. తాను అంగీకరించిన షరతులను త్వరలోనే వీడియో ద్వారా వివరిస్తానని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి హింసకు తావివ్వొద్దని కోరారు.కాగా, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ మార్చ్లో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.జూన్ 28 నుంచి నిరాహార దీక్షపరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్చుక్ జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకు ముందే జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయనను జంతర్ మంతర్ నుంచి తరలించి సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు అనుమతితో మెదాంత ఆస్పత్రికి మార్చారు. 26 రోజుల దీక్షలో ఆయన సుమారు 11 కిలోల బరువు కోల్పోయినట్లు సమాచారం.పేపర్ లీకులపై కేంద్రం కీలక చర్యలుపరీక్ష పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసుల విచారణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. ఢిల్లీ పరిధిలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లో స్పెష్టల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ను నియమించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారించనుంది. ఇటు విద్యాశాఖలో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసి ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీ.కే. అనిల్కుమార్ను నియమించింది.మోదీ వీడియో మెసేజ్.. రాహుల్ కౌంటర్ప్రధాని మోదీ తొలిసారిగా వీడియో సందేశం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ అతిపెద్ద సమస్య.. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు ఉంటాయని.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. పలువురు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారాయన. విద్యా సంస్కరణలు తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026అలాగే సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణపైనా మోదీ స్పందించారు. వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ తన దినచర్యను కొనసాగించాలని.. త్వరగా కోలుకొని మునుపటి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.అయితే.. మోదీ ట్వీట్పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మంత్రితో రాజీనామా చేయించకుండా.. విద్యార్థుల్ని అవమానించొద్దు అని రీట్వీట్ చేశారు. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి.. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని, విద్యార్థులు కోరుకునేది ఇదేనని అన్నారాయన. అలాగే లీకులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన వాళ్లపైనా చర్యలకు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.Don’t insult their intelligence with this pathetic midnight video. 1. Sack Pradhan.2. Punish those who beat students.3. Apologise https://t.co/7SLB6pQqZx— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026మాకు రాజీనామానే కావాలిఇటు మోదీ వీడియో సందేశంపై సీజేపీ స్పందించింది. కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని.. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని అంటోంది. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. “ఒక్క మంత్రి పదవి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే గొప్పది కాదు. విద్యార్థుల న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని సీజేపీ తెలిపింది. మరోవైపు సీజేపీతో ఏ టైంలోనైనా.. ఎక్కడైనా చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. రాజీనామా డిమాండ్ విషయంలో మాత్రం తలొగ్గే తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. ఇవాళ మధ్యాహ్నాం సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. -
కొడంగల్లో ధర్నా రాజకీయ నాటకం
సాక్షి ప్రతినిధి, వరంగల్: నీట్ పరీక్ష ఉదంతంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోదీ పేరును ప్రస్తావించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంపై రాజ్ భవన్ ముందు ధర్నా చేయాల్సిందిపోయి కొడంగల్లో ధర్నా చేయడం రాజకీయ నాటకమేనన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, మంత్రులు హైదరాబాద్లో ధర్నా చేస్తే ఆయన కొడంగల్కు పోయి అక్కడ ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. ‘మోదీ అంటే రేవంత్కు భయం. ఆయన పగలు కాంగ్రెస్తో ఉంటాడు. రాత్రయితే బీజేపీతో కలుస్తాడు..’అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు ఒక మూట ఇస్తే బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడని ఆరోపించారు. సీఎంపై ఉన్న పాత కేసులను బీజేపీ ప్రభుత్వం తోడుతుందనే ఉద్దేశంతోనే ప్రధాని పేరును కూడా పలకడానికి భయపడుతున్నాడని విమర్శించారు. గురువారం హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు ‘ఇది మూటలు పంపే పాలన. ప్రజలకు ఉపయోగపడే ఏ పని రేవంత్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టులను తన బంధువులకు ఇప్పించుకుంటున్నారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు. ఆయన బామ్మర్ది సృజన్రెడ్డికి మేలు జరిగే విధంగా వ్యవహరించారు. కన్నెపల్లి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయరు? బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులేవీ కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయడం లేదు. ఆ పనులు పూర్తి చేస్తే మాకు పేరొస్తుందని సీఎం భయపడుతున్నారు. దేవాదుల నుంచి నీటిని లిఫ్ట్ చేసినప్పుడు కన్నెపల్లి నుంచి ఎందుకు నీటిని పంపిణీ చేయరు? కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయకుండా తాము ఆపలేదని, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు..’అని కేటీఆర్ అన్నారు. నాలుగు పార్టీలు మారి హరీశ్రావుపై ఆరోపణలా? ‘హరీశ్రావు పార్టీ మారరు. బీఆర్ఎస్ పార్టీ లోనే తన పుట్టుక, చావు అని ఇప్పటికే పలుమార్లు హరీశ్రావు ప్రకటించారు. అయినా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. హరీశ్రావుపై నాలుగు పార్టీలు మారిన రేవంత్రెడ్డి కామెంట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఎవరితోనూ పొత్తులుండవు.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు. కవిత అంశంపై కూడా వ్యక్తులుగా కాకుండా వ్యవస్థలుగానే మాట్లాడతాం. కేసీఆర్ దయవల్లే మేమంతా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 179 వరకు పెరిగే అవకాశం ఉంది. పునర్విభజన వల్ల నా నియోజకవర్గం మారే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉండటమే నాకు ఎక్కువ సంతృప్తినిస్తోంది.ప్రజా సమస్యలపై అంశాల వారీగా ఉద్యమాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతులు, నిరుద్యోగులతో సమావేశాలు నిర్వహించాం. త్వరలో ఇతర వర్గాలతో కూడా సమావేశాలు చేపడతాం. నిరుద్యోగం, యువత సమస్యలు, రైతుల ఇబ్బందులపై బీఆర్ఎస్ మరింత దూకుడుగా పోరాటాలు కొనసాగిస్తుంది. అలాగే వచ్చే ఏడాది పాదయాత్ర కూడా చేస్తా. త్వరలోనే తేదీలు, వివరాలు ప్రకటిస్తాం. విద్యార్థుల ఆగ్రహం మోదీపైకి మళ్లింది.. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల ఆందోళనలు పెరుగుతున్నాయి. మొద ట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. దేశంలో యువత, నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తే దీనికి కారణం. మోదీ ప్రభుత్వం ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకుంది..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం పదవి వారసత్వ హక్కు కాదు.. ‘ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. సీఎం పదవి అనేది వారసత్వ హక్కు కాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు, రాష్ట్ర సాధకుడు.. కేసీఆర్ కుమారుడిగా, ఈ తెలంగాణ బిడ్డగా రాష్ట్ర సాధన పోరాటంలో మమేకం అయినందుకు గర్వపడుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. పదవులు ప్రజల అభీష్టం మేరకు వస్తాయని, ప్రజలు ఏది కోరుకుంటే అదే అవుతుందని అన్నారు. -
కాంగ్రెస్ ఓట్లే లక్ష్యం.. 'సర్'తో బీజేపీ సర్కార్ కుట్ర: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–సర్) పేరుతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘సర్’ పేరుకే ప్రక్షాళన అని, కాంగ్రెస్ ఓట్ల తొలగింపే టార్గెట్ అని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దళితులు, గిరిజనుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు కోల్పోతే సంక్షేమ పథకాల లబ్ధి పొందడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ నగరంలో లక్షల ఓట్లు తొలగించారని, ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనను సంక్షేమ శాఖకు బదిలీ చేశారని విమర్శించారు. ఇప్పుడు చేస్తున్న ఎస్ఐఆర్కు ఆద్యుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. గురువారం శాసనసభ ఆవరణలో జరుగుతున్న మరమ్మతు పనులను సీఎం పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ మీడి యా అడ్వైజరీ కమిటీ కార్యాలయంలో విలేకరులతో చిట్చాట్ చేశారు. ముందు ఓట్ల తొలగింపు.. తర్వాత సంక్షేమ పథకాలు ‘పేదోడి ఓటు చాలా విలువైంది. ఓటు పోతే వారి జీవితం పోతుంది. అందుకే 3వ తేదీ వరకు మా నేతలకు హైదరాబాద్ రావొద్దని చెప్పా. సర్ ప్రక్రియ ఇప్పటివరకు 70 శాతం పూర్తయ్యింది. ఇంకా 30 శాతం ఉంది.. ఇదే కీలకం. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) అత్యంత కీలక పాత్ర పోషించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలు, దళితులు, గిరిజనుల ఓట్లు పెద్దఎత్తున తొలగిపోయే ప్రమాదం ఉంది. కూలీ పనులకు వెళ్లేవారు, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పేదలంతా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వాళ్లే. బీఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్లు ఇంట్లో లేకపోతే ఆ ఓట్లు పోయినట్టే. కాంగ్రెస్కు ఓటు బ్యాంకుగా ఉన్న ఈ వర్గాల ఓట్లను తొలగించడం ద్వారా పార్టీని బలహీనపరచాలని కుట్ర జరుగుతోంది. ఓటు లేకపోతే ప్రజాస్వామ్య హక్కులు పోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నాకు రెండు ఓట్లు లేవు.. ‘కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటున్నాయి. నీట్ పేపర్ లీకేజీ నుంచి ఎస్ఐఆర్ వరకు రెండు పార్టీల వైఖరి అనుమానాలకు తావిస్తోంది. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. నాకు రెండు ఓట్లు ఉంటే బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. విచారణ చేసి తప్పు అయితే లోపల వేస్తారు. నేను స్వయంగా ఎన్నికల కమిషన్కు దరఖాస్తు పెట్టుకుని ఓటు కొడంగల్కు మార్చుకున్నా. కాళేశ్వరం కేసులో సీబీఐ తన పని చేసుకుంటుంది.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ కమిటీ నివేదికల ఆధారంగానే సీబీఐకి దర్యాప్తుకు అప్పగించాం. తప్పు చేసి ఉంటే తప్పించుకోలేరు. మేడిగడ్డ బరాజ్ గేట్లు తెరిచినా, పంప్హౌస్లు నడిచేపక్షంలో అవెందుకు కట్టారో చెప్పకుండా హరీశ్రావు చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. మేడిగడ్డ, కన్నెపల్లి పంప్హౌస్, బరాజ్ల నిర్మాణం, గేట్ల నిర్వహణపై నిపుణుల నివేదికలు స్పష్టంగా ఉన్నాయి. ఆ అంశాలపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడకుండా కన్నెపల్లి నుంచి నీటిని తరలించాలని కొత్త రాగం అందుకున్నారు. మేడిగడ్డ బరాజ్లో 5 టీఎంసీల నీళ్లు ఉన్నప్పుడే కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని తరలించే అవకాశం ఉంది. అదే పద్ధతి అన్నారం, సుందిళ్లలో కూడా ఉంది. ఇవన్నీ జరగాలంటే మూడు బరాజ్ల గేట్లు మూయాలి. అవి మూస్తే బరాజ్ కూలుతుందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. దేవాదుల ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేస్తున్నాయి..’ అని రేవంత్ వివరించారు. జన్వాడ ఫామ్హౌస్ ఎవరిది? ‘ఇంటర్మీడియెట్ పరీక్షల వ్యవహారంలో 25 మంది విద్యార్థుల మరణాలకు కారణమైందని ఆరోపణలు ఎదుర్కొన్న గ్లోబ్ అరెనా సంస్థ పేరు మార్చుకుని ప్రస్తుతం ’కో ఎంప్ట్’ గా చలామణి అవుతోంది. నీట్ పేపర్ లీకేజీకి స్ఫూర్తి నాటి గ్లోబ్ అరెనా సంస్థ చేసిన ఇంటర్ లీకేజీనే. జన్వాడ ఫామ్హౌస్ ఏ రాజు నుంచి వచ్చిందో...ఆ ఫామ్హౌస్కు, గ్లోబ్ అరెనా సంస్థ ‘రాజు’కు ఉన్న సంబంధమేంటో కేటీఆర్ చెప్పాలి. గ్లోబ్ అరెనా సంస్థ తనది కాదని కేటీఆర్ చెప్పే పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. ఇప్పటికే విజిలెన్స్ ద్వారా గ్లోబ్ అరెనా ఇంటర్ లీకేజీపై విచారణ జరుగుతోంది. కేటీఆర్ ఫిర్యాదు చేస్తే సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగుతారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారి విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు. జైలుకు వెళ్తే సానుభూతి వచ్చి సీఎంలు అయ్యే పక్షంలో, ఎప్పుడో జైల్లో ఉన్న చార్లెస్ శోభరాజ్, బిల్లా రంగాలు కూడా పీఎంలు ఆయ్యే వాళ్లు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. ‘ఇందిరమ్మ’ అదనపు ఖర్చు లబ్ధిదారులదే ‘పేదల ఇళ్లకు రూ.5 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అందుకు అనుగుణంగానే భూమి ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంది. హైదరాబాద్లో ఇచ్చే లక్ష ఇళ్లకు కూడా ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంది. అదనపు ఖర్చు లబ్ధిదారులే చెల్లించాల్సి ఉంటుంది. సమర్ధవంతంగా హైడ్రా వ్యవస్థ హైడ్రా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది. చెరువులను పునరుద్ధరించి ప్రభుత్వ భూములను కాపాడుతోంది. ఉద్యోగాల భర్తీలో మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 55 రోజుల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే నియామకాల జాబితాను పేర్లతో సహా వెల్లడించడానికి సిద్ధం. నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రశ్నపత్రం అమ్ముకోవడం వారి విధానమైతే, నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం మా విధానం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయలేకపోయామని కేటీఆర్ ఒప్పుకున్నాడు. మేము ప్రక్షాళన చేయడమే కాకుండా పదేళ్ల తర్వాత గ్రూప్ –1 పరీక్షలు నిర్వహించాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
వచ్చే నెల 9వ తేదీన వైఎస్సార్సీపీ బీసీ రణభేరి
తాడేపల్లి : వచ్చే నెల 9వ తేదీన విజయవాడలో వైఎస్సార్సీపీ బీసీ రణభేరి నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. ఈ రణభేరిలో బీసీలపై చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు చర్చిస్తామన్నారు. వైఎస్సార్సీపీ బీసీ నేతలను ఈ ప్రభుత్వం వేధిస్తుందని, చంద్రబాబు బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు జోగి రమేష్. బీసీల ఐక్యత చాటేలా ఈ రణభేరి ఉంటుందన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో బలహీన వర్గాలు నడవాల్సిన అవసరం ఉందన్నారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం(జూలై 23వ తేదీన) మీడియా సమావేశంలో మాట్లాడిన జోగి రమేష్.. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని జగన్ నిరూపించారన్నారు. సామాజిక న్యాయం జగన్తోనే సాధ్యమని, ఆయన మాత్రమే బీసీలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయే టైం దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు జోగి రమేష్.సూపర్ సిక్స్ పేరుతో సూపర్ మోసం చేశారుచంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరుతో సూపర్ మోసం చేశారని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మరీ ముఖ్యంగా బీసీలతో ఓట్లేయించుకుని వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ‘ బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అన్నమాటలు ఎవరూ మర్చిపోలేదు. వైఎస్సార్ సీపీలోని బీసీ నేతలందరినీ టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. గంటూరులోనూ బీసీ మహిళను వివస్త్రతను చేసి అవమానపరిచారు. నాపై పది అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఇలాంటివి ఎన్నైనా ఎదుర్కొంటాం. బీసీలందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు. -
మరో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధం
సాక్షి, తాడేపల్లి: ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలపై నిరంతరం వైఎస్సార్సీపీ పోరాడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. అమరావతి దోపిడీ నుంచి డీఎస్సీ అక్రమాల వరకూ అన్నింటినీ ప్రజల ముందు పెట్టి వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.ఈ క్రమంలో మరో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. 28న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. పార్టీ యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనుంది. డీఎస్సీ అక్రమాలు, నీట్ పరీక్షలో జరిగిన తప్పులు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబ్సర్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నిరసనలు నిర్వహించనుంది.వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. యువతను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో కోటిమంది యూత్ ఉన్నారని చంద్రబాబు చెప్తున్నారు. ఉద్యోగం వచ్చేంత వరకు వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.72 వేల కోట్ల బకాయి పడ్డారు. డీఎస్సీలో భారీగా జరిగిన అక్రమాలను సాక్షాలతో బయటపెట్టాం. అయినా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. బంగ్లాదేశ్లో యువత తిరగపడితే ఏం జరిగిందో చంద్రబాబు గుర్తుంచుకోవాలి’’ అని ఆయన హెచ్చరించారు.‘‘ఢిల్లీలో యువత చేస్తున్న ఆందోళనలు ఎలా ఉన్నాయో చూడండి. చంద్రబాబు యువత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. నీట్ పేపర్ లీక్ తో లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబిఐ విచారణ చేయాలి. నీట్ తప్పులు, ఫీజు రీయింబ్సర్మెంట్పై పోరాటం చేస్తాం. 28న జిల్లా కేంద్రాల్లో యూత్, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ర్యాలీలు చేస్తాం’’ అని జక్కంపూడి రాజా తెలిపారు.స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ.. డీఎస్సీలో పారదర్శకత లేదని.. మొదటి ర్యాంకు వచ్చిన వారికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. మెరిట్, రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా వారు డీఎస్సీ పరీక్షలు రావాల్సిన పనిలేదని జీవో ఇచ్చారు. బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?. డీఎస్సీలో అన్నీ అక్రమాలే. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. రూ.9 వేల కోట్లపైనే బకాయిలు పడ్డారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘యువత గొంతు నొక్కితే మీ రాజకీయ పతనం తప్పదు’
హైదరాబాద్: యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదని మంత్రి ఉత్తమ్కుమార్ మండిపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణాలపై మంత్రి ఉత్తమ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్బంధాలు సరికాదని ధ్వజమెత్తారు. ‘ప్రజాస్వామ్యాన్ని భయపెట్టలేరు... రాజ్యాంగాన్ని అణచలేరు. ఉద్యోగాలు అడిగిన యువతకు లాఠీలు, కేసులే బీజేపీ సమాధానామా?, ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కే. విద్యార్థుల స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు. యువత భవిష్యత్తుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యార్థుల మధ్య నిలిచిన రాహుల్ గాంధీ నిజమైన ప్రజానాయకుడు. ప్రజల మధ్య ఉండే నాయకత్వానికే దేశం మద్దతిస్తుంది. భయపెట్టి ప్రజల స్వరాన్ని శాశ్వతంగా అణచలేరు. విద్యార్థుల కలలను సంకెళ్లతో బంధించలేరు. యువత ఆశయాలను జైళ్ల గోడల మధ్య నిర్బంధించలేరురాజ్యాంగాన్ని ఎవరూ ఓడించలేరు. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ చారిత్రక బాధ్యత. యువత విద్వేషం కాదు... విశ్వాసం కోరుకుంటోంది. అహంకారం కాదు... జవాబుదారీతనం కోరుకుంటోంది. ప్రచారం కాదు... పారదర్శక పాలననే యువత కోరుకుంటోంది. 2029 ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణకు కీలకం. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అందిస్తుంది. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తోంది. ప్రజల గొంతు వినే ప్రభుత్వాలే చరిత్రలో నిలుస్తాయి. భారత్ను భయంతో కాదు... ప్రజాస్వామ్యం, రాజ్యాంగంతో నడపండి’ అని సూచించారు. -
