breaking news
world news
-
శత్రువే అయినా ప్రశంసించాల్సిందే.. ఇరాన్ను పొగిడిన ట్రంప్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ.. డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఒకవైపు ఇరాన్పై సైనిక ఒత్తిడి కొనసాగిస్తూనే.. మరోవైపు అదే దేశానికి ట్రంప్ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు. శత్రుదేశాన్నే ప్రశంసించేలా ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఓ ఆసక్తికర పరిణామం ఉంది.2024 డిసెంబర్ నుంచి ఇరాన్లో నిర్బంధంలో ఉన్న అమెరికా-ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన డెనా కరారీకి తాజాగా విముక్తి లభించింది. ఆమెను ఇరాన్ విడుదల చేయడాన్ని 'సద్భావ సంకేతం' (Goodwill Gesture)గా అభివర్ణించిన ట్రంప్.. ఆ దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రూత్ సోషల్లో స్పందిస్తూ.. "ఆమె ఇప్పుడు సురక్షితంగా ఇరాన్ వెలుపల ఉంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఈ సద్భావ చర్యను అమెరికా అభినందిస్తోంది" అని పేర్కొన్నారు.ట్రంప్ పోస్టు అనంతరం మానవ హక్కుల న్యాయవాది జారెడ్ జెన్సర్.. విడుదలైన మహిళ డెనా కరారీనేనని ధృవీకరించారు. 2024లో కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇరాన్కు వెళ్లిన ఆమెను అక్కడి అధికారులు దేశం విడిచి వెళ్లనీయలేదు. అనంతరం 2025లో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ఆమెపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశారు. అంతకుముందు.. డెనా అమెరికాలోని ఓ టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం చేయడంతో పాటు ఇరాన్లో పేద పిల్లల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థను నడిపేవారు. డెనా కరారీ విడుదలకు ట్రంప్ చేసిన నిరంతర ప్రయత్నాలే కారణమని జారెడ్ జెన్సర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె అమెరికాకు తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు వెల్లడించారు. గత రెండు దశాబ్దాల్లో 20 దేశాల్లో 340 మందికిపైగా ఖైదీల విడుదలకు జెన్సర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇరాన్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ‘‘ఇరాన్ చర్చలు కోరుకుంటోంది. వారితో ఒప్పందం కుదురుతుందేమో చూడాలి. అయితే వారు సరిగ్గా, మర్యాదగా ప్రవర్తించాలి (They better behave)’’ అంటూ హెచ్చరించారు. అలా కాదని ఘర్షణలు కొనసాగితే ఇరాన్ త్వరలోనే ఓటమి పాలవుతుందని కూడా వ్యాఖ్యానించారు. అయితే చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.మరోవైపు అమెరికా హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఇరాన్కు చెందిన తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై రెండో విడత దాడులు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిస్పందించిన ఇరాన్.. ఇది తమ ఉనికికే సంబంధించిన యుద్ధమని పేర్కొంటూ, అవసరమైతే ప్రాంతీయ ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
'బిగ్ న్యూస్' అంటూ ట్రంప్ సస్పెన్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్కంఠ రేపుతున్నారు. ఇవాళ రాత్రికి ప్రత్యేక ప్రైమ్టైమ్ ప్రసంగం చేయనున్నట్లు ప్రకటించారు. "ఇది నిజంగానే చాలా పెద్ద వార్త" అంటూ ఆసక్తిని మరింత పెంచారు. అయితే ఆ ప్రకటన ఏంటన్నది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు.వైట్హౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. దీంతో.. యుద్ధం సంబంధిత ప్రకటన కాదనేది స్పష్టమైపోయింది. అయితే.. ప్రసంగంలో ప్రధానంగా అమెరికా ఎన్నికల వ్యవస్థ, మరీ ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కొత్త సమాచారం, ఓటింగ్ యంత్రాల భద్రత వంటి అంశాలు ఉండే అవకాశం ఉంది. అలాగే తాజాగా డీక్లాసిఫై చేసిన నిఘా సమాచారాన్ని కూడా ఆయన ప్రస్తావించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.ఈ ప్రసంగం నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర (మిడ్టర్మ్) ఎన్నికలకు కొద్ది నెలల ముందే రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్పై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ట్రంప్ తన మద్దతుదారులను మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు పెంచే అవకాశం ఉందని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు.మళ్లీ అదే వివాదమా?2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన ట్రంప్.. అప్పటి నుంచి ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అనేక దర్యాప్తులు, కోర్టు విచారణలు స్పష్టం చేశాయి. అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ (CISA) కూడా 2020 ఎన్నికలను అమెరికా చరిత్రలోనే అత్యంత భద్రమైన ఎన్నికలుగా పేర్కొంది.అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం 2020 ఎన్నికలకు సంబంధించిన పలు పత్రాలను సేకరించడం, దర్యాప్తులను కొనసాగించడం, ఓటింగ్ విధానాల్లో మార్పులకు ప్రయత్నించడం వంటి చర్యలు చేపడుతోంది. ఓటర్ల గుర్తింపు నిబంధనలు కఠినతరం చేయడం, మెయిల్-ఇన్ బ్యాలెట్లపై పరిమితులు విధించడం వంటి అంశాలను కూడా ట్రంప్ ముందుకు తీసుకొస్తున్నారు.ఇక ట్రంప్ ప్రసంగంపై డెమొక్రాట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలపై ఆధారంలేని ఆరోపణలను మరోసారి ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీయొద్దని వారు హెచ్చరిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 6గం. ప్రాంతంలో ట్రంప్ ప్రసంగం ఉండనుంది.. -
ఎల్ నినో ఉగ్రరూపం!.. ఫసిఫిక్ వేడితో డేంజర్ బెల్స్
భూమి వాతావరణాన్ని తలకిందులు చేసే శక్తివంతమైన ఎల్ నినోమరోసారి బలపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి కేవలం సముద్ర ఉపరితలంలోనే కాదు.. పసిఫిక్ మహాసముద్రం లోతుల్లోనే భారీగా వేడి నీటి నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ అసాధారణ మార్పులను నాసా ఉపగ్రహాలు గుర్తించడంతో ప్రపంచ వాతావరణ నిపుణులు అప్రమత్తమయ్యారు. సముద్రం అడుగున నుంచి తూర్పు పసిఫిక్ వైపు కదులుతున్న ఈ వేడి ప్రవాహాలు భవిష్యత్లో అత్యంత శక్తివంతమైన(గాడ్జిల్లా) ఎల్ నినోకు సంకేతాలా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా కనిపించే ఎల్ నినో (El Niño) పరిస్థితులతో పోలిస్తే.. ఈసారి సముద్రం వేడెక్కుతున్న వేగం, తీవ్రత భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అందుకే 2026లో ఏర్పడే అవకాశం ఉన్న ఈ ఎల్ నినోను కొందరు నిపుణులు ‘గాడ్జిల్లా ఎల్ నినో’గా అభివర్ణిస్తున్నారు.150 ఏళ్ల రికార్డును బద్దలయ్యేనా?2026-27 కాలానికి సంబంధించి వెలువడుతున్న తాజా వాతావరణ నమూనాలు సంచలన అంచనాలను చూపిస్తున్నాయి. ఈసారి ఏర్పడే ఎల్ నినో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన ఘటనలను అధిగమించే అవకాశం ఉందని కొన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. గతంలో 1997-98లో నమోదైన ఎల్ నినో ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత 2015-16 ఎల్ నినో కూడా రికార్డు స్థాయి వేడితో చరిత్రలో నిలిచింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న సముద్ర మార్పులు.. 2026 ఎల్ నినో వీటిని మించే స్థాయికి చేరవచ్చనే అంచనాలకు కారణమవుతున్నాయి.ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. 14 ప్రధాన వాతావరణ నమూనాల నుంచి సేకరించిన వందలాది అంచనాల్లో ఎక్కువ భాగం ఈసారి ఎల్ నినో బలంగా మారే అవకాశాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల పసిఫిక్లోని నినో-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని నమూనాలు అంచనా వేస్తున్నాయి.ఇది 2015-16లో నమోదైన దాదాపు 2.75 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల కంటే ఎక్కువ. ఈ అంచనాలు నిజమైతే.. గత 150 ఏళ్ల వాతావరణ రికార్డుల్లోనే ఇది అత్యంత అసాధారణమైన ఎల్ నినోగా నిలిచే అవకాశం ఉంది.నాసా ఉపగ్రహాల్లో కనిపించిన వేడి అలలుపసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెంటినెల్-6 మైఖేల్ ఫ్రైలిచ్ ఉపగ్రహం పరిశీలిస్తోంది. ఉపగ్రహ డేటాలో సముద్రం లోతుల్లో ప్రయాణించే కెల్విన్ తరంగాలు (Kelvin Waves) భారీ మొత్తంలో వేడి నీటిని తూర్పు పసిఫిక్ వైపు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎల్ నినో ఏర్పడటంలో ఈ తరంగాలు కీలక పాత్ర పోషిస్తాయి.సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంలో గాలుల ప్రవాహం, సముద్ర ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యత ఉంటుంది. అయితే ట్రేడ్ గాలులు బలహీనపడినప్పుడు.. సముద్రం లోతుల్లో దాగి ఉన్న వేడి నీరు తూర్పు వైపు కదులుతుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయి.వేగం కూడా శాస్త్రవేత్తలకు షాక్ఈసారి ఎల్ నినో తీవ్రత మాత్రమే కాదు.. అది అభివృద్ధి చెందుతున్న వేగం కూడా నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. 1997-98 ఎల్ నినో అత్యంత వేగంగా బలపడిన ఘటనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుత పరిణామాలు అంతకంటే వేగంగా మారుతున్నట్లు కొన్ని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. 2026 ప్రారంభంలో లా నినా తరహా పరిస్థితుల నుంచి ఈ ఎల్ నినో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సముద్ర మార్పులకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి తక్కువ వ్యవధిలోనే పసిఫిక్ వేడెక్కడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అసలు ఎల్ నినో అంటే..పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని పశ్చిమ ప్రాంతాలకు తరలిస్తాయి. అదే సమయంలో సముద్రం లోతుల్లోని చల్లని నీరు పైకి వస్తుంది. అయితే ఈ గాలులు బలహీనపడినప్పుడు పరిస్థితి మారుతుంది. సముద్రం అడుగున ఉన్న వేడి నీరు తూర్పు పసిఫిక్ వైపు చేరుతుంది. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిణామాన్నే ఎల్ నినో అంటారు. ఇది కేవలం ఒక సముద్ర ప్రాంతానికి పరిమితమైన మార్పు కాదు. ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపించే శక్తివంతమైన ప్రకృతి ప్రక్రియ.ప్రపంచ వాతావరణంపై ప్రభావం ఎలా?శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, వేడి గాలులు పెరగొచ్చు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, నీటి కొరత, అటవీ అగ్నిప్రమాదాలు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.భారత్పై ఎలాంటి ప్రభావం?భారత్కు ఎల్ నినో ప్రభావం అత్యంత కీలకం. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయం, నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడొచ్చు. వర్షాలు తగ్గితే పంట దిగుబడులు తగ్గడం, నీటి కొరత పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే భారత రుతుపవనాలపై ఎల్ నినోతో పాటు హిందూ మహాసముద్ర డైపోల్ (IOD), స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.వాతావరణ మార్పులతో కలిస్తే మరింత ముప్పు?ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతున్న సమయంలో.. ఇలాంటి శక్తివంతమైన ఎల్ నినో మరింత తీవ్రమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2023, 2024లో ప్రపంచం రికార్డు స్థాయి వేడిని చూసింది. ఇప్పుడు మరో బలమైన ఎల్ నినో కూడా తోడైతే.. ప్రపంచ ఉష్ణోగ్రతలు మరోసారి కొత్త రికార్డులను తాకుతాయా? అనే అంశంపై నిపుణులు దృష్టి సారించారు.ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో నిశ్శబ్దంగా పేరుకుపోతున్న వేడి.. రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారుతుందా? అన్నదే కీలక ప్రశ్న. ‘గాడ్జిల్లా ఎల్ నినో’ నిజంగా బలపడితే.. దాని ప్రభావం పసిఫిక్ తీరాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది. -
అర్ధరాత్రి సోషల్ మీడియా బంద్!
పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్లు అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు సోషల్ మీడియా వినియోగించకుండా డిఫాల్ట్ పరిమితులు విధించాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సోషల్ మీడియా యాప్లను వినియోగించకుండా నిరోధించేలా కొత్త నిబంధనలు తీసుకురానుంది.ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం.. యువతలో పెరుగుతున్న రాత్రివేళల ఫోన్ వినియోగంపై ఆందోళనలే. ఆలస్యంగా నిద్రపోవడం, ఏకాగ్రత తగ్గడం, చదువుపై ప్రభావం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు అధిక స్క్రీన్ టైమ్ కారణమవుతోందని తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వినియోగదారులను ఎక్కువసేపు యాప్లలోనే ఉంచేలా రూపొందించిన విధానాలపై విమర్శలు ఉన్నాయి.ఇందులో భాగంగా.. వినియోగదారులను నిరంతరం ఆకర్షించే కొన్ని ఫీచర్లపై కూడా బ్రిటన్ దృష్టి పెట్టింది. వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ప్లే అయ్యే విధానం వంటి ‘ఎంగేజ్మెంట్ ఫీచర్లను’ డిఫాల్ట్గా నిలిపివేయనున్నారు. అయితే వినియోగదారులు కోరుకుంటే కొన్ని సెట్టింగులను మార్చుకునే అవకాశం ఉండనుంది.పూర్తి నిషేధం కాదు.. నియంత్రణే లక్ష్యంఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు పిల్లలకు పూర్తిస్థాయి నిషేధం విధించే మార్గాన్ని కాకుండా.. బ్రిటన్ దశలవారీ నియంత్రణ విధానాన్ని ఎంచుకుంది. ఇప్పటికే చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనల దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు 16, 17 ఏళ్ల యువతపైనా రాత్రివేళ పరిమితులను తీసుకురావడం ద్వారా మధ్యస్థ మార్గాన్ని అనుసరిస్తోంది.స్క్రోలింగ్కు బ్రేక్.. నిద్రకు ప్రాధాన్యంబ్రిటన్ కొత్త నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా యాప్లలో అంతులేని స్క్రోలింగ్కు కారణమయ్యే ఫీచర్లను డిఫాల్ట్గా నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ఒక వీడియో తర్వాత మరో వీడియో ఆటోమేటిక్గా ప్లే అయ్యే విధానాన్ని నియంత్రించనున్నారు. దీంతో టీనేజర్లు రాత్రివేళల్లో ఎక్కువ సమయం ఫోన్లకు అతుక్కుపోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. "యువతకు అవసరమైన నిద్ర లభించేందుకు, చదువుపై దృష్టి పెట్టేందుకు, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి" అని బ్రిటన్ టెక్నాలజీ మంత్రి లిజ్ కెండల్ తెలిపారు.ఆస్ట్రేలియా అనుభవాలతో బ్రిటన్ జాగ్రత్తలుపిల్లల సోషల్ మీడియా వినియోగంపై కఠిన చర్యలు తీసుకున్న తొలి దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉండకుండా నిషేధం విధించే చట్టాన్ని అక్కడ తీసుకొచ్చారు. అయితే ఆ నిబంధనలను తప్పించుకునేందుకు కొందరు టీనేజర్లు కొత్త మార్గాలను అన్వేషించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. వయసు ధ్రువీకరణ వ్యవస్థలను దాటేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కూడా అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కేవలం పూర్తిస్థాయి నిషేధం కంటే.. వినియోగ అలవాట్లను నియంత్రించడం, ముఖ్యంగా రాత్రివేళల స్క్రీన్ టైమ్ను తగ్గించడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని బ్రిటన్ భావిస్తోంది.మానసిక ఆరోగ్యంపై ఆందోళనలుసోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించడం వల్ల యువతలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల్లో రాత్రివేళ సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం వల్ల నిద్ర, దృష్టి కేంద్రీకరణ, మానసిక ఆరోగ్యంలో మెరుగుదల కనిపించినట్లు తేలింది.2027 నుంచి అమలు?బ్రిటన్ ప్రతిపాదించిన సోషల్ మీడియా నియంత్రణ(పూర్తిస్థాయి) నిబంధనలను ఈ ఏడాది చివరి నాటికి పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారు. 2027 వసంతకాలం నుంచి వీటిని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల అమలును కఠినంగా పర్యవేక్షిస్తామని కూడా స్పష్టం చేసింది.ప్రపంచవ్యాప్తంగా పిల్లల సోషల్ మీడియా వినియోగంపై చర్చ జరుగుతున్న వేళ.. ఆస్ట్రేలియా పూర్తిస్థాయి నిషేధం వైపు వెళ్తుంటే.. బ్రిటన్ మాత్రం నియంత్రణల మార్గాన్ని ఎంచుకుంది. రాబోయే రోజుల్లో యువతను సోషల్ మీడియా ప్రభావం నుంచి రక్షించేందుకు మరిన్ని దేశాలు ఎలాంటి విధానాలు అవలంబిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. -
హర్ముజ్లో మళ్లీ అమెరికా బ్లాకేడ్.. ఇరాన్ సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధ మంటలు మరోసారి ఎగిసిపడే పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా నాలుగో రోజూ అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. మధ్యవర్తుల ప్రయత్నాలతో ఉద్రిక్తతలు తగ్గి.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని అంతా భావించిన వేళ.. పరిణామాలు మళ్లీ మారిపోయాయి. పరస్పర ఆరోపణలు, కవ్వింపు చర్యలతో శాంతి ఒప్పందం ప్రశ్నార్థకంగా మారింది. హర్ముజ్ జలసంధిపై అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం ఒప్పందాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఇరాన్ ఆరోపించింది. దీంతో ఆ అవగాహన ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేసింది.గత నెలలో స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం.. ఘర్షణలను నిలిపివేసి, రెండు నెలల కాలపరిమితిలో శాంతి ఒప్పందం దిశగా ముందుకు సాగాల్సి ఉంది. ఇందులో కీలకమైన అణు అంశంపై ఒప్పందం కూడా భాగంగా ఉంది. అయితే అమెరికా పదేపదే ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా మళ్లీ నౌకాదళ దిగ్బంధాన్ని అమలు చేయడం.. ఈ ఒప్పందాన్ని పూర్తిగా దెబ్బతీసిందని టెహ్రాన్ మండిపడుతోంది.హర్ముజ్పై మళ్లీ ఆధిపత్య పోరుప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి ఘర్షణ కేంద్రంగా మారింది. ఇరాన్కు చెందిన నౌకలు ఈ మార్గంలో ప్రయాణించే విషయంలో అమెరికా ఆంక్షలు విధించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ మరోసారి దాడులకు దిగిందని సమాచారం. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై కూడా ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురు, సహజ వాయువులో భారీ వాటా హర్ముజ్ మార్గం గుండా సాగుతుంది. అందుకే ఈ ప్రాంతంలో ఏర్పడే ఏ సంక్షోభమైనా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది."హర్ముజ్పై పూర్తి ఆధిపత్యం మాదే"ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. "ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా హర్ముజ్పై మా సార్వభౌమ హక్కును కాపాడుకుంటాం" అని ఆయన పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. సాధారణ పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధి నిర్వహణలో ఇరాన్తో పాటు ఒమన్కూ పాత్ర ఉంటుంది. అయితే జాతీయ భద్రత దృష్ట్యా ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో మొత్తం మార్గంపై నియంత్రణ అవసరమని ఇరాన్ వాదిస్తోంది.చర్చలకు నో చెప్పిన ఇరాన్అమెరికాతో మళ్లీ చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమపై ఒత్తిడి పెంచే చర్యలను కొనసాగిస్తే.. తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతుండగా.. తాజాగా ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్ ప్రకటన చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.హర్ముజ్పై బ్లాకేడ్.. మళ్లీహర్ముజ్ జలసంధి పరిణామాల్లో అమెరికా బ్లాకేడ్ కీలక అంశంగా మారింది. ఇరాన్పై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా అమెరికా తొలిసారి ఏప్రిల్ 13న ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే, అక్కడి నుంచి బయటకు వచ్చే నౌకలపై నౌకాదళ దిగ్బంధాన్ని ప్రారంభించింది. ఈ చర్యతో గల్ఫ్ ప్రాంతంలో నౌకాయాన ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి అవగాహన (MoU) కుదిరిన తర్వాత పరిస్థితులు కొంత చల్లబడ్డాయి. ఆ ఒప్పందంలో భాగంగా అమెరికా జూన్ 18న బ్లాకేడ్ను ఎత్తివేసింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని, తదుపరి చర్చలకు మార్గం సుగమం అవుతుందని భావించారు. కానీ తాజాగా మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా జూలై 14 నుంచి ఇరాన్ నౌకాశ్రయాలపై నౌకాదళ దిగ్బంధాన్ని పునరుద్ధరించింది. ఇరాన్ మాత్రం ఈ చర్యను ఒప్పంద ఉల్లంఘనగా అభివర్ణిస్తూ.. శాంతి ఒప్పందాన్ని అమెరికానే నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తోంది.ప్రపంచానికి కొత్త ఆందోళనహర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే.. దాని ప్రభావం అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణకే పరిమితం కాకపోవచ్చు. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన ఈ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడితే.. అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడిచమురు, సహజ వాయువులో భారీ వాటా హర్ముజ్ మార్గం గుండా సాగుతుంది. ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా సరఫరా వ్యవస్థ దెబ్బతిని.. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరల నుంచి.. రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరల వరకు కనిపించే అవకాశం ఉంటుంది.ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. హర్ముజ్లో సంక్షోభం మరింత ముదిరితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. అందుకే హర్ముజ్ జలసంధిపై అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం రెండు దేశాల సమస్యగా కాకుండా.. ప్రపంచ ఇంధన భద్రతకు, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి కొత్త సవాలుగా మారాయి. -
మాస్కోతో దోస్తీ.. భారత్పైనా ట్రంప్ గురి!
రష్యా నుంచి ముడిచమురు దిగుమతుల విషయంలో భారత్కు అమెరికా మరోసారి గట్టి హెచ్చరికలు పంపుతోంది. ఇప్పటివరకు కొన్ని వెసులుబాట్లతో కొనసాగిన పరిస్థితులకు తెరదించేలా.. రష్యా ఇంధన రంగంతో వ్యాపారాలు కొనసాగించే దేశాలపై భారీ సుంకాలు విధించే ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే మిత్రదేశం భారత్కు షాక్ ఇస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానికి పూర్తి మద్దతు తెలిపినట్లు వైట్హౌస్ వెల్లడించింది.రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే ఓ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించినట్లు వైట్హౌస్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ అధికారికంగా ధృవీకరించింది. ‘సాంక్షనింగ్ రష్యా యాక్ట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. రష్యా ఇంధన రంగంతో సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి భారీ సుంకాలు విధించే అధికారం లభిస్తుంది. ఈ బిల్లులో భాగంగా దిగుమతులపై గరిష్ఠంగా 500 శాతం వరకు టారిఫ్లు విధించే అవకాశం ఉంది. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.టార్గెట్లో భారత్, చైనాఈ బిల్లును ముందుకు తీసుకెళ్లిన రిపబ్లికన్ నేత లిండ్సే గ్రాహమ్ గతంలోనే భారత్, చైనాలను ప్రధానంగా ప్రస్తావించారు. రష్యా చమురు, గ్యాస్ ఆదాయాలకు ఈ రెండు దేశాలే కీలక ఆధారాలని ఆయన వాదించారు. భారత్, చైనా కలిసి రష్యా ఇంధన ఎగుమతుల్లో భారీ వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంటూ.. ఈ డిమాండ్ను తగ్గించడం ద్వారా మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుకు బలమైన మద్దతుదారుగా ఉన్న గ్రాహమ్.. ఇటీవల ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన అనంతరం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని పలువురు సెనేటర్లు భావిస్తున్నారు.భారత్కు ఎందుకు ఆందోళన?ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న ముడిచమురు భారత్కు కీలకంగా మారింది. దేశ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకునే రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నామని భారత్ స్పష్టం చేస్తోంది. అయితే అమెరికా కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే.. భారత్ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫార్మా, టెక్స్టైల్స్, ఐటీ సేవలు రంగాలు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని అంచనా. 500 శాతం టారిఫ్లు అమలైతే భారత ఆర్థిక వృద్ధి దాదాపు 0.5 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.ఒకవైపు ముప్పు.. మరోవైపు వాణిజ్య అవకాశంరష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలోనే.. భారత్ మరో కీలక వాణిజ్య ఒప్పందంతో ముందుకు వెళ్తోంది. భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. దీనితో భారత ఎగుమతిదారులకు బ్రిటన్ మార్కెట్లో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. అంటే ఒకవైపు రష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి.. మరోవైపు కొత్త వాణిజ్య భాగస్వామ్యాలతో అవకాశాలు.. ప్రస్తుతం భారత్ దౌత్య, ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది.చమురు కోసం స్నేహమా? ఆర్థిక భద్రతా?భారత్ మాత్రం తన వైఖరిలో మార్పు లేదని మొదటి నుంచి చెబుతోంది. ఇంధన దిగుమతులు దేశ ఆర్థిక అవసరాల ఆధారంగా జరుగుతున్నాయని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని వివరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు సెనేటర్లు రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఇది అవసరమని చెబుతుండగా.. మరికొందరు భారత్, చైనా వంటి దేశాలపై భారీ సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.ఇక ముందు ఏం జరుగుతుంది?ట్రంప్ మద్దతుతో ఈ బిల్లుకు మరింత ఊపు వచ్చినప్పటికీ.. ఇది చట్టంగా మారాలంటే కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే.. రష్యాతో భారత్ ఇంధన సంబంధాలు మాత్రమే కాదు.. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోళ్లు.. ఇప్పుడు భారత్కు ఆర్థిక లాభమా? లేక అమెరికా టారిఫ్ల రూపంలో కొత్త సవాలా? అన్నది అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక చర్చగా మారింది. -
హఫ్తా వివాదం.. యుద్ధ భారం ప్రపంచ దేశాలపైనా?
ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయగా భావించే హర్ముజ్ మరోసారి అంతర్జాతీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీసింది. జలసంధి మార్గంలో ప్రయాణించే నౌకల సరకు విలువపై 20 శాతం వరకు ఫీజు వసూలు చేయాలని ఆయన సూచించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.‘‘ఈ అత్యంత సున్నితమైన ప్రాంతానికి అమెరికా భద్రత కల్పిస్తోంది. అందుకు తగిన పరిహారం చెల్లించాలి’’ అన్నది ట్రంప్ వాదన. అయితే.. అంతర్జాతీయ జలమార్గంపై రుసుము విధించే ఆలోచనను పలువురు నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భద్రత పేరుతో తప్పనిసరి వసూలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.ఫీజు అందుకేనట!పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజూ భారీగా చమురు, గ్యాస్ రవాణా ఈ మార్గం గుండా సాగుతుంది. అమెరికా దశాబ్దాలుగా గల్ఫ్ ప్రాంతంలో నౌకాదళాన్ని మోహరించి భద్రత కల్పిస్తున్నామని చెబుతోంది. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంత రక్షణ కోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. ఇకపై అందుకు పరిహారం రావాలి’’ అని పేర్కొన్నారు. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు ఈ ఖర్చును భరించాలని ఆయన సూచించారు. విమర్శలకు స్పందనట్రంప్ ప్రతిపాదనపై విమర్శకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. భద్రత కల్పిస్తామని చెప్పి దానికి ప్రతిగా డబ్బు వసూలు చేయడం ‘ప్రొటెక్షన్ మనీ’ /‘హఫ్తా’ తరహాలో ఉందని ఆరోపిస్తున్నారు. (బెదిరించి లేదంటే ఒత్తిడి చేసి క్రమం తప్పకుండా వసూలు చేసే డబ్బును కూడా హప్తా అంటారు). అయితే అమెరికా మాత్రం ఈ విమర్శలను ఖండిస్తోంది. ఇది ఎలాంటి బలవంతపు వసూలు కాదని.. ప్రపంచ వాణిజ్య మార్గాన్ని రక్షించేందుకు చేస్తున్న ఖర్చుకు పరిహారం మాత్రమేనని చెబుతోంది.అంతర్జాతీయ చట్టాలపై ప్రశ్నలుహర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన మార్గం. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఇక్కడ నౌకలకు స్వేచ్ఛా రవాణా హక్కు ఉంటుంది. ఇలాంటి మార్గంలో ప్రయాణానికి తప్పనిసరి టోల్ లేదంటే ఫీజు విధించే హక్కు ఎవరికీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సముద్ర రవాణా సంస్థ కూడా ఇలాంటి రుసుములకు చట్టపరమైన ఆధారం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఇరాన్కు కలిసొచ్చే అంశమా?ట్రంప్ ప్రతిపాదన మరోవైపు ఇరాన్కు కొత్త వాదనను అందించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఇరాన్ కూడా హర్ముజ్పై తన ప్రభావాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేసింది. నౌకల భద్రత పేరుతో రుసుములు వసూలు చేసే ఆలోచనలను ఆ దేశ వర్గాలు ప్రస్తావించాయి. ఇప్పుడు అమెరికానే ఫీజు ప్రతిపాదించడం వల్ల.. ‘‘అమెరికాకు అవకాశం ఉంటే మాకు ఎందుకు ఉండకూడదు?’’ అనే వాదనను ఇరాన్ ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ‘‘20 శాతం ఎక్కువే.. మేము న్యాయంగా వ్యవహరిస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారు.యుద్ధం చేసింది ఎవరు.. బిల్లు చెల్లించేది ఎవరు?విమర్శకుల వాదన ప్రకారం.. ‘‘సంక్షోభాన్ని సృష్టించి.. దాని భద్రత ఖర్చును ప్రపంచానికి అప్పగించే ప్రయత్నమా?’’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రతిపాదనపై ప్రధాన విమర్శ ఇదే. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల కారణంగా ఇప్పటికే చమురు మార్కెట్లు అస్థిరంగా మారాయి. ఇంధన ధరలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడింది. ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొనే ఖర్చును అంతర్జాతీయ రవాణాపై మోపడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఆధిపత్య పోరు ముదురుతుందా?ట్రంప్ ప్రతిపాదన అసలు ఆచరణలోకి వస్తుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ ప్రకటనతో హజ్ మరోసారి అమెరికా-ఇరాన్ ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. పంచ చమురు సరఫరాకు కీలకమైన ఈ జలమార్గం.. ఇకపై కేవలం వాణిజ్య మార్గంగానే కాకుండా, రాజకీయ ఒత్తిళ్లు, సైనిక ఆధిపత్యం, ఆర్థిక పోరాటాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. -
అమెరికా బాంబులకూ అందని ఇరాన్ రహస్యం!
భూమి లోపల వందల అడుగుల లోతు.. చుట్టూ పర్వతాల రక్షణ.. అత్యాధునిక ఆయుధాలు కూడా సులభంగా చేరుకోలేని నిర్మాణం.. ఇది ఏదో సాధారణ సైనిక స్థావరం కాదు. ఇరాన్లోని ఓ రహస్య భూగర్భ కేంద్రం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ‘పికాక్స్ మౌంటెన్’. ఇరాన్ అణు కార్యక్రమానికి కీలక కేంద్రంగా మారిందన్న అనుమానాలతో పాటు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలతో ఈ రహస్య స్థావరం మరోసారి చర్చకు వచ్చింది.‘‘పికాక్స్ మౌంటెన్ (Pickaxe Mountain)ను కూడా ధ్వంసం చేస్తాం.. ఇరాన్ సిద్ధంగా ఉండాలి’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఈ రహస్య భూగర్భ కేంద్రంపైకి మళ్లించింది. ఇప్పటికే ఇరాన్లోని కీలక అణు స్థావరాలపై దాడులు చేసిన అమెరికా.. తదుపరి లక్ష్యంగా ఈ పర్వతాన్ని ఎంచుకుందా? అనే చర్చ మొదలైంది. అసలు పికాక్స్ మౌంటెన్లో ఏముంది? ఎందుకు అమెరికా దీనిపై ఇంత ప్రత్యేక దృష్టి పెట్టింది? అణు కార్యక్రమానికి ఇది ఎంత కీలకం? అన్న ప్రశ్నలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి.జాగ్రోస్ పర్వతాల్లో దాగిన ‘భూగర్భ కోట’ఇరాన్లోని జాగ్రోస్ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ కేంద్రం.. స్థానికంగా కుహ్-ఎ కొలాంగ్ గాజ్ లా (Kuh-e Kolang Gaz La) పేరుతో కూడా గుర్తింపు పొందింది. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైన నాటాంజ్(Natanz) అణుశుద్ధి కేంద్రం నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. నాటాంజ్ కేంద్రం గతంలో దాడులకు గురైనప్పటికీ.. పికాక్స్ మౌంటెన్ మాత్రం భిన్నమైన నిర్మాణంతో తయారవుతోంది. పర్వతాన్ని తొలిచి దాని లోపల భారీ సొరంగాలు, భూగర్భ గదులు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఇదే అమెరికా వ్యూహకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఓ భవనం కాదు.. పర్వతాన్ని సహజ కవచంగా మార్చుకున్న భారీ రక్షణ వ్యవస్థ.బంకర్ బస్టర్ బాంబులకూ సవాల్పికాక్స్ మౌంటెన్పై ప్రపంచ దేశాల దృష్టి పడటానికి ప్రధాన కారణం దీని లోతు. నిపుణుల అంచనా ప్రకారం ఈ భూగర్భ సముదాయంలోని కొన్ని ప్రాంతాలు భూమి లోపల 260 నుంచి 330 అడుగుల లోతులో ఉండొచ్చని తెలుస్తోంది. అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ ఆయుధాలు కూడా పరిమిత స్థాయిలో మాత్రమే చొచ్చుకుపోగలవు. సాధారణంగా ఇవి వందల అడుగుల మట్టి, రాళ్ల పొరలను లేదంటే బలమైన కాంక్రీట్ నిర్మాణాలను ఛేదించగలిగినా.. ఇంత లోతులో ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేయడం సవాల్గా మారుతుంది. అందుకే పికాక్స్ మౌంటెన్.. అమెరికా సైనిక వ్యూహాలకు ఓ పెద్ద పరీక్షగా మారింది.అసలు అక్కడ ఏం జరుగుతోంది?ఈ రహస్య స్థావరం నిర్మాణం 2020 ప్రాంతంలో ప్రారంభమైంది. నాటాంజ్లో జరిగిన విధ్వంసం తర్వాత కొత్త సెంట్రిఫ్యూజ్ అసెంబ్లీ కేంద్రం నిర్మిస్తున్నామని ఇరాన్ అప్పట్లో వెల్లడించింది. అయితే నిర్మాణ స్థాయి, భద్రతా ఏర్పాట్లు మాత్రం అనేక అనుమానాలకు దారితీశాయి. కొందరు అణు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం పరికరాల తయారీ కేంద్రం మాత్రమే కాకుండా, రహస్య యురేనియం శుద్ధి కేంద్రంగా లేదంటే కీలక అణు పదార్థాల నిల్వ ప్రాంతంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇలాంటి రహస్య భూగర్భ కేంద్రాల్లో భద్రపరిచి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఐఏఈఏకు అందని రహస్యంపికాక్స్ మౌంటెన్ ఇప్పటివరకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) తనిఖీలకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలపై మరింత ఆసక్తి, అనుమానాలు పెరిగాయి. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో.. గత దాడుల తర్వాత కూడా అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు గుర్తించారు. కొత్త భద్రతా గోడలు, బలపరిచిన ప్రవేశ మార్గాలు, తవ్వకాల ఆనవాళ్లు కనిపించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో జరిగే దాడులను ఎదుర్కొనేలా ఇరాన్ ఈ కేంద్రాన్ని మరింత బలోపేతం చేస్తోందన్న అభిప్రాయాలకు కారణమైంది.ట్రంప్ హెచ్చరికలతో పెరిగిన ఉత్కంఠగతంలో ఇరాన్ అణు కేంద్రాలపై దాడుల తర్వాత.. ఆ దేశ అణు కార్యక్రమాన్ని దెబ్బతీశామని అమెరికా ప్రకటించింది. అయినప్పటికీ పికాక్స్ మౌంటెన్ మాత్రం ఇంకా అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఈ భూగర్భ స్థావరం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అమెరికా నిజంగానే ఈ కేంద్రంపై దాడికి దిగుతుందా? లేదంటే ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు మాత్రమే ఈ హెచ్చరికలు చేస్తున్నదా? అన్నది ఆసక్తికరంగా మారింది. పర్వతం లోపల దాగిన ఈ రహస్యం.. రాబోయే రోజుల్లో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పగ తీర్చుకుందా?.. అదే ఏనుగు.. అదే కుటుంబం!
ఓ కుటుంబం ప్రాణభయంతో ఊరు విడిచింది.. ఇక ఆ ప్రమాదం తమ దరిచేరదని భావించింది. కానీ కాలం గడిచినా ఆ విషాద జ్ఞాపకం వారిని వెంటాడుతూనే వచ్చింది. ఏకంగా 14 ఏళ్ల తర్వాత అదే ఏనుగు మళ్లీ వారి జీవితాల్లోకి వచ్చి పెను విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను బలిగొన్న ‘ధుర్బే’ అనే అడవి ఏనుగు ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.నేపాల్లోని చిత్వన్ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటన.. మనిషి–వన్యప్రాణి ఘర్షణ ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి చూపించింది. ఏళ్ల క్రితం జరిగిన విషాదం నుంచి బయటపడేందుకు ఊరు మార్చుకున్న ఓ కుటుంబాన్ని.. అదే ఏనుగు మళ్లీ వెతుక్కుంటూ వచ్చినట్లు కనిపించడం స్థానికులను సైతం విస్మయానికి గురిచేసింది.2012లో మొదలైన విషాదం..షానిచర బోటే కుటుంబానికి ఈ విషాద ప్రయాణం 2012లో మొదలైంది. చిత్వన్ నేషనల్ పార్క్ సమీపంలోని మడి ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో.. ‘ధుర్బే’ అనే అడవి ఏనుగు దాడి చేసింది. ఆ ఘటనలో షానిచర తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు.కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయిన షానిచర.. ఇక అక్కడ జీవించడం ప్రమాదకరమని భావించారు. కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 9 మైళ్ల దూరంలోని జగత్పూర్కు వలస వెళ్లారు. మధ్యలో రాప్తి నది కూడా ఉండటంతో.. ఇక ఆ ఏనుగు తమను చేరుకోలేదని భావించారు. అయితే విధి మరోలా రాసింది. 14 ఏళ్ల తర్వాత.. మళ్లీ అదే ఏనుగుఇటీవల జగత్పూర్లోని షానిచర కుటుంబం నివసిస్తున్న ప్రాంతానికి ధుర్బే ఏనుగు చేరుకుంది. ఇంట్లోకి చొరబడిన ఆ ఏనుగు దాడిలో షానిచర కోడలు అశికా బోటే (25), నాలుగేళ్ల మనవడు భారత్ బోటే మృతి చెందారు. “పెద్ద నదులు దాటి వెళ్లినా మేము సురక్షితంగా ఉంటామని అనుకున్నాం. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా అదే ఏనుగు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మా ఇంటిపై దాడి చేసి నా కోడలు, చిన్న మనవడిని తీసుకెళ్లిపోయింది. ఇక మాకు పారిపోవడానికి చోటు లేదు” అని షానిచర బోటే ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనతో ధుర్బే ఏనుగు కారణంగా ఒకే కుటుంబంలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. 2012లో షానిచర తల్లిదండ్రులను బలిగొన్న ఇదే ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత ఆయన కోడలు, మనవడిని కూడా పొట్టన పెట్టుకుంది.‘పగ’ కాదు.. కానీ వెంటాడిన విషాదం!ఏనుగులు మనుషుల్లా పగ తీర్చుకుంటాయని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే ఒకే కుటుంబాన్ని 14 ఏళ్ల వ్యవధిలో రెండుసార్లు విషాదంలోకి నెట్టిన ధుర్బే ఘటన మాత్రం అందరినీ కలచివేస్తోంది. ఒకప్పుడు తమ నుంచి దూరంగా వెళ్లిపోయిన కుటుంబం వద్దకే మళ్లీ అదే ఏనుగు చేరుకోవడం.. స్థానికుల్లో.. ఇది పగేనా?, అసలు ఎందుకు పగ బట్టింది?? అనే ప్రశ్నలను రేకెత్తిస్తోంది.25 మంది ప్రాణాలు తీసిన ధుర్బేధుర్బే నేపాల్లోని అత్యంత ప్రమాదకరమైన అడవి ఏనుగుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. చిత్వన్ నేషనల్ పార్క్ అధికారుల ప్రకారం.. 2010 నుంచి ఇప్పటివరకు ఈ ఏనుగు దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏనుగు కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు పలుమార్లు ట్రాకింగ్ కాలర్లు అమర్చారు. 2016లో తొలిసారి కాలర్ అమర్చగా.. అది పనిచేయకపోవడంతో 2020లో మరోసారి, 2023లో మళ్లీ కొత్త కాలర్ను అమర్చారు. అయినప్పటికీ ధుర్బే కదలికలను పూర్తిగా నియంత్రించడం సవాల్గా మారింది.పెరుగుతున్న మనిషి–ఏనుగు ఘర్షణఅడవుల విస్తీర్ణం తగ్గడం, మానవ నివాసాలు అటవీ ప్రాంతాలకు చేరువ కావడంతో మనిషి–వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. ఆహారం, నీటి కోసం అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం.. ప్రజలు భయంతో జీవించాల్సి రావడం ఇలాంటి విషాదాలకు కారణమవుతోంది. 14 ఏళ్ల పాటు తప్పించుకున్నామని భావించిన ఓ కుటుంబాన్ని.. అదే ఏనుగు మళ్లీ విషాదంలోకి నెట్టిన ఘటన ఇప్పుడు నేపాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. -
మొజ్తబా పని అయిపోయినట్లే!.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇరాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్న ట్రంప్.. మొజ్తబా పరిస్థితి కూడా ఏమీ బాగోలేదని, ఆయన పని అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. "వారికి నౌకాదళం లేదు.. వైమానిక దళం లేదు.. గగనతల రక్షణ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. వారి కీలక నాయకులంతా హతమయ్యారు" అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఖమేనీ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ.. మేం జరిపిన దాడుల్లో అయతొల్లా ఖమేనీ చనిపోయారు. ఆ తర్వాత సుప్రీం లీడర్ అంటూ ఆయన వారసుడు మొజ్తబా ఖమేనీ వచ్చారు. ఆయన పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆయన 90 శాతం దెబ్బతిన్నారు. ఆయన పని కూడా దాదాపు అయిపోయినట్లే అని అన్నారు. అయితే మొజ్తబా పరిస్థితిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలను అమెరికా విడుదల చేయలేదు. ఇరాన్ కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు.తండ్రి మరణం తర్వాత తెరపైకి.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పేరు ఒక్కసారిగా అంతర్జాతీయ చర్చల్లోకి వచ్చింది. ఇరాన్ రాజకీయ వ్యవస్థపై ప్రభావం ఉన్న వ్యక్తిగా మొజ్తబాను పరిగణిస్తుంటారు. అయతొల్లా మరణం తర్వాత సుప్రీం ఎవరు? అనే సమయంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. అయితే.. గతంలో ఆయనపై ఉన్న విమర్శలు, వివాదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఆ గౌరవం దక్కడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే మత పెద్దలు, ఐఆర్జీసీ మాత్రం ఆయన వైపే మొగ్గు చూపించింది. అయితే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొజ్తబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అయతొల్లా ఖమేనీ కుటుంబ సభ్యులు కొందరు మరణించారు. అయితే ఆ దాడిలో కొడుకు మొజ్తాబా మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారనే ప్రచారం ప్రచారం మాత్రం జోరుగా సాగింది. ముఖ్యంగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు కూడా మొజ్తబా హాజరు కాలేదు. టెహ్రాన్లో జరిగిన అంత్యక్రియల ప్రార్థనల్లో ఆయన సోదరులు మాత్రమే పాల్గొన్నారు. దేశ అత్యున్నత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఇప్పటిదాకా కనిపించకపోవడం తీవ్ర చర్చకు కారణమైంది.త్వరలో ప్రజల ముందుకు వస్తారా?ఇటీవల మొజ్తబా ఖమేనీ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారనే ప్రచారం జరుగుతోంది. తన తండ్రి జ్ఞాపకార్థం నిర్వహించే భారీ స్మారక సభలో ఆయన పాల్గొనే అవకాశం ఉందని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సభలో ఆయన ప్రత్యక్షమైతే.. సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి బహిరంగ కార్యక్రమం కానుంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి, నాయకత్వ సామర్థ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని భావించారు.‘తండ్రి మరణానికి ప్రతీకారం’ అంటూ ప్రకటనలుఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గాయపడిన మొజ్తబా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. సందేశాలు ఏమున్నా సరే.. అత్యంత గోప్యంగా ఆయనకు చేరవేస్తూ వస్తున్నారు. అలాగే ఆయన నుంచి బదులు కూడా అలాగే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తప్పదంటూ మొజ్తబా కూడా ప్రకటన ఇచ్చినట్లు ఇరాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు నిజంగానే వస్తారా?.. ట్రంప్ ప్రకటన ఉత్తదేనని తేలుస్తారా? అన్నది కీలకంగా మారింది.హర్ముజ్పై ట్రంప్ ప్రకటన.. భగ్గుమన్న ఇరాన్ఇదే సమయంలో ట్రంప్ హర్ముజ్ జలసంధిపై కూడా కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై సముద్ర దిగ్బంధనాన్ని తిరిగి అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. హర్ముజ్ గుండా ప్రయాణించే కార్గో నౌకల నుంచి 20 శాతం రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిపై ఇరాన్ భగ్గుమంది. హర్ముజ్ విషయంలో అమెరికా జోక్యం సహించబోమని.. తమ నౌకలపై ఆధిపత్యం ప్రదర్శిస్తే బలప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది. ఇటు అమెరికాకు సహకరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గల్ఫ్ దేశాలను సైతం వారించింది. -
రాహుల్, ఖర్గేకు ఓపెన్ లెటర్.. క్షమాపణ చెప్పాల్సిందే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 'మోదీ ఎయిర్వేస్' పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.నిర్వాహకుల్లో ఒకరైన అమిత్ కరంత్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్ క్రౌడ్' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.కాగా, మెల్బోర్న్లో జరిగిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింటా అలన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. -
హర్ముజ్ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి.. ఉద్రిక్తతలతో పాటు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల కేంద్రంగా మారింది. జలసంధి గుండా వెళ్లే ప్రతి కార్గో నౌకపై 20 శాతం టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నౌకల భద్రత కోసం తాము ఎంతో చేస్తున్నామని.. భారత్ సహా పలు దేశాలు ఈ రుసుము చెల్లించాల్సిందేనని అంటున్నారాయన. దానికి ఇరాన్ కాస్త ఘాటుగానే బదులిచ్చింది.ట్రూత్ సోషల్లో ట్రంప్ చేసిన పోస్టులో.. ఇకపై అమెరికా "ది గార్డియన్ ఆఫ్ ది హర్ముజ్ స్ట్రైట్"గా వ్యవహరిస్తుందని ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య నౌకలకు భద్రత కల్పించేందుకు అమెరికా భారీ ఖర్చు చేస్తున్నందున, ఆ ఖర్చుకు ప్రతిఫలంగా హర్ముజ్ (Strait of Hormuz) గుండా వెళ్లే ప్రతి కార్గోపై 20 శాతం రుసుము వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనికి విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ.. "హర్ముజ్కు నిజమైన సంరక్షకులు ఇరానేనని అన్నారు. అంతేకాదు 20 శాతం రుసుము చాలా ఎక్కువ.. మేమైతే న్యాయమైన రుసుమే వసూలు చేస్తాం" అంటూ వ్యంగ్యంగా స్పందించారు.ఇరాన్ ఘాటు కౌంటర్ట్రంప్ వ్యాఖ్యలపై ఎక్స్ (X) వేదికగా స్పందించిన అరాగ్చీ.. "వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కల్పించే వారికి పారితోషికం ఇవ్వాలన్న ట్రంప్ మాట సరైనదే. కానీ హర్ముజ్కు ఎప్పటినుంచో నిజమైన గార్డియన్ ఇరానే. ఇకముందూ అలాగే ఉంటుంది" అన్నారు. అయితే ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్పై సెటైర్ వేస్తూ.. "20 శాతం చాలా ఎక్కువ. మేమైతే న్యాయంగా వ్యవహరిస్తాం" అని వ్యాఖ్యానించారు. దీంతో హర్ముజ్పై అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.POTUS is absolutely right. Whoever provides secure and safe passage of commercial vessels through the Strait of Hormuz should be compensated for this service. Iran has always been the GUARDIAN of the Strait and will remain so FOREVER.20% is of course too much. We will be fair— Seyed Abbas Araghchi (@araghchi) July 13, 2026మరోసారి అమెరికా బ్లాకేడ్ఇదే సమయంలో ఇరాన్పై అమెరికా మరోసారి సముద్ర దిగ్బంధనాన్ని (Maritime Blockade) అమలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. జూలై 14 సాయంత్రం 4 గంటల (ET) నుంచి ఇరాన్ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై దిగ్బంధన చర్యలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ఇరాన్ పోర్టులకు వెళ్తున్న లేదా అక్కడి నుంచి వస్తున్న నౌకలను అమెరికా దళాలు తనిఖీ చేస్తాయని, గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్ముజ్ పరిసరాల్లో ప్రయాణించే నౌకలు అమెరికా నౌకాదళంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించింది.పాత ఒప్పందం ముగిసిందా?గతంలో ఏప్రిల్ 13 నుంచి జూన్ 18 వరకు అమెరికా ఇదే తరహా దిగ్బంధనం అమలు చేసింది. అనంతరం అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంతో దానిని ఎత్తివేశారు. అయితే ఇటీవల ఆ ఒప్పందం ఇక అమల్లో లేదని ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది.ఇరాన్ మాత్రం గత నెల కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం హర్ముజ్లో రవాణాను నియంత్రించే హక్కు తమకే ఉందని, అవసరమైతే టోల్ కూడా వసూలు చేసే అధికారం ఉందని చెబుతోంది. దీనిని అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ప్రపంచ నౌకలకు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉందని వాషింగ్టన్ వాదిస్తోంది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురు, ద్రవీభవించిన సహజ వాయువు (LNG)లో దాదాపు 20 శాతం హోర్ముజ్ జలసంధి గుండా రవాణా అవుతుంది. అందువల్ల ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది.విశ్లేషకుల అంచనా ప్రకారం.. ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్ అమల్లోకి వస్తే, పూర్తిగా చమురుతో నిండిన ఒక సూపర్ ట్యాంకర్ దాదాపు 30 మిలియన్ డాలర్ల వరకు అదనపు రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఇప్పటివరకు ఇరాన్ వసూలు చేసినట్లు భావిస్తున్న రుసుము సుమారు 2 మిలియన్ డాలర్ల పరిధిలోనే ఉందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.ఇంధన వ్యయం భారీగా పెరగడంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో హర్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్ ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. -
భీకర దాడులకు దిగిన ఇరాన్.. గల్ఫ్లో మళ్లీ మంటలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా జరిపిన వరుస వైమానిక దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కౌంటర్ ఎటాక్కు దిగింది. డ్రోన్లు, క్షిపణులతో బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఖతార్, ఒమన్ ప్రాంతాల్లోని అమెరికా మద్దతు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) ప్రకారం.. బహ్రెయిన్లోని షేక్ ఇసా వైమానిక స్థావరంపై దాడి చేసింది. అక్కడి అమెరికా సైనిక కార్యకలాపాలకు సంబంధించిన డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, హెలికాప్టర్ నిర్వహణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా డ్రోన్ ఫ్లీట్లో కీలక భాగాన్ని ధ్వంసం చేసినట్లు టెహ్రాన్ ప్రకటించింది. అయితే ఈ దాడులకు సంబంధించి అమెరికా నుంచి ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ రాలేదు.ఆ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులుఅమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్, జోర్డాన్లలోనూ తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఇరాన్ తెలిపింది. కువైట్లోని అలీ అల్ సేలెం, అహ్మద్ అల్ జాబర్ సైనిక స్థావరాలు, జోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, అలాగే ఖతార్, ఒమన్లోని అమెరికా మద్దతు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ప్రకటించింది. జోర్డాన్ స్థావరంలోని ఇంధన నిల్వలు, ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే జోర్డాన్ మాత్రం.. ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది.గల్ఫ్ దేశాల్లో హైఅలర్ట్ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, యూఏఈ దేశాల్లో భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఖతార్లో ఇరాన్ దాడుల సమయంలో శకలాలు పడి ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కువైట్లోని ఓ చమురు డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్పై జరిగిన దాడిలో ఓ కార్మికుడు గాయపడినట్లు సమాచారం. ఒమన్లోనూ డ్రోన్ దాడుల నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.ఇరాన్ సైనిక సామర్థ్యాలే లక్ష్యం: అమెరికామరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM).. ఇరాన్పై చేపట్టిన తాజా దాడులను సమర్థించుకుంది. అంతర్జాతీయ నౌకా రవాణాకు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలు, చిన్న యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు అమెరికా తెలిపింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటమే తమ చర్యల ఉద్దేశమని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాజా పరిణామాలపై స్పందించారు. ‘‘మేము వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.హర్ముజ్ మూసివేశామన్న ఇరాన్తాజా ఘర్షణలకు ప్రధాన కారణంగా మారింది హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని మూసివేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. అయితే అమెరికా ఈ ప్రకటనను ఖండించింది. ‘‘హర్ముజ్ జలసంధిపై ఇరాన్కు నియంత్రణ లేదు. అంతర్జాతీయ నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయి’’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.షిప్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం.. జలసంధి మీదుగా నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. అయితే పూర్తిగా నిలిచిపోలేదని సమాచారం. కొన్ని చమురు ట్యాంకర్లు మాత్రం ఈ మార్గం గుండా ప్రయాణించినట్లు తెలుస్తోంది.నౌకలపై దాడులే అసలు కారణంహర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల నేపథ్యంలో అమెరికా ఇరాన్పై తాజా దాడులు ప్రారంభించింది. అమెరికా ఆరోపణ ప్రకారం.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ఓ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుంది. దీనికి ప్రతిగా అమెరికా దాడులు చేపట్టినట్లు తెలిపింది. అయితే ఇరాన్ మాత్రం.. అనుమతి లేకుండా ప్రయాణించిన ఓ నౌకపై హెచ్చరిక కాల్పులు మాత్రమే జరిపామని పేర్కొంది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.చమురు ధరలకు సెగహర్ముజ్ జలసంధిపై నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య దాడులు కొనసాగడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు నాలుగు శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ ధర సుమారు 79 డాలర్లకు చేరింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో రవాణా అంతరాయం ఏర్పడితే.. అంతర్జాతీయంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.మళ్లీ యుద్ధ భయాలుఅమెరికా-ఇరాన్ మధ్య గత నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందం భవిష్యత్తుపైనా తాజా పరిణామాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి సమస్యను పరిష్కరించి ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. పరస్పర దాడులతో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా దాడులు కొనసాగిస్తే.. పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హర్ముజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న ఈ పోరు.. ప్రపంచ ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. -
ట్రంప్ ‘ట్రంప్కార్డ్’ ఇక లేరు.. గ్రాహం మృతిపై అనుమానాల కలకలం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఉన్న సెనేటర్ లిండ్సే గ్రాహం (71) ఇక లేరు. ఆకస్మిక అనారోగ్యంతో ఆయన శనివారం కన్నుమూశారు. ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.గ్రాహం కార్యాలయం తొలుత దీనిని ‘‘ఆకస్మిక అనారోగ్యం’’గా పేర్కొంది. అయితే వైద్య పరీక్షల నివేదికలు వచ్చాక.. మరణంపై మరో ప్రకటన చేసింది. గుండెకు అనుసంధానమైన ప్రధాన ధమని ఏఓర్టాలో చీలిక (aortic dissection) కారణంగానే ఆయన కన్నుమూసినట్లు తెలిపింది. తన సన్నిహితుడు గ్రాహం మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత నమ్మకమైన మిత్రుల్లో ఒకరిని కోల్పోయానని పేర్కొన్నారు.‘‘లిండ్సే గ్రాహం గొప్ప వ్యక్తి, గొప్ప సెనేటర్. ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవారు. నిజమైన అమెరికన్ దేశభక్తుడు’’ అంటూ ట్రంప్ నివాళులర్పించారు. మరణానికి ముందు రోజు రాత్రి కూడా గ్రాహం తనతో మాట్లాడారని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ పర్యటన గురించి వివరించారని, సుదీర్ఘ ప్రయాణం కారణంగా అలసిపోయినట్లు చెప్పారని వెల్లడించారు.భారత్పై ద్వేషం.. అంతర్జాతీయ రాజకీయాల్లో గ్రాహం పేరు ఇటీవల భారత్ విషయంలో ఎక్కువగా వినిపించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదనకు ఆయన మద్దతు తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ సహా ఆ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. ‘‘రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఊతమిస్తే.. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది’’ అంటూ గతంలో గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్కు కీలక వారధిలిండ్సే గ్రాహం అమెరికా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా ప్రభావం చూపిన నేత. 2002లో సెనేట్కు ఎన్నికైన ఆయన.. రక్షణ, విదేశాంగ విధానాల్లో రిపబ్లికన్ పార్టీకి కీలక స్వరంగా ఎదిగారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో విమర్శకుడిగా ఉన్నప్పటికీ.. తర్వాత ఆయనకు అత్యంత సన్నిహిత మద్దతుదారుల్లో ఒకరిగా మారారు. ట్రంప్ ‘‘అమెరికా ఫస్ట్’’ విధానానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం కొనసాగాలని గ్రాహం బలంగా నమ్మేవారు.ట్రంప్ శిబిరానికి భారీ లోటులిండ్సే గ్రాహం మరణం ట్రంప్ రాజకీయ శిబిరానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. సెనేట్లో ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలిచే కీలక గొంతుకల్లో ఒకటి ఇప్పుడు లేకుండా పోయింది. ఉక్రెయిన్ పర్యటన తర్వాతే మృతి.. అనుమానాల కలకలంమరణానికి ముందు రోజు గ్రాహం ఉక్రెయిన్లో పర్యటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సమావేశమై.. రష్యాపై మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్కు మద్దతు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన మరణంపై కొన్ని MAGA వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా లేదంటే ఇరాన్ ప్రమేయం ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. మరికొందరు.. ఉక్రెయిన్ పర్యటన, రష్యాపై ఆంక్షల పిలుపు, గతంలో వచ్చిన బెదిరింపులను ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అధికారులు కూడా ఎలాంటి కుట్ర కోణాన్ని నిర్ధారించలేదు. గ్రాహం కుటుంబంలో గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉందని కూడా సమాచారం.ఇరాన్పై కఠిన వైఖరి.. ఇజ్రాయెల్కు మద్దతుగ్రాహం ఇరాన్ విషయంలో కూడా కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైనిక చర్యలకు కూడా ఆయన మద్దతు తెలిపారు. గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్కు ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనపై మధ్యప్రాచ్యంలో విమర్శలు కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. గ్రాహంను ‘‘ఇజ్రాయెల్కు గొప్ప మిత్రుడు’’గా అభివర్ణించారు.ఇక గ్రాహం స్థానంలో ఎవరు?గ్రాహం మృతితో దక్షిణ కరోలినా సెనేట్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతానికి ఆయన స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసే అధికారం రాష్ట్ర గవర్నర్ హెన్రీ మెక్మాస్టర్కు ఉంది. ఆయన తాత్కాలిక సెనేటర్ను నియమించనున్నారు. ఈ రేసులో నాన్సీ మేస్ (Nancy Mace)(దక్షిణ కరోలినా ప్రతినిధుల సభ సభ్యురాలు), రిపబ్లికన్ హౌస్ సభ్యుడు రస్సెల్ ఫ్రై (Russell Fry), లెఫ్టినెంట్ గవర్నర్పామెలా ఎవెట్ (Pamela Evette).. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇది తాత్కాలిక నియామకం మాత్రమే. గ్రాహం ఈ ఏడాది తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్నందున.. ప్రత్యేక రిపబ్లికన్ ప్రైమరీ నిర్వహించి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ సాధారణ ఎన్నికల్లో తుది పోటీ జరుగుతుంది. -
మళ్లీ ట్రిగ్గర్ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాపై మళ్లీ దట్టమైన యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. మధ్యవర్తి ఖతార్ చొరవతో కాల్పుల విరమణపై ఆశలు చిగురిస్తున్నాయనుకున్న సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దూకుడు ప్రదర్శించారు. హర్ముజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం సాయంత్రం నుంచి తాజా వైమానిక దాడులు ప్రారంభించింది. వాణిజ్య నౌకలు, పౌర నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చర్యలు కొనసాగిస్తోందని ఆరోపిస్తూ ఈ దాడులకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రకటించింది.ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య ప్రధాన యుద్ధరంగంగా మారింది. "వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యం" అని సెంట్కామ్(CENTCOM) ప్రకటించింది. మరోవైపు అమెరికా జోక్యం ఆగే వరకు హర్ముజ్లో రాకపోకలను అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. దీంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రబిందువైంది.ఓవైపు దాడులు, మరోవైపు..అమెరికా తాజా దాడులు హర్మొజ్ జలసంధికి సమీపంలోని హోర్మోజ్గాన్, ఖుజెస్టాన్, సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులపై కేంద్రీకృతమయ్యాయి. బందర్ అబ్బాస్, జాస్క్, సిరిక్, ఖెష్మ్ దీవి, చాబహార్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఖొండాబ్లోని హెవీ వాటర్ కేంద్రం సమీపంలోనూ దాడులు జరిగినట్లు సమాచారం.దీనికి ప్రతిగా హర్ముజ్ గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కాల్పులు జరిపిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన ఒక క్రూయిజ్ క్షిపణి, ఒక ఆత్మాహుతి డ్రోన్ను కూల్చివేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.నీటి పంపింగ్ కేంద్రంపై దాడి.. ఒకరు మృతిఖుజెస్టాన్ ప్రావిన్స్లోని మహ్షహర్ ప్రాంతంలో వ్యవసాయ నీటి పంపింగ్ స్టేషన్పై జరిగిన దాడిలో ఒక భద్రతా సిబ్బంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.ఐదో విడత దాడులుకాల్పుల విరమణ ప్రకటించి మూడు వారాలు కూడా గడవకముందే అమెరికా ఐదో విడత వైమానిక దాడులు చేపట్టింది. శనివారం ఒక్కరోజే ఇరాన్లో 140కి పైగా లక్ష్యాలపై దాడులు చేసిన అమెరికా.. తాజా దాడులతో మరింత ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, జోర్డాన్లోని అమెరికా ప్రయోజనాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.క్షీణించిన నౌకల రాకపోకలుయుద్ధ ప్రభావం సముద్ర రవాణాపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు సుమారు 130 నౌకలు హర్ముజ్ జలసంధిని దాటుతుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 22కు పడిపోయినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థల అంచనాలు చెబుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 79 డాలర్ల వద్దకు చేరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన పెరిగింది.భారత్కూ ప్రభావంఒమన్ తీరంలో దాడికి గురైన జీఎఫ్ఎస్ గెలాక్సీ GFS Galaxy కంటైనర్ నౌకలో చిక్కుకున్న భారతీయ నావికుల్లో 23 మందిని రక్షించినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. మరో నావికుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హర్ముజ్లో పరిస్థితులు మరింత దిగజారితే భారత చమురు దిగుమతులు, సముద్ర వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ముందు ఏం జరుగుతుంది?హర్ముజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో అమెరికా-ఇరాన్ ఎవరూ వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. ఒకవైపు అమెరికా వరుస వైమానిక దాడులతో ఒత్తిడి పెంచుతుంటే.. మరోవైపు ఇరాన్ సముద్ర మార్గాన్ని తన ఆధీనంలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిష్ఠంభన కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతపై మరింత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
రహస్య కదలికలు.. భూమిపై ఏలియన్స్ నిఘా?
