breaking news
world news
-
భారత్తో ఢీ కొట్టాడు.. జిన్పింగ్ వేటులో పడ్డాడు!
చైనాలో సైనిక ప్రక్షాళన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా జనరల్ జావో జోంగ్కిని అధ్యక్షుడు జీ జిన్పింగ్ను కీలక బాధ్యతల నుంచి తప్పించారు. గతంలో భారత్తో డోక్లామ్ ప్రతిష్టంభన, గాల్వాన్ ఘర్షణ సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్కు నేతృత్వం వహించింది ఈయనగారే. ఇందుకుగానూ జిన్పింగ్ నోట హీరోగా ప్రశంసలు అందుకున్న వ్యక్తే.. ఇప్పుడు వేటుకు గురి కావడం గమనార్హం. భారత్తో కీలక సరిహద్దు ఘర్షణల సమయంలో చైనా సైన్యానికి నాయకత్వం వహించిన జనరల్ జావో జోంగ్కి (Zhao Zongqi)పై తాజాగా వేటు పడింది. 2017లో డోక్లామ్ ప్రతిష్టంభన, 2020లో గాల్వాన్ ఘర్షణ సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) వెస్ట్రన్ థియేటర్ కమాండ్కు నేతృత్వం వహించిన జావోను చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలి నుంచి తొలగించింది. అయితే ఆ తొలగింపునకు కారణాలను మాత్రం బీజింగ్ వర్గాలు వెల్లడించలేదు.2016లో వెస్ట్రన్ థియేటర్ కమాండ్ను పునర్వవ్యవస్థీకరించిన తర్వాత తొలి కమాండర్గా జనరల్ జావో జోంగ్కి బాధ్యతలు చేపట్టాడు. టిబెట్, జిన్జియాంగ్తోపాటు భారత్తో చైనా సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో పీఎల్ఏ కార్యకలాపాలను ఈ కమాండ్ పర్యవేక్షిస్తుంటుంది. అయితే 2017లో భారత్-చైనా-భూటాన్ త్రిసంధికి సమీపంలోని డోక్లామ్లో 72 రోజులపాటు ఇరు దేశాల సైనికులు ఉద్రిక్తతల్లో జావోనే కీలక పాత్ర పోషించారు. ఇందులో జావోదే పూర్తి బాధ్యత ఉందంటూ అంతర్జాతీయ మీడియా సైతం కథనాలు ఇచ్చింది.ఆ తర్వాత 2020లో తూర్పు లడ్డాఖ్లో ఉద్రిక్తతలు మొదలైనప్పుడు కూడా ఆయన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ బాధ్యతల్లోనే ఉన్నారు. అదే ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనా అధికారికంగా నలుగురు PLA సైనికులు మరణించినట్లు ప్రకటించింది.గల్వాన్ ఘర్షణకు సంబంధించి అమెరికా నిఘా వర్గాల అంచనాలను ఉటంకిస్తూ.. 2020లో వచ్చిన ఓ నివేదికలో జావో జోంగ్కి ఆపరేషన్కు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్కు ‘గుణపాఠం చెప్పాలనే’ ఉద్దేశంతో ఈ చర్యకు ఆయన ఆమోదం తెలిపినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ వాదనను చైనా అధికారికంగా ధృవీకరించలేదు. డోక్లామ్, గాల్వాన్ వంటి భారత్తో అత్యంత సున్నితమైన సరిహద్దు ఘర్షణలకు జావో నేతృత్వం వహించిన నేపథ్యంలో ఆయన తాజా తొలగింపు ఆసక్తికరంగా మారింది.ఆగస్టు 26న చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలి అయిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (CPPCC) జావోను తన స్టాండింగ్ కమిటీ నుంచి తొలగించింది. అలాగే జాతి, మత వ్యవహారాల కమిటీ డిప్యూటీ డైరెక్టర్ పదవి నుంచి తప్పించడంతోపాటు సీపీపీసీసీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. అయితే ఈ చర్యకు కారణమేంటన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయా? లేదంటే క్రమశిక్షణా ఉల్లంఘనలపై దర్యాప్తు జరుగుతోందా? అనేది కూడా స్పష్టం చేయలేదు.జిన్పింగ్ ‘పర్జ్’లో మరో వికెట్?జావోపై చర్యలు తీసుకున్న సమయంలోనే చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC)లోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్ జనరల్స్ జాంగ్ యూషియా, లియు జెన్లీపై కూడా క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.2012లో జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా సైన్యంలో అవినీతిపై ప్రారంభమైన చర్యలు క్రమంగా విస్తృత ప్రక్షాళనగా మారాయి. పలువురు సీనియర్ సైనికాధికారులు పదవులు కోల్పోవడం, కనిపించకుండా పోవడం(చంపేశారనే అనుమానాలు), దర్యాప్తులను ఎదుర్కోవడం జరిగింది. ఆయుధాల కొనుగోలు, రక్షణ విశ్వవిద్యాలయాలు, కీలక కమాండ్ల వరకు ఈ ప్రక్షాళన విస్తరించినట్లు తెలుస్తోంది.2026 ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) అంచనా ప్రకారం.. 101 మంది సీనియర్ పీఎల్ఏ అధికారులు పదవుల నుంచి తొలగించబడ్డారు. వాళ్లలో చాలామంది ఏమయ్యారో తెలియదు. ఈ నిర్ణయం ఎంతలా అంటే.. చైనా సైనిక నాయకత్వంలోని దాదాపు 52 శాతం పదవులను ప్రభావితం చేసిందట.ఇదీ చదవండి: కాళరాత్రి.. చైనా చరిత్రకే మాయని మచ్చ -
నేపాల్ అంతటా హృదయవిదారక దృశ్యాలే!
నేపాల్ను భీకర వరద కుదిపేసిన నాలుగు రోజుల తర్వాత కూడా అక్కడి పరిస్థితి హృదయవిదారకంగానే ఉంది. ఇంకా రెండు వేల మందికి పైగా ఆచూకీ తెలియరావాల్సి ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నదులు, బురద, శిథిలాల నుంచి వరుసగా మృతదేహాలు బయటపడుతుండటంతో ఆస్పత్రులు, మార్చురీలు నిండిపోయాయి. నేపాల్ ఆకస్మిక వరదలు మహా విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. బోటె కోషి వరదల ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు త్రిశూలి, నారాయణి నదుల వెంట దిగువ ప్రాంతాలకు చేరుతున్నాయి. ఒక్క చిత్వన్లోనే శనివారం ఉదయానికి 233 మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. నౌవల్పరాసి తూర్పులో మరో 158, గోర్ఖాలో 48, నౌవల్పరాసి పశ్చిమలో 47 మృతదేహాలు వెలుగుచూశాయి. వందలాది మంది జాడ తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో స్థలం లేక.. నేపాల్-టిబెట్ పరిసరాల్లోని ఆస్పత్రుల్లో మార్చురీల సామర్థ్యం 350 మృతదేహాలుగా తెలుస్తోంది. ఈ తరుణంలో సామర్థ్యం మించిపోవడంతో మృతదేహాలను ఇతర భవనాలకు తరలిస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు భారత్పూర్ సహా పలు ప్రాంతాల్లో తాత్కాలిక కేంద్రాలను(బాడీ మేనేజ్మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల టెంట్ల కింద కూడా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిటీ హాళ్లు, పోలీస్ ప్రాంగణాలు, ఇతర భవనాలను తాత్కాలిక మార్చురీలుగా మార్చేసినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజీ కొరత, హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు మృతదేహాలను భద్రపరచడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారాయి. ఎవరో గుర్తించడమే కష్టం..చాలా మృతదేహాలు బురద, శిథిలాల్లో తీవ్రంగా దెబ్బతినడంతో ముఖాలను చూసి గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో అధికారులు మృతదేహాల ఫొటోలు తీస్తూ, శరీరంపై ఉన్న గుర్తులు, దుస్తులు, టాటూలు, ఆభరణాలు, వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. అవసరమైన చోట డీఎన్ఏ నమూనాలను కూడా సేకరించి కుటుంబ సభ్యులతో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు.బంధువుల కోసం ఆర్తనాదాలు..కళ్లెదుటే అయినవాళ్లు కొట్టుకుపోతుంటే.. నిస్సహాయంగా చూస్తున్న ఉండిపోయిన వాళ్లు అధికారులను బతిమాలుకుంటున్నారు. వాళ్ల ఆచూకీ చెప్పాలంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం నేపాల్లో వందలాది మంది ఇంకా గల్లంతై ఉండగా, మొత్తం విపత్తులో 2,000కుపైగా మంది ఆచూకీ తెలియడం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. తాత్కాలిక బాడీ-మేనేజ్మెంట్ సెంటర్ల వద్ద తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఫొటోలు, మొబైల్ చిత్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. మృతదేహాలపైనా దోపిడీ..ఈ విపత్తు వేళ కొందరి అమానవీయ ప్రవర్తన కూడా వెలుగులోకి వచ్చింది. వరదలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం నుంచి చెవిపోగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన నేపాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయినా ఆ తతంగం ఆగడం లేదని తెలుస్తోంది. మరోవైపు నదుల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలతో పాటు వస్తువులు, బ్యాగులు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుంచి నగదు, నగల కోసం కొందరు పడవల్లో పరుగులు తీస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎటు చూసినా విషాదం, ఆర్తనాదాలు, మృతదేహాలే కనిపిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: ఆ సరస్సు నీటి రంగు మారింది.. చైనా వార్నింగ్ -
యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్కు చైనా మరో డెడ్లీ వార్నింగ్!