మీ దౌర్జన్యాలకు నేను భయపడను.. వెనక్కి తగ్గను: భూమన
తిరుపతి: సీమ జిల్లాల్లో ముఠా కక్షదారులు శత్రువులు ఆస్తులు ధ్వంసం చేసి సంతప్తి చెందిన మాదిరిగా తమ కుటుంబ ఆస్తులపై చంద్రబాబు దాడి చేసి తృప్తి పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబును వ్యతిరేకించేవారిని టార్గెట్ చేసి వారి కుటుంబ ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమాలకు కూటమి నేతలు దిగారని భూమన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఎత్తి చూపుతున్న కారణంగా ద్వేషంతో, ప్రతీకార పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. తన ఆస్తులు విధ్వంసం చేసినంత మాత్రాన తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు భూమన. ‘21 ఏళ్ల క్రితం ఈ ఆస్తులు కొనుగోలు చేశాం.. రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి, మీరు సీఎం గా ఉన్నప్పుడు కనిపించలేదా?, నా వాణి బలంగా వినిపిస్తున్నందుకే ఈ కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు. నేను అవినీతి మోసాలు చేసినవాడ్ని కాదు.తిరుపతిలో రౌడీ రాజకీయాలు ఏనాడు అవకాశం ఇవ్వలేదు. జీవితం అంతా విలువలతో రాజకీయాలు చేసిన వాడ్ని. నా ఆస్తులు విధ్వంసం చేసినంత మాత్రాన నేను వెనక్కి తగ్గను. నేను ఆశయాలతో బ్రతికేవాడ్ని, ఆశలతో బ్రతికే వాడిని కాదు. నేను అన్నిటికి సిద్ధం..మా కుటుంబ ఆస్తులు ధ్వంసం చేసినా నీ తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటా. 1991 లో ప్రారంభించిన హెరిటేజ్ కూడా నది పోరంబోకు స్థలంలోనే ఉంది. నా కుటుంబ ఆస్తులు దాడి చేయడం ద్వారా నాకు మరింత ఉత్సాహంగా మీ తప్పులను ఎత్తి చూపిస్తా’ అని హెచ్చరించారు. -
బాబూ.. లక్ష్మీ కటాక్షమా.. ఓట్ల రాజకీయమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి సంబంధించి చేస్తున్న ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేవిగా ఉంటున్నాయా? లేక అంతా ఆమోదించేవిగా ఉంటున్నాయా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు చేసిన కొన్ని ప్రకటనలను గమనించండి. అమరావతికి లక్ష్మీ కటాక్షం-హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నాం.. అమరావతి అంటే విజయవాడ గుంటూరు, మంగళగిరి కలిసి ఉండేదే.. ఈ వ్యాఖ్యలను విశ్లేషించుకుంటే ఏమి అర్దం అవుతుంది?ఇంతకాలం అమరావతిని దేవతల రాజధాని అని ఆయన ప్రచారం చేశారు. దీనిపై వస్తున్న ప్రశ్నలను దృష్టిలో పెట్టుకున్నారేమో తెలియదు కాని ప్రజల రాజధాని అని కూడా అంటున్నారు. అంతవరకు సంతోషమే.దేశంలో మరే రాష్ట్రంలో తమది దేవతల రాజధాని అని ఏ ముఖ్యమంత్రి చెప్పి ఉండరు. ప్రజలను సెంటిమెంట్తో ఆకట్టుకోవడం కోసం ఆయన ఇలా చేస్తున్నారన్నది తెలుస్తూనే ఉంది. గత ఏడెనిమిదేళ్లుగా ఆయన ఈ మాట చెబుతూనే ఉన్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నామని చంద్రబాబు అన్నారట. ఇలా అనడంలోని ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు. భారత్.. రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ దేశంగా ఉంది. అన్ని మతాలను సమానంగా చూడాలి. చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉంటే ఒకరకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తుంటారన్న భావన రాజకీయ వర్గాలలో ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు మతపరమైన రాజకీయాలు చేయడానికి రకరకాల యత్నాలు చేశారు. చంద్రబాబు 2024లో మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అదే ప్రయత్నం సాగిస్తున్నారు.తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపించి, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టేందుకు కృషి చేశారు. తీరా అలాంటిదేమీ జరగలేదని తేలడంతో ఆయన సెల్ఫ్గోల్ వేసుకున్నట్లయింది. అయినప్పటికీ ఈ మధ్య మీమతం, మా మతం, మీ దేవుడు, మా దేవుడు అంటూ స్పీచ్లు ఇస్తూ ప్రజలను అటువైపు మళ్లించడానికి తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ఆయన ఇలా మతపర వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలుతోంది.ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత డెబ్బై ఐదేళ్లలో ఎన్నడూ మతాల ఆధారంగా కాకుండా ప్రభుత్వాల పనితీరు, విధానాల ఆధారంగానే ఓట్లు వేస్తూ వచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన అంశాలకు ప్రాధాన్యం పెరిగిన మాట వాస్తవమే. అందులోనూ మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ధోరణి మరింత హెచ్చింది. బీజేపీ మెప్పు కోసం చంద్రబాబు కూడా హిందూయిజాన్ని ప్రధాన అంశంగా మలచుకుని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అమరావతి రాజధానిలో జగన్నాధ రధయాత్రలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా స్వామివారి ఆశిస్సులను కోరుకోవడం, ప్రజలకు మేలు కలగాలని ప్రార్ధించడం సహజంగానే జరుగుతుంది. కాని హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మించడం ఏమిటో తెలియదు. ఈ మాటలు విన్న ఇతర మతాలవారికి అది ఎలాంటి భావన కల్గిస్తుందన్నది ఆయన ఆలోచించుకోవాలి!గతంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని పిలవరా అని అన్నప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. టీడీపీకి దూరంగా ఉన్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు అన్ని కులాలను, మతాలను తన వెంట తీసుకువెళ్లేలా వ్యవహరించాలి. దేశం కాని, రాష్ట్రం కాని మతపరమైనవిగా లేవన్న సంగతి గుర్తించాలి. స్థల మహత్యంతో అమరావతిని ఎవరూ కదలించలేరని అంటూ రాజకీయ లక్ష్యంగా ప్రసంగం చేసినట్లు అనిపిస్తుంది. ఆధ్యాత్మికత తోడుంటేనే ప్రశాంతత వస్తుందని ఆయనే చెబుతారు. కాని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆయనే రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారు.అమరావతికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషపడతారు. లక్ష్మీ కటాక్షం రాష్ట్రం అంతటికి రావాలని ఎవరైనా కోరుకుంటారు కాని, అమరావతికే కోరడం ఏమిటో తెలియదు. ఇప్పటికైతే అమరావతి ద్వారా ప్రభుత్వానికి లక్ష్మీ కటాక్షం ఎంత జరిగిందో అంటే.. ఎంత ఆదాయం వచ్చిందో తెలియదు కాని, అప్పు మాత్రం 47వేల కోట్లకు చేరింది. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడానికి లక్షకోట్లు ప్రస్తుతం ఖర్చు చేయవలసి ఉందని అంటారు. నిజంగానే లక్ష్మీకటాక్షం జరిగి, ప్రజల మీద భారం లేకుండా అమరావతి సొంతంగా సంపాదించుకుంటే చంద్రబాబు చెప్పింది నిజమేనని నమ్ముతారు. అలాకాకుండా వేల కోట్ల అప్పులు తెస్తూ దానినే లక్ష్మీ కటాక్షం అని అనుకోవాలంటే కష్టం అవుతుంది.అంతేకాదు... అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఈ రెండేళ్లలో కలిగిన లక్ష్మీ కటాక్షం పెద్దగా ఏమి లేదని బాధపడుతుంటారు. వారికి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చి ఉంటే కొంత కటాక్షం కలిగేదేమో. పైగా బలవంతపు భూ సేకరణ ద్వారా రైతుల వద్ద ఉన్న లక్ష్మీని కూడా ప్రభుత్వం లాక్కుంటోందన్న బాధ పలువురిలో ఉంది. కొందరు మహిళలను సైతం ప్రభుత్వం ఈ విషయంలో వేధించిన తీరు చూసి లక్ష్మీదేవి కూడా బాధపడి ఉండాలి. ప్రభుత్వం స్టార్ హోటళ్లకు ఎకరా ఎనిమిది కోట్లకు భూమి ఇస్తామని ప్రతిపాదించిందట. అదే టైమ్ లో భూముల సొంతదారులైన రైతులకు మాత్రం కోటి, రెండు కోట్లు కూడా ఇవ్వడం లేదని ఉండవల్లి రైతులు వాపోతున్నారు.చివరిగా మరో మాట.. మాజీ సీఎం జగన్ మావిగన్ అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలను ఒక కారిడార్గా తీసుకుని రాజధాని అభివృద్ది చేయాలని సలహా ఇస్తే దానిని చంద్రబాబు ఎద్దేవ చేశారు. కాని తాజాగా చేసిన ఒక ప్రసంగంలో అమరావతి అంటే విజయవాడ, మంగళగిరి, గుంటూరు కలిసి ఉన్నాయని అంటున్నారు. అవి ఇందులో భాగం అయితే రైల్వేస్టేషన్, ఎయిర్పోర్టు వంటివి మళ్లీ ఎందుకు నిర్మించాలి? వాటికోసం వేల ఎకరాల భూములు తీసుకుని రైతులను ఎందుకు బాధించాలి అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. మొత్తం తెచ్చిన అప్పు అంతా అమరావతి 29 గ్రామాలలోనే ఎందుకు వ్యయం చేస్తున్నారన్నదానికి సమాధానం చెప్పరు. అయితే జగన్ మావిగన్ ప్రతిపాదనను కాదనలేని స్థితికి చంద్రబాబు చేరుకున్నారని అనుకోవాలి. మతం మత్తు మందు వంటిదని కారల్ మార్క్స్ అంటారు. దానిని ఎంతవరకు అంగీకరిస్తారో తెలియదు కాని, మతం పేరుతో రాజకీయ లబ్ది పొందడానికి మాత్రం చంద్రబాబు వేస్తున్న వ్యూహాలు ప్రజలకు అర్థం కాకుండా ఉంటాయా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మోదీ ట్వీట్కు రాహుల్, సీజేపీ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీకుల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం చేసిన ట్వీట్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించాయి.ప్రధాని మోదీ స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పేపర్ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ ఘాటు స్పందనప్రధాని ట్వీట్పై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’’ అంటూ విమర్శించారు. పేపర్ లీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాహుల్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మంత్రి రాజీనామా చేయాల్సిందే:సీజేపీమరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ కూడా ప్రధాని మోదీ ట్వీట్పై స్పందించింది. పేపర్ లీకుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. అలాగే విద్యార్థులపై దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్ఘాటించింది. అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేపీ కోరింది. -