భూమిపై గ్రహాంతరవాసులు (ఏలియన్స్) నిఘా పెట్టాయా? వారి అంతరిక్ష నౌకలే (యూఎఫ్వోలు) మన ఆకాశంలో సంచరిస్తున్నాయా?? దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న ఈ ప్రశ్నలకు మరోసారి ఊతమిచ్చేలా అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తాజాగా విడుదల చేసిన ఫైల్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. "నేను 28 ఏళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నా. కానీ, ఎన్నడూ ఇలాంటి వస్తువును నేను ఎప్పుడూ చూడలేదు’’ అని ఓ మాజీ సైనిక పైలట్ పేర్కొనడం, అణు ఆయుధ కేంద్రం వద్ద రహస్య వస్తువు సంచరించిన ఘటన, చైనా సమీపంలో తాజాగా నమోదైన వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మేరకు.. తాజాగా పెంటగాన్ మొత్తం 40 రికార్డులను బహిర్గతం చేసింది. వీటిలో 14 పత్రాలు, 19 వీడియోలు, నాలుగు ఆడియో ఫైల్స్, మూడు చిత్రాలు ఉన్నాయి. ఈ సమాచారం పెంటగాన్తో పాటు నాసా, సీఐఏ, ఎఫ్బీఐ, ఇంధన శాఖ వంటి కీలక అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించింది. విడుదలైన వీడియోల్లో పశ్చిమ పసిఫిక్, అట్లాంటిక్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో అమెరికా సైనిక కెమెరాలు రికార్డు చేసిన దృశ్యాలు ఉన్నాయి.The Creepiest UFO Video Ever Released By The White House 👽🛸🇺🇸What is that thing? Is it an ALIEN? 😱DOW-UAP-PR116, Unresolved UAP Report, Atlantic Ocean, 2020 pic.twitter.com/vOabmCyBb6— Interstellar (@InterstellarUAP) July 10, 2026ఈ ఫైల్స్లో అత్యంత ఆసక్తికరమైనది 2019లో నమోదైన ఒక ఘటన. అమెరికా తూర్పు ప్రాంతంలో శిక్షణ విమానయానం నిర్వహిస్తున్న ఓ సైనిక పైలట్, మరో నలుగురు సిబ్బంది తమ విమానం కిందుగా అత్యంత వేగంగా కదులుతున్న ఓ గుర్తుతెలియని వస్తువును గమనించారు. దాదాపు 10 నుంచి 15 సెకన్ల పాటు దానిని కెమెరాతో ట్రాక్ చేశారు. జూమ్ చేసి స్పష్టంగా చిత్రీకరించేలోపే ఆ వస్తువు క్షణాల్లో కెమెరా పరిధి దాటి అదృశ్యమైంది. తర్వాత వీడియోను పరిశీలించగా అది దీర్ఘచతురస్రాకారంలో (Rectangular) ఉన్నట్లు గుర్తించారు.దీనిపై సదరు పైలట్ తన నివేదికలో.. "ఎయిర్ఫోర్స్, నేవీలో 28 ఏళ్లుగా పనిచేస్తున్నా.. ఇలాంటి విమాన లక్షణాలున్న వస్తువును నేను ఎప్పుడూ చూడలేదు" అని పేర్కొనడం విశేషం.దెబ్బకు అణ్వాయుధ కేంద్రంలో లాక్డౌన్!మరో ఫైల్లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని పాంటెక్స్ అణు ఆయుధ కేంద్రం వద్ద 2015లో చోటుచేసుకున్న ఘటనను వెల్లడించారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది.. ఎలాంటి శబ్దం లేకుండా, ఇంజిన్కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకుండా గాల్లో కదులుతున్న ఓ గుర్తుతెలియని వస్తువును గుర్తించారు. దాంతో మొత్తం అణు కేంద్రాన్ని వెంటనే లాక్డౌన్ చేసి, బైనాక్యులర్లతో ఆ వస్తువును వెంబడించారు. అయితే అది ఏమిటో ఇప్పటికీ గుర్తించలేకపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.చైనా సమీపంలో తాజా కదలికలుఈసారి విడుదలైన ఫైల్స్లో అత్యంత తాజా సమాచారం 2025లో చైనా సమీప సముద్ర ప్రాంతాల్లో నమోదైన ఘటనలకు సంబంధించినది. అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్కు చెందిన సెన్సార్లు ఎల్లో సీ ప్రాంతంలో ఆరు కోణాల నక్షత్రం ఆకారంలో కనిపించిన ఓ విచిత్ర వస్తువును గుర్తించాయి. మరో వీడియోలో తూర్పు చైనా సముద్రం (ఈస్ట్ చైనా సీ) ప్రాంతంలో నిమిషాల పాటు కదులుతున్న మరో గుర్తుతెలియని వస్తువు రికార్డైంది.అలాగే 2023లో చిత్రీకరించిన మరో వీడియోలో.. ఓ రహస్య వస్తువు అమెరికా సైనిక విమానంలోని ఎలక్ట్రో-ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల పనితీరును ప్రభావితం చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఏలియన్స్ ఉన్నాయా?పెంటగాన్ విడుదల చేసిన ఫైల్స్లో.. ఈ వస్తువులు గ్రహాంతరవాసులకు చెందినవే అని ఎక్కడా నిర్ధారించలేదు. అదే సమయంలో అవి ఏమిటో కూడా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. అందుకే వీటిని అధికారికంగా యూఏపీ (Unidentified Anomalous Phenomena)గా పేర్కొంది.మిస్టరీ మరింత ముదిరిందిగత కొన్నేళ్లుగా అమెరికా ప్రభుత్వం యూఎఫ్వోలకు సంబంధించిన పలు రహస్య పత్రాలను దశలవారీగా బయటపెడుతోంది. అయితే తాజా ఫైల్స్లో మాజీ సైనిక పైలట్ వాంగ్మూలం, అణు ఆయుధ కేంద్రంలో గుర్తుతెలియని వస్తువు సంచారం, చైనా సమీపంలో నమోదైన తాజా వీడియోలు ఉండటంతో.. "భూమిపై నిజంగానే ఏలియన్స్ నిఘా ఉందా? లేదంటే మనకు ఇంకా తెలియని అత్యాధునిక సాంకేతికతేనా?" అన్న ప్రశ్నలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ రహస్యం మాత్రం ఇంకా వీడలేదు. -
ఇరాన్పైకి వెయ్యి క్షిపణులు.. నాన్స్టాప్గా ఏడాదిపాటు దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత ఎగసిపడేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్నారు. శాంతి చర్చలకు ఇరాన్ ఇప్పుడు దిగి వచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చన్న ఆయన.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే.. అమెరికా నుంచి వెయ్యి క్షిపణులు వెంటనే ఆ దేశంపై విరుచుకుపడతాయని హెచ్చరించారు. తొలి దాడితో ఆగకుండా.. అవసరమైతే ఏడాది పాటు ఇరాన్లోని కీలక ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేసేలా అమెరికా సైన్యానికి ముందుగానే ఆదేశాలు జారీ చేశానని వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "అమెరికా అధ్యక్షుడిని, ముఖ్యంగా నన్ను హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే.. వెయ్యి క్షిపణులు ఇప్పటికే లక్ష్యంగా సిద్ధంగా ఉన్నాయి. తొలి దాడి తర్వాత వేలాది క్షిపణులు వెంటనే ప్రయోగిస్తాం. అమెరికా సైన్యానికి అవసరమైన అన్ని ఆదేశాలు ఇప్పటికే ఇచ్చాం. ఒక సంవత్సరం పాటు అవసరమైతే ఇరాన్లోని ప్రతి కీలక ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది" అని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.బ్యాక్ టు బ్యాక్ వార్నింగులుట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా.. తనకు ఏదైనా జరిగితే ఇరాన్పై ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో బాంబుల వర్షం కురిపించాలని ముందుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. తనపై కొత్త హత్య కుట్రకు సంబంధించి ఇజ్రాయెల్ వద్ద ఎలాంటి తాజా సమాచారం లేదని, అయితే చాలా ఏళ్లుగా తానే ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి లక్ష్యంగా ఉన్నానని మరోసారి పునరుద్ఘాటించారు.సోలేమానీ హత్యతో మొదలైన వైరం2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్కు చెందిన అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్కు చెందిన పలువురు నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా గతంలో ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్కు అనుబంధంగా ఉన్న వ్యక్తులు కుట్రలు పన్నినట్లు వెల్లడించాయి. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. అయితే అయతొల్లా ఖమేనీ మరణంతో మళ్లీ ట్రంప్ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.శాంతి చర్చలపైనా కఠిన వైఖరిఇదిలా ఉండగా.. అమెరికాతో మళ్లీ చర్చలు కొనసాగించాలని ఇరాన్ కోరినట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా ఇప్పటికే ఇరాన్కు కాల్పుల విరమణ ముగిసిందని స్పష్టం చేసిందన్నారు. చర్చలకు అంగీకరించినా.. ఇరాన్పై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చారు.పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు?అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న సమయంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు మధ్యవర్తి దేశాలు శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు "వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి.. ఏడాది పాటు దాడులు కొనసాగుతాయి" అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మళ్లీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నన్ను ఏమైనా చేస్తే.. ట్రంప్ షాకింగ్ కామెంట్లు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తనను హత్య చేయాలనే కుట్రలు పన్నుతోందని చాలాకాలంగా ఆయన చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు కూడా ప్రస్తావించాయి కూడా . ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం విజయవంతమైతే.. ఇరాన్పై ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో దాడులు చేయాలని ముందుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని ట్రంప్ అంటున్నారు. అమెరికా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. "నేను చాలా కాలంగా ఇరాన్ లక్ష్యంగా ఉన్నాను. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే.. వాళ్లు ఇప్పటివరకు చూడని స్థాయిలో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించాలని ముందుగానే ఆదేశాలు ఇచ్చాను" అని అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్ నుంచి తనపై కొత్త హత్య కుట్రకు సంబంధించిన హెచ్చరికలు వచ్చాయా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. "కొత్తగా ఏమీ లేదు. చాలా ఏళ్లుగా వాళ్ల హిట్ లిస్ట్లో నేనే మొదటి లక్ష్యం" అని చెప్పారు."అలాంటి పరిస్థితి వస్తే ఇరాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది" అంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యల వెనుక 2020లో జరిగిన ఖాసెం సోలేమానీ హత్య ఘటన కీలకంగా నిలిచింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్కు చెందిన అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్కు చెందిన పలువురు నేతలు పరోక్షంగా హెచ్చరిస్తూ వచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్(మాజీ) అయతొల్లా ఖమేనీని యుద్ధంలో హతమార్చడంతో ఆ దేశం పగతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాను ఇరాన్ 'కిల్ లిస్ట్'లో అగ్రస్థానంలో ఉన్నానని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు.ఇటీవల నాటో సమావేశం సందర్భంగా కూడా ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. "ఇరాన్లో ఒక నాయకత్వం వెళ్లింది.. ఇంకో నాయకత్వం వచ్చింది.. అది కూడా మారింది. నేను కూడా ఎప్పుడు ఉంటానో తెలియదు. ఎందుకంటే వాళ్ల ప్రధాన లక్ష్యం నేనే" అంటూ వ్యాఖ్యానించారు. "ఇప్పటివరకు అదృష్టం కలిసి వచ్చింది. కానీ అది ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పలేం" అని కూడా పేర్కొన్నారు.ఇదే సమయంలో ఇరాన్తో శాంతి చర్చలపై కూడా ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ప్రక్రియ ముగిసిపోయిందని, ఇక ఆ దేశ చర్చల బృందంపై తనకు ఎలాంటి విశ్వాసం లేదని అన్నారు. "వాళ్లతో చాలా సమయం వృథా చేశాం. వాళ్లు హింసను నమ్మే వ్యక్తులు. అధికారులు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు.. కానీ దాంతో పెద్దగా ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం" అని వ్యాఖ్యానించారు.ఇటీవల అమెరికా ఇరాన్లోని పలు కీలక స్థావరాలపై దాడులు జరిపిన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు మధ్యవర్తి దేశాలు శాంతి చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్న వేళ ట్రంప్ తాజా వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా, ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మేం మంచివాళ్లం గనుక ఇరాన్కు వారం సెలవు ఇచ్చాం(ఖమేనీ వారం సంతాపదినాలను ఉద్దేశించి..) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఈ క్రమంలోనే ఖమేనీ అంతిమయాత్రలో.. ట్రంప్తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వ్యతిరేక నినాదాలు వినిపించాయి. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా పూర్తిగా చల్లారలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు, ఇరాన్ నుంచి వస్తున్న ప్రతీకార స్వరాల నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితులు మళ్లీ ఏ మలుపు తిరుగుతాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. -
పశ్చిమాసియాలో ఆగిన యుద్ధం.. మళ్లీ చర్చల బాట!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు భీకర దాడులు కొనసాగాయి. అయితే.. ఆ శాంతి చర్చలను మళ్లీ పట్టాలెక్కించేందుకు మధ్యవర్తి దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం తాత్కాలికంగా ఆగిందని సమాచారం.అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన పరస్పర దాడులతో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు చర్చల దిశగా అడుగులు వేస్తున్నట్లు అల్జజీరా ఓ కథనం ఇచ్చింది. అందులో.. వాషింగ్టన్ ఇప్పటికీ ఇరాన్తో చర్చలకు కట్టుబడి ఉందని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే విషయాన్ని మొదటి నుంచి చెబుతున్నట్లు గుర్తు చేశారాయన.ఇవాళ.. కొత్తగా దాడులేం జరగలేదు. అంతకు ముందు బుషెహర్ సైనిక స్థావరం వద్ద బాంబుల మోత మోగింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాయి.ఖతార్ చొరవతో..అమెరికా-ఇరాన్ ఘర్షణను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వ ప్రయత్నం చేస్తోంది. ఘర్షణలకు పరిష్కారం కేవలం దౌత్యం, చర్చల ద్వారానే సాధ్యమని ఖతార్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాశ్వత భద్రత, స్థిరత్వం కోసం సంభాషణలు, దౌత్య మార్గాలకే తమ దేశం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. లండన్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో..అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితి చాలా చల్లబడ్డప్పటికీ.. లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లోని నబాతియే ప్రాంతంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిగింది. చెత్తను తరలిస్తున్న ఓ వాహనంపై జరిగిన ఈ దాడిలో ఇద్దరు గాయపడినట్లు లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. షుకిన్, కఫర్ దజ్జల్ ప్రాంతాల సమీపంలో ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం.ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్లో మార్చి 2 నుంచి ఇప్పటివరకు 4,321 మంది మరణించగా.. 12,203 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 26న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య దళాల ఉపసంహరణకు సంబంధించి ఒప్పందం కుదిరినప్పటికీ.. తాజా దాడి ఆందోళన కలిగిస్తోంది.చర్చలే కీలకంఅమెరికా-ఇరాన్ మధ్య తాజా పరిణామాలు తాత్కాలిక శాంతి సంకేతాలను ఇస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయి కాల్పుల విరమణ, దీర్ఘకాలిక ఒప్పందంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, పరస్పర నమ్మకం వంటి అంశాలపై చర్చలు కీలకంగా మారనున్నాయి. రెండు రోజుల దాడుల తర్వాత ఇప్పుడు తుపాకులు మౌనంగా ఉన్నా.. శాంతి శాశ్వతమవుతుందా? అన్నది రాబోయే దౌత్య చర్చలపైనే ఆధారపడి ఉంది. -
ట్రంప్ ICE దూకుడు.. మెక్సికో సంచలన ప్రకటన
అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు కొనసాగుతున్న వేళ.. మెక్సికో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అమెరికా కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో తమ పౌరులు మరణించడంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.అమెరికా వలస, కస్టమ్స్ అమలు సంస్థ (ICE) అక్రమ వలసదారుల్ని అదుపు తీసుకునే చర్యల్లో భాగంగా.. పలువురిని చంపింది. అదే సమయంలో.. అదుపులోకి తీసుకునే క్రమంలో మరికొందరు ప్రమాదవశాత్తూ మరణించారు. అయితే అలా మరణించిన మెక్సికన్ పౌరుల కేసుల్లో అమెరికా కోర్టుల్లో నేరపూరిత ఫిర్యాదులు (Criminal Complaints) దాఖలు చేయనున్నట్లు క్లాడియా ప్రభుత్వం ప్రకటించింది.షీన్బామ్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. తమ పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కేవలం దౌత్యపరమైన నిరసనలతో సరిపెట్టకుండా, నేర విచారణలు జరగాలని అమెరికా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తామని చెప్పారు. అమెరికాలో జరిగిన ఈ మరణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి బాధ్యులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ఇటీవల టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన కాల్పుల ఘటన నిలిచింది. 52 ఏళ్ల మెక్సికన్ పౌరుడు లోరెన్సో సాల్గాడో అరౌజోను ఐస్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ సందర్భంగా కాల్చి చంపారు. అమెరికా అంతర్గత భద్రతా శాఖ (DHS) ప్రకారం.. అతను తన వాహనాన్ని అధికారులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో కాల్పులు జరిపినట్లు తెలిపింది. అయితే ఈ వాదనను మృతుడి కుటుంబం, మెక్సికో ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి. అతను గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని భావించి భయంతో వాహనం నడిపాడని అంటున్నారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు.మరో వైపు.. ఈ కేసుల్లో అమెరికా రాష్ట్రాల ప్రాసిక్యూటర్లతో పాటు ఫెడరల్ న్యాయ శాఖను కూడా ఆశ్రయించనున్నట్లు మెక్సికో విదేశాంగ ఉపమంత్రి రొబర్టో వెలాస్కో వెల్లడించారు. అంతేకాదు, వలస నిర్బంధ కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థలపై పౌర నష్టపరిహార (Civil) కేసులు కూడా వేయనున్నట్లు ప్రకటించారు. గతంలో దౌత్య మార్గాన ఫిర్యాదులు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాకపోవడంతో ఇప్పుడు నేరుగా న్యాయపోరాటానికి దిగుతున్నట్లు ఆయన వివరించారు.మెక్సికో విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు ఐస్ కస్టడీలో 14 మంది మెక్సికన్ పౌరులు మరణించారు. అదుపులోకి తీసుకునే క్రమంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలు సాధారణ సంఘటనలు కావని, మానవ హక్కుల ఉల్లంఘనల కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉందని మెక్సికో అభిప్రాయపడుతోంది.ఇదిలా ఉండగా, అమెరికా అంతర్గత భద్రతా శాఖ మాత్రం మెక్సికో ఆరోపణలను తోసిపుచ్చింది. ఐస్ కస్టడీలో మరణాల సంఖ్య పెరిగిందన్న వాదన సరికాదని, అదుపులో ఉన్న వారికి అవసరమైన వైద్యసేవలు, చట్టపరమైన హక్కులు కల్పిస్తున్నామని తెలిపింది. హ్యూస్టన్ ఘటనలో కూడా అధికారి ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పేర్కొంది. అయితే ఈ అంశంపై అమెరికా న్యాయ శాఖ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.అమెరికాలో అక్రమ వలసలను అరికట్టేందుకు చేపడుతున్న కఠిన చర్యలు, పెరుగుతున్న నిర్బంధాలు, కాల్పుల ఘటనలపై ఇప్పటికే మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు మెక్సికో ప్రభుత్వం నేరుగా అమెరికా కోర్టుల్లో క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేయాలని నిర్ణయించడం రెండు దేశాల మధ్య వలస విధానాలపై మరో పెద్ద దౌత్య, న్యాయ వివాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇజ్రాయెల్ నిఘా అస్త్రం.. మళ్లీ దగ్గరవుతున్న ట్రంప్-నెతన్యాహు!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనుకున్న సమయంలో మరోసారి మంటలు చెలరేగాయి. హర్ముజ్ జలసంధి పరిణామాలు, పరస్పర ఆరోపణలతో ఇరు దేశాల మధ్య టెన్షన్ పెరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మట్టుపెట్టేందుకు ఇరాన్ స్కెచ్ వేసిందన్న ప్రచారం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే వెల్లడించడం.. నాటో సదస్సు ప్రయాణంలో భద్రతా కారణాలతో విమానం మార్చుకోవడం.. వరుసగా చర్చనీయాంశాలయ్యాయి. అయితే ఈ మొత్తం పరిణామాల్లో ఇజ్రాయెల్ నిఘా సమాచారం కీలకంగా మారినట్లు తెలుస్తోంది.తన నిఘా వ్యవస్థ ద్వారా ఈ సమాచారాన్ని అందుకున్న ఇజ్రాయెల్ వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ట్రంప్కు ముప్పుపై కీలక వివరాలను అమెరికాకు అత్యవసరంగా చేరవేసిందని.. ఈ హెచ్చరికతో అమెరికా భద్రతా వ్యవస్థ అప్రమత్తమైందని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇరాన్తో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇజ్రాయెల్ అందించిన నిఘా సమాచారం ట్రంప్ వైఖరిలో మార్పునకు కారణమైందా? అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రక్రియపై దీని ప్రభావం పడనుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇజ్రాయెల్ హెచ్చరిక.. అమెరికా దూకుడు?అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ నుంచి ట్రంప్కు ముప్పు ఉందన్న సంకేతాలను అమెరికా నిఘా సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. అయితే, ఒక నిర్దిష్ట హత్యా ప్రణాళికకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇజ్రాయెల్ తాజాగా అమెరికా రక్షణ శాఖకు అందించినట్లు తెలుస్తోంది.ఈ సమాచారాన్ని అమెరికా స్వతంత్రంగా పూర్తిస్థాయిలో ధ్రువీకరించలేదని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో.. ఇరాన్పై మరింత కఠిన వైఖరి అవలంబించేలా ట్రంప్పై ఒత్తిడి తీసుకురావడానికి ఇజ్రాయెల్ ఈ నిఘా సమాచారాన్ని ఉపయోగించిందా? అన్న చర్చ కూడా అమెరికా వర్గాల్లో సాగుతోంది. అయితే భద్రతా అంశంగా ఈ హెచ్చరికను అమెరికా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు.. ఇరాన్ కదలికలపై నిఘాను పెంచినట్లు సమాచారం.మరోవైపు, ఈ పరిణామం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నేరుగా ఘర్షణకు వెళ్లకుండా పరిష్కారం కోరుతున్న ట్రంప్ వైఖరిలో ఈ హెచ్చరిక మార్పు తీసుకొస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మళ్లీ దగ్గరవుతున్న ట్రంప్-నెతన్యాహుఇరాన్ విషయంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య భిన్నాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. ఇరాన్పై ఒత్తిడిని కొనసాగించాలని నెతన్యాహు భావించగా.. యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లపై పడే ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ దౌత్య పరిష్కారం వైపు మొగ్గు చూపారు.ఈ క్రమంలో లెబనాన్ పరిణామాలు, శాంతి ఒప్పందం ఆలస్యం వంటి అంశాలపై ట్రంప్ ఇజ్రాయెల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో నెతన్యాహును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, తాజాగా ట్రంప్కు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారం నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా చేపడుతున్న చర్యలు, భద్రతా పరిస్థితులపై ట్రంప్, నెతన్యాహు మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.ఇరాన్ ముప్పు నేపథ్యంలో గత విభేదాలను పక్కన పెట్టి.. రెండు దేశాలు మళ్లీ వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి పెడుతున్నాయా? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.కొత్తేం కాకపోయినా..ట్రంప్కు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న ఆరోపణలు కొత్తవేమీ కాదు. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కీలక కమాండర్ ఖాసిం సోలైమనీ మరణించారు. ఆ ఘటన తర్వాత ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్లోని కొన్ని వర్గాలు బహిరంగంగా హెచ్చరించాయి.ఆ తర్వాత కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ఇరాన్లోని కొన్ని వర్గాల నుంచి హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరాన్లో జరిగిన సంతాప కార్యక్రమాల్లోనూ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు వినిపించినట్లు సమాచారం. అయితే ఇరాన్ నిజంగానే ఇలాంటి కుట్రకు పాల్పడుతోందా? లేక దౌత్య, వ్యూహాత్మక పోరాటంలో భాగంగానే ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయా? అన్నది ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వరుసగా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ హత్యా కుట్ర ఆరోపణలు, ఇజ్రాయెల్ నిఘా సమాచారం, అమెరికా భద్రతా చర్యలు, ఇరాన్ ప్రతిస్పందనలు.. మరోసారి పశ్చిమాసియా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.శాంతి దిశగా సాగాల్సిన చర్చలకు తాజా పరిణామాలు మరో పరీక్షగా మారాయి. ట్రంప్-ఇరాన్ ఘర్షణలో తదుపరి అడుగు ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
పుతిన్ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని తెలుస్తోంది. పైగా యుద్ధాన్ని ముగించే దిశగా చర్చల కంటే.. మరింత తీవ్రతరం చేసే వ్యూహాలపైనే మాస్కో దృష్టి పెట్టినట్లు సమాచారం. క్రెమ్లిన్కు సన్నిహితంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు రాయిటర్స్కు వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న నెలల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ ఇటీవల పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీలతో వేర్వేరుగా ఫోన్ సంభాషణలు జరిపారు. యుద్ధానికి పరిష్కారం అనుకున్నదానికంటే దగ్గరలోనే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పుతిన్ మాత్రం ప్రస్తుత యుద్ధ లక్ష్యాలను సాధించే వరకు వెనక్కి తగ్గే పరిస్థితిలో లేరని క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి.డాన్బాస్పై పట్టు కోసం..రష్యా అధ్యక్షుడి ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడమేనని సమాచారం. ఈ ప్రాంతంపై నియంత్రణ సాధిస్తేనే యుద్ధంలో విజయాన్ని సాధించినట్లు భావిస్తున్నారని పుతిన్కు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి వెల్లడించారు. కాల్పుల విరమణతో ప్రస్తుత యుద్ధ రేఖలను కొనసాగించే ప్రతిపాదనలను పుతిన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డాన్బాస్లో మిగిలిన ప్రాంతాలను కూడా త్వరలోనే తమ బలగాలు స్వాధీనం చేసుకుంటాయని రష్యా అధ్యక్షుడు నమ్ముతున్నారని సమాచారం.చమురు కేంద్రాలపై దాడులతో ఒత్తిళ్లుఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, పోర్టులు, నిల్వ కేంద్రాలపై దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా రష్యాలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ దాడులు పుతిన్ను మరింత ఆగ్రహానికి గురిచేశాయని, ప్రతిగా ఉక్రెయిన్పై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఇటీవల రష్యా కీవ్తో పాటు పలు ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడులు చేసింది. ఇందులో పలువురు పౌరులు మృతి చెందారు.డాన్బాస్ దాటి కొత్త భూభాగాలపై కన్ను?ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగా సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్ ఇటీవల రష్యా సైనిక అధికారులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వీటిని భద్రతా ప్రాంతాలుగా మార్చాలన్నది రష్యా ఉద్దేశమని ఆయన సంకేతాలిచ్చారు. ఉక్రెయిన్ మాత్రం తమ నిఘా నివేదికల ప్రకారం పుతిన్ శాంతి కోసం కాకుండా యుద్ధాన్ని కొనసాగించేందుకు కొత్త ఆపరేషన్లకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తోంది. అవసరమైతే ఉక్రెయిన్ వెలుపల ఉన్న యూరప్ దేశాలపై కూడా రష్యా దృష్టి పెట్టే అవకాశం ఉందని కీవ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.నాటోతో ప్రత్యక్ష ఘర్షణకు అవకాశంరష్యా సైనిక వర్గాల్లో ఇటీవల యుద్ధాన్ని మరింత విస్తరించే అంశంపై చర్చలు పెరిగాయి. ముఖ్యంగా బాల్టిక్ దేశాల్లోని నాటో స్థావరాలపై దాడుల అవకాశాలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. అలాంటి చర్యలు జరిగితే అమెరికా నేతృత్వంలోని నాటో కూటమితో రష్యాకు ప్రత్యక్ష ఘర్షణ ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే రష్యా నేరుగా నాటోతో యుద్ధం కోరుకోకపోయినా.. కూటమిలో విభేదాలు సృష్టించే లక్ష్యంతో చిన్నచిన్న దాడులకు పాల్పడే అవకాశం ఉందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.యుద్ధానికి పెరుగుతున్న మూల్యం2022లో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది మంది సైనికులు మృతి చెందడం, గాయపడటం లేదా కనిపించకుండా పోవడం జరిగిందని అంచనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ రష్యా దళాలు డాన్బాస్ ప్రాంతంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ల వినియోగం రష్యా సంఖ్యాబలానికి సవాల్గా మారింది. దాదాపు 1,200 కిలోమీటర్ల పొడవైన యుద్ధ రేఖపై పురోగతి సాధించేందుకు రష్యా భారీగా శ్రమిస్తోంది.పుతిన్కు విజయం అవసరంక్రెమ్లిన్కు సన్నిహితంగా ఉన్న వర్గాల ప్రకారం.. పుతిన్ ఈ యుద్ధంలో ఏదో ఒక స్పష్టమైన విజయాన్ని చూపించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా డాన్బాస్పై పూర్తి ఆధిపత్యం సాధించడం ఆయన రాజకీయంగా కీలక విజయంగా చూస్తున్నట్లు సమాచారం. అందుకే అమెరికా శాంతి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. రష్యా ఇప్పట్లో యుద్ధం నుంచి వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
24 గంటలూ కరెంట్.. ఇంధనం మాత్రం జీరో!
విద్యుత్ అంటే బొగ్గు, గ్యాస్, అణుశక్తి, జలవిద్యుత్, సౌర, పవన శక్తి.. ఇప్పటివరకు ప్రపంచం చూసింది ఇవే. కానీ ఇప్పుడు జపాన్ మరో అడుగు ముందుకేసింది. ఇంధనం అవసరం లేదు.. పొగలు, కాలుష్యం ఉండదు.. గాలి ఉన్నా లేకపోయినా, ఎండ ఉన్నా లేకపోయినా 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేయగల సాంకేతికతను ప్రపంచానికి చూపిస్తోంది.జపాన్లోని ఫుకువోకా నగరంలో ప్రపంచంలోనే అరుదైన ‘ఆస్మోటిక్ పవర్ ప్లాంట్’ నడుస్తోంది. శాస్త్రవేత్తలు దీనిని ‘బ్లూ ఎనర్జీ’గా అభివర్ణిస్తున్నారు.సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటిలోని ఉప్పు సాంద్రత తేడాను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఈ ప్లాంట్ ప్రపంచానికి చూపిస్తోంది.అలా ఎలా?ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. దీని వెనుక ఉన్న సూత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రపు ఉప్పు నీటిలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత మిగిలే నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల నీటిని ప్రత్యేకమైన సెమీ-పర్మియబుల్ మెంబ్రేన్ (ప్రత్యేక పొర) ద్వారా వేరు చేసి ఉంచుతారు. సహజంగా ఉప్పు తక్కువగా ఉన్న నీరు.. ఉప్పు ఎక్కువగా ఉన్న నీటి వైపు కదలడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియనే ఆస్మోసిస్ అంటారు. ఈ సహజ పీడనాన్ని టర్బైన్లకు అనుసంధానిస్తే అవి తిరిగి.. జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. అంటే.. ఇంధనం లేకుండానే, ప్రకృతి సిద్ధమైన ఉప్పు సాంద్రత తేడానే విద్యుత్కు మూలం అవుతుంది.వాతావరణంతో సంబంధం లేదుసౌర విద్యుత్కు ఎండ అవసరం. పవన విద్యుత్కు గాలి అవసరం. జలవిద్యుత్కు నీటి ప్రవాహం అవసరం. కానీ బ్లూ ఎనర్జీకి ఇవేవీ అవసరం ఉండవు. సముద్రం ఉన్నంత కాలం, శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులో ఉన్నంత కాలం ఈ ప్లాంట్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. అందుకే భవిష్యత్తులో బేస్లోడ్ పవర్ (నిరంతర విద్యుత్ సరఫరా)కు ఇది కీలక ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు.ప్రయోజనాలే ప్రయోజనాలుఈ సాంకేతికతలో బొగ్గు, గ్యాస్, డీజిల్ వంటి ఇంధనాలు అవసరం ఉండవు. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు దాదాపు ఉండవు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ఇది అత్యంత అనుకూలం. ముఖ్యంగా ఇప్పటికే మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం సులభం. విద్యుత్ ఉత్పత్తితో పాటు మురుగు నీటి నిర్వహణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఒకేసారి రెండు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.సవాళ్లు కూడా..అయితే ఈ సాంకేతికత ఇప్పుడే పూర్తిస్థాయిలో వాణిజ్య వినియోగానికి సిద్ధం కాలేదు. అత్యంత నాణ్యమైన మెంబ్రేన్ల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటం ప్రధాన సవాల్. అలాగే సముద్రపు నీటిలో ఉండే ఉప్పు, సూక్ష్మ జీవుల వల్ల మెంబ్రేన్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటి నిర్వహణ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. అయినా.. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సమస్యలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ప్రపంచానికి కొత్త దారి..సముద్రపు అలల్లోనే కాదు.. సముద్రపు ఉప్పు నీటిలోనూ అపారమైన శక్తి దాగి ఉందని జపాన్ ప్రపంచానికి చూపిస్తోంది. బొగ్గు, గ్యాస్లపై ఆధారపడకుండా.. కాలుష్యాన్ని తగ్గిస్తూ.. 24 గంటలూ విద్యుత్ను అందించే 'బ్లూ ఎనర్జీ' భవిష్యత్తులో ఇంధన రంగానికే కొత్త దిశను చూపే సాంకేతికతగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇంకో విశేషం.. 2025 ఆగస్టులో జపాన్లోని ఫుకువోకాలో ఈ ‘బ్లూ ఎనర్జీ’ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటి మధ్య ఉండే ఉప్పు సాంద్రత తేడాను వినియోగించే ‘ప్రెషర్ రిటార్డెడ్ ఆస్మోసిస్ (PRO)’ సాంకేతికతతో ఇది విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. సౌర, పవన విద్యుత్లా వాతావరణంపై ఆధారపడకుండా పగలు–రాత్రి నిరంతరం పనిచేయడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేస్తే.. ప్రపంచ విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం వరకు తీర్చే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.:::వెబ్ స్పెషల్ -
ఇరాన్ అంటే అంత భయమా?.. ట్రంప్ గగన ప్రయాణంలో ట్విస్ట్
ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఖతార్ నుంచి అందుకున్న వేల కోట్ల విలువైన కొత్త ఎయిర్ఫోర్స్ వన్ విమానం ఉండగానే.. తిరుగు ప్రయాణంలో ఆయన పాత విమానాన్ని ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న వేళ ట్రంప్ విమానం మార్చడం వెనుక భద్రతా కారణాలున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ట్రంప్ కోసం ఖతార్ ప్రభుత్వం సుమారు 400 మిలియన్ డాలర్లు (దాదాపు ₹3,400 కోట్లు) విలువైన బోయింగ్ 747-8 లగ్జరీ జెట్ను బహుమతిగా ఇచ్చింది. ఖతార్ రాజ కుటుంబం ఉపయోగించిన ఈ విమానాన్ని అమెరికా అధ్యక్షుడి ప్రయాణాలకు అనుగుణంగా మార్పులు చేశారు. అమెరికా రక్షణ సంస్థ ఎల్3హ్యారిస్ టెక్నాలజీస్ ఈ విమానంలో భద్రతా వ్యవస్థలు, రహస్య కమ్యూనికేషన్ సదుపాయాలు, రక్షణ సాంకేతికతను అమర్చింది. బోయింగ్ సంస్థ కొత్త ఎయిర్ఫోర్స్ వన్ విమానాల తయారీలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. ఈ విమానాన్ని తాత్కాలికంగా ‘బ్రిడ్జ్ ఎయిర్ఫోర్స్ వన్’గా ఉపయోగిస్తున్నారు.ఈ విమానం గురించి ట్రంప్ ‘‘అద్భుతం (truly magnificent)’’ అంటూ ప్రశంసించారు. యూరప్లోని పలు అమెరికా సైనిక స్థావరాలకు తీసుకెళ్లి అక్కడి సైనికులకు చూపించాలని కూడా ఆయన చెప్పారు. ఇందులో భాగంగా బ్రిటన్లోని రాయల్ ఎయిర్ఫోర్స్ మిల్డెన్హాల్ స్థావరంలో అమెరికా సైనిక సిబ్బందికి ఈ విమానాన్ని చూపించారు.కొత్త విమానం ఉండగా.. పాతదానిలో ప్రయాణంనాటో సదస్సు సమావేశం కోసం ట్రంప్ ఈ కొత్త ఎయిర్ఫోర్స్ వన్లో టర్కీకి వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం అనూహ్యంగా పాత ఎయిర్ఫోర్స్ వన్ను ఎంచుకున్నారు. అంకారా నుంచి బ్రిటన్లోని రాయల్ ఎయిర్ఫోర్స్ మిల్డెన్హాల్ (RAF Mildenhall) స్థావరం వరకు పాత విమానంలో ప్రయాణించిన ట్రంప్.. అక్కడ కొత్త విమానాన్ని ఎక్కి అమెరికాకు తిరిగి వెళ్లారు.ఇరాన్ ముప్పు కారణమా?కొత్త విమానాన్ని వదిలి పాతదానిలో ఎందుకు ప్రయాణించారన్న ప్రశ్నకు ట్రంప్ స్పష్టమైన కారణం చెప్పలేదు. అయితే ఇరాన్ నుంచి తనకు ముప్పు ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఇరాన్ హిట్ లిస్ట్లో నేనే నంబర్ వన్’’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచాయి. అధ్యక్షుడి భద్రతను దృష్టిలో పెట్టుకుని సీక్రెట్ సర్వీస్ అధికారులు పాత విమానాన్ని ఎంచుకోవాలని సూచించినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. అయితే ట్రంప్ పేషీ మాత్రం విమానం మార్పు భద్రతా కారణాలతో కాదని తెలిపారు.కొత్త విమానం భద్రతపై సందేహాలు?కొత్త ఎయిర్ఫోర్స్ వన్లో అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు, క్షిపణి రక్షణ సదుపాయాలు వంటి మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తక్కువ సమయంలోనే మార్పులు పూర్తి చేయడంతో భద్రతా ప్రమాణాలపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పాత ఎయిర్ఫోర్స్ వన్ విమానాలు ఎన్నో ఏళ్లుగా పరీక్షించబడ్డ రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.విమానం బహుమతిపై వివాదంవిదేశీ ప్రభుత్వం నుంచి ఇంత విలువైన విమానాన్ని స్వీకరించడంపై అమెరికాలో రాజకీయ, నైతిక విమర్శలు కూడా వచ్చాయి. విమానం బహుమతిగా వచ్చినప్పటికీ.. భద్రతా మార్పులు, సాంకేతిక అప్గ్రేడ్ల కోసం అమెరికా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ట్రంప్ పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విమాన యాజమాన్యాన్ని డొనాల్డ్ జే. ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ఫౌండేషన్కు బదిలీ చేసే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.మొత్తంగా.. ‘అద్భుతం’ అని ట్రంప్ మెచ్చిన విమానాన్నే తిరుగు ప్రయాణంలో పక్కన పెట్టడం.. ఇరాన్ ఉద్రిక్తతల వేళ కొత్త చర్చకు దారితీసింది. -
ఏఐతో కొత్త ముప్పు.. షాకింగ్ ఘటన!
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ప్రపంచానికి కొత్త అవకాశాలను అందిస్తున్న వేళ.. దాని దుర్వినియోగం మరో కొత్త ముప్పుగా మారుతోంది. ఏఐ సాధనాలను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయన్న ఆందోళనకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన బలం చేకూర్చింది. చాట్జీపీటీ సాయంతో ఓ ప్రోగ్రామ్ రూపొందించి వేలాది వినియోగదారుల ఖాతాలను ప్రభావితం చేశాడన్న ఆరోపణలతో 15 ఏళ్ల విద్యార్థి అరెస్ట్ కావడం ఇక్కడ మరో విశేషం. జపాన్కు చెందిన ఓ టీనేజర్.. ప్రముఖ యానిమే స్ట్రీమింగ్ సేవ అయిన బందాయ్ ఛానల్పై సైబర్ దాడికి పాల్పడ్డాడు. చాట్జీపీటీ సాయంతో కోడింగ్ను బ్రేక్ చేసి.. ఏకంగా 46,812 మంది వినియోగదారుల ఖాతాలు హ్యాక్ చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కంపెనీ అప్రమత్తమై ఆ ఖాతాలను నిలిపివేసింది. సంస్థ సేవలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది.చాట్జీపీటీ సాయంతో కోడ్..టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనియర్ హైస్కూల్ విద్యార్థిగా ఉన్న నిందితుడు.. బందాయ్ ఛానల్ వ్యవస్థలోని భద్రతా లోపాన్ని గుర్తించాడు. ఆ లోపాన్ని ఉపయోగించుకునేందుకు అతడు ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ను రూపొందించాడు. ఆ ప్రోగ్రామ్లోని కొంత భాగాన్ని పూర్తి చేసేందుకు చాట్జీపీటీ సాయం తీసుకున్నాడు. ఖాతాల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన కోడ్ను తానే రూపొందించానని, అది ఎక్కువ సమయం తీసుకోవడంతో మరో ప్రోగ్రామింగ్ భాషలో పూర్తి చేసేందుకు చాట్జీపీటీని ఉపయోగించానని ఆ బాలుడు చెప్పడం గమనార్హం.46 వేలకుపైగా ఖాతాల రద్దుపోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన కిందటి ఏడాది చివర్లో జరిగింది. 2025 నవంబర్ 4న బందాయ్ ఛానల్ సర్వర్లకు అనధికార ఆదేశాలు పంపారు. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారుల సభ్యత్వాలు రద్దయ్యాయి. ఈ ప్రభావంతో నవంబర్ 6 నుంచి సంస్థ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాత డిసెంబర్లో సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు బందాయ్ ఛానల్ వెల్లడించింది.ఐపీ మార్చి.. ఏమార్చి.. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సంస్థ అతడి యాక్సెస్ను నిలిపివేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ.. నిందితుడు తన ఐపీ అడ్రస్ను దాదాపు 30 సార్లు మార్చి మళ్లీ ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. వ్యవస్థలోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకుని వినియోగదారుల సమాచారాన్ని చేరుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు భావిస్తున్నారు.సరదాగానే..విచారణలో బాలుడు ఆరోపణలను అంగీకరించినట్లు సమాచారం. అయితే బందాయ్ ఛానల్పై తనకు ఎలాంటి కక్ష లేదని చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి ఉందని, నాలుగో తరగతిలోనే వాటిని ఉపయోగించడం ప్రారంభించానని అతడు చెప్పినట్లు అధికారులు తెలిపారు. అనుకోకుండా ఈ సమాచారాన్ని యాక్సెస్ చేయగలిగానని, సంస్థను లక్ష్యంగా చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని వెల్లడించినట్లు సమాచారం. చాలా ఖాతాల్లోకి ప్రవేశించే అవకాశం కనిపించడంతోనే ఈ ప్రయత్నం చేసినట్లు బాలుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది.చిన్న వయసులోనే కోడింగ్ నైపుణ్యంఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. నిందితుడు చిన్న వయసులోనే ప్రోగ్రామింగ్పై పట్టు సాధించాడు. ప్రాథమిక పాఠశాల దశలోనే కంప్యూటర్ కోడింగ్ నేర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగించకపోతే అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.వినియోగదారులకు హెచ్చరికసైబర్ దాడి తర్వాత బందాయ్ ఛానల్ ప్రభావిత వినియోగదారులకు సమాచారం అందించింది. నకిలీ ఈమెయిల్స్, ఫిషింగ్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రద్దైన సభ్యత్వాలను తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించిన సంస్థ.. సేవలు నిలిచిపోయిన సమయంలో వసూలైన రుసుములను తిరిగి చెల్లించినట్లు తెలిపింది. అయితే వినియోగదారుల సమాచారం బయటకు లీకైందని లేదా దుర్వినియోగమైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సంస్థ స్పష్టం చేసింది.ముమ్మాటికీ కొత్త ఆందోళనే!కృత్రిమ మేధ అందిస్తున్న అవకాశాలతో పాటు.. దాని దుర్వినియోగం వల్ల ఎదురయ్యే సవాళ్లు కూడా పెరుగుతున్నాయి. చాట్జీపీటీ వంటి సాధనాలను సైబర్ నేరాలకు ఉపయోగించే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా.. ఏఐ సాంకేతికత ఎంత శక్తివంతమైనదో, దాన్ని తప్పుదోవ పట్టిస్తే అంతే ప్రమాదకరంగా మారుతుందని జపాన్లో జరిగిన ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. -
ఒక్క దెబ్బ కొడితే.. 20 రెట్లు బలంగా కొడతాం
వాషింగ్టన్: ఇరాన్పై తాజా దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. తమపై లేదంటే తమ మిత్రదేశాలపై ఇరాన్ ఎలాంటి దాడికి పాల్పడినా.. దానికి 20 రెట్లు బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి వద్ద అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.అమెరికా దళాలు ఇరాన్పై వరుసగా రెండో రోజు దాడులు కొనసాగించాయి. ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలోని ఇరాన్షహర్ ఎయిర్బేస్పై దాడి చేసినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు, చిత్రాలను విడుదల చేశారు. ఈ స్థావరాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) వినియోగిస్తున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. అమెరికా దాడుల తర్వాత ఇరాన్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. దక్షిణ తీర ప్రాంతంలోని బుషెర్, చాబహార్, కొనారక్, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు పేర్కొంది. బుషెర్లోనే ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉంది. ‘‘చూస్తూ ఊరుకోం’’: ట్రంప్ఇరాన్ నుంచి వచ్చే ఏ దాడినైనా తిప్పికొడతామని ట్రంప్ తెలిపారు. ‘‘వాళ్లు మమ్మల్ని ఒక్కసారి కొడితే.. మేము 20 రెట్లు బలంగా సమాధానం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ముగిసిందని గతంలో ప్రకటించిన ట్రంప్.. చర్చలకు మాత్రం అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలను గౌరవిస్తుందా? అన్నదే ప్రధాన సందేహమని అన్నారు. అందుకే ఎలాంటి ఒప్పందం విషయంలోనూ తొందరపడబోమని స్పష్టం చేశారు. ఇది సాధారణ యుద్ధం కోసం చేస్తున్న చర్య కాదని.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.ఇజ్రాయెల్ మౌనం వెనుక వ్యూహమేంటి?అమెరికా-ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ వైఖరి ఆసక్తికరంగా మారింది. ఇరాన్ను ప్రధాన భద్రతా ముప్పుగా చూస్తున్న ఇజ్రాయెల్.. తాజా పరిణామాలపై నిశితంగా గమనిస్తోంది. అయితే ఈ దశలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మౌనం పాటిస్తోంది. అమెరికా చర్యలకు మద్దతు ఇస్తూనే.. పరిస్థితులు ఏ దిశగా వెళ్తాయో అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రతీకార చర్యలకు దిగిన ఇరాన్అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా స్పందించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగినట్లు సమాచారం. అయితే ఈ దాడుల్లో జరిగిన నష్టంపై వెంటనే స్పష్టత రాలేదు. కువైట్ సైన్యం మాత్రం డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.హర్ముజ్పై ఇరాన్ పట్టుహర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమకే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘలీబాఫ్ మాట్లాడుతూ అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు. ‘‘మీరు దాడి చేస్తే.. మిమ్మల్ని కూడా దాడి చేస్తాం’’ అంటూ హెచ్చరించారు. హర్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలు ఇరాన్ నిబంధనల ప్రకారమే సాగుతాయని తెలిపారు.చర్చలకు బ్రేక్?ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తాజా పరిణామాలు అడ్డంకిగా మారాయి. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. బెదిరింపులు బలానికి సంకేతం కాదని, అమెరికా విధానాల వైఫల్యాన్ని చూపిస్తున్నాయని విమర్శించింది.పెరిగిన చమురు ధరలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్పై పడింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ వ్యాఖ్యల తర్వాత చమురు ధరలు దాదాపు 8 శాతం పెరిగాయి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భీకరంగా మారిన అమెరికా-ఇరాన్ యుద్ధం!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక శాంతి ఒప్పందం "ముగిసిపోయింది" అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా సైన్యం ఇరాన్పై మరోసారి భారీ వైమానిక దాడులకు దిగింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా స్పష్టం చేసింది. చాబహార్, బందర్ అబ్బాస్, కొనారక్, ఇరాన్షహర్ సహా దక్షిణ ఇరాన్లోని పలు కీలక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించగా, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారిక ప్రకటనలో, హర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పుగా మారుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడమే తాజా దాడుల లక్ష్యమని వెల్లడించింది. వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై జరిగిన దాడులకు ఇరాన్ను బాధ్యుడిగా నిలబెడుతున్నామని స్పష్టం చేసింది.హెచ్చరిక తర్వాతే దాడులుమంగళవారం హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు సరకు నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ ప్రకటించారు. "నిన్న నౌకలపై జరిగిన దాడికి ఇదే సమాధానం. మళ్లీ అలాంటి దాడులు జరిగితే ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం" అని ఆయన హెచ్చరించారు.టర్కీలో జరిగిన నాటో సదస్సులో మాట్లాడుతూ, "ఇరాన్తో శాశ్వత ఒప్పందం కుదిరినా అది నిలుస్తుందనే నమ్మకం లేదు. వాళ్లు విశ్వసనీయులు కాదు. నా దృష్టిలో తాత్కాలిక ఒప్పందం ఇప్పటికే ముగిసింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పూర్తి స్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుందని మాత్రం తాను భావించడం లేదని కూడా చెప్పారు.మరింత తీవ్రంగా అమెరికా దాడులురాయిటర్స్ కథనం ప్రకారం.. బుధవారం జరిగిన దాడులు మంగళవారం కంటే మరింత విస్తృతంగా సాగాయి. ఇరాన్ దక్షిణ తీరంలోని కీలక సైనిక, నౌకాదళ మౌలిక సదుపాయాలనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్లో అతిపెద్ద నౌకాశ్రయం ఉన్న బందర్ అబ్బాస్, నౌకాదళ స్థావరాలు ఉన్న కొనారక్, వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన చాబహార్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. చాబహార్లో సముద్ర రవాణా నియంత్రణ టవర్కు నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. పేలుళ్ల అనంతరం అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్షహర్లో కూడా వరుస పేలుళ్లు నమోదయ్యాయి.అమెరికా స్థావరాలే లక్ష్యంగా..అమెరికా దాడులకు ముందు ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించింది. అలాగే అమెరికా తాజా దాడులకు ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై "భారీ దాడి"కి సిద్ధమవుతున్నామని ఇరాన్ భద్రతా వర్గాలకు చెందిన నూర్ న్యూస్ వెల్లడించింది.హర్ముజ్ జలసంధే అసలు కేంద్రబిందువుప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు హర్ముజ్ జలసంధి గుండా వెళ్తుంది. ఈ వ్యూహాత్మక మార్గంపై ప్రభావం చూపగల సామర్థ్యం ఇరాన్కు ఉండటంతో అంతర్జాతీయంగా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వాణిజ్య నౌకలపై దాడుల ద్వారా చర్చల్లో పైచేయి సాధించాలనే వ్యూహాన్ని ఇరాన్ అనుసరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే అమెరికా హర్ముజ్లో ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.శాంతి చర్చలకు మరోసారి దెబ్బజూన్ 17న కుదిరిన అవగాహన ఒప్పందం ఆధారంగా శాశ్వత శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించినప్పటికీ, తాజా దాడులతో ఆ ఆశలు దాదాపు ఆవిరయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగడం, అణు విధానంలో మార్పులు చేయడం, ఎర్ర సముద్రానికి కీలక ద్వారమైన బాబ్ ఎల్ మండెబ్ జలసంధిని మూసివేయడం వంటి ప్రతీకార చర్యలను కూడా ఇరాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.చమురు మార్కెట్లలో కలకలంతాజా దాడుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు వెంటనే స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక దశలో సుమారు 7 శాతం వరకు ఎగసిపడగా, తర్వాత బ్యారెల్కు సుమారు 79 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
హ్యాట్రిక్ ఓటముల తర్వాత.. చరిత్ర సృష్టించిన కీకో
పెరూ రాజకీయాల్లో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్నో సంవత్సరాల పోరాటం.. మూడు వరుస అధ్యక్ష ఎన్నికల ఓటములు, వివాదాలు, ఆరోపణల మధ్య నిలిచిన కీకో ఫుజిమోరి Keiko Fujimori.. ఎట్టకేలకు దేశ అత్యున్నత పదవిని దక్కించుకుని చరిత్ర సృష్టించారు.నెలల తరబడి సాగిన ఉత్కంఠభరిత కౌంటింగ్ ప్రక్రియ తర్వాత పెరూ ఎన్నికల కోర్టు అధికారికంగా కీకో ఫుజిమోరి(51)ని అధ్యక్ష ఎన్నిక విజేతగా ప్రకటించింది. జూన్ 7న జరిగిన రెండో దశ ఎన్నికల్లో ఆమె 50.135 శాతం ఓట్లతో స్వల్ప ఆధిక్యం సాధించగా, ప్రత్యర్థి వామపక్ష నేత రోబర్టో సాంచెజ్ 49.865 శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు. దాదాపు 1.8 కోట్ల ఓట్లలో 50 వేల కంటే తక్కువ తేడా ఈ ఎన్నికను దేశ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరిత పోటీల్లో ఒకటిగా నిలిపింది.ఫలితాలపై సాంచెజ్ వర్గం అక్రమాల ఆరోపణలు చేస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఎన్నికల అధికారులు అన్ని ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఫలితాన్ని ధృవీకరించారు. దీంతో కీకో ఫుజిమోరి అధికారికంగా పెరూ అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.కీకో ఎవరంటే..కీకో ఫుజిమోరి పెరూ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేత. మాజీ అధ్యక్షుడు అల్బర్టో ఫుజిమోరి (Alberto Fujimori) పెద్ద కుమార్తె. 1990 నుంచి 2000 వరకు పెరూ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, దేశంలో ఉగ్రవాదంపై కఠిన చర్యలతో ప్రసిద్ధి పొందినప్పటికీ, తరువాత అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించారు.అల్బర్టో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కీకో చాలా చిన్న వయసులోనే దేశ రాజకీయ వాతావరణాన్ని దగ్గరగా చూసారు. తండ్రి అధ్యక్షుడిగా ఉన్న చివరి సంవత్సరాల్లో.. కేవలం 19 ఏళ్ల వయసుకే ఆమె ‘‘ఫస్ట్ లేడీ’’ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఇది ఆమెను రాజకీయాల్లోకి ప్రవేశించడానికి దారి తీసిన కీలక దశగా భావిస్తారు. తర్వాత ఆమె పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి పాపులర్ ఫోర్స్ పార్టీకి నాయకత్వం వహించారు. 2011, 2016, 2021 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి ప్రతి సారి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ పరాజయాలు ఆమె రాజకీయ ప్రయాణాన్ని ఆపలేదు, కానీ మరింత బలమైన మద్దతు బేస్ నిర్మించుకునేలా చేశాయి. అదే సమయంలో ఆమెపై ఎన్నికల నిధుల అక్రమాల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసుల కారణంగా కొంతకాలం జైలు జీవితం గడపాల్సి రావడం ఆమె రాజకీయ జీవితంలో పెద్ద మలుపుగా నిలిచింది. అయినప్పటికీ రాజకీయాల నుంచి తప్పుకోకుండా మళ్లీ పునరాగమనం చేశారు.విజయం.. రాజకీయ ప్రాధాన్యంఈసారి ఎన్నికల్లో కీకో “కఠిన చట్టాలు, నేరాల నియంత్రణ, పెట్టుబడుల ఆకర్షణ” వంటి అంశాలపై ప్రచారం నిర్వహించారు. దేశంలో పెరుగుతున్న నేరాలు, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో ఆమె వాదనలు ఓటర్లలో గణనీయంగా ప్రభావం చూపించాయి. విజయం అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ముందున్న సవాళ్లు..అయితే కొత్త అధ్యక్షురాలిగా ఆమె ముందున్న సవాళ్లు పెద్దవి. పెరూ గత దశాబ్దంలో అనేక రాజకీయ సంక్షోభాలను చూసింది. వరుస ప్రభుత్వ మార్పులు, సామాజిక విభేదాలు, ఆర్థిక ఒత్తిడులు దేశాన్ని ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో స్థిరమైన పాలన అందించడం ఆమెకు ప్రధాన పరీక్షగా మారనుంది. అయినప్పటికీ దీర్ఘకాల పరాజయాల తర్వాత చివరకు అధికారం దక్కించుకున్న కీకో ఫుజిమోరి విజయం, పెరూ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. -
మేం మంచివాళ్లం.. ఇరాన్కు వారం సెలవిచ్చాం
ఇరాన్లో మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి జరుగుతున్న వీడ్కోలు కార్యక్రమాల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మౌంట్ రష్మోర్ వద్ద జరిగిన భారీ సభలో ఆయన చేసిన సెటైరికల్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.“మేం మంచివాళ్లం కాబట్టి ఇరాన్కు ఒక వారం సెలవిచ్చాం” అంటూ ట్రంప్ ప్రసంగించారు. అంతకుముందు ఇరాన్పై జరిగిన సైనిక చర్యలను ప్రస్తావిస్తూ ఆయన “మేం ఇరాన్ను గట్టిగా దెబ్బకొట్టాం… వాళ్లు చర్చలకు సిద్ధంగా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.మేము వెనెజువెలాను ఒక రోజులోనే ఓడించాం. ఇరాన్ను కూడా తీవ్రంగా దెబ్బతీశాం. వాళ్లు ఇప్పుడు ఒప్పందానికి రావడానికి ఎంతో తహతహలాడుతున్నారు. మేము మంచివాళ్లం కాబట్టి వారికి అంత్యక్రియల కోసం ఒక వారం సమయం ఇచ్చాం. వీలైనంత త్వరగా వాళ్లు మాతో డీల్ కుదుర్చుకుంటే మంచిది అని అన్నారాయన.ట్రంప్ వ్యాఖ్యలను సభలో ఉన్నవాళ్లు చప్పట్లు, నవ్వులతో స్వాగతించారు. ప్రస్తుతం.. అమెరికా అంతటా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.Trump on Iran: "We Gave Them a Week Off… Because We're Nice." pic.twitter.com/AcJ63EaUjO— GP Singh (@GanpatSinghDew5) July 4, 2026ఇక మరోవైపు ఇరాన్లో సంతాప దినాలు నడుస్తున్నాయి. రాజధాని టెహ్రాన్లో గ్రాండ్ మోసల్లా కేంద్రంగా ఖమేనీకి వీడ్కోలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు నల్ల దుస్తుల్లో హాజరై కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. ‘‘అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలి.. ట్రంప్ను హతమార్చాలి’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, ఫ్లకార్డులు ఆ కార్యక్రమంలో కనిపించడం గమనార్హం. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం సాధారణంగా 24 గంటల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, యుద్ధ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ సంతాప యాత్రలో ఖమేనీ పార్థివదేహాన్ని ఖోమ్, నజాఫ్, కర్బలా మీదుగా మష్హద్కు తరలించి జూలై 9న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు భారత్, పాకిస్థాన్, రష్యా, చైనా సహా అనేక దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇరాన్లో శోక వాతావరణం కొనసాగుతున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ దీనికి ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఉద్రిక్తతల కారణంగా.. అమెరికా–ఇరాన్ సంబంధాల్లో కొత్త రాజకీయ దుమారానికి కారణమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ట్రంప్ను కూల్ చేసేందుకు.. నాటో కొత్త ఎత్తుగడలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలకు తెరదించే ప్రయత్నంలో అట్లాంటిక్ కూటమి (నాటో) కీలక అడుగులు వేస్తోంది. సభ్యదేశాల మధ్య ఐక్యతపై ఎలాంటి సందేహాలకు తావులేకుండా చేయడంతో పాటు, వాషింగ్టన్ ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఈసారి శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ.. ఐరోపా భద్రతకు పెరుగుతున్న సవాళ్లు, అమెరికా వైఖరిలో వచ్చిన మార్పులు, సభ్యదేశాలపై ట్రంప్ ఒత్తిడి.. ఈ మూడింటి మధ్య జరుగుతున్న అంకారా(టర్కీ) సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.నాటో ఏర్పడి దాదాపు ఎనిమిది దశాబ్దాలు అవుతోంది. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఐరోపాలోని మొత్తం 32 దేశాలు ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ సైనిక వ్యయంలో సగానికి పైగా ఈ దేశాలదే. అలాంటి కూటమిలో గత కొన్నేళ్లుగా ఒక ప్రశ్న తరచూ వినిపిస్తోంది. అమెరికా లేకుండా నాటో కొనసాగగలదా? అదే సమయంలో మరో ప్రశ్న కూడా ముందుకొచ్చింది. అమెరికా ఎందుకు మిగతా దేశాల భద్రత కోసం అంత భారీగా ఖర్చు చేయాలి? ఈ రెండో ప్రశ్ననే డొనాల్డ్ ట్రంప్ అత్యంత బలంగా లేవనెత్తారు.ట్రంప్కు నాటోపై వ్యక్తిగత వ్యతిరేకత లేదు. కానీ కూటమి నిర్వహణ తీరుపై ఆయన చాలాకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ప్రతి ఏడాది వందల బిలియన్ డాలర్లు రక్షణపై వెచ్చిస్తుంటే, ఐరోపాలోని అనేక దేశాలు మాత్రం తమ భద్రత బాధ్యతను అమెరికాపైనే వదిలేశాయని ఆయన విమర్శిస్తున్నారు. "అమెరికా డబ్బుతో యూరప్ భద్రత ఎందుకు?" అనే ప్రశ్నను ఆయన ఎన్నికల ప్రచారంలోనే కాదు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ పదేపదే లేవనెత్తారు. సభ్యదేశాలు తగిన రక్షణ వ్యయం చేయకపోతే అమెరికా తన భద్రతా హామీలను పునఃసమీక్షిస్తుందని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఒక దశలో అమెరికా నిజంగానే నాటో నుంచి తప్పుకుంటుందా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగింది.అయితే ట్రంప్ ఎప్పుడూ ‘‘నాటోను రద్దు చేస్తాను’’.. ‘‘నాటో నుంచి తప్పుకుంటాం’’ అని అధికారికంగా ప్రకటించలేదు. ఆయన లక్ష్యం కూటమిని బలహీనపరచడం కాదని, సభ్యదేశాలు కూడా సమాన బాధ్యతలు తీసుకునేలా చేయడమేనని ఆయన సన్నిహితులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అంకారాలో జరుగుతున్న సమావేశం చూస్తే, ట్రంప్ ఎన్నాళ్లుగానో చెబుతున్న అంశాలకే నాటో స్పందిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అందుకే ఈసారి సభ్యదేశాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (GDP)లో కనీసం 2 శాతం రక్షణ రంగానికి కేటాయించాలనే లక్ష్యాన్ని దశలవారీగా 5 శాతానికి పెంచేందుకు అంగీకరించాయి. ఇందులో 3.5 శాతం నేరుగా సైనిక సామర్థ్యాల పెంపు, ఆయుధాల కొనుగోలు, సైనిక దళాల ఆధునికీకరణకు వినియోగిస్తారు. మిగిలిన 1.5 శాతం సైబర్ భద్రత, కీలక మౌలిక సదుపాయాలు, రక్షణ పరిశ్రమ, సైనిక రవాణా వ్యవస్థల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. నాటో చరిత్రలో ఇదే అతిపెద్ద రక్షణ వ్యయ లక్ష్యంగా భావిస్తున్నారు.ఇదొక్కటే కాదు.. సమావేశం ముగింపులో విడుదల చేసే సంయుక్త ప్రకటనలో నాటో ఒప్పందంలోని ఆర్టికల్-5 మీద తమ నిబద్ధత "అచంచలం" అని మరోసారి ప్రకటించనున్నారు. ఈ నిబంధనే నాటోకు వెన్నెముకగా భావిస్తారు. ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది మొత్తం కూటమిపై దాడిగా పరిగణించి మిగతా సభ్యదేశాలన్నీ రక్షణకు ముందుకు రావాలనేది దీని సారాంశం. ట్రంప్ గతంలో ఈ అంశంపైనా సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ సమావేశంలో మరో కీలక అంశం ఉక్రెయిన్. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీవ్కు సైనిక, ఆర్థిక సహకారాన్ని ఎలా కొనసాగించాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది. అయితే గత సమావేశాలతో పోలిస్తే ఈసారి ఉక్రెయిన్ అంశం కంటే అమెరికా-నాటో సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ట్రంప్ వైఖరి కారణంగా కూటమిలో ఎలాంటి చీలికలు ఏర్పడకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.నాటోలోని చాలా దేశాలు ఇప్పటికే రక్షణ వ్యయాన్ని పెంచడం ప్రారంభించాయి. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పుడు కేవలం మూడు దేశాలే జీడీపీలో 2 శాతం రక్షణకు ఖర్చు చేసేవి. ఇప్పుడు 32 సభ్యదేశాల్లో మెజారిటీ ఆ లక్ష్యాన్ని చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐరోపా దేశాలు తమ సైనిక బలాన్ని పెంచడంపై మరింత దృష్టి సారించాయి. ఇప్పుడు 5 శాతం లక్ష్యంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది.అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం అమెరికా-చైనా పోటీ, రష్యా దూకుడు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ఇలా అనేక పరిణామాలు ఒకేసారి చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నాయకత్వంలోని నాటోలో ఎలాంటి బలహీనత కనిపించినా అది ప్రత్యర్థి దేశాలకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉందని సభ్యదేశాలు భావిస్తున్నాయి. అందుకే ట్రంప్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను విస్మరించకుండా, వాటికి సమాధానమిస్తూ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా ఈసారి అడుగులు వేస్తున్నాయి.అమెరికా లేకుండా నాటోను ఊహించడం కష్టం. అదే సమయంలో నాటో లేకుండా ఐరోపా భద్రతను ఊహించడం కూడా అంతే కష్టం. ఈ వాస్తవాన్ని గుర్తించిన సభ్యదేశాలు ఇప్పుడు ఒకే సందేశం ఇవ్వాలని చూస్తున్నాయి. అమెరికా నమ్మకాన్ని కోల్పోకుండా, కూటమి బలాన్ని మరింత పెంచుకోవడం. అంకారా సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు రానున్న సంవత్సరాల్లో అమెరికా-నాటో సంబంధాలను ఏ దిశగా తీసుకెళ్తాయో నిర్ణయించనున్నాయి. -
ఇరాన్లో భావోద్వేగ దృశ్యాలు.. ఖమేనీకి కన్నీటి నివాళి
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తుదివీడ్కోలు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రాండ్ మోసల్లా ప్రాంగణం కన్నీళ్లు, నినాదాలు, సంతాప సందేశాలతో శోకసంద్రంగా మారింది. ప్రార్థన మందిరం వద్ద నిశ్శబ్దం అలుముకోగా.. ఖమేనీ పార్థివదేహం రాకతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.ఖమేనీ భౌతికకాయాన్ని జాతీయ జెండాతో కప్పి ప్రాంగణానికి తీసుకురాగా, ఆయన తలపై ఉండే నల్ల టర్బన్ను కూడా సంప్రదాయంగా ఉంచారు. కుటుంబ సభ్యుల పార్థివదేహాలను ప్రత్యేక పేటికల్లో ఆయన పక్కపక్కనే ఉంచారు. ఈ క్రమంలో అత్యంత భావోద్వేగ దృశ్యంగా ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మది గోల్పాయెగాని చిన్న శవపేటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. జాతీయ జెండాతో కప్పిన ఆ చిన్న పేటిక పక్కనే ఆమె ఫోటోను ఉంచడంతో అక్కడున్నవారు తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సహా పలువురు ఉన్నతాధికారులు భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు.Un cadre du cercueil de la martyre Zahra Mohammadi Golpayegani, #petite-fille du Guide suprême martyr de la Révolution islamique, à la Mosalla de #Téhéran.#بدرقه_آقای_شهید_ایران#باید_برخاست#NousDevonsNousSoulever#MartyrKhamenei pic.twitter.com/8JemW4zW4A— Iran en France (@IRANinFRANCE) July 3, 2026ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అప్పటి నుంచి భద్రపరచిన భౌతికకాయాన్ని ఇప్పుడు ఆరు రోజుల పాటు జరిగే సంతాప కార్యక్రమాల కోసం ప్రజల సందర్శనార్థం ఉంచారు.టెహ్రాన్లోని గ్రాండ్ మోసల్లా వద్దకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గేట్లు తెరవగానే భారీ జనసంద్రం లోపలికి ప్రవేశించింది. అమెరికాకు వ్యతిరేక నినాదాలతో పాటు ప్రతీకారాన్ని సూచించే ఎరుపు రంగు జెండాలు ప్రదర్శించారు. మరోవైపు.. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హతమార్చాలని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని’’ వేలమంది నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.ఈ సంతాప కార్యక్రమానికి దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. భారత్ సహా రష్యా, పాకిస్థాన్, టర్కీ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం రెండు కోట్ల మంది వివిధ దశల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని అంచనా వేశారు. అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్లో సోమవారం వరకు ఉంచి, అనంతరం ఖోమ్కు తరలించనున్నారు. మంగళవారం కర్బలా, నజాఫ్ వంటి పవిత్ర నగరాల మీదుగా ప్రయాణించి, చివరగా గురువారం ఆయన స్వస్థలమైన మష్హద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఆరు రోజుల సంతాప యాత్రతో ఇరాన్ అంతటా శోక వాతావరణం కొనసాగుతోంది. Mohammad Bagher Ghalibaf cries during the farewell ceremony of Ali Khamenei. pic.twitter.com/i4DC5OgM2y— Raz Zimmt (@RZimmt) July 3, 2026 -
బలూచిస్థాన్లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం
క్వెట్టా/ఇస్లామాబాద్: పాకిస్థాన్ దక్షిణ పశ్చిమ రాష్ట్రం బలూచిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.శుక్రవారం ఉదయం క్వెట్టా నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న ఈ బస్సు షెరాని–జోబ్ హైవేపై దనసర్ ప్రాంతంలో అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.Very sad news 😢💔At least 40 killed, 8 injured as passenger bus falls into ravine near Balochistan-KP border.#Balochistan #Accident pic.twitter.com/N222P3v64y— Balochistan Ko Bachao (BKB) (@balochistankb) July 3, 2026బస్సు ఒవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మార్గమధ్యంలో మరో బస్సు చెడిపోవడంతో అక్కడి ప్రయాణికులను కూడా ఈ బస్సులోకి ఎక్కించారని వెల్లడించారు. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగడం.. బస్సు అదుపు తప్పి ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. షెరాని డిప్యూటీ కమిషనర్ హజ్రత్ వాలి కకర్ మాట్లాడుతూ, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నామని, మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (MERC) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 40 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఎనిమిది మందిని వెంటనే జోబ్ ట్రామా సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నీటి ప్రవాహంలో కాకుండా బండ రాళ్ల మీద బస్సు పడడంతో.. ప్రమాద తీవ్రత ఎక్కువగా నమోదైందని చెబుతున్నారు. ప్రమాద స్థలంలో ఆరు అంబులెన్సులు, 12 మంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పది లైట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహాయక చర్యల్లో వచ్చి చేరాయి. స్థానిక అధికారులతో పాటు సమీప ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంత రెస్క్యూ బృందాలు కూడా ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. -
అద్భుతమా!! గోల్డెన్ అవర్స్ ఎక్కడ పోయాయి?
వెనెజువెలాను వణికించిన జంట భూకంపాల విషాదంలో.. ఆశాకిరణంలా ఓ అద్భుతం చోటుచేసుకుంది. దాదాపు ఎనిమిది రోజుల తర్వాత అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశాయి. అంతే.. ప్రపంచ మీడియా వరుస కథనాలతో ఊదరగొడుతోంది. అయితే ఇక్కడే మరో ప్రశ్న కూడా బలంగా వినిపిస్తోంది. అతన్ని బయటకు తీయడానికి ఇన్నిరోజులు ఎందుకు పట్టింది? అని.. జూన్ 24న సంభవించిన 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలతో.. లా గ్వైరా స్టేట్లోని గ్యాలేరియాస్ ప్లాయా గ్రాండే షాపింగ్ మాల్ కుప్పకూలింది. ఆ శిథిలాల కింద చిక్కుకున్న 43 ఏళ్ల భద్రతా సిబ్బంది హెర్నాన్ అల్బెర్టో గిల్ ఫ్లోరెస్ను దాదాపు ఎనిమిది రోజుల తర్వాత అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశాయి. ఈ ఆలస్యంపై రెస్క్యూ బృందాలు వివరణ ఇచ్చుకున్నాయి. హెర్నాన్ గిల్ చిక్కుకున్న భద్రతా గది పూర్తిగా కూలిపోకపోవడంతో చిన్న గాలి ఖాళీ (ఎయిర్ పాకెట్) ఏర్పడింది. మూడు రోజుల ముందే అతడి ఆచూకీ గుర్తించిన సిబ్బంది చిన్న గొట్టాల ద్వారా నీరు, ఆహారం, ఆక్సిజన్ అందించారు. ఏడు దేశాలకు చెందిన నిపుణులు మూడు మీటర్లకు పైగా సొరంగం తవ్వి అత్యంత జాగ్రత్తగా అతడిని బయటకు తీశారు. మొత్తం ఆపరేషన్కు వంద గంటలకు పైగా సమయం పట్టింది. Hernán Gil, a 43-year-old security guard, survived eight days beneath a collapsed seven-story building in Catia La Mar, Venezuela. Rescuers from seven countries reached him after a three-day operation. The building came down in the country's twin earthquakes. pic.twitter.com/AMYODt8ia2— Open Source Intel (@Osint613) July 2, 2026అయితే ఈ రెస్క్యూ ఆలస్యానికి పలు కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. భూకంపాల తర్వాత వెనెజువెలాను వందల సంఖ్యలో ఆఫ్టర్షాక్స్ వణికిస్తూనే ఉన్నాయి. ఆ ధాటికి కుప్పకూలిన భవనాల శిథిలాలు నిరంతరం కదులుతూనే ఉన్నాయి. దీంతో భారీ యంత్రాలను వినియోగిస్తే శిథిలాలు మరింత కూలిపోయి లోపల చిక్కుకున్న వారి ప్రాణాలకు, రక్షక సిబ్బందికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండేది. అధికారిక లెక్కల ప్రకారం వెనెజువెలా భూకంపాల్లో.. 2,295 మంది మరణించగా, 11,267 మంది గాయపడ్డారు. ఇంకో 45 వేల మంది జాడ తెలియాల్సి ఉంది. సుమారు 58 వేల భవనాలు కుప్పకూలిపోయాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.👉భూకంపం తర్వాత తొలి 72 గంటలను ‘‘గోల్డెన్ పీరియడ్’’గా పరిగణిస్తారు. ఈ సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తే ప్రాణాలతో బయటపడే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. ఆ తర్వాత ఆహారం, నీరు, ఆక్సిజన్ కొరత, తీవ్ర గాయాల కారణంగా బతికే అవకాశాలు వేగంగా తగ్గిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎనిమిది రోజుల తర్వాత హెర్నాన్ గిల్ సజీవంగా బయటపడటం నిజంగా అద్భుతమే. అయితే అదే సమయంలో గోల్డెన్ పీరియడ్లోనే సహాయక చర్యలు మరింత వేగంగా జరిగి ఉంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు దక్కేవో? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ధ్వంసమైన రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, భారీ యంత్రాల కొరత, ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న వెనెజువెలా మౌలిక వసతుల బలహీనత కూడా సహాయక చర్యలను నెమ్మదింపజేశాయి. పైగా 1,600 మందికిపైగా విదేశీ రెస్క్యూ సిబ్బంది కాస్త ఆలస్యంగా వచ్చి చేరడంతో అప్పటి నుంచి సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. సహాయక చర్యల్లో.. ప్రభుత్వ స్పందనపై అసంతృప్తి కూడా పెరుగుతోంది. తొలి రోజుల్లో భారీ యంత్రాలు, సహాయక బృందాలు తగినంతగా అందుబాటులో లేవని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సహాయక సామగ్రి పంపిణీలో అవ్యవస్థలు చోటుచేసుకున్నాయని, భద్రతా సిబ్బంది దోపిడీలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవడంతో నలుగురు అధికారులను విధుల నుంచి తొలగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ సాయం ఆలస్యంగా చేరడం, ప్రభుత్వ సమన్వయం బలహీనంగా ఉండటం వల్ల రెస్క్యూ వేగం తగ్గిందని విమర్శలు కొనసాగుతున్నాయి. -
గాయపడ్డ శరీరాలు.. బాంబులకు బదులు బంతితో సమాధానం!
ప్రపంచమంతా ఫిఫా ప్రపంచకప్ ఉత్సాహంలో మునిగిపోయింది. స్టేడియాలు అభిమానుల సందడితో మారుమోగుతున్నాయి. కానీ గాజాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. కరెంట్ ఉండే కొద్దిసేపైనా టీవీ ముందు గుమిగూడటం.. ఇంటర్నెట్ సిగ్నల్ కోసం భవనాలపైకి ఎక్కడం.. బ్యాటరీని పొదుపుగా వాడుకుంటూ మ్యాచ్లు చూడటం అక్కడి ప్రజల దైనందిన దృశ్యం. అలాంటి యుద్ధ వాతావరణంలోనూ ఫుట్బాల్ మాత్రం వారికి కాసేపైనా భయాన్ని మరిచిపోయే ప్రపంచంగా మారింది.అయితే అక్కడి నుంచే ఇప్పుడు మరో ఫుట్బాల్ కథ ప్రపంచాన్ని కదిలిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో అవయవాలు కోల్పోయిన గాజా యువతులు.. ఇప్పుడు ఫుట్బాల్ మైదానంలో తమ జీవితానికి కొత్త అర్థం వెతుకుతున్నారు. పుట్టుకతోనే వైకల్యం ఉన్న అమ్మాయిలతో కలిసి పాలస్తీనాలో తొలి మహిళల అంప్యూటీ ఫుట్బాల్ జట్టుగా ఏర్పడి(amputee).. చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతి వారం.. డీర్ అల్-బలాహ్లో దాడుల్లో మిలిగిన కొద్దిపాటి గడ్డి మైదానంలో వారు సాధన చేస్తున్నారు. వారి లక్ష్యం ఒక్కటే.. ఒకరోజు ప్రపంచ వేదికపై పాలస్తీనా జెండాను ఎగురవేయడం.గాజా ఆరోగ్య శాఖ అంచనా ప్రకారం యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడ దాదాపు ఆరు వేల మంది అవయవాలు కోల్పోయారు. వీరందరికీ కృత్రిమ అవయవాలు, దీర్ఘకాలిక పునరావాసం అవసరమైంది. ఈ పరిస్థితుల్లోనే 2018లో స్థాపించబడిన పాలస్తీనా అంప్యూటీ ఫుట్బాల్ అసోసియేషన్ కొత్త ఆశాకిరణంగా మారింది. యుద్ధం తర్వాత వికలాంగుల సంఖ్య పెరగడంతో మహిళల జట్టులో చేరిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.‘‘మా మైదానాలు ధ్వంసమయ్యాయి. సామగ్రి లేదు. అయినా ఈ అమ్మాయిల సంకల్పమే మమ్మల్ని ముందుకు నడిపించింది" అని అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఫౌద్ అబూ ఘూలియన్ చెబుతున్నారు. ప్రపంచకప్ సందర్భంగా గాజా నుంచి వినిపించాల్సిన గొంతులు కూడా ఉన్నాయని, ముఖ్యంగా ఈ మహిళలు నిజమైన ఛాంపియన్లని ఆయన అంటున్నారు. 2027లో జరగనున్న మహిళల అంప్యూటీ ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనడమే తమ లక్ష్యమని వెల్లడించారు.24 ఏళ్ల రోజాన్ ఖైరా జీవితాన్ని మాత్రం యుద్ధమే ఒక్కసారిగా మార్చేసింది. 2023 నవంబరులో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కుటుంబ ఇంటిపై బాంబు పడటంతో ఆమె ఒక కాలును కోల్పోయింది. ఒకప్పుడు పరుగుపందేల్లో పతకాలు గెలిచిన ఆమెకు అది పెద్ద దెబ్బే. కానీ అదే సంఘటన ఆమె సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఇప్పుడు అంప్యూటీ ఫుట్బాల్ జట్టులో చేరి తన జీవితానికి కొత్త అర్థం వెతుక్కుంటోంది.గోల్కీపర్ ఐషా అల్ అబద్లా కథ మరింత హృదయవిదారకం. 2008 యుద్ధ సమయంలో ఆమె తల్లి తెల్ల భాస్వర(వైట్ పాస్పరస్) రసాయన ప్రభావానికి గురికావడంతో ఐషా ఒక చేయి పూర్తిగా అభివృద్ధి చెందకుండా జన్మించింది. అయినా దానిని ఆమె ఎప్పుడూ బలహీనతగా భావించలేదు. ఎనిమిదేళ్లుగా ఫుట్బాల్ ఆడుతున్న ఆమెకు ఆటే జీవితం. "మైదానంలోకి దిగితే యుద్ధానికి ముందు ఉన్న రోజులు గుర్తొస్తాయి. మా జీవితంలో ఆనందం మళ్లీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది" అని చెబుతోంది.అయితే వీరి పోరాటం మైదానంలోనే ముగియడం లేదు. చాలామందికి శరణార్థి శిబిరాల నుంచి సాధనకు రావడానికి ప్రయాణ ఖర్చులే భారంగా మారుతున్నాయి. ఆహార కొరత, పోషకాహార లోపం, క్రీడా సామగ్రి కొరత వంటి సమస్యలు ప్రతిరోజూ వెంటాడుతున్నాయి. అయినా "పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మా పట్టుదల మాత్రం తగ్గదు" అని రోజాన్ ధైర్యంగా చెబుతోంది.ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచకప్ను చూస్తుంటే... డీర్ అల్-బలాహ్లోని ఈ యువతులు కూడా వీలైనప్పుడల్లా ఆ మ్యాచ్లను చూస్తున్నారు. కానీ వారు కేవలం ప్రేక్షకులుగా ఉండాలని కోరుకోవడం లేదు. ఒకరోజు అదే ప్రపంచం తమ ఆటను కూడా చూడాలని... తమ గాయాలను కాదు, తమ గెలుపును గుర్తించాలని కలలు కంటున్నారు. యుద్ధం వారి అవయవాలను దూరం చేసినా... ఫుట్బాల్పై ప్రేమను, జీవితంపై ఆశను మాత్రం ఏ బాంబూ చెరిపేయలేకపోయింది. -
ఇరాన్-అమెరికా చర్చలు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంటోందా? తాజా చర్చల్లో తాము కోరుకున్న దాదాపు అన్ని అంశాలకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న పరోక్ష చర్చలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో ఇటీవల జరిగిన తాజా రౌండ్ చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్ మా ప్రభుత్వం కోరుకున్న దాదాపు అన్ని షరతులకు అంగీకరించినట్లు అనిపిస్తోంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇంకా తుది శాంతి ఒప్పందం దిశగా పరిస్థితి పూర్తిగా స్థిరపడలేదని కూడా ఆయన అంగీకరించారు.“మేము చర్చలు జరుపుతున్నాం. ఏమి జరుగుతుందో చూడాలి. నాకు అనిపిస్తోంది.. వారు మేము కోరిన దాదాపు అన్నింటికీ అంగీకరించారు” అని ట్రంప్ సీఎన్బీసీ(Trump CNBC Interview)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఇరాన్ సైనికంగా ఇప్పటికే బలహీనపడిందని, కొన్ని మిసైళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే వాటినీ లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని హెచ్చరించారు.“వారు డ్రోన్తో ఒక నౌకపై దాడి చేశారు. దానికి నేను ప్రతిస్పందనగా చర్య తీసుకున్నాను. గత వారంలో.. వరుసగా మూడు రాత్రులు, అంతకుముందు రెండు రాత్రులు తీవ్రంగా దాడులు చేశాం” అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి..ఇదిలా ఉంటే.. దోహాలో జరిగిన చర్చల్లో ఇరాన్ నిధుల విడుదల, హర్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా భద్రత వంటి కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే అణు కార్యక్రమం (Nuclear programme) అంశం ఈ దఫా చర్చల్లో చర్చకు రాలేదని రాయిటర్స్ కథనం వెల్లడించింది. అదే సమయంలో చర్చల్లో “సానుకూల పురోగతి” కనిపించిందని ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొనడం గమనార్హం. జూన్లో జరిగిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని ఈ చర్చలు ముందుకు సాగుతున్నాయి అని ఖతార్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. మరోవైపు.. వాషింగ్టన్ వర్గాలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి. అణు కార్యక్రమంపై చర్చలు తర్వాతి దశలోనే ప్రారంభమవుతాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.ఇప్పటికే అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తుల సమక్షంలో వేర్వేరు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం తదుపరి దశ చర్చలు జరిగే అవకాశం ఉందని ఖతార్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మొత్తంగా చూస్తే, ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గే దిశగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, అణు అంశంపై స్పష్టత రాకపోవడం వల్ల పరిస్థితి ఇంకా అనిశ్చితంగానే ఉంది. -
సీన్ రివర్స్.. ఇంధన దిగ్గజానికి భారత్ దన్ను!