భారీ ఆకస్మిక వరదల నుంచి తేరుకోకముందే నేపాల్ను మరో జలప్రళయం ముంచెత్తుందన్న హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వరదల ధాటికి ఏర్పడిన సహజ సరస్సు నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని చైనా హెచ్చరించింది. సరస్సులోని నీటి రంగు మరింత ముదురుతోందని.. ఇది కట్ట తెగే ప్రమాదానికి సంకేతం కావొచ్చని పేర్కొంది. ఎప్పుడైనా సరస్సు కట్టలు తెంచుకునే అవకాశం ఉందని నేపాల్ను అప్రమత్తం చేసింది. దీంతో సహాయక చర్యలకు, గల్లంతైన వాళ్ల కోసం కొనసాగుతున్న అన్వేషణకు తాజా వార్నింగ్ ఆటంకాలు కలిగిస్తోంది.నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం దూసుకొచ్చిన ఆకస్మిక వరదలు ఘోర నష్టాన్ని కలిగించాయి. అయితే ఆ సమయంలో ఎగువ ప్రాంతంలో గ్లేసియర్ కూలిపోవడంతో భారీగా మంచు, బండరాళ్లు, మట్టి కిందికి కొట్టుకొచ్చాయి. దీంతో నదీ ప్రవాహానికి అడ్డుగా సహజ కట్ట ఏర్పడి.. దాని వెనుక బారియర్ సరస్సు ఏర్పడింది. చైనా జలవనరుల శాఖ ప్రకారం.. శుక్రవారం నాటికి అందులో సుమారు 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. మరో మూడు రోజుల్లో అదనంగా 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సరస్సు చైనాలోని చోచెన్ నది, నేపాల్లోని పురేపు నది సంగమ ప్రాంతానికి సమీపంలో ఏర్పడింది. నీటిమట్టం క్రమక్రమంగా.. శరవేగంగా పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైనా సూచించింది.కట్ట తెగితే.. 500 క్యూబిక్ మీటర్ల ప్రవాహంఈ సరస్సు ఏ క్షణాన అయినా కట్టలు తెంచుకోవచ్చని చైనా నిన్నటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే టిబెట్ ప్రాంతంలో సహాయక చర్యలను సైతం నిలిపివేసింది. సరస్సు కట్టలో కొంత భాగం తెగితే గరిష్ఠంగా సెకనుకు 500 క్యూబిక్ మీటర్ల నీరు నదిలోకి చేరొచ్చని అంచనా వేస్తోంది. ఇది మొన్న సంభవించిన వరద ఉధృతితో పోలిస్తే ఐదారు రెట్లు ఎక్కువ ఉండే చాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే సరస్సు నుంచి నీరు లెహెండే ఖోలా, త్రిశూలి నదుల్లోకి ప్రవహించడం ప్రారంభమైందని వెల్లడించింది. దీంతో డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా పరిస్థితిని చైనా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నేపాల్ అధికారులు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను, సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. నిన్నటి నుంచి పోలీసులు మైక్లలో చేస్తున్న హెచ్చరికలతో.. ఎత్తైన ప్రాంతాలకు తరలి పోతున్నారు.600కు చేరువలో మృతుల సంఖ్యఆకస్మిక వరదలు నేపాల్ను తీవ్రంగా దెబ్బతీశాయి. రసువాతోపాటు మధ్య నేపాల్లోని పలు ప్రాంతాల్లో గ్రామాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. నేపాల్లో 600 మంది దాకా మృతి చెందారు. 1,500 మందికి గాయాలు అయ్యాయి. సహాయక చర్యలు ముందుకు వెళ్తున్నా కొద్దీ.. మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు.. భారత సరిహద్దు వైపునకు కూడా కొన్ని మృతదేహాలు, బ్యాగులు కొట్టుకువస్తున్నాయి. దాదాపు 2,500 మంది గల్లంతైనట్లు తాజా సమాచారం. ఈ విపత్తుతో 90 వేల మందికిపైగా ప్రభావితమైనట్లు రెడ్క్రాస్ అంచనా వేసింది.2,000 people now missing in Nepal as death toll from floods hits 579.Nepali authorities say they’re monitoring two lakes upstream from the main flood zone, one of which has begun overflowing. pic.twitter.com/4cyByjJ1Yx— 𓂀 𝕋𝔼𝔸ℍ 𓂀 (@TeahCartel) August 28, 2026అటు టిబెట్లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడ పలువురు మృతి చెందగా.. వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కైలాస్–మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భారతీయుల ఆచూకీపై ఆందోళన కొనసాగుతోంది.టన్నెళ్లలో వందలమంది?భారీ వరదలకు నేపాల్లోని 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 933 మంది కార్మికులు గల్లంతైనట్లు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది. వీరిలో కొందరు టన్నెళ్లలో చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క అప్పర్ త్రిశూలి–1 ప్రాజెక్టులోనే 576 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడం.. మొబైల్, టెలిఫోన్ నెట్వర్క్లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇప్పటివరకు మూడు డజన్లకుపైగా వంతెనలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.భారత్ నుంచి భారీ సాయంవిపత్తు నేపథ్యంలో ఇతర దేశాల సాయం వద్దన్న నేపాల్.. కొద్దిగంటల్లోనే మనసు మార్చుకుంది. ధ్వంసమైన రవాణా మార్గాలను పునరుద్ధరించేందుకు 42 బెయిలీ వంతెనలు(తాత్కాలిక) నిర్మించేందుకు భారత్, చైనా సాయాన్ని నేపాల్ కోరింది. ఇటు భారత్ ఇప్పటికే నేపాల్కు సహాయక సామగ్రిని పంపింది. వైద్య సిబ్బంది, టన్నెల్ రెస్క్యూ నిపుణులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపేందుకు కూడా ముందుకొచ్చింది. ప్రస్తుతం వేలాది మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగా.. మరోవైపు సహజ సరస్సు ఎప్పుడైనా కట్టలు తెంచుకునే అవకాశం ఉందన్న చైనా హెచ్చరిక నేపాల్లో కొత్త ఆందోళనకు కారణమైంది. దీంతో బోటెకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.ఇదీ చదవండి: చైనా బార్డర్ వల్లే నేపాల్ సంచలన నిర్ణయం? -
చైనా సరిహద్దు! నేపాల్ సంచలన నిర్ణయం.. భారత్ కీలక ప్రకటన!
భారీ వరదల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహాయక చర్యల కోసం ఇతర దేశాల సాయం తమకేం అక్కర్లేదని తేల్చేసింది. అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను సహాయక చర్యలకు రంగంలోకి దింపినట్లు ప్రధాని బాలేంద్ర షా వెల్లడించారు. తమ భద్రతా బలగాలే సమర్థంగా పని చేస్తున్నాయని.. అలాంటప్పుడు వేరే దేశాల అవసరం తమకు ఉండకపోవచ్చని నేపాల్ విదేశాంగ శాఖ అంటోంది. దీనికి స్పందించిన భారత్.. ఓ కీలక ప్రకటన చేసింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం ఆకస్మిక వరద పోటెత్తింది. ఎగువన ఉన్న గ్లేసియర్ కరిగిపోవడంతో.. బండరాళ్లు, బురదతో కూడిన వరద క్షణాల్లో ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఇప్పటిదాకా 600 మృతదేహాలను వెలికి తీశారు. మరో 1,400 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇందులో భారత్ సహా పలు దేశాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు. ముఖ్యంగా నేపాల్లోని రసువా జిల్లాలో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. పలు గ్రామాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా.. రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఇంతకు ముందు వరద కారణంగా ఏర్పడిన మరో సరస్సు కట్టలు తెంచుకునే ప్రమాదం చైనా ఇప్పటికే నేపాల్ను హెచ్చరించింది. దీంతో మరోసారి జల ప్రళయం(మునుపటి కంటే ఐదు రెట్లు తీవ్రతతో..) రావొచ్చని ఆందోళనల నడుమ అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.భారత్ రియాక్షన్ ఇదే..నేపాల్ విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని ప్రకటించినప్పటికీ.. భారత్ మాత్రం అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. నేపాల్ అభ్యర్థన మేరకు.. అదనపు మానవతా సాయం, వైద్య బృందాలు, ఇంజినీరింగ్ సిబ్బంది, అవసరమైన పరికరాలను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.ఇప్పటికే రెండు విమానాల్లో సహాయక సామగ్రిని నేపాల్కు పంపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో విమానం కూడా త్వరలో బయలుదేరనుంది. టన్నెల్ రెస్క్యూ టీమ్ను పంపేందుకు ముందుగా రెకీ బృందాన్ని పంపుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అక్కడి పరిస్థితిని పరిశీలించిన అనంతరం అవసరమైన పరికరాలను గుర్తించనున్నారు. అదేవిధంగా వైద్య బృందాన్ని పంపడంతోపాటు.. వరదల కారణంగా దెబ్బతిన్న రహదారి కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు బెయిలీ(పోర్టబుల్) వంతెనలు, సాంకేతిక బృందాలను అందించేందుకు భారత్ ముందుకొచ్చింది.బృందాలనూ పంపుతాంసహాయక చర్యల్లో సహాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైన పరికరాలను పంపేందుకు భారత్ ప్రత్యేకంగా నేపాల్కు ప్రతిపాదన చేసినట్లు జైస్వాల్ వెల్లడించారు. దీనిపై నేపాల్ ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. విపత్తుతో ప్రభావితమైన ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.పలు దేశాల నుంచి సాయం ఆఫర్నేపాల్ వరదల్లో తమ దేశాలకు చెందిన పౌరులు గల్లంతైన నేపథ్యంలో పలు దేశాలు సహాయక బృందాలను పంపేందుకు ముందుకొచ్చాయి. భారత్, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ రెస్క్యూ బృందాలను పంపేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతానికి విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛేత్రి తెలిపారు. తమ భద్రతా సంస్థలు ఇప్పటికే శోధన, రక్షణ చర్యలను చేపట్టాయని.. అవి సమర్థంగా కొనసాగుతున్నాయని చెప్పారు.చైనా సరిహద్దు ప్రాంతం కావడం వల్లేనా?విదేశీ రెస్క్యూ బృందాలను అనుమతించకపోవడం వెనుక రసువా ప్రాంత భౌగోళిక ప్రాధాన్యత కూడా కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రాంతం చైనా ఆధీనంలోని టిబెట్కు సమీపంలో ఉండటంతో.. విదేశీ బృందాల రాక సున్నితమైన అంశంగా మారి ఉండొచ్చని నేపాల్ మాజీ దౌత్యవేత్త దినేశ్ భట్టారాయ్ అభిప్రాయపడ్డారు. అయితే నేపాల్ విదేశాంగ శాఖ మాత్రం ఆ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది.‘సాయం పూర్తిగా వద్దనడం కాదు’నేపాల్ అంతర్జాతీయ సాయాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదని ఛేత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ భద్రతా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని, ఏదైనా ప్రత్యేక నైపుణ్యం లేదంటే సాంకేతిక సహాయం అవసరమైతే ఆయా దేశాలను తామే సంప్రదిస్తామని చెప్పారు.వరదల్లో దక్షిణ కొరియాకు చెందిన పలువురు జలవిద్యుత్ ప్రాజెక్టు సిబ్బంది గల్లంతయ్యారు. నేపాల్ ప్రస్తుతం విదేశీ రెస్క్యూ బృందాలను అంగీకరించే పరిస్థితిలో లేదని తమకు సమాచారం అందినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అయినప్పటికీ నేపాల్తో చర్చలు కొనసాగిస్తామని పేర్కొంది. మానవతా సాయం కింద 10 లక్షల డాలర్లను అందించనున్నట్లు ప్రకటించింది.ఆ వెంటనే యూటర్న్.. విదేశీ బృందాలకు ఓకే!విదేశీ రెస్క్యూ బృందాల సాయం అవసరం లేదన్న నేపాల్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అంతర్జాతీయ ఒత్తిడి, పెద్ద సంఖ్యలో విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో పరిమిత స్థాయిలో విదేశీ నిపుణులను అనుమతించింది. భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా నుంచి నిపుణులు టన్నెల్ రెస్క్యూ, డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ గుర్తింపు ప్రక్రియల్లో సహకరించనున్నారు. ఇదిలా ఉండగా.. భారత్ ఇప్పటికే వైద్య, టన్నెల్ రెస్క్యూ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: ఫరక్కా డెడ్లైన్.. మరో జల యుద్ధం తప్పదా? -
చరిత్రలోనే మెగా డీల్ ఇది.. వెనెజువెలా చమురుకు ట్రంప్ స్కెచ్!