పార్లమెంట్ను తాకిన ఏపీ మెగా డీఎస్సీ స్కామ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్సీపీ పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేసింది. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని చెబుతూ.. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చింది.రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం వాయిదా తీర్మాన నోటీసు ఇవ్వగా.. లోక్సభలో ఎంపీ గురుమూర్తి ఇదే అంశంపై నోటీసు అందించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై ఉభయ సభల్లోనూ తక్షణ చర్చ చేపట్టాలని వారు కోరారు.16 వేల టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు!ఏపీలో సుమారు 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైఎస్సార్సీపీ అంటోంది. రిక్రూట్మెంట్ ప్రక్రియను ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వహించారని, దీనిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. టీచర్ల నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.స్పోర్ట్స్ కోటాలో మరీ దారుణంస్పోర్ట్స్ కోటా పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంలో పేర్కొంది. డబ్బులు తీసుకుని స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారనే ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు. నిజమైన అర్హులకు అవకాశాలు దక్కలేదని అన్నారు.మెరిట్ జాబితాలపై ప్రశ్నలుగతంలో మాదిరిగా జిల్లా వారీగా మెరిట్ జాబితాలను విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ అంటోంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో కొందరిని కూడా ఎంపిక చేయలేదని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అవసరమని, పారదర్శకత కోసం సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.ఏపీలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై రాజకీయంగా దుమారం కొనసాగుతోంది. చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్లు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియామక ప్రక్రియ ఏ దశలోనూ సజావుగా సాగలేదని.. పైగా అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై మీడియా సమావేశంలో ఇదివరకే ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. -
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు రిమాండ్
సాక్షి, శ్రీకాకుళం: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్ వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. యాక్సిడెంట్ సంబంధిత కేసులో ఆయన పేరును ఏ3గా చేర్చి.. సెక్షన్లను మార్చేసి మరీ అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మరోవైపు రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదని, వైద్య చికిత్స అవసరమైన సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారని అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తున్నారని భార్య శ్రీదేవి మండిపడ్డారు. యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మార్చడం బాధాకరమన్నారు. ఈ తరుణంలో ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు, ఇటు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. పీఎస్లోనే సీదిరి అప్పలరాజుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ఆయన్ని కలవనీయకుండా పోలీసులు అడ్డుకుంటుండడంతో కాశీబుగ్గ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది.రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పోలీసులు అప్పలరాజును బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ సమయంలో ఆయన్ని చొక్కా పట్టుకుని లాక్కెల్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలాగే రాత్రంత కాశీబుగ్గ స్టేషన్లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన్ని ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అరెస్ట్ రాజకీయ కక్షసాధింపులో భాగమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.వైద్య పరీక్షల కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి..మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైద్య పరీక్షల నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. భద్రతా ఏర్పాట్ల మధ్య సీదిరిని ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీస్ బృందం. వైద్య పరీక్షల తర్వాత సీదిరి అప్పలరాజును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అప్పలరాజు తరలింపుతో పలాసలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ధర్మాన కృష్ణదాస్ను అడ్డుకున్న పోలీసులు..పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ పీఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ను అడ్డుకున్న పోలీసులు.. సీదిరి అప్పలరాజును కలిసేందుకు వైఎస్సార్సీపీ నేతలను అనుమతించలేదు.పలాసలో ఉద్రిక్తతఅప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో పలాసలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆయన అరెస్ట్కు నిరసనగా పలాసలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. పోలీస్స్టేషన్ నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకు సాగిన ఆందోళనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఉదయం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు పలాసకు చేరుకుంటున్నారు.