ప్రపంచానికి చమురు, ఇంధనం ఎగుమతి చేసే దిగ్గజం.. ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంధన మౌలిక సదుపాయాలు, ఆయిల్ రిఫైనరీలు యుద్ధంలో తీవ్రంగా దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. జనాలు ఇంధనం కోసం కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు.. స్వదేశీ అవసరాలు తీర్చుకునేందుకు భారత్ను ఆశ్రయించే పరిస్థితికి చేరింది!. ఇది ప్రపంచ ఇంధన సమీకరణాల్లో అసాధారణ మార్పుగా కనిపిస్తోంది!.ఉక్రెయిన్ గత కొద్ది నెలలుగా రష్యాలోని కీలక ఆయిల్ రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు, రవాణా మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల కారణంగా అనేక రిఫైనరీల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఫలితంగా రష్యా వ్యాప్తంగా పెట్రోల్ కొరత, రేషన్ విధానం, పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు, ధరల పెరుగుదల వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఇప్పుడు ఇంధన సరఫరా కోసం భారత్ వైపు మళ్లింది.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే భారత్ నుంచి కనీసం 60 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ రష్యాకు సముద్ర మార్గంలో చేరింది. మరో రెండు ట్యాంకర్లు కూడా ఒక్కొక్కటి 30–40 వేల మెట్రిక్ టన్నుల ఇంధనంతో రష్యా వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సరఫరా ఏ భారతీయ రిఫైనరీ నుంచి వెళ్తోందన్నది మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.వేసవి కాలంలో రష్యాలో ఇంధన డిమాండ్ భారీగా ఉంటుంది. రోజుకు సుమారు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ అవసరం ఉంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో నెలకు దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని మాస్కో యోచిస్తోంది. ఇప్పటికే బెలారస్ కూడా రష్యాకు సహాయక సరఫరాలు పెంచింది. జూన్ మొదటి భాగంలోనే బెలారస్ నుంచి రైలుమార్గంలో 70 వేల మెట్రిక్ టన్నులకుపైగా పెట్రోల్ రష్యాకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.మరోవైపు భారత్–రష్యా ఇంధన వాణిజ్యం మాత్రం గత కొన్నినెలల్లోనే మరింత బలపడింది. ఉక్రెయిన్ యుద్ధం.. పశ్చిమ దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ధరల ఒత్తిడుల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు భారీగా కొనుగోలు చేస్తోంది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, భారత్ తన ఇంధన భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు కొనసాగించింది. భారత రిఫైనరీలు ఈ చమురును శుద్ధి చేసి దేశీయ అవసరాలకే కాకుండా ఇతర మార్కెట్లకు కూడా సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల బంధం మరింత బలపడింది.ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశంలో ఇంధన కొరతను అంగీకరించారు. ఉక్రెయిన్ దాడుల కారణంగానే కొన్ని ప్రాంతాల్లో సరఫరా సమస్యలు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దాడులు రష్యా సైనిక కార్యకలాపాలపై ప్రభావం చూపలేదని స్పష్టం చేస్తూ, ఇంధన మౌలిక సదుపాయాల రక్షణ కోసం వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.మరోవైపు భారత్–రష్యా మధ్య ఇంధన వాణిజ్యం గత కొద్ది నెలల్లో మరింత బలపడింది. హర్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడిచమురు దిగుమతి చేసింది. తక్కువ ధరలకు లభిస్తున్న రష్యా చమురును భారత రిఫైనరీలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండగా, ఇప్పుడు ఆ సరఫరా చైన్ కొత్త దశకు చేరినట్లు కనిపిస్తోంది.ఇలా ఒకప్పుడు ఇంధన ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న రష్యానే ఇప్పుడు భారత్పై ఆధారపడే పరిస్థితికి చేరడం అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ ప్రభావాలు, ఇంధన మార్కెట్ మార్పులపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. విశ్లేషకుల ప్రకారం, ఇది యుద్ధం తెచ్చిన ఆర్థిక సమీకరణాల “సీన్ రివర్స్” ఉదాహరణగా నిలుస్తోంది. అదే సమయంలో సంక్షోభ సమయంలో భాగస్వామ్య దేశానికి అండగా నిలుస్తూ భారత్ తన మిత్రధర్మాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
మరోసారి యుద్ధమా?.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్
ఒకవైపు ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతుండగా.. మరోవైపు వైట్హౌస్లో యుద్ధంపై అత్యంత కీలక సమావేశాలు జరిగాయి. ఇరాన్పై మరోసారి భారీ సైనిక దాడులు చేసి "ఈసారి కథ ముగించేయాలా?" అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత రక్షణాధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే చివరి క్షణంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్లు ఆ కథనం వెల్లడించింది.. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ట్రంప్ ఇటీవల రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్తో అధ్యక్ష భవనంలో పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఇరాన్తో కొనసాగుతున్న అణు చర్చలను విరమించి, మళ్లీ పెద్ద ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించాలా? అనే అంశంపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.అమెరికా రక్షణ వర్గాల్లోని కొంతమంది అధికారులు ఈ ఆపరేషన్ను ఫినిష్ ది జాబ్ "Finish the Job"గా అభివర్ణించినట్లు సమాచారం. గత సైనిక చర్యలతో ఇరాన్ సైనిక సామర్థ్యం దెబ్బతిన్న నేపథ్యంలో, మిగిలిన మౌలిక సదుపాయాలనూ పూర్తిగా ధ్వంసం చేసి యుద్ధానికి ముగింపు పలకాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తుది ఆమోదం ఇవ్వలేదు. ఇప్పుడే మరోసారి భారీ యుద్ధానికి వెళ్తే దౌత్య చర్చలు పూర్తిగా దెబ్బతింటాయని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని చర్చల ద్వారానే నియంత్రించడం మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చెప్పింది కూడా సబబేనని అధికారులు భావించినట్లు సదరు వార్తా కథనం పేర్కొంది.అయితే యుద్ధం పూర్తిగా తప్పిపోయిందని భావించే పరిస్థితి లేదని అమెరికా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించినా లేదంటే అమెరికా బలగాలపై దాడులకు పాల్పడినా, పరిమిత స్థాయి సైనిక దాడులు చేపట్టేందుకు ట్రంప్ సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మిలిటరీ ఆప్షన్ను పూర్తిగా పక్కన పెట్టలేదని అధికారులు చెబుతున్నారు.ఇదే సమయంలో ఖతార్ రాజధాని దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య మరో విడత పరోక్ష చర్చలు కూడా జరిగాయి. ఈ సమావేశాల్లో హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకాయానం పునరుద్ధరణ, ఇరాన్కు చెందిన సుమారు 6 బిలియన్ డాలర్ల ఫ్రీజ్డ్ నిధుల్లో కొంత భాగాన్ని విడుదల చేయడం, ఒప్పంద ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వంటి అంశాల్లో పురోగతి సాధించినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత వంటి ప్రధాన వివాదాలు మాత్రం ఇంకా పరిష్కారానికి రాలేదు.హర్ముజ్ జలసంధి ఇప్పటికీ ఇరు దేశాల మధ్య అతిపెద్ద వివాదంగా కొనసాగుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంపై అధిక నియంత్రణ కోరుతున్న ఇరాన్.. అంతర్జాతీయ నౌకాయానం ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగాలని అమెరికా పట్టుబడుతోంది. ఇదే అంశం భవిష్యత్ చర్చల్లోనూ కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుతం ట్రంప్ దౌత్య చర్చలకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, పరిస్థితులు మారితే మరోసారి భారీ సైనిక చర్యలకు వెనుకాడబోమనే సంకేతాలను కూడా ఇస్తున్నారు. దీంతో ఇరాన్-అమెరికా ఉద్రిక్తత తాత్కాలికంగా తగ్గినట్లే కనిపిస్తున్నా.. యుద్ధ మేఘాలు మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
‘‘అవసరమైతే ఇరాన్పై మళ్లీ దాడి’’.. నెతన్యాహు సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారాయని భావిస్తున్న వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రపంచం ఉలిక్కిపడే ప్రకటన చేశారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని.. అవసరమైతే మరోసారి ఇరాన్పై దాడులు చేసి తీరతామని అంటున్నారాయన. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరిక మరోసారి ఉద్రిక్తతలను పెంచేలా కనిపిస్తోంది.ఇజ్రాయెల్కు చెందిన ఛానల్–14కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఇప్పటివరకు విజయవంతమైందని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ నుంచి వస్తున్న అణుబాంబు ముప్పు నుంచి మేము మా దేశాన్ని కాపాడుకున్నాం. అవసరమైతే ఇంకోసారి కూడా దాడి చేస్తాం’’ అని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్న నెతన్యాహూ.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మరోసారి తేల్చిచెప్పారు.ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఖతార్ మధ్యవర్తిత్వంలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి యుద్ధం తర్వాత ఏర్పడిన కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్చల్లో ఆర్థిక ఆంక్షల సడలింపు, హర్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై పర్యవేక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి.ప్రతిపాదిత అవగాహన ప్రకారం.. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీనిపై సాంకేతిక స్థాయి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.'అమెరికా ఒప్పందానికి మేము కట్టుబడి ఉండం'అయితే అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగినా.. అది తమ భద్రతకు భంగం కలిగిస్తే ఇజ్రాయెల్ దానికి కట్టుబడి ఉండబోదని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక లేదంటే అణు సామర్థ్యం కొనసాగితే అవసరమైన చర్యలు స్వతంత్రంగా తీసుకుంటామని హెచ్చరించారు.ట్రంప్ సూచన.. 'జాగ్రత్తగా ఉండండి'ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ను సంయమనం పాటించాలని కోరుతూ వస్తున్నారు. మరోసారి భారీ స్థాయిలో దాడులు చేస్తే ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరిగా మారే ప్రమాదం ఉందని నెతన్యాహుకు సూచించినట్లు వెల్లడించారు. "బీబీ.. కాస్త జాగ్రత్తగా ఉండండి. లేకపోతే త్వరలోనే మీరు ఒంటరిగా మిగిలిపోతారు" అని తాను హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దౌత్య చర్చలు విజయవంతం కావాలంటే కొత్త సైనిక చర్యలకు దూరంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.లెబనాన్లోనూ వెనక్కి తగ్గేది లేఇరాన్పై హెచ్చరికలతో పాటు లెబనాన్ విషయంలోనూ నెతన్యాహు కఠిన వైఖరినే ప్రదర్శించారు. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ నియంత్రణ ప్రాంతాలను సందర్శించిన ఆయన.. హెజ్బొల్లాముప్పు పూర్తిగా తొలగే వరకు అక్కడి నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లదని ప్రకటించారు. ‘‘హెజ్బొల్లా ఆయుధాలతో అక్కడే ఉన్నంత కాలం.. మా బలగాలు కూడా అక్కడే ఉంటాయి. మా ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు" అని ఆయన స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. ఓ స్పష్టత అంటూ లేకుండా పోయింది. మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదమా?ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తుండగా.. మరోవైపు ఇజ్రాయెల్ అవసరమైతే మరోసారి సైనిక చర్యలకు సిద్ధమని స్పష్టం చేయడం మధ్యప్రాచ్యంలో కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో దౌత్య చర్చలు ఫలిస్తాయా? లేదంటే మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. -
ఒక దారి మూసుకుపోయింది.. ఇప్పుడు ప్లాన్-బీ రెడీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'బర్త్రైట్ సిటిజన్షిప్' నిర్ణయంపై అత్యున్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది. అయితే ట్రంప్ వెంటనే ప్లాన్-బీ అమల్లోకి తెచ్చారు. "కోర్టు అడ్డుకున్నా.. నేను ఆగను" అన్నట్లుగా కొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఇంతకీ దాన్ని అధిగమించేందుకు ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు?అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం కల్పించే 'బర్త్రైట్ సిటిజన్షిప్' (Birthright Citizenship) విధానాన్ని పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రయత్నాలకు అమెరికా సుప్రీంకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. అక్రమంగా లేదంటే తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీయుల పిల్లలకు కూడా పుట్టుకతోనే పౌరసత్వ హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆయన పెద్ద షాకే తలిగిందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడితో ఆగే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు."కోర్టు తీర్పు నిరాశ కలిగించినా.. నా దారి నాకుంది" అంటూ కొత్త వ్యూహాన్ని ప్రకటించారు. దీంతో ట్రంప్ తదుపరి అడుగు ఏంటన్న దానిపై అమెరికా రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship)పై కీలక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు, హక్కుల సంఘాలు కోర్టులో సవాల్ చేశాయి. దిగువ కోర్టులు ఇప్పటికే ఆ ఉత్తర్వును నిలిపివేయగా.. తాజాగా అమెరికా సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని సమర్థించింది.సుప్రీంకోర్టు ఏమంది?..ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6-3 మెజారిటీతో కీలక తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ (Fourteenth Amendment) ప్రకారం అమెరికా భూభాగంలో జన్మించిన దాదాపు ప్రతి వ్యక్తికీ పౌరసత్వ హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అక్రమంగా లేదంటే తాత్కాలికంగా అమెరికాలో ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు కూడా అమెరికా చట్టాల పరిధిలోనే ఉంటారని, అందువల్ల వారికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుందని కోర్టు పేర్కొంది. ఈ హక్కును తొలగించాలంటే కేవలం అధ్యక్ష ఉత్తర్వు సరిపోదని, రాజ్యాంగ పరమైన మార్పులు అవసరమనే విషయాన్ని కూడా తీర్పు స్పష్టం చేసింది.ట్రంప్ స్పందన ఏంటి?సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ఈ తీర్పు అమెరికాకు మంచిది కాదు. కానీ దీనిని కాంగ్రెస్లో చట్టం ద్వారా సులభంగా సరిచేయవచ్చు. రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కాంగ్రెస్ ఈ రోజే పని ప్రారంభించాలి. వారికి నా పూర్తి మద్దతు ఉంటుంది" అని పేర్కొన్నారు. జన్మహక్కు పౌరసత్వం వల్ల అమెరికాపై భారీ ఆర్థిక భారం పడుతోందని, ప్రస్తుత విధానం దేశానికి అన్యాయమని ఆయన మరోసారి వాదించారు.అంతేకాదు.. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. "చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు అభినందనలు" అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభించే ప్రస్తుత విధానం అక్రమ వలసలను, 'బర్త్ టూరిజం'ను ప్రోత్సహిస్తోందని ట్రంప్ మరోసారి ఆరోపించారు. ఈ తీర్పుతో చైనా సహా ఇతర దేశాల పౌరులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్య చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జస్టిస్ డిపార్ట్మెంట్ ఏమందంటే..సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ అక్రమంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు జరుగుతున్న 'బర్త్ టూరిజం' (ప్రసవం కోసం అమెరికాకు వెళ్లడం)పై చర్యలు కొనసాగుతాయని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది. చట్టంలోని లోపాలను ఉపయోగించుకుని పౌరసత్వం పొందేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఇక ముందు ఏం జరగొచ్చు?సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు అమలు దాదాపు నిలిచిపోయినట్లే. అయితే జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేసేలా కాంగ్రెస్లో కొత్త చట్టం తీసుకురావాలని ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. అయితే రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధంగా అలాంటి చట్టం నిలబడుతుందా? లేదంటే మళ్లీ కోర్టుల్లోనే నిలిచిపోతుందా? అన్నది ఇప్పుడు అమెరికా రాజకీయాలు, న్యాయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. -
వెనెజువెలా: పాపం వాళ్లు… శిథిలాల్లో ప్రాణాల కోసం పోరాటం!
ఒక దేశం నుంచి బలవంతంగా పంపించారు. పోనీలే.. స్వస్థలానికి చేరామన్న ఊపిరి కూడా తీసుకోకముందే ప్రకృతి రూపంలో వచ్చిన విధ్వంసం వారిని మింగేసింది. డిపోర్ట్ చేసిన కొద్ది గంటల్లోనే భారీ భూకంపం వారిని శిథిలాల కిందకి లాక్కెళ్లింది. కొందరు ప్రాణాలతో బయటపడగా.. వంద మందికి పైగా ఇప్పటికీ కనిపించకుండా పోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది.వెనెజువెలాను కుదిపేసిన జంట భూకంపాలు ఇప్పటివరకు కనీసం 1,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు. నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగెస్ ప్రకారం 5,034 మంది గాయపడ్డారు, ఇంకా వేలాది మంది ఆచూకీ లేని పరిస్థితి నెలకొంది. వారం గడిచినా.. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత బుధవారం సాయంత్రం 7.2 మరియు 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాలు.. దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతక విపత్తులుగా మారాయి. లా గ్వైరా సహా పలు ప్రాంతాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. భవనాలు కూలిపోవడంతో రోడ్లు, హోటళ్లు, నివాసాలు శిథిలాలుగా మారాయి. అయితే అప్పటి నుంచి ప్రకంపనలు ఆగకపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిదాకా 500కు పైగా ప్రకంపనలు(ఆఫర్ట్ షాక్స్) సంభవించినట్లు తెలుస్తోంది. ఈ విపత్తు సమయంలోనే అమెరికా నుంచి డిపోర్ట్ చేయబడిన 146 మంది వెనిజులా వలసదారులు దేశానికి చేరుకున్నారు. వారిని లా గ్వైరాలోని హోటల్లో తాత్కాలికంగా ఉంచగా, కొన్ని గంటల్లోనే అదే ప్రాంతాన్ని భూకంపం తీవ్రంగా దెబ్బతీసింది.డిపోర్టేషన్ తర్వాతే విధి పరీక్షడొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక.. వలస నియంత్రణ చర్యల్లో భాగంగా కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అక్రమ చొరబాటు దారులంటూ బేడీలు వేయించి మరీ యుద్ధ విమానాల్లో.. అత్యంత దయనీయమైన పరిస్థితుల నడుమ స్వస్థలాలకు పంపించి వేస్తున్నారు. అలా డిపోర్టేషన్ ఫ్లైట్లలో భాగంగా వచ్చిన ఈ వెనెజువెలా వలసదారులు, స్వదేశానికి తిరిగొచ్చిన వెంటనే ఈ విపత్తులో చిక్కుకున్నారు. ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా మానవతా చర్చకు దారితీస్తోంది.ఆ 100 మంది ఎక్కడ?హోటల్ శిథిలాల నుంచి కొందరు బయటపడగా, మరికొందరు ఐదు కిలోమీటర్ల దూరం నడిచి సహాయం కోరారు. కానీ 100 మందికి పైగా వలసదారుల ఆచూకీ ఇంకా తెలియకపోవడం ఆందోళన పెంచుతోంది. వాళ్లంతా ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని చెబుతున్న అధికారులు.. వాటిని తొలగించే పనిని కొనసాగిస్తున్నారు. లిస్బెత్ పోర్టిల్లో అనే శరణార్థి సహా కొందరు వలసదారులు శిథిలాల నుంచి బయటపడి ప్రాణాలతో తప్పించుకున్నారు. “చుట్టూ అరుపులు, పరుగులు, దుమ్ము… ఎవరూ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి. కొందరు దుస్తులు, మరికొందరు చెప్పుల్లేకుండా ప్రాణభయంతో పరుగులు తీశారు” అని ఆమె వివరించింది. రెండో అంతస్తులో ఉన్న గదిలోనే ఆమె శిథిలాల కింద ఇరుక్కున్నప్పటికీ అదృష్టవశాత్తు బయటపడింది. “నేను మళ్లీ పుట్టాను… దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చాడు” అంటూ ఆమె కన్నీళ్లతో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.మృతుల సంఖ్య పెరుగుతున్న భయంప్రభుత్వ లెక్కల ప్రకారం 1,719 మంది మరణించగా, 15,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇంకా వేలాది మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మరింత విషమించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి (UN) 10,000 బాడీ బ్యాగ్స్ పంపించాలని నిర్ణయించింది. 24 దేశాలు కలిసి 521 టన్నుల సహాయాన్ని పంపించాయి. 2,700కు పైగా రెస్క్యూ సిబ్బంది, 86 డాగ్ యూనిట్లు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అమెరికా కూడా తన సహాయాన్ని 300 మిలియన్ల డాలర్లకు పెంచింది. -
'ఆ చేతులు నరికేస్తాం'.. భారత్పై పాక్ ప్రేలాపనలు
భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం వివాదం మరింత ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఒప్పందాన్ని అమలులో నిలిపివేసిన భారత్పై పాకిస్థాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘పాక్కు రావాల్సిన నీటిని అడ్డుకునే చేతులను నరికేస్తాం’’ అంటూ ఆ దేశ మంత్రి ఒకరు హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. సింధు జలాల ఒప్పందం(Indus Water Treaty)పై పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి భారత్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇస్లామాబాద్లో ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్, పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ సోమవారం సంయుక్త పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో.. భారత్ తమ దేశానికి రావాల్సిన నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు."పొరుగు దేశ ప్రధాని తన చేతిలో ఉన్న కుళాయిని మూసేస్తానంటున్నారు. పాకిస్థాన్కు ఒక్క చుక్క నీళ్లు కూడా రానివ్వనని చెబుతున్నారు. మా వాటా నీటిపై ఎవరైనా చేయి వేస్తే.. ఆ చేతులను నరికేస్తాం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే సింధు జలాల ఒప్పందం ప్రకారం తమకు దక్కాల్సిన నీటి హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని స్పష్టం చేశారు.ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే: పాక్సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్ మాట్లాడుతూ.. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే అమల్లో ఉందన్నారు. ఒక దేశం ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం, సవరించడం లేదా నిలిపివేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం పాకిస్థాన్కు నీటిపై ఉన్న హక్కులు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా న్యాయ నిపుణులు, జలవనరుల నిపుణులతో ఇస్లామాబాద్లో అంతర్జాతీయ సదస్సు కూడా నిర్వహిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. భారత్ నిర్ణయానికి అంతర్జాతీయ మద్దతు లభించలేదని కూడా పాక్ అంటోంది.🚨 Water Gone. Threats On."Touch Our Water, We'll Cut Off Your Hand": Pakistan Minister Musadik Malik.Arre bhai, koi inko batao... pichhle 1.5 saal se paani hi band haiVideo: ARY news pic.twitter.com/Kc1d2JxCN4— OsintTV 📺 (@OsintTV) June 29, 2026పహల్గామ్ తర్వాత.. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చెనాబ్ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని చెబుతున్న భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా ముగింపు పలికే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే భారత్వ వాదనను పాకిస్థాన్ ఖండించింది.యుద్ధ హెచ్చరికలు కూడా..సింధు జలాల వివాదంపై ఇప్పటికే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. నీటి భద్రత తమ జాతీయ భద్రతలో భాగమని, దానికి ముప్పు ఏర్పడితే భారత్పై యుద్ధానికి కూడా వెనుకాడబోమని వ్యాఖ్యానించారు. తాజా ప్రకటనలతో పాకిస్థాన్ మరోసారి అదే వైఖరిని కొనసాగించింది.భారత్ ఏమంటోంది?అయితే భారత్ మాత్రం పాక్ ప్రేలాపనలు పట్టించుకోవడం లేదు. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత ప్రతినిధి అనుపమా సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంలో భాగంగా ఉపయోగించే దేశం సహకార ఒప్పందాల ప్రయోజనాలు కోరడం తార్కికం కాదన్నారు. 1960లో కుదిరిన ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అతీతంగా శాశ్వత హక్కుగా పరిగణించలేమని ఆమె స్పష్టం చేశారు. గత ఆరు దశాబ్దాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అందుకే సింధు జలాల ఒప్పందాన్ని కూడా ప్రస్తుత వాస్తవాలకు అనుగుణంగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అలాగే జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించిన భారత్, అంతర్జాతీయ వేదికలను ఉపయోగించి పాకిస్థాన్ ఉగ్రవాదం, అంతర్గత సమస్యల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.మరోసారి మాటల యుద్ధంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక ఉద్రిక్తతలు పెరిగిన వేళ.. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం కూడా మరో ప్రధాన వివాదంగా మారింది. ఒకవైపు పాకిస్థాన్ యుద్ధ హెచ్చరికలు, మరోవైపు ఉగ్రవాదం కొనసాగినంత కాలం సహకారం ఉండదన్న భారత్ వైఖరితో.. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమవుతోంది. పరిస్థితి ఎలా మారుతుందన్నది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. -
అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ట్రంప్కు భారీ బూస్ట్
అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వతంత్ర ఫెడరల్ ఏజెన్సీల అధిపతులను ఎలాంటి కారణం చెప్పుకుండానే తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. 91 ఏళ్ల నాటి కీలక న్యాయసూత్రాన్ని పక్కనబెట్టింది. తద్వారా అమెరికా అధ్యక్షుడి అధికారాలను గణనీయంగా విస్తరించేందుకు మార్గం సుగమం చేసింది. అదే సమయంలో.. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతకు మాత్రం రక్షణ కల్పించింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో గవర్నర్ లీసా కుక్ను వెంటనే తొలగించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు వేసింది. ఈ రెండు తీర్పులు కలిసి అమెరికాలో అధ్యక్షుడి అధికారాలు, కేంద్ర బ్యాంకు స్వతంత్రతపై కొత్త చర్చకు తెరలేపాయి.స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం ఈ తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష అధికారాలకు సంబంధించిన అత్యంత కీలక తీర్పుల్లో ఇదొకటని పేర్కొన్నారు. అయితే లీసా కుక్ కేసులో సాంకేతిక కారణాలతో మాత్రమే తీర్పు వచ్చిందని, ఆమెపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని సోషల్ మీడియాలో వెల్లడించారు.దశాబ్దాల.. న్యాయసూత్రానికి ముగింపుఫెడరల్ ఏజెన్సీల అధిపతుల్ని తొలగించే కేసులో.. 6-3 మెజారిటీతో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 1935లో వచ్చిన హంపేరీస్ ఎగ్జిక్యూటర్ Humphrey's Executor తీర్పును రద్దు చేసింది. ఆ తీర్పు ప్రకారం ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) వంటి స్వతంత్ర సంస్థల సభ్యులను అధ్యక్షుడు విధానపరమైన విభేదాల కారణంగా తొలగించలేడు. ఇప్పుడు ఆ పరిమితిని తొలగిస్తూ.. అలాంటి రక్షణలు రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. దీంతో అధ్యక్షుడికి స్వతంత్ర ఫెడరల్ సంస్థలపై మరింత నియంత్రణ లభించినట్టైంది. ఏయే సంస్థలపై ప్రభావం?ఈ తీర్పు ప్రభావం కేవలం ఫెడరల్ ట్రేడ్ కమిషన్కే పరిమితం కాదు. నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ (NLRB), మెరిట్ సిస్టమ్స్ ప్రొటెక్షన్ బోర్డ్, కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ వంటి అనేక స్వతంత్ర సంస్థల బోర్డు సభ్యులను కూడా అధ్యక్షుడు అవసరమైతే పదవి నుంచి తొలగించే అవకాశం ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో వైట్హౌస్ ప్రభావం ఈ సంస్థలపై మరింత పెరిగే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఫెడరల్ రిజర్వ్కు మాత్రం.. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా భావించే ఫెడరల్ రిజర్వ్ విషయంలో సుప్రీంకోర్టు భిన్నమైన వైఖరి తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్ ఫెడ్ గవర్నర్ లీసా కుక్ను వెంటనే తొలగించాలన్న అభ్యర్థనను 5-4 మెజారిటీతో తిరస్కరించింది. చట్టం కల్పించిన విధివిధానాలు పాటించకుండా ఆమెను తొలగించలేరని స్పష్టం చేసింది. కేసు పూర్తయ్యే వరకు లీసా కుక్ పదవిలో కొనసాగవచ్చని ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ తన తీర్పులో ఫెడరల్ రిజర్వ్ చరిత్రను ప్రస్తావిస్తూ.. ఈ సంస్థ రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రత్యేక రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. అధ్యక్షుడి ఇష్టానుసారంగా గవర్నర్లను తొలగించే అవకాశం ఉంటే, వడ్డీ రేట్లపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. లీసా కుక్పై ఆరోపణలు ఏమిటి?2025 ఆగస్టులో ట్రంప్, లీసా కుక్పై మార్ట్గేజ్ మోసం ఆరోపణలు చేస్తూ ఆమెను తొలగించే ఉత్తర్వులు జారీ చేశారు. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లోని రెండు ఇళ్లను ఒకేసారి ప్రధాన నివాసంగా చూపించి గృహ రుణాల్లో అక్రమ ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. అయితే ఇవి నిరూపితం కాని ఆరోపణలేనని, అసలు ఉద్దేశం తనను వడ్డీ విధానంపై రాజకీయ ఒత్తిడికి లోను చేయడమేనని లీసా కుక్ ఆరోపించారు. తనపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని కూడా స్పష్టం చేశారు.ట్రంప్ లక్ష్యం వేరే.. తన రెండో అధ్యక్ష పదవీకాలం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ వడ్డీ రేట్లు వేగంగా తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్లతో ప్రభుత్వ రుణభారం తగ్గడమే కాకుండా, గృహ, వాహన రుణాలు కూడా చౌకవుతాయని ఆయన వాదిస్తున్నారు. కానీ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ విభేదాల నేపథ్యంలోనే కుక్, అలాగే మాజీ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి పెంచిందని విమర్శలు వచ్చాయి. పావెల్పై దర్యాప్తు కూడా..ఫెడరల్ రిజర్వ్ మాజీ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై కూడా ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఫెడ్ ప్రధాన కార్యాలయ భవనాల పునరుద్ధరణ వ్యయాల పేరుతో విచారణ చేపట్టినా, అది వడ్డీ రేట్లపై ప్రభావం చూపేందుకు చేసిన ప్రయత్నమేనని పావెల్ ఆరోపించారు. అనంతరం కోర్టు జోక్యంతో ఆ విచారణ నిలిచిపోయి, చివరకు అమెరికా న్యాయశాఖ దానిని ఉపసంహరించుకుంది.ఒకవైపు అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలను మరింత బలోపేతం చేస్తూనే, మరోవైపు ఫెడరల్ రిజర్వ్ వంటి అత్యంత కీలక ఆర్థిక సంస్థ రాజకీయ జోక్యానికి గురికాకుండా రక్షణ కల్పించింది. అమెరికా సుప్రీం కోర్టు వెల్లడించిన ఈ రెండు తీర్పులు.. అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్నారు. అధ్యక్ష అధికారాలు ఎంతవరకు ఉండాలి? స్వతంత్ర సంస్థల స్వేచ్ఛ ఎంతవరకు కాపాడాలి? అనే చర్చలకు ఈ తీర్పు కొత్త దిశ చూపిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
15 ఏళ్ల డాలర్ బంధానికి ముగింపు!
ఒక దేశపు కరెన్సీ విలువను మరో దేశపు కరెన్సీతో స్థిరంగా అనుసంధానించి ఉంచడం.. ఆ తర్వాత ఆ బంధాన్ని తెంచుకోవడం సాధారణ నిర్ణయం కాదు. అలాంటి కీలక అడుగే ఇప్పుడు బొలీవియా వేసింది. 15 ఏళ్లుగా కొనసాగిన డాలర్ పెగ్ విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? డాలర్ పెగ్ను వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మార్పు బొలీవియా ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేయనుంది? పరిశీలిస్తే..సాధారణంగా ఒక దేశ కరెన్సీ విలువ మార్కెట్లో డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువను అమెరికన్ డాలర్కు స్థిరంగా కట్టిపెడతాయి. దీనినే "డాలర్ పెగ్" అంటారు. బొలీవియా కూడా గత 15 ఏళ్లుగా తన కరెన్సీ అయిన "బొలివియానో" విలువను డాలర్తో స్థిరంగా కొనసాగించింది. మార్కెట్లో పరిస్థితులు ఎలా మారినా.. ఒక నిర్దిష్ట మారకపు రేటును ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. ఇందుకోసం భారీ మొత్తంలో డాలర్ నిల్వలు అవసరమవుతాయి.సడన్గా ఎందుకు?..ఇటీవలి కాలంలో బొలీవియా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దేశ విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంధన దిగుమతులు, విదేశీ చెల్లింపుల కోసం అవసరమైన డాలర్లను సమకూర్చడం ప్రభుత్వానికి భారంగా మారింది. మరోవైపు మార్కెట్లో డాలర్ల కొరత తీవ్రమైంది. అధికారిక మారకపు రేటు ఒకలా ఉండగా, బ్లాక్ మార్కెట్లో డాలర్ ధర మరింత ఎక్కువగా పలుకుతోంది. దీంతో ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి బ్లాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో పాత విధానాన్ని కొనసాగించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావించింది.ఇకపై..డాలర్ పెగ్ విధానాన్ని రద్దు చేయడంతో ఇకపై బొలీవియా కరెన్సీ విలువ మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది. అంటే డిమాండ్, సరఫరా ఆధారంగా కరెన్సీ విలువ పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు. ఈ నిర్ణయం తర్వాత బొలివియానో విలువ గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దీని ప్రభావంగా.. దిగుమతి వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో కరెన్సీ నిజమైన మార్కెట్ విలువను ప్రతిబింబించడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరికొన్ని దేశాలు..బొలీవియా నిర్ణయం ప్రపంచానికి కొత్తేమీ కాదు. గతంలో అనేక దేశాలు డాలర్తో ఉన్న స్థిర అనుబంధాన్ని వదిలేశాయి. దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనా 1990లలో తన కరెన్సీ పెసోను డాలర్కు 1:1 నిష్పత్తిలో కట్టిపెట్టింది. కానీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా 2002లో ఆ విధానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం అర్జెంటీనా కరెన్సీ భారీగా విలువ కోల్పోయింది. అలాగే కజకిస్తాన్ 2015లో, ఈజిప్ట్ 2016లో తమ కరెన్సీలను మార్కెట్ ఆధారిత విధానానికి మార్చాయి. నైజీరియా కూడా గత కొన్నేళ్లుగా విదేశీ మారక సంక్షోభం నేపథ్యంలో కరెన్సీపై నియంత్రణలను సడలిస్తోంది.అయితే మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్ వంటి దేశాలు ఇప్పటికీ డాలర్ పెగ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దేశాల వద్ద భారీ విదేశీ మారక నిల్వలు ఉండటం ఇందుకు ప్రధాన కారణం.ఒక దేశం తన కరెన్సీని డాలర్కు కట్టిపెట్టడం ఎంత కష్టమో, ఆ బంధాన్ని తెంచుకోవడం కూడా అంతే కీలక నిర్ణయం. బొలీవియా తీసుకున్న తాజా నిర్ణయం ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో చెబుతూనే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యం, కరెన్సీ విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది.భారత్ డాలర్ పెగ్ విధానాన్ని అనుసరించదు. మన కరెన్సీ రూపాయి 'మేనేజ్డ్ ఫ్లోట్' విధానంలో ఉండటంతో.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాని విలువ మారుతుంటుంది. అయితే రూపాయిలో తీవ్ర ఒడిదొడుకులు రాకుండా అవసరమైనప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. -
పాక్ దొంగ బుద్ధి.. డబుల్ ట్యాప్ వ్యూహం!
పాకిస్తాన్ కపట దాడులతో.. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు మరోసారి నెత్తురోడింది. అర్ధరాత్రి వేళ.. జనావాసాలు, మసీదులపై మొదటిసారి దాడులు జరగగా.. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనూ.. పాక్ అనైతికంగా మరోసారి మెరుపు దాడులు జరిపింది. ఈ ఘటనల్లో కనీసం 35 మంది మరణించారని, వాళ్లంతా నిషేధిత సంస్థకు చెందిన వ్యక్తులని పాక్ ప్రకటించుకుంది. అయితే ఆఫ్ఘన్ అధికారులు మాత్రం మృతుల్లో ఎక్కువ మంది అమాయక ప్రజలే ఉన్నారని చెబుతున్నారు.పక్తికా, పక్తియా, కునార్ ప్రాంతాల్లో పాకిస్తాన్ వైమానిక దళం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో దాడులు ప్రారంభించినట్లు సమాచారం. 25 నిమిషాల వ్యవధిలోనే అదే ప్రాంతాల్లో రెండో దశ దాడులు జరిగినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. వివాదాస్పదంగా భావించే “డబుల్ ట్యాప్” వ్యూహం ఈ దాడుల్లో అమలయ్యిందన్న ఆరోపణలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. మొదటి దాడుల తర్వాత సహాయక చర్యలకు వెళ్లిన వాళ్లపైనా రెండోసారి మెరుపు దాడి జరిగింది. ఈ ఘటనలతో మరణాల సంఖ్య పెరిగిందని, గాయపడిన వారి సంఖ్య వందకు పైగా చేరిందని తెలుస్తోంది.Pakistani airstrikes reportedly hit civilian areas in Afghanistan’s Paktia, Paktika, and Kunar provinces, killing more than 40 people—including women and children—and injuring dozens more. Reports describe it as one of the deadliest cross-border attacks in recent years pic.twitter.com/08pAHmtsKk— Israel Army (@Israeldefences) June 29, 2026పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చర్యలను ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా చేసిన “ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్లు”గా సమర్థించుకుంటోంది. దేశంలో ఇటీవల జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ సైనిక చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా టీపీపీ అనుబంధ గ్రూపులపై చర్యల భాగంగా ఈ దాడులు జరిగినట్లు పాకిస్తాన్ వాదిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. పౌర ప్రాంతాలు, ఇళ్లు, మసీదులే లక్ష్యంగా మారాయని, మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని కాబూల్ అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ చేసిన చర్యలను “అక్రమ దాడులు”గా అభివర్ణిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.2021 తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. తరచూ సరిహద్దు ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు కొనసాగుతుండటంతో ప్రాంతంలో అస్థిరత నెలకొంది. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు కూడా పూర్తిగా నిలబడలేకపోయాయి. తాజా దాడులతో సరిహద్దు గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇల్లీగల్ కాదా?.. “డబుల్ ట్యాప్” అనే సైనిక వ్యూహాన్ని అంతర్జాతీయ చర్చల్లో చాలాసార్లు అత్యంత వివాదాస్పదమైన, మానవతా పరంగా తీవ్రంగా విమర్శించబడే పద్ధతిగా పేర్కొంటారు. సాధారణంగా మొదటి దాడి తర్వాత సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు చేరుకునే సమయంలో అదే ప్రాంతంపై రెండోసారి దాడి చేయడాన్ని డబుల్ ట్యాప్ దాడులంటారు. మానవ హక్కుల సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నాయి. అయితే..ఇది అధికారిక అంతర్జాతీయ చట్టాల్లో ప్రత్యేకంగా “illegal by name”గా నిర్వచించబడకపోయినా.. పౌరుల భద్రత, యుద్ధ నిబంధనలు, జెనీవా కన్వెన్షన్ స్పిరిట్కు విరుద్ధమనే విమర్శలు బలంగా వినిపిస్తాయి. గతంలో కూడా ఇలాంటి వ్యూహాలపై ఆరోపణలు వివిధ యుద్ధాల సమయంలోనూ వినిపించాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ సరిహద్దు ఘటనల్లో కూడా అదే తరహా “డబుల్ ట్యాప్” వ్యూహం ఉపయోగించారన్న ఆరోపణలు రావడంతో, ఇది మళ్లీ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. -
'ఇరాన్ను లేకుండా చేస్తాం'.. 'నరకం చూపిస్తాం'!
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే.. ఇరు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్పై దాడి జరిగిందని ఆరోపిస్తూ అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిగా అమెరికా గల్ఫ్ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న పనామా జెండా కలిగిన కికు (KIKU) అనే చమురు ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్తో దాడి చేసిందని అమెరికా ఆరోపించింది. సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును తీసుకెళ్తున్న ఈ నౌక దెబ్బతిన్నప్పటికీ సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. దీనికి ప్రతిగా అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్లోని 10 కీలక సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, సముద్ర మైన్లను మోహరించే సామర్థ్యాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇచ్చినా.. ఇరాన్ మళ్లీ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపించింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇరాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ఆయన, అవసరమైతే అమెరికా యుద్ధాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే దేశమే ఇక ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ పూర్తిగా తమదేనని మరోసారి స్పష్టం చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ.. తమ నిబంధనలను ఉల్లంఘించే నౌకలు ఉద్రిక్తతలకు కారణమవుతాయని హెచ్చరించారు. అదే సమయంలో, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే నరకాన్ని అనుభవిస్తాయి అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నేవీ కమాండర్ హెచ్చరించారు. మరోవైపు పశ్చిమాసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బహ్రెయిన్లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే కువైట్ సైన్యం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంటున్నాయని తెలిపింది. గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.అయితే తీవ్ర సైనిక ఉద్రిక్తతల మధ్య కూడా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్లో శాంతి చర్చలపై అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ దాడులతో.. 60 రోజుల వ్యవధిలో శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. అయితే.. మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, పాకిస్తాన్ల విజ్ఞప్తితో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు చర్చలకు ముందుకొచ్చినట్లు సమాచారం అందుతోంది. మంగళవారం లేదంటే ఈ వారంలోనే దోహాలో సమావేశమై హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర భద్రత, కాల్పుల విరమణ అమలుపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సఫలమైతే ప్రాంతంలో యుద్ధ ముప్పు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. మరోవైపు ఇరు దేశాల నుంచి వస్తున్న హెచ్చరికలు మధ్యప్రాచ్యాన్ని మరోసారి అగ్నిగుండంలా మార్చే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. -
పగలు నర్సు.. రాత్రైతే నరమాంస భక్షకుడు!
పగలంతా ఆస్పత్రిలో తెల్ల కోటు వేసుకుని రోగులకు సేవలు.. రాత్రి ఇంటికొచ్చాక మాత్రం మనిషి ఊహించలేని భయానక ప్రపంచం!. మానవ అవయవాలను సేకరించడం.. ఇంట్లో దాచుకోవడం.. వాటితో వింత ప్రయోగాలు చేయడం.. చివరకు వాటిలో కొన్నింటిని తానే తిన్నానని పోలీసుల ఎదుట ఒప్పుకోవడం!. ఇదెదో డబ్బింగ్ సినిమా కథ అనుకునేరు!. ఒక ఆస్పత్రి ఉద్యోగి గురించి బయటపడిన ఈ నిజాలు పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేశాయి. అతడి ఇంట్లో కనిపించిన దృశ్యాలు హారర్ సినిమాలను తలపించగా.. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.ఆస్పత్రిలో పేషెంట్ ట్రాన్స్పోర్టర్ (రోగులను తరలించే ఉద్యోగి)గా పని చేసే ఉద్యోగి(30) చీకటి కోణం షాక్కు గురి చేస్తోంది. మానవ అవశేషాలను అక్రమంగా సేకరించడం, వాటిని తన ఇంట్లో నిల్వ చేయడం, చివరకు.. వాటిని వండుకోకుండా పచ్చిగా తీసేశాడన్న అనుమానాలతో పోలీసులు సోదాలు జరిపారు. తనిఖీల్లో దాదాపుగా అవే నిజాలని తెలిసి నిర్ఘాంత పోయారు. చివరకు.. అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో వెలుగుచూసింది.సోదాల్లో అతడి ఇంట్లో కనిపించిన దృశ్యాలు అధికారులను సైతం విస్మయానికి గురిచేశాయి. మనిషి తల, ముఖం మీది చర్మం, కాలు భాగం, మెదడు, చేయి, పలు పుర్రెలు, ఎముకలు, సూట్కేసులో దాచిన అస్థిపంజర భాగాలు.. ఇవన్నీ ఒక ఎత్తయితే ఒక జాడీలో భద్రపరిచిన గుండె పోలీసులకు మాట పడిపోయేలా చేసింది.( ఆ గుండె మనిషిదేనా? లేక జంతువుదా? అనేది ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలాల్సి ఉంది)!.జూన్ 17వ తేదీన అతన్ని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయగా.. 23న ఆ విషయం బయటకు వచ్చింది. విచారణలో నిందితుడు.. మానవ శరీర భాగాలపై తనకు అమితమైన ఆసక్తి ఉందని.. అందుకే కొన్నింటిని శరీరాల నుంచి తానే వేరుచేసి తిన్నానని అంగీకరించాడు. శరీర నిర్మాణ శాస్త్రం (అనాటమీ), పాథాలజీపై అతడికి విపరీతమైన ఆసక్తి ఉండేదని, జంతువులను కోసి పరిశీలించడం కూడా అతడి హాబీగా మారిందని పోలీసులు వెల్లడించారు.దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. అతడు పనిచేసే ఆస్పత్రి నుంచి, అలాగే హంగేరీ, పొరుగు దేశమైన స్లోవేకియాలోని శ్మశాన వాటికల నుంచి అనాథ శవాల అవశేషాలను దొంగిలించాడని పోలీసులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న అవయవాలు ఎవరివి? వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.ఈ కేసులో భాగంగా నిందితుడి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర స్టోరేజ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. అయితే తన ఎముకల సేకరణ గురించి మాత్రం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా బహిరంగంగా మాట్లాడేవాడని, వాటి ఫొటోలు తీసి భద్రపరచేవాడని అధికారులు వెల్లడించారు. అయితే అతన్ని పట్టించిన టిప్ గురించి మాత్రం పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.మరిన్ని కేసులు..ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. సమాధుల నుంచి మృతదేహాలను ఎలా బయటకు తీశాడు? ఆస్పత్రి నుంచి మృతదేహాల అవశేషాలను ఎలా ఎత్తుకు రాగలిగాడు? అతనికి ఎవరైనా సహకరించారా? నరమాంస భక్షణలో ఇంకా ఎవరైనా పార్టనర్లు ఉన్నారా?.. ఇలా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత నిందితుడిపై మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉందని హంగేరీ దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. -
షాకింగ్: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రనేతలు?!
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ కార్యక్రమంలో లష్కర్-ఎ-తోయిబా (LeT) కీలక నేతలు, అందునా 2025 పహల్గామ్ దాడి అనుమానిత కీలక సూత్రధారి సైఫుల్లా కసూరి సహా పలువురు హాజరైనట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.Ex Cricketer Shoaib Akhtar's Brother died of heart attack!Shahid Akhtar's funeral was attended by PMML Islamabad President Inam ur Rehman Kamboh and other LeT terrorists.PMML serves as a proxy for LeT. Why Were LeT Leaders/Terrorists There? pic.twitter.com/ldJiocolCl— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2026సైఫుల్లా కసూరి గతంలో భారత్పై పలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 26/11 తరహా దాడుల గురించి, సముద్ర మార్గ దాడుల గురించి అతను చేసిన వ్యాఖ్యలు భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగించాయి. పహల్గామ్ దాడికి ఇతనే సూత్రధారి అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు సైతం బలంగా ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలతో అతని కార్యకలాపాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. ఎల్ఈటీకి రాజకీయ ముఖచిత్రంగా భావించే పాకిస్తాన్ మార్కాజీ ముస్లిం లీగ్ (PMML) ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.జూన్ 24న గుండెపోటుతో అక్తర్ సోదరుడు మరణించారు. ఆయన కూడా మాజీ క్రికెటరే. గురువారం ఇస్లామాబాద్లోని హెచ్-8 గ్రేవ్యార్డ్లో అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో ప్రార్థనల సమయంలోనే వాళ్లంతా అక్కడ హల్చల్ చేశారు. అయితే.. క్రికెట్లో రావల్పిండి ఎక్స్ప్రెస్గా పేరున్న షోయబ్ అక్తర్.. భారత్ను ద్వేషించేలా మాట్లాడరు!. కానీ దాయాదుల పోరు సందర్భాల్లో ఎమోషనల్, ఫైర్డ్ కామెంట్స్ చేస్తారు. అదే సమయంలో భారత క్రికెట్ సిస్టమ్ను చాలాసార్లు ఓపెన్గా ప్రశంసించారు కూడా. అయితే షోయబ్ అక్తర్కు వాళ్లకు సంబంధాలు ఉన్నాయా? లేదంటే షాహిద్ అక్తర్కు వాళ్లు దగ్గరా?.. ఇప్పటివరకు షోయబ్ అక్తర్ నుంచిగానీ.. ఆయన కుటుంబం నుంచి ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు. Prominent figures and terrorists linked to Lashkar-e-Taiba (LeT) openly attended the funeral of Shahid Akhtar, the elder brother of former Pakistani cricketer Shoaib Akhtar, in Islamabad. pic.twitter.com/Src3ftlmf1— Vyom Pallav 🇮🇳 (@VyomPallav) June 27, 2026అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం లేదంటే స్థానిక భద్రతా సంస్థల నుంచి కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాధిక్ కూడా అంత్యక్రియలకు హాజరు కావడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిషేధిత సంస్థల నేతల వీడియోలు వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సాధారణంగా అత్యంత రహస్యంగా, నీడల్లో కనిపించే ఈ నెట్వర్క్ సభ్యులు ఓ పబ్లిక్ ఈవెంట్లో ఇలా ప్రత్యక్షమవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో నిషేధాలు ఉన్నప్పటికీ ఈ ఉగ్రసంస్థలు పాక్లో రాజకీయ ముసుగులో కొనసాగుతున్నాయా? అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ సంఘటన పాకిస్తాన్లో ఉగ్ర నెట్వర్క్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.భారత్ గతంలో చేపట్టిన చర్యలు, సరిహద్దు భద్రతా చర్యల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు మరింత సున్నితంగా మారాయి. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ భద్రతా సమీకరణాల్లో ఈ ఘటన కొత్త చర్చకు దారి తీసింది. పరిశీలకులు మాత్రం.. నిషేధిత సంస్థలు పూర్తిగా కనుమరుగుకాకుండా “పాలిటికల్ షెల్టర్” లేదా “ఫ్రంట్ ఆర్గనైజేషన్స్” ద్వారా కొనసాగుతున్న అవకాశం ఉందని అంటున్నారు.LeT నెట్వర్క్ నేపథ్యంలష్కర్-ఎ-తోయిబా అనేది 1990ల చివర్లో ఏర్పడిన ఉగ్ర సంస్థగా గుర్తింపు పొందింది. భారత్లో 2008 ముంబై దాడులు సహా పలు భారీ దాడుల్లో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయంగా ఇది నిషేధిత ఉగ్ర సంస్థగా గుర్తించబడింది. సైఫుల్లా కసూరి వంటి నేతలు ఈ సంస్థలో కీలక కమాండ్ స్థాయిలో ఉన్నారని భద్రతా విశ్లేషణలు చెబుతున్నాయి. -
వెనెజువెలా విలయం.. 50 వేల మంది ఆచూకీ గల్లంతు!
వెనెజువెలాను వణికించిన జంట భూకంపాల విధ్వంసం రోజురోజుకూ భయానకంగా మారుతోంది. నాలుగు రోజులు గడిచినా శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో వరుస ఆఫ్టర్షాక్లు(వరుస ప్రకంపనలు.. తాజాగా 4.9 తీవ్రత) నమోదవుతుండటంతో బాధితుల్లో భయం మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 920కి చేరగా, మరో 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.బుధవారం సాయంత్రం కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో.. రిక్టర్స్కేల్పై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన రెండు భారీ భూకంపాలు ఉత్తర వెనెజువెలాను అతలాకుతలం చేశాయి. రాజధాని కారకాస్ సమీపంలోని తీరప్రాంత నగరం లా గ్వైరా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. భారీ అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. అనేక ప్రాంతాల్లో శిథిలాల కిందే వందలాది మంది చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు.సహాయక చర్యలు మాత్రం ఆశించిన వేగంతో సాగడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల భారీ యంత్రాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు, వాలంటీర్లే చేతులతో శిథిలాలను తొలగిస్తూ తమ ఆత్మీయుల కోసం వెతుకుతున్నారు. ఐదు నెలల చిన్నారి గల్లంతైందంటూ ఓ తల్లి కన్నీరుమున్నీరవుతుండగా, ప్రభుత్వ సహాయం కనిపించడం లేదంటూ మరో బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.‼️🚨🆘😭😭😭 Estos verdaderos héroes de #Venezuela, están dando su vida por salvar otras vidas. Sin cascos, sin implementos, con las uñas, dando una palabra de aliento. Tanta valentía y bondad por parte de algunos, me quedo con eso. ¡Dios bendiga a Venezuela! Esto es durísimo. pic.twitter.com/s7hljQwmJZ— Rubén Valencia (@rubenvalencia22) June 27, 2026🇸🇻🙏🇻🇪 URGENTE: Rescatistas de El Salvador lograron rescatar con vida a Nayarit Colmenares, de 39 años, quien quedó atrapada bajo los escombros tras el terremoto que sacudió Venezuela. 🙏❤️ pic.twitter.com/5twmSRP86e— Alerta Mundial (@AlertaMundoNews) June 27, 2026అధికారికంగా.. ఇప్పటివరకు 920 మంది మృతి చెందగా, 3,360 మందికి పైగా గాయపడ్డారు. అయితే మరో 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని లోకల్ మీడియా కథనాలు, పలు నివేదికల ఆధారంగా ఐక్యరాజ్యసమితి చెప్తున్నాయి. శిథిలాల కింద ఇంకా 172 మంది చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. గణాంకాల విషయంలో ప్రభుత్వం దాపరికం ప్రదర్శిస్తుండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.ప్రజల ఆగ్రహం తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్పై కూడా వ్యక్తమైంది. ఆమె బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్థానికులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. పరిస్థితుల దృష్ట్యా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి 8 గంటల తర్వాత ప్రవేశాన్ని అధికారులు తాత్కాలికంగా నిషేధించారు. అదే సమయంలో.. పాజిటివ్ వీడియోలను ప్రభుత్వం వైరల్ చేస్తోంది. సహాయక చర్యల్లో చిన్నారులను, వృద్ధులను, మూగజీవాలను రక్షించిన వీడియోలను రిలీజ్ చేస్తోంది. అయినప్పటికీ.. ప్రజాగ్రహం మాత్రం చల్లారడం లేదు.ఇదిలా ఉండగా.. ప్రపంచ దేశాలు వెనెజువెలాకు అండగా నిలుస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కనీసం 17 దేశాల నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. చిలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, మెక్సికో, కొలంబియా, ఎల్ సాల్వడార్ దేశాల బృందాలు ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. అమెరికా కూడా 250 మందికిపైగా సిబ్బంది, ప్రత్యేక శునకాలతో కూడిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను పంపేందుకు సిద్ధమైంది.ఈ భూకంపాల్లో పలువురు విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా తొమ్మిది మంది పోర్చుగల్ పౌరులు, ఐదుగురు స్పెయిన్ పౌరులు, ఇద్దరు బ్రెజిలియన్లు, ఇద్దరు చైనా పౌరులు, ఒక ఇటలీ-వెనెజువెలా పౌరుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు వందలమంది విదేశీయుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.దశాబ్దకాలంగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న వెనెజువెలాలో.. ఆస్పత్రులు, ప్రభుత్వ సేవలు ఇప్పటికే బలహీనంగా ఉండటంతో సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. భూకంపం తర్వాత 50 నుంచి 60 వేల మంది జాడ లేకపోయారని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఈ అత్యవసర పరిస్థితి మరింత పెద్ద మానవ విపత్తుగా మారకుండా అంతర్జాతీయ సమాజం తక్షణమే మరింత సహాయం అందించాలని పిలుపునిచ్చింది.వెనెజువెలా భూకంపంలో మృతులు, క్షతగాత్రులకు గౌరవసూచకంగా ఫిఫా ప్రపంచకప్-2026 ఫుట్బాల్ మ్యాచ్లకు ముందు రెండు నిమిషాల మౌనం పాటించారు. దాదాపు వందేళ్ల తర్వాత వెనెజువెలాలో సంభవించిన అత్యంత తీవ్ర భూకంపాలు ఇవేనని భూకంప నిపుణులు చెబుతున్నారు. -
హర్ముజ్లో మళ్లీ టెన్షన్.. టెన్షన్
ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ సంక్షోభంలో పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ దాడులను కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని ఆరోపించిన అమెరికా, ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలపై భారీ ప్రతీకార దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపిన వివరాల ప్రకారం.. గల్ఫ్లోని ఒక ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినందుకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. ఇరాన్ తీర ప్రాంతాల్లోని క్షిపణి నిల్వలు, డ్రోన్ స్థావరాలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని "శక్తివంతమైన దాడులు" నిర్వహించినట్లు పేర్కొంది.ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్ముజ్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాల్పుల విరమణ ఒప్పందానికే కాకుండా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)ను కూడా ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. ఇరాన్ "తెలివితక్కువ పని" చేసిందని వ్యాఖ్యానిస్తూ.. ఇటువంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసిందని, అమెరికా తన బాధ్యతలను పాటించిందని చెప్పారు. ఒప్పంద అమలుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, హింసకు హింసతోనే సమాధానం ఉంటుందని హెచ్చరించారు.అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికానే ఎప్పటిలాగే తన హామీలను ఉల్లంఘించిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతిగా ప్రాంతంలోని అమెరికా బలగాల మోహరింపు ప్రాంతాలను తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో అమెరికా దాడులు పునరావృతమైతే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. అయితే.. అమెరికా స్థావరాలపై దాడులు ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది.ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ చైర్మన్ ఎబ్రహీం అజిజీ కూడా ట్రంప్పై విమర్శలు గుప్పించారు. చర్చలు, కాల్పుల విరమణ సూత్రాల పట్ల ట్రంప్కు ఎలాంటి నిబద్ధత లేదని ఆరోపిస్తూ.. అమెరికా దాడులను నిర్లక్ష్యపూరిత చర్యగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా, హర్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళన పెంచుతున్నాయి. ఖతార్ ఎనర్జీకి చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్ ‘ఉమ్ స్లాల్’ హర్ముజ్ సమీపంలో తన ప్రయాణాన్ని మధ్యలోనే వెనక్కి మళ్లించగా, అంతకుముందు గ్యాస్లాగ్ షాంఘై నౌక కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో పేలుళ్లు నమోదవడంతో గల్ఫ్ మార్గంలో ఎల్ఎన్జీ రవాణాపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.ఇరాన్ మాత్రం హర్ముజ్ జలసంధిని తన అత్యంత కీలక వ్యూహాత్మక అస్త్రంగా భావిస్తోంది. ఈ జలసంధిపై తన ఆధిపత్యాన్ని వదులుకోవడం అంటే చర్చల్లో తన బలమైన ఒత్తిడి సాధనాన్ని కోల్పోవడమేనని టెహ్రాన్ భావిస్తోంది. అందుకే రాజకీయ నాయకులు, సైనికాధికారులు, ఐఆర్జీసీ నేతలు హర్ముజ్పై తమ నియంత్రణను కాపాడుకునేందుకు అవసరమైతే పోరాటానికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఇటీవల జరిగిన యుద్ధం ప్రాంతీయ వ్యూహాత్మక పరిస్థితులను పూర్తిగా మార్చేసిందని, ఆ కొత్త వాస్తవాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.మరోవైపు, అమెరికా మాత్రం ఈ ప్రతీకార దాడులను పరిమితంగానే ఉంచినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించిన అమెరికా, విస్తృత సైనిక స్థావరాలను మాత్రం టార్గెట్ చేయలేదు. హర్ముజ్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కాపాడుతూనే, దౌత్య చర్చలకు అవకాశం కొనసాగించాలనే ఉద్దేశంతోనే తమ సైనిక చర్యలను పరిమితం చేసినట్లు వాషింగ్టన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇరు దేశాల పరస్పర ఆరోపణలు, ప్రతీకార చర్యలతో కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై మరోసారి తీవ్ర అనిశ్చితి నెలకొంది.ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధం.. వీళ్లకేమో కాసుల వర్షం! -
ఏసీల కోసం పొలిటికల్ ఫైట్.. ఎక్కడో తెలుసా?
ఒకప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరుతో ఏసీలను వ్యతిరేకించిన దేశంలో.. ఇప్పుడు వాటిపైనే రాజకీయ యుద్ధం మొదలైంది. మండిపోతున్న ఎండలు, మూతపడుతున్న పాఠశాలలు, ఉక్కిరిబిక్కిరవుతున్న ఆస్పత్రులు, ప్రాణాపాయ స్థాయికి చేరుతున్న ఉష్ణోగ్రతలు.. చివరికి రాజకీయ పార్టీలను కూడా రెండు వర్గాలుగా విడగొట్టాయి. ఏసీలు అవసరమా? వద్దా? అన్న అంశమే ఇప్పుడు ఆ దేశ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.ఆ దేశమే ఫ్రాన్స్. గత కొన్ని రోజులుగా అక్కడ నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ వారం ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్కు చేరువైన ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన రోజు కూడా ఇదేనని అధికారులు వెల్లడించారు. వేడి తీవ్రతతో వేలాది పాఠశాలలు తాత్కాలికంగా మూతపడగా.. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, రోగులు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పోర్టబుల్ ఏసీల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పిల్లలు కొంతసేపైనా తరగతి గదుల్లో ఉండేందుకు, అపార్ట్మెంట్లలో నివసించే ప్రజలు రాత్రిపూట నిద్రపోయేందుకు ఏసీలే మార్గమవుతున్నాయి. అయితే ఇక్కడే రాజకీయ చర్చ మొదలైంది. ప్రతిపక్షం మాత్రం ఈ వేడి పరిస్థితులను ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. కుడిపక్ష (రైట్ వింగ్) నాయకురాలు మరీన్ లె పెన్.. దేశంలోని అన్ని పాఠశాలలు, ఆస్పత్రుల్లో తక్షణమే ఏసీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. కోట్లాది కుటుంబాలు తమ ఇళ్లలో ఏసీలు అమర్చుకునేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రజల ప్రాణాల కంటే పర్యావరణ సిద్ధాంతాలు ముఖ్యమా? అంటూ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు.అదే సమయంలో పర్యావరణవాదులు, గ్రీన్ పార్టీ తమ పాత వైఖరిని కొంత సవరించుకున్నాయి. ఇప్పటివరకు ఏసీలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆ పార్టీ.. ప్రస్తుత తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో కనీసం పాఠశాలలు, ఆస్పత్రుల్లో మాత్రం శీతలీకరణ సదుపాయాలు తప్పనిసరి అని అంగీకరించింది. అయితే దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా ఏసీల వినియోగాన్ని ప్రోత్సహించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తోంది. అధిక విద్యుత్ వినియోగం, గ్రీన్హౌస్ వాయువుల విడుదల, నగరాల్లో వేడి మరింత పెరగడం వంటి పర్యావరణ సమస్యలను గుర్తు చేస్తూ జాగ్రత్తలు అవసరమని చెబుతోంది.మరోవైపు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రభుత్వం సమతుల్య వైఖరిని అవలంబిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అవసరమైన చోట ఏసీల వినియోగాన్ని సమర్థిస్తూనే.. దేశమంతా ఏసీలను విస్తృతంగా ప్రోత్సహించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. భవనాల్లో మెరుగైన ఇన్సులేషన్, సహజ గాలి ప్రసరణ, పచ్చదనం పెంపు వంటి శాశ్వత పరిష్కారాలకే ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్పత్రులు, పాఠశాలలు వంటి కీలక ప్రాంతాల్లో శీతలీకరణ సదుపాయాలు అనివార్యమనే విషయాన్ని కూడా అంగీకరిస్తోంది.ప్రస్తుతం ఫ్రాన్స్లో కేవలం 25 శాతం ఇళ్లలో మాత్రమే ఏసీలు ఉన్నాయి. అదే స్పెయిన్, ఇటలీల్లో ఈ సంఖ్య 50 శాతం కాగా.. అమెరికా, జపాన్లలో దాదాపు 90 శాతం ఇళ్లలో ఏసీలు ఉన్నాయి. దీంతో పెరుగుతున్న వేడి పరిస్థితుల్లో ఫ్రాన్స్ కూడా తన పాత విధానాన్ని మార్చక తప్పదనే అభిప్రాయం బలపడుతోంది.మొత్తానికి.. ఒకప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరుతో ఏసీలను దూరంగా ఉంచిన ఫ్రాన్స్.. ఇప్పుడు అదే ఏసీల అవసరంపై రాజకీయంగా, సామాజికంగా కొత్త చర్చను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పుల తీవ్రత పెరుగుతున్న కొద్దీ.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలా? లేక ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శీతలీకరణ సదుపాయాలను విస్తరించాలా? అనే ప్రశ్న ఇప్పుడు ఫ్రాన్స్ రాజకీయాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. -
ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్ ఫెయిల్?
ప్రపంచ దేశాలన్నీ ఆదర్శంగా చూసిన ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదా? 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలనే ఉద్దేశం నెరవేరడం కష్టంగా ఉందా?. ప్రపంచంలోనే ఈ తరహా తొలి చట్టం అమల్లోకి తెచ్చిన ఆ దేశానికి.. ఆరు నెలలు తిరిగే సరికి పెద్ద షాక్ తగిలింది. 85 శాతం మంది పిల్లలు.. ఇప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియాను వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనం, మానసిక ఆరోగ్య సమస్యలు, ఆన్లైన్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని 2025 డిసెంబర్ 10న చట్టం అమల్లోకి తెచ్చింది ఆంథోనీ అల్బనీస్ నేతృత్వంలోని ప్రభుత్వం. దీని ప్రకారం.. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్ వంటి ప్రముఖ వేదికలు 16 ఏళ్లలోపు వారికి ఖాతాలు ఇవ్వకుండా ఈ చట్టం ఆదేశించింది. కాదని ముందుకు వెళ్తే.. భారీ జరిమానాలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆరంభంలో మంచి ఫలితం ఇవ్వడంతో.. ఈ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయి.అయితే, ఆ చట్టం అమల్లోకి వచ్చి ఆరు నెలలు గడిచిన తర్వాత పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 12 నుంచి 15 ఏళ్ల వయసున్న ఆస్ట్రేలియా పిల్లల్లో దాదాపు 85 శాతం మంది ఇప్పటికీ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు.ఈ అధ్యయనంలో పాల్గొన్న చిన్నారుల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది.. నిబంధనల్లోని లొసుగులను వినియోగించుకున్నట్లు తేలింది. 16 ఏళ్లకు పైబడిన వారికే ఖాతాలు అనుమతించే నిబంధనను తప్పించుకునేందుకు.. తమ వయసును 16 ఏళ్లు దాటినట్లు నమోదు చేయడమో లేదంటే సెల్ఫీ ఆధారిత వయస్సు ధ్రువీకరణను దాటేయడమో చేస్తున్నారాట. తద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సోషల్ మీడియా ఖాతాలను యథావిధిగా కొనసాగించినట్లు అధ్యయనం వెల్లడించింది. దీంతో బ్యాన్ అమలులోని లోపాలు బహిర్గతమయ్యాయి.దీంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఈ మోడల్పై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో చట్టం అమలులో లోపాలను సరిదిద్దేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు వేదికలు ఈ నిర్ణయంపై కోర్టుల్ని ఆశ్రయించాయి. దీంతో న్యాయపరమైన సవాళ్లను కూడా తట్టుకునేలా చట్టాన్ని బలోపేతం చేయడమే కాకుండా.. దేశంలోని ఈ-సేఫ్టీ కమిషన్కు మరిన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలు పాటించని సోషల్ మీడియా సంస్థలపై.. 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల(సుమారు 322 కోట్ల రూపాయలు) వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే కొన్ని వేదికలపై చట్టపరమైన చర్యలకు సైతం అల్బనీస్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇక.. ఆస్ట్రేలియా ప్రయోగాన్ని అనుసరించేందుకు ఇప్పటికే పలు దేశాలు అడుగులు వేస్తున్నాయి. టీనేజర్లకు(16 ఏళ్లలోపు) సోషల్ మీడియాతో పాటు గేమింగ్, లైవ్-స్ట్రీమింగ్ వేదికలపైనా బ్రిటన్ ఆంక్షలు విధించే ప్రణాళికను ప్రకటించింది. ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్, నార్వే వంటి దేశాలు కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు లేదంటే నిషేధాల దిశగా కసరత్తు చేస్తున్నాయి.మొత్తానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే దీన్ని వైఫల్యంగా అంగీకరించకుండా.. చట్టంలోని లోపాలను సరిదిద్దుతూ మరింత సమర్థవంతంగా అమలు చేయడంపైనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది. -
వెనెజువెలా మహావిషాదం: శిథిలాల కిందే మరెందరో!
లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాను జంట భూకంపాలు అతలాకుతలం చేశాయి. రాజధాని కారకాస్తో పాటు తీర ప్రాంతాల్లో ఎటు చూసినా.. భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ.. సహాయక చర్యలు సాగుతున్నా కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. మృతుల సంఖ్య 589కు చేరుకోగా.. దాదాపు 4,300 మంది గాయపడ్డారు. వేల మంది జాడ ఇంకా తెలియరావడం లేదు. అలాగే.. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.బుధవారం సాయంత్రం సెకన్ల తేడాతో సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి.. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా లా గువైరా, కారకాస్ పరిసర ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. సుమారు 250 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందల మంది ఆ శిథిలాల కిందే చిక్కుని ఉంటారని అధికారులు చెబుతుండగా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. భారీగా మృతులు?శిథిలాలను తొలగించే కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతుండటంతో వెనెజువెలాలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే వెనెజువెలా ప్రభుత్వం, అలాగే అక్కడి అధికార యంత్రాగం చెబుతున్న పరిస్థితులకు భిన్నంగా అక్కడి వాతావరణం కనిపిస్తోంది. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై వాళ్ల ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ భూకంపంలో 10 వేల మంది దాకా మరణించి ఉంటారని తొలుత అక్కడి మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. అయితే కాసేపటికే.. ఆ సంఖ్యను వందల్లోకి తీసుకొచ్చాయి. అయితే.. Se siguen desplomando edificios en la zona costera de Venezuela. Más de 250 estructuras reducidas a escombros, según las autoridades. No sólo la construcción, es también las características del terreno sobre el que se alzan https://t.co/AaUrq66RXl pic.twitter.com/6buAjkxWEH— Sandro Pozzi (@sandro_pozzi) June 25, 2026Te lo cuentan y no lo crees. Qué desesperación tan grande. Se salvaron por un pelo. #Venezuela #Terremoto 🚨‼️🆘 pic.twitter.com/7rNILpCl4r— Cristian Crespo F. 🇨🇺 (@cristiancrespoj) June 25, 2026😢Así vivieron esta pareja de ancianos el terremoto de #Venezuela Dos fuertes sismos sacudieron el miércoles el oeste de la capital de Venezuela, provocando el derrumbe de edificios en #Caracas, dejando personas atrapadas bajo los escombros, y llevaron a científicos a estimar… pic.twitter.com/aci0yLAxSe— Cristian Crespo F. 🇨🇺 (@cristiancrespoj) June 25, 2026అమెరికా భూగర్భ సర్వే (USGS) మాత్రం.. ఆ సంఖ్య లక్ష దాకా ఉండొచ్చని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి స్థాయి శిథిలాల తొలగింపనకు నాలుగైదు రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉండడంతో.. దాదాపు 11 వేల మందికి పైగా మిస్ అయినట్లు కథనాలు వెలువడుతుండడంతో.. మృతుల సంఖ్య బాగా పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తోంది. An earthquake that lasted only a few seconds caused devastation in Venezuela.Oh God,how terrifying the Day of Judgment will be. pic.twitter.com/mGzzQfMiG2— SilencedSirs◼️ (@SilentlySirs) June 25, 2026🇻🇪 Freaking devastating footage of Venezuela after it got absolutely crushed by twin massive earthquakes.The number keeps piling up, with at least 164 people dead, nearly 1,000 injured, and over 11,000 missing. More than 100 BUILDINGS COLLAPSED in La Guaira alone, with entire… https://t.co/1ZHLCVp4OX— Mario Nawfal (@MarioNawfal) June 25, 2026Moments after the first earthquake in Caracas you can see the total destruction of the surrounding area.Minutes later a massive 7.5 hit the same area finishing the job and leaving thousands trapped and unfortunately deceased.California Democrats would love for this to happen… https://t.co/kSC0ZfzxDE pic.twitter.com/l5QebHImRZ— B. Wilkins lll 🇺🇸 (@ScummyMummy511) June 25, 2026అధికారికంగా.. భూకంపాల కారణంగా ఇప్పటివరకు సుమారు 235 మంది మృతి చెందగా, 4,300 మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య మంత్రి కార్లోస్ అల్వరాడో తెలిపారు. వేలాది మంది గల్లంతయ్యారని, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తీర ప్రాంతం, లా గ్వైరా వంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భవనాలు కూలిపోవడం, ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోవడం, పిల్లలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం వంటి దృశ్యాలు దేశాన్ని విషాదంలో ముంచేశాయి.ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బఈ భూకంపాల వల్ల వెనెజువెలాకు 7.5 బిలియన్ డాలర్లకుపైగా ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. ఇది దేశ జీడీపీలో దాదాపు 7 శాతం వరకు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. చమురు, గ్యాస్ రంగానికి పెద్దగా నష్టం జరగకపోయినా.. విద్యుత్ అంతరాయాలు చమురు ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.సహాయానికి ముందుకొచ్చిన..వెనెజువెలాలో భారీ భూకంపం ధాటికి.. వేలాది మంది నిరాశ్రయులుగా మారగా, సహాయక శిబిరాల్లో వారికి ఆహారం, తాగునీరు, వైద్యసేవలు అందిస్తున్నారు. విపత్తు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పలు దేశాలు వెనెజువెలాకు అండగా నిలుస్తున్నాయి. అమెరికా 150 మిలియన్ డాలర్ల అత్యవసర సాయాన్ని ప్రకటించడంతో పాటు సహాయక బృందాలను పంపింది. చిలీ, స్విట్జర్లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, టర్కీ, బ్రిటన్ వంటి దేశాలు కూడా రెస్క్యూ బృందాలు, పరికరాలు, అత్యవసర సాయాన్ని అందిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన ప్రత్యేక రెస్క్యూ బృందాలు కూడా వెనెజువెలాకు చేరుకుంటున్నాయి. మరోవైపు స్టార్లింక్ సంస్థ నెల రోజుల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ప్రకటించింది. అమెరికా భూగర్భ సర్వే (USGS) ప్రకారం.. వెనెజువెలా రాజధాని కారకాస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో తొలుత 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ప్రకంపనల నుంచి ప్రజలు తేరుకునేలోపే.. నిమిషం కూడా గడవకముందే(39 సెకన్లలోనే) 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం రావడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఇది 1900 తర్వాత వెనెజువెలాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా అధికారులు చెబుతున్నారు.గమనిక: పై వీడియోలు వెనెజువెలా భూకంపం పేరిట ఎక్స్ ఖాతాలో వైరల్ అవుతున్నవే! -
ట్రంప్కు భారీ ఊరట.. టీపీఎస్ రద్దుకు గ్రీన్సిగ్నల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ విజయం దక్కింది. వలస విధానాల విషయంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయాన్ని సమర్థించేలా అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో లక్షలాది మందిని వెనక్కి పంపించేందుకు(Deport) కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలకు మార్గం సుగమమైంది. ట్రంప్ సర్కార్కు అనుకూలంగా అమెరికా సుప్రీం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. హైతీ, సిరియా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు ఇప్పటివరకు లభిస్తున్న టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) రక్షణను రద్దు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ, ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది ఒక్కసారిగా డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్రంప్ ప్రభుత్వం "చట్టానికి దక్కిన విజయం"గా అభివర్ణిస్తుండగా.. మానవ హక్కుల సంఘాలు మాత్రం "వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయం" అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఏళ్లుగా.. లక్ష్యంగా.. డొనాల్డ్ ట్రంప్ తన తొలి అధ్యక్ష పదవీకాలం (2017-2021) నుంచే వలస విధానాలను కఠినతరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ పేరుతో అనేక మంది అమెరికాలో శాశ్వతంగా ఉండిపోతున్నారని అప్పటినుంచే ఆయన విమర్శిస్తున్నారు. తన మొదటి టర్మ్లోనే హైతీ, ఎల్సాల్వడోర్, నికరాగువా, సూడాన్ తదితర దేశాలకు ఇచ్చిన టీపీఎస్ను రద్దు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఫెడరల్ కోర్టులు పలుమార్లు ట్రంప్ నిర్ణయాలను నిలిపివేశాయి. 2021లో ఆయన పదవి వీడటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.తిరిగి.. 2025 జనవరిలో రెండోసారి వైట్హౌస్లో అడుగుపెట్టిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అదే అజెండాను వేగవంతం చేసింది. ఇప్పటికే వెనెజువెలా వలసదారుల టీపీఎస్పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు హైతీ, సిరియాపై కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వచ్చిన తాజా సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్కు అత్యంత కీలక విజయంగా భావిస్తున్నారు.TPS అంటే ఏంటంటే.. 1990లో అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, తీవ్ర రాజకీయ అస్థిరత లేదంటే మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాల పౌరులకు అమెరికా తాత్కాలిక రక్షణ(Temporary Protected Status.. TPS) కల్పిస్తుంది. ఈ హోదా పొందిన వ్యక్తులను వారి స్వదేశాలకు బలవంతంగా పంపించరు. అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది గ్రీన్కార్డు లేదంటే పౌరసత్వానికి మార్గం కాదు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ప్రభుత్వం ఈ హోదాను రద్దు చేయవచ్చు.అయితే 2010లో సంభవించిన భారీ భూకంపం తర్వాత హైతీ పౌరులకు టీపీఎస్ ఇచ్చారు. 2012లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడి ప్రజలకు కూడా ఈ రక్షణ కల్పించారు. అనంతరం ఆయా దేశాల్లో పరిస్థితులు పూర్తిగా మెరుగుపడకపోవడంతో వరుస ప్రభుత్వాలు ఈ గడువును పొడిగిస్తూ వచ్చాయి.అసలు వివాదం ఎలా మొదలైంది?2025లో తిరిగి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. వలసవాదుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది చూస్తున్నదే. ఈ క్రమంలో ఈ హక్కును "తాత్కాలిక రక్షణ"గా కాకుండా "శాశ్వత వలస మార్గం"గా మార్చేశారని ఆరోపిస్తూ వస్తున్నారాయన. ఈ క్రమంలోనే హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ హైతీ, సిరియా దేశాలకు ఇచ్చిన TPSను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై వలసదారుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం.. హైతీలో గ్యాంగ్ హింస, కిడ్నాప్లు, రాజకీయ అరాచకాలు కొనసాగుతున్నాయని, సిరియాలో అంతర్యుద్ధం ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని వాదించాయి. ఈ పరిస్థితుల్లో వారిని తిరిగి పంపడం ప్రాణాంతకమని పేర్కొన్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్లోని ఫెడరల్ కోర్టులు కూడా ఇదే అభిప్రాయంతో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.సుప్రీంకోర్టు సంచలన తీర్పు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా.. 6-3 మెజార్టీతో ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జస్టిస్ శామ్యూల్ అలిటో తీర్పు ఇస్తూ.. టీపీఎస్ ఇవ్వాలా? రద్దు చేయాలా? అనేది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలను కోర్టులు సమీక్షించే అధికారం చట్టం ఇవ్వలేదని పేర్కొన్నారు. అందువల్ల దిగువ కోర్టులు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయడం సరైనది కాదని తేల్చిచెప్పారు.భిన్నాభిప్రాయంలో.. ఈ తీర్పుతో లిబరల్ న్యాయమూర్తులు ఎలీనా కేగన్, సోనియా సోటోమేయర్, కేతంజీ బ్రౌన్ జాక్సన్ తీవ్ర విభేదించారు. జస్టిస్ కేగన్ తన భిన్నాభిప్రాయంలో ట్రంప్ గతంలో హైతీ ప్రజలపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. హైతీ వలసదారులపై జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియను పాటించిందా లేదా అన్నది కోర్టులు పరిశీలించే హక్కు ఉందని అభిప్రాయపడ్డారు.ఎంతమందిపై ప్రభావమంటే.. ఈ తీర్పు తక్షణ ప్రభావం.. సుమారు 3.5 లక్షల మంది హైతీ పౌరులు, 6,100 మంది సిరియా పౌరులపై పడనుంది. వీరంతా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. అయితే దీని ప్రభావం ఇంతటితో ఆగే అవకాశం లేదు. ప్రస్తుతం 17 దేశాలకు చెందిన సుమారు 13 లక్షల మంది టీపీఎస్ కింద అమెరికాలో నివసిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఆధారంగా.. భవిష్యత్తులో ఇతర దేశాల TPSలను కూడా రద్దు చేసే అవకాశాలు పెరిగాయని వలస నిపుణులు చెబుతున్నారు.మానవ హక్కుల సంఘాల తీవ్ర ఆందోళనఈ తీర్పుపై పలు మానవ హక్కుల సంస్థలు, వలసదారుల హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. హైతీ, సిరియాలో పరిస్థితులు బాగోలేవని అంటున్నాయి. హైతీ వలసదారుల తరఫు న్యాయవాదులు.. "ఈ తీర్పు వేలాది మంది అమాయకుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది" అని హెచ్చరించారు. అమెరికాలోని ప్రముఖ పౌరహక్కుల సంస్థ NAACP కూడా ఈ తీర్పును తీవ్రంగా తప్పుబట్టడం గమనార్హం. అమెరికా అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న హైతీ కుటుంబాలను ఒక్కసారిగా అనిశ్చితిలోకి నెట్టివేయడం మానవతా దృక్పథానికి విరుద్ధమని పేర్కొంది. ఒహాయోలోని హైతీ సపోర్ట్ సెంటర్ ప్రతినిధులు కూడా "ఇప్పటికే వేలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలా? ఉద్యోగాలకు వెళ్లాలా? లేక ఎప్పుడు డిపోర్ట్ చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.ట్రంప్ ప్రభుత్వం స్పందన ఇదే..అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఈ తీర్పును స్వాగతించింది. TPS అసలు ఉద్దేశాన్ని దుర్వినియోగం చేసి శాశ్వత వలస మార్గంగా మార్చేశారని పేర్కొంది. వైట్హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ తీర్పును "పదేళ్లుగా ఎదురుచూస్తున్న విజయం" గా అభివర్ణించారు. ఇప్పుడు హైతీ వలసదారులను స్వదేశాలకు పంపే ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పారు.'బిగ్ రిలీఫ్' ఎందుకంటే..రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానాలకు కోర్టుల్లో వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఇటీవల వెనిజులా టీపీఎస్ కేసుతో పాటు, ఆశ్రయం కోరే వలసదారులపై పరిమితుల విషయంలోనూ సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు హైతీ, సిరియా టీపీఎస్ కేసులో కూడా ట్రంప్కు మద్దతుగా తీర్పు రావడంతో ఆయన వలస విధానాలకు అత్యున్నత న్యాయస్థానం నుంచి మరోసారి బలమైన మద్దతు లభించినట్టైంది. అందుకే ఈ తీర్పును అమెరికా రాజకీయ వర్గాలు ట్రంప్కు బిగ్ రిలీఫ్ గా అభివర్ణిస్తున్నాయి. ఇక ఈ నిర్ణయం అమెరికా వలస విధానాల భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేసే అవకాశముందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
భారత్లో వివాదం.. మరి ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి?
పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదంటూ కేంద్రం చేసిన తాజా వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పాస్పోర్ట్ కోసం పోలీసు వెరిఫికేషన్ నుంచి పలు స్థాయిల పరిశీలన జరిగితే.. అదే పత్రాన్ని పౌరసత్వానికి ఆధారంగా ఎందుకు గుర్తించరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వివాదం మధ్య మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? పాస్పోర్ట్ను అక్కడ పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తారా? లేదంటే భారత్లాగే అభ్యంతరాలు ఉన్నాయా? పరిశీలిస్తే.. పాస్పోర్ట్ అనగానే చాలా మందికి అది ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిరూపించే అత్యంత బలమైన పత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏ దేశమైనా తన పౌరులకే పాస్పోర్ట్లు జారీ చేస్తుంది. అయితే చట్టపరంగా అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండదు. పాస్పోర్ట్కు ఇచ్చే చట్టబద్ధ హోదా దేశానికో విధంగా ఉంటుంది.అమెరికాలో.. ప్రపంచంలో పాస్పోర్ట్ను పౌరసత్వానికి అత్యంత బలమైన ఆధారంగా గుర్తించే దేశాల్లో అమెరికా ముందుంటుంది. అక్కడ చెల్లుబాటు అయ్యే అమెరికన్ పాస్పోర్ట్ ఉంటే.. అది పౌరసత్వ ధ్రువీకరణ పత్రంతో సమానంగా పరిగణిస్తారు. ప్రభుత్వ సంస్థలు, కోర్టులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా సాధారణంగా అమెరికన్ పాస్పోర్ట్ను పౌరసత్వానికి ప్రత్యక్ష ఆధారంగా అంగీకరిస్తారు. అమెరికాలో జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate), Certificate of Citizenship, US Passport.. ఈ మూడు ప్రధాన పౌరసత్వ ఆధారాలుగా పరిగణిస్తారు. వీటిలో పాస్పోర్ట్కే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోనూ..అమెరికా తరహాలోనే బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కామన్ లా దేశాల్లో కూడా పాస్పోర్ట్కు భారీ చట్టబద్ధ ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి ఆ దేశ పాస్పోర్ట్ను కలిగి ఉంటే.. సాధారణ పరిస్థితుల్లో అతడు ఆ దేశ పౌరుడేనని అధికారులు భావిస్తారు. అయితే అవసరమైతే పౌరసత్వ రికార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు, నేచురలైజేషన్ సర్టిఫికెట్లు వంటి అదనపు ఆధారాలను పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది.యూరప్లో పరిస్థితి ఎలా ఉందంటే.. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాల్లో పాస్పోర్ట్ బలమైన పౌరసత్వ ఆధారంగా పరిగణించబడుతుంది. అయితే అక్కడ చాలా దేశాల్లో జాతీయ గుర్తింపు కార్డులు (National ID Cards) కూడా ఉంటాయి. అందువల్ల పౌరసత్వ నిర్ధారణలో పాస్పోర్ట్తో పాటు జాతీయ గుర్తింపు వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. యూరోపియన్ యూనియన్లోని అనేక దేశాల్లో పౌరులు దేశీయ ప్రయాణాలు, ప్రభుత్వ సేవల కోసం పాస్పోర్ట్ కంటే జాతీయ గుర్తింపు కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తారు.మరి భారత్లాంటి దేశాలు ఉన్నాయా?అవును.. భారత్ మాత్రమే కాదు కొన్ని దేశాల్లో పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన అది పౌరసత్వానికి శాశ్వత, అంతిమ రుజువు కాదని భావిస్తారు. ఉదాహరణకు కెనడాలో పాస్పోర్ట్కు అధిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. సిటిజన్షిప్ సర్టిఫికెట్(Citizenship Certificate) అనే ప్రత్యేక పత్రాన్ని పౌరసత్వానికి మరింత బలమైన ఆధారంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్తో పాటు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి రావొచ్చు.అలాగే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జాతీయ పౌరసత్వ రిజిస్టర్లు, ప్రత్యేక సిటిజన్ కార్డులు, ప్రభుత్వ రికార్డులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది.అసలు ఎన్ని దేశాలు పాస్పోర్ట్ను పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తున్నాయి?. ఇదే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ఒకే విధమైన అధికారిక జాబితా లేదు. అయితే సాధారణంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ భాగం పాస్పోర్ట్ను పౌరసత్వానికి బలమైన, ప్రాథమిక ఆధారంగా అంగీకరిస్తాయి. మరోవైపు కొన్ని దేశాలు మాత్రం అదనపు పౌరసత్వ ధ్రువీకరణ వ్యవస్థలను కూడా కొనసాగిస్తున్నాయి. అంటే ప్రపంచంలోని 190కి పైగా దేశాల్లో పాస్పోర్ట్కు ఉన్న చట్టబద్ధ హోదా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది.భారత్లో వివాదం ఎందుకంటే.. భారత్లో ప్రస్తుతం ప్రతి పౌరుడికి ఇచ్చే ఒకే ఒక్క "యూనివర్సల్ సిటిజన్షిప్ డాక్యుమెంట్" లేదు. ఆధార్ గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుంది. ఓటరు కార్డు ఓటు హక్కును సూచిస్తుంది. పాన్ కార్డు పన్ను అవసరాల కోసం. పాస్పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమే. దీంతో పౌరసత్వాన్ని నిరూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క పత్రం కాకుండా.. జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల రికార్డులు, విద్యా ధ్రువపత్రాలు, ప్రభుత్వ రికార్డులు వంటి అనేక ఆధారాలను అధికారులు పరిశీలించాల్సి వస్తోంది.చర్చ ఎటు దారితీస్తోంది?పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువా? కాదా? అనే ప్రశ్న కంటే.. భారత్లో ప్రత్యేక పౌరసత్వ గుర్తింపు వ్యవస్థ అవసరమా? అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో పాస్పోర్ట్ ఒక్కటే సరిపోతుండగా.. భారత్లో మాత్రం పౌరసత్వ నిర్ధారణకు బహుళ పత్రాల అవసరం కొనసాగుతోంది. అందుకే కేంద్రం చేసిన తాజా వ్యాఖ్యతో మొదలైన ఈ చర్చ.. ఇప్పుడు భారత పౌరసత్వ వ్యవస్థ భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారుతోంది. -
వెనెజువెలాలో భయానక దృశ్యాలు.. 164కు చేరిన మృతులు
వెనెజువెలాను భారీ భూకంపాలు అతలాకుతలం చేశాయి. రాజధాని కారకాస్తో పాటు పలు ప్రాంతాలు శిథిలాల కుప్పలుగా మారాయి. భవనాలు కూలిపోవడం, రోడ్లకు పగుళ్లు ఏర్పడటం, దుమ్ము మేఘాలతో నగరాలు కమ్ముకుపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శిథిలాల మధ్య చిక్కుకున్నవారి కోసం సహాయక బృందాలు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపట్టారు. సునామీ హెచ్చరికలు కొనసాగుతున్న వేళ.. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. వెనెజువెలా భూకంపంలో పెరిగిన మృతుల సంఖ్యఇప్పటివరకూ 164 మంది మృతదేహాలు వెలికితీత.. 974 మందికి తీవ్ర గాయాలుభూకంప ధాటికి కుప్పకూలిన భవనాలుశిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నట్లు సమాచారంయుగాంతం వచ్చేసిందా?.. వెనెజువెలాలో భయానక దృశ్యాలు భారీ భూకంపాలతో వెనెజువెలా రాజధాని కారకాస్ సహా పలు ప్రాంతాలు అతలాకుతలం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భవనాలు ఊగిపోతూ కూలిపోయిన దృశ్యాలు.ప్రకంపనలు మొదలవగానే ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి రోడ్డుపైకి పరుగులు. విమానాశ్రయంలో టెర్మినల్ మొత్తం కంపిపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సీసీటీవీ ఫుటేజీల్లో కొన్ని సెకన్ల వ్యవధిలోనే వీధులు వణికిపోయిన దృశ్యాలు రికార్డు. రహదారుల్లో పగుళ్లు, వాహనాలు ఊగిపోవడం, భవనాల గోడలు కూలిపోవడం చోటుచేసుకున్నాయి. భూమి కంపించడంతో జంతువులు కూడా భయంతో పరుగులు తీసిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించాయి. పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. యుగాంతాన్ని తలపించే ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. Imágenes de las labores de rescate tras el terremoto y réplicas en Venezuela. pic.twitter.com/bYZm9eqHdr— Eric Cartman (@Cartman_Freedom) June 25, 2026Back-to-back earthquakes measuring 7.1 and 7.5 struck Venezuela, causing building collapses in Caracas. The powerful tremors triggered tsunami alerts for parts of the Caribbean as residents evacuated damaged structures. #Venezuela #Earthquake #BreakingNews #WorldNews pic.twitter.com/TwRBDaDRgc— Daily Hindi Milap (@DailyHindiMilap) June 25, 2026Fishermen in the sea off the coast of La Guaira record the moments after the earthquake with dust covering large parts of the coast as a result of building collapses#Venezuela pic.twitter.com/D8KNwLkLDf— CNW (@ConflictsW) June 25, 2026ముందే గుర్తించిన గూగుల్! వెనెజువెలాలో ప్రకంపనలకు కొన్నిక్షణాల ముందు మోగిన ఆండ్రాయిడ్ ఫోన్లుగూగుల్ నుంచి భూకంపం రాబోతోందని అలర్ట్అప్రమత్తమై పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న పలువురు!భూ ప్రకంపనలను ముందుగానే గుర్తించే ఆండ్రాయిడ్ ఫోన్లలోని యాక్సిలెరోమీటర్ సెన్సార్లుప్రకంపనలు నమోదైతే ఫోన్లు Google Android Earthquake Alerts Systemకు సమాచారంఒకే ప్రాంతంలోని అనేక ఫోన్ల నుంచి వచ్చిన డేటాను విశ్లేషించి భూకంపాన్ని నిర్దారించుకునే గూగుల్భూకంపంలో ముందుగా వచ్చే P-Wavesను ఫోన్లు గుర్తించడంతో.. విధ్వంసకర S-Waves రాకముందే హెచ్చరికలు పంపే అవకాశంప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ భూకంప హెచ్చరిక వ్యవస్థలో భాగంభారత్లోనూ 2023 నుంచి ఈ సేవ అందుబాటులోకి Android 5, ఆ పైబడిన ఫోన్లలో ఈ అలర్ట్లు పనిచేస్తాయి.శిథిలాల దిబ్బగా నగరాలుభారీ భూకంపంతో నాశనమైన రాజధాని కారకస్!ఘోరంగా దెబ్బ తిన్న తీర ప్రాంతం లా గ్వైరాపలు చోట్ల కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనాలు రోడ్లు, హైవేల్లో భారీ పగుళ్లుమొత్తం.. దుమ్ము, శిథిలాలతో నిండిపోయిన నగరాలుక్షతగాత్రుల హాహాకారాలువెనెజువెలాలో కొనసాగుతున్న సహాయక చర్యలుశిథిలాల కింద చిక్కుకుని పలువురి ఆర్తనాదాలుతమ వారి జాడ కోసం వెతుక్కుంటున్న వేల మంది!ఇప్పటివరకు అధికారికంగా.. 32 మంది మృతి, 700 మంది గాయాలుఅమెరికా జియాలజికల్ సర్వే అంచనా ప్రకారం మరణాలు.. 10,000 నుంచి 1 లక్ష వరకు! హరర్ మూవీలా.. భారీ భూకంపంతో వెనెజువెలాకు కాళరాత్రి భవనాలు కూలిపోతుండటంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలురాత్రంతా రోడ్ల మీదే గడిపిన పౌరులుపొగ, దుమ్ము వల్ల కనిపించని పరిస్థితికుటుంబ సభ్యులను శిథిలాల మధ్య వెతుక్కుంటున్న దృశ్యాలుకాళ్లు చేతులు తెగి పడి సాయం కోసం ఆర్తనాదాలు పెడుతున్న ప్రజలు!హరర్ మూవీని తలపిస్తున్న రాజధాని కాకారస్ నాన్ స్టాప్గా సహాయక చర్యలువెనెజువెలాలో ఎమర్జెన్సీ ప్రకటనభూకంపం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలుశిథిలాల మధ్య చిక్కుకున్న రక్షించే ప్రయత్నంఎక్స్కవేటర్లు, రెస్క్యూ బృందాలు మోహరింపువిరామం లేకుండా కొనసాగుతున్న సహాయక చర్యలురెస్క్యూ బృందాలకు.. స్థానికులు, వలంటీర్లు సహాయం ఒక టీనేజ్ అమ్మాయిని సజీవంగా బయటకు తీయడంతో.. చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసిన ప్రజలుకారకాస్లో హృదయ విదారక దృశ్యాలుధనిక ప్రాంతమైన అల్టామిరాలో పెద్ద ఎత్తున నష్టంకూలిన అపార్ట్మెంట్ల ముందు కుటుంబ సభ్యుల వేచి చూడటంరెసిడెన్సియాస్ ఒబెలిస్కో భవనంలో చిక్కుకున్నవారి కోసం ఆందోళనమౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావంభూకంపం ధాటికి తీర నగరం లా గ్వైరాలో భారీ విధ్వంసందేశ ప్రధాన విమానాశ్రయం సిమోన్ బొలివార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూసివేతసముద్రతీర హోటళ్లు, భవనాలు కూడా ధ్వంసంరాత్రంత అంధకారంలోనే ఉండిపోయిన పలు ప్రాంతాలుకమ్యూనికేషన్ సైతం కట్ప్రభుత్వ అత్యవసర చర్యలుదేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షురాలువేల మంది మరణించి ఉంటారనే ఆందోళనఅన్ని ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ప్రకటనరెండు భారీ భూకంపాలు ఒక్కసారిగా..వెనెజువెలాను కుదిపేసిన రెండు భారీ భూకంపాలు7.2, 7.5 తీవ్రతతో.. వరుసగా 39 సెకన్లలో ప్రకంపనలుస్థానిక సమయం ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఘటన20కుపైగా ఆఫ్టర్షాక్స్ (4.9–6.4 తీవ్రత) నమోదుశతాబ్ధం తర్వాత వచ్చిన అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా పేర్కొంటున్న శాస్త్రవేత్తలు👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వందేళ్లకొకసారి సంభవించే అరుదైన భూకంపం!
వామ్మో.. భూమి రెండుగా చీలిపోయిందా? అన్నట్లు వెనెజువెలా వణికిపోయింది. జంట భూకంపాలు రాజధాని కారకాస్తో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ భవనాలు ఊగిపోతూ కుప్పకూలిపోగా.. సుదూరాన ఉన్న కొలంబియా దేశ రాజధాని బోగొటాలో ఆ ప్రకంపనల ప్రభావం కనిపించింది. వేల నుంచి లక్ష వరకు మరణాలు ఉండొచ్చన్న అంచనాల మధ్య దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇంతటి భారీ విధ్వంసానికి కారణమైన ఈ రెండు భూకంపాలు.. కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే ఎలా సంభవించాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.దక్షిణ అమెరికా దేశం వెనిజువెలా భూకంపాల దెబ్బకు అతలాకుతలమైంది. మొదట 7.1 తీవ్రతతో భూమి కంపించగా, ఆ భయం తగ్గకముందే కేవలం 39 సెకన్లలోనే 7.5 తీవ్రతతో రెండో భారీ ప్రకంపన అదే ప్రాంతాన్ని తాకింది. ఈ రెండు శక్తివంతమైన భూకంపాలు కలిసి దేశాన్ని కుదిపేసి, ప్రజలను వీధుల్లోకి పరుగులు తీయించాయి. సాధారణంగా ఒక భారీ భూకంపం సంభవించిన తర్వాత భూమి లోపల ఒత్తిడి కొంతవరకు విడుదలవుతుంది. ఆ తర్వాత చిన్నచిన్న ఆఫ్టర్షాక్లు మాత్రమే వస్తాయి. కానీ వెనెజువెలా ప్రకంపనల పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రెండు పెద్ద భూకంపాలు వరుసగా రావడంతో విధ్వంసం రెట్టింపైంది. భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను శాస్త్రవేత్తలు ‘‘సిస్మిక్ డబ్లెట్” (Earthquake Doublet)’’ గా పేర్కొన్నారు. అంటే ఒకే ప్రాంతంలో ఉన్న భూగర్భ చీలికలు లేదంటే ఫాల్ట్ లైన్లు చాలా తక్కువ వ్యవధిలో విడివిడిగా విరగడం. సాధారణంగా ఒక భూకంపం తర్వాత మరొకటి గంటలు లేదంటే రోజుల గ్యాప్తో వస్తాయి. కానీ ఇక్కడ కేవలం 39 సెకన్లలోనే రెండో భారీ భూకంపం రావడం ఈ ఘటనను అరుదైనదిగా మార్చింది.వెనెజువెలాలో మొదటి భూకంపం తర్వాత పక్కనున్న భూగర్భ చీలికలపై ఒత్తిడి పెరిగి, వెంటనే రెండో భారీ భూకంపం సంభవించి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే.. ఒత్తిడి తట్టుకోలేక సమీపంలోని మరో చీలిక కూడా కదలడంతో రెండో భూకంపం వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.వెనెజువెలా భౌగోళికంగా అత్యంత ప్రమాదకర భూకంప జోన్లో ఉంది. కరీబియన్ ప్లేట్ మరియు దక్షిణ అమెరికా ప్లేట్ కలిసే ప్రాంతంలో ఈ దేశం ఉంది. ఈ రెండు భూభాగాలు నిరంతరం ఒకదానికొకటి స్లైడ్ అవుతూ కదులుతుంటాయి. ఈ కదలికల వల్ల భూగర్భంలో భారీ ఒత్తిడి ఏర్పడి, అది ఒక్కసారిగా విడుదలైనప్పుడు శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి.బొకోనో, సాన్ సెబాస్టియన్, ఎల్ పిలార్, మోరోన్ వంటి అనేక ఫాల్ట్ జోన్లు పరస్పరం అనుసంధానమై ఉండటంతో, ఒక ప్రాంతంలో జరిగిన కదలిక మరో ప్రాంతాన్ని కూడా వెంటనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇదే ఈసారి రెండు భారీ ప్రకంపనలు వరుసగా రావడానికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ప్రస్తుతం వెనెజువెలా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సహాయక బృందాలు శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నాయి. రాజధాని కారకాస్తో పాటు పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. ఈ డబ్లెట్ భూకంపాల తర్వాత ఆఫ్టర్షాక్ల ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని యూఎస్జీఎస్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బలహీనమైన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలను బయటే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.సాధారణంగా వందేళ్లకు ఒకసారి లేదంటే అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి తీవ్ర స్థాయి జంట భూకంపాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనల్లో సాధారణంగా మొదటి భూకంపం తర్వాత భూగర్భ ఒత్తిడి సమీప ఫాల్ట్లకు బదిలీ అవుతుంది. ఆ ఒత్తిడి వెంటనే విడుదలైతే రెండో పెద్ద భూకంపం సంభవిస్తుంది. ఇండోనేషియా, ఇరాన్, అమెరికాలోనూ ఎర్త్క్వేక్ డబ్లెట్ చోటు చేసుకున్నాయి. అయితే వెనిజువెలాలో ఈసారి కేవలం 39 సెకన్లలోనే రెండు భారీ ప్రకంపనలు రావడం భూమి లోపల ఉన్న ఒత్తిడి ఎంత అస్థిరంగా ఉందో చూపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇదీ చదవండి: జంట భూకంపాల దెబ్బ.. లక్ష మంది మృతి? -
జంట భూకంపాల దెబ్బ.. వెనెజువెలాలో భారీగా మృతులు?
దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. రాజధాని కారకాస్తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. మృతులు, క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉండేలా కనిపిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మృతుల సంఖ్య లక్ష దాకా ఉండొచ్చని అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS) హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం వెనెజువెలా పశ్చిమ ప్రాంతంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని కారకాస్కు పశ్చిమంగా ఉన్న సాన్ ఫెలిపే సమీపంలో దీని కేంద్రం నమోదైంది. కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే యుమారే ప్రాంతం వద్ద మరో 7.5 తీవ్రతతో మరింత శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత 20 సార్లు భూమి స్వల్పంగా కంపించింది. ఈ ధాటికి జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. క్షణాల్లోనే.. భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా అంతరాయం కలగడం తీవ్ర నష్టాన్ని కలిగించాయని తెలుస్తోంది.ఈ ఘటనను "సిస్మిక్ డబ్లెట్"(seismic doublet earthquake)గా యూఎస్జీఎస్ అభివర్ణించింది. అంటే.. చాలా తక్కువ వ్యవధిలో ఒకే ప్రాంతాన్ని రెండు భారీ భూకంపాలు తాకడం. ప్రాథమిక అంచనాల ప్రకారం భారీ ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది. మృతుల సంఖ్య 10 వేలుగా ఉండొచ్చని స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. కానీ, భూకంపం తీవ్రతను బట్టి ఆ సంఖ్య లక్ష వరకు చేరవచ్చని యూఎస్జీఎస్ అంచనా వేస్తోంది. అయితే అధికారికంగా ఇప్పటివరకు మృతులు, గాయపడిన వారి సంఖ్యను వెనెజువెలా ప్రభుత్వం ప్రకటించలేదు. Venezuela shaken by a pair 7.2 and 7.5 magnitude earthquakes. Devastation is quite high, media says. pic.twitter.com/sj7CzuwdBL— Straturka (@straturka) June 25, 2026పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాష్ట్ర టెలివిజన్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని వెల్లడించారు.భూకంప ప్రభావంతో కారకాస్ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాలు, వాణిజ్య కేంద్రాలు దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. జూన్ 24న వెనెజువెలాకు జాతీయ సెలవు దినం. దీంతో ఇళ్లలోనే ఎక్కువ మంది ఉండిపోయారు. దీంతో మృతుల సంఖ్కయ ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. Tras los fuertes sismos registrados esta tarde en el país, hemos decretado Estado de Emergencia en todo el territorio nacional. Hacemos un llamado a todos los ciudadanos y ciudadanas a mantenerse atentos, en resguardo y con la mayor calma posible. pic.twitter.com/WFlj6rVs0U— Delcy Rodríguez (@delcyrodriguezv) June 25, 2026ఇక అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించింది. మరోవైపు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలె, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు మరియా ఎల్విరా సలజార్, వెనెజువెలా ప్రతిపక్ష నేతలు సహా పలువురు అంతర్జాతీయ నాయకులు వెనెజువెలా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు.ప్రస్తుతం వెనెజువెలా వ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల తొలగింపు, దూర ప్రాంతాల నుంచి సమాచారం సేకరణ పూర్తయిన తర్వాతే అసలు నష్టం, ప్రాణనష్టం ఎంత జరిగిందన్న విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది. భూకంపాల తీవ్రత దృష్ట్యా వెనెజువెలా ఇటీవల కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తులలో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డబుల్ ట్రబుల్లో ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధ వ్యవహారంలో.. తన సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. యుద్ధం సాగుతున్న తీరు, దాని వ్యయం, వ్యూహాత్మక లక్ష్యాలపై పెరుగుతున్న అసంతృప్తి మధ్య బుధవారం రిపబ్లికన్ పార్టీ ఎంపీలతో జరిగిన క్లోజ్డ్-డోర్ సమావేశంలో ట్రంప్, రిపబ్లికన్ సెనేటర్ బిల్ క్యాసిడీ Bill Cassidy మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.సమావేశంలో క్యాసిడీ.. ఇరాన్తో కుదిరిన తాజా ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై ప్రశ్నలు లేవనెత్తారు. అమెరికా ప్రకటించిన లక్ష్యాలు నెరవేరకుండానే ఇరాన్కు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారనే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రజలకు ఇప్పటివరకు చెప్పిన దానికంటే ఎక్కువ సమాచారం తెలుసుకునే హక్కు ఉంది’’ అని సమావేశం అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధ వ్యూహం మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోందా? లేదా? అన్నది స్పష్టంగా లేదని కూడా అన్నారు.ఒకవైపు.. ఈ ఘటన రిపబ్లికన్ పార్టీలో పెరుగుతున్న విభేదాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికన్ కాంగ్రెస్ నియంత్రణను నిర్ణయించే కీలక ఎన్నికలు(మధ్యంతర) సమీపిస్తున్న సమయంలో ఇరాన్ యుద్ధం ట్రంప్కు రాజకీయ భారం అవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.బిల్ క్యాసిడీ.. అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్. వృత్తిరీత్యా వైద్యుడు అయిన ఆయన.. 2015 నుంచి అమెరికా సెనెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021లో ట్రంప్పై జరిగిన రెండో ఇంపీచ్మెంట్ విచారణలో ఆయన దోషిగా తేల్చాలని ఓటు వేసిన కొద్దిమంది రిపబ్లికన్ సెనేటర్లలో ఒకరు. మితవాద (Moderate) రిపబ్లికన్గా పేరున్న క్యాసిడీ, అవసరమైతే తన పార్టీ నాయకత్వాన్నీ బహిరంగంగా ప్రశ్నించే నేతగా గుర్తింపు పొందారు.ఇదిలా ఉండగా.. అమెరికా ప్రజల్లోనూ యుద్ధంపై అసంతృప్తి పెరుగుతున్నట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి. యుద్ధం వల్ల వచ్చిన ఖర్చుకు తగిన ఫలితం లభించిందని కేవలం నలుగురిలో ఒకరు మాత్రమే భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ కూడా ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు తెలుస్తోంది.ఇంకోవైపు అమెరికా సెనెట్ ఆమోదించిన ఒక తీర్మానం కూడా ట్రంప్పై ఒత్తిడిని పెంచింది. ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని కోరుతూ తీసుకొచ్చిన ఆ తీర్మానానికి కొంతమంది రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వగా, వారిలో క్యాసిడీ కూడా ఒకరు. అయితే ఆ తీర్మానాన్ని ట్రంప్ “ప్రతీకాత్మక చర్య మాత్రమే” అంటూ కొట్టిపారేశారు. అలాంటి సందేశాలు ఇరాన్కు అమెరికా బలహీనంగా కనిపించేలా చేస్తాయని వ్యాఖ్యానించారు.మరోవైపు, ఈ అంతర్గత రాజకీయ ఉద్రిక్తతల మధ్యే ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్కు అదనంగా 70 బిలియన్ డాలర్ల యుద్ధ నిధుల కోసం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఉన్న 867 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్కు ఇది అదనంగా కావడం గమనార్హం. దీంతో యుద్ధ ఖర్చులు, వ్యూహాత్మక దిశ, రాజకీయ ప్రభావంపై అమెరికాలో చర్చ మరింత వేడెక్కుతోంది. -
వెనెజువెలా, జపాన్లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరిక జారీ
భారీ భూకంపాలతో వెనెజువెలా, జపాన్ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల భవనాలు కుప్పకూలిపోగాa.. ప్రాణ నష్టం సైతం వాటిల్లినట్లు తెలుస్తోంది. వెవెజువెలాలో నిమిషాల వ్యవధిలోనే శక్తివంతమైన రెండు ప్రకంపనలు సంభవించాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వెనిజులాలో సుమారు 7.5, 7.1 తీవ్రతలతో(రిక్టర్ స్కేలుపై)తో వరుసగా రెండు శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో.. మోంటాల్బాన్ ప్రాంతంలో 13.2 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. దీని ప్రభావం కొలంబియా, కారకాస్లో కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కరేబియన్ తీర ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు అమెరికా సునామీ కేంద్రం తెలిపింది. ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని అపార్ట్మెంట్లలో పగుళ్లు ఏర్పడ్డాయి, అద్దాలు పగిలిపోయాయి.A powerful 7.1-magnitude earthquake just struck Altamira, Caracas, Venezuela. pic.twitter.com/wFsX2GwrHs— Weather Monitor (@WeatherMonitors) June 24, 2026వెనిజులాలో సంభవించిన భూకంపం కారణంగా ప్యూర్టో రికో, అమెరికా వర్జిన్ దీవులకు సునామీ ముప్పు ఉందని సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. అయితే అమెరికా తీర ప్రాంతాలకు ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని పేర్కొంది.“అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించిన తర్వాత, సముద్ర మట్టం హెచ్చుతగ్గులు, బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా ప్యూర్టో రికో, వర్జిన్ దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఇవి తీర ప్రాంతాలు, బీచ్లు, నౌకాశ్రయాలు, తీర జలాల్లో ప్రమాదకరంగా మారవచ్చు” అని తెలిపింది. ఇక, జపాన్లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇక్కడి నష్టం వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. MORE: Multiple structures have reportedly collapsed after a strong earthquake struck Caracas. https://t.co/r1EaakspGy— Breaking911 (@Breaking911) June 24, 2026WATCH: Terrifying Moment Powerful 7.1-Magnitude Earthquake Rocks Caracas, Venezuela pic.twitter.com/D9A5cXEV6e— Breaking911 (@Breaking911) June 24, 2026 -
ఎప్స్టీన్ ఫైల్స్: ‘అవును..’ బిల్గేట్స్ సంచలన వాంగ్మూలం!
ఎప్స్టీన్ కుంభకోణంలో.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు బిల్ గేట్స్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎదుట ఆయన ఇచ్చిన ‘రహస్య’ వాంగ్మూలం ఇప్పుడు బయటకు రావడం సంచలనంగా మారింది. అందులో.. తనకు ముగ్గురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని అంగీకరించిన గేట్స్.. జెఫ్రీ ఎప్స్టీన్ తనను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించి ఉండొచ్చని ఆరోపించారు!.అమెరికా ప్రతినిధుల సభ పర్యవేక్షణ కమిటీ (హౌస్ ఓవర్సైట్ కమిటీ) ఎప్స్టీన్ నెట్వర్క్, అతడి పరిచయాలపై దర్యాప్తు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూన్ 10న బిల్ గేట్స్ స్వచ్ఛందంగా కమిటీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా విడుదలైన ట్రాన్స్క్రిప్ట్తో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.గేట్స్ ఏం చెప్పినట్లు ఉందంటే.. రష్యాకు చెందిన బ్రిడ్జ్ క్రీడాకారిణి మిలా ఆంటోనోవా, అణు భౌతిక శాస్త్రవేత్త కరీమా నిగ్మతులినా, వైద్య రంగ పారిశ్రామికవేత్త అలిస్ జాకబ్స్ నెసెల్రోట్లతో తనకు సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే ఈ వ్యక్తిగత వ్యవహారాలకు ఎప్స్టీన్తో ఉన్న పరిచయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. "ఆ సంబంధాలు నా కుటుంబానికి బాధ కలిగించాయి. కానీ ఎప్స్టీన్ వాటికి సంబంధించిన సమాచారంతో పాటు మరికొన్ని అబద్ధాలను కలిపి నాపై ఒత్తిడి తీసుకురావాలని చూశాడు" అని గేట్స్ పేర్కొన్నారు.బ్లాక్మెయిల్కు ప్రయత్నించాడా?కమిటీ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్స్టీన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించి తనపై ప్రభావం చూపాలని భావించి ఉండొచ్చని చెప్పారు. "అతడు నన్ను ఎప్పుడూ బ్లాక్మెయిల్ చేయలేదు. కానీ బయటకు వచ్చిన కొన్ని ఈమెయిల్స్ను చూస్తే, అలా చేయాలనే ఆలోచన అతడికి ఉండి ఉండొచ్చనే అనుమానం కలుగుతోంది" అని వ్యాఖ్యానించారు.2014లో ఎప్స్టీన్తో సంబంధాలు తెంచుకున్న తర్వాత, తాను సంబంధం పెట్టుకున్న ఓ మహిళకు ఖర్చు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరుతూ ఎప్స్టీన్ ఈమెయిల్ పంపినట్లు కూడా గేట్స్ వెల్లడించారు. అయితే తాము ఒక్క పైసా కూడా చెల్లించబోమని తన బృందానికి స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు.బాధితుల సమక్షంలో ఉన్నానేమో...వాంగ్మూలంలో అత్యంత కీలకంగా మారిన అంశం ఇదే. ఎప్స్టీన్ బాధితుల్లో కొందరు అతడి ఉద్యోగులుగానూ పనిచేసినట్లు దర్యాప్తులో తేలిందని కమిటీ సభ్యులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన గేట్స్.. ఎప్స్టీన్ విమానంలో జరిగిన ఒక సమావేశం ముగిసిన తర్వాత కొందరు మహిళా ఉద్యోగులను చూసినట్లు గుర్తు చేసుకున్నారు. "అది మంచి పాయింట్. నేను ఎప్స్టీన్ బాధితుల సమక్షంలో ఉండి ఉండొచ్చు" అని అంగీకరించారు. అయితే తాను ఎప్పుడూ ఎలాంటి లైంగిక వేధింపులను ప్రత్యక్షంగా చూడలేదని, అలాంటి ఘటనల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు.ఎస్టీడీ ఆరోపణలపై స్పందనఎప్స్టీన్కు సంబంధించిన పత్రాల్లో బిల్ గేట్స్కు లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే వ్యాధి (ఎస్టీడీ) సోకిందనే అనుమానం వ్యక్తమైందని, దానికి సంబంధించిన మందులు రహస్యంగా అందించారనే ఆరోపణలు కూడా ఉన్నాయని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన గేట్స్.. "నాకు ఎప్పుడూ ఎలాంటి ఎస్టీడీ రాలేదు. అలాంటి వ్యాధి సోకిందేమోనని ఆందోళన కలిగి ఉండొచ్చు. కానీ నాకు ఎప్పుడూ అలాంటి వ్యాధి లేదు. రహస్యంగా మందులు కూడా తీసుకోలేదు" అని స్పష్టం చేశారు.ఎప్స్టీన్తో సంబంధాలు ఎలాగంటే..2011లో తనకు అత్యంత విశ్వసనీయ సహచరుడైన డాక్టర్ బోరిస్ నికోలిక్ ద్వారా ఎప్స్టీన్తో పరిచయం ఏర్పడిందని గేట్స్ తెలిపారు. అప్పటికే ఎప్స్టీన్కు లైంగిక నేరాలకు సంబంధించిన శిక్ష పడిన విషయం తనకు తెలుసని అంగీకరించారు. అయినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాల కోసం బిలియన్ల డాలర్ల నిధులు సమీకరించగలనని ఎప్స్టీన్ చెప్పడంతో అతడితో వృత్తిపరమైన సంబంధాలు కొనసాగించినట్లు వివరించారు. నాలుగేళ్ల వ్యవధిలో 12 నుంచి 14 సార్లు ప్రత్యక్షంగా, రెండు సార్లు వీడియో కాల్స్లో మాట్లాడినట్లు చెప్పారు.అయితే ఎప్స్టీన్ చెప్పిన వాగ్దానాలు ఏవీ నెరవేరలేదని, అతడితో పరిచయం కొనసాగించడం జీవితంలో చేసిన తప్పిదాల్లో ఒకటిగా భావిస్తున్నానని గేట్స్ పేర్కొన్నారు.ఎప్స్టీన్ ఫైల్స్లో ఏముంది?అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన అదనపు పత్రాలు, ఈమెయిల్స్, ఫొటోలు ఈ వ్యవహారాన్ని మరోసారి వార్తల్లోకి తెచ్చాయి. ఆ పత్రాల్లో బిల్ గేట్స్తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు, ఎప్స్టీన్తో జరిగిన సంప్రదింపులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. గేట్స్తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే అందులోని మహిళల పేర్లను గోప్యంగా ఉంచారు.ఇక ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈమెయిల్స్లో ఎప్స్టీన్, గేట్స్ ఫౌండేషన్కు చెందిన కొంతమంది సిబ్బంది మధ్య సంభాషణలు కూడా వెలుగుచూశాయి. దీంతో గేట్స్ ఫౌండేషన్ గతంలో ఎప్స్టీన్తో ఉన్న సంబంధాలపై ప్రత్యేక బాహ్య సమీక్ష ప్రారంభించినట్లు ప్రకటించింది.అదే సమయంలో కమిటీ మరో ట్రాన్స్క్రిప్ట్ను కూడా విడుదల చేసింది. అందులో ఎప్స్టీన్ దీర్ఘకాల సహాయకురాలు లెస్లీ గ్రాఫ్.. తన మాజీ యజమానిని "మాస్టర్ మానిప్యులేటర్"గా అభివర్ణించింది. అయితే అతడి నేరాల గురించి తనకు తెలియదని చెప్పింది. ఎప్స్టీన్, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణలకు తానే అనేకసార్లు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు కూడా ఆమె వెల్లడించింది.ఎందుకు ప్రాధాన్యం..?ప్రముఖ ఫైనాన్షియర్ అయిన ఎప్స్టీన్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. అయితే 2019లో ఎప్స్టీన్ జైలులో మృతిచెందినా.. అతడి పరిచయ వలయం, ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన వ్యక్తులతో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజా వాంగ్మూలంతో బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితం, ఎప్స్టీన్తో అతడి పరిచయాలు, బ్లాక్మెయిల్ ఆరోపణలు, బాధితుల సమక్షంలో ఉండి ఉండొచ్చన్న అంగీకారం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ప్రపంచ ప్రముఖులపై ఎప్స్టీన్ వద్ద ఎంత సమాచారం ఉండేది, ఆ సమాచారం ద్వారా అతడు ఎంత ప్రభావం చూపగలిగాడన్న ప్రశ్నలకు ఈ కేసు కొత్త కోణాన్ని జోడించింది. -
భారతీయులు ఖర్చు పెట్టరు.. వాన్స్ ప్రతిపాదనపై ట్రంప్ వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు చేసిన ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. పుతిన్-జెలెన్స్కీల మొండిపట్టుతో ఆ చర్చలు ముందుకు సాగడం లేదు. అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి వైట్హౌజ్లో జరిగిన ఓ ఆసక్తికర చర్చ ఇప్పుడు బయటకు వచ్చింది. యుద్ధ విరమణ ఒప్పందాన్ని పర్యవేక్షించేందుకు నాటో దేశాల బలగాల బదులుగా భారత సైన్యాన్ని వినియోగించవచ్చనే ప్రతిపాదన వచ్చిందట. దానికి ట్రంప్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చినట్లు ఇప్పుడు బయటకు వచ్చింది. జూన్ 23న విడుదలైన రిజిమ్ చేంజ్ (Regime Change) పుస్తకాన్ని జర్నలిస్టులు మ్యాగీ హాబర్మన్, జోనాథన్ స్వాన్ రచించారు. ఇందులో 2025 జనవరి 30న ఓవల్ ఆఫీస్లో జరిగిన సమావేశం గురించి వివరించారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కేవలం పది రోజుల తర్వాత ఈ సమావేశం జరిగినట్లు పేర్కొన్నారు.ఆ సమావేశంలో.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ప్రత్యేక దూతగా నియమితులైన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలాగ్ శాంతి ప్రణాళికను వివరించారు. ఆ ప్రణాళికలో యుద్ధ విరమణ అమలును పర్యవేక్షించేందుకు ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాల బలగాలను ఉక్రెయిన్లో మోహరించే ప్రతిపాదన చేశారు.అయితే నాటో సభ్య దేశాల సైన్యం ఉక్రెయిన్లో ఉంటే రష్యా దానిని రెచ్చగొట్టే చర్యగా పరిగణించే అవకాశం ఉందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారట. అలా చేస్తే ఉద్రిక్తతలు మరింత పెరిగి యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందని ఆయన భావించారట. దీంతో నాటోకు చెందని దేశాల బలగాలను ఉపయోగించవచ్చా? అని వాన్స్ ప్రశ్నించగా.. అప్పటి జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ వాల్ట్జ్ కూడా ఆ ఆలోచనకు సానుకూలంగా స్పందించారు. అనంతరం భారత్, సౌదీ అరేబియా వంటి దేశాల బలగాలను పరిగణనలోకి తీసుకోవచ్చని వాన్స్ సూచించారట.అయితే ట్రంప్ వెంటనే ఆ ప్రతిపాదనను తోసిపుచ్చినట్లు బిగ్గరగా నవ్వినట్లు.. రిజిమ్ చేంజ్ రచయితలు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, మోదీ తనను ఇష్టపడతారని చెప్పినప్పటికీ, "భారతీయులు అలాంటి వాటికి ఖర్చు పెట్టరు. వారు దీనికి డబ్బులు వెచ్చించరు" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించినట్లు పుస్తకంలో వెల్లడించారు.అమెరికాకు ఆర్థిక బాధ్యతలు పెరగకూడదనే అంశంపైనే ట్రంప్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పుస్తకం చెబుతోంది. బ్రిటన్ లేదంటే ఫ్రాన్స్ తమ సొంత నిర్ణయంతో బలగాలను పంపితే తనకు అభ్యంతరం లేదని, కానీ అమెరికా నేరుగా ఇందులో భాగస్వామి కాకూడదని ఆయన భావించినట్లు వివరించింది. అదే సమావేశంలో ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీపై కూడా తీవ్ర విమర్శలు చేసినట్లు పుస్తక రచయితలు పేర్కొన్నారు. జెలెన్స్కీని తట్టిపోయడమే కాకుండా.. ఉక్రెయిన్ను ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరమైన దేశాల్లో ఒకటిగా వ్యాఖ్యానించినట్లు వెల్లడించారు.అయితే ఇవన్నీ కొత్తగా విడుదలైన పుస్తకంలోని వాదనలు మాత్రమే. వైట్హౌస్ లేదంటే సంబంధిత వర్గాలు ఈ వివరాలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయినప్పటికీ, ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విదేశాంగ విధానం, భారత్తో ట్రంప్ సంబంధాలపై ఈ పుస్తకం కొత్త చర్చకు తెరలేపింది. -
అణు కేంద్రాలు తెరవకపోతే.. చర్చలే రద్దు!
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ముందుకు సాగుతున్న వేళ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అణు కేంద్రాల్లో అంతర్జాతీయ తనిఖీలకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా ప్రకటించగా.. కాసేపటికే టెహ్రాన్ వర్గాలు దానిని తోసిపుచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. “అది పూర్తిగా తప్పు” అంటూ ఇరాన్పై మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలు తప్పనిసరి. ఇరాన్ అధికారులు తనిఖీల అంశాన్ని ఖండిస్తున్నప్పటికీ, తెర వెనుక వారు అంగీకరించారని ట్రంప్ పేర్కొన్నారు. "వాళ్లు తప్పు చెబుతున్నారు. నిజంగా అంగీకరించకపోతే ఈ క్షణమే చర్చలను రద్దు చేస్తాను" అని వ్యాఖ్యానించారు.జేడీ వాన్స్ ప్రకటనతో..అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఇటీవల స్విట్జర్లాండ్ చర్చల అనంతరం మాట్లాడుతూ.. ఇరాన్ చివరకు ఐఏఈఏ తనిఖీలకు అంగీకరించిందని ప్రకటించారు. ఇరు దేశాల ఒప్పందంలోనే దీనిని పెద్ద ముందడుగుగా అభివర్ణించారు. అయితే కొద్ది గంటల్లోనే ఇరాన్ ఆ ప్రకటనను ఖండించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ వాదన ఏమిటి?ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం అమెరికా ప్రకటనలను ఖండిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్లో జరిగిన చర్చల్లో తనిఖీలపై ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు గురైన అణు కేంద్రాలను తనిఖీ చేయడానికి ప్రస్తుతం అనుమతించే యోచన లేదని తెలిపింది. అసలు వివాదం ఎందుకు కీలకం?ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించాలంటే తనిఖీలు అత్యంత కీలకమైన అంశం. గతంలో జరిగిన అణు ఒప్పందాలన్నింటిలోనూ IAEA పర్యవేక్షణ ప్రధాన షరతుగా ఉండేది. ఇప్పుడు కూడా అదే అంశాన్ని అమెరికా "నాన్-నెగోషియబుల్" షరతుగా చూస్తోంది. ట్రంప్ పరిపాలన అభిప్రాయం ప్రకారం, తనిఖీలు లేకుంటే ఇరాన్ నిజంగా అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేసిందో లేదో నిర్ధారించడం అసాధ్యం. అందుకే తనిఖీలు తప్పనిసరి అంటోంది. ట్రంప్ ప్రకారం, సరైన సమయంలో IAEA తనిఖీ బృందాలు ఇరాన్లోకి ప్రవేశిస్తాయని, అణు కార్యకలాపాలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అణు తనిఖీలు లేకుండా ఎలాంటి ఒప్పందమూ ఉండదని.. అవసరమైతే చర్చలనే రద్దు చేస్తానని హెచ్చరించారు. దీంతో చర్చల భవిష్యత్తుపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. -
వాన్స్ను ముందుకు నెట్టి.. ట్రంప్ సేఫ్ గేమ్?
స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధి బృందం అకస్మాత్తుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదనే ప్రచారం వైరల్ కాగా.. మరోవైపు, ఇరాన్తో కుదురుతున్న వివాదాస్పద ఒప్పందం విజయవంతమైతే కీర్తి ట్రంప్దే, విఫలమైతే నింద మాత్రం వాన్స్పైనే పడేలా రాజకీయ వ్యూహం నడుస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ సమావేశ మందిరంలోకి వచ్చి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్తో మాట్లాడి, అనంతరం అమెరికా ప్రతినిధుల వైపు చూడకుండానే వెనుదిరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిని చాలామంది అమెరికాకు, ముఖ్యంగా జేడీ వాన్స్కు జరిగిన దౌత్యపరమైన అవమానంగా అభివర్ణించారు.అయితే వాన్స్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. "నన్ను అవమానించారనే భావన నాకు లేదు. ఇరానీయన్లు చర్చల్లో కొన్నిసార్లు చాలా గందరగోళంగా వ్యవహరిస్తారు. కానీ ఆ ఘటన తర్వాత కూడా మేము దాదాపు తొమ్మిది గంటలపాటు చర్చలు కొనసాగించాం" అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కనిపించిన దృశ్యాల కంటే, చర్చల గదిలో జరిగిన పరిణామాలే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. అమెరికా ప్రతినిధులతో కలిసి ఫొటో దిగాలన్న ప్రతిపాదనపై, అలాగే అదే సమయంలో ట్రంప్ చేసిన హెచ్చరికలపై అసంతృప్తితో ఇరాన్ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. లెబనాన్లోని హెజ్బొల్లా కార్యకలాపాలపై ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేయడాన్ని కూడా టెహ్రాన్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.అయితే అసలు రాజకీయ చర్చ ఇప్పుడు మరో కోణంలో సాగుతోంది. ఇరాన్తో కుదురుతున్న తాత్కాలిక శాంతి ఒప్పందానికి అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చమురు ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల, ఇరాన్ పునర్నిర్మాణానికి భారీ ఆర్థిక సహకారం వంటి అంశాలు రిపబ్లికన్ పార్టీలోని కొందరికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ తనను పక్కన పెట్టి, ఒప్పందం ముఖచిత్రంగా జేడీ వాన్స్ను ముందుకు నెట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చర్చలకు వాన్స్నే నాయకత్వం వహించడమే కాకుండా, ఇరాన్ ఒప్పందాన్ని సమర్థించే బాధ్యత కూడా ఆయన భుజాలపై పడింది. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ శాఖ నేతలు వెనుకకు తగ్గిన వేళ.. విమర్శలన్నింటినీ ఎదుర్కొంటున్నది వాన్స్ కావడం గమనార్హం.ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూర్చాయి. "ఒప్పందం విజయవంతమైతే క్రెడిట్ నాదే.. విఫలమైతే నింద జేడీదే" అంటూ ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ట్రంప్ కావాలనే వాన్స్ను ముందుకు నెట్టి, తాను సురక్షిత దూరంలో నిలిచారని అమెరికా మీడియా విశ్లేషిస్తోంది.రిపబ్లికన్ వర్గాల్లో కూడా ఈ ఒప్పందాన్ని ఇప్పటికే "వాన్స్ డీల్"గా పిలవడం మొదలైంది. ఒప్పందం కుదిరితే 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో వాన్స్కు భారీ రాజకీయ లాభం కలిగే అవకాశం ఉంది. కానీ చర్చలు విఫలమైతే లేదంటే ఇరాన్ మరోసారి అమెరికాను ఇబ్బందుల్లోకి నెడితే.. ఆ రాజకీయ దెబ్బ కూడా ముందుగా వాన్స్కే తగిలే ప్రమాదం కనిపిస్తోంది. -
డీల్పై కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ను మళ్లీ రెచ్చగొట్టిన ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్ పాటించకపోతే తాను అవసరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో కాస్త ఘాటు హెచ్చరికలే జారీ చేశారు."ఇరాన్ తమ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. ఒప్పందం పట్ల వాళ్లు సక్రమంగా ప్రవర్తించాల్సిందే. లేకుంటే నేను చేయాల్సింది నేను చేస్తా. ఊరుకుంటానుకుంటే ఆ దేశం పొరపాటే" అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ.. గత వారం ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాత్కాలిక ఒప్పందం(MoU)పై డిజిటల్ సంతకాలు చేశారు. ప్రత్యక్ష చర్చల్లో భాగంగా.. మొన్న ఆదివారం ఇరాన్, అమెరికా, మధ్యవర్తిత్వ ప్రతినిధులు స్విట్జర్లాండ్లో చర్చలు మొదలుపెట్టారు. దీంతో 60 రోజుల్లో ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. అయితే.. స్విస్ చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ను కవ్వించేలా మాట్లాడారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే భీకర దాడులు.. అదీ గతంలో కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగానే ఇరాన్ ప్రతినిధులు చర్చల మధ్య నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో ఇరాన్ అధికార ప్రతినిధులు ట్రంప్ వార్నింగ్పై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ తరుణంలో.. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్కు ఇరాన్ నుంచి కౌంటర్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిధుల వినియోగంపైనా ఓ క్లారిటీఇదిలా ఉంటే.. ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధులను విడుదల చేసే అంశంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. విడుదలయ్యే డబ్బు మొత్తం అమెరికా నుంచే ఆహార పదార్థాల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. "విడుదల చేసే డబ్బంతా తిరిగి అమెరికా రైతులకే చేరుతుంది. ఎందుకంటే ఆ నిధులతో ఇరాన్ అమెరికా నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సుమారు 9.1 కోట్ల జనాభాకు సరిపడా ఆహారాన్ని ఇరాన్ ఉత్పత్తి చేయలేకపోతోంది" అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఇరాన్కు నిధుల విడుదల అనేది నేరుగా నగదు సాయం కాదని, నియంత్రిత వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థలో భాగమని అమెరికా సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతూనే..అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఇరాన్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా ఒప్పందం శాంతికి మార్గం వేస్తుందా? లేదంటే ఇరాన్ ఒప్పంద నిబంధనల అమలుపై కొత్త వివాదాలకు దారితీస్తుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది.ఇదీ చదవండి: ఇదెక్కడి ఫిట్టింగ్?.. పే చేయాల్సింది గల్ఫ్ దేశాలేనా! -
బిగ్ రిలీఫ్.. చేతులు కలిపిన అమెరికా-ఇరాన్!
ఓవైపు హెచ్చరికలు, మరోవైపు శాంతి చర్చలు.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా-ఇరాన్ సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్విట్జర్లాండ్లో జరిగిన తొలి విడత చర్చల అనంతరం 60 రోజుల్లో తుది శాంతి ఒప్పందానికి చేరుకోవాలనే రోడ్మ్యాప్ను ఇరు దేశాలు ఆమోదించాయి. ఖతర్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో.. ఇందుకు ఇరు దేశాల ప్రతినిధులు చేతులు కలపడం గమనార్హం. స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో ఆదివారం జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక మలుపు తిరిగాయి. ఖతర్, పాకిస్తాన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం.. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య నెలకొన్న ప్రధాన విభేదాలను పరిష్కరించేందుకు 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక (రోడ్మ్యాప్)పై ఇరు దేశాలు అంగీకరించాయి.'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' (Islamabad MoU) కింద జరిగిన తొలి విడత చర్చలు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయని మధ్యవర్తి దేశాలు పేర్కొన్నాయి. తుది ఒప్పందానికి అవసరమైన అమలు విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థ, నిబంధనల అమలు, పరస్పర బాధ్యతలపై ఇక నుంచి సాంకేతిక స్థాయి చర్చలు వెంటనే ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్నిఇటు ఇరాన్ సైతం ధృవీకరించింది. Tireless Pakistani and Qatari mediation has delivered major progress to end Lebanon War. Oil and petrochem exports are waived, blockade lifted, some frozen assets released, and major reconstruction & development plan launched for Iran. 1st real test: Lebanon deconfliction cell https://t.co/q0okD2qwSO— Seyed Abbas Araghchi (@araghchi) June 22, 2026చర్చల్లో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అపార్థాలు, ఉద్రిక్తతలు, అనుకోని ఘర్షణలు నివారించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య నేరుగా సమాచార మార్పిడి వ్యవస్థ (డైరెక్ట్ కమ్యూనికేషన్ ఛానెల్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చర్చల కాలంలో ఏవైనా సంఘటనలు చోటుచేసుకున్నా వాటిని వెంటనే పరిష్కరించేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది.ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకల అంశం కూడా ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. హర్ముజ్లో భద్రత, నౌకాయాన స్వేచ్ఛను కొనసాగించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని అంగీకరించారు. అలాగే రాజకీయ స్థాయిలో మొత్తం మధ్యవర్తిత్వ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి ప్రధాన చర్చాకర్తలు తరచూ నివేదికలు సమర్పిస్తారు. అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, పర్యవేక్షణ విధానాలు, వివాద పరిష్కార వ్యవస్థ వంటి అంశాలపై ప్రత్యేక వర్కింగ్ గ్రూపులు పనిచేయనున్నాయి.లెబనాన్లో కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించేందుకు అమెరికా, ఇరాన్, లెబనాన్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక 'డీ-కాన్ఫ్లిక్షన్ సెల్'ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ఖతర్, పాకిస్తాన్ సౌకర్యదాతలుగా వ్యవహరించనున్నాయి.ఈ చర్చల్లో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ పాల్గొనగా.. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఖతర్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ కూడా చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు.. చర్చలు జరుగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. దీంతో ఇరాన్ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారని.. చర్చల నుంచి వాకౌట్ చేశారని.. అమెరికాకు కౌంటర్ వార్నింగ్ ఇచ్చారని కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ చర్చల టేబుల్పై పురోగతి సాధించామని జేడీ వాన్స్ ప్రకటించారు. లెబనాన్లో కాల్పుల విరమణ కొనసాగించడం, ఇరాన్తో సంబంధాలను కొత్త దిశగా తీసుకెళ్లడంలో ముందడుగు పడిందని ఆయన పేర్కొన్నారు.మొదటి విడత చర్చల్లో విభేదాలు, వాకౌట్లు, హెచ్చరికలు కనిపించినప్పటికీ.. చివరకు 60 రోజుల రోడ్మ్యాప్పై అంగీకారం కుదరడం శాంతి ప్రక్రియకు ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ 60 రోజులు అమెరికా-ఇరాన్ సంబంధాల భవిష్యత్తును నిర్ణయించే కీలక కాలంగా మారనున్నాయి. -
బొలీవియాలో ఎమర్జెన్సీ ప్రకటన
దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో అధ్యక్షుడు రోడ్రిగో పాజ్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి (State of Emergency) ప్రకటించారు. ఏప్రిల్ చివరి నుంచి కొనసాగుతున్న ఆందోళనలు, రహదారి దిగ్బంధనాల కారణంగా ఇంధనం, ఆహార సరుకులు వంటి నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడి దేశ జీవన వ్యవస్థ దెబ్బతింది.అత్యవసర పరిస్థితి ద్వారా రహదారి దిగ్బంధనాలను తొలగించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరిస్తామని అధ్యక్షుడు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని బొలీవియా కాంగ్రెస్ 72 గంటల్లో ఆమోదించాలి లేదా తిరస్కరించాలి.ఆందోళనలకు కారణాలుభూ సంస్కరణల ప్రతిపాదనలపై రైతుల ఆగ్రహంఇంధన సబ్సిడీల కోతలకు వ్యతిరేక నిరసనలుఆర్థిక సంస్కరణలు, పొదుపు చర్యలపై వ్యతిరేకతరాజ్యాంగ సవరణల ప్రతిపాదనలపై అభ్యంతరాలుఅధ్యక్షుడు రోడ్రిగో పాజ్ రాజీనామా చేయాలన్న డిమాండ్పలువురు మృతి.. వందల అరెస్టులుగనికార్మికులు, రైతులు, ఆదివాసీ సంఘాల నేతృత్వంలో జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు పలువురు ప్రాణాలు కోల్పోగా, వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని సహా పలు ప్రాంతాల్లో పోలీసులు, సైనిక బలగాలు మోహరించాయి.మాజీ అధ్యక్షుడిపై ఆరోపణలుప్రస్తుత సంక్షోభం వెనుక మాజీ అధ్యక్షుడు Evo Morales ఉన్నారని అధ్యక్షుడు పాజ్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మొరాలెస్ ఖండించారు.శాంతి ప్రయత్నాలు విఫలంమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, తనతో పాటు మంత్రుల జీతాలను సగానికి తగ్గించడం, వివిధ వర్గాలతో చర్చల కోసం ప్రత్యేక మండలి ఏర్పాటు వంటి చర్యలు చేపట్టినా ఆందోళనలు తగ్గలేదు. దీంతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించే దిశగా అడుగులు వేసింది. -
‘‘నోర్ముయ్!.. లేదా బయటకు పో.. నీ హద్దులో నువ్వు ఉండు!’’
ఐక్యరాజ్యసమితి (UN) వేదికపై దౌత్య మర్యాదలు పక్కనపడ్డాయి. ఇజ్రాయెల్ను తొలిసారిగా లైంగిక హింస, చిన్నారుల హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన బ్లాక్లిస్టులో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ దేశ రాయబారి డ్యానీ డానన్.. ఐరాస ఉన్నతాధికారులతో బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. ఒక దశలో "నోరు మూసుకోండి" అంటూ అధికారిణిపై కావరం ప్రదర్శించడం తీవ్ర చర్చనీయాంశమైంది.న్యూయార్క్లో శుక్రవారం "సాయుధ ఘర్షణల్లో లైంగిక హింస నిర్మూలన దినోత్సవం" సందర్భంగా ఐరాస సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాయబారి డ్యానీ డానన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ను లైంగిక హింసకు సంబంధించిన ఆరోపణల జాబితాలో చేర్చిన ఐరాస ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్ ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నారని.. ప్రమీలా పాటెన్ కూడా అదే వైఖరికి లొంగిపోయారని ఆరోపించారు. అంతేకాదు, ఆమె తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. డానన్ వ్యాఖ్యల మధ్యలో చిన్నారులు, సాయుధ ఘర్షణల అంశాలపై ఐరాస ప్రతినిధిగా ఉన్న వానెస్సా ఫ్రాజియర్ జోక్యం చేసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ ధ్రువీకరించిన ఆధారాల ఆధారంగానే నమోదు చేశామని చెప్పారు. దీనికి ఆగ్రహించిన డానన్.."మేము సభ్య దేశం. మీరు ఐరాస ఉద్యోగి మాత్రమే. మీ హద్దులో మీరుండాలి. ఇప్పుడు మీరు నోరు మూసుకోవాలి. లేదంటే బయటకు పోండి. మీ నివేదిక సిగ్గుచేటు" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.Israeli ambassador to the United Nations, Danny Danon, got in a shouting match with the U.N.'s special representative for children and armed conflict, Vanessa Frazier, after she interrupted his remarks at Friday's meeting regarding allegations that Israeli soldiers and settlers… pic.twitter.com/Qp8hEuN6HU— CBS News (@CBSNews) June 20, 2026వివాదానికి కారణం ఏంటంటే.. ఇటీవల ఐరాస విడుదల చేసిన రెండు కీలక నివేదికల్లో ఇజ్రాయెల్ను బ్లాక్లిస్టులో చేర్చింది. సాయుధ ఘర్షణల సమయంలో లైంగిక హింస, అలాగే చిన్నారులపై జరుగుతున్న ఉల్లంఘనలకు సంబంధించి ఇజ్రాయెల్పై తొలిసారిగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, గాజా యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా చిన్నారులపై ఉల్లంఘనలు గణనీయంగా పెరిగాయని ఐరాస పేర్కొంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్కు శత్రువైన హమాస్ కూడా ఈ బ్లాక్లిస్టులో కొనసాగుతోంది.ఇజ్రాయెల్ ఆగ్రహంఈ నివేదికలు వెలువడినప్పటి నుంచే ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నివేదికలు పక్షపాత ధోరణితో రూపొందించబడ్డాయని ఆరోపిస్తున్న ఆ దేశం.. ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రెస్తో అధికారిక సంబంధాలను తెంచుకుంటామని కూడా హెచ్చరించింది.తాజా ఘటనతో ఐరాస–ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘనల అంశాలపై ఇరువైపులా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న వేళ.. ఐరాస వేదికపై జరిగిన ఈ మాటల యుద్ధం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. -
ట్రంప్–మెలోనీ.. ఎక్కడ చెడింది?.. ఆ ఐదే కారణమా?