ప్రపంచ చమురు రంగంలో సంచలనం రేపే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాకు చెందిన 65 బిలియన్ బ్యారెళ్లకు చమురు నిల్వలపై దాదాపు నియంత్రణ లభించేలా.. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో భారీ ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. దీన్ని ‘ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందం’గా ఆయన అభివర్ణించారు.వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్తో కలిసి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ ఒప్పందం కోసం చర్చలు జరిపినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వారాలపాటు కొనసాగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరిందని చెప్పారు. అమెరికా పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం లేకుండానే ఈ ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారం వెనెజువెలా అధికారులు పలు కంపెనీలకు, ముఖ్యంగా అమెరికా సంస్థలకు, చమురు అన్వేషణ, ఉత్పత్తి హక్కులు కల్పించే ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం.అమెరికా లక్ష్యం ఇదే..వెనెజువెలా వద్ద ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. మొత్తం 303 బిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇది ప్రపంచ చమురు నిల్వల్లో దాదాపు 17 శాతానికి సమానం. అయినప్పటికీ అక్కడి చమురు పరిశ్రమ సంవత్సరాల తరబడి పెట్టుబడుల కొరత, నిర్వహణ లోపాలు, ఆంక్షల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. దీంతో భారీ నిల్వలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకు సుమారు 12.5 లక్షల బ్యారెళ్ల చమురును మాత్రమే ఉత్పత్తి చేస్తోంది.ఈ పరిస్థితిని మార్చి వెనెజువెలా చమురు ఉత్పత్తిని పెంచడం, అమెరికా రిఫైనరీలకు అదనపు ముడి చమురును అందుబాటులోకి తీసుకురావడం ట్రంప్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా సంస్థలకు వెనెజువెలా చమురు క్షేత్రాల్లో దీర్ఘకాలిక ప్రాప్యత కల్పించడం ద్వారా ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.దాదాపు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు?ఈ ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని రూబియో పేర్కొన్నారు. అమెరికాకు స్థిరమైన, తక్కువ ధరకు ముడి చమురు లభించే అవకాశం ఉంటుందని, తద్వారా పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు వెనెజువెలాలో దాదాపు 100 బిలియన్ డాలర్ల మేర ప్రైవేటు పెట్టుబడులు రావచ్చని, వేలాది అధిక వేతన ఉద్యోగాలు ఏర్పడటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.పెట్రోల్ ధరలు వెంటనే తగ్గుతాయా?అయితే అమెరికా ప్రజలకు తక్షణమే చమురు ధరల రూపంలో ప్రయోజనం దక్కుతుందా అన్నదానిపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వెనెజువెలాలోని చమురు మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టి చమురు ఉత్పత్తిని పెంచడం, దాన్ని రవాణా చేయడం, భారీ ముడి చమురును శుద్ధి చేయడానికి అవసరమైన రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచడం వంటి పనులకు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఒప్పందం వల్ల అమెరికాలో పెట్రోల్ ధరలు స్వల్పకాలంలోనే గణనీయంగా తగ్గుతాయని చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్పత్తి పెరిగి, సరఫరా స్థిరపడిన తర్వాతే దాని ప్రభావం వినియోగదారులపై కనిపించే అవకాశం ఉంది.చట్టపరమైన చిక్కులు కూడా..అసలు ఈ ఒప్పందం ఏ రూపంలో అమలు కానుందనే దానిపై మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. ఏ చమురు క్షేత్రాలు ఇందులో భాగం కానున్నాయి? ఏ కంపెనీలు పాల్గొంటాయి? అమెరికా మెజారిటీ నియంత్రణను ఎలా చేపడుతుంది? వంటి కీలక అంశాలను ఆయన వెల్లడించలేదు.ఇదే సమయంలో వెనెజువెలా చట్టాల ప్రకారం చమురు పరిశ్రమలో కీలక కార్యకలాపాలపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతోంది. అందువల్ల అమెరికా ప్రభుత్వం నేరుగా లీజు విధానంలో చమురు క్షేత్రాలను నిర్వహించేలా ఒప్పందం చేసుకుంటే దానికి వెనెజువెలా రాజ్యాంగం, హైడ్రోకార్బన్స్ చట్టాల ప్రకారం చట్టబద్ధత ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి విధానానికి గతంలో స్పష్టమైన ఉదాహరణ లేదని నిపుణులు చెబుతున్నారు.అడ్డంకులెన్నో..చమురు నిల్వలు అపారంగా ఉన్నప్పటికీ వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాజకీయ అనిశ్చితి, బలహీనమైన విద్యుత్ వ్యవస్థ, పరిమిత ఎగుమతి సామర్థ్యం, చమురు రంగంపై ప్రభుత్వ నియంత్రణ వంటి అంశాలు గతంలో పెట్టుబడిదారులను వెనక్కి తగ్గించాయి. కేవలం ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే భారీ స్థాయిలో పెట్టుబడులు వెంటనే రావడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.చమురు జాతీయీకరణ నుంచి..వెనెజువెలా చమురు పరిశ్రమకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1970లలో ఆ దేశం చమురు పరిశ్రమను జాతీయీకరించి ప్రభుత్వ ఆధీనంలోని పీడీవీఎస్ఏను (PDVSA) కేంద్రంగా మార్చింది. ఆ తర్వాత హ్యూగో చావెజ్ పాలనలో విదేశీ చమురు సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ మరింత పెరిగింది. విదేశీ కంపెనీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాయింట్ వెంచర్లలోకి తీసుకురావడంతోపాటు కొన్ని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అమెరికా చమురు సంస్థల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి.మదురో తొలగింపు తర్వాత వేగం..నికొలస్ మదురోను అమెరికా సైనిక చర్య అధ్యక్ష ద్వారా పదవి నుంచి తొలగించిన తర్వాత వెనెజువెలా చమురు రంగంపై వాషింగ్టన్ దృష్టి మరింత పెరిగింది. అమెరికా రిఫైనరీలకు వెనెజువెలా నుంచి స్థిరమైన ముడి చమురు సరఫరా ఉండేలా చూడటంతోపాటు అమెరికా కంపెనీల పెట్టుబడులను ప్రోత్సహించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మదురోను అమెరికాకు తరలించి నార్కోటెర్రరిజం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై కేసులు ఎదుర్కొనేలా చేసిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత తాజా చమురు ఒప్పంద ప్రకటన రావడం గమనార్హం.అమెరికాకు మరో అవసరం..అమెరికాలో పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావడం కీలకంగా మారింది. ఇప్పటికే అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి భారీగా చమురును విడుదల చేసింది. ఆగస్టు ప్రారంభంలో ఆ నిల్వలు 30 కోట్ల బ్యారెళ్ల కంటే దిగువకు పడిపోయాయి. 2026 ప్రారంభంతో పోలిస్తే 10 కోట్ల బ్యారెళ్లకు పైగా తగ్గాయి.ఈ నేపథ్యంలో వెనెజువెలా నుంచి అదనపు చమురు సరఫరాను పొందడం అమెరికాకు రెండు విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఒకవైపు రిఫైనరీలకు ముడి చమురు సరఫరా పెరుగుతుంది. మరోవైపు భవిష్యత్తులో వ్యూహాత్మక చమురు నిల్వలను తిరిగి నింపేందుకు కూడా ప్రత్యామ్నాయాలు లభిస్తాయి.ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు, చట్టపరమైన నిర్మాణం, పెట్టుబడుల విధానం, చమురు క్షేత్రాల ఎంపిక వంటి అంశాలు స్పష్టమైన తర్వాతే ఈ డీల్ అసలు ప్రభావం ఎంత ఉంటుందో అంచనా వేయగలమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగిన వెనెజువెలా.. వాటిని వెలికితీసే సామర్థ్యాన్ని తిరిగి సాధిస్తే ప్రపంచ ఇంధన మార్కెట్పై కూడా గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ట్రంప్కు బిగ్ షాక్ -
నీతులు చెప్పే చైనాకు.. బాన్కియావో ఘోరకలి గుర్తుందా?
హిమాలయ ప్రాంతంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. చైనా తీరు వివాదాస్పదంగా మారింది. ఫ్లాష్ఫ్లడ్స్ గురించి సమాచారం ఉన్నప్పటికీ చైనా తమను హెచ్చరించలేదని నేపాల్ ఆరోపించింది. అయితే చైనా మాత్రం ఆ ఆరోపల్ని ఖండించింది. ఇలాంటి సమయంలో ఆరోపణలు కాదని.. ఇరు దేశాలు పరస్పర సహకారంతో పనిచేయాలని.. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఉండాలని సూచించింది. దీంతో చైనా చెబుతున్న సహకార నీతుల నేపథ్యంలో గతంలో అదే గడ్డపై జరిగిన అతిపెద్ద డ్యామ్ విపత్తు మరోసారి చర్చకు వచ్చింది.బుధవారం నేపాల్లోని పలు జిల్లాలను ఆకస్మిక వరద ముంచెత్తింది. ఇళ్లు, దుకాణాలు, రహదారులు, వంతెనలు.. ఊర్లకు ఊళ్లే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. టిబెట్ సరిహద్దులోని చైనా రీజియన్లో మంచు ఫలకాలు కూలిపోవడం వల్ల భారీగా నీరు ఒక్కసారిగా దిగువకు వచ్చిందని ఓ అంచనాకు వచ్చారు. అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపడుతున్న మౌలిక వసతుల నిర్మాణాలపై కూడా నేపాల్లోని కొందరు నిపుణులు, జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వాస్తవానికి హిమాలయ ప్రాంతంలో హిమానీనదాలు, హిమ సరస్సులు, కొండచరియలు, భారీ వర్షాలు, నదీ ప్రవాహాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఉండటం దిగువ దేశాలకు అత్యంత కీలకం. టిబెట్లో చోటుచేసుకునే ప్రకృతి పరిణామాలు నేపాల్లోని నదులపై తక్కువ సమయంలోనే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిన వెంటనే దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు పంపాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో నేపాల్ ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది.చైనా చరిత్రలో మాయని మచ్చనేపాల్ ఆరోపణల నేపథ్యంలో.. 1975లో చైనాలో జరిగిన బాన్కియావో డ్యామ్(Banqiao Tragedy) విపత్తు మళ్లీ గుర్తుకొస్తోంది. హెనాన్ ప్రావిన్స్లోని రు నదిపై నిర్మించిన బాన్కియావో డ్యామ్ను వరద నియంత్రణ, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారు. నిర్మాణం పూర్తయిన కొద్దికాలానికే డ్యామ్, గేట్లలో పగుళ్లు కనిపించడంతో సోవియట్ ఇంజినీర్ల సాయంతో మరమ్మతులు చేపట్టారు. అయితే ఆ తర్వాత అది ‘ఐరన్ డ్యామ్’గా పేరుపొందింది.కానీ 1975 ఆగస్టులో టైఫూన్ నినా కారణంగా హెనాన్లో ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం మూడే రోజుల్లో.. ఏడాది మొత్తంలో కురిసే వర్షపాతం రికార్డైంది. దీంతో బాన్కియావో రిజర్వాయర్లోకి తీవ్ర ఉధృతిలో నీరు వచ్చి చేరింది. అయితే అప్పటికే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.ఒక రాత్రిలో 62 డ్యామ్లు!1975 ఆగస్టు 8 అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే బాన్కియావో డ్యామ్ తెగిపోయింది. భారీగా నీరు దిగువ ప్రాంతాలపైకి దూసుకొచ్చింది. బాన్కియావోకు సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిమాంటన్ డ్యామ్ కూడా దెబ్బతింది. అనంతరం వరుసగా అనేక చిన్న రిజర్వాయర్లు, డ్యామ్లు నాశనం అవుతూ వచ్చాయి. వాటిలో కొన్నింటిని వరద నీటి మల్లింపు కోసం కావాలనే ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా మొత్తం 62 దాకా డ్యామ్లు నాశనం అయినట్లు తర్వాత వివిధ నివేదికలతో వెలుగులోకి వచ్చింది. 2 లక్షల మందికిపైనే..ఈ విపత్తులో మృతుల సంఖ్యపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఆ టైంలో చైనా మీడియా తీవ్రమైన గోప్యత ప్రదర్శించింది. అయితే వరదల కారణంగా 26 వేల మంది మరణించినట్లు 2017లో ప్రిన్స్టన్, సింఘువా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. కరువు, ఆకలి, అంటువ్యాధుల కారణంగా మరో లక్ష మందికి పైగా మరణించి ఉండొచ్చని ఆ అధ్యయనం అంచనా వేసింది.అయితే మరికొన్ని అంచనాలు మాత్రం ఆ మరణాల సంఖ్య 2.3 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ సంఖ్యను కొందరు చైనా నిపుణులు అంచనా వేసినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలు ప్రస్తావించాయి. మరణాల సంఖ్యను పక్కన పెడితే.. దాదాపు కోటి మంది ఈ విపత్తు ప్రభావానికి గురైనట్లు అంచనాలు ఉన్నాయి.సమాచారం ఇవ్వక.. విషాదాన్ని దాచి!బాన్కియావో విషాదంలో చైనాపై మరో తీవ్రమైన ఆరోపణ ఉంది. హెచ్చరికలు సరిగా చేరకపోవడం, అధికారుల నిర్ణయాల్లో జాప్యం, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం కూడా విపత్తు తీవ్రతను పెంచినట్లు తరువాతి అధ్యయనాలు వెల్లడించాయి. అటుపై ఈ విపత్తు పూర్తి స్థాయిని ప్రపంచానికి వెల్లడించలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో డ్యామ్ల వైఫల్యం, ప్రాణనష్టం, సహాయక చర్యల దుస్థితి వంటి అంశాలు విస్తృతంగా బయటకు రావడానికి చాలా సంవత్సరాలే పట్టింది. ప్రస్తుతం నేపాల్–టిబెట్ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు ఈ పాత ఘటనతో ఈ పాతగాయం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే నైతిక పాఠాలు చెప్పే చైనా.. తన పౌరుల భద్రతతో పాటు పొరుగు దేశాల ప్రజల ప్రాణాల విషయంలోనూ అదే పారదర్శకత, బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి విపత్తులు సరిహద్దులు చూడవు.. అలాంటి సమయంలో సమాచారం దాచడం కంటే, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, సహకారంతో వ్యవహరించడమే నిజమైన మానవత్వం. గత విషాదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించడమే ప్రతి దేశం ముందున్న అసలైన బాధ్యత.ఇదీ చదవండి: ఇరాన్ కళ్లుగప్పి అమెరికా అంత పని చేసిందా? -
ఇరాన్ కళ్లుగప్పి.. హర్ముజ్లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్!
ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఏర్పాటు చేసిన మందుపాతరలను(సీ మైన్స్) పూర్తిగా తొలగించినట్లు తెలిపింది. అమెరికా దళాలు అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించి.. శ్రమించి వాటిని తొలగించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ఈ చర్యను అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’గా అభివర్ణించారు.హర్ముజ్పై పట్టు సాధించే క్రమంలో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో సీ మైన్స్ను ఏర్పాటు చేసింది. వీటి కారణంగా అమెరికా బలగాల కదలికలు నిలిచిపోవడంతో పాటు వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర ముప్పు ఏర్పడింది. వాటిని తొలగించడమూ అంత సులువు కాదని.. చాలా సమయం పట్టొచ్చని అప్పట్లో చర్చలు నడిచాయి. ఈ క్రమంలో హర్ముజ్ బ్లాకేడ్(నిర్బంధం) కొనసాగిస్తున్న అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వీటి తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే ఇరాన్ ఏర్పాటు చేసిన సముద్రపు మైన్స్ను తొలగించేందుకు అమెరికా బలగాలు అత్యంత రహస్యంగా ఆపరేషన్ చేపట్టాయి. ముందుగా మైన్స్ ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక డైవింగ్ బృందాలను రంగంలోకి దించారు. సముద్రంలోకి వెళ్లిన ఈ బృందాలు మైన్స్ను గుర్తించి, వాటిని సురక్షితంగా తొలగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన మైన్స్ను పూర్తిగా తొలగించడం అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’ అని ఆయన పేర్కొన్నారు.హర్ముజ్లో మైన్స్ తొలగింపుతో పాటు గత కొన్ని నెలల్లో సుమారు 1,500 వాణిజ్య నౌకలు ఈ జలసంధిని దాటేందుకు అమెరికా దళాలు సహకరించినట్లు కూపర్ తెలిపారు. ఈ నౌకల ద్వారా ప్రపంచ మార్కెట్లకు దాదాపు 750 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయినట్లు వెల్లడించారు. హర్ముజ్లో సురక్షిత రవాణా మార్గాలను పునరుద్ధరించడం అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక పరిణామమని ఈ సందర్భంగా అమెరికా ప్రకటించుకుంది.ఇదిలా ఉంటే.. మైన్స్ తొలగించినంత మాత్రాన హర్ముజ్లో ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఇంకా తొలగిపోలేదు. దీంతో నౌకల రాకపోకలు పూర్తిగా సాధారణ స్థితికి చేరడానికి సమయం పట్టే అవకాశం ఉంది.ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిమరోవైపు ఇరాన్పై అమెరికా ఆర్థిక, సైనిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్ నౌకాశ్రయాల్లోకి ప్రవేశించేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 75 నౌకలను వెనక్కి పంపినట్లు అమెరికా తెలిపింది. మరో మూడు నౌకలపై సైనిక చర్యలు(స్వల్ప దాడులు!) తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే మానవతా అవసరాల కోసం ప్రయాణించే నౌకలకు మాత్రం మినహాయింపులు ఇచ్చినట్లు పేర్కొంది.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి, నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఖతార్, ఒమన్ వంటి దేశాలు ఇరాన్తో చర్చలు జరుపుతున్నాయి. అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను సడలించడం వంటి అంశాలపై ఇరాన్ పట్టుబడుతున్నట్లు సమాచారం.చమురు మార్కెట్లపై ప్రభావం?ప్రపంచ ఇంధన సరఫరాలో హర్ముజ్ జలసంధిది అత్యంత కీలకమైన స్థానం. ఈ మార్గంలో నౌకల రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలిగితే చమురు, గ్యాస్ సరఫరాపై ఉన్న ఒత్తిడి తగ్గి అంతర్జాతీయ ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉంది. అయితే అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ పూర్తిగా సురక్షితంగా మారిందని చెప్పడానికి ఇంకా పరిస్థితులను నిశితంగా గమనించాల్సి ఉంది.ఇదీ చదవండి: కెనడాకు బీపీ తెప్పించిన ట్రంప్.. ఏం చేశారంటే? -
చైనాలో భారీ భూకంపం.. నేపాల్లో హైఅలర్ట్
బీజింగ్: వరుస ప్రకృతి విలయాలు ఆసియా దేశాలను వణికిస్తున్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దులో జలవిలయం మరువక ముందే.. చైనాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో చైనా నేపాల్ను అప్రమత్తం చేసింది. నేపాల్-టిబెట్ సరిహద్దులో మరో భారీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. తాజా పరిణామం మరింత వణుకు పుట్టిస్తోంది.సిచువాన్ ప్రావిన్స్ లాంగ్చాంగ్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం 5.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్స్ సెంటర్ (CENC) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. లాంగ్చాంగ్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెంటనే వెల్లడికాలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.గత రాత్రి నేపాల్, టిబెట్లు కూడా భూకంపంతో వణికిపోయాయి. ఆకస్మిక వరదల తర్వాత మరోసారి ఏ ముప్పు ముంచుకొస్తుందేమోనని వణికిపోయిన ప్రజలు రాత్రంతా నడి రోడ్లపైనే గడిపారు. ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం గ్లేసియర్ కూలిపోవడంతోనే సిచువాన్ ప్రావిన్స్ భూకంపం సంభవించిందని.. బారియర్ సర్సు తెగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇటు భూకంపం నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. ఏ క్షణంలోనైనా వరద విరుచుకుపడొచ్చని నేపాల్కు హెచ్చరిక జారీ చేసింది. ఇక టిబెట్ సరిహద్దులో వరద సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిచింది. మరో వరద ముంచుకొస్తున్న నేపథ్యంలోనే రెస్క్యూ నిలిపివేసినట్లు వెల్లడించింది. గైరాంగ్ పోర్ట్ వద్ద వరద ప్రవాహాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మరో జల ప్రళయం ముప్పు నేపథ్యంలో నేపాల్ కూడా అప్రమత్తమైంది. రుసువా, నువాకోట్లకు తీవ్ర ముప్పు పొంచి ఉండడంతో.. అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరికాసేపట్లో భారీ వరద దూసుకొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మొన్నటి వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ఏ క్షణమైనా వరద ముంచెత్తుతుందన్న పోలీసుల హెచ్చరికలతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పారిపోతున్నారు.ఇదీ చదవండి: యుగాంతాన్ని తలపించేలా నేపాల్కు మరో ముప్పు! -
నేపాల్లో రెడ్ అలర్ట్.. మరో భారీ జల ప్రళయం ముప్పు
మరో వరద ముప్పు పొంచి ఉండడంతో నేపాల్ చిగురుటాకులా వణికిపోతోంది. కాసేపట్లో.. మొన్న సంభవించిన ఆకస్మిక వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ఫ్లాష్ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని చైనా హెచ్చరికలు జారీ చేసింది. కాసేపట్లో ఆ వరద నేపాల్ను ముంచెత్తబోతుందనే సమాచారం అందుతోంది. దీంతో నేపాల్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించి.. ప్రజల్ని అప్రమత్తం చేసింది. మరోవైపు ప్రాణభయంతో నదీ తీర ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. నేపాల్కు మరో భారీ జల ప్రళయ ముప్పు పొంచి ఉంది. గ్లేసియర్లు బద్ధలు కావడం.. చైనా సరిహద్దులో బారియర్ సరస్సు తెగిపోవడంతో వరద ఉధృతంగా దూసుకొస్తోందని తెలుస్తోంది. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సహాయక చర్యలను నిలిపివేసిన అధికారులు.. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని చెబుతున్నారు. ఇటు వరద ముప్పు నేపథ్యంలో ఇటు చైనా కూడా టిబెట్లో సహాయక చర్యలను చైనా నిలిపివేసింది. గైరాంగ్ పోర్టు వద్ద ప్రవాహాన్ని అధికారులు గమనిస్తున్నారు.టిబెట్లోని గైరాంగ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన సరస్సు కట్ట తెగిపోవడంతో నేపాల్లో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో నేపాల్ భద్రతా బలగాలు, సహాయక సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించాయి. దీంతో గంటన్నర పాటు సహాయక చర్యలను నిలిపివేశారు. టిబెట్లోనూ వరద ప్రమాదం కారణంగా చైనా రెస్క్యూ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేసి, సిబ్బందిని కిలోమీటరు మేర వెనక్కి రప్పించింది. రెండు రోజుల క్రితం మట్టి, శిథిలాల ప్రవాహంతో ఏర్పడిన ఈ బారియర్ సరస్సు పొంగిపొర్లుతుండటంతో మరిన్ని వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.ఏ క్షణమైనా నేపాల్ను వరదలు ముంచెత్తనున్నాయని పోలీసుల హెచ్చరికలతో నేపాల్ ప్రజలు పరుగులు తీస్తున్నారు. క్షణక్షణానికి పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. బారియర్ సరస్సు వరద విరుచుకుపడితే.. రుసువా, నువాకోట్కు తీవ్ర ముప్పు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.Alert !! pic.twitter.com/grYxhc5N7Q— Nepal Police (@NepalPoliceHQ) August 28, 2026బిహార్ సరిహద్దు గ్రామాల్లో హైఅలర్ట్నేపాల్ వరద హెచ్చరికల నేపథ్యంలో ఇటు సరిహద్దు గ్రామాలు సైతం అప్రమత్తం అవుతున్నాయి. భారత్లోని బిహార్లో గండకీ నది బ్యారేజ్కు వరద ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్-బిహార్ బోర్డర్లో గ్రామాలను స్థానికులు ఖాళీ చేస్తున్నారు. అక్కడ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఇదీ చదవండి: చైనాలో భారీ భూకంపం.. నేపాల్లో హైఅలర్ట్బుధవారం ఉదయం ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడడంతో నేపాల్ అతలాకుతలం అయ్యింది. ఇప్పటిదాకా 500 మృతదేహాలు వెలికి తీయగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. సుమారు 1500 మంది ఆచూకీ గల్లంతైంది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. ఈసారి ఐదు రెట్ల వరద వస్తుందన్న హెచ్చరికలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. -
జుట్టు పట్టుకుని లాగి.. చెవిపోగులు చోరీ!