‘వైద్యం అవసరమైన సమయంలో అరెస్ట్ చేశారు’‘‘రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. వైద్య చికిత్స అవసరమైన సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదం కేసును నేరపూరిత హత్య కేసుగా మార్చడం బాధాకరం. రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారు’’ అని అప్పలరాజు భార్య శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త, కుమారుడిపై కావాలనే అక్రమ కేసులు నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.వైఎస్ జగన్ ఆగ్రహంమాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కేందుకు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగిస్తున్నారని, అరెస్టులతో వైఎస్సార్సీపీని భయపెట్టలేరని జగన్ పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.కేసు విషయంలో రాజకీయ దుమారంరోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులోనే అప్పలరాజును అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతుండగా.. ఇది కక్షసాధింపు చర్యేనని వైఎస్సార్సీపీ అంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పలరాజు ఆరోగ్యం, అరెస్ట్ పరిణామాలు, పలాసలో కొనసాగుతున్న నిరసనలపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
2027లో ఉత్తరప్రదేశ్ను ఏలేది ఎవరు?
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పటికే తారాస్థాయికి చేరింది. అధికార బీజేపీతో పాటు విపక్షాలైన సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే తమ పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సామాజిక సమీకరణాలు, కులగణనలే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు సరికొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.బీజేపీ సరికొత్త వ్యూహం - సంస్థాగత బలోపేతంగత లోక్సభ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకున్న భారతీయ జనతా పార్టీ, ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వెనుకబడిన వర్గాల ఓట్లు పార్టీకి దూరమవ్వకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడంతో పాటు, హిందుత్వ, అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తూ ప్రజల్లో మతపరమైన, సామాజిక ఐక్యతను చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.ఎస్పీ ‘పీడీఏ’ ఫార్ములా - మారుతున్న సమీకరణలుసమాజ్వాదీ పార్టీ ఈసారి టికెట్ల కేటాయింపులో వినూత్న పద్ధతిని అనుసరిస్తోంది. కేవలం నాయకుల వ్యక్తిగత ప్రభావంపై ఆధారపడకుండా, ప్రతి నియోజకవర్గంలోని సామాజిక పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేస్తోంది. కేవలం యాదవ, ముస్లిం ఓట్లకే పరిమితం కాకుండా, ఇతర వెనుకబడిన కులాలను కూడా తమ వైపునకు తిప్పుకోవడానికి ‘పీడీఏ’ (వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాక) నినాదంతో ముందుకు సాగుతోంది.మాయావతి ఒంటరి పోరుయూపీలో మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఏ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. పార్టీకి బలమైన పునాదిగా ఉన్న దళిత ఓటు బ్యాంకును తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు, ఇతర వెనుకబడిన వర్గాలు, సవర్ణుల్లో కొంత భాగాన్ని ఆకట్టుకునేలా పాత సామాజిక ఇంజినీరింగ్ సూత్రాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ దూకుడు - కులగణన అస్త్రంరాష్ట్రంలో కోల్పోయిన పాత ప్రాభవాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా కులగణన అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, జనాభా ప్రాతిపదికన ప్రతి వర్గానికి సరైన ప్రాతినిధ్యం దక్కాలనే డిమాండ్ను బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా రైతులు, యువకులు, వివిధ సామాజిక వర్గాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే పనిలో పడింది.ఓవైసీ ఎంట్రీతో మారుతున్న సమీకరణలుఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ రాక యూపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముస్లిం ఓట్లతో పాటు దళిత, వంచిత వర్గాలను కూడగట్టి సరికొత్త సామాజిక సమీకరణాన్ని తెరపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం నేరుగా విపక్షాలైన ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సామాజిక సమీకరణల ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్ జనాభాలో వెనుకబడిన తరగతులు, దళిత, ముస్లిం కమ్యూనిటీలదే సింహభాగం ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఏ కులం ఎంత బలంగా ఉందనే లెక్కలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తూ వస్తున్నాయి. యాదవ, కుర్మి, లోద్, నిషాద్ వంటి వెనుకబడిన కులాలు, ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించేందుకే అన్ని ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.ఇది కూడా చదవండి: గాంధీ నుంచి సోనమ్ వాంగ్చుక్ వరకు..