మొన్నటిదాకా జార్జియా మెలోనీ.. డొనాల్డ్ ట్రంప్కు యూరప్లో అత్యంత సన్నిహిత మిత్రురాలిగా గుర్తింపు పొందారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయనకు అత్యంత నమ్మకమైన యూరోపియన్ భాగస్వామిగా నిలిచారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకోవడం, బహిరంగ వేదికలపై పరస్పరం సరదా వ్యాఖ్యలు చేసుకోవడం కనిపించింది. అలాంటిది ఈ ఇద్దరి మధ్య అకస్మాత్తుగా మాటల యుద్ధం మొదలవడం, అది వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకోవడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు ట్రంప్–మెలోనీ స్నేహానికి ఎక్కడ బీటలు వారాయో గమనిస్తే..ట్రంప్–మెలోనీ బంధం కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు. కుడిపక్ష(రైట్వింగ్) భావజాలం, వలసల నియంత్రణ, జాతీయవాద విధానాలు వంటి అనేక అంశాల్లో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. అందుకే యూరప్లో ట్రంప్కు అత్యంత సన్నిహిత మిత్రురాలిగా మెలోనీకి గుర్తింపు లభించింది. అయితే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఈ స్నేహంపై ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక్క ఫొటో వివాదం కాదు. గత కొన్ని నెలలుగా పేరుకుపోతున్న రాజకీయ విభేదాల ఫలితంగా కనిపిస్తోంది. ఆ ఐదు కారణాలివే..1. మొదటి చిచ్చు.. యుద్ధమే!ట్రంప్కు మెలోనీ ఎంత సన్నిహితురాలో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలనిపిస్తుంది. 2025లో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వేడుకకు హాజరైన ఏకైక యూరోపియన్ నాయకురాలు కూడా ఆమెనే. ఆ తర్వాత గాజా శాంతి చర్చల సందర్భంగా మెలోనీపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘అందం, తెలివితేటలు రెండూ ఉన్న నాయకురాలు’ అంటూ కొనియాడారు. కానీ ఇరాన్ యుద్ధం తర్వాత పరిస్థితి మారడం మొదలైంది. హర్ముజ్ జలసంధి భద్రత, ఇరాన్పై ఒత్తిడి వంటి అంశాల్లో అమెరికా వైఖరికి ఇటలీ పూర్తి మద్దతు ఇవ్వలేదు. యుద్ధంలో పాల్గొనేందుకు మెలోనీ నిరాకరించడంతో ట్రంప్లో అసంతృప్తి పెరిగింది. ఆ అసంతృప్తి క్రమంగా బహిరంగ విమర్శలకు దారితీసింది. మెలోనీకి ధైర్యం లేదని, అంతర్జాతీయ సంక్షోభాల విషయంలో ఆమె సరైన నాయకత్వం చూపడం లేదంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇద్దరి మధ్య విభేదాలు ఎంత దూరం వెళ్లాయో చెప్పకనే చెబుతోంది.2. పోప్ లియో వివాదంఇరాన్ యుద్ధంపై పోప్ లియో XIV శాంతి సందేశం ఇవ్వడం కూడా ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. యుద్ధం విస్తరించకుండా చర్చల ద్వారానే పరిష్కారం వెతకాలని పోప్ పిలుపునివ్వగా.. ట్రంప్ మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ భద్రతా అంశాలపై పోప్ మాట్లాడటం తగదన్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే కాథలిక్ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే ఇటలీ ప్రధాని మెలోనీ మాత్రం పోప్కు బహిరంగంగా అండగా నిలిచారు. ట్రంప్ వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని, పోప్ అభిప్రాయాలను గౌరవించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.ఈ పరిణామం ట్రంప్కు ఏమాత్రం నచ్చలేదని చెబుతున్నారు. అప్పటివరకు మిత్రురాలిగా భావించిన మెలోనీ.. తనకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారనే భావన ఆయనలో ఏర్పడింది. దీంతో మాటల యుద్ధం మరింత ముదిరింది. ఒక దశలో పోప్ కంటే మెలోనీనే పరిస్థితులను సరిగా అర్థం చేసుకోవడం లేదంటూ ట్రంప్ సెటైర్లు వేయగా.. మెలోనీ కూడా వెనక్కి తగ్గకుండా తన వైఖరిని సమర్థించుకున్నారు. దీంతో విధానపరమైన విభేదం క్రమంగా వ్యక్తిగత స్థాయికి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.3. G7లో బహిరంగ విభేదాలుఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులోనే ఇద్దరి మధ్య విభేదాలు మొదటిసారి బహిరంగంగా బయటపడ్డాయి. ఇరాన్ యుద్ధం, నాటో బాధ్యతలు, పశ్చిమ దేశాల పాత్ర వంటి అంశాలపై జరిగిన చర్చల్లో ట్రంప్ తన అసంతృప్తిని దాచుకోలేదు. యూరప్ అమెరికాను ఒంటరిగా వదిలేసిందని, నాటో మిత్రదేశాలు తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మెలోనీ ఈ వ్యాఖ్యలను నేరుగా సవాలు చేసినట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. అమెరికా–యూరప్ భాగస్వామ్యం ఇప్పటికీ బలంగానే ఉందని, పశ్చిమ దేశాల మద్దతును తక్కువ చేసి చూపడం సరైంది కాదని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.ఇద్దరూ ఒకే సోఫాపై కూర్చొని చర్చిస్తున్న దృశ్యాలు బయటకు కనిపించినా.. ఆ సమావేశాల్లో వాతావరణం అంత స్నేహపూర్వకంగా లేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రంప్ తరచూ చేస్తున్న ‘యూరప్ మమ్మల్ని వదిలేసింది’ అన్న వ్యాఖ్యలను మెలోనీ ఖండించగా.. ట్రంప్ కూడా తన వైఖరి నుంచి వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు. దీంతో ఇంతకాలం తెరవెనుక మాత్రమే ఉన్న విభేదాలు G7 వేదికగా అందరికీ కనిపించే స్థాయికి చేరుకున్నాయి. చాలా మంది విశ్లేషకుల దృష్టిలో ఇదే ఇద్దరి బంధంలో కీలక మలుపుగా నిలిచింది.4. ఫొటో వ్యాఖ్యలతో మరింత దూరంఇద్దరి మధ్య పెరుగుతున్న దూరానికి ప్రతీకగా నిలిచింది ఈ ఫొటో వివాదం. G7 సమావేశం సందర్భంగా మెలోనీ తనతో ఫొటో దిగేందుకు "బతిమాలిందని", "ఆమెపై జాలిపడి ఫొటో ఇచ్చానని" ట్రంప్ వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని మెలోనీ ఈసారి మాత్రం వెంటనే స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమని, తాను గానీ, ఇటలీ గానీ ఎప్పుడూ ఎవ్వరినీ బతిమాలుకోదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.అంతటితో ఆగకుండా, పశ్చిమ దేశాల మిత్రుల పట్ల ట్రంప్ చూపుతున్న వైఖరిపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా మిత్రదేశాల కంటే ప్రత్యర్థి దేశాల నేతల పట్ల ఆయన మరింత మర్యాదగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. మరోవైపు ట్రంప్ కూడా వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు మెలోనీ తన అభిమానుల్లో ఒకరని, కానీ ఇప్పుడు ఆమె తనకు అభిమానిగా ఉండటం ఇష్టం లేదంటూ మరోసారి వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ విభేదాలుగా మొదలైన ఈ ఘర్షణ.. వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు బహిరంగంగానే పంచులు వేసుకోవడం పరిస్థితి ఎంత మారిపోయిందో చెబుతోంది.5. మెలోనీ శిబిరం నుంచి ఎదురుదాడిఈ వివాదంలో అత్యంత గమనార్హమైన అంశం మెలోనీ చుట్టూ ఉన్న నాయకుల స్పందన. సాధారణంగా ట్రంప్పై నేరుగా విమర్శలు చేయడానికి దూరంగా ఉండే మెలోనీ శిబిరం ఈసారి మాత్రం అసాధారణంగా ఘాటుగా స్పందించింది. ప్రధాని కార్యాలయంలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా భావించే జియోవాన్బట్టిస్టా ఫజ్జోలారి ఏకంగా ట్రంప్ అమెరికా–యూరప్ చారిత్రక సంబంధాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలతో యూరప్ అంతటా అమెరికా వ్యతిరేక భావన పెరిగేలా చేస్తున్నారని కూడా విమర్శించారు.ఇంతటితో ఆగకుండా, ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకోవడం మరింత చర్చకు దారి తీసింది. దీనితో పాటు అమెరికాలో జరగాల్సిన ఇటలీ–అమెరికా వ్యాపార సదస్సు కూడా వాయిదా పడింది. ఈ వివాదాన్ని కేవలం ట్రంప్–మెలోనీ మధ్య వ్యక్తిగత ఘర్షణగా చూడలేం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా–యూరప్ సంబంధాలు, నాటో బాధ్యతలు, ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి భద్రత వంటి అంశాలపై ఇరువైపులా పెరుగుతున్న భిన్నాభిప్రాయాలకు ఇది తాజా ప్రతిబింబంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ట్రంప్కు యూరప్లో అత్యంత విశ్వసనీయ మిత్రురాలిగా భావించిన మెలోనీ సైతం ఇప్పుడు బహిరంగంగానే విభేదించడం పరిస్థితి ఎంత మారిపోయిందో సూచిస్తోంది. అందుకే ఈ మాటల యుద్ధం ఇద్దరు నేతలకే పరిమితమవుతుందా? లేక అమెరికా–యూరప్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక దూరానికి, అట్లాంటిక్ మిత్రబంధంలో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. -
డీల్ వేళ పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
ఇరాన్–అమెరికా మధ్య అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగిన మరుసటిరోజే పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. దక్షిణ లెబనాన్లోని నబాతియే ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 16 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. లెబనాన్ జాతీయ వార్తా సంస్థ (NNA) తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి తరువాత ఈ దాడులు జరిగాయి. నబాతియే నగరంతో పాటు క్ఫర్ జౌజ్, క్ఫర్ రేమాన్, జెబ్డైన్ పట్టణాలపై బాంబుల వర్షం కురిసింది. ఇటు క్ఫర్ టిబ్నిట్, రేహాన్ హైట్స్ ప్రాంతాలపై వరుసగా వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది.నబాతియే, హరూఫ్ ప్రాంతాల్లో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అల్-షర్కియా, డువైర్ మధ్య ఉన్న ఓ ఇంటిపై జరిగిన దాడిలో నలుగురు మరణించారు. క్ఫర్ సిర్ పట్టణంలో జరిగిన మరో దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు ఎన్ఎన్ఏ వెల్లడించింది. అదే సమయంలో డువైర్ మునిసిపాలిటీ భవనం సమీపంలో మోటార్సైకిల్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ దాడులతో దక్షిణ లెబనాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.డీల్ కొలిక్కి రావడంలో ఆలస్యానికి లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యం కూడా ఓ కారణమే!. కాల్పుల విరమణ అమల్లో ఉండగానే.. హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 5 వేల మంది మరణించగా.. సాధారణ పౌరులే ఉన్నారనని చెబుతూ ఇజ్రాయెల్పై లెబనాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటు లెబనాన్పై దాడులు ఆపకపోతే ఒప్పందానికి ముందుకు రామని.. అవసరమైతే భీకర యుద్ధం చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తూ వచ్చింది. దీంతో ఈ విషయంలో మిత్రదేశాలైన అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం సైతం నడిచింది. ఒకానొక టైంలో దాడులు ఆపాలంటూ నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు సైతం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే.. అవేవీ పట్టించుకోకుండా నెతన్యాహు ఇంతకాలం లెబనాన్పై పరిమిత దాడులు జరిపిస్తూ వచ్చారు. ఇజ్రాయెల్లో రాజకీయ ఒత్తిళ్లే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. హర్ముజ్ వేదికగా ఇంతకాలం కొనసాగిన ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలకు డీల్ తర్వాత చెక్ పడింది. అయితే.. ఈ డీల్పై ఇజ్రాయెల్లో నెతన్యాహు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజా దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ దాడులపై ఇటు ఇరాన్, అటు అమెరికాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. -
మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తొలిసారి స్పందించారు. ఇరాన్ ప్రయోజనాలు, "రెసిస్టెన్స్ ఫ్రంట్" హక్కులు కాపాడతామనే హామీతోనే తాను ఈ ఒప్పందానికి అంగీకరించానని అన్నారాయన. ఈ క్రమంలోనే ట్రంప్ తీరుపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిన తర్వాత ప్రజలను ఉద్దేశించి విడుదల చేసిన సందేశంలో మొజ్తబా ఖమేనీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం తామేమీ ప్రయత్నించలేదని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే తీవ్రంగా ఆరాటపడ్డారని.. ఈ క్రమంలో "అన్ని రకాల ఒత్తిళ్లు, ఎత్తుగడలు" ఉపయోగించారని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..తొలుత తాను ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించానని.. అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, జాతీయ భద్రతా మండలి సభ్యులు తనను ఒప్పించారని అన్నారు. ఇరాన్ ప్రయోజనాలు దెబ్బతినవని హామీ ఇవ్వడంతోనే ఆమోదం తెలిపినట్లు చెప్పారు. "ఈ ఒప్పందం కోసం ఇరాన్ అధికారులు నిజాయితీగా కృషి చేశారు. కానీ దీనిని సాధించేందుకు అన్ని రకాల ఒత్తిళ్లు ఉపయోగించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడే. నిరాశతోనే ఈ డీల్ను ముందుకు తీసుకొచ్చాడు" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో అమెరికా ఒప్పంద పరిధిని దాటి అదనపు షరతులు విధించాలనుకుంటే వాటికి తాము లొంగబోమని అధ్యక్షుడు తనకు స్పష్టంగా చెప్పారని ఖమేనీ వెల్లడించారు. ఇరాన్ హక్కులు, స్వాతంత్ర్యం, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో అమెరికాతో ముఖాముఖి చర్చలు జరగడం అంటే.. అమెరికా వైఖరిని అంగీకరించినట్లు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన యుద్దం ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఆనాడు ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన మొబ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మధ్యలో నాయకత్వ బాధ్యతలు ఇరాన్లో తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు.. మత, భద్రతా వర్గాల మద్దతుతో మొజ్తాబానే కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు. తాజాగా అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఖమేనీకి మద్దతుగా విదేశాంగ మంత్రిఖమేనీ ప్రకటనతో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఏకీభవించారు. సుప్రీం లీడర్ మార్గదర్శకాల ప్రకారమే చర్చలు కొనసాగుతాయని పేర్కొన్నారు. చర్చల తదుపరి దశలో దేశ ప్రయోజనాలు, గౌరవం, స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగించే ఒప్పంద తాలుకా ఎంవోయూపై ఇరు దేశాల అధినేతలు డిజిటల్ సంతకాలు చేశారు. ఒప్పందం కుదిరిన వెంటనే తొలి చర్యలు ప్రారంభమయ్యాయి. హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమలు చేస్తున్న సముద్ర నిర్బంధ చర్యలను అమెరికా సెంట్రల్ కమాండ్ నిలిపివేసింది. ఇకపై ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చీపోయే వాణిజ్య నౌకలపై ఆంక్షలు ఉండవని ప్రకటించింది.మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాను పునరుద్ధరించేందుకు ఇరాన్ చర్యలు ప్రారంభించింది. వచ్చే 60 రోజుల పాటు నౌకలకు వేగవంతమైన అనుమతులు, జలసంధి రుసుముల మినహాయింపు కల్పిస్తామని వెల్లడించింది.ఒప్పందంలో అసలు ఏముంది?"ఇస్లామాబాద్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్" పేరుతో కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సైనిక చర్యలను నిలిపివేయాలి. హర్ముజ్ జలసంధిలో సాధారణ రవాణా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. అలాగే 60 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలి. ఆ చర్చల్లో ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇక..ఇటు స్విట్జర్లాండ్లో జరగాల్సిన కీలక సమావేశం యథాతథంగా జరగనుంది. అమెరిరా, ఇరాన్తో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నారు. అవగాహన ఒప్పందం అమలుతో పాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. -
బీబీకి దొరికిన ‘బెస్ట్ డీల్’ ఇదేనా!?
ఇజ్రాయెల్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. ఇరాన్తో కుదిరిన తాజా శాంతి ఒప్పందం అనేది ఇజ్రాయెల్కు దక్కిన బెస్ట్ డీల్ అని.. ఇంతకు మించి ఆ దేశానికి ఇంకేది అక్కర్లేదని.. ఇదే విషయాన్ని తాను నెతన్యాహుకి చెప్పానని అన్నారాయన.ఇరాన్–అమెరికా మధ్య తాజాగా కుదిరిన శాంతి ఒప్పందం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి ముందు తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే ఈ ఒప్పందం వల్ల ఇజ్రాయెల్కు ఉన్న అత్యంత పెద్ద భద్రతా ముప్పు తొలగిపోయిందని ఆయన అన్నారు. ఆ సంభాషణలో “ఆలోచించు బీబీ(నెతన్యాహుని ఉద్దేశించి.. ఆయన ముద్దు పేరు, పైగా రాజకీయ వర్గాల్లో అలానే పిలుస్తారు).. నీకు ఇది బెస్ట్ డీల్. ఇకపై ఇజ్రాయెల్పై అణు దాడి ప్రమాదం ఉండదు” అని చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండే ప్రమాదమే ఇజ్రాయెల్కు అతిపెద్ద భయం అని, ఈ ఒప్పందంతో ఆ ముప్పు తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. “ఇజ్రాయెల్ కోరుకున్న అత్యంత కీలకమైన భద్రతా హామీ ఇదే” అని నెతన్యాహుకు చెప్పినట్లు వెల్లడించారు.ఫ్రాన్స్ ఈవియన్-లెస్-బెయిన్స్లో G7 సమావేశం జరిగింది. దీనికి హాజరైన ట్రంప్ పారిస్లోని ఓ హోటల్లో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చిన విందుకు ట్రంప్ హాజరయ్యారు. అక్కడే ఆయన ఇరాన్తో ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ మీద సంతకం చేశారు. ఆ సమయంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు.మరోవైపు అమెరికా-ఇరాన్ ఒప్పందంపై పూర్తి స్పష్టత ఇంకా లేదు. ఎంవోయూ ప్రకారం.. ఇరాన్ తన అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించాల్సి ఉంటుందని, అలాగే కొన్ని ఆంక్షల సడలింపు అంశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు, హెజ్బొల్లా గ్రూపుల అంశం వంటి సున్నిత విషయాలు కూడా ఈ ఒప్పంద చర్చల్లో భాగమయ్యాయి.అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్పై దాడికి దిగడంతోనే పశ్చిమాసియా యుద్ధం మొదలైందన్న సంగతి తెలిసిందే. అయితే మధ్యలో కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించినప్పటికీ.. హెజ్బొల్లాను తుడిచిపెట్టే ఉద్దేశంతో లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని వద్దని వారించినా.. నెతన్యాహు మాత్రం పరిమిత దాడులు కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో లెబనాన్లో భారీగా ప్రాణ నష్టం(దాదాపు 5 వేలమంది) సంభవించింది. అయితే ఇరాన్-అమెరికా ఒప్పందంలో లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో సైనికచర్యలు నిలిపి వేయాలనే ప్రతిపాదన ఉంది.ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తమ భద్రత కోసం చేపట్టే చర్యల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు సొంత వర్గంలోని కొందరు మాజీ నేతలు నెతన్యాహుపై ఒత్తిడిని పెంచే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద, ఇరాన్–అమెరికా ఒప్పందం కేవలం ప్రాంతీయ రాజకీయాలకే కాకుండా, ఇజ్రాయెల్ భద్రతా సమీకరణాలపై కూడా పెద్ద ప్రభావం చూపేలా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది: ఇరాన్
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు తెర పడింది. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. డీల్కు సంబంధించిన అవగాహన ఒప్పందంపై అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. దీంతో యుద్ధం అధికారికంగా ముగిసినట్లైంది. అయితే ఈ ఎంవోయూపై ఇప్పుడు ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. జీ7 సదస్సు అనంతరం పారిస్లోని వెర్సైల్స్ ప్యాలెస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విందు ఇచ్చారు. దీనికి హాజరైన ట్రంప్ ఒప్పంద పత్రంపై(MoU) సంతకం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇటు ఇరాన్ కూడా డీల్ను కన్ఫర్మ్ చేసింది. తమ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకం చేసినట్లు వెల్లడించింది. అయితే ఒప్పందం కుదరడం కంటే.. దాన్ని అమలు చేయడమే ఇప్పుడు అసలు పరీక్ష అని టెహ్రాన్ అంటోంది.ఇక ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయెల్ బఘాయ్ Esmaeil Baqaei మాట్లాడుతూ.. "ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం (Memorandum of Understanding)పై ఇరు దేశాధినేతల సంతకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఒప్పందం అమలును పరీక్షించే సమయం వచ్చింది. ఇది ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి" అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది."అమెరికా సంయుక్త రాష్ట్రాలు – ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం" పేరుతో రూపొందించిన ఈ పత్రంలో పలు కీలక అంశాలు ఉన్నాయి. లెబనాన్ సహా అన్ని రంగాల్లో సైనిక చర్యలను వెంటనే, శాశ్వతంగా నిలిపివేయాలని ఇందులో పేర్కొన్నారు.ఒప్పందం ప్రకారం అమెరికా 30 రోజుల్లో ఇరాన్పై అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. అదే సమయంలో యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలో వాణిజ్య నౌకల రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలి. తుది ఒప్పందం కుదిరిన తర్వాత 30 రోజుల్లో ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాలు వైదొలగాలని కూడా ఇందులో పేర్కొన్నారు.మరోవైపు, వాణిజ్య నౌకలకు 60 రోజుల పాటు ఎలాంటి రుసుము లేకుండా సురక్షిత ప్రయాణం కల్పించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.సంతకాలు పూర్తవడంతో ఇకపై 60 రోజులపాటు అమెరికా–ఇరాన్ ప్రతినిధులు తుది ఒప్పందానికి సంబంధించిన నిబంధనలపై చర్చలు జరపనున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే పశ్చిమాసియాలో దీర్ఘకాలిక స్థిరత్వానికి మార్గం సుగమం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా–ఇరాన్ ఎంవోయూలో కీలక అంశాలులెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో అమల్లోకి కాల్పుల విరమణ60 రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలుపరస్పర అంగీకారంతో గడువు పొడిగింపునకు అవకాశం30 రోజుల్లో ఇరాన్పై అమెరికా నౌకాదళ దిగ్బంధనానికి ముగింపుయుద్ధానికి ముందు స్థాయిలో నౌకల రాకపోకల పునరుద్ధరణతుది ఒప్పందం తర్వాత 30 రోజుల్లో ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ60 రోజుల పాటు వాణిజ్య నౌకలకు ఉచిత, సురక్షిత రాకపోకలకు ఇరాన్ హామీహర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఎలాంటి రుసుములు లేకుండా ఏర్పాట్లుఅణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ అంగీకారంఐఏఈఏ పర్యవేక్షణలో యురేనియం(శుద్ధి చేసిన) నిర్వహణకు ఒప్పుకోలుఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి కనీసం 300 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుఆ నిధిలో అమెరికాతో పాటు ప్రాంతీయ భాగస్వామ్య దేశాల భాగస్వామ్యంఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడానికి అమెరికా అంగీకారంఆంక్షల ఎత్తివేతకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ తుది ఒప్పందంలో ఖరారుఅయితే.. అధికారిక సంతకాల కార్యక్రమం మొదట స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగాల్సి ఉన్నప్పటికీ, ఒప్పందంపై ఇప్పటికే డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయని స్పష్టమవుతోంది. అయినప్పటికీ.. ఫిజికల్ సంతకాల కోసం జెనీవా సమావేశం యథావిధిగా కొనసాగవచ్చని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం జరగబోయే ఈ భేటీలో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొంటుండగా.. ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ హాజరు కావొచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత సుమారు 110 రోజుల పాటు కొనసాగిన ఘర్షణలకు ఈ ఒప్పందం ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టెహ్రాన్ చెప్పినట్లే, ఒప్పందం కుదరడం ఒక దశ అయితే, దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడమే అసలు సవాలుగా మారింది.ఇదీ చదవండి: ట్రంప్ సంతకం.. డీల్లో మ్యాటర్ ఏంటంటే.. -
పైసా ఇవ్వని అమెరికా.. ఇరాన్ డీల్లో మెగా ట్విస్ట్
ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు దేని కోసం అన్న ప్రశ్నకు అణు ఒప్పందం, హర్ముజ్ జలసంధి వంటి అంశాల చుట్టూ భిన్న భిన్న వెర్షన్లు వినిపిస్తున్నాయి. డీల్లో అసలు ఏముంది అన్నదానిపై స్పష్టత లేకపోయినా, ఒక్కో వర్గం ఒక్కో కోణాన్ని ప్రధానంగా చూపిస్తోంది. ఇక ఈ మొత్తం సమీకరణాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తున్న పదం మాత్రం ఇప్పుడు చర్చల్లో బలంగా వినిపిస్తోంది… అదే మెగా డీల్.ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు కేవలం రాజకీయ ఒప్పందాలకే పరిమితం కావడం లేదు. అణు కార్యక్రమంపై నియంత్రణలు, ఆంక్షల ఎత్తివేత, అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి అంశాలు ఈ డీల్లో ప్రధాన భాగాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలు భౌగోళిక రాజకీయాల కోణంలో అత్యంత కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి. హర్ముజ్ జలసంధి విషయానికి వస్తే, ఇది ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు అత్యంత కీలక మార్గం. ఈ మార్గంపై స్థిరత్వం లేకపోతే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు నేరుగా ప్రభావితమవుతాయి. అందుకే శాంతి ఒప్పందంలో దీనిపై ప్రత్యేక అంగీకారాలు అవసరమవుతున్నాయి. అదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమం కూడా ఈ చర్చల కేంద్రబిందువుగా కొనసాగుతోంది.అయితే ఈ రెండు కీలక అంశాల మధ్య ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఆర్థిక ప్యాకేజీ. సుమారు 300 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మొత్తం ఈ చర్చను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇరాన్-యూఎస్ పీస్ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్లో భాగంగా ప్రతిపాదించిన ఈ ఫండ్.. యుద్ధానంతర పునర్నిర్మాణం కోసం రూపొందించిన భారీ ఆర్థిక ప్యాకేజీగా భావిస్తున్నారు.రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ ఫండ్ పూర్తిగా ప్రైవేట్ పెట్టుబడులతోనే నడుస్తుంది. అమెరికా ప్రభుత్వం నుంచి పైసా సాయం ఉండదు. అయితే.. ఇప్పటికే సుమారు 150 బిలియన్ డాలర్లకు పైగా కమిట్మెంట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆసియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడమట. ఎనర్జీ, రవాణా, లాజిస్టిక్స్, పరిశ్రమలు వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకురావడం ద్వారా దేశాన్ని మళ్లీ గ్లోబల్ ఎకానమీకి కలపడం దీని ఉద్దేశమని ఆ కథనం పేర్కొంది. ముఖ్యంగా ఈ ఆర్థిక ప్యాకేజీని అణు ఒప్పంద చర్చలు, అలాగే హర్ముజ్ జలసంధి అంశం నుండి వేరుగా ఉంచినట్లు సమాచారం. అంటే ఒక వైపు రాజకీయ భద్రతా ఒప్పందాలు కొనసాగుతుండగా, మరోవైపు ఈ ఫండ్ పూర్తిగా ఆర్థిక ట్రాక్లో ముందుకు వెళ్లనుందన్నమాట.ఇరాన్ మొదట యుద్ధ నష్టాలకు 400 బిలియన్ డాలర్ల పరిహారం కోరినప్పటికీ.. అమెరికా ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రత్యామ్నాయంగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆలోచన ముందుకు వచ్చింది. ఈ మార్పే ఇప్పుడు ఈ డీల్ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తోందనే విశ్లేషణ నడుస్తోంది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. హర్ముజ్ జలసంధి భద్రత, అణు ఒప్పందం రాజకీయ స్థిరత్వాన్ని నిర్ణయిస్తే… ఈ 300 బిలియన్ డాలర్ల ఫండ్ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే గేమ్చేంజర్గా మారే అవకాశం ఉంది. అంటే ఒకవైపు వ్యూహాత్మక భద్రత, మరోవైపు ఆర్థిక జాక్పాట్ – రెండూ ఈ డీల్ను నడిపిస్తున్న రెండు ఇంజిన్లలా భావిస్తున్నారు. -
ట్రంప్ బిగ్ గేమ్! అమెరికా రాజకీయాల్లో ఇజ్జత్ కా సవాల్
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావం ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. ఆయన మద్దతు లభిస్తే ఎన్నికల్లో విజయం దాదాపు ఖాయమనే (స్ట్రయిక్ రేటు ఎక్కువ) అభిప్రాయం రిపబ్లికన్ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. ట్రంప్ మద్దతు పొందిన కెన్ పాక్స్టన్ ప్రైమరీలో తొలి అడ్డంకిని దాటి, ఇప్పుడు ప్రధాన ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తీసుకునే తదుపరి రాజకీయ నిర్ణయం పై అందరి దృష్టి నిలిచింది. టెక్సాస్ చాలా కాలంగా రిపబ్లికన్ పార్టీకి బలమైన కోటగా ఉంది. ఇటీవల జరిగిన రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ మద్దతుతో రాష్ట్ర అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్, సీనియర్ సెనేటర్ జాన్ కార్నిన్ను ఓడించి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అయితే ప్రైమరీలో గెలవడం ఒక విషయం అయితే, సాధారణ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకోవడం మరో విషయం.ఈ పరిస్థితుల్లో కెన్ పాక్స్టన్కు ఎదురవుతున్న గట్టి పోటీని రిపబ్లికన్ పార్టీ కీలక పరీక్షగా చూస్తోంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున జేమ్స్ టలారికో నుంచి పెరుగుతున్న సవాల్, ఆయన బలమైన ఫండ్రైజింగ్, అలాగే పాక్స్టన్పై ఉన్న పాత అవినీతి ఆరోపణలు రిపబ్లికన్లకు రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ పోరు రిపబ్లికన్ పార్టీకి “ఇజ్జత్ కా సవాల్”గా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.తన మద్దతుతో అభ్యర్థిగా నిలిచిన కెన్ పాక్స్టన్ను గెలిపించేందుకు ట్రంప్ తన వద్ద ఉన్న అత్యంత భారీ ఎన్నికల నిధిని ఖర్చు చేస్తారా లేదా? ఇదే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో చర్చకు దారితీసిందిరిపబ్లికన్లకు ట్రంప్ వద్ద ఉన్న నిధి కీలకంగా కనిపిస్తోంది. అమెరికాలో ఎన్నికలు అత్యంత ఖరీదైన రాజకీయ ప్రక్రియల్లో ఒకటి. టెలివిజన్ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం, ప్రజా సమావేశాలు, ప్రచార బృందాలు, ఓటర్లను చేరుకునే కార్యక్రమాల కోసం కోట్లాది డాలర్లు అవసరమవుతాయి. అందుకే రాజకీయ నాయకులు, పార్టీలు ముందుగానే భారీ మొత్తంలో విరాళాలు సేకరిస్తుంటాయి.ట్రంప్కు అనుబంధంగా ఉన్న మాగా (MAGA Inc), సూపర్ పాక్(PAC) వద్ద ప్రస్తుతం 356 మిలియన్ డాలర్ల(సుమారు రూ.3,000 కోట్లు) నిధి ఉంది. ఇది అమెరికా రాజకీయాల్లో అత్యంత భారీ ఎన్నికల నిధుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ డబ్బు ప్రధానంగా ట్రంప్ అభిమానులు, వ్యాపారవేత్తలు, పార్టీ మద్దతుదారుల విరాళాల ద్వారా సమీకరించబడింది. అయితే.. 👉ట్రంప్ ఈ డబ్బును టెక్సాస్ కోసం పాక్స్టన్ కోసం ఖర్చు చేస్తే ఏమవుతుంది?.. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారీ ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, ప్రత్యర్థులపై రాజకీయ దాడులు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో పాక్స్టన్కు ఎన్నికల్లో స్పష్టమైన ఊతం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా టలారికో ఆర్థిక బలాన్ని ఎదుర్కోవడానికి ఇది ఉపయోగపడవచ్చు.👉అయితే ట్రంప్ ఈ నిధిని ఖర్చు చేయకుండా దాచిపెడితే పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. పాక్స్టన్ తన సొంత నిధులతోనే ఎన్నికల పోరాటం చేయాల్సి వస్తుంది. ఒకవేళ టెక్సాస్ వంటి కీలక రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోతే, అమెరికా సెనేట్లో పార్టీ బలం తగ్గే అవకాశం ఉంటుంది. అలా జరిగితే భవిష్యత్తులో ట్రంప్ రాజకీయ అజెండాను అమలు చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు.👉అలాగే.. ట్రంప్ నిధిని వెంటనే ఖర్చు చేయకూడదని భావించే వర్గాలు కూడా ఉన్నాయి. 2026 మధ్యంతర ఎన్నికలతో పాటు రాబోయే జాతీయ రాజకీయ పోరాటాల కోసం ఈ డబ్బును నిల్వ ఉంచడం వ్యూహాత్మకంగా మంచిదని వారు వాదిస్తున్నారు. అందుకే ట్రంప్ ఇప్పటివరకు తన తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు.మొత్తంగా చూస్తే, టెక్సాస్ ఎన్నిక ఇప్పుడు కేవలం ఒక సెనేట్ సీటు కోసం జరిగే పోటీ కాదు. ట్రంప్ రాజకీయ ప్రభావం, ఆయన ఆర్థిక శక్తి, అలాగే రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన కీలక పరీక్షగా మారింది. ట్రంప్ తన ‘రూ.3,000 కోట్ల’ రాజకీయ నిధిని తెరపైకి తీసుకొస్తారా? లేదంటే సరైన సమయం కోసం దాచిపెడతారా?.. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఈ బిగ్ గేమ్ హాట్ టాపిక్గా మారింది. -
అమెరికాలో కూలిన విమానం.. 8 మంది దుర్మరణం
అమెరికా కాలిఫోర్నియా స్టేట్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. స్థానికకాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 11గం.20ని. సమయంలో ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. అయితే కాసేపటికే అది ప్రమాదానికి గురైంది. విమానం కుప్పకూలిన వెంటనే అగ్నికి ఆహుతి కావడంతో అందులో సిబ్బంది అగ్నికి ఆహుతి అయ్యారు. సాధారణ పరీక్షా మిషన్లో భాగంగా బీ-52 బాంబర్ బయలుదేరిందని.. ఆ వెంటనే ఈ ఘోరం జరిగిందని ఎయిర్ఫోర్స్ అధికారులు ప్రకటించారు. ప్రమాద స్థలానికి అత్యవసర సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం ఎయిర్ బేస్ను తాత్కాలికంగా మూసివేసి, అక్కడికి వచ్చే ఇతర విమానాలను మళ్లించారు.ఇఇలా ఉంటే.. 1954లో అమెరికా ఆర్మీలో అడుగు పెట్టిన బీ-52 బాంబర్.. అమెరికా వైమానిక దళంలో అత్యంత కీలకమైన యుద్ధ విమానాల్లో ఒకటి. అణ్వస్త్రాలు సహా వివిధ రకాల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యంతో ఈ విమానం అనేక యుద్ధాల్లో సేవలందించింది. -
జాబ్స్ కాదు.. ఏఐతో ఇంకా చాలా పోవచ్చు: సత్య నాదెళ్ల
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల ఉద్యోగాలను తినేస్తుందనే భయాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వల్ల సృష్టించే విలువ, సంపద, జ్ఞానం అన్నీ కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఏం జరుగుతుందో చెబుతూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగాలు పోవడమే కాదు.. అంతకు మించిన ముప్పు పొంచి ఉందని అంటున్నారాయన.ఏఐ వల్ల వచ్చే లాభాలు, జ్ఞానం, వ్యాపార విలువ అంతా కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమవడం అసలు ముప్పని సత్య నాదెళ్ల హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన సుదీర్ఘ పోస్టులో నాదెళ్ల.. ఏఐ విప్లవాన్ని కేవలం మరో సాంకేతిక మార్పుగా చూడకూడదన్నారు. అలా జరిగితే మిగతా సంస్థలు తమ సొంత పరిజ్ఞానం, అనుభవం, పోటీపడే సామర్థ్యాన్ని కోల్పోయి పూర్తిగా వాటిపైనే ఆధారపడాల్సి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.గతంలో డిజిటల్ టూల్స్ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి మాత్రమే ఉపయోగపడేవని.. కానీ ఇప్పుడు మనుషులు, ఏఐ వ్యవస్థలు పరస్పరం నేర్చుకునే కొత్త దశలోకి ప్రపంచం అడుగుపెడుతోందని వివరించారు. దీనిని ఆయన "కాగ్నిటివ్ లూప్"గా అభివర్ణించారు. భవిష్యత్తులో సంస్థల విజయాన్ని నిర్ణయించేది కేవలం డబ్బు లేదంటే యంత్రాలో కాదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అనుభవం, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం, సృజనాత్మకత ఎంత ముఖ్యమో.. ఏఐ ఆధారంగా సంస్థలు సొంతంగా అభివృద్ధి చేసుకునే సామర్థ్యాలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అయితే ఈ రెండింటిలోనూ మనిషే కేంద్రబిందువుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. లక్ష్యాలను నిర్దేశించడం, కొత్త ఆలోచనలను సృష్టించడం, విభిన్న రంగాల మధ్య సంబంధాలను గుర్తించడం వంటి అంశాల్లో మనుషుల పాత్ర కీలకంగానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే నాదెళ్ల ఆందోళన ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కాదు. కొద్ది సంఖ్యలో ఉన్న శక్తివంతమైన ఏఐ మోడళ్లపై ప్రపంచంలోని కంపెనీలు పూర్తిగా ఆధారపడిపోతే.. తమ సొంత పరిజ్ఞానం, మేధోసంపత్తి, అనుభవాన్ని క్రమంగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. "ప్రతి రంగంలోని ప్రతి సంస్థ సృష్టించిన విలువ అంతా కొద్ది ఏఐ మోడళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రపంచాన్ని మనలో ఎవరూ కోరుకోరు" అని వ్యాఖ్యానించారాయన.ఈ సందర్భంలో ఆయన ప్రపంచీకరణ తొలి దశను ఉదాహరణగా ప్రస్తావించారు. తయారీ పరిశ్రమలు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలిపోవడంతో ఆర్థిక వృద్ధి కాగితాలపై కనిపించినా.. అనేక ప్రాంతాలు, వర్గాలు శాశ్వతంగా నష్టపోయాయని గుర్తు చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు ఏఐ యుగంలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. కంపెనీలు దశాబ్దాలుగా కూడబెట్టుకున్న అనుభవం, పరిజ్ఞానం, వ్యాపార విలువ మొత్తం ఏఐ వ్యవస్థల్లో కలిసిపోతే.. దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం కొద్ది సంస్థలకే పరిమితమయ్యే ప్రమాదాన్ని ఆయన ఎత్తిచూపారు. అందుకే "ఫ్రాంటియర్ మోడల్" కాకుండా "ఫ్రాంటియర్ ఎకోసిస్టమ్" అవసరమని నాదెళ్ల సూచించారు. అంటే.. కొద్ది కంపెనీలు మాత్రమే ఏఐని నియంత్రించే పరిస్థితి కాకుండా.. వివిధ దేశాలు, సంస్థలు, పరిశ్రమలు తమ సొంత ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఏఐ వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరుతాయని అభిప్రాయపడ్డారు.https://t.co/vLmiBKTtX3— Satya Nadella (@satyanadella) June 14, 2026ఇదిలా ఉండగా.. ఏఐ భవిష్యత్తుపై ఇతర సాంకేతిక దిగ్గజాలు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ ఇటీవల ఏఐ కారణంగా దీర్ఘకాలిక ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐ మానవ మేధస్సుతో చేసే అనేక పనులను భర్తీ చేస్తే.. ఉద్యోగాలపై శాశ్వత ప్రభావం పడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి మరింత తీవ్రమైతే ప్రభుత్వాలు ఉద్యోగుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సి రావచ్చని కూడా సూచించారు.మరోవైపు, ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ మాత్రం ఉద్యోగ కోతలన్నింటికీ ఏఐనే కారణమని చెప్పడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. జనరేటివ్ ఏఐ అనేది విస్తృతంగా అందుబాటులోకి రాకముందే అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించాయని గుర్తుచేశారు. ఉద్యోగాల కోత వెనుక ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వ్యూహాలు, మార్కెట్ మార్పులు వంటి అనేక కారణాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. ఒకవైపు అపార అవకాశాలు కనిపిస్తుంటే.. మరోవైపు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల చేసిన హెచ్చరిక ఒక కీలక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఏఐ మనిషిని మరింత శక్తివంతం చేసే సాధనంగా మారుతుందా? లేదంటే కొద్ది కంపెనీల చేతుల్లోనే శక్తిని కేంద్రీకరించి మిగతా ప్రపంచాన్ని ఆధారపడేలా చేస్తుందా? రానున్న దశాబ్దంలో ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. -
ట్రంప్ హామీ.. డీల్ కుదిరిందా? లేదంటే మరో ట్విస్ట్ తప్పదా??
మూడునెలలుగా యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్న పశ్చిమాసియా ఒక్కసారిగా ఆశల వైపు చూస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన ఘర్షణకు ముగింపు దగ్గరపడిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అయితే అదే సమయంలో ఇరాన్ నుంచి వచ్చిన స్పందన కొత్త సందేహాలకు తావిచ్చింది. నిజంగానే శాంతి ఒప్పందం కుదిరిందా? లేదంటే ఇంకా చివరి అడ్డంకులు మిగిలే ఉన్నాయా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వారాంతంలోనే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. "ఇరాన్తో యుద్ధానికి అద్భుతమైన పరిష్కారం దొరికింది. కొన్ని పత్రాలపై తుది సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి" అని చెప్పారు.ఒప్పందంపై సంతకాలు యూరప్లో జరగవచ్చని, అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుందని కూడా ఆయన ప్రకటించారు.అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. చర్చల ముసాయిదాలో చాలా భాగం పూర్తయిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒప్పంద ప్రతిపాదన ప్రస్తుతం దేశంలోని కీలక నిర్ణయాధికార సంస్థల పరిశీలనలో ఉందన్నారు. అమెరికా చర్చల మధ్యలో కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తోందని ఆరోపించిన ఆయన.. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన "రెడ్లైన్స్"ను దాటదని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యల మర్మం ఏంటన్నదానిపై కుతూహలం నెలకొంది.ఇక ఈ ఒప్పందంలో అత్యంత కీలక అంశం ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమమే. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని, కొనుగోలు చేయబోదని అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఇదే మొత్తం చర్చల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని గతంలాగే పునరుద్ఘాటిస్తోంది.అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై సంయుక్త దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారంనుంచి ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇరాన్, లెబనాన్లో భారీ నష్టం సంభవించింది. చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. పరస్పర దాడులు కొనసాగించాయి. అమెరికా అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసిన ఘటన తర్వాత హర్ముజ్ ప్రాంతంలో అమెరికా కొత్త దాడులు జరిపింది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.ఇదిలా ఉండగా, ఒప్పందానికి ఇరాన్ అత్యున్నత నాయకత్వం కూడా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆమోదం తెలిపారని తనకు సమాచారం ఉందన్నారు. అలాగే ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ సహా పశ్చిమాసియాలోని పలు దేశాలు ఈ ఒప్పందానికి మద్దతు తెలిపాయని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం మాత్రం ఈ అవగాహన ఒప్పందంలో తాము భాగస్వాములు కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఒప్పందం ఉండాలని ట్రంప్కు నెతన్యాహూ సూచించినట్లు వెల్లడించింది.మొత్తంగా చూస్తే.. ట్రంప్ "డీల్ దాదాపు ఖరారైంది" అంటుండగా, ఇరాన్ "ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు" అంటోంది. నిజంగానే ఈ వారాంతంలో శాంతి ఒప్పందం కుదిరి యుద్ధానికి తెరపడుతుందా? లేదంటే చివరి క్షణంలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటాయా? అని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
అందం కూడా నేరమా?.. మేకప్ వేస్తే జైలే!!
ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టే ముందు.. ఏం దుస్తులు వేసుకోవాలి? అనే ఆత్రుత సహజమే!. కళ్లకు అద్దుకునే కాటుక దగ్గరి నుంచి కాలికి వేసుకుని చెప్పుదాకా.. అన్నీ పక్కాగా ఉండాలని మహిళల్లో కొందరు అనుకుంటారు. కానీ, వాళ్లు ఏం వేసుకోవాలి? ఎలా ఉండాలి?.. ఇలా అన్నింటినీ ప్రభుత్వం నిర్ణయించే పరిస్థితి ఊహించగలరా?.. ఇప్పుడు ఆ దేశంలో అదే జరుగుతోంది. కాదంటే.. బలవంతంగా బేడీలు వేసి జైలుకు పంపిస్తున్నారు..మహిళలపై ఇప్పటికే ఎన్నో పరిమితులు అమలు చేస్తున్న అఫ్గనిస్థాన్లోని తాలిబాన్ ప్రభుత్వం తాజాగా మరోసారి కఠిన చర్యలకు దిగింది. ముఖం పూర్తిగా కప్పుకోకుండా బయటకు రావడంపై నిషేధం విధించింది. అలాగే.. బిగుతైన దుస్తులు ధరించడం, మేకప్ వేసుకోవడం నేరమని ప్రకటించింది. తాము నిర్దేశించిన రీతిలో హిజాబ్ నిబంధనలు పాటించకపోతే కఠిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ క్రమంలో.. పలువురిని అదుపులోకి తీసుకుని నిర్బంధ కేంద్రాలకు తరలించే అధికారం పోలీసులకు సైతం కల్పించారు.మహిళలు మాత్రమే కాదు.. వారి కుటుంబ సభ్యులపైనా బాధ్యత మోపారు. ఇంట్లోని మహిళలు నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆ ఇంట్లోని మగవాళ్లదేనని స్పష్టం చేసింది తాలిబాన్ ప్రభుత్వం. ఉల్లంఘనలు కొనసాగితే పురుషుల మీద కూడా కేసులు నమోదు చేసి న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్లో ప్రస్తుతం ఈ ఆదేశాలు అమలవుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.ఇక.. కొత్త నిబంధనల అమలులో భాగంగా హెరాత్లోని పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. రహదారులపై వెళ్తున్న వాహనాలు, ట్యాక్సీలను ఆపి మహిళల దుస్తులు, హిజాబ్ విధానాన్ని తనిఖీ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం 21 మంది మహిళలు, బాలికలను ఈ నిబంధనల ఉల్లంఘన పేరుతో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.అరెస్టైన వారిలో ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సు కూడా ఉన్నట్లు సమాచారం. భర్తతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారని స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో గడ్డం నిబంధనలు పాటించలేదనే కారణంతో కొందరు వైద్యులు, నర్సులను కూడా తాలిబాన్ అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై వరుస ఆంక్షలు విధిస్తోంది. బాలికల ఉన్నత విద్యపై నిషేధం, ఉద్యోగ అవకాశాల పరిమితి, ప్రజా ప్రదేశాల్లో సంచారంపై ఆంక్షలు వంటి వందకు పైగా ఆదేశాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. తాజాగా వచ్చిన ఈ నిర్ణయాలు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను మరింత కుదించే చర్యలుగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి. -
ట్రంప్ చెప్పింది నిజమేనా?.. లేక గప్పాలా?
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ పరిస్థితులు నెలకొంటున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కళ్లుగప్పి హర్ముజ్ జలసంధిలో ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అత్యంత రహస్యంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్ ద్వారా భారీ పరిమాణంలో చమురును అంతర్జాతీయ మార్కెట్కు చేరవేశామని ప్రకటించారు. అంతేకాదు, గత నెల రోజులుగా అలానే 200కు పైగా వాణిజ్య నౌకలను హర్ముజ్ దాటించామని వెల్లడించారు.ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. గత నెలలోనే అమెరికా సైన్యానికి ఓ రహస్య ఆదేశం ఇచ్చినట్లు తెలిపారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు రహస్యంగా రక్షణ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ మిషన్ ఫలితంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు ప్రపంచ మార్కెట్కు చేరిందని, 200కుపైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని పేర్కొన్నారు.అమెరికా కారణంగానే హర్ముజ్ జలసంధిలో రవాణా కొనసాగుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. "హర్ముజ్ను నియంత్రించేది ఇరాన్ కాదు.. అమెరికానే" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఇరాన్ సైనికంగా ఓడిపోయిందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ మరో సంచలన విషయం వెల్లడించారు. ఇటీవల ఒకే రాత్రిలో 22 నౌకలను ఎలాంటి లైట్లు లేకుండా, రాడార్ ట్రాకింగ్కు చిక్కకుండా హర్ముజ్ జలసంధి దాటించినట్లు చెప్పారు. రాత్రి చీకటిని ఉపయోగించుకుని ఈ ఆపరేషన్ను నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురును బయటకు తీసుకువస్తున్నామని, అందువల్లే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అదుపులో ఉన్నాయని వ్యాఖ్యానించారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలపై తర్వాత అమెరికా సైనిక, ఇంధన శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ నుంచి చమురును "తీసుకురావడం" లేదా "స్వాధీనం చేసుకోవడం" జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవానికి హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల భయంతో నిలిచిపోయే పరిస్థితి వచ్చిన వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పించిందని తెలిపారు.అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఒమన్ తీర ప్రాంతాన్ని ఉపయోగిస్తూ సురక్షిత మార్గాల్లో ట్యాంకర్లు, వాణిజ్య నౌకలను దాటించినట్లు వెల్లడించారు. గత కొన్ని వారాల్లో 200కుపైగా నౌకలు ఈ భద్రతా వ్యవస్థ ద్వారా హర్ముజ్ను సురక్షితంగా దాటాయని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు తరచూ అంతర్జాతీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఒకసారి ఇరాన్ చర్చలకు సిద్ధమైందని, మరోసారి శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, ఇంకోసారి తాను జోక్యం చేసుకోవడంతోనే ఇజ్రాయెల్-లెబనాన్ ఘర్షణలు తగ్గాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. అయితే ఈ ప్రకటనలను ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హర్ముజ్ జలసంధిలో 100 మిలియన్ బ్యారెళ్ల చమురును రహస్య ఆపరేషన్ ద్వారా సురక్షితంగా తరలించామన్న ట్రంప్ వ్యాఖ్యలు కూడా కొత్త సందేహాలకు తావిచ్చాయి. ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడిగా భావించే హర్ముజ్ జలసంధి ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. జలసంధిపై ఆధిపత్యం ప్రకటించుకున్న ఇరాన్ తన నిఘా కొనసాగిస్తోంది. అమెరికా గస్తీలో ఉన్న నౌకలను అస్సలు వదలడం లేదు. మరి ట్రంప్ చెప్పినట్లుగా అమెరికా నిజంగానే ఇరాన్ కళ్లు గప్పి భారీ ఆపరేషన్ నిర్వహించిందా? సొంత సరిహద్దుల్లోనే ఇరాన్ బకరా అయ్యిందా? లేదంటే తన రాజకీయ, దౌత్య బలాన్ని చాటిచెప్పేందుకు ట్రంప్ మరోసారి అతిశయోక్తి వ్యాఖ్యలు చేశారా? చర్చ రాజకీయ, దౌత్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
ఇరాన్ యుద్ధం.. నెతన్యాహు సంచలన నిర్ణయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయా?. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న సంచలన నిర్ణయం అవుననే అంటోంది. ఇకపై అమెరికా మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఇరాన్పై దాడులు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. మరికొన్ని గంటల్లో ఇరాన్పై దాడి చేయబోతున్నామని అమెరికా ముందుగానే ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.పశ్చిమాసియా సంక్షోభంపై జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే అలాంటి పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని.. కానీ అవసరమైతే అందుకు వెనుకాడబోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో.. అమెరికా-ఇరాన్ డీల్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఏ ఇరాన్ ఒప్పందమైనా.. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలకు అనుకూలంగా కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.గత కొంతకాలంగా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మిత్రదేశాలైన అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విబేధాలకు కారణం అవుతున్నాయి. ఇరాన్తో అణు ఒప్పందం నేపథ్యంతో శాంతి చర్చలకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఇరాన్, అటు లెబనాన్లో యుద్దానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్(దక్షిణ ప్రాంతాల్లో)పై ఇజ్రాయెల్ దాడులు జరుపుతూనే వస్తోంది. ఈ దాడుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ పరిణామాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. లెబనాన్పై సైనిక చర్య ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెతన్యాహుని ట్రంప్ మందలిస్తున్నారని కొంతకాలంగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ, నెతన్యాహు మాత్రం అదేం పట్టించుకోకుండా ‘పరిమిత దాడులకు’ ఆదేశాలిస్తూనే వస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య డీల్ కుదిరితే.. తమ సైనిక చర్యల స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే యోచనలో ఇజ్రాయెల్ ఉంది, అందుకే ఇరాన్ ఒప్పందంలో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని నెతన్యాహు ట్రంప్ను కోరుతున్నట్లు తెలుస్తోంది.ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చి మరీ దాడులు?ఇటు హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడులు నిర్వహించాయి. జాస్క్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా(ఇరాన్ దాడికి ప్రతీకారంగానే!) తమ దాడులు పూర్తయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది. ఇరాన్ నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇటు.. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై జరిగిన ప్రతి దాడికి సమాధానం ఇస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హెచ్చిరించిన కాసేపటికే దాడులు జరిగాయి. అమెరికా స్థావరాలు, బహ్రెయిన్లో ఉన్న అమెరికా ఐదో నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎదురుదాడులకు దిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బహ్రెయిన్ ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇటు అమెరికా సైనిక దూకుడు కొనసాగితే మరింత తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అయితే..మరికొన్ని గంటల్లో ఇరాన్పై దాడి చేయబోతున్నామని ఇజ్రాయెల్కు అమెరికా ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తాజా దాడులు ఆ సమాచారం అనుగుణంగానే జరిగాయా? లేదంటే అమెరికా ఇరాన్పై మరేదైనా కొత్త దాడులకు వ్యూహ రచన చేస్తోందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
ఆశలన్నీ ఇంక ఆ నలుగురి మీదే!
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో ముందడుగు వేసింది. దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి మనుషుల్ని దింపాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఆర్టిమిస్ మిషన్కు సంబంధించిన ఓ ప్రకటన చేసింది. ఆర్టెమిస్-3 మిషన్కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించింది. భవిష్యత్లో చంద్రుడిపై మానవుల శాశ్వత ఉనికికి బాటలు వేసే కీలక మిషన్ ఇది. అలాంటప్పుడు ఈ నలుగురినే ఎందుకు ఎంచుకున్నారనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. నాసా ఎంపిక చేసిన ఈ బృందంలో కమాండర్ రాండీ బ్రెస్నిక్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పైలట్ లూకా పార్మిటానో, నాసా వ్యోమగాములు ఫ్రాంక్ రూబియో, ఆండ్రే డగ్లస్ ఉన్నారు. ఇందులో ఆండ్రే డగ్లస్ను మినహాయిస్తే మిగతా ముగ్గురు అంతరిక్షయానం చేసి ఉన్నారు. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వహించిన అనుభవం, టెస్ట్ పైలటింగ్ నైపుణ్యాలు, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరిని ఎంపిక చేసినట్లు నాసా వెల్లడించింది. అలాగని వాళ్ల బ్యాక్గ్రౌండ్లు ఆషామాషీగా లేవు.. రాండీ బ్రెస్నిక్: మిషన్కు సారథిఆర్టెమిస్-3 కమాండర్గా ఎంపికైన రాండీ బ్రెస్నిక్ నాసాలో అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాముల్లో ఒకరు. అమెరికా మెరైన్ కార్ప్స్ మాజీ పైలట్ అయిన ఆయన వేల గంటలపాటు యుద్ధ విమానాలను, టెస్టింగ్ ఫ్లైట్స్ నడిపారు. ఇప్పటికే రెండు అంతరిక్ష ప్రయాణాలు పూర్తి చేసిన ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కమాండర్గా కూడా సేవలందించారు. పలు స్పేస్వాక్లలో పాల్గొని అంతరిక్షంలో క్లిష్టమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. దీర్ఘకాలిక మిషన్ల నిర్వహణలో ఆయన అనుభవమే ఆర్టెమిస్-3లో ప్రధాన బలంగా భావిస్తున్నారు.లూకా పార్మిటానో: యూరప్ అంతరిక్ష వీరుడుఇటలీకి చెందిన లూకా పార్మిటానో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తరఫున ఈ బృందంలో చోటు దక్కించుకున్నారు. మాజీ ఫైటర్ పైలట్ అయిన ఆయన ఇప్పటికే రెండు అంతరిక్ష యాత్రలు పూర్తి చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్గా వ్యవహరించిన తొలి ఇటాలియన్గా రికార్డు సృష్టించారు. స్పేస్వాక్లలో విశేష అనుభవం ఉన్న ఆయన అంతరిక్షంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆర్టెమిస్-3లో ఆయన ఎంపిక నాసా-యూరప్ అంతరిక్ష సహకారానికి ప్రతీకగా నిలుస్తోంది.ఫ్రాంక్ రూబియో: రికార్డు సృష్టించిన వ్యోమగామినాసా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణం ఆయన అంతరిక్షంలో గడిపిన సమయం. అమెరికన్ వ్యోమగాముల్లో అత్యధిక కాలం నిరవధికంగా అంతరిక్షంలో ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు. వైద్యుడిగా, సైనిక అధికారిగా సేవలందించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. మానవ శరీరంపై అంతరిక్ష ప్రభావాలను అధ్యయనం చేయడంలో ఆయన అనుభవం ఆర్టెమిస్-3 మిషన్కు ఎంతో ఉపయోగపడనుంది.ఆండ్రే డగ్లస్: ఇంట్రెస్టింగ్ఈ బృందంలో అత్యంత ఆసక్తికరమైన ఎంపిక ఆండ్రే డగ్లస్. ఇంజినీరింగ్, రోబోటిక్స్, మానవ-యంత్ర వ్యవస్థలపై నైపుణ్యం కలిగిన ఆయన చంద్రుడిపై భవిష్యత్ కార్యకలాపాల కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష ప్రయాణ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్ చంద్రయాత్రల సాంకేతిక రూపకల్పనలో ఆయన చేసిన కృషిని గుర్తించి నాసా ఈ బృందంలో చోటు కల్పించింది.అమెరికా-యూరప్ కలయికఆర్టెమిస్-3 బృందంలో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములతో పాటు ఒక యూరోపియన్ వ్యోమగామికి చోటు కల్పించడం యాదృచ్ఛికం కాదు. చంద్రుడిపై భవిష్యత్ అన్వేషణలు ఒక్క దేశం ఆధిపత్యంలో కాకుండా అంతర్జాతీయ భాగస్వామ్యంతో సాగుతాయనే సందేశాన్ని నాసా ఇవ్వాలనుకుంటోంది. ఆర్టెమిస్ కార్యక్రమంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అందుకే లూకా పార్మిటానో ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.ఇది ట్రయల్ మాత్రమే!ఈ నలుగురి బాధ్యత చంద్రుడిపై అడుగుపెట్టడం మాత్రమే కాదు. భవిష్యత్లో చంద్రుడిపై మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం వంటి మహత్తర లక్ష్యాలకు అవసరమైన సాంకేతికతను పరీక్షించడం. అందుకే ఆర్టెమిస్-3 బృందాన్ని నాసా సాధారణ వ్యోమగాముల బృందంగా కాకుండా, మానవ అంతరిక్ష అన్వేషణ తదుపరి అధ్యాయాన్ని రాసే బృందంగా అభివర్ణిస్తోంది.ఇప్పటికే ఆర్టెమిస్-1 ద్వారా మానవరహిత పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నాసా, ఆర్టెమిస్-2 ద్వారా వ్యోమగాములను చంద్రుడి చుట్టూ తిప్పి భూమికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆర్టెమిస్-3తో మరింత కీలక దశలోకి ప్రవేశిస్తోంది. కానీ, ఇక్కడో క్లారిటీ అవసరం. ఆర్టెమిస్-3 మనుషుల్ని చంద్రుడి మీదకు దించే యాత్ర కాదు. భవిష్యత్లో చంద్రుడిపై వ్యోమగాములను సురక్షితంగా దించేందుకు అవసరమైన అత్యంత కీలక సాంకేతిక ప్రక్రియలను పరీక్షించడమే దీని ప్రధాన లక్ష్యం. సుమారు రెండు వారాల పాటు కొనసాగే ఈ మిషన్లో వ్యోమగాములు భూమి కక్ష్యలోనే ఉండి చంద్రుడిపై దిగే ల్యాండర్లతో డాకింగ్ ప్రక్రియను సాధన చేస్తారు. భవిష్యత్ చంద్రయాత్రల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఈ మిషన్లో మరో ఆసక్తికర అంశం.. ప్రైవేట్ కంపెనీల పాత్ర. జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఒరిజిన్ అభివృద్ధి చేస్తున్న ‘బ్లూ మూన్’ ల్యాండర్, ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ రూపొందిస్తున్న ‘స్టార్షిప్’ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్లతో ఈ వ్యోమగాములు డాకింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. భవిష్యత్ అంతరిక్ష యుగంలో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి ఎలా పనిచేయబోతున్నాయో ఈ మిషన్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలవనుంది. కాబట్టి.. నాసా "మూన్ ల్యాండింగ్కు ముందు ఫైనల్ రిహార్సల్"గా అభివర్ణిస్తోంది.అందుకే కీలకంఅంటే ఆర్టెమిస్-3 అనేది చంద్రయాత్రకు ముందు చివరి పరీక్ష. భవిష్యత్లో చంద్రుడిపై దిగే వ్యోమగాముల భద్రతకు అవసరమైన సాంకేతిక, శాస్త్రీయ సమాచారాన్ని నాసా సేకరిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్టెమిస్-3 బృందం ప్రకటన ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇప్పటివరకు డిజైన్, ఇంజినీరింగ్ దశలో ఉన్న మిషన్ ఇప్పుడు మానవ ప్రయాణానికి సిద్ధమవుతోందనే సంకేతం. 1972లో అపోలో-17 మిషన్ అనంతరం మానవుడు మళ్లీ చంద్రుడిపై అడుగుపెట్టలేదు. దాదాపు ఐదు దశాబ్దాల విరామం తర్వాత మానవులను తిరిగి చంద్రుడిపై దించాలన్న లక్ష్యంతో నాసా ఆర్టెమిస్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీర్ఘకాలికంగా చంద్రుడిపై స్థిరమైన మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం నాసా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఆర్టెమిస్-3 కీలక మలుపుగా మారనుంది. ఈ మిషన్ విజయవంతమైతే 2028లో చేపట్టే ఆర్టెమిస్-4 ద్వారా మానవులు చంద్రుడిపై అడుగుపెట్టే మార్గం మరింత సుగమం కానుంది. అయితే.. ఈ నలుగురు ఆర్టెమిస్-3లో పాల్గొనే నలుగురే కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ, నాసా ఆశలన్నీ ఇప్పుడు వీళ్లపైనే ఉన్నాయి.ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆర్టెమిస్-4లో నలుగురు వ్యోమగాములు చంద్ర కక్ష్యకు వెళ్తారు. వారిలో ఇద్దరు మాత్రమే ల్యాండర్లో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి దిగుతారు. అక్కడ వారం రోజుల పాటు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి తిరిగి ఓరియన్ వ్యోమనౌకలో చేరతారు.:::సాక్షి వెబ్ ప్రత్యేకం -
ట్రంప్ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్ కొత్త ప్లాన్ ఇదేనా?
పశ్చిమాసియా సంక్షోభంలో సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే కోరుతున్నారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్పై దాడులతో మళ్లీ యుద్ధాన్ని మొదలుపెట్టినంత పని చేశారు. ఇది శాంతి ప్రయత్నాల్లో ఉన్న ట్రంప్నకు సాధారణంగానే చిర్రెత్తుకొచ్చేలా చేసింది.ఒకవైపు తాను కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కవ్వింపు చర్యలకు దిగడాన్ని ట్రంప్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే వీళ్లిద్దరి మధ్య వాడివేడి సంభాషణలు జరిగినట్లు.. అందులో ట్రంప్ నెతన్యాహును చెడామడా వాయించినట్లు అమెరికా మీడియా వరుసబెట్టి కథనాలు ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ స్థాయిలో తిట్టనేలేదని.. సున్నితంగా మందలించారనే అంటోంది. ఈ క్రమంలో మంచి స్నేహాన్ని చెడగొట్టుకుంటూ.. ‘ఒంటరి అయిపోతావ్ జాగ్రత్త!’ అని హెచ్చరించేదాకా నెతన్యాహు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది పరిశీలిస్తే..ఇరాన్పై మరోసారి దాడులకు ఆదేశించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పైకి చూస్తే ఇది కేవలం హెజ్బొల్లా కోసమో, ప్రతీకారం కోసమో చేసిన దాడిలా కనిపించినా.. అసలు లక్ష్యం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్కు ప్రాధాన్యం దక్కేలా ఒత్తిడి తీసుకురావడమేనని చెబుతున్నారు. లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లయ్యింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు తాత్కాలికంగా కాల్పులు నిలిపివేశాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్తో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. కానీ, ఆ చర్చల నుంచి ఇజ్రాయెల్ను తొలి నుంచే దూరంగా ఉంచినట్లు.. ట్రంప్ వ్యవహార శైలిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో "మా ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎలాంటి తుది ఒప్పందమూ సాధ్యం కాదు" అనే సంకేతాన్ని వాషింగ్టన్కు పంపేందుకే నెతన్యూహు ఈ పరిమిత దాడులకు ఆదేశించి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇది మాత్రమే కాదు. ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన అంశం.. దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు జరిపే స్వేచ్ఛ. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరితే.. ఆ సైనిక చర్యలకు అవకాశమే ఉండకపోవచ్చు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ దాడులకు నేరుగా ప్రతిస్పందించి, "లెబనాన్లో మా చర్యలకు ఇరాన్ జోక్యం అంగీకరించం" అనే గట్టి సందేశాన్ని పంపింది.ఇక.. కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు కొంతకాలంగా బయటపడుతున్నాయి. గత వారం బీరూట్పై జరగాల్సిన వైమానిక దాడులను ట్రంప్ ఫోన్ చేయడంతో నెతన్యాహూ నిలిపివేశారు. శాంతి చర్చలు దెబ్బతినకుండా ఉండాలన్నదే ట్రంప్ ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్లో ప్రతిపక్షాలు మాత్రం "అమెరికా చర్చల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారా?" అంటూ నెతన్యాహూపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వదేశం నుంచి ఈ ఒత్తిళ్లు కూడా నెతన్యాహును దాడులకు ఆదేశించి ఉండొచ్చన్న వాదన ఒకటి వినిపిస్తోంది.సైనిక నిపుణులు చెబుతోంది ఏంటంటే.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్పై దాడులు చేయగలిగినా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే సీన్ మాత్రం లేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ వ్యవస్థల కోసం అమెరికా సహకారం కీలకం. అందువల్ల ట్రంప్తో పూర్తిగా విభేదించే పరిస్థితి కూడా ఇజ్రాయెల్కు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్పై తాజా దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలను విస్మరించవద్దనే రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ శాంతి ప్రయత్నాలు, నెతన్యాహూ భద్రతా ఆందోళనల మధ్య ఈ సమీకరణం భవిష్యత్తులో మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సెల్ఫోన్ కోసం 262 అడుగుల ఎత్తులో..
పట్టు తప్పిందా ఇక అంతే!. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అందుకే ఆ యువకుడి సాహసం.. అక్కడున్నవాళ్లను షాక్కు గురి చేసింది. ఉత్కంఠతో చివరి నిమిషం దాకా ఏం జరుగుతుందా? అని ఊపిరి బిగబట్టేలా చేసింది. పోనీ అదంతా ఎందుకు చేశాడా? అని కారణం తెలిశాక.. కంగుతినడం అక్కడున్నవాళ్ల వంతు అయ్యింది. ఒక సాధారణ పర్యాటక విహారం క్షణాల్లోనే ఉత్కంఠభరిత ఘటనగా మారింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇగ్వాజు జలపాతం (Iguazu Falls) వద్ద ఓ టూరిస్ట్ ప్రాణాలను లెక్కచేయకుండా వేగంగా ప్రవహిస్తున్న నీటిలోకి దూకాడు. కాసేపు అలాగే గనుక ఉండి ఉంటే.. ప్రవాహం ధాటికి కచ్చితంగా వందల అడుగుల కిందకి పడిపోయేవాడే!. ఈ సంఘటన బ్రెజిల్ వైపు ఉన్న జలపాతం ప్రాంతంలో శనివారం (జూన్ 6) చోటుచేసుకుంది.ఇగ్వాజు జలపాతం అర్జెంటీనా–బ్రెజిల్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద జలపాత వ్యవస్థల్లో ఒకటి. సుమారు 262 అడుగుల లోతు ఉంటుందది. రెండు దేశాల మధ్య ప్రాంతం కావడంతో పర్యాటకులు ఇక్కడికి పోటెత్తుతుంటారు. అదే సమయంలో ఇక్కడి భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే ఉండడం తరచూ వార్తల్లో వినిపిస్తుంటుంది. "Loco total"Porque un turista que estaba visitando las Cataratas de Iguazú se tiro al agua para recuperar su teléfono celular, lo recuperó, se subió a la pasarela y siguió recorriendo el lugar. pic.twitter.com/pWpmgsMLVV— Tendencias en Argentina (@porqueTTarg) June 8, 2026అలా.. ఓ పర్యాటకుడు ఈ వాటర్ఫాల్ అంచుల్లో దిగడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉన్నట్లుడి.. ఓ టూరిస్ట్ రాళ్లపై నుంచి దూకి ప్రవాహంలోకి వెళ్లి ఏదో వెతకబోయాడు. జలపాతం ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. బలమైన నీటి ప్రవాహం, జారిపోయే రాళ్లు, కేవలం కొద్ది అడుగుల దూరంలోనే ప్రాణాంతకమైన ఎత్తు ఉండటంతో ఈ ప్రాంతాన్ని అధికారులు కఠినంగా నియంత్రిస్తారు. అయినప్పటికీ ఆ వ్యక్తి చేసిన చర్య అక్కడున్న పర్యాటకులను తీవ్రంగా షాక్కు గురిచేసింది. కాసేపు ఏదో వెతికి.. ఆలస్యం చేయకుండా వెంటనే బయటకు వచ్చేశాడు. అతగాడి చేష్టలను ఇతర పర్యాటకులు వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది. అయితే చావు నోట్లో తలపెట్టి రావడానికి సెల్ఫోన్ కారణమంట!. చేజారి అది పడిపోయిందని.. అందుకే అతను అలా సాహసం చేశాడని తెలుస్తోంది. మరి సెల్పోన్ దొరికిందా? లేదా? అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. Se tiró en la Garganta del Diablo para recuperar su celularUn hecho insólito generó indignación en las Cataratas del Iguazú, del lado brasileño.Un hombre se arrojó desde la pasarela del circuito Garganta del Diablo para buscar su celular tras caerse, sin poder regresar por… pic.twitter.com/7G4tGj7aRR— mavica (@mavica7) June 8, 2026అదృష్టవశాత్తూ అతనికేం కాలేదు. సురక్షితంగా బయటకు వచ్చాడు. అయితే ఈ సంఘటన భద్రతా నియమాలపై మరోసారి చర్చకు దారితీసింది.ఇది మొదటిసారి జరిగిన ఘటన కాదని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ పర్యాటకుడు తన టోపీ కోసం ఇలాగే చేశాడు. ఆ టైంలో అధికారులు సకాలంలో స్పందించడంతో బతికి బట్టకట్టాడు. -
ఆమె ప్రశ్నిస్తే ట్రంప్కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!