నేపాల్లో భారీ వరదల నేపథ్యంలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకుని బయటకు లాగిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె చెవులకు ఉన్న బంగారు పోగులను చోరీ చేశారు. దీనికి సంబంధించిన 41 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. నరాయణి నదిలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహాన్ని 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరి గుర్తించారు. చెక్క దుంగల సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు లాగిన వారు.. జుట్టు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమె రెండు చెవులకు ఉన్న పోగులను తొలగించి పక్కన పెట్టుకున్నారు. చుట్టూ ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు.ఈ వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన చిత్వాన్ పోలీసులు నిందితులను గుర్తించారు. గురువారం భరత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని పోఖరా బస్పార్క్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల పట్ల దోపిడీకి పాల్పడటం, అమానవీయంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.మరోవైపు నేపాల్–టిబెట్ సరిహద్దులో వరదలు, కొండచరియలు బీభత్సం తీవ్ర విషాదం మిగిల్చాయి . ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 500 మంది మృతి చెందగా.. 1,400 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. భారీ బురద, కొండచరియల కారణంగా పలు గ్రామాలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రంప్-కిమ్ భేటీ ఇప్పుడు ఎంతో అవసరం! -
నేపాల్ ఫ్లాష్ఫ్లడ్స్.. ఆ ఆరోపణల్ని ఖండించిన చైనా
ఫ్లాష్ఫ్లడ్స్పై ఉద్దేశపూర్వకంగానే తమ దేశం ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదన్న నేపాల్ అధికారుల ఆరోపణలను చైనా ఖండించింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర సహకారం మాత్రమే అవసరమని అభిప్రాయపడింది. అలాగే.. నేపాల్ జలవిలయంపై జరుగుతున్న ఓ ఫేక్ ప్రచారాన్ని కూడా తోసిపుచ్చింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలపై నేపాల్లోని చైనా రాయబార కార్యాలయం గురువారం స్పందిచింది. తమ దేశం ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రస్తుత పరిస్థితుల్లో సహకారంతోనే ప్రాణాలను కాపాడగలమని పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర ఆరోపణల కంటే సహాయక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బాధితులను ఆదుకోవడం, సహాయక చర్యలను వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి’’ అని పేర్కొంది.అలాగే చైనా వైపు ఉన్న ఓ డ్యామ్ కూలిపోయి.. నేపాల్లో ఈ విధ్వంసం జరిగిందన్న ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని, ‘ఫేక్ న్యూస్’ అని ఖాట్మాండులోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.భూకంపం.. హిమపాతమే కారణం: చైనాఆగస్టు 26 ఉదయం భూకంపమో, భూకంపం మాదిరిగా మంచు ఫలకాలు కూలిపోవడం వల్లనో.. భారీగా మంచు, రాళ్లు, మట్టి, నీరు కలిసి ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ప్రవహించడంతో ఫ్లాష్ఫ్లడ్స్ విపత్తు చోటుచేసుకుందని పేర్కొంది. రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల వైపునా ఈ ప్రభావం కనిపించిందని చైనా వెల్లడించింది.175 మంది మృతి.. వందలాది మంది గల్లంతుహిమాలయ ప్రాంతంలో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నీరు, మట్టి, రాళ్లు, మంచు కలిసి వచ్చిన భారీ ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. ఇప్పటివరకు 175 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 1,300 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.నేపాల్ వైపు భిన్న వాదనలువర్షం లేకున్నా.. మెరుపు వరదలు ముంచెత్తడంపై రకరకాల థియరీలు తెరపైకి వచ్చాయి. తొలుత భూకంపమే కారణమని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) తాజా విశ్లేషణలో అది భూకంపం కాదని, గ్లేసియర్ కూలిపోవడం వల్లే భారీ ప్రకంపనలు, ఫ్లాష్ఫ్లడ్స్ సంభవించాయని వెల్లడించింది. భారత్కు చెందిన ఇస్రో మాత్రం తన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణతో.. వరదలకు ముందు సంభవించిన భూకంపం.. గ్లేసియర్ కూలిపోవడానికి ట్రిగ్గర్గా మారి ఉండొచ్చని అంచనా వేస్తోంది.మరోవైపు నేపాల్లో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరదలు టిబెట్ సరిహద్దు నుంచి నేపాల్ జిల్లాలకు చేరేందుకు రెండుగంటల సమయం పట్టిందని.. ఆ గ్యాప్లో చైనా నుంచి ముందస్తు హెచ్చరిక అందలేదని, దీనివల్ల నష్టం మరింత పెరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే చైనా ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఇరు దేశాల మధ్య విపత్తులపై సహకార వ్యవస్థ ఉన్నప్పటికీ.. సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, హిమపాతం వంటి ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే ప్రత్యేక ద్వైపాక్షిక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మాత్రం లేదని తెలుస్తోంది.Deeply saddened by the devastating natural disaster in the Gyirong–Rasuwagadhi border region, which has caused significant casualties and losses on both the Chinese and Nepali sides.My deepest condolences to those who lost their lives, and my sincere sympathies to their…— Ambassador Zhang Maoming (@PRCAmbNepal) August 27, 2026రంగంలోకి దిగిన చైనానేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనపై చైనా త్వరగతిన స్పందించింది. ఈ విపత్తులో తమ వైపు కూడా నష్టం జరిగిందని పేర్కొంటూ.. సహాయక చర్యలను వేగవంతం చేసింది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగించాలని ఆదేశించారు. చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతమైన టిబెట్లో అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. టెంట్లు, దుప్పట్లు, ఇతర సహాయక సామగ్రిని తరలించడంతో పాటు అత్యవసర నిధులను కూడా కేటాయించింది.ఇదీ చదవండి: చైనా బ్రహ్మరాక్షసితో భారత్కే పెనుముప్పు? -
మీ ఫోన్లోనే AI పరీక్ష పెడుతోంది!.. ఎలాగో తెలుసా?
పరీక్ష అంటే ఒకప్పుడు.. ఉపాధ్యాయులు ప్రశ్నలు అడిగేవారు విద్యార్థులు సమాధానాలు రాసేవారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రశ్నాపత్రాలు, మార్కులు ఆ తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇలా పరీక్షల రూపం కాలానుగుణంగా మారుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మరో కొత్త పరీక్ష మొదలైంది. ఎలాంటి ప్రశ్నాపత్రం లేదు.. ఇన్విజిలేటర్ కనిపించడు.. అయినా ప్రతిరోజూ మనం ఓ పరీక్ష రాస్తూనే ఉన్నాం. అదీ మన చేతిలోని స్మార్ట్ఫోన్తోనే!స్మార్ట్ఫోన్ ఇప్పుడు కేవలం సమాచారం తెలుసుకునే సాధనం మాత్రమే కాదు.. మన అలవాట్లు, ఆసక్తులు, అభిరుచులను బయటపెట్టే అద్దంగా మారింది. మనం ఏ వీడియో చూస్తున్నాం? ఏ వార్తపై ఆగుతున్నాం? ఏ ఫొటోను ఇష్టపడుతున్నాం? ఏ అంశాన్ని పదే పదే వెతుకుతున్నాం? ఇవన్నీ మనకు తెలియకుండానే ఓ డిజిటల్ రికార్డుగా మారుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహిస్తోంది కృత్రిమ మేధస్సు (AI). సమాధానాలు రాసేది కలం కాదు.. మన వేళ్లు. మనం చేసే ప్రతి క్లిక్, ప్రతి స్క్రోల్, ప్రతి సెర్చ్, ఒక వీడియోను చూసే సమయం, ఒక వార్తపై స్పందించే తీరు.. ఇవన్నీ AIకి మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే సంకేతాలుగా మారుతున్నాయి. వినియోగదారుల ప్రవర్తనా సరళిని విశ్లేషించే ఈ సాంకేతికత ఆధారంగానే మనకు కనిపించే కంటెంట్, ప్రకటనలు, సిఫార్సులు మారుతున్నాయి.కనిపించని ప్రశ్నాపత్రం ఇదే..ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది చేసే మొదటి పని ఫోన్ చూడటం. యూట్యూబ్లో వీడియోలు చూడటం, సోషల్ మీడియాలో పోస్టులు పరిశీలించడం, గూగుల్లో సమాచారం వెతకడం.. ఇవన్నీ సాధారణ అలవాట్లుగానే అనిపిస్తాయి. కానీ AI దృష్టిలో ఇవన్నీ కీలకమైన డేటా. మీరు ఏ వీడియో దగ్గర ఎక్కువసేపు ఆగారు?. ఏ వార్తను వెంటనే ఓపెన్ చేశారు?. ఏ అంశాన్ని పదే పదే వెతికారు?. ఏ పోస్టును షేర్ చేశారు?. ఎలాంటి ప్రాంప్ట్లతో ఇమేజ్లు జనరేట్ చేస్తున్నారు?.. ఇలాంటి చర్యలను కలిపి AI మీ ఆసక్తులు, అభిరుచులు, ఆలోచనా విధానంపై ఓ అంచనాను రూపొందిస్తుంది.మీకు నచ్చే ప్రపంచాన్నే చూపిస్తుంది..ఉదాహరణకు మీరు వరుసగా ఫుడ్ వీడియోలు చూస్తున్నారు అనుకోండి.. మీ ఫీడ్లో ఆ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన వీడియోలు చూస్తే.. ట్రంప్, చైనా, రష్యా, ఇరాన్ వంటి అంశాలకు సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపించవచ్చు. అలాగే మీరు సినిమాలు, క్రీడలు, టెక్నాలజీ లేదంటే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు ఎక్కువగా చూస్తే.. అదే తరహా సమాచారం మీ ముందుకు వస్తుంది. అంటే ఏఐ అనేది మీకు ప్రపంచాన్ని మొత్తం చూపించదు. మీరు దానితో ఎలా ప్రవర్తిస్తే.. ఆ ఆసక్తితో కూడిన ప్రపంచాన్ని మీ ముందు నిర్మిస్తోంది.జస్ట్ మూడే సెకన్లుడిజిటల్ ప్లాట్ఫార్మ్లలో వినియోగదారుడి దృష్టి చాలా విలువైనది. ఒక వీడియో లేదంటే పోస్టు వద్ద వినియోగదారు ఎంతసేపు ఆగుతున్నాడు? ఎక్కడ స్క్రోల్ ఆపుతున్నాడు? అనే అంశాలు కూడా అల్గారిథమ్లకు సంకేతాలుగా మారతాయి. ఒక వీడియోను వెంటనే స్కిప్ చేస్తే ఆసక్తి లేదని భావించే అవకాశం ఉంటుంది. అదే వీడియోను పూర్తిగా చూస్తే.. ఆ అంశం వినియోగదారుడికి నచ్చిందనే అంచనాకు రావచ్చు. డేటా ఆధారంగానే భవిష్యత్తులో కనిపించే కంటెంట్, ప్రకటనలు, సజెషన్స్ మారుతుంటాయి.భావోద్వేగాలనూ చదువుతున్న ఏఐ..మనిషి నిర్ణయాల్లో భావోద్వేగాల పాత్ర చాలా ఎక్కువ. దీనిని కూడా ఏఐ గుర్తిస్తోంది. ఉదాహరణకు ఒక వార్తకు రెండు శీర్షికలు ఉన్నాయనుకుందాం. ‘‘దేశాన్ని కుదిపేసిన సంచలన నిర్ణయం!’’. ‘‘ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది’’ ఇలా. ఇందులో మొదటి టైటిల్కు ఎక్కువ క్లిక్స్ వస్తే.. సంచలన పదాలు ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని ఏఐ నేర్చుకుంటుంది.అందుకే సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే శీర్షికలు, చిత్రాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఏఐ కూడా మన నుంచే నేర్చుకుంటోంది!చాలామంది ఏఐ మనల్ని మాత్రమే నిశితంగా విశ్లేషిస్తుందని భావిస్తారు. కానీ వాస్తవానికి మన స్పందనల నుంచే ఏఐ చాలా నేర్చుకుంటుంది. తనను తాను మెరుగుపరుచుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల మందిలో.. ఎలాంటి కంటెంట్కు ప్రజలు స్పందిస్తున్నారు?. ఏ అంశాలపై ఎక్కువ సమయం గడుపుతున్నారు?. ఏ విషయాలు వారిని ఆకర్షిస్తున్నాయి?. ఇలాంటి సమాచారంతో ఏఐ మరింత ఖచ్చితమైన సిఫార్సులు అందించే ప్రయత్నం చేస్తోంది.మార్కులు కనిపించవు.. ప్రభావం మాత్రమే!ఈ ఏఐ పరీక్షలో మనకు మార్కులు గట్రా పడవు. ఎలాంటి ఫలితాల పట్టా రాదు. కానీ దాని ప్రభావం మన జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబ్ సూచించే వీడియోలు మారతాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మారతాయి. గూగుల్ మన తర్వాతి ప్రశ్నను ఊహించే ప్రయత్నం చేస్తుంది. ఆన్లైన్ షాపింగ్లో కనిపించే ప్రకటనలు కూడా మన ఆసక్తులకు అనుగుణంగా మారతాయి(ఇది ఎప్పటి నుంచో సోషల్ మీడియాలోనూ నడుస్తున్న తంతే!). మన మాటల కంటే మన ప్రవర్తనే AIకి ఎక్కువ సమాచారం ఇస్తోంది.సౌకర్యమా?.. సవాలా?భవిష్యత్తులో విద్య, వైద్యం, ఉద్యోగాలు, వినోదం వంటి రంగాల్లో ఏఐ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. మనకు అవసరమైన సమాచారాన్ని ముందుగానే అందించడం, పనులను సులభతరం చేయడం, నిర్ణయాల్లో సహకరించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఏఐ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇదే సమయంలో మరో వైపు కూడా ఉంది. మన ప్రతి ఆన్లైన్ కదలిక, ప్రతి ఆసక్తి, ప్రతి అభిరుచి డేటాగా మారుతున్న వేళ.. వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత, తప్పుడు సమాచారాన్ని గుర్తించే సామర్థ్యం మరింత కీలకంగా మారనున్నాయి. సౌకర్యం కోసం ఏఐపై ఆధారపడుతున్న కొద్దీ దాని వినియోగంపై అప్రమత్తత కూడా అంతే అవసరం. ఒకప్పుడు మనిషి యంత్రాలను పరీక్షించాడు. ఇప్పుడు ఏఐ యుగంలో యంత్రం నిశ్శబ్దంగా మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం సాంకేతిక పరిణామం కాదు.. మనిషి, యంత్రం మధ్య కొత్త సంబంధానికి నాంది. అందుకే ఏఐ మనకు సౌకర్యమా?.. లేక కొత్త సవాలా?.. అన్నది నిర్ణయించేది చివరకు మనమే.::వెబ్డెస్క్ ప్రత్యేకంఇదీ చదవండి: ఇరాన్ నాటకాన్ని బయటపెట్టిన ట్రంప్ -