ఇంటర్వ్యూల ఫార్మాట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రశ్న.. జవాబుల కంటే కఠిన ప్రశ్నలతో సంచలనాలు రేపే సెషన్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఎదురుగా డొనాల్డ్ ట్రంప్లాంటి నేతల ముందు అడుగు వేయడం అంటేనే చాలా మంది జర్నలిస్టులు జాగ్రత్తపడే పరిస్థితి. కానీ ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా ధైర్యంగా కఠిన ప్రశ్నలు వేసిన ఒక జర్నలిస్ట్.. ఇప్పుడు హాట్టాపిక్గా మారారు. ఇక చాలూ అనుకుంటూ ఆయన్ని ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేయించిన.. “ఆమె ఎవరబ్బా?” అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది.. ఆమె పేరు.. క్రిస్టెన్ వెల్కర్. ఎన్బీసీ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ట్రంప్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధానంగా.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఆధారాలు చూపాలంటూ ఆయన్ని పదే పదే ప్రశ్నించారు. అయితే ఆయన మాత్రం ఆ ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే అంశాన్ని ఆమె మళ్లీ మళ్లీ ప్రస్తావించడంతో ఇంటర్వ్యూ వాతావరణం క్రమంగా ఉద్రిక్తంగా మారింది. సారీ డార్లింగ్ అంటూనే.. తీవ్రంగా విమర్శిస్తూ ట్రంప్ విసుగ్గా కోటుకు ఉన్న లాపెల్ మైక్, వైర్లెస్ ట్రాన్స్మిటర్తో పాటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత అమెరికా మీడియా ప్రపంచంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఒక్కసారిగా దృష్టి మొత్తం క్రిస్టెన్ వెల్కర్ వైపుకే మళ్లింది.WOW -- Trump crashes out and cuts his interview with Welker short as she presses him on his lack of evidence for claiming elections are rigged"You're either crooked or you're stupid. Let's call it quits. Because I've had enough. Thank you darling," he tells her.""I traveled… pic.twitter.com/qQaNIDnX4y— Aaron Rupar (@atrupar) June 7, 2026క్రిస్టెన్ వెల్కర్ 1976 జూలై 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే వార్తా రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్రను అభ్యసించారు. అనంతరం జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని స్థానిక టెలివిజన్ ఛానళ్లలో రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించారు. రిపోర్టింగ్లో చూపిన ప్రతిభతో 2010లో ఆమె ఎన్బీసీ న్యూస్లో చేరారు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం వేగంగా ముందుకు సాగింది. వైట్హౌస్ కరస్పాండెంట్గా నియమితులైన ఆమె, అమెరికా అధ్యక్షుల విదేశీ పర్యటనలు, ఎన్నికలు, జాతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలను కవర్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే.. క్రిస్టెన్ వెల్కర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి పెద్దగా వినిపించింది 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో. అప్పటి ట్రంప్–బైడెన్ మధ్య జరిగిన చివరి ప్రత్యక్ష చర్చకు ఆమె సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇద్దరు అభ్యర్థులను సమతుల్యంగా ప్రశ్నిస్తూ, చర్చను నియంత్రించిన తీరు ఆమెకు విస్తృత ప్రశంసలు తెచ్చిపెట్టింది. అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ చర్చా కార్యక్రమాల్లో ఒకటైన “మీట్ ద ప్రెస్”కు 2023లో ఆమె హోస్ట్గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా హోస్ట్గా, రెండో మహిళా యాంకర్గా నిలిచి విశేష గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్ను ఆమె ఇంతకు ముందు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. ట్రంప్ మాత్రమే కాదు.. గతంలో బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, జో బైడన్.. ఇంకా పలువురు టాప్ డెమోక్రటిక్, రిపబ్లికన్ లీడర్లను ఆమె తనదైన శైలి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఆమె ప్రశ్నించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా వెనక్కి తగ్గకుండా ప్రశ్నలు వేయడం, సమాధానాల్లోని అస్పష్టతను వెంటనే గుర్తించి తిరిగి ప్రశ్నించడం ఆమె జర్నలిజం శైలి. స్పష్టమైన సమాధానం వచ్చే వరకు వెనక్కి తగ్గకపోవడం వల్లే ఆమెను అమెరికా రాజకీయ జర్నలిజంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా భావిస్తారు. తాజా ఘటనతో మరోసారి ఆమె పేరు.. తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. -
పాపం.. రన్వేపైనే కబళించిన మృత్యువు
ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం ఎందుకు ప్రయత్నించిందో తెలియదు. రన్వేపై ఘోరంగా తడబడింది. చూస్తుండగానే ప్రైవేట్ జెట్ అదుపుతప్పి కుప్పకూలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే విమానం అగ్నిగుండాన్ని తలిపించింది. పైలట్ చేసిన ప్రయత్నం చివరకు విషాదాంతంగా మారింది. ఆ మంటల్లో చిక్కుకుని పైలట్, కో-పైలట్ ప్రాణాలు కోల్పోయారు. డొమినికన్ రిపబ్లిక్లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ రన్వేపై సురక్షితంగా దిగకముందే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనాస్థలం అగ్నిగుండంలా మారిపోయింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.విమానం ఏ కారణంతో అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నించిందన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాంకేతిక లోపమా? ఇంజిన్ సమస్యా? లేదంటే వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందికి దించే ప్రయత్నం చేసినప్పటికీ, చివరి క్షణాల్లో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. దీంతో రన్వేకు చేరకముందే విమానం నేలపై కూలిపోయింది.Tragic development: A private jet has crashed during an emergency landing attempt at La Romana International Airport in the Dominican Republic.#aircraft pic.twitter.com/Q4nmtpn4ul— FL360aero (@fl360aero) June 7, 2026ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీ మంటలు ఎగసిపడ్డాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోల్లో విమానం శకలాలు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినా, విమానం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.ఈ ఘటనపై విమానయాన అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. విమానం నిర్వహణ రికార్డులు, సాంకేతిక పరిస్థితి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో జరిగిన సంభాషణలు, ఫ్లైట్ డేటా తదితర అంశాలను పరిశీలించనున్నారు. అయితే ప్రమాదానికి దారితీసిన అసలు కారణం ఏంటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
అన్నంత పని చేసిన ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. లెబనాన్ బీరూట్ శివార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే.. ఇరాన్ రంగంలోకి దిగింది. నేరుగా బాలిస్టిక్ క్షిపణులతో ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాల్లో సైరన్లు మోగగా, క్షిపణి నిరోధక వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగాయి. ఆదివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) వెల్లడించింది. క్షిపణుల ప్రయోగాన్ని గుర్తించిన వెంటనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగించడంతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థలను రంగంలోకి దింపింది. లక్షలాది మంది ప్రజలు అత్యవసర ఆశ్రయ కేంద్రాలు, బంకర్లకు పరుగులు తీశారు. ఉత్తర ఇజ్రాయెల్లో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను వైమానిక దళం విజయవంతంగా అడ్డుకుందని తెలిపింది. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని పేర్కొంది. అయితే అదనపు క్షిపణుల ప్రయోగాలను కూడా గుర్తించినట్లు వెల్లడించింది.ప్రతీకారమే!ఈ క్షిపణి దాడులు జరగడానికి కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హిజ్బుల్లా ప్రభావం ఎక్కువగా ఉన్న దహియెహ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీరూట్పై దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని ఇప్పటికే హెచ్చరించిన టెహ్రాన్, తాజాగా రంగంలోకి దిగినట్లే స్పష్టమవుతోంది.10 క్షిపణులు అడ్డుకున్న ఇజ్రాయెల్అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన కనీసం 10 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా మీడియా సంస్థ CNN తన నివేదికలో పేర్కొంది.ఇజ్రాయెల్ ప్రతీకార హెచ్చరికఇరాన్ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ Effie Defrin, "ఇరాన్ తీవ్రమైన తప్పు చేసింది" అని వ్యాఖ్యానించారు. అలాగే ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎయల్ జమీర్ మాట్లాడుతూ.. అవసరమైతే శత్రువుపై గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఏప్రిల్ తర్వాత..ఏప్రిల్ 8న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సున్నితమైన శాంతి వాతావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇజ్రాయెల్-హెజ్బుల్లా ఘర్షణల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను కూడా ఇరాన్ నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో పాక్షిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, అదే రోజున రెండు పక్షాలు పరస్పరం దాడులు కొనసాగించడంతో ఆ ఒప్పందం నిలవలేదు.రమత్ డేవిడ్ ఎయిర్బేస్ లక్ష్యంగా..ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తమ ఏరోస్పేస్ దళాలు ఇజ్రాయెల్లోని రమత్ డేవిడ్ ఎయిర్బేస్ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. ఇరాన్కు చెందిన ఖాతమ్ అల్-అన్బియా కమాండ్ అధికారి మాట్లాడుతూ, బీరూట్ దక్షిణ శివార్లపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ అన్ని "రెడ్లైన్లను" దాటిందని ఆరోపించారు.అన్నంత పని చేసిన ఇరాన్"బీరూట్ శివార్లపై దాడులు విస్తరిస్తే ఆక్రమిత భూభాగాల్లోని లక్ష్యాలపై దాడి చేస్తామని ముందే హెచ్చరించాం. ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు ఆపకపోతే మరింత తీవ్రమైన, విధ్వంసకర దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ఇరాన్ సైనికాధికారులు హెచ్చరించారు.గగనతలం మూసివేతఇజ్రాయెల్పై క్షిపణి దాడుల అనంతరం ప్రతీకార చర్యలు ఉండొచ్చన్న అంచనాతో ఇరాన్ తన పశ్చిమ గగనతలాన్ని (Western Airspace) తాత్కాలికంగా మూసివేసింది. అదే సమయంలో ఇరాక్, సిరియా కూడా భద్రతా కారణాల దృష్ట్యా తమ గగనతలాన్ని మూసివేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో ప్రాంతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.అమెరికా లక్ష్యాలకూ హెచ్చరికఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) మరింత ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమైతే కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా అమెరికా ప్రయోజనాలు, అమెరికా మద్దతు ఉన్న లక్ష్యాలపై కూడా దాడులు విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిసరాల్లో జరిగిన ఘటనలను కూడా ప్రస్తావించింది.ట్రంప్ భిన్నాభిప్రాయంఅయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ మరింత ప్రతీకార చర్యలకు వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రసార సంస్థ నివేదించింది. ఇది ఇజ్రాయెల్ సైన్యం వ్యక్తం చేస్తున్న కఠిన వైఖరికి భిన్నంగా కనిపిస్తోంది.మళ్లీ యుద్ధ భయాలుఇరాన్-ఇజ్రాయెల్ తాజా ఘర్షణతో మిడిల్ఈస్ట్ దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే గాజా, లెబనాన్, సిరియా ప్రాంతాల్లో కొనసాగుతున్న అస్థిర పరిస్థితులకు ఈ పరిణామం మరింత మంటలు రాజేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భూకంప బీభత్సం.. సునామీ హెచ్చరికలతో హైఅలర్ట్!
ఒక్కసారిగా భూమి కంపించింది. క్షణాల్లో భవనాలు ఊగిపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. ఫిలిప్పీన్స్లోని మిండనావో ప్రాంతాన్ని 8.2 తీవ్రత భూకంపం వణికించగా.. ఇప్పుడు అందరి దృష్టి సముద్రంపైనే ఉంది. ఎందుకంటే భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ కావడంతో తీరప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.ఫిలిప్పీన్స్లోని మిండనావో ద్వీపం సమీపంలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఉపరితలానికి అత్యంత సమీపంలో భూకంప కేంద్రం ఉండటంతో ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా నమోదైంది.మొదట భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేసిన అధికారులు.. ఆ తర్వాత 7.8గా, అనంతరం 8.2గా సవరించారు. దీంతో ఇది ఇటీవలి కాలంలో పసిఫిక్ ప్రాంతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా మారింది.కూలిన భవనాలు.. పరుగులు తీసిన ప్రజలుభూకంపం సంభవించిన వెంటనే పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భవనాలు కూలిపోవడం, ప్రజలు అరుస్తూ బయటకు పరుగులు తీయడం కనిపించింది. ఓ పాఠశాలలో విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జనరల్ సాంటోస్ నగరంలో ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలు కిందపడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొన్ని వాణిజ్య భవనాలకు కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం.ఒకరు మృతి.. పలువురికి గాయాలుతాజా సమాచారం ప్రకారం కనీసం ఒకరు మృతి చెందగా, నలుగురికి పైగా గాయపడ్డారు. సరంగాని ప్రావిన్స్లోని అలాబెల్ పట్టణ పోలీస్ స్టేషన్కు పగుళ్లు ఏర్పడ్డాయి. "ఇటీవలి సంవత్సరాల్లో మేము అనుభవించిన అత్యంత బలమైన భూకంపం ఇదే" అని స్థానిక అధికారులు తెలిపారు.సునామీ భయంభూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం వెంటనే అలర్ట్ జారీ చేసింది. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా తీరప్రాంతాలకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ అగ్నిపర్వతాలు, భూకంపాల పరిశోధనా సంస్థ (PHIVOLCS) కొన్ని ప్రాంతాల్లో ఒక మీటర్కు పైగా ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వేలాది మందిని తీరప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇండోనేషియా కూడా తన ఈశాన్య తీరప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.రింగ్ ఆఫ్ ఫైర్లోనే ప్రమాదంఫిలిప్పీన్స్ "పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్"గా పిలిచే అత్యంత భూకంప ప్రబల ప్రాంతంలో ఉంది. భూమి టెక్టానిక్ ఫలకాలు కలిసే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు సంభవిస్తుంటాయి.ఇప్పుడు అందరి చూపు సముద్రంపైనేభూకంపం వల్ల జరిగిన నష్టం కంటే ఇప్పుడు సునామీ ముప్పే అధికారులను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. సముద్ర మట్టంలో మార్పులను నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సునామీ ప్రమాదం పూర్తిగా తొలగే వరకు తీరప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. (8 มิ.ย. 69) เวลา 06:37 น. ตามเวลาประเทศไทย เกิดแผ่นดินไหว จุดศูนย์กลางอบู่บริเวณ Mindanao, Philippines ขนาด 8.2 ลึก 10 กม. ญี่ปุ่นประกาศเตือนสึนามิ ขอให้ทุกคนปลอดภัยนะ ภัยธรรมชาติน่ากลัวมาก#earthquake #Philippines #tsinami pic.twitter.com/Zi5mIOsGBy— เลิฟบูววววว (@Lali_M17) June 8, 2026 UPDATE: At least one dead, 4 injured after the earthquake in southern Philippines. The police chief of Alabel town in Sarangani told Reuters the police building cracked during the quake, which hit while officers were mid-flag-raising ceremony.Magnitude still being confirmed.… pic.twitter.com/ncqtqHTGBX— Global Report (@Global_ReportHQ) June 8, 2026Another video captures the Jollibee building collapse in General Santos, Philippines following powerful earthquake. No word on casualties. https://t.co/LJEVl0qTjC pic.twitter.com/DgixNijwoY— AZ Intel (@AZ_Intel_) June 8, 2026 -
చైనా దాచిన నిజాలు.. 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి!
ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోకి వచ్చిన వేలాది మంది యువత.. ట్యాంకులతో వారిపై విరుచుకుపడిన సైన్యం.. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 1989 టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఇప్పటికీ చైనా చరిత్రలో చెరగని మచ్చగానే మిగిలింది. ఈ ఘటనకు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాటి ఉద్యమానికి సంబంధించిన మరికొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి రావడంతో ప్రపంచ దృష్టి మరోసారి ఆ రక్తచరిత్రపైకి మళ్లింది.ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకని ఘటనల్లో టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఒకటి. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు వీధుల్లోకి రావడం.. ఆ ఉద్యమాన్ని చైనా ప్రభుత్వం ట్యాంకులు, సైన్యంతో అణచివేయడం.. వందల మంది, మరికొందరి అంచనాల ప్రకారం వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం.. ఇవన్నీ చైనా చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయాయి.1980ల చివర్లో చైనా వేగంగా ఆర్థిక సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, రాజకీయ స్వేచ్ఛలు మాత్రం కఠిన నియంత్రణలోనే ఉండేవి. అవినీతి పెరుగుతోందన్న విమర్శలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రజాస్వామ్య సంస్కరణలపై యువతలో పెరుగుతున్న ఆకాంక్షలు దేశవ్యాప్తంగా అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సంస్కరణవాది నేత హు యాబాంగ్ మరణం ఉద్యమానికి నాంది పలికింది.హు యాబాంగ్ను విద్యార్థులు, మేధావులు మార్పుకు ప్రతీకగా భావించేవారు. ఆయన మరణం తర్వాత 1989 ఏప్రిల్లో వేలాది మంది విద్యార్థులు బీజింగ్లోని టియానన్మెన్ స్క్వేర్కు చేరుకున్నారు. మొదట ఇది కేవలం సంతాప సభగానే ప్రారంభమైనప్పటికీ, క్రమంగా అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య సంస్కరణలు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం భారీ ఉద్యమంగా రూపాంతరం చెందింది.రోజులు గడిచేకొద్దీ నిరసనల తీవ్రత పెరిగింది. విద్యార్థులతో పాటు కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పౌరులు కూడా ఉద్యమంలో చేరారు. లక్షలాది మంది స్క్వేర్లో గుమికూడడంతో బీజింగ్ అంతర్జాతీయ మీడియా దృష్టిలోకి వచ్చింది. ఒక దశలో ఈ ఉద్యమం చైనా కమ్యూనిస్టు పాలనకే సవాలుగా మారిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన ప్రభుత్వం మే నెలలో మార్షల్ లా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జూన్ 3 రాత్రి నుంచి జూన్ 4 తెల్లవారుజామున వరకు సైన్యం ట్యాంకులు, సాయుధ బలగాలతో బీజింగ్లోకి ప్రవేశించి నిరసనలను అణచివేసింది. ఆ రాత్రి ఏం జరిగిందన్నది ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, ప్రత్యక్ష సాక్షులు మరియు అంతర్జాతీయ మీడియా నివేదికలు వందల నుంచి వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని సూచిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మాత్రం అధికారిక మరణాల సంఖ్యను ఇప్పటికీ వెల్లడించలేదు.ఈ ఘటనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దృశ్యం “ట్యాంక్ మ్యాన్”. ట్యాంకుల వరుస ముందు ఒంటరిగా నిలబడి వాటిని అడ్డుకున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చిత్రం ప్రభుత్వ శక్తికి ఎదురుగా వ్యక్తి ధైర్యానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది.ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన కొత్త చిత్రాలు ఆ రోజుల్లోని ఉద్రిక్త వాతావరణాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. స్క్వేర్లో గుమికూడిన విద్యార్థులు, తాత్కాలిక శిబిరాలు, ప్రజల రద్దీ, సైనిక కదలికలు, ఆందోళనల మధ్య నెలకొన్న ఉద్విగ్న పరిస్థితులు ఈ ఫొటోల ద్వారా మరోసారి ప్రపంచం ముందు ప్రత్యక్షమవుతున్నాయి. చరిత్రలో నమోదు కాని కొన్ని క్షణాలను కూడా ఇవి వెలుగులోకి తీసుకొస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.టియానన్మెన్ ఘటనలో కీలక పాత్ర పోషించిన హు యాబాంగ్ చైనా కమ్యూనిస్టు పార్టీలో సంస్కరణవాది నేతగా గుర్తింపు పొందారు. సాంస్కృతిక విప్లవ సమయంలో అన్యాయానికి గురైన వారికి పునరావాసం కల్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయనను ప్రజల్లో మరింత గౌరవనీయుడిగా మార్చాయి. 1987లో ఆయన పదవి నుంచి తప్పించబడ్డారు. 1989 ఏప్రిల్లో ఆయన మరణించడంతో విద్యార్థులు నివాళుల కోసం స్క్వేర్కు చేరుకోవడం చివరికి పెద్ద ఉద్యమంగా మారింది.ఈ ఘటనపై చైనాలో ఇప్పటికీ బహిరంగ చర్చలు పరిమితంగానే ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు, మీడియా, సోషల్ మీడియా వేదికలపై కఠిన నియంత్రణ కొనసాగుతోంది. అయినప్పటికీ విదేశాల్లోని చరిత్రకారులు, మానవ హక్కుల సంస్థలు ప్రతి సంవత్సరం ఈ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అణచివేత వల్ల ఈ ఉద్యమం లక్ష్యాన్ని సాధించకపోయినా, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన చర్చల్లో అది ఒక శాశ్వత గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ కొత్త చిత్రాలు ఆ పోరాటంలో నిలిచిన వేలాది యువత ఆశలు, భయాలు, ధైర్యానికి మరోసారి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
నీటి చుక్క దొరక్క 49 మంది మృతి
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఒకటైన సహారా ఎడారిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ఎడారిలో చిక్కుకుపోగా.. రోజుల తరబడి నీటి చుక్క దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇద్దరు కాలినడకన సాహసోపేత ప్రయాణం చేసి అధికారులకు విషయం చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..అల్జీరియా-మాలీ సరిహద్దుల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మాలీ నుంచి కొందరు పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో ఈద్ అల్-అధా(బక్రీద్)ను జరుపుకునేందుకు ట్రక్కులో బయల్దేరారు. అయితే ట్రక్కు అస్సామాకా పట్టణానికి పశ్చిమాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో.. సహారా ఎడారిలోని నిర్జన ప్రాంతంలో నిలిచిపోయింది. ట్రక్కు చెడిపోవడంతో డ్రైవర్, సహాయకులు, ప్రయాణికులు కలిసి మరమ్మతు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చుట్టుపక్కల ఎక్కడా గ్రామం లేదు.. నీటి వనరు లేదు.. ఫోన్ సిగ్నల్ కూడా లేదు. దీంతో వాహనంలో ఉన్నవారు మండే ఎండలో చిక్కుకుపోయారు.సహారా ఎడారిలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో నీరు లేకపోతే మనిషి కొన్ని రోజులు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణికులు సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. మొదట నీటి నిల్వలు అయిపోయాయి. తర్వాత ఆహారం కూడా ముగిసింది. చివరకు దాహం, వేడి, అలసటతో ఒక్కొక్కరిగా కుప్పకూలిపోయారు.అయితే అందరూ చనిపోలేదు. ఇద్దరు వ్యక్తులు ప్రాణాల కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 50 కిలోమీటర్లకుపైగా కాలినడకన ఎడారిలో నడిచి ఒక నీటి వనరును చేరుకున్నారు. అక్కడి నుంచి అస్సామాకా పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతోనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రక్షక బృందాలు అక్కడికి చేరుకునే సరికి ట్రక్కు కింద, చుట్టుపక్కల డజన్ల కొద్దీ మృతదేహాలు కనిపించాయి. మొత్తం 49 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.రక్షక బృందాలకు మరో షాక్ఈ ఘటనలో మృతదేహాలను వెలికితీసి.. ఎడారిలోనే సామూహిక ఖననాలు నిర్వహించారు. అయితే రక్షక బృందాలు తిరుగు ప్రయాణంలో మరో షాకింగ్ దృశ్యాన్ని చూశాయి. సమీప ప్రాంతంలో మరో ట్రక్కు కూడా చెడిపోయి సుమారు 60 మంది మూడు రోజులుగా చిక్కుకుపోయినట్లు గుర్తించారు. అదృష్టవశాత్తూ వారికి సమయానికి నీరు అందించి ప్రాణాలు కాపాడగలిగారు. లేదంటే మరో భారీ విషాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు.సహారా ఎందుకు ఇంత ప్రమాదకరం?సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. ఇది సుమారు 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. నైజర్లోని ఉత్తర ప్రాంతాల్లో జనావాసాలు చాలా తక్కువ. వందల కిలోమీటర్ల మేర నీటి వనరులు కనిపించవు. ఒక వాహనం చెడిపోతే సహాయం చేరుకోవడానికి రోజులు పట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే స్థానికులు సహారాను "సైలెంట్ కిల్లర్"గా అభివర్ణిస్తుంటారు. అలా.. కుటుంబాలతో ఈద్ చేసుకునేందుకు బయల్దేరిన 49 మంది ప్రయాణికుల ప్రయాణం... చివరకు ఇసుకల్లోనే ముగిసింది. సహారా ఎడారి మరోసారి తన క్రూర రూపాన్ని ప్రపంచానికి చూపించింది.ఇది మొదటిసారి కాదుసహారా ఎడారిలో ఇలాంటి విషాదాలు గతంలో కూడా ఎన్నోసార్లు జరిగాయి. 2013లో నైజర్ నుంచి అల్జీరియా వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు వలసదారులు దారి తప్పి దాహంతో మరణించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. 2017లో మరో ఘోర ఘటన జరిగింది. ఎడారిలో చిక్కుకున్న వలసదారుల్లో 44 మంది దాహం, ఆకలితో మృతి చెందారు. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అంతర్జాతీయ వలస సంస్థ (IOM) అంచనా ప్రకారం 2014 నుంచి సహారా మార్గాల్లో కనీసం 7 వేల మందికిపైగా మరణించినట్లు.. మరికొందరు అదృశ్యమైనట్లు నమోదైంది. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎడారిలో కనిపించకుండా పోయిన వారిలో చాలామంది గురించి ఎప్పటికీ సమాచారం బయటకు రాదు. -
వార్ పవర్స్ షాక్.. ట్రంప్ దూకుడుకు బ్రేక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కీలక రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలను అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకోకుండా నియంత్రించే 'వార్ పవర్స్' (War Powers) తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదించింది. 215-208 ఓట్ల తేడాతో ఆమోదం పొందిన ఈ తీర్మానం ట్రంప్ విదేశాంగ, సైనిక విధానాలపై కాంగ్రెస్ అసంతృప్తికి నిదర్శనంగా భావిస్తున్నారు.డెమోక్రటిక్ పార్టీకి చెందిన గ్రెగరీ మీక్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రకారం.. అమెరికా సైన్యాన్ని యుద్ధంలో కొనసాగించడం లేదంటే కొత్త సైనిక చర్యలు చేపట్టడం కోసం కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్) అనుమతి తప్పనిసరి. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం కాంగ్రెస్కే ఉందని ఈ తీర్మానం మరోసారి స్పష్టం చేస్తోంది. ఈ తీర్మానానికి నలుగురు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపడం కొసమెరుపు. ఎందుకు ఎదురుదెబ్బ?.. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఇరాన్ ఘర్షణలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి లేకుండానే సైనిక చర్యలు చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే యుద్ధం కారణంగా చమురు ధరలు, ఇంధన వ్యయాలు పెరగడం, ఆర్థిక ప్రభావాలు కనిపించడం వల్ల అమెరికాలో ప్రజాభిప్రాయం కూడా మారుతోంది. ఈ నేపథ్యంలోనే అధికార రిపబ్లికన్ పార్టీలోని నలుగురు సభ్యులు కూడా డెమోక్రాట్లతో కలిసి తీర్మానానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఈసారి విజయంఇదే తరహా తీర్మానం గతంలో పలుమార్లు సభ ముందుకు వచ్చినప్పటికీ ఆమోదం పొందలేదు. మే నెలలో జరిగిన ఓటింగ్లో 212-212తో సమం కావడంతో తీర్మానం విఫలమైంది. అయితే ఈసారి అదనపు మద్దతు లభించడంతో సభ ఆమోదం దక్కింది.ఏం జరగబోతోందంటే..హౌస్ ఆమోదించిన ఈ తీర్మానం ఇప్పుడు సెనెట్లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా కొంతమంది రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలుపుతున్నప్పటికీ తుది ఫలితం ఆసక్తికరంగా మారింది. సెనెట్ ఆమోదించినా ట్రంప్ దీనిపై వీటో (Veto) విధించే అవకాశం ఉందని అమెరికా మీడియా నివేదిస్తోంది.యుద్ధం వెంటనే ఆగిపోతుందా?ఈ తీర్మానం ఆమోదం పొందినంత మాత్రాన యుద్ధం తక్షణమే ఆగిపోదు. అయితే కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు కొనసాగించడంపై ట్రంప్ ప్రభుత్వంపై రాజకీయ, రాజ్యాంగపరమైన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అధ్యక్ష అధికారాలపై కాంగ్రెస్ తన నియంత్రణను పునరుద్ఘాటించినట్లవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ట్రంప్ దూకుడును కొంత మేర నియంత్రించే పరిణామంగా భావిస్తున్నారు.కీలక అంశాలుఇరాన్పై సైనిక చర్యలను పరిమితం చేసే 'వార్ పవర్స్' తీర్మానం ఆమోదం215-208 ఓట్లతో హౌస్లో ఆమోదంనలుగురు రిపబ్లికన్లు కూడా మద్దతుయుద్ధ నిర్ణయాలకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అనే సందేశంసెనెట్ ఆమోదం, ట్రంప్ వీటోపై ఉత్కంఠట్రంప్ విదేశాంగ విధానాలకు పెద్ద రాజకీయ హెచ్చరికగా విశ్లేషణ -
జపాన్లో మసీదు.. పాక్ పరువు పాయె!
పరాయి దేశంలో పాకిస్థాన్కు పరువు పొగొట్టుకుంది. ఆ దేశ పౌరులు అక్కడ ఓ మసీదును నిర్మించడమే అందుకు కారణం. పైగా దానిని ఆ దేశ రాయబారితోనే అట్టహాసంగా ప్రారంభించింది. అయితే వారం తిరగకుండానే స్థానిక అధికారులు మసీదు నిర్వాహకులకు షాకిచ్చారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జపాన్లోని సైతామా ప్రిఫెక్చర్లో ఉన్న కవగోయే నగరంలో నిర్మించిన ఓ మసీదు వివాదాస్పదంగా మారింది. నగర ప్రణాళిక చట్టాల ప్రకారం ప్రత్యేక అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాని ప్రాంతంలో ఈ మసీదును నిర్మించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సుమారు 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం పర్వత అటవీ భూమిగా నమోదై ఉంది. ఇది అర్బనైజేషన్ కంట్రోల్ ఏరియా పరిధిలోకి వస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం నిషేధం.అయితే మసీదు నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకోలేదని కవగోయే మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ హమీద్ Abdul Hameed ఈ ఏప్రిల్లో జరిగిన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడమే. దీంతో ఈ నిర్మాణానికి పాకిస్థాన్ ప్రభుత్వ మద్దతు ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.అయితే వివాదం ముదరడంతో పాకిస్థాన్ రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. మసీదు నిర్వాహకులు అన్ని అనుమతులు తీసుకున్నామని హామీ ఇవ్వడంతోనే రాయబారి కార్యక్రమానికి హాజరయ్యారని పేర్కొంది. స్థానిక చట్టాలను ఉల్లంఘించే ఏ ప్రాజెక్టుతోనూ తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అలాగే జపాన్లో నివసిస్తున్న పాకిస్థానీ కమ్యూనిటీకి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, ప్రార్థనా మందిరాల నిర్మాణం సహా అన్ని అంశాల్లో స్థానిక చట్టాలను పూర్తిగా పాటించాలని కోరింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని హెచ్చరించింది.ఇదే సమయంలో జపాన్లో చాలాకాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాషియో మసీదు ప్రతినిధి షకీల్ షేక్ మహ్మద్ కూడా ఈ నిర్మాణాన్ని తప్పుబట్టారు. స్థానిక ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ, చట్టబద్ధంగా అనుమతులు తీసుకుని మాత్రమే మసీదులు నిర్మించాలని సూచించారు.మొత్తంగా మసీదు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కొద్ది రోజులకే అది అక్రమ నిర్మాణంగా మారడం పాకిస్థాన్కు ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. జపాన్ వంటి చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించే దేశంలో ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
నువ్వో పిచ్చోడివి! నేనే గనుక లేకుంటే..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్న వేళ.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని.. యుద్ధం ఆగిపోతోందని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ విషయం బయటకు వచ్చింది. లెబనాన్లో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం.. బీరూట్పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్, నెతన్యాహుతో అత్యంత ఉద్రిక్తంగా మాట్లాడారు. “నువ్వు పిచ్చివాడివి.. నేను లేకపోతే జైలులో ఉండేవాడివి. ఇప్పుడు అందరూ నిన్ను, ఇజ్రాయెల్ను ద్వేషిస్తున్నారు” అంటూ ట్రంప్ మండిపడ్డారని అమెరికా అధికారులు వెల్లడించినట్లు కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యలు కేవలం లెబనాన్కే పరిమితం కాకుండా.. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.బీరూట్పై దాడి నిలిపివేయించానన్న ట్రంప్ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందించారు. నెతన్యాహుతో “అత్యంత ఫలప్రదమైన” చర్చ జరిగిందని పేర్కొంటూ.. బీరూట్ వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తిప్పినట్లు చెప్పారు. అంతేకాదు.. హెజ్బొల్లా ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులు చేయకపోతే తాము కూడా కాల్పులు ఆపేందుకు హెజ్బొల్లా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. “ఇరు పక్షాలు కాల్పులు నిలిపేస్తాయి. ఇది శాశ్వతంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అంటూ “ETERNITY” అనే పదాన్ని పెద్ద అక్షరాలతో పోస్ట్ చేశారు.నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గలేదుఅయితే ట్రంప్ ప్రకటనల తర్వాత నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు మరోసారి సందేహాలకు తావిచ్చాయి. హెజ్బొల్లా తమ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగిస్తే బీరూట్లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. “హెజ్బొల్లా ఆగకపోతే మేము కూడా ఆగం” అని నెతన్యాహు ప్రకటించారు. దీంతో ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణపై ప్రశ్నలు తలెత్తాయి.యుద్ధం తాజా పరిస్థితిఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త చర్యలతో ఇరాన్పై సైనిక ఒత్తిడి ప్రారంభమైన తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్కు మద్దతుగా ఉన్న హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తుండగా.. ప్రతిగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్లో వైమానిక, భూదళాల ఆపరేషన్లు కొనసాగిస్తోంది. ఇటీవల బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా స్థావరాలు కూడా ఇజ్రాయెల్ లక్ష్యాలుగా మారాయి. ఈ పరిణామాలు పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళన పెరుగుతోంది.ఇరాన్ చర్చలకు బ్రేక్?లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు విస్తరించడంతో అమెరికాతో జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. తమ మిత్రదేశమైన హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతుండగా చర్చలు జరపడం సాధ్యం కాదని టెహ్రాన్ అభిప్రాయపడుతోంది. అయితే ట్రంప్ మాత్రం మరోవైపు భిన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇరాన్తో చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని ఒక ప్రకటనలో చెబుతూనే.. మరో ఇంటర్వ్యూలో “ఆ చర్చలు బోరింగ్గా మారాయి. అవి విఫలమైనా నాకు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు” అని వ్యాఖ్యానించారు. ఇంకా “కొంతకాలం మౌనం పాటిస్తే మంచిది” అని కూడా అన్నారు.వాషింగ్టన్-టెల్అవీవ్ మధ్య విభేదాలా?ఇప్పటివరకు ఇరాన్ విషయంలో ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహాత్మకంగా భిన్న దిశల్లో కదులుతున్నాయా అనే చర్చ మొదలైంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా.. నెతన్యాహు మాత్రం హెజ్బొల్లాపై సైనిక ఒత్తిడి కొనసాగించాలనే వైఖరితో కనిపిస్తున్నారు.మిడిల్ఈస్ట్ సంక్షోభం ఎటు?ఒకవైపు కాల్పుల విరమణ ప్రకటనలు.. మరోవైపు బీరూట్పై దాడుల హెచ్చరికలు.. ట్రంప్-నెతన్యాహు మధ్య బహిర్గతమైన విభేదాలు.. ఇరాన్ చర్చల అనిశ్చితి.. ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యాన్ని మరో కీలక మలుపు వద్ద నిలబెట్టాయి. ట్రంప్ ఆశిస్తున్నట్లుగా ఈ శాంతి “శాశ్వతం” అవుతుందా? లేక మరో భారీ ఘర్షణకు నాంది పలుకుతుందా? అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. -
షాకింగ్: అమెరికాను ముందే దెబ్బ కొట్టే వ్యూహమా?
శాటిలైట్కు చిక్కిన ఆ నిర్మాణం.. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుతోంది. ఎడారి మధ్యలో కనిపిస్తున్న ఆ నిర్మాణాలు సాధారణ సైనిక బేస్లు కావు… ఉపగ్రహ కళ్లలో అవి ఇప్పుడు ఒక భారీ “అణు కోట వ్యవస్థ”గా మారాయి. అమెరికా మొదట దాడి చేసినా తమ అణు శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయలేని విధంగా చైనా రూపొందిస్తున్న రహస్య “డిఫెన్స్ వెబ్” అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.రాయిటర్స్ పరిశీలించిన తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, చైనా జిన్జియాంగ్ ఎడారి ప్రాంతంలో తన దీర్ఘశ్రేణి అణు క్షిపణుల (ICBM) చుట్టూ విస్తారమైన మిలిటరీ మౌలిక వసతులను వేగంగా నిర్మిస్తోంది. ఈ నిర్మాణాలు కేవలం రక్షణ కోసం మాత్రమే కాకుండా, ప్రతిదాడి సామర్థ్యాన్ని పెంపొందించేలా రూపొందించినట్లు భద్రతా నిపుణులు భావిస్తున్నారు.జిన్జియాంగ్ ఎడారిలో బయటపడిన ఈ వ్యవస్థలో 80కి పైగా కొత్త లాంచ్ ప్యాడ్లు, భూగర్భ బంకర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా. ఇవి చైనా అణు వ్యూహంలో కీలక మార్పును సూచిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయ సైలో ఆధారిత వ్యవస్థను మరింత విస్తరించి, మొబైల్ లాంచ్ సామర్థ్యంతో కలిపిన సమగ్ర రక్షణ–దాడి నెట్వర్క్గా అభివృద్ధి చేస్తున్నారు.అందుకోసమేనా?ఈ పరిణామం అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న అణు పోటీలో కొత్త దశను సూచిస్తోంది. తైవాన్ అంశంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, చైనా తన “సెకండ్ స్ట్రైక్ కెపబిలిటీ”ను మరింత బలపరచుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే, తొలి దాడి జరిగినా తిరిగి ప్రతిదాడి చేయగల సామర్థ్యాన్ని నిలుపుకోవడం.ఇక శాటిలైట్ చిత్రాల్లో వెలుగులోకి వచ్చిన మరో కీలక అంశం జిన్జియాంగ్ ప్రాంతంలోని రెండు భారీ ఆక్టాగాన్ ఆకార సైనిక సముదాయాలు. ఇవి కేవలం బేస్లు మాత్రమే కాకుండా, విస్తృత మిలిటరీ నెట్వర్క్కు కేంద్రాలుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి చుట్టూ సైనిక వాహనాల శిబిరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, ఎయిర్బేస్లు, రైల్వే కనెక్టివిటీతో పాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసినట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం నిర్మాణం ఒక క్లిష్టమైన రోడ్డు వ్యవస్థ, భూగర్భ మార్గాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లతో అనుసంధానమై ఉండటం. ఇది కేవలం ఒక బేస్ కాకుండా, పూర్తి స్థాయి వ్యూహాత్మక యుద్ధ యంత్రాంగంగా రూపుదిద్దుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. ఎడారి అంతటా విస్తరించిన ఈ నెట్వర్క్, అవసరమైనప్పుడు వేగంగా కదిలే అణు దళాలకు సహకరించేలా రూపొందించినట్లు భావిస్తున్నారు.అమెరికా డిఫెన్స్ అంచనాల ప్రకారం, చైనా 2030 నాటికి తన అణు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచి సుమారు 1,000 వార్హెడ్లను సిద్ధం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే వందకు పైగా ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లు (ICBMలు) వివిధ సైలోల్లో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.అణు వ్యూహ నిపుణులు ఈ విస్తరణను “అసాధారణం”గా అభివర్ణిస్తున్నారు. ఇంత వేగంగా, ఇంత భారీ స్థాయిలో ఎడారి ప్రాంతంలో మిలిటరీ మౌలిక వసతులు అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారి అని వారు చెబుతున్నారు. ఇది చైనా వ్యూహాత్మక అణు సామర్థ్యాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లే పరిణామమని అంచనా వేస్తున్నారు.ప్రపంచ భద్రతా దృష్టిలో చూస్తే, ఈ పరిణామం కొత్త ఒత్తిడిని తీసుకువస్తోంది. అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలతో పోలిస్తే చైనా ఇప్పుడు తన అణు వ్యూహాన్ని మరింత విస్తృతంగా, రహస్యంగా, బలంగా రూపుదిద్దుకుంటోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది భవిష్యత్లో ప్రపంచ అణు సమతుల్యతను మార్చే కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. -
ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతూ.. హర్ముజ్ హైడ్రామా
ఒక రోజు యుద్ధ హెచ్చరికలు.. మరుసటి రోజు శాంతి చర్చలు..! ఉదయం ఒప్పందం కుదిరిందంటూ ప్రకటనలు.. సాయంత్రానికి “అది ఫేక్” అంటూ ఖండనలు..! ప్రస్తుతం హర్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్ వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల కంటే ఎక్కువగా ఒక హైటెన్షన్ డ్రామాను తలపిస్తోంది.ఒకవైపు ప్రపంచ చమురు మార్కెట్లు వణికిపోతుంటే.. మరోవైపు రెండు దేశాలు మాత్రం మాటల యుద్ధంతో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒక్కసారిగా “అమెరికాతో ఒప్పందం కుదిరింది.. హర్ముజ్ను మళ్లీ తెరుస్తాం” అంటూ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తుందని, సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుందని కూడా ఇరాన్ ప్రచారం చేసింది.అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గత కొన్ని రోజులుగా “ఇరాన్ చర్చలకు సిద్ధమైంది.. అణు ఒప్పందం దిశగా పురోగతి ఉంది.. హర్ముజ్లో మళ్లీ స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుంది” అంటూ వరుస ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీంతో నిజంగానే రెండు దేశాలు రాజీ దిశగా వెళ్తున్నాయనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.కానీ అప్పుడే కథలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన వైట్హౌస్.. ఇరాన్ మీడియా విడుదల చేసిన ఒప్పంద ముసాయిదా “పూర్తిగా కల్పితం” అంటూ తేల్చేసింది. దీంతో అసలు నిజం ఏంటన్నది ప్రపంచ దేశాలకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ట్రంప్ శాంతి సంకేతాలు ఇస్తుంటే.. మరోవైపు వైట్హౌస్ మాత్రం ఒప్పందాన్నే ఖండించడం ఇప్పుడు మరింత గందరగోళానికి దారి తీసింది.ఇదే సమయంలో అమెరికా మరోవైపు ఇరాన్పై వైమానిక దాడులు కొనసాగిస్తుండటం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఒకచేత్తో చర్చలు.. మరోచేత్తో దాడులు అనే విధంగా అమెరికా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా “యుద్ధం ఉండదు” అంటూనే, హర్ముజ్పై నియంత్రణ మాత్రం తమదేనని స్పష్టం చేస్తోంది.ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ ఇలాంటి ప్రకటనలు రావడం వల్ల మార్కెట్లు ఒక్కసారిగా కుదేలవుతున్నాయి. చమురు ధరలు భారీగా మారిపోతుండగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ దేశాలు నిజంగా శాంతి కోరుకుంటున్నాయా..? లేక ప్రపంచంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయా..? అనే చర్చ అంతర్జాతీయ వేదికలపై జోరుగా సాగుతోంది. -
వీడియో: విమానం ఢీ.. చీలిపోయిన పారాగ్లైడర్!
ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వతాలపై ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం ఎగురుతున్న చిన్న విమానం.. గాల్లో విహరిస్తున్న పారాగ్లైడర్ను నేరుగా ఢీకొట్టింది. ఒక్కసారిగా పారాగ్లైడర్ ముక్కలైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింటకు చేరాయి. ఆ వీడియోలో ఓ చిన్న విమానం పారాగ్లైడర్ మధ్య నుంచి చీల్చుకుంటూ వెళ్లిన దృశ్యాలు షాకింగ్గా కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మహిళ గాల్లోనే అదుపుతప్పి చక్రంలా తిరుగుతూ కిందకు పడిపోయింది. అయితే.. చివరి క్షణంలో ఆమె ఎమర్జెన్సీ పారాచూట్ను తెరవడంతో ప్రాణాపాయం తప్పింది. స్క్మిటెన్హోహే పర్వత ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మొత్తం ఆమె కెమెరాలో రికార్డైంది. వెంటనే అత్యవసర బృందాలు హెలికాప్టర్తో చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించాయి. చిన్నచిన్న గాయాలతో ఆమె బయటపడినట్లు సమాచారం. ఆమె పేరు సబ్రినా(44) అని, పారాగ్లైడింగ్లో అనుభవం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆ తేలికపాటి విమానం కూడా జెల్ ఆమ్ సీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ ఢీ కొట్టడాన్ని తాను తప్పించలేకపోయానని సదరు పైలట్(28) అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో.. గాల్లో భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.🇦🇹 A paraglider collided midair with a Cessna 172 over Austria and somehow survived.She deployed her emergency parachute seconds after impact and landed safely.The plane pilot also managed to land safely at Zell am See Airport.pic.twitter.com/6IH7sTi3Ic— Mario Nawfal (@MarioNawfal) May 24, 2026 -
ఇరాన్ డీల్పై నిమ్మలంగా ట్రంప్!
దాదాపు మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. అయితే కాల్పుల తీవ్రత కొంత తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. “డీల్ కోసం తొందరపడొద్దు.. సమయం మాకే అనుకూలంగా ఉంది” అంటూ ట్రంప్ చెప్పడం వెనుక అసలు వ్యూహం ఏంటనేది అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ట్రంప్ చేసిన ఆ ఒక్క వ్యాఖ్యతో మళ్లీ ప్రపంచ మార్కెట్లు, చమురు దేశాలు, దౌత్య వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అమెరికా ఇప్పుడు కేవలం యుద్ధాన్ని ఆపడం మాత్రమే కాదు. ఇరాన్పై దీర్ఘకాల వ్యూహాత్మక ఒత్తిడి కొనసాగిస్తూ భారీ రాజకీయ-ఆర్థిక ఒప్పందాన్ని సాధించాలని చూస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై పూర్తి నియంత్రణ, హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకా రవాణా, మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని మరింత బలపరచడం వంటి లక్ష్యాలతో వాషింగ్టన్ ముందుకెళ్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే.. ఇరాన్ ట్రంప్ ప్రతిపాదనలకు ఒప్పుకుందా?..ప్రస్తుతం అందుతున్న సంకేతాల ప్రకారం సమాధానం “పాక్షికంగానే” ఒప్పుకుంది. చర్చలకు సిద్ధమని టెహ్రాన్ వర్గాలు చెబుతున్నా.. అమెరికా షరతులకు పూర్తిగా గ్రీన్సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. ముఖ్యంగా అణు కార్యక్రమాన్ని పూర్తిగా పరిమితం చేయడం, యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ అణు సంస్థ (IAEA) తనిఖీలకు పూర్తి అనుమతి ఇవ్వడం వంటి అంశాల్లో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ వైఖరి ప్రస్తుతం ‘‘ముందు ఆంక్షలు సడలించండి.. తర్వాత మేం నిర్ణయం చెబుతాం’’ అన్నట్టుగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, యుద్ధం అధికారికంగా ముగిసిందన్న హామీ ఇవ్వడం వంటి అంశాలను టెహ్రాన్ ప్రధాన షరతులుగా పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి అంశాన్ని ఇరాన్ ఇప్పటికీ ఒత్తిడి సాధనంగానే ఉపయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో ట్రంప్ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. “పూర్తి ఒప్పందం కుదిరే వరకు బ్లాకేడ్ అలాగే కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. అంటే కాల్పులు తగ్గినా.. ఆర్థిక, వ్యూహాత్మక ఒత్తిడి మాత్రం కొనసాగుతుందన్న సంకేతాలు అమెరికా ఇస్తోంది. అందుకే ట్రంప్ అసలు లక్ష్యం యుద్ధాన్ని ఆపడం కంటే.. ఇరాన్ను బలహీన స్థితిలో చర్చల టేబుల్పై ఉంచడమేనా? అనే చర్చ మొదలైంది.అంతర్జాతీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో యుద్ధాన్ని అధికారికంగా ముగించడం, హర్ముజ్ మార్గాన్ని తిరిగి తెరవడం, తదుపరి 30 లేదంటే 60 రోజులపాటు అణు చర్చలు కొనసాగించడం వంటి అంశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్, ఒమన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తుండటం గమనార్హం.ఇక అమెరికా లోపల కూడా ట్రంప్పై ఒత్తిడి పెరుగుతోంది. “మూడు నెలల క్రితం ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పి.. ఇప్పుడు మళ్లీ అదే దేశంతో రాజీ చర్చలు ఎందుకు?” అంటూ కొందరు రిపబ్లికన్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న డిమాండ్ను కొనసాగిస్తోంది.ఇప్పటికైతే యుద్ధం కాస్త చల్లారినట్లే కనిపిస్తున్నా.. అసలు గేమ్ ఇప్పుడు మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ “టైమ్ మా వైపే ఉంది” అంటుంటే.. ఇరాన్ మాత్రం “మా షరతులు ముందుగా నెరవేర్చాలి” అని పట్టుబడుతోంది. ఈ బేరసారాలు ఎటు దారి తీస్తాయన్నదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్లు, అంతర్జాతీయ భద్రత భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ట్రంప్ ఆ ఒక్క మాటతో మళ్లీ ప్రపంచంలో టెన్షన్ పెరిగిందనే అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. -
ఏం ఆటలా?.. 47 ఏళ్లుగా అదే మోసమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ఇరాన్ అమెరికాతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇరు దేశాలు తమ ప్రతిపాదనలను పరస్పరం తిరస్కరించుకున్న గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం కావొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజాగా చేసిన మెసేజ్ సారాంశం ఇలా ఉంది.. ఇరాన్ 47 సంవత్సరాలుగా అమెరికాతో పాటు ప్రపంచాన్ని మోసం చేస్తోంది. వారు ఎప్పటికప్పుడు ఆటలాడుతూ ఆలస్యం(మూడుసార్లు నొక్కి.). చేస్తున్నారు’’ అని న్యూక్లియర్ డీల్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఒబామా చారిత్రక తప్పిదం చేశారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ఇరాన్పై “సడలింపు” చూపారని.. ఆయన హయాంలో అమెరికా నుంచి ఇరాన్కు విమానాల్లో పెద్ద మొత్తంలో(400 మిలియన్ డాలర్లు) నగదు వెళ్లిందని ఆరోపించారు. ఒబామా కుదిర్చిన 2015 అణు ఒప్పందం ‘‘అత్యంత చెత్త ఒప్పందం’’. దాని వల్లే మిడిల్ ఈస్ట్లో ఇరాన్కు అనవరసమైన ప్రాధాన్యం పెరిగింది. ఒబామా ప్రభుత్వం ఈ నగదు పంపిణీని 1979లో విఫలమైన ఆయుధ ఒప్పందం కారణంగా చెల్లించాల్సిన డబ్బు అని చెప్పింది. కానీ, అది ఎంతమాత్రం కాదు. ఈ చర్యతో ఒబామా ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గమైన పాలనను బలపరిచారు’’ అని మండిపడ్డారు. గతంలో నేను ఈ ఒప్పందాన్ని రద్దు చేశానని.. లేకపోతే ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధం తయారు చేసి ఇజ్రాయెల్పై వాడేదని అన్నారు. అలాగే, తన బలమైన నాయకత్వంలోనే జనరల్ ఖాసీం సోలేమానీని హతమార్చానని.. ఆ చర్యను “అత్యవసరమైన రక్షణ చర్య”గా ప్రకటించారు. (ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని క్వాడ్స్ ఫోర్స్ కమాండర్. 2020 జనవరి 2న ఇరాక్ బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మరణించాడు. అప్పటి ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీకి ఖాసీం సోలేమానీ కుడి భుజంగా ఉండేవాడు.)ఇరాన్ నుంచి ఒక లేఖ రావొచ్చు, చూద్దాం ఎలా ఉంటుందో అని రెండ్రోజుల కిందటే ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే రోజు ఇరాన్ తన ప్రతిస్పందనను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు అందజేసిందని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. అయితే.. ఇరాన్ తాజా ప్రతిపాదనలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, అందులో ఏ అంశాలు అంగీకరించలేనివిగా ఉన్నాయో మాత్రం ఆయన బయటకు చెప్పడం లేదు. మరోవైపు.. ఇరాన్ మాత్రం దిగి రామంటోంది. అమెరికా చెప్పినట్లు ఒప్పందం చేసుకోవడం అంటే.. లొంగిపోవడం కిందకే వస్తోందని అంటోంది. ఇరాన్ డిమాండ్లు:అమెరికా నుంచి యుద్ధ పరిహారం (war reparations) హర్ముజ్ జలసంధిపై పూర్తి ఇరాన్ సార్వభౌమాధికారంఇరాన్పై ఆంక్షల ఎత్తివేతఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల, వీటికి అదనంగా..అమెరికా నావికాదళ ఆంక్షలు తొలగించాలిభవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలిఇరాన్ చమురు అమ్మకాలపై నిషేధం తొలగించాలిఅయితే ఈ డిమాండ్లు, యుద్ధం మొత్తం కాలంలో అమెరికా ప్రకటించిన ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. కమ్యూనికేషన్ లోపం వల్లే.. అమెరికా-ఇరాన్ చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం ఎంత పేలవంగా ఉందో అమెరికా మాటలతో బయటపడింది. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఎన్బీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రధాన లక్ష్యం హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా నావిగేషన్.. అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణ. ఇరాన్ నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. ప్రభుత్వంలో వర్గాల ఒత్తిడి, మధ్యవర్తితత్వం వహిస్తున్న కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఆలస్యం జరుగుతోంది’’ అని చెప్పారు.ఒకవైపు పాక్తో పాటు ఈజిప్ట్ కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ ప్రతిస్పందన.. ఈ ఘర్షణను మరింత క్లిష్టం చేస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో పాటు.. పర్షియన్ గల్ఫ్ రీజియన్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా దాడులతో లెబనాన్ వణికిపోతోంది. దీంతో దౌత్య ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అదే సమయంలో.. ఇంధన ధరలు పెరుగుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
నేనే రాజునైతే సీన్ వేరేలా ఉంటుంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి డెమోక్రట్లు అత్యంత ప్రమాదకరమని.. తనపై జరిగిన హత్యాయత్నానికి ఒకరకంగా వాళ్లే కారణమని ఆరోపించారు. ఈ క్రమంలో మీడియాపైనా ఆయన చిందులు తొక్కారు. ‘‘నేరాల విషయంలో మీడియా, డెమోక్రట్లు ఒకేలా ఉన్నాయి. నేను మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నా. నో కింగ్స్ ఆందోళనలో పాల్గొన్న వ్యక్తే నాపై హత్యాయత్నం చేశాడు. నేరస్తుడు వైడ్ అవేక్స్ అనే టీంలో సభ్యుడిగా ఉన్నాడు. నో కింగ్స్ నిరసనలకు కొందరు కుట్రదారులు ఫండింగ్ చేశారు. రాజుల్లేరు.. నేను రాజును కాదు. నేనే గనుక రాజును అయితే సీన్ వేరేలా ఉండేది’’ అని అన్నారాయన. సీబీఎస్ ‘60 నిమిషాలు’ కార్యక్రమంలో జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం గురించి స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షులపై హత్యాయత్నం కొత్తేం కాదు. అది ఎప్పుడూ జరిగేదే. గతంలో గతంలో అబ్రహం లింకన్, మెక్ కిన్లే, కెనెడీలపైనా జరిగాయి. డెమోక్రట్ల విషపూరిత ప్రసంగాల వల్లే ఇలా జరుగుతోంది. వాళ్లు అమెరికాకు అత్యంత ప్రమాదకరం’’ అని అన్నారాయన. అదే సమయంలో కాల్పులకు దిగిన నిందితుడు కోలో టోమస్ ఎలెన్ చేసిన సంచలన ఆరోపణలను సీబీఎస్ ప్రతినిధి నోరా ఓడోనెల్ ప్రస్తావించారు. అయితే.. ‘‘నేను రేపిస్ట్ను కాదు’’ అంటూ ట్రంప్ ఆమెపై ఆయన ఫైర్ అయ్యారు. -
దాడికి 10 నిమిషాల ముందు ఏం చేశాడంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ఉన్నతాధికారులపై హత్యాయత్నం వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దాడికి ముందు అనుమానితుడు తన కుటుంబానికి ఓ సుదీర్ఘమైన లేఖ(మేనిఫెస్టో) రాశాడు. అందులో దాడికి కారణాలు.. తన లక్ష్యం.. అలాగే ఆ దాడిని ఈ తరహాలోనే ఎందుకు చేయాలనుకుంది.. మొత్తం చెప్పుకొచ్చాడు.తనను తాను ఫ్రెండ్లీ ఫెడరల్ అస్సాసిన్’ అంటూ సంబోధించుకున్న ఎలెన్ ఇలా రాసుకొచ్చాడు.. హింసకు హింసతో ప్రతిస్పందించకూడదు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు అని క్రైస్తవం చెబుతుంది. వ్యక్తిగత అవమానాలు లేదా దాడులు ఎదురైనప్పుడు ప్రతీకారం తీర్చుకోవద్దు అని అంటోంది. కానీ, ఇతరుల చెంప మీద కొడుతున్నప్పుడు మౌనంగా చూడమని కాదు. అలాంటి సమయంలోనూ స్పందించకపోతే అణచివేతకు సహకరించినట్లే అవుతుంది.నిత్యం అఘాయిత్యాలు, ఆకలి కేకలు, వేధింపులు, అన్యాయంగా మరణశిక్షల విధింపు.. వీటిని చూస్తూ భరించలేకపోతున్నా. సాధ్యమైనంత వరకు ప్రాణనష్టం తగ్గించాలని భావిస్తున్నా. కానీ, ఒక రేపిస్ట్, ద్రోహి.. పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వ్యక్తి ప్రసంగం వినడానికి చాలామంది వచ్చారు. నా లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో..తన కుటుంబ సభ్యులు, సహచరులు, విద్యార్థులు, ప్రయాణికులు, హోటల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే తన నిర్ణయాలు ఇతరులకు నష్టం కలిగించవచ్చని క్షమాపణలు తెలియజేశాడు.అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్’(డబ్ల్యూహెచ్సీఏ) విందు సమావేశం జరిగింది. పదేళ్ల తర్వాత ఆ డిన్నర్కు హాజరైన ట్రంప్.. మరికాసేపట్లో మాట్లాడాల్సి ఉంది. ఈలోపు.. 8.34గం. ప్రాంతంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.హాల్ బయట కాల్పులు జరుగుతుండడంతో ట్రంప్ దంపతుల చుట్టూ భద్రతాధికారులు వలయంగా ఏర్పడి వేదిక వద్ద నుంచి తరలించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ దంపతులను, ఇతర అధికారులనూ సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. తుపాకులు, కత్తులతో వచ్చిన ఆగంతుకుడిని మీటింగ్ జరుగుతున్న బాల్రూంవైపు వెళ్లకుండా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆపేశాయి. సంకెళ్లు వేసి ఆపై అక్కడి నుంచి తరలించాయి. నిందితుడు కోల్ టొమాస్ ఎలెన్ను (31)గా ధృవీకరించిన దర్యాప్తు సంస్థలు.. కాలిఫోర్నియా టొరాన్స్లో అతనో టీచర్గా చెబుతున్నారు. అంతేకాదు.. ఎలెన్ అదే హోటల్లో బస చేశాడని అధికారులు గుర్తించారు.లిస్ట్ నుంచి ఆయనొక్కడికే మినహాయింపు.. ఎలెన్ లిస్ట్లో ఉన్న పేర్లు బయటకు రావాల్సి ఉంది. అయితే.. ట్రంప్ సహా ఆయన ప్రభుత్వంలోని హైలెవల్ నుంచి లోలెవల్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ నుంచి ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పేరు మాత్రం మినహాయించబడిందట. ఎలెన్ ఆయన్ని మాత్రమే ఎందుకు తప్పించాడు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే హోటల్ సిబ్బందిని కూడా దాడి నుంచి మినహాయించుకున్నాడని తెలుస్తోంది.ఇవాళే కోర్టుకు.. వాషింగ్టన్ హిల్టన్లో భద్రతా తనిఖీ కేంద్రాన్ని దాటి, అధికారులతో కాల్పులు జరిపిన తర్వాత ఎలెన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా యు.ఎస్. అటార్నీ జీనిన్ పిర్రో ఏం చెబుతున్నారంటే.. అతనిపై ఫెడరల్ ఆయుధాలు, దాడి కేసులు నమోదు చేయబడ్డాయి. అదనపు కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు.తనపై జరిగిన హత్యాయత్నంపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ‘‘ఎలెన్ క్రైస్తవ వ్యతిరేకి. క్రైస్తవుల పట్ల అతనిలో విద్వేషం పెరిగిపోయింది. అతనో మానసిక రోగి. గతంలో అతనిపై సోదరుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు’’ అని ట్రంప్ అన్నారు. అంతకు ముందు దాడిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అధ్యక్షుడిగా ఉండటం ప్రమాదకరమైన పనైనా నేను భయపడలేదు. మెలనియా కూడా పలుమార్లు నాతో ఈ విషయం చెప్పింది. జరిగిన దాని గురించి ఇక ఆలోచించను. ఎప్పటిలాగే పని చేసుకుంటూ వెళ్తా. దేనిని ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటానని ప్రకటించారు. -
అమ్మో.. అమెరికా సైన్యం లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేదో?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్ పవర్గా ఎదిగిన అమెరికా.. పెద్దన్న పాత్రలో పలు దేశాల్లో తన సైన్యాన్ని మోహరిస్తోంది. పశ్చిమాసియా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో ఈ మోహరింపులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ సంక్షోభాలు, అంతర్యుద్ధాలు, యుద్ధాలు, వాణిజ్య మార్గాల రక్షణ, ఉగ్రవాదం.. ఇలా రకరకాల కారణాలతో అగ్రరాజ్యంతో మిత్రదేశాలతో ఈ తరహా డీల్ కుదుర్చుకోవాల్సి వస్తోంది. మరి ఏ దేశంలో ఆ ఫిగర్ ఎక్కువగా ఉందో తెలుసా?.. తెలిస్తే మీకు కచ్చితంగా షాకవుతారు.అమెరికా సైన్యం ఎక్కువగా మధ్యప్రాచ్యంలో లేదంటే యూరప్లో ఉంటుందని చాలామంది అనుకుంటారు. తాలిబన్ల దాడుల టైంలో(2001–2021) అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో అత్యధికంగా సైనికులను మోహరించింది. 2011 నాటికల్లా ఆ సంఖ్య లక్షకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2021లో చివరి దశలో కేవలం 2,500 సైనికులు మాత్రమే మిగిలి.. అటుపై ఆగస్టు 2021లో పూర్తిగా వెనక్కి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుత గణాంకాల ప్రకారం.. అమెరికా సైన్యం 1,71,500 మంది సైనికులను విదేశాల్లో మోహరించింది. అందులో ప్రపంచంలో అత్యధికంగా మోహరించింది మాత్రం జపాన్లోనే!!. ఎందుకిలా?.. జపాన్కంటూ సొంత సైన్యం లేదా?.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులేసిన దేశపు సైన్యాన్నే ఎందుకు ప్రొత్సహించాల్సి వచ్చింది?..అణుబాంబుల తర్వాత..రెండో ప్రపంచ యుద్ధంలో.. జపాన్ అంత త్వరగా ఓటమిని అంగీకరించలేదు. యుద్ధాన్ని త్వరగా ముగించడానికి, జపాన్ను లొంగదీసుకోవడానికి అమెరికా తీవ్ర నిర్ణయం తీసుకుంది. హిరోషిమా, నాగసాకిలపై మూడు రోజుల వ్యవధిలో అణుబాంబులు ప్రయోగించింది. లక్షల సంఖ్యలో మరణాలు.. లెక్కలేనంత మందిపై రేడియేషన్ ప్రభావం. ఆ ఓటమి తర్వాత కొన్నాళ్లపాటు అమెరికా ఆధీనంలో ఉండిపోయింది జపాన్. ఆ తర్వాత తన వీక్నెస్ను పసిగట్టింది. తన రాజకీయ, రక్షణ వ్యవస్థను జపాన్ సమూలంగా మార్చుకుంది.1947లో అమెరికా పర్యవేక్షణలో జపాన్ కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఇందులో “యుద్ధం చేయకూడదు, సైన్యం పెట్టకూడదు” అనే క్లాజ్ ఏర్పాటు చేసుకుంది. సైన్యం కోసం కాకుండా.. ఆర్థిక అభివృద్ధి ఇందుకోసం సాంకేతికత, పరిశ్రమల రంగాలపై దృష్టిసారించాలని నిర్ణయించుకుంది. ఆపై 1951, 1960లో జపాన్ తన రక్షణ బాధ్యతను అమెరికాకు అప్పగిస్తూ US-Japan Security Treaty చేసుకుంది. అప్పుడు ఏర్పడ్డ అమెరికా సైన్యం స్థావరాలు.. ఏమాత్రం తగ్గకుండా మరింత వ్యూహాత్మకంగా పెరిగాయి.ఆ అవసరం ఎందుకు వచ్చిందంటే.. 2026 నాటికి జపాన్లో సుమారు 61 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ (35,989), దక్షిణ కొరియా (23,766) ఉన్నాయి. చైనా, ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉండడంతో అమెరికా సైన్య సహాయం తీసుకుంటోంది. ఆ రెండు దేశాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రభావాన్ని నిలుపుకోవడం కోసం జపాన్ రక్షణ బాధ్యతకు అమెరికా ముందుకొచ్చింది. పసిఫిక్ సముద్రంలో వాణిజ్య మార్గాలను రక్షించడానికి జపాన్లోని స్థావరాలు ఒకినావా, యోకోసుకా, మిసావా ముఖ్యమైనవిగా ఉన్నాయి.అక్కడే ఎక్కువ.. అమెరికా సైన్యం జపాన్లో అత్యధికంగా మోహరించబడింది. మొత్తం మీద జపాన్లో 120కి పైగా అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది Okinawa దీవి గురించి. చైనా, తైవాన్, ఉత్తర కొరియా దగ్గరగా ఉండటం వల్ల అమెరికా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఇక్కడే అతిపెద్ద ఎయిర్ బేస్ (Kadena Air Base) ఉంది. సుమారు 23,000 పైగా అమెరికా సైనికులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది ఉన్నారు.అభ్యంతరాలు కూడా..అయితే.. అమెరికా సైన్యం మోహరింపుపై జపాన్లో అభ్యంతరాలూ ఉన్నాయి. స్థావరాల కోసం అధిక భూభాగాన్ని వినియోగించుకోవడం.. తరచూ ప్రమాదాలు.. స్థానికులపై అమెరికా సైనికులు దాడులకు తెగబడడం.. శబ్ధ కాలుష్యంపై ఒకినావా (Okinawa)లో ఇప్పటికీ నిరసనలు జరుగుతుంటాయి. 2025లో రెజల్యూట్ జపాన్ పేరుతో ఇరు దేశాలు ఎయిర్షో నిర్వహించాయి. అయితే ‘‘మా దీవులను యుద్ధభూమిగా మార్చొద్దు’’ అంటూ స్థానికులు రోడ్లను బ్లాక్ చేశారు. అమెరికా బేస్ల కారణంగానే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదని.. తద్వారా నిరుద్యోగం పెరిగిపోతోందనే విమర్శ ఒకటి ఉంది. అయితే జపాన్ తన రక్షణను స్వయంగా చూసుకోలేని స్థితి. మిత్రదేశం అమెరికాకు ఆ బాధ్యత అప్పగించింది. అందుకే మెజారిటీ ప్రజలు, రాజకీయ వర్గాలు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఒకటుంది. సైన్యం ఉంది, కానీ..జపాన్కి త్రివిధ దళాలతో కూడిన సొంత సైన్యం ఉంది. దాన్ని జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (JSDF) అంటారు. ఇది 1954లో స్థాపించబడింది. దీని వద్ద ఆధునిక ఆయుధాలు, నౌకలు, యుద్ధవిమానాలు ఉన్నాయి. ప్రస్తుతం అందులో సుమారు 2.5 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. కానీ వీటి ప్రధాన లక్ష్యం రక్షణ మాత్రమే.. దాడి కాదు. జపాన్ రాజ్యాంగంలోని 9వ ఆర్టికల్ ప్రకారం.. జపాన్ “యుద్ధం చేయదు, దాడి సైన్యం పెట్టదు.”. మరి జేఎస్డీఎఫ్ ఏం చేస్తుంది? ప్రధానంగా.. రక్షణ, శాంతి పరిరక్షణ, విపత్తు సహాయం, అంతర్జాతీయ శాంతి మిషన్లలో మాత్రమే పాల్గొంటుంది. జపాన్ యుద్ధం కోరుకోదు.. కానీ తన రక్షణ కోసం ఆధునిక సైనిక శక్తిని కలిగి ఉంది. అందువల్ల JSDF “సైన్యం” కంటే “రక్షణ దళం” అనే పేరుతోనే ఎక్కువగా వినిపిస్తుంటుంది. -
వీడియో: అగ్నిపర్వతం బద్ధలు.. వేల అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్న బూడిద
మధ్య అమెరికా దేశం గ్వాటెమాలాలో ఫ్యుగో అగ్నిపర్వతం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. చిన్నచిన్న విస్ఫోటనాలు కాస్త ఒక్కసారిగా తీవ్రతరం అయ్యాయి. ఈ ప్రభావంతో వేల అడుగుల ఎత్తు దాకా బూడిద ఎగసిపడుతోంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. 3,763 మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్యుగో అగ్నిపర్వతం తరచుగా చిన్న, మధ్యస్థాయి విస్ఫోటనాలతో(స్ట్రోంబోలియన్ శైలి) క్రియాశీలకంగా(Active Volcano) ఉంటుంది. అయితే ఈసారి విస్ఫోటనాలు సాధారణం కంటే తీవ్రంగా కనిపించాయి. జనవరి చివరి వారంలో ప్రారంభమైన విస్ఫోటనాలు, ఫిబ్రవరి ప్రారంభంలో మరింత తీవ్రతతో కొనసాగాయి.ప్రస్తుతానికి బూడిద మేఘాలు 14,000 నుండి 16,000 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. రాత్రి వేళల్లో ఆకాశం మెరిసేపోయేలా.. ప్రవహిస్తున్న లావా దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో.. 15 లక్షల మంది ఉన్న ఈ రీజియన్లో ఆందోళనలను రేకెత్తించాయి. అయితే ప్రస్తుతానికి ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు మొదలుకాకపోయినా.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు మాత్రం జారీ అయ్యాయి. అదే సమయంలో విమాన ప్రయాణాలకు ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాకటేపెక్వెజ్, చిమాల్టెనాంగో, పనిమాచె, మోరెలియా.. ఇలా చుట్టుపక్కల ప్రాంతా ప్రజలు లావా ఉద్గారాలు, బూడిద వర్షం, అగ్నిపర్వతం బద్ధలయ్యేప్పుడు గర్జనల శబ్దాలతో ఆందోళనకు గురవుతున్నారు. 2018లో జరిగిన ఆకస్మిక విస్ఫోటనం దాదాపు 200 మంది ప్రాణాలు తీసుకుంది. Eruption observed with lava at Volcàn de Fuego stratovolcano in Guatemala on January 31, 2026pic.twitter.com/L0c2zqdV7v— Massimo (@Rainmaker1973) February 2, 2026 -
పాక్ బలగాల పిరికిపంద చర్యలు
పాకిస్తాన్ గడ్డ మీద బెలూచిస్తాన్లో పరిణామాలు మళ్లీ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాయి. బెలూచ్ రెబల్స్ పాక్ బలగాలపై అనూహ్య రీతిలో దాడులు జరపడం.. ఆ ఆత్మాహుతి దాడులు జరిపిన వాళ్లలో ఇద్దరు మహిళలు ఉండడం, ఇరువైపులా భారీగా ప్రాణనష్టం సంభవించడం!.. ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ధురందర్ సినిమా చూసిన వాళ్లకు పాక్లో బలూచ్లు ఎదుర్కొనే వివక్ష గురించి ఓ ఐడియా ఉండొచ్చు. అయితే.. వాస్తవంలోనూ బలూచ్ ప్రజలు తమ అణచివేతకు వ్యతిరేకంగా నిలబడి.. స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో.. మహిళా ఫిదాయిన్ల త్యాగం చర్చనీయాంశంగా మారింది. పాక్ బెలూచిస్తాన్ ప్రావిన్స్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన ‘ఆపరేషన్ హెరోఫ్ – ఫేజ్ II’.. దానికి కౌంటర్గా పాక్ ఆర్మీ జరిపిన దాడులు 40 గంటలకుపైనే కొనసాగాయి. ఈ ఆపరేషన్లో పాక్ సైన్యాన్ని, ఫ్రంట్ వారియర్స్ను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు మహిళా ఫిదాయీన్లు పాల్గొన్నారని బీఎల్ఏ ప్రకటించింది. ‘‘ఖరాన్, మస్తుంగ్, టంప్, పస్ని ప్రాంతాల్లో మా ఆపరేషన్లు పూర్తయ్యాయి. క్వెట్టా, నోష్కీ ప్రాంతాల్లో కూడా మా యోధులు ఉన్నారు. అక్కడి పాక్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. దాడుల్లో మొత్తం 200 మంది పాక్ సైనికులు మరణించారు. బలూచ్ ప్రజల్లారా.. పాక్ సైన్యానికి దూరంగా ఉండండి. మా పోరాటానికి మద్దతు ప్రకటించండి’’ అంటూ బీఎల్ఏ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను తక్కువగా చేసి చెబుతోంది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. మహిళలే ఆత్మాహుతి దాడులు జరిపారని చెబుతూ.. శుక్రవారం 41 మంది, శనివారం 92 మంది బీఎల్ఏ రెబల్స్ హతమయ్యారని ప్రకటించారు. నోష్కీ, హబ్, చమన్, నసీరాబాద్, గ్వాదర్, మక్రాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని అన్నారు. బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ.. బీఎల్ఏ రెబల్స్ జరిపిన దాడుల్లో 17 భద్రతా సిబ్బంది, 31 పౌరులు మరణించారన్నారు. పాకిస్తాన్ సైన్యం 40 గంటలపాటు ప్రతిదాడి చేసి 140కి పైగా మిలిటెంట్లను హతమార్చినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటిస్తే.. బీఎల్ఏ మాత్రం 18 మంది మాత్రమే తమ యోధులు మరణించారని, ఇందులో 11 మంది ఆత్మాహుతి దాడుల్లోనే వీరమరణం పొందారని ప్రకటించుకుంది. Fidayeen" (ఫిదాయీన్) అనే పదం అరబిక్ మూలం నుంచి వచ్చింది. అర్థం తన ప్రాణాలను త్యాగం చేసే వ్యక్తి లేదంటే ఆత్మాహుతి యోధుడు/యోధురాలు అని..ఇదే మొదటిది కాదు.. !ఈ తరహా మహిళా మానవ బాంబు దాడులకు (fidayeen strike) దిగడం బలూచ్ రెబల్ గ్రూప్స్కు తొలిసారేం కాదు. బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ తరఫున జరీనా రఫీయా అలియాస్ ట్రాంగ్ మహూ అనే సూసైడ్ బాంబర్ ఆ మధ్య చగయ్ సమీపంలో చైనా మైనింగ్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో చైనాకు ఆస్తినష్టం జరపడంతో పాటు ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. తాజా దాడుల్లో.. 24 ఏళ్ల ఆసిఫా మంగళ్ తోపాటు మరో యోధురాలు పాల్గొన్నట్లు బీఎల్ఏ ప్రకటించుకుంది. నోష్కీలోని ఐఎస్ఐ ప్రధాన కార్యాలయంపై వాహన బాంబుతో ఆసిఫా, మరో మహిళా యోధురాలు హవా బలోచ్ గ్వాదర్ ఫ్రంట్లో పోరాడి మరణించిందని తెలిపింది. వాళ్ల ఫొటోలు, దాడికి ముందు వాళ్ల ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని కూడా విడుదల చేసింది.#BLA the group behind ongoing coordinated attacks in #Balochistan has released a video showing one of its female fighters “Hawa Baloch” aka Droshum, reportedly filmed during a battle.Reports suggest more female fighters are involved but yet to be identified. pic.twitter.com/8bLY3iJSZ7— Hammad Baloch (@Hammad_Baluch) February 1, 2026మరోవైపు.. బీఎల్ఏ విడుదల చేసిన వీడియోలో ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న మహిళా యోధురాలు పాక్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూనే.. సంచలన ఆరోపణలకు దిగింది. బలూచ్ యోధుల్ని ఏమీ చేయలేక.. తమ ఇంట ఆడవాళ్లపై ప్రతాపం చూపిస్తోందని పేర్కొంది. ‘‘పాక్ సైన్యానికి మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అది వాళ్ల కెపాసిటీకి మించిన పని. అందుకే మా ఇంట ఆడవాళ్లపై పడ్డారు. ఇది పిరికిపంద చర్య కాదంటారా?’’ అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అలాగే బలోచ్ ప్రజలు మేల్కొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. మాకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదంటూ పెద్ద తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు చేసిన 12 గంటల్లోపే ఆమె వీరమరణం పొందిందని బీఎల్ఏ పేర్కొంది. Hawa Baloch.Woman fighter of #Balochistan fighting the brutal, occupying Pakistan army.The young soldier died just hours later, defending her land, but not before sending dozens of Paki troops to the hoors.As brave as the rebel women of Iran.pic.twitter.com/sMDcExLd1E— Abhijit Majumder (@abhijitmajumder) February 1, 2026పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్ (సుమారు 44% భూభాగం). అయితే.. పంజాబీలు, పశ్తూన్లు వంటి జాతులు పాక్ రాజకీయ, సైనిక, ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కేవలం ఆరు శాతం జనాభా ఉన్న మైనారిటీ వర్గం బలూచ్.. సొంత గడ్డపై అన్నివిధాలుగా తీవ్ర అణచివేతకు గురవుతోంది. అదే సమయంలో గ్యాస్, ఖనిజ ఆర్థిక వనరులతో పాటు గ్వాదర్ పోర్ట్ విషయంలోనూ పాక్ ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని.. స్థానికులైన తమకు తగిన లాభాలు అందడం లేదంటూ ఆ జాతి వాదిస్తోంది. వెరసి తమ హక్కుల కోసం తిరుగుబాట్లు, ఉద్యమాలు చేస్తున్నారు.బెలూచిస్తాన్లో తిరుగుబాట్ల చరిత్ర👇 మొదటి తిరుగుబాటు (1948): ఖాన్ ఆఫ్ కలాత్ పాకిస్తాన్లో విలీనాన్ని వ్యతిరేకించడంతో ప్రారంభమైంది. రెండో దశ తిరుగుబాటు (1958–59): భూస్వామ్యం, స్వతంత్రత డిమాండ్లతో మళ్లీ అల్లర్లు. మూడో దశ తిరుగుబాటు (1963–69): గిరిజన నాయకులు, పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు.. నాలుగో దశ తిరుగుబాటు (1973–77): పెద్ద ఎత్తున సైనిక చర్యలు, వేలాది మరణాలు.. ఐదో దశ తిరుగుబాటు (2003–ప్రస్తుతం): అత్యంత దీర్ఘకాలంగా.. ప్రస్తుతం కొనసాగుతున్నాయి.బెలూచిస్తాన్లో తిరుగుబాట్లు (Baloch Insurgency) అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. బీఎల్ఏ, బీఎల్ఎఫ్ తరహా రెబల్స్ గ్రూపులు వేర్పాటువాద పోరాటాల్లో ప్రముఖంగా పాల్గొంటున్నాయి. అయితే పాక్తో పాటు మరికొన్ని దేశాలు వీటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయి. బలూచ్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటి 50 లక్షలు. ఇందులో ఇరాన్లోనే 40 లక్షల మంది ఉన్నట్లు 2023 గణాంకాలు చెబుతున్నాయి. అఫ్గనిస్తాన్లో మరో 10 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రధానమైన బలూచిస్తాన్ ప్రావిన్లో మాత్రం వీళ్ల జనాభా తక్కువగా ఉంటోంది. అందుకు అక్కడి ఉద్రిక్తతలు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఏదిఏమైనా.. బెలూచిస్తాన్ రీజియన్లో నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనే చెప్పొచ్చు. -
ఆ టైంలో మేమిద్దరం సిగ్గుతో తలదించుకునేవాళ్లం
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అన్నిచోట్లా అప్పుల కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో సొంత పౌరులే సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నా.. ఏనాడూ ఆ దేశ ప్రభుత్వం స్పందించింది లేదు. తాజాగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ విషయాన్ని అంగీకరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇస్లామాబాద్లో జరిగిన బిజినెస్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో కలిసి నేను రహస్యంగా చాలా దేశాల వద్దకు వెళ్లి అప్పులు అడిగాం. ఆ సమయంలో మాకు చాలా సిగ్గుగా అనిపించి తలలు దించుకునేవాళ్లం. రుణాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బ. డబ్బులు ఇచ్చేవారు ఏం డిమాండు చేసినా సరే.. అడ్డు చెప్పలేని పరిస్థితి ఉంటుంది’ అంటూ షరీఫ్ ప్రసంగించారు. అయితే..రుణాలు ఇచ్చే విషయంలో చాలా దేశాలు పాక్ను నిరాశ పరచలేదని షరీఫ్ చెప్పుకొచ్చారు. పరిస్థితులతో సంబంధం లేకుండా పాక్కు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, చైనా.. ఇలా మిత్ర దేశాలన్నింటికీ కృతజ్ఞతలు చెప్పారాయన. అదే సమయంలో.. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడంపై షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిత్ర దేశాల నుంచి అప్పులు కోరడంపై పాక్ ప్రధాని నిరాశ వ్యక్తంచేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో సౌదీ ఆరేబియా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. మరిన్ని రుణాలు అడగడం తనను ఇబ్బంది పెట్టిందన్నారు. ఇదిలా ఉంటే.. పాక్కు ఆర్థికసాయం అందించిన దేశాల్లో మొదటి స్థానంలో చైనా ఉంది.ఇదీ చదవండి: వాళ్లంతా బిచ్చగాళ్లే.. పాక్ పరువు పోయిందిగా! -
కూలిన బతుకులు
గోమా: డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రకృతి విలయానికి 200 మంది కార్మికులు బలయ్యారు. ఈ వారంలో ఉత్తర కివూ ప్రావిన్స్లో కొండచరియలు విరిగిన పడటంతో బలహీనపడిన గనులు బుధవారం కుప్పకూలడంతో భూగర్భంలో విధుల్లో ఉన్న 200 మందికిపైగా కార్మికులు సజీవసమాధి అయ్యారు. రుబాయా మైన్స్గా పిలబడే ఆ ప్రాంతంలోని గనుల ముఖద్వారాలన్నీ కుప్పకూలాయి. దీంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని నార్త్కివూ ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి లుముంబా కంబేరే ముయీసా ప్రకటించారు. రుబాయా గనుల్లో ముఖ్యంగా కోల్టన్ ముడి ఖనిజం కోసం తవ్వకాలు జరుపుతారు. కొలంబైట్ టాంటలైట్గా పిలిచే ఈ అత్యంత విలువైన లోహాన్ని అత్యాధునిక ఎల్రక్టానిక్స్లో ఉపయోగిస్తారు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, ఆటోమోటివ్ ఎల్రక్టానిక్స్, విమాన ఇంజిన్లు, కంప్యూటర్లలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన కెపాసిటర్లలో కోల్టన్ ముడి ఖనిజాన్ని వాడతారు. మొత్తం ప్రపంచ కోల్టన్ అవసరాల్లో 15 శాతం ఖనిజం కేవలం ఈ గనుల నుంచి వెళ్తోంది. దీంతో అత్యధిక లాభాలు గడించాలనే దుర్బుద్ధితో సరైన రక్షణ ఏర్పాట్లు లేకుండానే పేద కార్మికులను ప్రమాదకర గనుల్లోకి పంపించి గంటల తరబడి పనిచేయిస్తున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు ఎం23 అనే తిరుగుబాటుదారుల చేతుల్లో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాని పర్యవసానంగా గనులు కూలాయని తిరుగుబాటుదారుల ప్రభుత్వం పేర్కొంది. ‘‘ఇంకా కొందరు ఆ బురదల్లో కూరుకుపోయి ఉంటారు. గాయపడిన వారిని సమీప రుబాయా పట్టణ ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నాం. గోమా పట్టణ ఆస్పత్రుల్లోనూ పలువురిని చేర్పించాం. గనుల సమీప శిబిరాలను తక్షణం ఖాళీ చేయించి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాం’’అని ముయీసా చెప్పారు. చేతులతోనే తవ్వకం, అధ్వాన ఏర్పాట్లు.. ఆ గనుల్లో సురక్షిత పరిస్థితులు అనేవే ఉండవని అక్కడ గతంలో పనిచేసిన కార్మికుడు చెప్పాడు. ‘‘ఎలాంటి భారీ యంత్రాలు లేకుండా మైనింగ్ జరుగుతుంది. కార్మికులు ఉత్త చేతులతో చిన్న పనిముట్లతో తవ్వకాలు చేస్తారు. గని పైకప్పు కూలకుండా పటిష్టమైన తాత్కాలిక నిర్మాణాలు ఏమీ ఉండవు. గనుల నిర్వహణ అధ్వానంగా ఉంటుంది. సమాంతరంగా గనులను తవ్వుతారు. దీంతో ఒక్కటి కూలితే మిగతావన్నీ కూలడం ఖాయం’’అని క్లోవిస్ మఫేర్ అనే మాజీ కార్మికుడు చెప్పారు. మధ్య ఆఫ్రికా దేశమైన తూర్పు కాంగోలో రుబాయా ప్రాంతం అత్యంత కీలకమైంది. ఇక్కడ దశాబ్దాలుగా హింస రాజ్యమేలుతోంది. సమీప రువాండా దేశ దన్నుతో ఎం23 తిరుగుబాటుదారులుసహా పలు రెబల్ గ్రూప్లు ప్రభుత్వ సాయుధ బలగాలతో తరచూ ఘర్షణలకు దిగుతూ రక్తపుటేరులు పారిస్తున్నాయి. అంతర్యుద్ధం కారణంగా దశాబ్దాల్లో తూర్పు కాంగో నుంచి 70 లక్షల మంది జనం తమ సొంతూళ్లను వదిలి వెళ్లిపోయారు. ఒక్క ఈ జనవరిలోనే మరో లక్ష మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. -
భార్యను ముక్కలుగా చేసి.. ముద్దలుగా మార్చేసి..
ఆ మధ్య మలయాళంలో సూక్షదర్శిని అనే సినిమా వచ్చింది. అందులో అమాయకంగా కనిపించే తల్లీకొడుకులు.. తమ ఇంటి బిడ్డనే దారుణంగా హతమార్చి.. యాసిడ్లో పోసేసి కరిగించేస్తారు. ఆపై ఏం ఎరగనట్లు నాటకాలాడతారు. పరువు హత్య(ఓ సున్నితమైన అంశం) నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ హిట్ అయ్యి.. ఇక్కడ తెలుగు డబ్తో ఓటీటీలోనూ అలరించింది. అయితే దాదాపు ఇలాంటి తరహా ఘటనే ఒకటి తెరపైకి వచ్చింది.వింటేనే వెన్నులో వణుకుపుట్టే ఘటన ఇది. తన భార్యను.. ఇద్దరు పిల్లల తల్లిని.. క్షణికావేశంలోనో లేదంటో ఉద్దేశపూర్వకంగానో హత్య చేశాడో భర్త. ఆపై నేరం నుంచి తప్పించుకునేందుకు అతను చేసిన ప్రయత్నమే కిరాతకంగా ఉంది. ఆమెను ముక్కలుగా.. చెక్కలుగా చేసి.. ముద్దగా మార్చేసి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆ ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి దోషిగా తేలాడు.స్విట్జర్లాండ్లో హైప్రొఫెషనల్ కేసుగా ఉన్న క్రిస్టియానా జోక్సిమోవిక్(38) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడని స్థానిక అధికారులు బుధవారం నిర్ధారించారు. క్రిస్టియానా జోక్సిమోవిక్ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ కావడమే ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది.2024 ఫిబ్రవరిలో బిన్నింగెన్లోని తన నివాసంలో క్రిస్టియానా జోక్సిమోవిక్ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వేళ్లన్నీ భర్త థామస్ వైపే చూపించాయి. అయితే తన భార్య తనపై దాడికి ప్రయత్నించిందని.. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించిందని.. తాను భయంతో ఆ శవాన్ని మాయం చేసే ప్రయత్నం మాత్రమే చేశానని మొదటి నుంచి అతను వాదించాడు. కానీ, ఆధారాలు అన్నీ అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి.ఆమెను గొంతు నులిమి హత్య చేసిన థామస్.. గర్భాశయాన్ని తొలగించి ఆ తర్వాత పెరట్లోని రంపంతో ముక్కలుగా కత్తిరించాడని.. ఆపై మిక్సర్లో వేసి ముద్దగా మార్చేశాడని.. అందులో కొంత భాగాన్ని రసాయనాల్లో వేసి కరిగించేశాడని తెలిపారు. నేరానికి ఉయోగించిన రంపాన్ని, తోలు భాగాన్ని, ఎముకల అవశేషాల్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ ఘోరాన్ని అతను యూట్యూబ్ వీడియోలు చూస్తూ చేశాడని వెల్లడించారు.శరీరం నుంచి నడుమ జాయింట్లను విరిచేసి.. మెడ, వెన్నెముకను కోసేసి.. చివరకు ఆమె తలను వేరు చేసి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. శవపరీక్షలో అత్యంత భయానకమైన ఈ వివరాలు వెల్లడయ్యాయి అని కోర్టుకు దర్యాప్తు అధికారులు సమర్పించిన వివరాల్లో ఉంది.క్రిస్టియానా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీ గురించి తీవ్రంగా ప్రయత్నించారు. నెలలు గడిచినా ఆమె ఆచూకీ కానరలేదు. అయితే.. క్రిస్టియానా జుట్టుకు సంబంధించిన అవశేషాలను లాండ్రీ రూమ్లో ఆమె తండ్రి గుర్తించడం ఈ కేసును అసలు మలుపు తిప్పింది. ఆ ఘటన తర్వాత ఎలాంటి కంగారు లేకుండా ఉన్నాడని.. అది అతనిలోని క్రూరత్వానికి ప్రతీకగా నిలిచిందని పోలీసులు తమ నివేదికలో వివరించారు. భర్తే హంతకుడిగా తేలడంతో ఈ కేసు ట్రయల్ జరగాల్సి ఉంది.మిస్ నార్త్వెస్ట్ స్విట్జర్లాండ్ క్రిస్టియానా జోక్సిమోవిక్.. 2007లో మిస్ స్విట్జర్లాండ్ పోటీల్లో ఫైనలిస్ట్తో సరిపెట్టుకుంది. ఆ తర్వత క్యాట్వాక్ కోచ్గా మారి.. అనేక మంది మోడల్స్కు శిక్షణ ఇచ్చింది. పై కేసు చదువుతుంటే.. భార్యను కుక్కర్లో ఉడికించిన కేసు గుర్తొచ్చిందా?.. ఆ కథనమూ చదివేయండి 👉 హైదరాబాద్ మీర్పేటలో కిరాతకం -
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. 20 మంది సజీవ దహనం!
ఇండోనేషియా రాజధాని జకార్తలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి.. 20 మంది దాకా సజీవ దహనం అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు.సెంట్రల్ జకార్తాలోని ఓ భవనంలో మంగళవారం మధ్యాహ్నా సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ప్రారంభమైన మంటలు శరవేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సహయక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల్లో 15 మంది పురుషులు, ఐదుగుర మహిళలు ఉన్నారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం సంభవించిన భవనంలో టెర్రా డ్రోన్ ఇండోనేషియా అనే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్థానిక టీవీ చానెల్స్ ప్రసారం చేస్తున్న విజువల్స్లో .. అగ్నిమాపక సిబ్బంది బాధితులను బయటకు తీసుకువస్తూ.. కొందరి బాడీ బ్యాగ్లను మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పై అంతస్తుల నుండి కొంతమంది ఉద్యోగులు పోర్టబుల్ లాడర్లు ఉపయోగించి బయటకు తప్పించుకున్న విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సహాయం కోసం కొందరు బిల్డింగ్ పైన నిల్చున్న దృశ్యాలు నెట్టింటకు చేరుతున్నాయి.#இந்தோனேசியா தலைநகர் #ஜகார்த்தா-வில் வணிக கட்டிடம் ஒன்றில் இன்று ஏற்பட்ட தீ விபத்தில் 5 பெண்கள், 15 ஆண்கள் என குறைந்தது 20 பேர் பலியாகியுள்ளனர்.#indonesia #jakarta #FireAccident pic.twitter.com/yh9wKi6V0G— patrikai.com (@Patrikaidotcom) December 9, 2025ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. లంచ్ టైంలో ఘటన చోటు చేసుకుందని ప్రాణాలతో బయటపడిన కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చి సహాయక చర్యలు ముగిశాకే ప్రమాదంపై ఓ స్పష్టమైన ప్రకటన చేయస్తామని అధికారులు అంటున్నారు. -
‘అపూర్వ అడుగు’.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం
గాజా సంక్షోభం(Gaza War)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas)లు ముందుకు వచ్చాయి. మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. ·రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేసినట్లు ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో ట్రంప్ పోస్టు చేశారు. ‘‘గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్లు అంగీకరించినందుకు గర్వంగా భావిస్తున్నాను. ఈ నిర్ణయంతో హమాస్ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారు. ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకుంటుంది. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుంది. .. అన్ని పార్టీలను సమంగా చూస్తాం. అరబ్, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజు. ఈ చరిత్రాత్మక, అపూర్వసంఘటన. ఇది నెరవేరడానికి మాతో పాటు కలిసి పని చేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, టర్కీ(తుర్కీయే)కు థ్యాంక్స్’’ అని ట్రంప్ పేర్కొన్నారు.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ మిలిటెంట్లు విరుచుపడి 1,200 మందికిపైగా హతమార్చి, 250 మందికిపైనే బందీలుగా చేసుకున్నారు. ఆపై హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాపై భీకరంగా విరుచుకుపడి హమాస్ ముఖ్య నేతలందరిని హతమార్చింది. ఈ రెండేళ్ల యుద్ధంలో 67 వేలమందికిపైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. 1.70 లక్షలమంది గాయపడ్డారు. లక్షకుపైగా భవనాలు నేలమట్టమయ్యాయి. గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళికను హమాస్ ముందు ఉంచారు. ఈ ప్రణాళికకు ఒప్పుకోకుంటే నరకం చూపిస్తానని ఇటీవల హెచ్చరించారు. మరోవైపు మూడు రోజులుగా శాంతి ప్రణాళికపై ఈజిప్టులో ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మొదటి దశ అమలుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇజ్రాయెల్ ఏమందంటే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. ఈ నిర్ణయం ఇజ్రాయెల్కు గొప్పరోజుగా అభివర్ణించారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు, బందీలందరినీ ఇళ్లకు చేర్చేందుకు రేపు ప్రభుత్వాన్ని సమావేశపరుస్తానని పేర్కొన్నారు. హమాస్ ఏమందంటే.. ఇటు శాంతి ఒప్పందాన్ని హమాస్ ధ్రువీకరిస్తూ.. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్టు, తుర్కియే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ, మానవత సాయానికి అనుమతి, ఖైదీల మార్పిడి చోటుచేసుకోనుందని వెల్లడించింది. గాజా ప్రజలు సాటిలేని ధైర్యం, వీరత్వం ప్రదర్శించారని హమాస్ పేర్కొంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వయం నిర్ణయాలు సాధించేవరకు తమ ప్రజల హక్కులను వదులుకోమని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: దీపావళికి అమెరికాలో సెలవు ప్రకటన -
కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 38 మంది!
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈస్ట్ జావా రాష్ట్రం సిడోయార్జి పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్ భవనం కుప్పకూలిపోయింది(School Building Collapse). ఈ ఘటనలో ఒక విద్యార్థి మరణించగా.. వంద మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఆ ఇస్లామిక్ స్కూల్లో ప్రార్థనలు జరుగుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. భవనం కుప్పకూలడంతో ఒక విద్యార్థి (13) అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించగా.. వాళ్లలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 38 మంది విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి ఉంది. వీళ్లంతా శిథిలాల్లో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.శిథిలాల కింది నుంచి చిన్నారుల కేకలతో, తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. కాంక్రీట్ దిమ్మెలు భారీ పరిణామంలో ఉండడం.. వాటిని కదిలిస్తే మరింత కుప్పకూలిపోయే అవకాశం ఉండడంతో సహాయక చర్యలు జాగ్రత్తగా, నిదానంగా సాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక కూడా సహాయక చర్యలు కొనసాగాయి. రెస్క్యూ బృందాలు(Rescue Teams) తీవ్రంగా శ్రమించి.. 102 మందిని రక్షించినట్లు కాంపోస్.డాట్ కామ్ అనే స్థానిక మీడియా వెబ్సైట్ కథనం ఇచ్చింది. స్కూల్ భవనం పాతది కావడం.. అనుమతి లేకుండా పై అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ ప్రతినిధి జూల్స్ అబ్రహాం అబాస్ట్ తెలిపారు.ఇదీ చదవండి: చిగురుటాకులా వణికిపోయిన వియత్నాం! -
‘ఇదేందయ్యా ఇది..!’ ఒకే వేదికపై మెరిసిన ట్రంప్-మస్క్
అమెరికా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో తీవ్రస్థాయి పరస్పర విమర్శలు గుప్పించుకున్న ట్రంప్-మస్క్.. మళ్లీ ఒక్కటయ్యారు!. అరిజోనా స్టేట్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో హేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ వెనుక కూర్చుని ఇద్దరూ తెగ ముచ్చటించుకున్నారు. అంటే.. పొరపచ్చాలను పక్కన పెట్టి అమెరికా కోసం మళ్లా ఒక్కటిగా కలిసి పని చేయబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ను అమెరికా స్వాతంత్ర సమర యోధుడిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెప్టెంబర్ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో జరిగిన దాడిలో కిర్క్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆదివారం అరిజోనా స్టేట్ గ్లెన్డేల్ నగరంలోని స్టేట్ ఫామ్ స్టేడియంలో నిర్వహించిన కిర్క్ స్మారక సభలో ట్రంప్ పై ప్రకటన చేశారు. అయితే.. ఇదే వేదికగా కనిపించిన ఓ దృశ్యం.. ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ట్రంప్తో కరచలనం చేసి.. పక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించారు. ట్రంప్ సైతం మస్క్ను టచ్ చేస్తూ ఆప్యాయంగానే మాట్లాడారు. ఆ సమయంలో మస్క్ తన చేతులను ‘‘పిరమిడ్ హ్యాండ్ సింబల్’’ రూపంలో ఉంచడమూ.. ఇంటర్నెట్ను ప్రధానంగా ఆకర్షిస్తోంది. ఊహించని ఈ పరిణామంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.NEW: President Trump and Elon Musk were spotted sitting together and chatting during a surprise reunion at Charlie Kirk’s memorial. pic.twitter.com/5asd3mTiJF— Fox News (@FoxNews) September 21, 20252024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ విపరీతంగా పని చేశారు. ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించడం, ఆయన కోసం విరాళాల సేకరణ ద్వారా తన బలమైన మద్దతు ప్రకటించారు. ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత.. మస్క్ను Department of Government Efficiency (DOGE) అనే కొత్త శాఖకు నాయకుడిగా నియమించారు. ఈ శాఖ ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, వ్యవస్థను సరళతరం చేయడం లక్ష్యాలతో పని చేసింది. మస్క్కు ట్రంప్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం సహజంగానే రిపబ్లికన్లకూ కోపం తెప్పించింది. ఈలోపు.. ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు తేవడాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా.. ఈ ఏడాది మే 30న తన డోజ్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆపై ట్రంప్ పాలనా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒకానొక టైంలో ఇది ట్రంప్నే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ బహిరంగానే విమర్శలు చేసుకుంటూ, వార్నింగులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలు.. మస్క్ను రాజకీయ పార్టీ ప్రకటన వైపు అడుగులేయించింది. అంతేకాదు ట్రంప్ను ఇరకాటంలో పడేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి అంశాన్ని సైతం మస్క్ ప్రధానంగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.అయితే, కొన్నాళ్లుగా మస్క్ స్వరం మారింది. ట్రంప్లాగే చార్లీ కిర్క్తో ఎలాన్ మస్క్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన స్మారక సభలో మస్క్ భావోద్వేగంగా స్పందించారు. అదే సమయంలో ట్రంప్తో ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత విభేదాలను పక్కనబెట్టి, మళ్లీ కలిసి పనిచేయబోతున్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. దీనికి మస్క్ ఎక్స్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. -
ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టులపై సైబర్ ఎటాక్!
ప్రపంచవ్యాప్తంగా పలు విమానాశ్రయాలపై సైబర్ దాడులు జరిగాయి. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం.. లండన్ హీత్రో, బ్రస్సెల్స్(బెల్జియం)తో పాటు యూరప్ దేశాల్లోనే విమానాశ్రయాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. కోలిన్స్ ఎయిరోస్పేస్(Collins Aerospace) అనే సంస్థ నిర్వహించే చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. హీత్రో విమానాశ్రయంలో విమాన ప్రయాణాలు ఆలస్యం కాగా, బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఆటోమేటెడ్ సేవలు నిలిచిపోవడంతో మాన్యువల్గా చెక్ ఇన్ నిర్వహిస్తున్నారు. సైబర్ దాడి జరిగిన విషయాన్ని బెర్లిన్(జర్మనీ) విమానాశ్రయం కూడా తన వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించింది. అయితే, ఫ్రాంక్ఫర్ట్, జ్యూరిచ్ విమానాశ్రయాలు ఈ దాడి నుంచి తప్పించుకున్నాయి.సైబర్ దాడి ప్రభావంతో యూరప్ దేశాల విమానాశ్రాయాల్లో అలజడి నెలకొంది. ఈ ప్రభావంతో వేల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. వందల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలను రద్దు చేశారు. అమెరికా అధ్యక్షుడు హెచ్-1బీ వీసాల దరఖాస్తు రుసుమును అమెరికా లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు ఫుల్ బిజీగా మారాయి. ఈ క్రమంలోనే ఈ సైబర్ దాడి జరగడం గమనార్హం. -
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్స్కేల్పై భూకంపం తీవ్రత 7.8గా నమోదు అయింది. దీంతో యూఎస్ జాతీయ ఆరోగ్య సర్వీస్ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్స్కీ రీజియన్లో గురువారం అర్ధరాత్రి దాటాక ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కేంద్రం 10 కి.మీ దూరంలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అనంతరం స్వల్ప వ్యవధిలో మరో ఐదుసార్లు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రష్యాలో తరచూ భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం—అది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ (Pacific Ring of Fire) లో భాగంగా ఉండటం. ఇది భూమి మీద అత్యంత చురుకైన భూకంప, అగ్నిపర్వత ప్రాంతం. ప్రధానంగా కమ్చట్కా ద్వీపకల్పం ప్రాంతం పసిఫిక్ ప్లేట్-యూరేషియన్ ప్లేట్ మధ్య ఉంది. ఇవి ఒకదానిని మరొకటి గుద్దుతూ కదలడం వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఇదిలా ఉంటే.. ఇటు ఇండోనేషియాలోనూ 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్లో శుక్రవారం వేకువ జాము సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 28 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని సమాచారం. -
2-3 నిమిషాల్లో విరిగిన ఎముకలు అతికితే!!
ఈ గమ్మును మీ విరిగిన ఎముకల మధ్య రాస్తే.. అవి రెండు నుంచి మూడు నిమిషాల్లో అతుక్కుంటాయి అంటూ ఓ వీడియో గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలో ఈ గ్లూ మీద జరిగిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని.. ఇది మార్కెట్లోకి రావడమే ఆలస్యమని.. ఇది గనుక అందుబాటులోకి వస్తే వైద్యరంగంలోనే విప్లవాత్మక మార్పునకు కారణమవుతుందని ఊదరగొడుతున్నారు. ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంత?.. ఓసారి పరిశీలిస్తే.. విరిగిన ఎముకలు అంత ఈజీగా అతుకుతాయా? గంటల తరబడి ఆపరేషన్లు చేస్తే.. నెలలు, సంవత్సరాల తరబడి అవి అతుక్కుంటున్నాయి. అలాంటిది కేవలం సెకన్ల వ్యవధిలో ఓ సూది ద్వారా అతుక్కనేలా చేయొచ్చా?. చైనా పరిశోధకులు కనిపెట్టిన బోన్ గ్లూకు అసలు శాస్త్రీయత ఉందా?.. ఆ ప్రచారంలో ఉన్నట్లు విరిగిన ఎముకలను గంటల పాటు శస్త్రచికిత్స చేసి, స్టీల్ ప్లేట్లు అమర్చే సంప్రదాయ వైద్యం ఇక చరిత్ర అవ్వబోతోందా?.. షెజాంగ్ స్థానిక మీడియా ప్రకారం.. తూర్పు చైనా(China)లోని షెజాంగ్ ప్రావిన్స్లో ‘బోన్ 02’ అనే బోన్ గ్లూ(bone glue)ను పరిశోధకులు ఆవిష్కరించారు. దీంతో విరిగిన ఎముకలను మూడు నిమిషాల్లోనే అతికించవచ్చని ఆ కథనం సారాంశం. సర్ రన్ రన్ షా ఆస్పత్రిలో అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లిన్ షాన్ఫింగ్ నేతృత్వంలోని బృందం దీనిని డెవలప్ చేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన జిగురు కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే ఎముకను బాగుచేస్తుందని అంటున్నారాయన. రక్త ప్రవాహం అధికంగా ఉండే వాతావరణంలోనూ దీని పనితీరు మెరుగ్గా ఉందని వెల్లడించారు. సంప్రదాయ వైద్యంలో ఎముకలు అతికించాలంటే శరీరానికి పెద్ద కోతలు వేసి, స్టీల్ ప్లేట్లను అమర్చుతారు. కానీ ఈ ఇంజెక్షన్తో అలాంటి అవసరం రాదని అంటున్నారాయన. పైగా బోన్ 02 శరరీంలో ఈజీగా కలిసిపోతుందని, కాబట్టి మరో సర్జరీ అనే అవసరం లేకుండా చేస్తుందని చెబుతున్నారాయన. ఆపరేషన్ల సక్సెస్ రేటు తక్కువగా ఉంటుండడమే.. తనకు దీనిని రూపొందించాలనే ఆలోచన కలగజేసిందని అంటున్నారాయన.ఇంతకీ ఈ గ్లూను అభివృద్ధికి ప్రేరణ ఏంటో తెలుసా?. నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలు. వాటి జీవశైలిని పరిశీలించిన లిన్ షాన్ఫింగ్ ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టారు.ట్రయల్స్.. సక్సెస్.. ‘బోన్ 02’(Bone-02)ని లాబోరేటరీలో కూడా పరీక్షించారు. అందులో తేలింది ఏంటంటే.. ఇది 400 పౌండ్ల బలాన్ని తట్టుకోగలదు (అంటే చాలా బలంగా అంటుకుంటుంది). 0.5 MPa కోత బలం (shear strength) అంటే పక్కదిశలో ఒత్తిడిని తట్టుకునే శక్తి ప్రదర్శించింది. అలాగే.. 10 MPa సంపీడన బలం (compressive strength) అంటే నేరుగా ఒత్తిడిని తట్టుకునే శక్తి చూపించింది. ఈ లక్షణాలన్నీ సంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేయగల సామర్థ్యం దీనికి ఉందని సూచిస్తున్నాయి. అలాగే.. దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్లు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అవసరం లేకుండా.. ఎముక గాయం నయం కాగానే శరీరంలో కలిసిపోవడం ఈ ‘బోన్ 02’లోని మరో విశిష్ట లక్షణం ఉండనే ఉంది. మొత్తం 150 మంది పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్లో ఇది విజయవంతంగా పని చేసింది. దీంతో.. సెప్టెంబర్ 10వ తేదీన దీనిని ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే.. చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ (NMPA) నుంచి పూర్తి మార్కెట్ అనుమతి పొందిందా? అనేదానిపై సష్టత కొరవడింది. వైద్య చరిత్రలో మైలురాయే!ఎముకలను అతికించేందుకు ఈ తరహా ప్రయోగాలు గతంలోనూ జరిగాయి. 1940 కాలంలో.. ఎముకలను అతికించే పదార్థాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మొదలైంది. 1950 నుంచి ముప్పై ఏళ్లపాటు నాన్స్టాప్గా ఈ తరహా పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం జంతు మూలాల నుంచి తీసిన ప్రోటీన్ పదార్థం, బలమైన అంటుకునే లక్షణాలున్న ఎపాక్సీ రెసిన్లు (Epoxy Resins) రసాయనాలు, వేగంగా గట్టిపడే ప్లాస్టిక్ తరహా అక్రిలేట్లు (Acrylates)సైనోఎక్రిలేట్లు (super glue తరహా) పదార్థాలు ఉపయోగించారు. అయితే.. ఇవి ఎముకలను అతికించే సామర్థ్యం ప్రదర్శించినా.. బాడీకి పనికి రాకుండా పోయాయి. వీటి వల్ల బయోకంపాటబిలిటీ సమస్యలు ఎదురయ్యేవి. అంటే.. ఇన్ఫెక్షన్, అలర్జీలు వచ్చేవి. పైగా శరీర కణజాలాన్ని దెబ్బ తీశాయి. వాటిని తొలగించేందుకు రెండో సర్జరీ అవసరం అయ్యేవి. ఈ కారణాల వల్ల, వాటిని వైద్యంగా విరమించాల్సి వచ్చింది. సైనోఎక్రిలేట్లు (super glue తరహా) వంటి పదార్థాలతో ప్రయోగాలు జరిగాయి.1990–2010 మధ్యకాలంలో.. బయోకంపాటబుల్ పాలిమర్లు, కోలాజెన్, కెరటిన్, కైటోసన్ వంటి పదార్థాలపై దృష్టి పెట్టారు. ఇవి శరీరంలో కరిగిపోవడం, తక్కువ రిస్క్ ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉన్నా, అంత బలంగా అంటుకునే సామర్థ్యం ప్రదర్శించలేకపోయాయి. 2010 తర్వాత.. బయోమిమిటిక్ దిశగా ప్రయోగాలు జరిగాయి. అంటే.. ఆల్చిప్పలు, గవ్వలు, గోరింటాకు వంటి జీవుల నుంచి స్ఫూర్తి పొందిన బయోమిమిటిక్ గ్లూలు అభివృద్ధి చేయడం మొదలైంది. ఇవి నీటి లోపల కూడా బలంగా అంటుకునే లక్షణాలను కలిగి ఉండటంతో, శరీరంలోని రక్త ప్రవాహంలో కూడా పనిచేయడం లాంటి ఫలితాలను ఇచ్చాయి. అలా కొన్ని గ్లూలు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నా.. అక్కడ సరైన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. ఇలాంటి టైంలో.. చైనా బోన్ 02 గ్లూలు వాస్తవిక ప్రయోగ దశకు చేరుకోవడం గమనార్హం. సాధారణంగా, ఇలాంటి వైద్య పరికరాలను Class III medical deviceగా పరిగణిస్తారు. కాబట్టి వీటికి క్లినికల్ ట్రయల్స్, టెక్నికల్ సమీక్ష, రెగ్యులేటరీ అనుమతులు అవసరం. ఆ తర్వాతే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి వస్తాయి. అంటే ఇది మార్కెట్లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. సో.. వైరల్ అవుతున్న ఆ వీడియో.. ఆ కథనం రెండూ నిజమే. ‘బోన్ 02’ అనే గ్లూ ఎముకలు అతికించడంలో వేగంగా, బలంగా, సురక్షితంగా పనిచేస్తోందని రుజువైంది. ఇది సంప్రదాయ చికిత్సకు మంచి ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
నేపాల్ అగ్నిగుండాన్ని చల్లార్చిన యాప్!
కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం(గత) 26 సోషల్ మీడియా యాప్లపై విధించిన నిషేధం.. ఆ దేశంలో అలజడిని సృష్టించింది. జెడ్ జనరేషన్ యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టడం.. వాటిని అదుపు చేసే క్రమంలో హింస చెలరేగి 51 మంది మరణించడం.. యాప్ బ్యాన్ ఎత్తివేత.. అయినా శాంతించని యువత.. ప్రధాని రాజీనామా.. ఆపై ఆందోళనకారుల ఛాయిస్ ప్రకారం తాత్కాలిక ప్రధాని ఎంపిక.. ఇదంతా పదిరోజుల వ్యవధిలోనే చకచకా జరిగిపోయింది. అయితే సో.మీ. బ్యాన్ నేపథ్యంలో ఆందోళనకారులు డిస్కార్డ్ Discord అనే చాట్ ప్లాట్ఫారమ్ను భలేగా ఉపయోగించారు. ఒకవేళ ఈ యాప్ గనుక లేకుండా ఉంటే.. నేపాల్ ఇంకా అగ్నిగుండంగా రగిలిపోతూ ఉండేదేమో అనే చర్చా నడుస్తోందక్కడ.పాలన పేరిట ఇన్నేళ్లుగా కొనసాగిన అవినీతికి నేపాల్ యువత ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంది. ఆందోళనలను ఉధృతంగా జరిపి ప్రభుత్వం మెడలు వచ్చింది. అయితే ఈ ఆందోళనలను సమన్వయపర్చుకోవడానికి డిస్కార్డ్ యాప్నే Gen Z నిరసనకారులు ఉపయోగించుకున్నారు. అంతేకాదు.. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత.. తమ ఆకాంక్షలకు అనుగుణంగా నాయకుడ్ని ఎన్నుకునే క్రమంలోనూ ఈ వేదికనే ఉపయోగించుకున్నారు. Discord అనే యాప్ గురించి మిలెనియల్స్కు పెద్దగా పరిచయం లేకపోయినా.. Gen Z యువత మాత్రం సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన వేదికగా భావిస్తోంది. డిస్కార్డ్(Discord) అనేది 2015లో ప్రారంభమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫారమ్. ఇది గేమర్ల కోసం ఆటల మధ్యలోనే స్నేహితులతో చాట్ చేయడానికి రూపొందించబడిన ఒక యాప్. అయితే.. 2020లో మహమ్మారి సమయంలో Gen Z యువతలో ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. Discord ద్వారా వినియోగదారులు సర్వర్లు అనే కమ్యూనిటీలు ఏర్పాటు చేసి.. టెక్స్ట్, ఆడియో, వీడియో చానెల్స్ ద్వారా చర్చలు జరపడం ప్రారంభించారు. స్క్రీన్ షేరింగ్, స్ట్రీమింగ్, మోడరేషన్ టూల్స్ వంటి ఫీచర్లు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సర్వర్లో గరిష్టంగా 5 లక్షల మంది చేరవచ్చు, కానీ ఒకేసారి 2.5 లక్షల మంది మాత్రమే యాక్టివ్గా ఉండగలరు. అందుకే నేపాల్ యువత ఉద్యమానికి దీన్నొక వేదికగా మల్చుకుంది. వీపీఎన్ సాయంతో.. సాధారణంగా వీపీఎన్లను ఎందుకు ఉపయోగిస్తారు?.. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. నేపాల్ యువత మాత్రం ఈమధ్య దీనిని తాజాగా నిరసనలకే ఉపయోగించింది(నేపాల్లో VPNల వినియోగం 3 రోజుల్లోనే 6,000% పెరిగింది.. అలాగే 5వ రోజుకొచ్చేసరికి 8,000% పెరిగింది.). నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిషేధం కొనసాగుతున్న వేళ.. విస్తృత యాప్గా పేరున్న డిస్కార్డ్(Discord) వీపీఎన్ సాయంతో అందుబాటులోకి తెచ్చుకుంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఉన్నట్లు ఎండ్లెస్ ఫీడ్లు లేకుండా.. వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్లతో Discord ఉండడం వల్లే దీనిని రైట్ఛాయిస్గా అక్కడి యువత భావించింది. అలా.. "Youth Against Corruption" అనే Discord సర్వర్లో 145,000 మందికి పైగా సభ్యులుగా చేరారు. ఈ సర్వర్లో చర్చలు, అనౌన్స్మెంట్స్, ఫ్యాక్ట్ చెక్, హెల్ప్లైన్లు వంటివి కొనసాగించింది. వారు ఏర్పాటు చేసిన Discord సర్వర్లలో ఇన్ఫర్మేషన్ సులభంగా పాసయ్యింది. పెద్ద సంఖ్యలో సభ్యులు చర్చలు జరిపేందుకు ఇదొ కీలక వేదికగా నిలిచింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.ఓటింగ్ కూడా.. నేపాల్ తాత్కాలిక నాయకత్వం విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని డిస్కార్డే తొలగించింది!. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ, నేపాల్ పవర్ హౌజ్గా పేరున్న కుల్మన్ ఘీసింగ్, రాపర్ బాలేంద్ర షా(బాలెన్), ఇలా పలువురి పేర్లతో ఓ డైలామా ఏర్పడగా.. డిస్కార్డ్ జరిగింది ఓటింగ్ ద్వారా స్పష్టత తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ యాప్ ద్వారానే ప్రతిపక్షాన్ని కూడా సమన్వయపర్చుకుని.. రాజకీయ అనిశ్చితిని తొలగించింది. ఈ ఓటింగ్ను పర్యవేక్షించిన శశ్వత్ లామిచ్ఛానే కూడా ఈ విషయాల్ని ధృవీకరించారు. ఇక డిస్కార్డ్లో ఓటింగ్ బుదవారం పూర్తైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 50 శాతం ఓట్లు సుశీల్ కార్కీకే పడ్డాయి. ఆ మరుసటి రోజు ఆమె నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీచీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను కలిశారు. అలా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎపిసోడ్లో ఉత్కంఠ వీడింది. అయితే.. ఇండియా టుడే ఓఎస్ఐఎన్టీ(Open-Source Intelligence) సర్వే ప్రకారం ఈ ఓటింగ్లో పాల్గొన్నవాళ్లంతా నేపాల్ పౌరులేనా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. భారత్లోనూ డిస్కార్డ్Discord ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అమెరికాలో దాదాపు 25 కోట్లు, బ్రెజిల్లో ఐదున్నర కోట్ల యూజర్లు ఉన్నారు. ఆ తర్వాత భారత్లోనూ ఐదు కోట్ల మంది ఈ యాప్ను ఉపయోగిస్తునన్నారు. ఈ లిస్ట్లో కెనడా, ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ప్లాట్ఫారమ్ విండోస్, మాక్ఓఎస్, ఆండ్రాయిడ్, ఐవోఎస్, లైనక్స్ వెబ్ బ్రౌజర్లలో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 30కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది, అందులో తెలుగు మాత్రం లేదు. డిస్కార్డులో గేమింగ్ మాత్రమే కాదు.. పౌర ఉద్యమాలు, రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. సొంత సర్వర్తో క్రియేటివ్ కమ్యూనిటీలు నిర్మించుకునేందుకు వీలుగా ఉండడంతోనే ఇది సాధ్యమవుతోంది. అంత నిషేధంలోనూ Gen Z యువతకు డిస్కార్డ్ యాప్ ఒక గళం ఇచ్చింది. ఒకవేళ ఈ యాప్ను జెన్ జెడ్ యువత గనుక సమర్థవంతంగా ఉపయోగించుకుని గనుక ఉండి ఉంటే.. నేపాల్ ఉద్యమం అసంఘటితంగా, అస్పష్టంగా, మరింత హింసాత్మకంగా మారిపోయే అవకాశం ఉండేదేమో!. -
జూకీపర్ను చంపి పీక్కుతిన్న సింహాలు
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బుధవారం ఘోరం జరిగింది. అక్కడి ప్రముఖ జూలో పని చేసే వ్యక్తి(58)ని సింహాల గుంపు చంపి పీక్కుతింది. పర్యాటకులంతా చూస్తుండగానే ఇదంతా జరడం గమనార్హం. బ్యాంకాక్ పోస్ట్ కథనం ప్రకారం.. జియన్ రంగ్ఖరాసమీ అనే వ్యక్తి ఇరవై ఏళ్లుగా బ్యాంకాక్ సఫారీ వరల్డ్లో పని చేస్తున్నాడు. ఇది పేరుగాంచిన ఓపెన్ ఎయిర్ జూ. అందులో కొంతకాలంగా ఆయన సింహాల కేర్టేకర్(ఆహారం అందిస్తూ) విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. బుధవారం సింహాల ఎన్క్లోజర్లో ఉండగా ఏమరపాటుగా ఆయన తన వాహనం నుంచి కిందకు దిగారు. అంతే సింహాలు ఒక్కసారిగా ఆయనపై ఎగబడ్డాయి.సుమారు 15 నిమిషాలపాటు అవి ఆయనపై దాడి చేశాయి. ఆ సమయంలో కొందరు పర్యాటకులు.. వాహనాల హారన్లు కొడుతూ, గట్టి గట్టిగా అరుస్తూ వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. జూకీపర్ శరీరంలో కొంత భాగాన్ని పీక్కుతిన్నాయి. ఎలాగాలో వాటి నుంచి ఆయన్ని లాగేసి.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే దారిలోనే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై Safari World Bangkok స్పందించింది. గత 40 ఏళ్లలో ఇలాంటి దాడి జరగడం ఇదేనని తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో భధ్రతా చర్యలను కఠినంగా అమలు చేస్తామని పేర్కొంది. కింది వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.. A zookeeper on Wed was attacked and killed by a pack of #lions at a #Bangkok #zoo, as tourists witnessed the incident and tried to intervene to save him. The shocking attack lasted about 15 minutes, with visitors attempting to intervene by honking car horns and shouting to… pic.twitter.com/8ZzsKFwXU0— Shanghai Daily (@shanghaidaily) September 11, 2025సింహాలు మనుషుల్ని తింటాయా?.. సింహాలు మనుషుల్ని వేటాడడం.. అత్యంత అరుదుగా జరుగుతుంది. సాధారణంగా అవి మనుషుల్ని ఆహారంగా పరిగణించవు. జింకలు, జీబ్రాలు, అడవి దున్నలు.. ఇలా పరిమాణంలో పెద్దగా ఉండే జంతువులు వాటి సహజ ఆహారం. గాయపడిన సింహాలు, వయసైపోయిన సింహాలు వేటాడలేని స్థితిలో మనుషులపై దాడి చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే.. అడవుల్లో జంతువుల సంఖ్య తగ్గిపోయినా ప్రత్యామ్నాయంగా పశువులు, మనుషుల మీద దాడి చేయొచ్చు. ఈ క్రమంలో.. ఒకసారి సింహం మనిషిని వేటాడితే గనుక ఆ ప్రవర్తనను కొనసాగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. కొన్నిసార్లు తన పిల్లలకూ మనుషుల్ని వేటాడడం నేర్పిస్తాయట. Tsavo Man-Eaters (1898).. కెన్యాలో రెండు సింహాలు 135 మంది రైల్వే కార్మికులను చంపినట్లు రికార్డులు ఉన్నాయి. అలాగే.. Njombe Man-Eaters (టాంజానియా) పేరిట కొన్ని సింహాలు తరతరాలుగా మనుషులపై వేటాడినట్లు ఆధారాలు ఉన్నాయి. -
పగలంతా తేనె పలుకులు, రాత్రైతే..
ఉక్రెయిన్ సంక్షోభంలో.. పుతిన్ వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ విధానాలు తనకేమాత్రం నచ్చడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఈ ఇద్దరు దేశాధినేతలు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటుండడం తెలిసిందే.రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి పట్ల నేను తీవ్ర నిరాశ చెందారు. పుతిన్ శాంతి కోసం మాట్లాడతారని అనుకున్నాను. కానీ రాత్రికి రాత్రి ఉక్రెయిన్పై దాడులు చేయిస్తున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు అని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పుల్స్టాప్ పెట్టే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే.. పుతిన్-జెలెన్స్కీ వైఖరి వల్ల నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. దీంతో ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. పైగా ట్రంప్-పుతిన్లు తరచూ ఈ అంశంపై ఫోన్లో మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యాపై ఆంక్షలు?రష్యాపై కొత్త ఆంక్షలు విధించే అవకాశాన్ని ట్రంప్ సూచన ప్రాయంగా తెలియజేశారు. మేము రేపు ఏం చేస్తామో చూడండి అంటూ మీడియాతో వ్యాఖ్యానించారాయన. అమెరికా సెనేటర్లు ఇప్పటికే రష్యాపై ‘స్లెడ్జ్హామర్’(కఠినమైన) ఆంక్షల బిల్లును ప్రతిపాదించిన సమాచారం. పైగా ఈ బిల్లు రష్యా విషయంలో ఆంక్షలు విధించేందుకు ట్రంప్కు విస్తృత అధికారాలను కల్పించనుందని తెలుస్తోంది.తాజా వ్యవహారంతో ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరీముఖ్యంగా అమెరికా-రష్యా సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతున్నాయి. ట్రంప్ మాటలు, చర్యలు.. ఉక్రెయిన్ ఉద్రిక్తతల్లో రష్యాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను అందించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్కు ఇది ఎంతో అవసరమని అని ఆయన.. ఈ ఆయుధాల ఖర్చును అమెరికా భరించదని, యూరోపియన్ యూనియన్ 100% చెల్లించనుందని తెలిపారు.ఈ క్రమంలో ఇది జస్ట్ బిజినెస్ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. -
అదేదో మీ ముద్దుల భార్యతోనే మొదలుపెట్టండి!
వలసదారుల బహిష్కరణ విషయంలో దూకుడు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కౌంటర్ పడింది. అమెరికా పౌరసత్వం పొందిన వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సంతకాల సేకరణ జరుగుతోంది. అదేదో.. తన ముద్దుల భార్య మెలానియా నుంచే మొదలుపెట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఏకంగా సంతకాల సేకరణ చేపట్టారు. ‘‘Deport Melania" అనే పేరుతో అమెరికాలో ఆన్లైన్లో సంతకాల సేకరణ ప్రారంభమైంది. ఈ పిటిషన్లో మెలానియా ట్రంప్, ఆమె తల్లిదండ్రులు, కుమారుడు బారన్ అమెరికా నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ ఏమన్నారంటే.. అమెరికన్ పౌరసత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న విదేశీ మూలాలవారు దేశం నుంచి వెళ్లిపోవాలి అని. ట్రంప్ చెప్పిన దానిప్రకారం.. విదేశాల నుంచి వచ్చి పౌరసత్వం పొందిన వారిని బహిష్కరించాలంటే, ముందుగా ఆయన కుటుంబం నుంచే ఆ ప్రక్రియ ప్రారంభించాలి అనేది ఈ పిటిషన్ ఉద్దేశం. మెలానియా పౌరసత్వంపై వివాదం ఏంటంటే.. మెలానియా ట్రంప్ అసలు పేరు మెలనియా క్నావ్స్. స్లోవేనియాలో జన్మించారు. 1970 ఏప్రిల్ 26న అప్పటి యుగోస్లావియాలోని నోవో మెస్టో (Novo Mesto) అనే పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం ఇది స్లోవేనియా దేశంలో భాగంగా ఉంది. బాల్యంలో ఆమె సెవ్నికా అనే గ్రామంలో గడిపారు. ఆమె తండ్రి కార్లు అమ్మేవారు. తల్లి బట్టల పరిశ్రమలో పని చేసేది. తన 16వ ఏట మోడలింగ్ కెరీర్ను ప్రారంభించిన మెలానియా.. తర్వాత పారిస్, మిలాన్లకు వెళ్లి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఆపై మోడలింగ్ కోసం వీసా ద్వారా 1996లో అమెరికాకు వచ్చారు. మెలానియా 2000లో EB-1 వీసా (Einstein Visa) కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2001లో ఆమెకు ఈ వీసా మంజూరు అయ్యింది. అయితే అప్పటికి ఆమె సాధారణ ఫ్యాషన్ మోడల్ మాత్రమే. ఆమెకు అంత స్థాయి అంతర్జాతీయ గుర్తింపు కూడా లేదు అనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2005లో ట్రంప్ను వివాహం చేసుకున్న ఆమె.. 2006లో అమెరికా పౌరసత్వం పొందారు.EB-1 వీసా అంటే.. ఇది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఉన్నత ప్రతిభ కలిగిన వ్యక్తుల కోసం ప్రత్యేక వీసా. సాధారణంగా నోబెల్ బహుమతి విజేతలు, ఒలింపిక్ పతకాలు, పులిట్జర్, అకాడమీ అవార్డులు వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నవారికి మాత్రమే ఈ వీసా లభిస్తుంది. అయితే, మెలానియా నిజంగానే ఆ గుర్తింపునకు అర్హత ఉన్న వ్యక్తేనా? అనే విషయంపై వివాదం నడుస్తోందక్కడ. 2025 జూన్లో జరిగిన అమెరికా కాంగ్రెస్ విచారణలో డెమొక్రాటిక్ ప్రతినిధి జాస్మిన్ క్రాకెట్ వ్యాఖ్యానిస్తూ.. మెలానియా పొందింది Einstein వీసా అయితే లెక్క సరిపోవడం లేదంటూ విమర్శించారు.ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యలు, వీసా రద్దులు, చైన్ మైగ్రేషన్((పౌరులు తమ కుటుంబ సభ్యులకు గ్రీన్ కార్డులు పొందించే విధానం) వ్యతిరేకత వంటి విధానాలను ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో.. ఆమె పొందిన పౌరసత్వం చట్టబద్ధమైనదే. కానీ, తన పౌరసత్వం ద్వారా ట్రంప్ భార్య మెలానియా తన తల్లిదండ్రులకు గ్రీన్ కార్డులు ఇప్పించారు. అంటే.. ఏ రకంగా చూసుకున్నా ట్రంప్ పాలసీకి ఈ చర్యగా విరుద్ధంగా ఉంది. అందుకే.. ఆ మొదలుపెట్టేదోదో మెలానియాతోనే మొదలుపెట్టండి అని అమెరికన్లు సంతకాల పిటిషన్ చేపట్టారు. -
ఆకాశంలో ఉండగా విమానానికి మంటలు!
ఆకాశంలో ఉండగా ఓ విమానానికి మంటలు అంటుకున్నాయి. ఆ టైంలో విమానంలో మొత్తం 159 మంది ఉన్నారు. అయితే పైలట్ చాకచక్యంతో వ్యహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానానికి బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ నుంచి మంటలు బయటకు వచ్చాయి. ఇది గమనించిన పైలట్ అప్రమత్తం అయ్యారు. వెంటనే విమానాన్ని వెనక్కి తెచ్చి సేఫ్ ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. అక్కడి కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. లాస్వెగాస్ హ్యారీ రెయిడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్ 1665 విమానం(ఎయిర్బస్కు చెందిన A321) టేకాఫ్ అయ్యింది. 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో అది బయల్దేరింది. నార్త్ కరోలీనా షార్లెట్లోని డగ్లస్ ఎయిర్పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది.అయితే.. టేకాఫ్ అయ్యాక కాసేపటికి(8.20గం.కి టేకాఫ్ అయితే.. 8.30గం.) గాల్లో ఉండగా ఇంజిన్ కింది భాగం నుంచి మంటలు, పొగ కనిపించాయి. ఇది గమనించిన పైలట్ విమానాన్ని తిరిగి లాస్వెగాస్ ఎయిర్పోర్టులో సేఫ్ ల్యాండ్ చేశారు. అయితే.. విమానాన్ని పరిశీలించిన సిబ్బందికి ఎలాంటి సాంకేతిక లోపం.. మంటలు అంటుకున్న జాడ కనిపించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ విమానాన్ని రద్దు చేసి.. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానాలకు చేర్చారు. ఆకాశంలో విమానానికి మంటలు అంటుకున్న దృశ్యాన్ని కొందరు తమ ఫోన్లలో బంధించగా.. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) దర్యాప్తు జరుపుతోంది. ఇటీవల భారత్లో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మంది(సిబ్బందితో కలిపి), జనావాసాలపై విమానం కూలి పేలిపోవడంతో మరో 34 మంది స్థానికులు మరణించారు. తాజాగా బ్రెజిల్లో హాట్ ఎయిర్ బెలూన్ గాల్లో ఉండగా పేలి 8 మంది అక్కడికక్కడే మరణించగా.. కిందకు దూకి మరో 13 మంది ప్రాణాలు రక్షించుకోగలిగారు. ఈ ఘోర ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. -
సంబురాల్లో తుపాకుల మోత.. రక్తమోడిన గువానాజువాటో సిటీ
మెక్సికోలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మతపరమైన సంబురాల్లో కొందరు దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబబ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్యకాలంలో అత్యంత హింసాత్మక ప్రాంతంగా ముద్రపడిన గువానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటోలో ఇది చోటుచేసుకుంది. బుధవారం.. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్కు గౌరవంగా నిర్వహించిన వీధి ఉత్సవంలో స్థానికులు సంబురాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో కొందరు దుండగులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు. అప్పటిదాకా మద్యం, చిందుల్లో మునిగిపోయిన ప్రజలు.. భయంకరమైన కాల్పులతో ఒక్కసారిగా బయపడి పరుగులు తీశారు. ఆ సమయంలో చిన్నారులు కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇరాపువాటో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 12 మంది అక్కడికక్కడే మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షైన్బామ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ప్రకటించారు. దాడి వెనుక ఉద్దేశం.. దుండగుల వివరాలు తెలియరావాల్సి ఉంది. #Nacionales | 🚨❗ Lamentable... M@asacre en fiesta en Irapuato deja 10 personas sin vida, entre ellos un menor.Al menos 10 personas fueron asesinadas durante un ataque armado en la fiesta patronal de San Juan, en #Irapuato, #Guanajuato, informaron autoridades. Detalles:… pic.twitter.com/yQbGKMRKhE— Plano Informativo Aguascalientes (@planoags) June 25, 2025ఇదిలా ఉంటే.. క్రిమినల్ గ్రూపుల మధ్య తగాదాలతో గువానాజువాటో.. మెక్సికో క్రైమ్ ఏరియాగా పేరు ముద్రపడిపోయింది. గత నెలలో కూడా ఈ స్టేట్లో ఓ చర్చి కార్యక్రమంలో ఏడుగురు హత్య గురయ్యారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే ఈ రాష్ట్రంలో 1,435 హత్యలు నమోదయ్యాయి, ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెండింతల సంఖ్య కావడం గమనార్హం. -
Israel-Iran: అణుయుద్ధం.. నిజమెంత?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా మెరుపుదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ అర గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్పై 22 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అని!. ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవేంటో.. ఒక్కటొక్కటిగా చూద్దాం.1.ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి దౌత్యవర్గాల్లో అణుయుద్ధంపై చర్చ జరుగుతూనే ఉంది. దశాబ్దాల తరువాత మధ్యప్రాచ్య పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినపిస్తున్నాయి. అయితే ఆ దారుణం జరక్కుండా చూసేందుకు ప్రభుత్వాధినేతలు చాలామంది తమవంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. 2.‘‘అణుస్థావరాలపై అమెరికా దాడి యుద్ధం ప్రకటించడమే!’’ అని ఇరాన్ చెప్పడమే కాకుండా.. అణ్వాయుధాలకు సంబంధించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగే ఆలోచన కూడా చేస్తోంది. 1970 నుంచి అమల్లో ఉన్న ఈ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగడం అంటే.. ఇరాన్ తనకు నచ్చినట్టుగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకోగలదు. అణ్వాస్త్రాలూ తయారు చేసుకోగలదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) వంటి ఐరాస సంస్థల పర్యవేక్షణను అనుమతించదన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరాన్ మరింత వేగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.3. ఇదిలా ఉంటే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఏ దేశం ఎటువైపున ఉన్నదన్నది కూడా అణుదాడులు జరిగే అవకాశాలను నిర్ణయిస్తుంది. ఇరాన్పై అమెరికా దాడులను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు దేశాలూ ఇరాన్కు నేరుగా మిలటరీ సాయం చేసే స్థితికి చేరలేదు. టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరోవైపు భారత్సహా అనేక ఆసియా దేశాలు ఇరు పక్షాలకూ దూరంగా ఉంటున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇరుదేశాలకు సూచిస్తున్నాయి. 4. అమెరికా నిన్న ఇరాన్ అణు స్థావరాలపై బంకర్ బాంబులతో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఐఏఈఏ ఒక హెచ్చరిక చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇరాన్-ఇజ్రాయెల్ ప్రాంతంలో రేడియోధార్మిక ప్రభావం పెరిగిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణుస్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతాల్లో రేడియోధార్మిక పదార్థాలేవీ లేవని ఇరాన్ ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం. సరిగ్గా దాడులు జరిగే ముందే ఇరాన్ ఫర్డో స్థావరం నుంచి సుమారు 400 కిలోల యురేనియం (60 శాతం శుద్ధత కలిగినది. ఆయుధాల తయారీకి కనీసం 90 శాతం శుద్ధమైన యురేనియం 235 అవసరం.)ను అక్కడి నుంచి తరలించినట్లు వార్తలొచ్చాయి. ఇంకోపక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్ తన వైఖరిని సమర్థించుకోగా.. వాటిని సార్వభౌమత్వంపై దాడులుగా ఇరాన్ అభివర్ణించింది. మొత్తమ్మీద చూస్తే ప్రపంచం అణుయుద్ధపు అంచుల్లో ఉందని చెప్పలేము. ఇప్పటివరకూ యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలకే పరిమితమై ఉంది. మధ్యప్రాచ్య దేశాలు, రష్యా, చైనా వంటి అభివృద్ది చెందిన దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో మార్పు లేనంత వరకూ అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువే!. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
గాల్లో ఉండగా మంటలు.. 8 మంది దుర్మరణం
బ్రెజిల్ గగనతలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు చెలరేగి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. శాంటా కాటరినా రాష్ట్రం ప్రియాగ్రాండే నగరంలో శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. బెలూన్ గాల్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది నేలపై కూలిపోయింది. ఆ సమయంలో బెలూన్లో మొత్తం 22 మంది పర్యాటకులు ఉన్నారు. వాళ్లలో 13 మంది ప్రాణాలతో బయటపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.#Brazil: At least eight people have died following an accident involving a hot air balloon in the southern region of Santa Catarina.Governor Jorginho Mello said, rescue teams were searching for other people, as preliminary information indicated there were 22 people on board.… pic.twitter.com/usUJ3Mzfh0— All India Radio News (@airnewsalerts) June 21, 2025వారం కిందట సావో పాలో రాష్ట్రంలో కూడా ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. వారం వ్యవధిలో వరుస ఘటనల నేపథ్యంలో హాట్ ఎయిర్ బెలూన్ పర్యటనల భద్రతపై పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.🚨🇧🇷 BREAKING: A hot air balloon caught FIRE and CRASHED with 22 people on board in Santa Catarina, Brazil.🎥 Shocking footage shows one person jumping out to escape the flames mid-air.#Brazil #Balloon #SantaCatarina pic.twitter.com/fisGaJHjrd— Breaking News (@PlanetReportHQ) June 21, 2025 -
Donald Trump: అబ్బా.. ఏం గుండెరా వాడిది!
అమెరికా అధ్యక్ష భవనం చరిత్రలోనే తొలిసారి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హయాం ఓ అరుదైన ఘట్టానికి వేదికైంది. వైట్హౌజ్ ఆవరణలో రెండు భారీ జెండా స్తంభాలు ఏర్పాటు అయ్యాయి. పైగా అవి ప్రపంచంలోనే అత్యుత్తమ పోల్స్ అంటూ ట్రంప్ తనదైన శైలిలో ఓ ప్రకటన చేశారు కూడా.బుధవారం ఆ పోల్స్ను వైట్హౌజ్ భవనం బయట దక్షిణం వైపు, ఉత్తరం వైపు మరొకటి ఏర్పాటు చేయించారు(White House Huge Poles). ఆ మరుసటి రోజు అమెరికా జెండాను ఆవిష్కరించి.. సెల్యూట్ చేశారు. అయితే.. మొదటి టర్మ్(2013-2020) టైంలోనే ఇలా ఏర్పాటు ఎందుకు చేయించలేదని కొందరు మీడియా వాళ్లు అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ‘‘చాలా కాలం కిందటే ఇలా చేయాలని అనుకున్నా. తొలి టర్మ్లో అన్ని కళ్లు, వేళ్లు నా వైపే ఉండేవి. ఎక్కడ నేను దొరుకుతానా? అని విమర్శకులు వెంటాడేవాళ్లు. ఇప్పుడు నేనే అందరినీ వేటాడుతున్నా. చాలా తేడా ఉంది కదా. అందుకే ఇప్పుడు కుదిరింది’’ అని బదులిచ్చారు.అంతేకాదు.. రియల్టర్ అయిన ట్రంప్ ఆ పోల్స్ను ఎంపిక చేయడం మాత్రమే కాదు.. ఎక్కడ పాతాలో(ఏర్పాటు చేయాలో) కూడా స్వయంగా స్థలాన్ని సిబ్బందికి వెతికి చూపించారట. అయితే ఆ స్తంభాలను అక్కడ ఏర్పాటు చేసిన సిబ్బందిని అభినందించే క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పోల్స్ ఏర్పాటు చేసిన సిబ్బంది ఒక్కొక్కరిని పిలిచి ట్రంప్ కరచలనం చేశారు. ఆ సమయంలో వెనకాల.. ఓ క్రేన్ ఆపరేటర్(Crane Driver Trump Funny) కునుకు తీస్తూ కనిపించాడు. అయితే ట్రంప్ అది గమనించకుండా సిబ్బందితో ఫొటోలు దిగసాగారు. ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. అసలు అతగాడు ట్రంప్ ముందు అంత దర్జాగా ఆ పని ఎలా చేయగలిగాడంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు జస్ట్ మిస్ అంటూ కామెంట్ పెన్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి.. అతను ఇప్పుడు అసలు ప్రాణాలతో ఉన్నాడా? అని ఆరాలు తీస్తున్నారు.NEW: Crane operator appears to take a quick nap during the installation of President Trump's flag pole at the White House.The president was seen taking pictures with workers while the man sat back in the crane.Trump says the two large flag poles were his gift because it was… pic.twitter.com/QYZONrjlKO— Collin Rugg (@CollinRugg) June 18, 2025ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధికారంతో వైట్హౌజ్లో అడుగుపెట్టినప్పటి నుంచి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చిరాగానే.. ఓవల్ ఆఫీస్లో ఫొటోలన్నీంటిని మార్పించేశారు. పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నం ఫొటోను ప్రముఖంగా ఆఫీస్లో ఏర్పాటు చేయించుకున్నారు. జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రోజ్ గార్డెన్ను ఏర్పాటు చేయించారు. అయితే ఆ గార్డెన్లో నిర్మాణ పనులు జరపాలని ట్రంప్ తాజాగా ఆదేశించారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. అక్కడి గడ్డిలో హైహీల్స్తో నడిచేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారని!!. -
ఇజ్రాయెల్-స్ట్రైకర్.. ఇరాన్ ఫతా ఎంత డేంజరో తెలుసా?
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ ప్రజల పట్ల కనికరం చూపించే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఈ క్రమంలోనే శక్తివంతమైన హైపర్సోనిక్ మిస్సైల్స్ను ప్రయోగించినట్లు ప్రకటించారాయన. మరోవైపు.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా ‘ఫతా-1 మిస్సైల్స్’ను ప్రయోగాన్ని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ క్షిపణి అంత శక్తివంతమైందా? దాని సామర్థ్యం ఏపాటిదో ఓ లుక్కేద్దాం. ఫతా(Fattah) హైపర్సోనిక్ మిస్సైల్.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించుకుంది. అయితే ఈ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన పని. ఇరాన్ గతంలో రష్యా, చైనా వంటి దేశాలతో రక్షణ రంగంలో పరస్పర సహకారం కొనసాగించింది. బహుశా ఈ దేశాల భాగస్వామ్యంతోనే ఫతాను రూపొందించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే.. ఈ క్షిపణి అభివృద్ధితో అమెరికా, రష్యా, చైనా తర్వాత హైపర్సోనిక్ క్షిపణి కలిగిన నాలుగో దేశంగా ఇరాన్ నిలిచింది. అలాగని ఇజ్రాయెల్ మీదకు ఫతా హైపర్సోనిక్ మిస్సైల్స్ను ఇరాన్ ప్రయోగించడం ఇప్పుడే తొలిసారేం కాదు!. కిందటి ఏడాది అక్టోబర్ 1వ తేదీన జరూసలేం మీదకు ఈ క్షిపణలను ప్రయోగించినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇటు ఇరాన్, అటు ఇజ్రాయెల్ ఈ ప్రచారంపై ఇప్పటిదాకా మౌనం వీడలేదు. అయితే తాజాగా మాత్రం ఇరాన్ అధికారిక ప్రకటనతో వీటి ప్రయోగం జరిగిందన్న విషయం వెలుగు చూసింది. హైపర్సోనిక్ అనే పదాన్ని సాధారణంగా అత్యంత వేగమైన రవాణా వ్యవస్థకు ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాతి కాలంలో అది యుద్ధ రంగానికి అన్వయించడం మొదలుపెట్టారు. హైపర్ సోనిక్ మిస్సైల్స్ అంటే.. అత్యాధునికమైన క్షిపణులు అని అర్థం. ఇవి శబ్ధ వేగం కంటే అధిక రెట్లతో ప్రయాణిస్తాయి. అత్యంత వేగంతో ప్రయాణించడం వల్ల శత్రుదేశాలు గుర్తించడంగానీ, మార్గంమధ్యలోనే నాశనం చేయడంగానీ చాలా కష్టం. ఫతాను 2003లో ఇరాన్ ఆవిష్కరించింది. దీనికి ఆ పేరు పెట్టింది ఇరాన్ సుప్రీం ఖమేనీనే. దీని పొడవు 12 మీటర్లు. 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది చేధించగలదు. సుమారు 200 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. శబ్ద వేగం కంటే 13 నుంచి 15 రెట్లు అధికంగా ఇది ప్రయాణించగలదు. అంటే దాదాపు గంటకు 16,000–18,500 కిలోమీటర్లు వేగం ఉంటుందన్నమాట. ఇది హైపర్సోనిక్ గ్లైడ్ వెహికిల్ (HGV), హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ (HCV) లక్షణాలను కలిగి ఉంది. కానీ, ఫతా సామర్థ్యానికి సంబంధించిన సరైన వివరాలను ఇరాన్ ఇప్పటిదాకా వెల్లడించకపోవడం గమనార్హం. కాకుంటే.. ఐరన్ డోమ్, ఆరో లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్న ఇజ్రాయెల్కు సైతం ఈ క్షిపణి అంతు చిక్కదు. అందుకే ఇరాన్ దీనిని ముద్దుగా ఇజ్రాయెల్-స్ట్రైకర్ అని అభివర్ణిస్తుంటుంది. ఇజ్రాయెల్ మాత్రమే కాదు.. హిందూమహాసముద్రంలో సంచరించే అమెరికా యుద్ధ నౌకలను కూడా ఇది ఆనాశనం చేయగలదని ఇరాన్ తరచూ ధీమాగా చెబుతుంటుంది. తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల గగన తలాలను పూర్తిగా ఇరాన్ తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగిందంటే మాత్రం.. అందుకు ఫతాలాంటి హైపర్సోనిక్ మిస్సైల్ కారణం. -
ఏం జరగబోతోంది?.. ట్రంప్ గరం గరం.. సిట్యుయేషన్ రూమ్ రెడీ
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందనే భయాలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. జీ 7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా నిష్క్రమించడం.. పైగా ఆయన నేతృత్వంలోని సిట్యుయేషన్ రూమ్ హడావిడిగా సమావేశం అవుతుండడమే అందుకు కారణం. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించగా.. ఆ ప్రకటనను తోసిపుచ్చుతూ ‘అంతకు మించే జరగబోతోంది’ అని ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయి చేరుకున్న నేపథ్యంలో.. జీ7 సదస్సు నుంచి ముందుగానే ట్రంప్ నిష్క్రమించారు. పర్యటనను కుదించుకున్న ఆయన.. తాను జీ7 సదస్సు నుంచి వచ్చేలోపు సిట్యువేషన్ రూమ్లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలి(NSC)ని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరికొన్నిగంటల్లో ట్రంప్ చేరుకుంటారని, ఈ సమావేశం తర్వాత ఆయన కీలక ప్రకటన చేస్తారని వైట్హౌజ్ వర్గాలు వెల్లడించాయి.ట్రంప్ ఆఫర్ ఉత్తదే.. పరిస్థితి చేజారిందా?అంతకు ముందు.. ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణకు ట్రంప్ ఆఫర్ చేశారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అధికారికంగా ఓ ప్రకటన చేశారు. తొలుత కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుని.. ఆ తర్వాత సరిహద్దు చర్చలు ప్రారంభించాలని ట్రంప్ ప్రతిపాదించారని, అయితే ఈ ఆఫర్ను ఇరు దేశాలు అనుసరిస్తాయా? లేదా? అనేది చూడాలని మేక్రాన్ అన్నారు. అయితే.. మేక్రాన్ ప్రకటనను ట్రంప్ తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసమే మేక్రాన్ అలాంటి ప్రకటన చేసి ఉంటారని, అసలేం జరగబోతోందో ఆయన ఊహించలేరని, తాను వాషింగ్టన్ వెళ్లేది కాల్పుల విరమణ కోసం కాదని.. అంతకు మించిందే జరగబోతోందని ట్రంప్ సోషల్మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిణామాలపై ట్రంప్ గరం గరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో.. ఈ వారంలో న్యూక్లియర్ డీల్పై ఇరాన్ ప్రతినిధులతో ఆరో దఫా ట్రంప్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అలాంటి చర్చల ప్రస్తావన కనుమరుగైందని స్పష్టత ఇచ్చారాయన. ఇక.. టెహ్రాన్ను వీడాలని ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు పరిస్థితి చేజారిందనే సంకేతాలు అందిస్తున్నాయి. ట్రంప్ ఆ ప్రకటన చేసిన కాసేపటికే టెహ్రాన్లో బాంబుల వర్షం కురుస్తోందని సమాచారం. అమెరికా రంగంలోకి దిగి భారీ బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ అణుస్థావరాలపై ప్రయోగించవచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.ట్రంప్పై ఒత్తిడి..ఇరాన్ మాస్టర్ ప్లాన్గల్ఫ్ దేశాలతో ట్రంప్ను దారిలోకి తెచ్చేందుకు ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను ఆశ్రయించింది. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ దేశాలను ఇరాన్ కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని ఆ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
ఇదంతా ట్రంప్పై ద్వేషంతో చేసిందే!