సంచలనం.. అమెరికాలో భారీ సైబర్ దాడుల కుట్ర భగ్నం
అమెరికాలో భారీ సైబర్ దాడి కలకలం రేపింది. ఆ దేశపు అత్యంత కీలకమైన ప్రభుత్వ వ్యవస్థలపై హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయని అక్కడి అధికారులు వెల్లడించారు. సెనెట్తో పాటు న్యాయశాఖ, అంతరిక్ష సంస్థ నాసా, ఫెడరల్ రిజర్వ్ లాంటి కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ ఆపరేషన్ను అడ్డుకున్నట్లు అమెరికా ప్రకటించింది.అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యూస్కాన్(QScan), క్యూటీరూటర్( QTRouter) అనే రెండు హ్యాకింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన డొమైన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ వేదికల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు నెట్వర్క్లలోకి చొరబడేందుకు ప్రయత్నాలు జరిగాయని వెల్లడించింది. అయితే డాటా సురక్షితమేనా?.. కీలక సమాచారం ఏదైనా బయటకు పొక్కిందా? అనే వివరాలను మాత్రం ధృవీకరించలేదు.చైనా హ్యాకర్లపై ఆరోపణలుఈ సైబర్ దాడుల వెనుక చైనా కేంద్రంగా పనిచేసే సంస్థ ఉందని అమెరికా ఆరోపించింది. చైనాకు చెందిన నాన్జింగ్ జిన్జియువీ నెట్వర్క్ టెక్నాలజీ కంపెనీ నిర్వహించిన ఈ వ్యవస్థలను చైనా గూఢచార సంస్థలు, సైన్యానికి సంబంధించిన వర్గాలు ఉపయోగించినట్లు అమెరికా దర్యాప్తు పత్రాల్లో పేర్కొంది. 2018 నుంచే దాడుల ప్రయత్నాలు?ఈ హ్యాకింగ్ కార్యకలాపాలు 2018 నుంచే కొనసాగుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. కీలక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ నెట్వర్క్లు, అంతర్జాతీయ సంస్థల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడుల ప్రయత్నాలు జరిగినట్లు తెలిపారు. 2019లో నాసా నెట్వర్క్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం జరిగినా.. అది విఫలమైందని అధికారులు తెలిపారు. 2024లో ఎనర్జీ డిపార్ట్మెంట్ ల్యాబ్లు, ఆరోగ్య శాఖకు చెందిన సంస్థలు, ఇతర సున్నితమైన నెట్వర్క్లపై చొరబాట్లు జరిగినట్లు వెల్లడించారు. డాటా చోరీపై ఆందోళనసైబర్ దాడితో అమెరికా రక్షణ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి సమాచారం దొంగిలించేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు సైబర్ భద్రతా సంస్థలు తెలిపాయి. సెనెట్, ఆసుపత్రి నెట్వర్క్లను కూడా హ్యాకర్లు పరిశీలించినట్లు దర్యాప్తులో తేలింది. చైనా రియాక్షన్అమెరికా ఆరోపణలపై చైనా స్పందిస్తూ.. సైబర్ దాడులను తమ దేశం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని తెలిపింది. సైబర్ భద్రత అంశాలను ఉపయోగించుకుని చైనాను అపఖ్యాతి పాలుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. అయితే తాజా నివేదికలపై మాత్రం డ్రాగన్ దేశం స్పందించాల్సి ఉంది. సైబర్ యుద్ధం ఇలా..అమెరికా-చైనా మధ్య ఇప్పటికే వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైబర్ నిపుణుల ప్రకారం.. ప్రభుత్వ ప్రోత్సాహంతో పనిచేసే హ్యాకింగ్ నెట్వర్క్లు ప్రపంచవ్యాప్తంగా కీలక సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ఆ మధ్య ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అత్యంత జాగ్రత్తగా అమెరికా భద్రతా బలగాలు వ్యవహరించాయి. తాజాగా జరిగిన సైబర్ దాడుల వ్యవహారం రెండు దేశాల మధ్య డిజిటల్ భద్రతపై కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కళ్లెదుటే కల్లోలం.. ఈ షాకింగ్ దృశ్యాలు చూశారా? -
Nepal Flash Floods: అప్పుడే అయిపోలేదు.. మరోసారి డేంజర్ బెల్
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించింది. రాసువా జిల్లాలో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో 162 మంది మృతి చెందారు(ఇప్పటిదాకా). వందలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అందులో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం.భోట్ కోషి, త్రిశూలి నదీ వ్యవస్థల్లో ఒక్కసారిగా వచ్చిన వరదలు భారీగా మట్టి, రాళ్లు, బండరాళ్లను కొట్టుకొచ్చాయి. ఉదయం 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి వచ్చిన భారీ నీటి ప్రవాహం నేపాల్లోని రాసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అనేక గ్రామాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి నేపాల్లో రవాణా, విద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం 19 వంతెనలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రాసువాగఢి సరిహద్దు మార్గం కూడా ధ్వంసమైంది. ఎనిమిది జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇందులో రాసువాగఢి, సంజెన్ ఖోలా, అప్పర్ త్రిశూలి-3ఏ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.Ground level footage shows people running for their lives as a sudden flash flood tears through the Nepal–Tibet region pic.twitter.com/kTY1bg2HJJ— Surajit (@surajit_ghosh2) August 26, 2026మరో వరద ముప్పు.. ఐసీఎంఓడీ హెచ్చరికహిమాలయ ప్రాంతాలపై అధ్యయనం చేసే అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ (ICIMOD) కీలక హెచ్చరిక జారీ చేసింది. వరదకు కారణమైన ప్రాంతంలో ఇంకా ఓ భారీ నీటి అడ్డంకి కొనసాగుతోందని, అది తెగిపోతే మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది.ఐసీఎంఓడీ వాతావరణ, పర్యావరణ ప్రమాదాల వింగ్ చీఫ్ కియాంగ్గాంగ్ జాంగ్ మాట్లాడుతూ.. గతేడాది వరదలు సంభవించిన ప్రాంతమే మళ్లీ ప్రమాదంలో ఉందన్నారు. లెండే ఖోలా ప్రాంతంలో మంచు-రాళ్ల కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ విపత్తు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే కారణం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదని తెలిపారు.గతేడాది కూడా ఇదే లెండే ఖోలా ప్రాంతం భారీ వరదలకు గురైంది. 2025 జూలైలో టిబెట్ సరిహద్దు సమీపంలో గ్లేసియర్ సరస్సు తెగిపోవడం వల్ల ఒక్కసారిగా భారీగా నీరు, బురద, రాళ్లు దిగువకు ప్రవహించాయి. ఈ వరద భోటే కోషి నదిలో కలసి రాసువా ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆ వరదల్లో 15 మంది దాకా మరణించారు. రాసువాగఢి సరిహద్దు వంతెన, రహదారులు, పలు మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఈ ఘటన నుంచి కోలుకోకముందే ఇప్పుడు అదే ప్రాంతంలో మరోసారి వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.నిమిషాల్లోనే పెరిగిన నదీ ప్రవాహంఅయితే తాజా ఫ్లాష్ఫ్లడ్స్కు తీవ్రతకు నదుల్లో నీటి మట్టాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. త్రిశూలి నదిలోని గల్చి ప్రాంతంలో కేవలం 30 నిమిషాల్లోనే నీటిమట్టం 9 మీటర్ల మేర పెరిగింది. మాలేఖు ప్రాంతంలో 7 మీటర్ల మేర పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇంత వేగంగా నీటి మట్టం పెరగడం వల్ల పర్వత ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయిన నీరు, మట్టి, మంచు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.భూకంపం కాదు.. కొండచరియల కదలికగా గుర్తింపుతొలుత ఈ విపత్తుకు కారణం భూకంపం అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) విశ్లేషణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 5.2 తీవ్రతతో నమోదైన సీస్మిక్ సంకేతాలు వాస్తవానికి భూకంపం వల్ల కాకుండా భారీ కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడినవిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో భారీగా మంచు, రాళ్లు కదలడంతో భూకంప తరంగాల్లాంటి సంకేతాలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.మంచు కొండ కూలి.. లోయలోకి దూసుకొచ్చిన విపత్తుశాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు చేస్తున్న ప్రాథమిక అంచనాల ప్రకారం.. హిమనదంలోని దిగువ భాగం విరిగిపడి వందల మీటర్ల ఎత్తు నుంచి లోయలోకి పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మంచు-రాళ్ల భారీ దిబ్బ లెండే ఖోలా నదిలో పడటంతో ఒక్కసారిగా నీరు, బురద, భారీ బండరాళ్లతో కూడిన వరద ప్రవాహం దిగువకు దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.Glacier Lake Bursts in Tibet, Sending a Massive Flood Toward Nepal! 🤯A sudden glacier lake outburst in Tibet unleashed a powerful surge of water and debris, triggering severe flooding downstream in Nepal’s Koshi River system. The sheer force of nature is terrifying…— Horizon Wire (@HorizonWireHW) August 27, 2026చైనా వైపునా విధ్వంసం.. గ్యిరోంగ్ పోర్టుకు భారీ నష్టంవరద ప్రభావం నేపాల్కే పరిమితం కాలేదు. టిబెట్లోని గ్యిరోంగ్ ప్రాంతం కూడా తీవ్రంగా దెబ్బతింది. మట్టి, రాళ్ల ప్రవాహంతో రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా దెబ్బతిన్నాయి. చైనా అధికారులు గ్యిరోంగ్ పోర్టు ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. సరిహద్దు మార్గాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక బృందాలకు చేరుకోవడం కష్టంగా మారింది.భారతీయ యాత్రికుల కోసం ఆందోళనవరదల్లో గల్లంతైన వారిలో పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఉన్నారు. నేపాల్ పర్యాటక శాఖ ప్రకారం 400 మందికి పైగా పర్యాటకుల ఆచూకీ కొంతకాలం తెలియలేదు. ఇందులో 133 మంది భారతీయ కైలాస్ మానస సరోవర్ యాత్రికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 57 మంది ఎన్నారైలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిని గుర్తించేందుకు నేపాల్ రక్షణ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బురదలో కూరుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.నేపాల్కు భారత్ సాయంవిపత్తు నేపథ్యంలో భారత్ వెంటనే స్పందించింది. సహాయక సామగ్రి, వైద్య పరికరాలతో కూడిన విమానాన్ని భారత వైమానిక దళం నేపాల్కు పంపించింది. 10 టన్నుల సహాయ సామగ్రిని తరలించినట్లు సమాచారం. భారత ప్రదాని నరేంద్ర మోదీ జలప్రళయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘ప్రజలు ఎదుర్కొంటున్న నష్టం ఎంతో బాధాకరం. ప్రభుత్వం తన పూర్తి వనరులతో సహాయక చర్యలు చేపడుతోంది’’ అని తెలిపారు.తొమ్మిది మంది దక్షిణ కొరియా కార్మికులు గల్లంతువరద ప్రభావిత ప్రాంతాల్లో విదేశీయులు కూడా చిక్కుకున్నారు. నేపాల్లోని ఓ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న తొమ్మిది మంది దక్షిణ కొరియా కార్మికులు గల్లంతైనట్లు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో పది మంది వరద ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు తెలిపింది. వారిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలను పంపిస్తోంది.కైలాస్ యాత్రకు తీవ్ర అంతరాయంనేపాల్-టిబెట్ సరిహద్దు మార్గం మూసుకుపోవడంతో కైలాస్ మానస సరోవర్ యాత్రపై తీవ్ర ప్రభావం పడింది. రాసువాగఢి-కెరుంగ్ మార్గం పూర్తిగా దెబ్బతింది. వంతెనలు కొట్టుకుపోవడం, రహదారులు ధ్వంసం కావడంతో యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రైవేటు మార్గాల్లో వెళ్లిన వందలాది మంది యాత్రికుల కాంటాక్ట్ తెగిపోవడంతో ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికులపై ఆందోళనకైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది సభ్యులు టిబెట్లోని గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలో వరదలు సంభవించాయని ఆ సంస్థ తెలిపింది. వారి పరిస్థితి, ఆచూకీపై అధికారిక సమాచారం అందలేదని సంస్థ వ్యవస్థాపకుడు సద్గురు తెలిపారు. తమ బృందాలు అధికారులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు.భారత్లోనూ అప్రమత్తత.. బిహార్, యూపీకి వరద అలర్ట్నేపాల్ నుంచి వచ్చే వరద నీటితో భారత్లోని సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బిహార్లో గండక్ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షణ పెంచారు. వాల్మీకినగర్ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాల్లోనూ అలర్ట్ జారీ చేశారు.ప్రస్తుత వరదతో ప్రమాదం ముగిసిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెండే ఖోలా ప్రాంతం ఎగువన ఇంకా నీటి అడ్డంకి కొనసాగుతున్నట్లయితే అది ఎప్పుడైనా తెగిపోయి మరో భారీ వరదకు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే భోటే కోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: విమానంలో వచ్చి.. మనిషిని చంపిన దోమ!! -
పాక్లో ఘోరం.. 15 మంది నవజాత శిశువులు సజీవదహనం
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఘోరం జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అప్పుడే పుట్టిన బిడ్డలు 15 మంది సజీవ దహనం అయ్యారు. ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మిలాద్ ఉన్ నబీ పూట నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇస్లామాబాద్ పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. గైనకాలజీ వార్డులోని నర్సరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నర్సరీలో 16 మంది శిశువులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. వారిలో ఒక్కరిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన 15 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.కారణం ఏంటంటే.. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పిల్లల వార్డులోని ఎయిర్ కండిషనర్(AC) కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే అధికారులు మాత్రం ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. తొలుత మృతుల సంఖ్యపైనా స్పష్టత రాలేదు. కాసేపటికే 15 మంది నవజాత శిశువులు చనిపోయినట్లు స్థానిక జియో టీవీ కథనం ఇచ్చింది.తెల్లవారుజామునే విషాదంసమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాయి. నాలుగు ఫైరింజన్లు, ఆరు ఆంబులన్స్లు రెస్క్యూలో పాల్గొన్నాయి. అయితే బుధవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో మంటలు ప్రారంభమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. కొంతసేపటి పాటు ‘కూలింగ్ ఆపరేషన్స్’ కొనసాగినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ ప్రమాదంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కన్నవాళ్ల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణమంతా శోకసంద్రంలో నిండిపోయింది. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు.🚨 TRAGIC: Fire at PIMS Hospital in Islamabad Kills 15 NewbornsAC compressor explosion in the gynecology ward sparks deadly blaze.#PIMS #Islamabad #Pakistan #BreakingNews@MarioNawfal pic.twitter.com/Z2exHnPX3J— DR ADNAN ALI (@DrMalko) August 26, 2026 ఇదీ చదవండి: భారత్లో ఆ మరణాలు.. షాకిచ్చిన నివేదిక -
చనిపోని దేహంతో.. చెడిపోని ప్రాణంతో!
మనిషి శరీరాన్ని పోలిన యంత్రుడు మరమనిషి. కానీ మనిషికి సాధ్యమైన పనులను మరింత వేగంగా, కచ్చితంగా చేయగలిగే శక్తి!. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి.. మనిషి, యంత్రం మధ్య ఉన్న తేడాను రోజురోజుకూ తగ్గిస్తోంది. ఈ మార్పునకు తాజా ఉదాహరణే ‘టియాన్గాంగ్ అల్ట్రా’.చైనా మరోసారి సాంకేతిక ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఈసారి కారణం కారు కాదు, క్షిపణి కాదు.. ‘టియాన్గాంగ్’ (Tiangong) అనే హ్యూమనాయిడ్ రోబోట్. మనిషిలా రెండు కాళ్లపై నడవడం, చకచకా మెట్లు ఎక్కడం, ఎత్తుపల్లాలపై బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడం, పరిసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలతో ఈ రోబోట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్ పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, విపత్తు నిర్వహణలో టియాన్గాంగ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.జస్ట్ 8.86 సెకన్లలోనే..బీజింగ్లో జరుగుతున్న 2026 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్లో.. 16 దేశాలకు చెందిన సుమారు 2,000 రోబోలు పాల్గొన్నాయి. ఇందులో టియాన్గాంగ్ అల్ట్రా తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 100 మీటర్ల పరుగును కేవలం 8.86 సెకన్లలో పూర్తి చేసింది. ఇంతకు ముందు ఇదే రోబోట్ 9.39 సెకన్లతో ఉసేన్ బోల్డ్ రికార్డును అధిగమించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టియాన్గాంగ్ కేవలం నడిచే రోబోట్ కాదు. పరుగులో వేగాన్ని పెంచుకుంటూనే తన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం, అడుగుల్లో చిన్న మార్పులు చేసుకోవడం, ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా కదలికలను సరిచేసుకోవడం దీని ప్రత్యేకత. అలా బాక్సింగ్ సహా పలు కేటగిరీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది.అసలు టియాన్గాంగ్ అంటే?టియాన్గాంగ్ అనే చైనీస్ పదానికి స్వర్గ భవనం అని అర్థం. మనిషి శరీర నిర్మాణాన్ని పోలిన పూర్తి పరిమాణ హ్యూమనాయిడ్ రోబోట్ ఇది. బ్రెయిన్ను బట్టి మనిషి శరీరం ముందుకు నడుస్తుంది. ఇదే టియాన్గాంగ్ విషయంలో ఆ పనిని సెన్సర్లు, కంప్యూటింగ్ వ్యవస్థ, కృత్రిమ మేధ(AI) చేస్తాయి. చుట్టూ ఉన్న వస్తువులు, అడ్డంకులు, నేల పరిస్థితులను గుర్తించి.. వాటికి అనుగుణంగా తన కదలికలను మార్చుకుంటుంది.కళ్లుగా కెమెరాలు.. చెవులే సెన్సర్లుటియాన్గాంగ్కు మనిషిలా కళ్లూ, చెవులూ ఉండవు కదా! వాటి పనిని చేసే సాంకేతిక వ్యవస్థ ఉంది. కెమెరాలు, లిడార్ సెన్సర్లు, ఫోర్స్ సెన్సర్లు, ఇతర సెన్సింగ్ వ్యవస్థలు పరిసరాల సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటాను ఏఐ ఆధారిత కంప్యూటింగ్ వ్యవస్థ విశ్లేషిస్తుంది. ముందున్న అడ్డంకి ఎంత దూరంలో ఉంది? నేల సరిగ్గా ఉందా? అడుగు ఎక్కడ వేయాలి? వేగాన్ని తగ్గించాలా? పెంచాలా? వంటి విషయాలపై క్షణాల్లో నిర్ణయం తీసుకుని కాళ్లు, చేతులు, శరీర కదలికలను సమన్వయం చేస్తుంది. అందుకే టియాన్గాంగ్ నడకలో మెషిన్ కంటే మనిషి కదలికలను పోలిన సహజత్వం కనిపిస్తుంది.తోసినా.. తడబడినా పడిపోదు!హ్యూమనాయిడ్ రోబోట్లకు అతిపెద్ద సవాళ్లలో ఒకటి సమతుల్యం(బ్యాలెన్స్). రెండు కాళ్లపై నడిచే యంత్రం చిన్న పొరపాటుతోనైనా కిందపడే ప్రమాదం ఉంటుంది. అయితే టియాన్గాంగ్ ఇందులో గణనీయమైన పురోగతి సాధించింది. ఎవరైనా తోసినా, నేల ఒక్కసారిగా మారినా శరీర బరువును మార్చుకుని తిరిగి బ్యాలెన్స్లోకి వచ్చేసేలా దీన్ని రూపొందించారు. నడుస్తున్నప్పుడు ప్రతి అడుగును ముందుగానే ఊహించి.. అవసరమైతే కదలికను మధ్యలోనే సరిచేసుకునే సామర్థ్యం దీనికి ఉంది. అంటే.. మనిషి తడబడినప్పుడు వెంటనే కాలు మార్చి నిలబడినట్లే, ఈ రోబోట్ కూడా తన కదలికలను సర్దుబాటు చేసుకుంటుంది.పరుగే కాదు.. ఇంకా చాలాటియాన్గాంగ్ పేరు ఇప్పుడు 100 మీటర్ల పరుగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నప్పటికీ.. దాని అసలు లక్ష్యం క్రీడా ప్రదర్శన కాదు. మనుషులు చేసే అనేక పనులను భవిష్యత్తులో రోబోట్లు చేపట్టేలా సాంకేతికతను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశం. ఫ్యాక్టరీల్లో యంత్రాల మధ్య పనిచేయడం, గోదాంల నుంచి వస్తువులను తరలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం, విపత్తుల సమయంలో శిథిలాల్లోకి వెళ్లడం వంటి పనుల్లో హ్యూమనాయిడ్ రోబోట్లు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంతే కాదు.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం, ఆసుపత్రుల్లో కొన్ని పనులు నిర్వహించడం వంటి సేవల్లోనూ భవిష్యత్తులో వీటి వినియోగం పెరగొచ్చని రోబోటిక్స్ రంగం అంచనా వేస్తోంది.ఒక్క రోబోట్ కాదు.. చైనా పెద్ద ప్రయోగంటియాన్గాంగ్ను అభివృద్ధి చేసింది.. బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్. ఇది ఒక వ్యక్తి చేసిన ప్రయోగం కాదు. ఇంజినీర్లు, రోబోటిక్స్ నిపుణులు, ఏఐ పరిశోధకులు, విద్యా సంస్థలు కలిసి పనిచేసిన పెద్ద ప్రాజెక్టు. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ను భవిష్యత్ పరిశ్రమల్లో కీలక రంగంగా చైనా భావిస్తోంది. అందుకే పరిశోధన, తయారీ, ఏఐ సాంకేతికతలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ముందుకు వెళ్తోంది.మనిషికి ప్రత్యామ్నాయమా?టియాన్గాంగ్ అల్ట్రా రికార్డు చూసిన వెంటనే తలెత్తే ప్రశ్న ఇదే. భవిష్యత్తులో రోబోట్లు మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తాయా?. నిపుణుల దృష్టిలో ప్రస్తుతానికి సమాధానం అంత సులభం కాదు. హ్యూమనాయిడ్ రోబోట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మానవుడిలా అన్ని పరిస్థితులను అర్థం చేసుకోవడం, భావోద్వేగాలను గ్రహించడం, సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాల్లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.8.86 seconds for 100m.🏃💨 That's not a sprinter. That's #Tiangong Ultra, a #humanoid #robot.It just broke the human record for a 100m sprint at the World Humanoid Robot Games. And honestly? My 100m time is looking real slow right now. 🤖🥇#humanoidrobot #TiangongUltra pic.twitter.com/11UUlgY9q4— So Shanghai (@shanghai490528) August 26, 2026మనిషి చేసే పనులను మనిషితో కలిసి చేయగలిగే తెలివైన యంత్రాల యుగం మొదలైంది. కేవలం 100 మీటర్లను 8.86 సెకన్లలో పరుగెత్తిన టియాన్గాంగ్ ఆ భవిష్యత్తుకు టీజర్ మాత్రమే. మనిషిలా ఆకారం.. యంత్రంలా శక్తి.. ఏఐ ఆలోచన.. టియాన్గాంగ్ రికార్డు కేవలం ఒక రోబోట్ గెలుపు కాదు రాబోయే సాంకేతిక ప్రపంచానికి చైనా ఇచ్చిన సంకేతం.:::వెబ్డెస్క్ ప్రత్యేకంఇదీ చదవండి: ఆ రహస్య విమానంలో వచ్చింది ఆయనేనంట! -
సి-17లో వచ్చిందెవరో తెలుసా?.. ఆయనే!