లిబరేషన్ డే సుంకాలకు లైన్ క్లియర్ అయినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కోపం చల్లారలేదు. తన ప్రభుత్వం విధించిన సుంకాలు అమలుకాకుండా మాన్హట్టన్ ట్రేడ్ కోర్టు నిలుపుదల చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తీర్పు రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదని, అధ్యక్షుడి అధికారాలను న్యాయమూర్తులు అణగదొక్కారని మండిపడ్డారు.‘‘అంతర్జాతీయ వాణిజ్యపు న్యాయస్థానం అమెరికాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అదృష్టవశాత్తూ.. మాన్హట్టన్ వాణిజ్యపు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని 11 మంది న్యాయమూర్తులతో కూడిన ఫెడరల్ సర్క్యూట్ కోర్టు ఆదేశించింది. అసలు ఆ ముగ్గురు న్యాయమూర్తులు(మాన్హట్టన్ బెంచ్) ఎక్కడి నుంచి వచ్చారు?. అమెరికాకు తీవ్ర నష్టం చేకూర్చే పనిని చేయడం వాళ్లకు ఎలా సాధ్యమైంది?. ఇదంతా ట్రంప్పై ద్వేషంతో చేసిందే. ఇది తప్పుడు చర్య. రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదే’’ అని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో ట్రంప్ పలు దేశాలపై సుంకాలను(Liberation Day tariffs) విధించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని, దేశ వాణిజ్య విధానం తన వెర్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని కోరుకుంటున్నారంటూ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన మాన్హట్టన్ వాణిజ్య న్యాయస్థానం(Manhattan Trade Court).. సుంకాల విధింపునకు కత్తెర వేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని తేల్చిచెప్పింది. అయితే.. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం పలు దేశాలతో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ట్రంప్ సర్కారు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్ డీల్స్ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. కానీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో.. ‘‘టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారు’’ అని న్యాయధికారులు కోర్టుకు తెలిపారు. కానీ, ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు అమలుకాకుండా నిలుపుదల చేసింది. అయితే.. .. మాన్హట్టన్ కోర్టు ఆదేశాలపై ట్రంప్ సర్కారు అప్పీల్ దాఖలు చేసింది. గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. దీనిపై జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు స్పందించాలని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ట్రంప్ చెప్పేదొకటి.. చేసేదొకటి! -
ట్రంప్ పాలకవర్గం నుంచి మస్క్ ఔట్
ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్((Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మస్క్.. ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తన ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించి ఆయన ఓ పోస్ట్ చేశారు. ‘‘అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసింది’’ అని పోస్టులో పేర్కొన్నారాయన. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending. The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.— Elon Musk (@elonmusk) May 29, 2025ట్రంప్ ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయాలపై మస్క్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజా పన్నులు, వ్యయాల బిల్లులను తప్పు బట్టిన ఆయన.. ట్రిలియన్ డాఆర్ల పన్నులు వేయకపోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే.. రక్షణ రంగంపై వ్యయం పెంచడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో ట్రంప్ విధానాలు సరికావంటూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంతోనే ఆయన బాధ్యతల నుంచి తప్పుకుని ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం నుంచే ఎలాన్ మస్క్ను తన పాలక వర్గంలోకి తీసుకుంటానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్ను డోజ్ శాఖకు సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వశాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేసింది. ఈ క్రమంలో.. అటు డెమోక్రట్ల నుంచి మాత్రమే కాదు, ఇటు రిపబ్లికన్ల నుంచి కూడా మస్క్ వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయితే దీర్ఘకాలిక అభివృద్ధి కావాలంటే.. కొన్నింటిని వదులుకోవాలని మస్క్ తన చర్యలను సమర్థించుకున్నారు.ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇవన్నీ డోజ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. 2026 జులై 4వ తేదీలోపు మొత్తం ఫెడరల్ బ్రూరోక్రసీని ఇది ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్ దానికదే ఎక్స్పైరీ కానుంది. మస్క్ నిర్ణయంతో డోజ్కు ట్రంప్ కొత్త సారథిని నియమిస్తారా? లేదంటే ఆ వ్యవస్థను రద్దు చేస్తారా? అనేది వేచి చూడాలి.ఇదీ చదవండి: యువ పార్లమెంటేరియన్తో సీనియర్ అనుచిత ప్రవర్తన! -
తప్ప తాగి.. నాతో అనుచితంగా ప్రవర్తించారు
ఆయనో సీనియర్ పార్లమెంటేరియన్. చట్ట సభకు సంబంధించిన ఓ కార్యక్రమం జరుగుతోంది. ఆ ఈవెంట్లో పీకల దాకా తాగారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న యువ సభ్యురాలితో అనుచితంగా ప్రవర్తించారు. ఇది ఫిర్యాదు దాకా వెళ్లింది. సీనియర్ సభ్యుడొకరు తనను బాగా ఇబ్బంది పెట్టారని ఆస్ట్రేలియా స్వతంత్ర సెనేటర్ ఫాతిమా పేమన్(Fatima Payman) ఆరోపణలకు దిగారు. ఈ మేరకు పార్లమెంటరీ వర్క్ప్లేస్ సపోర్ట్ సిస్టమ్(PWSS)లో ఆమె ఫిర్యాదు కూడా చేశారు. ‘‘పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన బాగా తాగారు. నన్ను కూడా తాగి.. టేబుల్ ఎక్కడి డ్యాన్స్ చేయమంటూ బలవంతం చేయబోయారు. అయితే అందుకు నేను ఒప్పుకోలేదు. .. నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి అంటూ కటువుగానే ఆయనకు సమాధానం ఇచ్చా’’ ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. సదరు సీనియర్ సెనేటర్ పేరును ఆమె మీడియాకు ప్రస్తావించలేదు. అయితే ఆ వ్యాఖ్యలు మతపరంగా తన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు లైంగిక వేధింపుల కిందకు వస్తుందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన పీడబ్ల్యూఎస్ విచారణ జరుపుతామని ఆమెకు హామీ ఇచ్చింది.అఫ్గన్ సంతతికి చెందిన ఫాతిమా(30).. 2022లో లేబర్ పార్టీ(Labour Party) తరఫున వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి ఎన్నికయ్యారు. ఆ టైంలో అతి చిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. 2024లో పాలస్తీనా తీర్మానం సమయంలో ఆమె పార్టీ వైఖరికి విరుద్ధంగా ఓటేశారు. ఈ పరిణామంతో ఆమె లేబర్ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: ఇదేం చెండాలం?.. నడిరోడ్డు మీద డర్టీ పిక్చర్ -
సౌత్ కరోలీనా లిటిల్ రివర్లో కాల్పులు
కొలంబియా: అమెరికా రాష్ట్రం సౌత్కరోలీనా(South Carolina) తుపాకీ మోతలతో దద్దరిల్లింది. స్థానిక కాలమానం ప్రకారం.. లిటిల్ రివర్ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో 11 మంది గాయపడ్డారు. అయితే క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.మైర్టెల్ తీరానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది లిటిల్ రివర్(Little River) నగరం. ఆదివారం రాత్రి మెమోరియల్ డే సందర్భంగా పలువురు గుమిగూడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో పలువురు గాయపడినట్లు, ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రులకు చేరినట్లు హోరీ కౌంటీ పోలీసులు(Horry County Police) వెల్లడించారు. క్షతగాత్రుల పరిస్థితిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.మరోవైపు కాల్పులకు పాల్పడింది ఎవరు? అనుమానితుడికి సంబంధించిన వివరాలను సైతం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అయితే.. ఘటనా స్థలానికి పోలీసు వాహనాలు, ఆంబులెన్స్లు వెళ్లిన దృశ్యాలు మాత్రం మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: పుతిన్కు పిచ్చి.. నోరు జాగ్రత్త జెలెన్స్కీ! -
వంట కోసం బోటులో పొయ్యి వెలిగించిన మహిళ
మధ్య ఆఫ్రికా దేశం కాంగో(Democratic Republic of the Congo)లో ఘోరం జరిగింది. ప్రయాణికులతో నదిలో వెళ్తున్న ఓ భారీ బోటు అగ్నిప్రమాదానికి గురి కాగా.. 150 మందికి పైగా మృతి చెందారు. మరో వంద మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో బోటులో 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాంగో నార్త్వెస్ట్ రీజియన్లోని మటాన్కుము పోర్టు నుంచి బోలోంబా వైపు.. మంగళవారం వందల మందితో కూడిన భారీ చెక్కబోటు ‘హెచ్బీ కాంగోలో’ బయల్దేరింది. అయితే కాంగో నది మధ్యలోకి వెళ్లగానే హఠాత్తుగా బోటులో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయాణికుల్లో చాలామంది నీళ్లలోకి దూకేశారు. ఈత కొందరు కొందరు నీట మునిగి చనిపోగా.. మరికొందరు అగ్నికి ఆహుతి అయ్యారు. చెల్లాచెదురైన మరో వంద మందికి పైగా జాడ తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన వాళ్లకు ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్మయం కలిగించే విషయం ఒకటి తెలిసిందే. ప్రయాణికుల్లో ఓ మహిళ వంట చేసేందుకు ప్రయత్నించగా.. మంటలు చెలరేగినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సదరు మహిళ గ్యాస్ స్టౌవ్ అంటించగానే.. పేలుడు సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె అగ్నికి ఆహుతై అక్కడికక్కడే మరణించింది. ఇక.. కాంగోలో బోటు ప్రమాదాలు షరా మాములుగా మారిపోయాయి. At Least 148 Dead After Overcrowded Boat Capsizes In Congo@nitingokhale @SuryaGangadha13 @amitabhprevi @s_jkr #Congo #Africa https://t.co/em5A5kUqQZ— StratNewsGlobal (@StratNewsGlobal) April 19, 2025పాతవి, పాడైపోయిన పడవలను ప్రయాణాలకు వినియోగించడం, సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో కూడిన పడవ ప్రయాణాలే అందుకు కారణాలు. దీనికి తోడు ప్రయాణికుల భద్రత గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా బోటు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కిందటి ఏడాదిలో కాంగో వ్యాప్తంగా జరిగిన వేర్వేరు బోటు ప్రమాదాల్లో 400 మందికి పైనే మరణించారు. -
ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఆసక్తి పోయిందా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో యుద్ధం ఆపడం సాధ్యం కాకపోతే తమ ప్రయత్నాలు విరమించుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగించడం సాధ్యంకాని పక్షంలో.. చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు. ఇన్నాళ్లూ కేవలం ఉక్రెయిన్కు సాయం చేస్తున్నాం. ఇది మా యుద్ధం కాదు కాబట్టి ముగించాలనుకుంటున్నాం అని మార్కో రూబియో అన్నారు.ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యుద్ధాన్ని ఓ ముగింపునకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండబోరు. ఆయనకు ప్రపంచంలో ఇతర ప్రాధాన్యాలు కూడా ఉన్నాయి. చర్చల్లో గనుక పురోగతి కనిపించకపోతే ఆయన దీనిని వదిలేస్తానన్నారు అని రుబియో వెల్లడించారు.తాజాగా ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే ఇది సాకారం కావచ్చని పేర్కొన్నారు. అమెరికా ఓ శాంతిఒప్పందం ముసాయిదా తయారుచేసి ఐరోపా నేతలకు వెల్లడించింది. వారినుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక దీనినే మార్కో రూబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్కు వెల్లడించారు. -
టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్ ఖాన్, అలియా భట్, సాక్షి మాలిక్(రెజ్లర్) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. రేష్మా కేవలరమణి(52)టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?టైమ్ మ్యాగజైన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్ మ్యాగజైన్. అలా..అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్ చేసింది టైమ్ మ్యాగజైన్. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్ మ్యాగజైన్. -
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ, సాక్షి: లిబరేషన్ డే పేరిట.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ‘సుంకాల బాంబు’ పేల్చారు. ఈ క్రమంలోనే భారత్పై 26శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటించారు. దీంతో ట్రంప్ నిర్ణయంపై భారత్లో విశ్లేషణ మొదలైంది. అయితే ఇదేం మన దేశానికి ఎదురుదెబ్బ కాదంట!. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల(reciprocal tariffs) ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం లేకపోలేదు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల (Tariffs) తగ్గింపును ట్రంప్ ప్రభుత్వం పునఃపరిశీలించే నిబంధన కూడా ఉంది. కాబట్టి ఇది మిశ్రమ ఫలితమే అవుతుంది తప్ప.. భారత్కు ఎదురుదెబ్బ కాదు అని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.ఎప్పటి నుంచి అమలు.. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో..) ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేశారు. తాను విధించిన టారిఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. కానీ, 26 శాతం టారిఫ్లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతోంది. లిబరేషన్ డే పేరిట ట్రంప్ చేసిన ప్రకటన సారాంశం.. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందే. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర విధిస్తున్నాం. భారత్ మా ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, మేం 26% సుంకం విధిస్తున్నాం. ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్ల ప్రకటన చేసే వేళ భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు.ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనకు ముందు గతంలో భారతీయ దిగుమతులపై అమెరికా చాలా తక్కువ సుంకాలను విధిస్తూ వచ్చింది. విదేశీ తయారీ ఆటోమొబైల్స్పై కేవలం 2.5% సుంకాలను, దిగుమతి చేసుకున్న మోటార్సైకిళ్లపై 2.4% సుంకాలను మాత్రమే విధించాయి. అయితే భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 52% సుంకాలను వసూలు చేస్తోందన్నది ట్రంప్ వాదన.నీ క్రమంలోనే ఇప్పుడు 26 శాతం టారిఫ్ను ప్రకటించారు. -
భూకంప శిథిలాల నుంచి కీలక పత్రాల చోరీ?
బ్యాంకాక్: థాయ్లాండ్ భూకంప సహాయక చర్యల్లో.. కొత్త కోణం వెలుగు చూసింది. రాజధాని బ్యాంకాక్(Bangkok Building Collapse)లోని 33 అంతస్థుల భవనం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రమాద స్థలి నుంచి కొన్ని పత్రాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కొందరు ప్రయత్నించగా.. సహాయక బృందాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేయగలిగారు. అయితే ఆ ఐదుగురు చైనాకు చెందిన వాళ్లు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చైనా(China)కు చెందిన రైల్వే నంబర్ 10 కంపెనీ 2018లో థాయ్లాండ్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. హౌజింగ్ సొసైటీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఇతర బడా కాంట్రాక్టులను ఈ కంపెనీ స్థానిక కంపెనీలతో జాయింట్ వెంచర్గా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో థాయ్లాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కోసం సుమారు 58 బిలియన్ డాలర్లతో మూడేళ్ల కిందట పనులు చేపట్టారు.తాజా భూకంపం(Earthquake) ధాటికి నిర్మాణంలో ఉన్న ఆ భవనం కుప్పకూలిపోగా.. శిథిలాల నుంచి ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇంతకంటే ఎక్కువ ఎత్తులో భవనాలకు ఏం కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజైనింగ్లో లోపాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాల నడుమే.. థాయ్లాండ్ ఉప ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్ సైతం ప్రమాద స్థలిని సందర్శించి దర్యాప్తునకు ఆదేశించారు. ఈలోపు.. ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన పత్రాలను దొంగిలించేందుకు యత్నాలు జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. భవన శిథిలాల వద్దకు ఆదివారం ఐదుగురు వ్యక్తులు అనుమతి లేకుండా లోనికి ప్రవేశించారు. శిథిలాల నుంచి కొన్ని పత్రాలను తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా రెస్క్యూ టీంలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పాయి. వారిని ప్రశ్నించగా.. చైనా దేశస్థులని తెలిసింది. అయితే.. అందులో ఒకరు తాను ప్రాజెక్ట్ మేనేజర్ అని, బీమా క్లెయిమ్ చేసుకోవడం కోసం సంబంధిత పత్రాలు తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఈ కంపెనీ ‘నాసిరక నిర్మాణాల’తో వార్తల్లోకి ఎక్కింది. అయితే ఆయా ఘటనలతో ప్రమాదవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలను ఈ చైనా కంపెనీకి అప్పగించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక శుక్రవారం మధ్యాహ్నాం మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం ధాటికి.. పొరుగున ఉన్న థాయ్లాండ్లోనూ భారీగా భూమి కంపించింది. రాజధాని బ్యాంకాక్లో పలు భవనాలు కుప్పకూలిపోవడంతో.. ఇప్పటిదాకా 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. -
యూఏఈ: 500 మందికి పైగా భారతీయులకు క్షమాభిక్ష
అబుదాబి: భారత్తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్కు చెందిన వాళ్లే 500 మందికి పైగా ఉండగా.. వాళ్లంతా జైళ్ల నుంచి విడుదలైనట్లు సమాచారం. రంజాన్ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడి జైళ్లలో ఉన్న 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు తాజా క్షమాభిక్ష వర్తిస్తుందని అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సమ్ ఇస్సా అల్ హుమైదాన్ ప్రకటించారు. రంజాన్ మాసం సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం.. విడుదల చేయడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆయా ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. -
పవర్ కట్తో లండన్ హీథ్రో ఎయిర్పోర్టు మూసివేత
లండన్: భారీ అగ్నిప్రమాదంతో పవర్ కట్ చోటు చేసుకోగా హీథ్రో ఎయిర్పోర్టు మూతపడింది. రెండు రోజులపాటు విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. ప్రయాణికులెవరూ ఎయిర్పోర్ట్ వైపు రాకూడదని విజ్ఞప్తి జారీ చేశారు. ఎయిర్పోర్టుకు విద్యుత్ సరఫరా చేసే ఓ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్లో అగ్నిప్రమాదం చెలరేగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లండన్ బరో ఆఫ్ హిల్లింగ్డన్లోని హయేస్లో ఉన్న ఓ సబ్స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో హీథ్రో ఎయిర్పోర్టుతో పాటు సుమారు 16 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విదుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో కార్యకలాపాలు నిలిచిపోగా.. అధికారులు ఎయిర్పోర్టు మూసేశారు. పలు విమానాలు దారి మళ్లగా.. తిరిగి సేవలను పునరుద్ధరించే అంశంపై నిర్వాహకులు స్పష్టమైన ప్రకటన మాత్రం చేయలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవర్ కట్కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోవడంపై జోకులు పేలుస్తున్నారు.మరోవైపు అగ్నిప్రమాదం కారణంగా చెలరేగిన పొగ, ధూళితో బరో ఆఫ్ హిల్లింగ్డన్ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్లను, 200 సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు.. దట్టమైన పొగ అలుముకోవడంతో ఎవరూ బయటకు రావొద్దని.. తలుపులు, కిటికీలు మూసే ఉంచాలని అధికారులు స్థానికులకు సూచించారు.ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో హీథ్రో ఎయిర్పోర్టు ఒకటి. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి ప్రయాణించేవాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. OAG అనే సంస్థ గణాంకాల ప్రకారం.. కిందటి ఏడాది రద్దీ ఎయిర్పోర్టుల జాబితాలో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. అయితే తాజా అగ్ని ప్రమాదంతో సోషల్ మీడియాలో ఈ ఎయిర్పోర్టుపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.Due to a fire at an electrical substation supplying the airport, Heathrow is experiencing a significant power outage.To maintain the safety of our passengers and colleagues, Heathrow will be closed until 23h59 on 21 March. Passengers are advised not to travel to the airport… pic.twitter.com/7SWNJP8ojd— Heathrow Airport (@HeathrowAirport) March 21, 2025 -
డొనాల్డ్ ట్రంప్ మరో ‘సంచలన’ సంతకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం అమలు దిశగా అడుగు వేశారు. ఆ దేశ విద్యాశాఖ(Department of Education) మూసివేత ఉత్తర్వులపై సంతకం చేశారు. నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా అమెరికాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదని, ఇంకా యూరప్ దేశాలు.. చైనా కంటే వెనుకబడే ఉన్నామని, కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారాయన. అయితే.. విద్యార్థులకు ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగిస్తామని అన్నారాయన.గురువారం వైట్హౌజ్లోని ఈస్ట్ రూమ్లో స్కూల్ పిల్లల మధ్య డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కూర్చుని ఈ ఉత్తర్వులపై ప్రత్యేక వేడుకలో సంతకం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ లీడర్లు, పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు. విద్యాశాఖ విభాగాన్ని మూసివేస్తూ.. ఆ అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించండి అని విద్యాశాఖ కార్యదర్శి, డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో లిండా మెక్ మహోన్(Linda McMahon)కు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాకు లిండా మెక్ మహోన్నే చివరి విద్యాశాఖ కార్యదర్శి కావొచ్చని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. మార్చి 3వ తేదీన ఆమె ఆ బాధ్యతలను స్వీకరించడం గమనార్హం.అమెరికాలో 1979 నుంచి విద్యాశాఖ విభాగాన్ని ఫెడరల్ గవర్నమెంట్ చూసుకుంటోంది. విద్యాశాఖ నిర్వహణలో పరిమితమైన పాత్రే పోషిస్తున్నప్పటికీ.. ఫండింగ్ విషయంలో మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే.. తాజా ట్రంప్ ఆదేశాలతో ఇక నుంచి స్టేట్స్(రాష్ట్రాలు) ఆ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు డెమోక్రట్లు, అటు విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇది ట్రంప్ తీసుకున్న మరో వినాశకార నిర్ణయమని డెమోక్రట్ సెనేటర్ చుక్ షూమర్ అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే.. ట్రంప్ తాజా నిర్ణయం అమల్లోకి రావడం అంత సులువు కాదు. ఎందుకంటే.. అందుకు పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. కానీ, ట్రంప్ మాత్రం వీలైనంత త్వరలో ఈ ఉత్తర్వులను ఆచరణలోకి తెస్తామని చెప్తున్నారు. ఎన్నికల సమయంలో తన ప్రచారంలోనూ ట్రంప్ ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేస్తానని ప్రకటించడం తెలిసిందే. అధికారంలోకి వచ్చాక.. డోజ్(DOGE) విభాగం ద్వారా అనవసరపు ఖర్చులు తగ్గించుకునేందుకు పలు విభాగాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ సాయం తీసుకుంటున్నారాయన. -
మస్క్పై వ్యతిరేకత.. టెస్లా షోరూంలపై కొనసాగుతున్న దాడులు
సలమ్: అమెరికాలో టెస్లా షోరూంపై మళ్లీ దాడి జరిగింది. ఒరెగాన్లోని షోరూమ్పై గురువారం కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం కాగా.. పలు వాహనాలు సైతం దెబ్బ తిన్నాయి. అయితే అదృష్టం కొద్దీ ఎవరికీ హాని జరగలేదు. వారం వ్యవధిలో ఇదే షోరూమ్పై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఇలాన్ మస్క్(Elon Musk) కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఆయన డోజ్ ఓవెల్ ఆఫీస్లో అడుగుపెట్టారో.. అప్పటి నుంచి ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. డోజ్(DOGE) చీఫ్ పేరిట ఫెడరల్ ఉద్యోగుల తొలింపు చర్యలతో ఆ వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన సీఈవోగా వ్యవహరిస్తున్న టెస్లా కంపెనీ లక్ష్యంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీన ఒరెగాన్(Oregon) పోర్ట్లాండ్ సబర్బ్ అయిన టిగార్డ్లోని టెస్లా డీలర్షిప్పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొలరాడో లవ్ల్యాండ్లోని షోరూమ్ను ఓ మహిళ ధ్వంసం చేసింది. ఆపై మస్క్ వ్యతిరేక రాతలు రాసి.. బొమ్మలు గీసిందిబోస్టన్లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్కు దుండగుల నిప్పుసియాటెల్లో టెస్లా వాహనాలకు మంట పెట్టిన ఆగంతకులువాషింగ్టన్ లీన్వుడ్లో టెస్లా సైబర్ ట్రక్కులపై స్వస్తిక్ గుర్తులతో పాటు మస్క్ వ్యతిరేక రాతలుమార్చి 13వ తేదీన.. ఒరెగాన్ టిగార్డ్ షోరూంపై మరోసారి కాల్పులు.. షోరూం ధ్వంసంవారం వ్యవధిలో రెండుసార్లు ఒరెగాన్ షోరూంపై దాడి జరిగింది. దీంతో ఎఫ్బీఐ, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పని చేస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు టెస్లాపై జరుగుతున్న దాడులను దేశీయ ఉగ్రవాదంగా(Domestic Terrorism) అభివర్ణించిన ట్రంప్.. ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని చెబుతున్నారు. ఇలాంటి చర్యలు ఓ గొప్ప కంపెనీకి తీరని నష్టం కలిగిస్తాయని.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మస్క్ కంపెనీలు అందిస్తున్న సేవలు మరిచిపోకూడదని ట్రంప్ చెబుతున్నారు.#ICYMI Two people were federally charged in separate incidents of attacks on Tesla dealerships in Colorado and Oregon.@ATFDenver @FBIDenver @PoliceLoveland investigating: https://t.co/HExwL3I3Z4@ATF_Seattle @FBISeattle @SalemPoliceDept investigating: https://t.co/YXkpdAhJQi pic.twitter.com/Ll7KD0af5k— ATF HQ (@ATFHQ) March 14, 2025 -
William Alsup: ట్రంప్, మస్క్లకు గట్టి దెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగానికి న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. ఉద్యోగాల్లోంచి తీసేసిన వేల మంది ఫెడరల్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయమూర్తి విలియమ్స్ అల్సప్ ఆదేశాలు జారీ చేశారు.మొత్తం ఆరు ఫెడరల్ ఏజెన్సీల నుంచి తొలగించిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారాయన. ఉద్యోగాల్లో ప్రదర్శన ఏం బాగోలేదని చెబుతూ.. ఇలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని డోజ్ విభాగం వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా బూటక చర్యగా అభిప్రాయపడ్డ జడ్జి విలియమ్స్ అల్సప్(William Alsup).. వెంటనే వాళ్లను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశించారు. చట్టానికి విరుద్ధంగా ఉద్యోగులను తొలగించారంటూ.. ఓపీఎం(Office of Personnel Management) ఆదేశాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పాటు మరికొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే OPM చర్యలు కేవలం మార్గదర్శకత్వం మాత్రమేనని, అత్యవసర సిబ్బందిని తొలగించలేదని న్యాయశాఖ వాదనలు వినిపించింది. ఈ వాదనను ఏకీభవించని జడ్జి విలియమ్స్ అల్సప్.. ఆ ఆదేశాలను నిలుపుదల చేస్తూ తక్షణమే ఆ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. సైన్య వ్యవహారాలు, వ్యవసాయం, రక్షణ, ఖజానా శాఖ.. ఇలా మొత్తం ఆరు శాఖల ఉద్యోగాలను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారాయన. అయితే ఈ ఆదేశాలు అన్ని ఫెడరల్ ఏజెన్సీలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఉద్యోగాల తొలగింపు తననూ బాధించిందని.. కానీ వాళ్లలో చాలామంది పని చేయలేకపోయారని.. అందుకే ఉత్తమ ప్రదర్శన ఉన్నవాళ్లను మాత్రమే కొనసాగిస్తున్నామని ట్రంప్ బుధవారం వ్యాఖ్యలు చేశారు. ఆ మరుసటి రోజే కాలిఫోర్నియా జడ్జి ఈ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. అయితే ట్రంప్ సర్కార్ ఈ ఆదేశాలను సవాల్ చేసే అవకాశం లేకపోలేదు. ఎవరీ జడ్జి?79 ఏళ్ల విలియమ్స్ అల్సప్ సీనియర్ న్యాయమూర్తి. హార్వార్డ్ నుంచి న్యాయవిద్య పూర్తి చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి విలియమ్ డగ్లస్కు 1971-72 మధ్య క్లర్క్గా పని చేశారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో కరోలినా నార్త్ డిస్ట్రిక్ జడ్జిగా నియమించబడ్డారు. 2021 జనవరిలో సీనియర్ హోదా దక్కింది ఆయనకు. డోజ్ విమర్శలపై మస్క్అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE) సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇలా డోజ్కి లక్ష్యాలను ఇచ్చారు. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. ఈ క్రమంలోనే గత రెండు నెలల కాలంలోనే 62,530 మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు. అయితే నాసా, విద్యా శాఖ, సైన్య విభాగాలపై ఈ తొలగింపులు ప్రభావం చూపించాయి. ఈ తొలగింపులు ఇలాగే కొనసాగితే.. నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతుందని.. ఈ ఏడాది చివరికల్లా ఆ సంఖ్య ఐదు లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుందని అక్కడి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. -
గాజా ప్లాన్పై ట్రంప్ రివర్స్ గేర్
వాషింగ్టన్: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో శిథిలమైన గాజాను స్వాధీనం చేసుకుని పునర్ నిర్మిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారింది కూడా. గాజాలో ఉన్న లక్షల మంది పాలస్తీనా ప్రజలు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా తరలి వెళ్లాల్సిందేనని అన్నారాయన. అయితే.. హఠాత్తుగా ఆయన యూటర్న్ తీసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శిథిలమైన గాజాను పునర్ నిర్మించే ప్రణాళికలో భాగంగా ఎవరినీ బహిష్కరించమని ట్రంప్ ఇప్పుడు అంటున్నారు. బుధవారం ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్(Micheál Martin)తో ఆయన వైట్హౌజ్లో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గాజా నుంచి బహిష్కరణలు ఉండబోవని అన్నారు. ఈ సందర్భంగా.. యూఎస్ సెనెట్ మైనారిటీ నాయకుడు చక్ షూమర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారాయన. గతంలో ఆయన(చక్ షూమర్) యూదుడైనప్పటికీ.. ఇప్పుడు మాత్రం పాలస్తీనియన్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కిందటి నెలలో ఇదే అంశంపై ఆయన తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి చర్చకు దారి తీశారు కూడా. అయితే.. గాజాలో మానవతా సాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్ అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణతో పాటు హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు. అయితే ట్రంప్ గాజా ప్లాన్ను ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) తిరస్కరించింది. ప్రతిగా.. ఈజిప్ట్ ప్రతిపాదిస్తున్న ప్రణాళికకు మద్దతు ఇచ్చింది.గాజా యుద్ధం.. మధ్యలో ఐర్లాండ్గాజాలో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్కు ఐర్లాండ్కు మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. గతంలో.. గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతకు పాల్పడుతోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా ఓ కేసు వేయగా.. అందులో జోక్యం చేసుకోవాలని ఐర్లాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిగాకిందటి ఏడాది డిసెంబరులో ఐర్లాండ్లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు టెల్అవీవ్(ISRAEL) ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో ట్రంప్-మార్టిన్ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక.. భవిష్యత్తు గాజా పేరిట ట్రంప్ పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియోనూ సైతం ట్రంప్ విడుదల చేయగా అది తీవ్ర విమర్శలకు తావు ఇచ్చింది. హమాస్ సంస్థ సైతం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పుపట్టింది. గాజా పాలస్తీనాలో విడదీయలేని భాగమని.. కొనుగోలు చేసి.. అమ్మడానికి అదేం స్థిరాస్తి కాదని ప్రకటించింది. అదే సమయంలో ఆ వీడియోను సృష్టించిన డిజైనర్.. అది కేవలం పొలిటికల్ సెటైర్ మాత్రమేనని ప్రకటన చేశాడు. -
రాజా.. ఐ లవ్ యూ రాజా!
బూజు పట్టిన రాజరికాన్ని నేపాల్ ప్రజలు 19 ఏళ్ల క్రితమే వదిలించుకున్నారు. నాటి నాటకీయ పరిణామాలతో రాజు జ్ఞానేంద్ర షా (77) చేసేది లేక గద్దె దిగాడు. కిరీటం పక్కన పెట్టి, సింహాసం దిగి, రాజదండం వదిలేసి మాజీ అయ్యాడు. రాజభవనం ‘నారాయణ్ హితి ప్యాలెస్’ను ఖాళీ చేశాడు. సాధారణ పౌరుడిగా జీవనం ఆరంభించాడు. ఇదంతా పాత ముచ్చట. కొందరు నే’పాలితులు’ మళ్లీ ఇప్పుడు ‘రాజరికమే ముద్దు’ అంటున్నారు. రాజు పరిపాలనే కావాలని కోరుకుంటున్నారు. మాజీ రాజు జ్ఞానేంద్ర షా(Gyanendra Shah) ఇటీవలి కాలంలో దేశంలో పర్యటిస్తున్నారు. పశ్చిమ నేపాల్ తీర్థయాత్రలు ముగించుకుని రెండు నెలల అనంతరం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆదివారం పది వేల మంది మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ‘దేశాన్ని మీరే కాపాడాలి’ అంటూ ఆయనను ఉద్దేశించి నినాదాలతో హోరెత్తించారు. ‘రాజు కోసం రాజభవనాన్ని ఖాళీ చేయాలి. రాజు మళ్లీ రావాలి. మాకు రాజరికమే(Monarchy) కావాలి. మా రాజు చిరకాలం జీవించాలి’ అని వారంతా గళమెత్తారు. హిందూ మతాన్ని మళ్లీ దేశ అధికారిక అభి‘మతం’గా మార్చాలని డిమాండ్ చేశారు. జ్ఞానేంద్ర ఎలాంటి వ్యాఖ్యలూ లేకుండానే వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు.జ్ఞానేంద్ర మామూలోడు కాదురాజభవనంలో తమ కుటుంబ సభ్యుల ఊచకోత దుర్ఘటన దరిమిలా.. 2002లో జ్ఞానేంద్ర షా నేపాల్ రాజు అయ్యారు. అప్పటినుంచి దేశ రాజ్యాంగాధినేతగా నామమాత్ర అధికారాలతో నెట్టుకొచ్చిన ఆయన.. 2005లో రాజకీయ, కార్యనిర్వహణాధికారాలను కూడా సొంతం చేసుకుని సంపూర్ణాధికారం చేజిక్కించుకున్నారు. ప్రభుత్వాన్ని, పార్లమెంటును రద్దు చేయడమే కాకుండా రాజకీయ నాయకులు, జర్నలిస్టులను జైళ్లలో పెట్టించారు. సమాచార వ్యవస్థలను స్తంభింపజేసి, అత్యయిక పరిస్థితి ప్రకటించారు. తన ఏలుబడికి వీలుగా సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఈ ఘటనలు ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతను ఎగదోశాయి. 2006లో దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలు మిన్నుముట్టడంతో జ్ఞానేంద్ర సింహాసనం దిగారు. దేశంలో 240 ఏళ్లుగా కొనసాగుతున్న హిందూ రాజరికాన్ని రద్దు చేయాలని నేపాల్ పార్లమెంటు 2008లో నిర్ణయించడంతో ఆయన రాయల్ ప్యాలెస్ విడిచిపెట్టారు. అలా నేపాల్ 2008లో లౌకిక, గణతంత్ర రాజ్యమైంది. అయితే.. తమ గణతంత్ర రాజ్యం అనుకున్నంత ‘ఘన’తంత్రంగా లేదంటూ నేపాల్ ప్రజల్లో తాజాగా అసమ్మతి పెచ్చరిల్లుతోంది. దేశంలో రాజకీయ అస్థిరత వేళ్లూనుకుందని, అవినీతి అర్రులు చాచి విచ్చలవిడిగా పెరిగిందని, ఆర్థిక రంగం కుదేలైందని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజరికం రద్దయిన 2008వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు దేశంలో 13 ప్రభుత్వాలు మారడమే రాజకీయ అస్థిరతకు తార్కాణమని అసంతృప్తవాదులు మండిపడుతున్నారు. దేశం మరింత పతనావస్థకు దిగజారకుండా ఉండాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని వారు అభిలషిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో రాజరిక వ్యవస్థకు మళ్లీ అవకాశం లేదని నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి సహా పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.మావోయిస్టు ప్రధానిగా ప్రచండ!ఇప్పుడు మనం చూస్తున్న హిమ రాజ్యం నేపాల్(Nepal) ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఆ చిన్న ముక్కలన్నిటిని రాజు పృథ్వీనారాయణ్ షా 1768లో ఏకీకృతం చేసి ‘నేపాల్ సామ్రాజ్యం’గా మార్చారు. 1800 సంవత్సరం నుంచి రాజప్రతినిధులు, ప్రధానమంత్రులు నియమితులై షా వంశ రాజుల పేరిట అధికారం చెలాయిస్తూ వచ్చారు. అప్పట్లో రాజు పదవి లాంఛనప్రాయం. తన పూర్వీకుల మాదిరిగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూనే రాజు త్రిభువన్ షా 1950లో ‘రాజకీయ పాత్ర’ను కూడా కొత్తగా తలకెత్తుకున్నారు. ఇక నాటి నుంచి 2006లో ‘రాజు పదవీచ్యుతి ఉద్యమం’ కొనసాగే వరకు షా వంశ రాజులు రాజకీయాధికారం కూడా చెలాయించారు. త్రిభువన్ షా కుమారుడు మహేంద్ర షా ఆధునిక నేపాల్ రూపశిల్పి. ‘హిందూ రాజరికం’ భావనకు కూడా ఆయనే మార్గదర్శి. తదనంతర కాలంలో ప్రజల నుంచి ఎదురైన నిరసనలను దృష్టిలో ఉంచుకున్న రాజు బీరేంద్ర షా 1990లో ‘సంపూర్ణ రాజరికం నుంచి రాజ్యాంగ రాజరికానికి’ నేపాల్ పరివర్తన చెందేందుకు అంగీకరించి, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుతో అధికారం పంచుకోవడానికి సంసిద్ధుడయ్యాడు. ఇలా రాజీ కుదిరినా ప్రజల్లో అసమ్మతి సెగ మాత్రం చల్లారలేదు. 1990వ దశకం మధ్యలో దేశంలో మావోయిస్టుల తీవ్రవాదం విస్తరించింది. ‘ప్రచండ’గా సుప్రసిద్ధుడైన మావోయిస్టు ఉద్యమ నేత పుష్పకమల్ దహాల్ ఆ తర్వాత దేశ ప్రధానమంత్రి అయ్యాడు.రాజకుటుంబంలో రక్తపాతం!2001లో నేపాల్ రాజభవనంలో చోటుచేసుకున్న మారణకాండలో రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య, మరో ఎనిమిది మంది రాజ కుటుంబీకులు హత్యకు గురయ్యారు. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఇంటి పెద్దలు అంగీకరించకపోవటంతో యువరాజు దీపేంద్ర ఆగ్రహించి మద్యం మత్తులో తన కుటుంబ సభ్యులను చంపడమే కాకుండా తానూ తుపాకితో కాల్చుకుని మరణించాడు. ఈ పరిణామం తర్వాత జ్ఞానేంద్ర షా రాజు అయినప్పటికీ ఆయన పదవీకాలం స్వల్పమే. జ్ఞానేంద్రకు తాజాగా ఖాట్మండు విమానాశ్రయం వద్ద స్వాగతం పలకాలని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా సామాజిక మాధ్యమాల వేదికగా నేపాలీలకు పిలుపునివ్వడం కొసమెరుపు! దేశంలో ఎన్నికైన తొలి ప్రధానమంత్రి బి.పి.కొయిరాలాకు మనీషా స్వయానా మనవరాలు. ::జమ్ముల శ్రీకాంత్(Courtesy: CNN, The Times of India, WION, India Today, Al Zazeera) -
స్వర్గం భూమ్మీదకు వచ్చిందా?.. అందాల లోకం.. వారెవ్వా వనాటు
స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?. ఎవరో వర్ణిస్తే కానీ ఊహించుకోవడం తప్పించి!. ఒకవేళ అది భూమ్మీద గనుక ఉంటే.. అది అచ్చం ‘వనాటు’(Vanuatu)లాగే ఉంటుందని లలిత్ మోదీ అంటున్నారు. ఐపీఎల్ సృష్టికర్త కారణంగా ఇప్పుడు ఈ దేశం పేరు తెగ వినిపించేస్తుండగా.. దాని గురించి వెతికే వాళ్ల సంఖ్యా ఒక్కసారిగా పెరిగిపోయింది.ఆర్థిక నేరగాడికి అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్ పారిపోయారు. అయితే ఆయన్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు భారత్ ముమ్మరంగా చేయగా.. ఆయన తెలివిగా వనాటు పౌరసత్వం పొందారు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు వనాటు ప్రధాని జోథం నపాట్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే.. ఎక్స్ వేదికగా లలిత్ ఓ పోస్ట్ చేశారు.‘‘వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే’’ అని సందేశం ఉంచారు. దీంతో నెటిజన్స్ ఆయన కామెంట్ సెక్షన్లో సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వనాటు అందాల గురించి ఆరా తీస్తున్నారు.వనాటు.. ఎక్కడుంది?ఉత్తర ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉంది ఈ ద్వీప దేశం. మొత్తం 83 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా వై(Y) ఆకారంలో ఉంటుందీ దేశం. ఇందులో 65 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. ఎఫేట్ ఐల్యాండ్లో ఉండే పోర్టువిల్లా నగరం ఆ దేశ రాజధాని. పశ్చిమంగా ఫిజీ దేశం, ఇతర దిక్కుల్లో సాలామాన్ ద్వీపాలు, న్యూ కాలేడోనియా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ఫ్రెంచ్ సంయుక్త పాలనలో ఇది బానిస దేశంగా ఉండేది. 1980 జులై 30న వనాటు స్వాతంత్రం పొందింది. కరెన్సీ వనాటు వాటు. ప్రస్తుత జనాభా దాదాపు మూడున్నర లక్షలు. ‘‘దేవుడితో మేం నిలబడతాం’’ అనేది ఆ దేశపు నినాదం.అగ్నిపర్వతాలు.. భూకంపాల నేలఈ ద్వీప దేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్రియాశీలకంగా కూడా ఉన్నాయి. సంవత్సరంలో సుదీర్ఘంగా వేసవి వాతావరణంతో పొడిగా ఉంటుంది అక్కడ. అయితే నవంబర్-ఏప్రిల్ మధ్య వర్షాలు, తుపాన్లు సంభవిస్తుంటాయి. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండడం మూలంగా భూ కంపాలు షరామాములుగా మారాయి. అయితే కిందటి ఏడాది డిసెంబర్లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ భూకంపంలో 14 మంది చనిపోగా.. 265 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందాల లోకం.. వనాటులో ఉన్న వృక్ష, జంతు సంపద అత్యంత అరుదైంది. ఈ భూమ్మీద ఎక్కడా కనిపించని జీవ జాతులు ఉన్నాయక్కడ. ఎటు చూసినా.. దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన సముద్రం.. నిర్మానుష్యమైన తీరాలు, కొన్ని ద్వీపాల్లో లాగున్లూ.. ఓ ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం.. వనాటును ప్రపంచ పర్యాటక జాబితాలో ‘ప్యారడైజ్ ఆఫ్ ది ఎర్త్’గా నిలబెట్టాయి.టూరిజం కోసమే..టూరిజం, వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. అలాగే జనాభాలో గ్రామీణ జనాభా ఎక్కువ. 80 శాతం వ్యవసాయమే చేస్తుంటారు. కావా పంట ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడీపీలో 65 శాతంగా ఉంది. పర్యాటకం మీద ఆధారపడిన ప్రజలు కావడంతో.. పర్యాటకులను మర్యాదలతో ముంచెత్తారు. అలాగే.. సంప్రదాయాలకు అక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తుంటారు. పెంటెకాస్ట్ ఐల్యాండ్లో స్థానికులు ల్యాండ్ డైవింగ్ క్రీడ నిర్వస్తుంటారు. బొంగులలాంటి నిర్మాణలను ఎత్తుగా పేర్చి.. చెట్ల తీగలతో సాయంతో బంగీ జంప్లా కిందకు దూకుతారు. ఎవరి తల భూమికి మొదట తాకితే వాళ్లు విజేతలు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల్లో.. పాపం ఒక్కోసారి ప్రాణాలు పొగొట్టుకుంటారు కూడా. పన్నులు లేవు, కానీ..వనాటులో ఎలాంటి పన్నులు విధించరు. ఈ కారణంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఈ దేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అదే టైంలో.. వనాటు ఆర్థిక నేరాలకు అడ్డా కూడా. మనీలాండరింగ్కు సంబంధించిన చట్టాలు కూడా అక్కడ బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం. ఆర్థిక నేరాలతో పాటు డ్రగ్స్.. ఆయుధాల అక్రమ రవాణాలకు ఇది అడ్డాగా మారింది. ఈ కారణంగానే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ దేశాన్ని గ్రే లిస్ట్లో చేర్చింది. అలాగే.. 2017లో వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్స్ లీక్.. అక్కడి అక్రమ సంపద వ్యవహారాలను బయటపెట్టింది. ఇక.. 2001 ఏప్రిల్లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. భారత్కు చెందిన వ్యాపారవేత్త అమరేంద్ర నాథ్ ఘోష్కు వందల కోట్ల విలువ చేసే పైనాన్షియల్ గ్యారెంటీలను అనధికారికంగా కట్టబెట్టారని బరాక్పై అభియోగాలు వచ్చాయి. ఈ కారణంతో ఆయన అదే ఏడాది తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రపంచం దృష్టిలో ఏర్పడిన ఈ మచ్చని.. కఠిన చట్టాల ద్వారా తొలగించుకునే పనిలో ఉంది ఈ సుందర ద్వీప దేశం. -
శాంతి చర్చల వేళ.. ఎయిర్స్ట్రైక్స్తో భీకర దాడులు
కీవ్: శాంతి చర్చల వేళ రష్యా సైన్యం(Russia Military) భీకర దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. తాజాగా.. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్కోస్ తెలిపారు. అయినప్పటికీ.. తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులు శాంతి చర్చలు(Ukraine Peace Talks) జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం. రెండు రోజుల కిందట ఖర్కీవ్ రీజియన్లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ప్రకటించారాయన. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్కు అమెరికా నిఘా సమాచార సహాయం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే రష్యా తన దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం. -
‘‘అయ్యా ట్రంప్.. ఇలాంటి బతుకులెందుకు?’’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజన్పై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి. తాజా ‘ట్రంప్ గాజా’ అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహాజనితమైన గాజా.. వాస్తవాలను ఏమాత్రం దాచిపెట్టలేదని.. అక్కడి ప్రజలు కోరుకునేది అలాంటి బ్రతుకులు కానేకాదని పలువురు మండిపడుతున్నారు.ఆకాశన్నంటే భవనాలు, లగ్జరీ ఓడలు, రాత్రిపూట బంగారు వర్ణంలో మెరిసి పోయే గాజా, నియంతృత్వ ధోరణిని ప్రతిబింబించేలా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బంగారు విగ్రహాలు, మధ్యలో ఏదో తింటూ కనిపించే ఇలాన్ మస్క్, డబ్బులు వెదజల్లే పిల్లలు, అటు పబ్లో డ్యాన్సర్లతో.. ఇటుపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహూతో ట్రంప్ చొక్కాల్లేకుండా సేదతీరుతున్న దృశ్యాలను.. వెరసి విలాసవంతమైన ప్రాంతంగా ఉన్న గాజా వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్లో షేర్ చేశారు.Holy Shlit. President Trump just posted Trump Gaza on his Truth Social account. 🤣🤣🤣 pic.twitter.com/o44mmbtyk8— Based DK (@Back_2TheMiddle) February 26, 2025అయితే ట్రంప్ గాజా పేరుతో విడుదలైన ఆ ఏఐ జనరేటెడ్(AI Generated Video) వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది గాజా ప్రజలను ప్రతిబింబించేలా ఎంతమాత్రం లేదని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బసీమ్ నయీమ్ అన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ట్రంప్ మరోసారి గాజా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. గాజా ప్రజలు కోరుకుంటోంది ఛిద్రమైన ఈ ప్రాంత పునర్మిర్మాణం. అలాగే తమ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలని. అంతేగానీ బంధీఖానాల్లో ఉండాలని కాదు. మేం పోరాడేది బంధీఖానాల్లో పరిస్థితులు మెరుగుపడాలని కాదు. అసలు జైలు, జైలర్ లేకుండా చూడాలని’’ అని నయీమ్ అంటున్నారు.మరోవైపు ఈ వీడియోలో మస్క్, నెతన్యాహూ ప్రస్తావించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గాజాలో మానవతా సాయం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను ట్రంప్ పక్కనపెట్టారంటూ పలువురు మండిపడుతున్నారు. 👉2023 అక్టోబర్ 07వ తేదీన హమాస్(Hamas) సంస్థను ఇజ్రాయెల్పై మెరుపు మిస్సైళ్ల దాడి జరిపింది. ఈ దాడుల్లో 1,200 మంది మరణించారు. అయితే ప్రతిగా హమాస్ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు జరుపుతూ వచ్చింది. ఇప్పటిదాకా ఈ దాడుల్లో 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా.. ఇందులో పిల్లల సంఖ్యే అధికంగా ఉంది. మరోవైపు.. ఈ యుద్ధ వాతావరణంతో 90 శాతం గాజా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో గాజాకు అంతర్జాతీయ సాయం అందడం కూడా కష్టతరంగా మారగా.. ఆ సాయం అందక పలువురు చనిపోవడం గమనార్హం.👉ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పలు విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఒప్పందంలో భాగంగా తమ దగ్గర ఉన్న బంధీలను హమాస్.. పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం పూర్తైతే హమాస్ పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. 👉మరోవైపు.. గాజా పునర్మిర్మాణం కోసం ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అక్కడ ఉన్న 21 లక్షల మంది పాలస్తీనా ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించేసి(వెలేసి).. గాజాను అతి సుందర విలాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆ బాధ్యతలు అమెరికానే తీసుకుంటుందని అంటున్నారాయన. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మద్ధతు ప్రకటించగా.. అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. గాజా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్లో మార్చి 4వ తేదీన ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ట్రంప్ ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: సారీ.. ఆయన కింద పని చేయలేం! -
వీడియో: చూస్తుండగానే ఘోరం.. కుప్పకూలిన బ్రిడ్జి
దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోగా.. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న మరో ముగ్గురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.సౌత్ కొరియా(South Korea) నగరం చెయోనాన్లో ఎక్స్ప్రెస్వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 10గం. ప్రాంతలో క్రేన్ సాయంతో బ్రిడ్జికి సపోర్ట్గా ఉండే ఇనుప నిర్మాణాలను కార్మికులు తరలిస్తున్నారు. ఆ టైంలో అప్పటికే అమర్చిన ఐదు ఇనుప నిర్మాణాలు ఒక్కసారిగా ఒరిగిపోవడంతో.. బ్రిడ్జి కుప్పకూలిపోయింది(Bridge Accident).BIG BREAKING NEWSAt least 3 construction workers killed, 5 injured after portion of highway overpass collapsed near Anseong, South Korea🇰🇷🇰🇷‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️ pic.twitter.com/qk6LSajfLe— WW3 Monitor (@WW3_Monitor) February 25, 2025తొలుత ముగ్గురు మరణించార స్థానిక మీడియా కథనాలు ఇచ్చాయి. అయితే ఇద్దరే ఘటనా స్థలంలో మరణించారని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఘటనపై ఆరా తీసిన తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సంగ్ మోక్(Choi Sang Mok).. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. పని ప్రాంతంలో మరణాలు ఆ దేశంలో గణనీయంగా నమోదు అవుతున్నాయి. 2020-23 మధ్యకాలంలో ఏకంగా 8 వేల మంది కార్మికులు మరణించారక్కడ. -
ట్రంప్ బెదిరిస్తే భయపడలా?: మెక్సికో అధ్యక్షురాలు
పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేస్తున్న బెదిరింపులపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ (Claudia Sheinbaum) తీవ్రంగా స్పందించారు. ట్రంప్ హెచ్చరికలకు భయపడుతున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. అలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టంచేశారామె. ‘‘ట్రంప్ చేసే డ్రగ్స్ ముఠాల కట్టడికి మిలిటరీ జోక్యం, వలసదారుల బహిష్కరణ, పరస్పర సుంకాల బెదిరింపులకు నేను భయపడను. నేను ప్రజల మనిషిని. మెక్సికన్ ప్రజల మద్దతు ఉంది. మెక్సికో (Mexico) సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకుంటా’’ అని అన్నారామె. వైట్హౌజ్లోకి అడుగుపెట్టగానే.. అగ్రరాజ్యంలోకి ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా, వలసదారుల చొరబాట్లను అడ్డుకోవడంలో కెనడా, మెక్సికోలు విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయా దేశాలపై 25 శాతం సుంకం విధిస్తానంటూ హెచ్చరించారు కూడా. అలాగే.. అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అయితే.. మెక్సికోపై ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలను నెలరోజుల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల అధికారులు ఈ వారం వాషింగ్టన్లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. -
మీ వాటా బంగారం.. మూడు తులాలు!
పసిడి ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ రోజు ఎంత పెరుగుతుందో అని భారంగానే నడుస్తోంది. అయితే.. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ఎంత బంగారం ఉందో మీకు తెలుసా?. కేవలం 2, 44,000 మెట్రిక్ టన్నులు మాత్రమే!. అవును.. ఈ భూమ్మీద బంగారు గనుల నుంచి 244,000 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే గనుల నుంచి బయటకు వెలికి తీయబడింది. ఇందులో ఎక్కువగా.. చైనా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి వెలికి తీసిందే. అయితే.. ఇంత బంగారాన్ని ఒకవేళ భూమ్మీద ఉన్న మనుషులందరికీ పంచగలిగితే!.. భూమ్మీద అధికారికంగా ఇప్పుడున్న ప్రతీ మనిషికి బంగారం గనుక పంచితే(Gold Distribution On Earth).. దాదాపు 30 గ్రాముల(ట్రాయ్ ఔన్స్) దాకా పంచొచ్చట. ప్రపంచ జనాభా.. 816 కోట్లుగా ఓ అంచనా వేసుకుంటే.. ఈ బంగారం ఇలా సరిపోతుందని విజువల్ క్యాపిటలిస్ట్కు చెందిన వోరోనోయి యాప్ లెక్కకట్టి తేల్చింది. 👉అయితే.. అత్యధిక బంగారు నిల్వలు(Gold Reserves) ఉన్నది మాత్రం అమెరికాలో. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఆ తర్వాతి ప్లేస్లో ఉన్న చైనా.. తన నిల్వలను క్రమంగా పెంచుకుంటూ పోతోంది. బంగారు నిల్వల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది. 👉ఒకప్పుడు బంగారం ఉత్పత్తి(Gold Production) అంటే.. దక్షిణాఫ్రికా పేరు ప్రముఖంగా వినిపించేది. 1900-1970 మధ్య ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసిన దేశంగా నిలిచిందది. ఒకానొక టైంలో ఏడాదికి 1,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రారాజుగా వెలుగొంది. అయితే.. ఇప్పుడు బంగారం ఉత్పత్తిలో చైనా అద్భుతాలు సృష్టిస్తోంది. 👉అమెరికా, ఆస్ట్రేలియా తరహాలో భారీ బంగారు గనులు లేకపోయినా ఉన్న గనుల నుంచే అత్యధికంగా బంగారాన్ని వెలికి తీస్తోంది. కిందటి ఏడాదిలో రికార్డు స్థాయిలో 380 మెట్రిక్ టన్నుల బంగారాన్ని బయటకు తీసి ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
మార్కో ఫినిష్డ్
అతనో కరడుగట్టిన గ్యాంగ్స్టర్. పాతికపైగా దేశాలకు మోస్ట్వాంటెడ్ కూడా. అలాంటోడు.. కిందటి ఏడాది జరిగిన గ్యాంగ్ వార్లో చచ్చాడని కథనాలు వచ్చాయి. అతని ప్రేయసి కూడా బోరుమనడంతో అందరూ అది నిజమేనని నమ్మారు. కట్ చేస్తే.. ఇప్పుడు నిజంగానే ఆ క్రిమినల్ ఓ ఆగంతకు కాల్పుల్లో హతమయ్యాడు!.డచ్ డ్రగ్ డీలర్.. మోస్ట్వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్(Marco Ebben) ఎట్టకేలకు హతమయ్యాడు. మెక్సికోలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. నెదర్లాండ్స్కు చెందిన మార్కో ఎబ్బెన్ యూరప్ దేశాలకు మోస్ట్వాంటెడ్గా ఉన్నాడు. 2014-15 మధ్యకాలంలో మార్కో, అతని అనుచరులు 400 కేజీల కొకైన్ను పైనాపిల్స్(Pineapples)లో స్మగ్లింగ్ చేయడం వార్తల్లోకి ఎక్కింది. బ్రెజిల్(Brazil) నుంచి నెదర్లాండ్స్కు, ఇతర యూరోపియన్ దేశాలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలను అక్రమ రవాణా చేసినట్లు అభియోగాలున్నాయి. 2020లో డచ్ కోర్టు అతనికి ఏడేళ్ల శిక్ష విధించగా.. పోలీసుల చెర నుంచి పరారయ్యాడు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కిందటి ఏడాది అక్టోబర్లో మార్కో పెద్దడ్రామానే ఆడాడు. క్యూలికాన్లో జరిగిన గ్రూప్వార్లో అతను చనిపోయినట్లు ప్రచారం చేయించాడు.పైగా అతని ప్రేయసి మార్కో డెడ్బాడీని గుర్తు పట్టినట్లు ఆ డ్రామాలో భాగమైంది కూడా. అయితే ప్రస్తుతం అతన్ని కాల్చి చంపింది ఎవరనేదానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదీ చదవండి: డాలర్తో గేమ్స్ వద్దు! -
Illegal Immigrants: ఎవరేమన్నా.. ఐ డోంట్ కేర్!
వాషింగ్టన్: అక్రమ వలసవాదుల విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వారం రోజుల్లోనే సుమారు మూడున్నర వేల మందిని అరెస్ట్ చేసి వెనక్కి పంపించారు(డిపోర్టేషన్). అందులో ఈ రెండ్రోజుల్లోనే రెండు వేలమందిపై చర్యలు తీసుకోవడం గమనార్హం. దీంతో.. సరైన పత్రాల్లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు. అయితే..అయితే.. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే క్రమంలో అక్కడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉంటోంది. పలు నగరాల్లో ఇళ్లలోకి, ప్రార్థనాస్థలాల్లోకి వెళ్లి మరీ తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ వలసదారుల్ని గొలుసులతో కట్టడంతోపాటు చేతులకు బేడీలు వేసి అమానవీయంగా సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పైగా ఆ విమానంలో తాగునీరు లాంటి కనీస వసతులు కూడా కల్పించడం లేదనే ఆరోపణలొచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని మధ్య, దక్షిణ అమెరికా దేశాలు ఖండిస్తున్నాయి.మరోవైపు.. ఎఫ్ 1 వీసాల ఆధారంగా వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వణికిపోతున్నారు. యూనివర్సిటీలతో, తమ కోర్సులతో సంబంధం లేకుండా.. ఖర్చుల కోసం పార్ట్టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.అయితే.. ఏదిఏమైనా.. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ చర్యలు ముందుకు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. సరైన పత్రాల్లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసముంటున్న వారిని పెద్దఎత్తున విమానాల ద్వారా స్వదేశాలకు తిప్పి పంపే చర్యలు కొనసాగుతాయన్నారు. అయితే.. ఆ విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా ఝళిపించి మరీ ట్రంప్ దారికి తెచ్చుకుంటుండడం గమనార్హం.సరిహద్దున ఉన్న మెక్సికోతోపాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండూరస్, ఎల్సాల్వడార్ వంటి దేశాలుఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్నాయి. అయితే..ఇప్పుడు వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. -
విడాకుల ప్రచారంపై ఒబామా రియాక్షన్ ఇదే!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మధ్య వార్తల్లోకి ఎక్కారు. సతీమణి మిషెల్లీ నుంచి ఆయన విడిపోబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. అందుకు గత కొంతకాలంగా మీడియా ముఖంగా కనిపించిన సందర్భాలే కారణం. కచ్చితంగా హాజరు కావాల్సిన కార్యక్రమాలకు కూడా ఈ ఇద్దరూ జంటగా కనిపించకపోవడమే విడాకులు రూమర్లకు బలం చేకూర్చింది. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ జంటగా ఎక్కడా మీడియా కంటపడలేదు. పైగా జనవరి 9వ తేదీన జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు, వాళ్ల వాళ్ల సతీమణులంతా(మాజీ ప్రథమ మహిళలు) హాజరయ్యారు. అయితే ఒబామా(Obama) మాత్రం ఒంటరిగానే ఆ ఈవెంట్కు హాజరయ్యారు. దానికి కొనసాగింపుగా.. జనవరి 20వ తేదీన వైట్హౌజ్(White House)లో జరగబోయే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష స్వీకరణ కార్యక్రమానికి తాను హాజరు కావట్లేదని తన కార్యాలయం నుంచి మిషెల్లీ ఒక ప్రకటన విడుదల చేయించారు. అయితే ఆ ఈవెంట్కు ఒబామా ఒంటరిగానే హాజరవుతారనే కథనాలు ఒక్కసారిగా విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చాయి.There are strong rumors circulating about a possible divorce between Michelle "Big Mike" Obama and Barack Obama. Speculation is growing as Michelle has already missed Jimmy Carter’s funeral and will once again be skipping Donald Trump’s upcoming inauguration, which Barack will… pic.twitter.com/qP3V7jqh14— Shadow of Ezra (@ShadowofEzra) January 16, 2025 I think Barack and Michelle Obama are heading for divorce. His letters talking about how he fantasizes about sex with men "every day" had to be the icing on the cake for her. What woman wants to deal with that, especially in the public eye?— Freedom Party! (@DavidJo1960) January 14, 2025వీళ్ల వ్యక్తిగత జీవితంపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో గత ఐదారు రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ లోపు సందర్భం రావడంతో ఈ రూమర్స్కు తనదైన శైలిలో స్పందించారు ఒరాక్ ఒబామా. జనవరి 17వ తేదీన మిషెల్లీ(Michelle) పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు.నా ప్రేమ జీవితానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రొమాంటిక్ ఫోజులో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేసి లవ్ యూ అంటూ సందేశం ఉంచారాయన. దానికి అంతే స్పీడ్గా లవ్ యూ హనీ.. అంటూ మిషెల్లీ ఒబామా బదులిచ్చారు. తద్వారా విడాకుల రూమర్స్కు ఒకేసారి ఇద్దరూ చెక్ పెట్టారన్నమాట.Happy birthday to the love of my life, @MichelleObama. You fill every room with warmth, wisdom, humor, and grace – and you look good doing it. I’m so lucky to be able to take on life's adventures with you. Love you! pic.twitter.com/WTrvxlNVa4— Barack Obama (@BarackObama) January 17, 2025చికాగోలో ఓ పంప్ ఆపరేటర్-గృహిణి దంపతులకు జన్మించారు మిషెల్లీ. ఓ లా కంపెనీలో ఒబామా-మిషెల్లీ తొలిసారి కలుసుకున్నారు. మూడేళ్ల తర్వాత తమ ప్రేమను బయటపెట్టుకుని.. వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు మలియా(23),సాషా(23). అమెరికా హైప్రొఫైల్ జంటల్లో.. వన్ ఆఫ్ ది ‘ఆదర్శ జంట’గా వీళ్లకు పేరుంది. గతంలో చాలా సందర్భాల్లో ఈ జంట తమ వైవాహిక జీవితం గురించి సరదాగా చర్చించేవారు. Happy anniversary, @MichelleObama! 32 years together, and I couldn’t have asked for a better partner and friend to go through life with. pic.twitter.com/04t41YYfN6— Barack Obama (@BarackObama) October 3, 2024అయితే ఒక్కోసారి ఆయన వ్యవహార శైలి చిరాకు తెప్పించేదని.. ఆ కోపంతో ఆయన్ని బయటకు విసిరేయాలన్నంత కోపం వచ్చేదని మిషెల్లీ ఓ పాడ్కాస్ట్లో సరదాగా మాట్లాడడం చూసే ఉంటారు. అయితే ఎన్ని కష్టకాలమైనా.. ఆమె తన వెంటే నడిచిందని, బహుశా ఆ ప్రేమే జీవితాంతం ఆమె వెంట ఉండేలా తనను చేస్తోందంటూ ఒబామా కూడా అంతే సరదాగా బదులిచ్చేవారు. ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో తొలిసారి! -
న్యూఓర్లీన్స్ ట్రక్కు దాడి.. ఎవరీ జబ్బర్?
కొత్త సంవత్సరం వేళ.. కేవలం గంటల వ్యవధిలో అమెరికాను వరుస దాడులు వణికించాయి. ముఖ్యంగా న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడి కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విచారణ పూర్తిగా ఉగ్రకోణంలోనే సాగుతోందని ఎఫ్బీఐ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అనుమానితుడికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు విడుదల చేసింది.గతంలో అమెరికా సైన్యం పని చేసిన షంసుద్ దిన్ జబ్బార్(42)ను ఈ దాడికి ప్రధానసూత్రధారిగా అనుమానిస్తున్నారు. ట్రక్కుతో దాడికి పాల్పడిన అనంతరం.. అతడ్ని భద్రతా బలగాలు అక్కడికక్కడే కాల్చి చంపాయి. అయితే అతనొక మానసిక రోగినా? లేకుంటే ఉగ్రవాదినా? అనేదానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. కానీ.. 👉జబ్బార్ గతంలో టెక్సాస్లో రియల్ ఎస్టేట్(Real Estate) ఎజెంట్గా పని చేశాడు. అంతకు ముందు చాలాఏళ్లు అమెరికా సైన్యంలో పని చేశాడు. అయితే.. ఆర్థిక సమస్యలతో పాటు విడాకులు అతని వ్యక్తిగత జీవితాన్ని కుంగదీసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందట.. యూట్యూబ్ ఛానెల్లో తనను తాను రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పరిచయం చేసుకున్న ఓ వీడియో సైతం ఇప్పుడు బయటకు వచ్చింది.👉ఇదిలా ఉంటే.. జబ్బార్ 2005 నుంచి 2015 మధ్య అమెరికా సైన్యంలో హ్యూమన్ రీసోర్స్ స్పెషలిస్ట్గా, ఐటీ స్పెషలిస్ట్గా పని చేశాడని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. అంతేకాదు.. 2009-10 మధ్య అఫ్గనిస్థాన్లో అతను విధులు నిర్వహించాడు. తాజా దాడి ఘటన తర్వాత.. అమెరికా సైన్యంలో అతను పని చేసిన టైంలో ఓ వీడియో యూట్యూబ్లో వైరల్ అయ్యింది. అయితే కాసేపటికే ఆ వీడియోను ఎవరో యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు.👉వీటితో పాటు 2021 నుంచి ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్లో అతడు సీనియర్ సొల్యూషన్ స్పెషలిస్ట్గా విధులు నిర్వహించాడు.👉దాడి ఘటనపై అతని కుటుంబం స్పందించింది. తన సోదరుడు జబ్బార్ ఎంతో మంచివాడని అబ్దుర్ జబ్బార్ చెప్తున్నాడు. చిన్నతనంలో మా కుటుంబం మతం మారింది. కానీ, ప్రస్తుత దాడిని మతానికి ముడిపెట్టడం సరికాదు. రాడికలైజేషన్ ప్రభావంతోనే నా సోదరుడు ఉన్మాదిగా మారిపోయి ఉంటాడు అని అబ్దుర్ చెప్తున్నాడు.👉జార్జియా స్టేట్ యూనివర్సిటీలో జబ్బార్ విద్యాభ్యాసం కొనసాగింది. 2015-17 మధ్య కంప్యూటర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడతను. జబ్బార్ డైవోర్సీ. రెండుసార్లు వివాహం జరగ్గా.. ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలతోనే రెండో భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు 2022లో అతను పంపిన మెయిల్ను అధికారులు పరిశీలించారు.👉రియల్ ఎస్టేట్ నష్టాలతో జబ్బార్ ఆర్థికంగానూ జబ్బార్ చితికిపోయి ఉన్నాడు. ఒకానొక టైంలో అద్దె కూడా చెల్లించని లేని స్థితికి చేరుకున్నాడు. ఆఖరికి లాయర్కు ఫీజులను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించి.. వాటిని ఎగ్గొట్టాడు.👉నేర చరిత్రను పరిశీలిస్తే.. 2002లో దొంగతనం, 2005లో కాలం చెల్లిన డ్రైవింగ్ లైసెన్స్తో బండి నడిపి శిక్ష అనుభవించాడు.👉షంషుద్దీన్ జబ్బార్ దాడి చేస్తాడని కొన్ని గంటల ముందే ఎఫ్బీఐ తనకు సమాచారం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వెల్లడించారని ఏబీసీ న్యూస్ ఓ కథనం ప్రచురించింది. ఐసిస్ స్ఫూర్తితోనే తాను ఈ చర్యకు ఉపక్రమిస్తున్నట్లు వీడియో పోస్ట్ చేశాడు. ఇస్లామిక్ స్టేట్ ఆర్మ్డ్ గ్రూప్(ఐసిస్కు మరో పేరు) జెండా కూడా దాడికి పాల్పడిన ట్రక్కులో ఉన్నట్లు ఎఫ్బీఐ తనకు నివేదించిందని బైడెన్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. 👉షంషుద్దీన్ జబ్బార్ను ఐసిస్ ఒంటరి తోడేలు (Lone Wolf)గా ఎఫ్బీఐ భావిస్తోంది. అంటే.. ఒంటరిగాగానీ లేదంటే చిన్నగ్రూపులుగా ఏర్పడి దాడులు చేయడం. అమెరికాలో జరిగే అత్యధిక ఉగ్రదాడులు ఈ రూపంలోనే ఉంటున్నాయి. 2014లో బెల్జియంలో యూదుల మ్యూజియంపై, 2012లో బ్రస్సెల్స్లో మసీదుపై, 2016లో ఫ్రాన్స్లో బాస్టిల్డే నాడు ట్రక్కుతో దాడి ఇలా చేసినవే. ‘‘అతడికి సైనిక నేపథ్యం ఉంది. కానీ, ఏనాడూ యుద్ధంలో పాల్గొనలేదు. నౌకాదళంలో చేరేందుకు ప్రయత్నించినా.. అది వీలుకాలేదు. దాడికి ముందు సెయింట్ రోచ్ సమీపంలో ఓ ఇంటి సమీపంలో అతడు ట్రక్కును ఆపి కొన్ని పెట్టెలను కిందకి దించుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే అక్కడున్న ఆ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిందితుడు జబ్బార్ ఎయిర్ బీఎన్బీలో ఒక గది తీసుకొని.. అక్కడ న్యూఆర్లీన్ దాడికి పేలుడు పదార్థాలు తయారుచేశాడు. టూరో అనే యాప్ సాయంతో అతడు ఫోర్డ్ ఎఫ్-150 లైటినింగ్ అనే భారీ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును బుక్ చేశాడు. దానిని వాడే నూతన సంవత్సర వేడుకల వేళ బర్బన్ వీధిలో విచక్షణా రహితంగా దాడి చేసి 15 మందిని బలిగొన్నాడు’’ అని లూసియానా అటార్నీ జనరల్ లిజ్ ముర్రిల్ల్ తెలిపారు.అయితే జబ్బార్ తన కుటుంబాన్ని ఐసిస్లో కలవాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశాడని.. వినకపోయేసరికి వాళ్లను సైతం కడతేర్చడానికి వెనుకాడలేదని అధికారులు చెప్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు. -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. డీఎస్టీ రద్దు
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన ప్రకటనలు చేస్తున్నారు. అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టకముందే.. తాను ఏం చేయబోతున్నాననే విషయాలను వరుసగా ప్రకటిస్తున్నారాయన. ఈ క్రమంలో వంద ఏళ్లుగా అమెరికన్లు పాటిస్తున్న డేలైట్ సేవింగ్ టైం(DST) విధానానికి ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు.‘రిపబ్లికన్ పార్టీ డే లైట్ సేవింగ్ టైమ్ను రద్దు చేయనుంది. ఈ పద్ధతిని అనుసరించడం ఎంతో అసౌకర్యంగా ఉంది. దీనివల్ల అమెరికన్లపై చాలా భారం పడుతుంది’ అని రాసుకొచ్చారు. డేలైట్ సేవింగ్ టైం అంటే.. వసంతకాలంలో ఒక గంట ముందుకు, శరధ్రుతువులో ఒక గంట వెనక్కి గడియారంలో సమయాలను మార్చుకోవడం. అయితే, ఈ పద్ధతికి కాలం చెల్లిందని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదన్నది చాలామంది అభిప్రాయం.ఎనర్జీ సేవింగ్.. అంటే పగటికాంతిని సాయంత్ర వేళల్లో సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఈ విధానం పాటిస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల పనులకు అవాంతరాలు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా నిద్రపై ప్రభావం పడుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.1784లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ తొలిసారిగా డేలైట్ సేవింగ్ టైం ప్రతిపాదన చేశారు. అయితే.. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తొలిసారి ఈ డే లైట్ సేవింగ్ టైమ్ను అమెరికన్లు పాటించారు. యుద్ధం ముగిశాక.. ఈ విధానం పాటించడం మానేశారు. అయితే తిరిగి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ విధానం మళ్లీ అమెరికాలో ఆచరణలోకి వచ్చింది. యూనిఫామ్ టైం యాక్ట్ 1966 కింద.. ఈ విధానం శాశ్వతంగా మారిపోయింది. అయితే హవాయ్,ఆరిజోనా మాత్రం ఈ విధానం పాటించడం లేదు. అయితే ఈ విధానాన్ని మూర్ఖపు విధానంగా పేర్కొంటూ.. సెనేటర్ మార్కో రుబియో 2022లో సన్షైన్ ప్రొటెక్షన్ అనే బిల్లును తెచ్చారు. బిల్లు సెనేట్లో పాసైనప్పటికీ.. హౌజ్లో మాత్రం ఆమోదం దక్కించుకోలేకపోయింది. దీంతో.. బైడెన్ దాకా ఆ బిల్లు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం ట్రంప్ కార్యవర్గంలో రుబియో స్టేట్ సెక్రటరీగా ఉండడం గమనార్హం.ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలాంటి ట్రంప్ అనుచరగణం కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా ఉంది. మరోవైపు.. డీఎస్టీ ద్వారా ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ప్రస్తుతం అమెరికన్లు ప్రతీ ఏటా మార్చి-నవంబర్ మధ్య డేలైట్ టైం ను.. నవంబర్-మార్చి మధ్య స్టాండర్డ్ టైంను ఫాలో అవుతున్నారు. ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే.. కాలాన్ని మార్చుకునే ఈ వందేళ్ల ఆనవాయితీకి పుల్స్టాప్ పడుతుంది. అమెరికా మాత్రమే కాదు.. యూరప్ సహా ప్రపంచంలోని మూడింట దేశాలు ఈ పద్ధతిని అవలంభిస్తున్నాయి.