మాస్కోలో అర్ధరాత్రి అమెరికా సైనిక విమానం ల్యాండ్ అయింది. ఆ వెంటనే రష్యాపై ఉక్రెయిన్ దాడులు ఆగిపోయాయి! అసలు ఆ విమానంలో ఉన్నదెవరు? ఎందుకు ఇంత రహస్యంగా మాస్కోకు వచ్చారు? అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. ఇప్పుడు ఆ మిస్టరీ దాదాపు వీడినట్లే కనిపిస్తోంది. అమెరికా సీఐఏ డైరెక్టర్ జాన్ ర్యాట్క్లిఫ్ రష్యా అధికారులతో రహస్య చర్చల కోసం మాస్కో వచ్చినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ జాన్ ర్యాట్క్లిఫ్ రహస్యంగా రష్యా వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన ఎవరిని కలిశారు? ఎలాంటి అంశాలపై చర్చలు జరిపారు? అనే వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే మంగళవారం ఆయన రష్యా అధికారులతో సమావేశమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదే సమయంలో అమెరికా సీఐఏ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా మీడియా ముందు ఈ పర్యటనను ధ్రువీకరించలేదు. మాస్కోకు సి-17 గ్లోబ్మాస్టర్మంగళవారం అమెరికా సైన్యానికి చెందిన భారీ రవాణా విమానం సి-17 గ్లోబ్మాస్టర్-3 మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో దిగింది. విమానాల ట్రాకింగ్ వివరాల ప్రకారం.. ఈ విమానం తొలుత లాత్వియా రాజధాని రిగాకు చేరుకుని, అక్కడి నుంచి మాస్కోకు వెళ్లింది. అమెరికా సైన్యానికి చెందిన ఈ విమానం సైనికులు, వాహనాలు, భారీ కార్గో రవాణాకు ఉపయోగిస్తారు.అయితే విమానంలో ఎవరు ప్రయాణించారనే విషయాన్ని అమెరికా అధికారికంగా వెల్లడించలేదు. లాత్వియా రక్షణ శాఖ మాత్రం ఈ విమానానికి తమ గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, అవసరమైన సమన్వయం పూర్తయినట్లు తెలిపింది. ఆ వెంటనే విమానంలో సీఐఏ డైరెక్టర్ ర్యాట్క్లిఫ్ ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. U.S. Air Force Boeing C-17A Globemaster III strategic airlifter descending to land at the Vnukovo International Airport in Moscow on Tuesday morning.The cameraman, likely sarcastically, comments: "we are under attack!" https://t.co/7EfvANBScW pic.twitter.com/dVItO5nAjn— Status-6 (War & Military News) (@Archer83Able) August 25, 2026ఉక్రెయిన్కు అమెరికా కీలక సూచనర్యాట్క్లిఫ్ పర్యటనకు ముందు అమెరికా.. ఉక్రెయిన్కు కీలక సూచన చేసినట్లు సమాచారం. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్తో పాటు రష్యాలోని ఉత్తర ప్రాంతాలపై సోమవారం నుంచి బుధవారం వరకు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయవద్దని కోరినట్లు తెలుస్తోంది. రష్యా రాజధానికి ఓ సీనియర్ అమెరికా అధికారి ప్రయాణిస్తున్నారని కూడా కీవ్కు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. ఈ పరిణామం అమెరికా–ఉక్రెయిన్ సంబంధాలపైనా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్యాతో యుద్ధం కొనసాగిస్తున్న ఉక్రెయిన్ను అమెరికా బహిరంగంగా సమర్థిస్తున్న సమయంలోనే.. సీనియర్ అమెరికా గూఢచార అధికారి మాస్కోకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.నాలుగేళ్ల తర్వాత మళ్లీ సీఐఏ చీఫ్ రాకర్యాట్క్లిఫ్ పర్యటన నిజమైతే.. 2021 తర్వాత రష్యా రాజధానికి అమెరికా గూఢచార సంస్థ అధిపతి వెళ్లడం ఇదే తొలిసారి. అప్పటి సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ 2021 నవంబర్లో మాస్కో వెళ్లి అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపారు. ఆ భేటీ జరిగిన మూడు నెలలకే రష్యా ఉక్రెయిన్పై దాడికి దిగింది. ప్రస్తుతం కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం, మరోవైపు అమెరికా–రష్యా మధ్య సంబంధాలు సున్నితంగా ఉండటంతో ర్యాట్క్లిఫ్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.రష్యా–ఇరాన్ బంధం కూడా కీలకమే..ర్యాట్క్లిఫ్ మాస్కో పర్యటన సమయంలో మరో అంశం కూడా చర్చకు వస్తోంది. ఇరాన్తో రష్యాకు ఉన్న సన్నిహిత సంబంధాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇటీవల కొత్త ఆంక్షలు ప్రకటించింది. ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.రష్యా మాత్రం ఇరాన్తో సైనిక, ఆర్థిక, దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఇరాన్ డ్రోన్లు అందించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రష్యా.. ఇరాన్కు అమెరికా లక్ష్యాలపై దాడులకు ఉపయోగపడే ఉపగ్రహ చిత్రాలను అందించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మాస్కో ఈ ఆరోపణలను ఖండించింది.ఖైదీల మార్పిడిలోనూ కీలక పాత్రఅమెరికా–రష్యా మధ్య ఖైదీల మార్పిడి వ్యవహారాల్లోనూ సీఐఏ కీలక పాత్ర పోషిస్తోంది. ర్యాట్క్లిఫ్ స్వయంగా 2025 ఏప్రిల్లో అమెరికా–రష్యా ద్వంద్వ పౌరురాలు క్సేనియా కరేలినా విడుదలకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం. 2024లో వాల్స్ట్రీట్ జర్నల్ విలేకరి ఇవాన్ గెర్ష్కోవిచ్, మాజీ అమెరికా మెరైన్ పాల్ వీలన్ విడుదలకు దారితీసిన ఖైదీల మార్పిడిలోనూ సీఐఏ ప్రమేయం ఉంది.పుతిన్తో భేటీ ఉంటుందేమో!ర్యాట్క్లిఫ్ మాస్కో పర్యటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం, రష్యాతో సంబంధాలు, ఇరాన్ అంశం, ఖైదీల మార్పిడి వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.ఇదీ చదవండి: ఇరాన్పై కోపం.. భారత కంపెనీలకూ షాక్! -
కిరణా హిల్స్పై డ్రోన్ దాడి?! ఆపరేషన్ సిందూర్ మిస్టరీకి తెర
న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని కీలక సైనిక ప్రాంతం కిరణా హిల్స్పై భారత డ్రోన్ దాడి చేసిందా?. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జరిగిన ఈ పరిణామం గురించి ఇన్నాళ్లుగా సందేహాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే దానికి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తాజాగా చెక్ పెట్టారు. అది అనుకోకుండా జరిగిందంటూ ఆయన వివరణ ఇచ్చారు.కిరణా హిల్స్ను భారత్ ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోలేదని జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన జనరల్ చౌహాన్.. ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో సర్గోధా చుట్టుపక్కల రాడార్లను గుర్తించేందుకు లాయిటరింగ్ మ్యూనిషన్లను మోహరించినట్లు చౌహాన్ వెల్లడించారు. సర్గోధాకు సుమారు 10 కిలోమీటర్ల ఉత్తరాన కిరణా హిల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతం పాకిస్థాన్ సైనిక, అణు మౌలిక సదుపాయాలతో సంబంధం ఉన్న కీలక ప్రాంతంగా చాలాకాలంగా ప్రచారంలో ఉంది. సర్గోధా పరిసరాల్లోని రాడార్లను గుర్తించి దాడి చేయడమే ఆ డ్రోన్ల లక్ష్యం. ఇలాంటి లాయిటరింగ్ మ్యూనిషన్లు కొంతసేపు గాల్లో తిరుగుతూ లక్ష్యాన్ని వెతుకుతాయని, సాధారణంగా దాదాపు రెండు గంటల వరకు గాలింపును కొనసాగించగలవని వివరించారు. నిర్ణీత సమయంలో లక్ష్యం దొరకకపోతే అవి తిరిగి వచ్చి ఎక్కడో ఒకచోట కూలిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు.‘‘మేము కిరణా హిల్స్ను లక్ష్యంగా చేసుకోలేదు. రాడార్ల కోసం పంపిన లాయిటరింగ్ మ్యూనిషన్ లక్ష్యాన్ని గుర్తించలేకపోవడంతో చివరకు ఆ కొండల్లో ఒకదాన్ని ఢీకొని ఉండొచ్చు’’ అని చౌహాన్ వివరించారు. ఆ సమయంలో కిరణా హిల్స్ నుంచి పొగలు వస్తున్న దృశ్యాలు పాకిస్థాన్ మీడియా ద్వారా బయటకు రావడం కూడా ఈ ప్రాంతంపై అనేక అనుమానాలకు దారితీసింది. అయితే అది అక్కడి అణు స్థావరంపై ఉద్దేశపూర్వక దాడికి సంబంధించిన ఆధారం కాదని చౌహాన్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.లోయర్ ఎయిర్స్పేస్.. భారత్ వ్యూహంఆపరేషన్ సిందూర్లో భారత్ అనుసరించిన వ్యూహంపై కూడా మాజీ సీడీఎస్ కీలక విషయాలు వెల్లడించారు. గతంలో ఉరీ ఘటన తర్వాత చేపట్టిన భూదాడులు, పుల్వామా అనంతరం నిర్వహించిన భారీ వైమానిక దాడులకు భిన్నంగా ఈసారి తక్కువ ఎత్తులోని గగనతలాన్ని వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్లు, అటాక్ హెలికాప్టర్లు వంటి ఆయుధ వ్యవస్థలకు ఈ లోయర్ ఎయిర్స్పేస్ అనుకూలంగా ఉంటుందని చెప్పారు. తద్వారా కంట్రోల్లో ఉంటూనే.. అనూహ్య దాడులతో లక్ష్యాలను ఛేదించే అవకాశం లభించిందని వివరించారు.పాక్ చర్చలకు వచ్చినా.. సర్గోధాపై దాడికి ఓకేఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ చర్చలకు ముందుకొచ్చినప్పటికీ, సర్గోధాపై దాడికి భారత్ అనుమతించినట్లు చౌహాన్ వెల్లడించారు. పాకిస్థాన్ నుంచి చర్చల కోసం ఫోన్ వచ్చిన సమయంలోనే వైమానిక దళాధిపతి సర్గోధాపై దాడి చేయాలా అని తనను అడిగారని తెలిపారు. తాను ‘‘వెళ్లండి.. దాడి చేయండి’’ అని సూచించినట్లు చెప్పారు. అంతేకాకుండా మరో రెండు లక్ష్యాలను గుర్తించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.అందులో ఒకటిగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని స్కార్దూను గుర్తించారు. దాడికి అనుమతి లభించినప్పటికీ అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చిందని చెప్పారు. చివరకు భోలారి వైమానిక స్థావరంలోని హ్యాంగర్పై భారత వైమానిక దళం దాడి చేసిందని చెప్పారు.భోలారి దాడి.. భారీ నష్టంమే 10న జరిగిన భారత వైమానిక దాడుల్లో భోలారి ఎయిర్బేస్పై జరిగిన దాడి కీలకంగా నిలిచింది. అక్కడి ఓ హ్యాంగర్ పైకప్పులో భారీ రంధ్రం ఏర్పడినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. దాడి తీవ్రతకు నిదర్శనంగా హ్యాంగర్ చుట్టూ శకలాలు కనిపించాయి.ఇక పాక్ తాను జరిపిన దాడులపై ఎలాంటి స్పష్టత లేకుండా ఉండిపోయిందని అనిల్ చౌహాన్ అన్నారు. అమెరికా, చైనా సంస్థలకు చెందిన వాణిజ్య ఉపగ్రహ చిత్రాల ద్వారా సమాచారం పొందేందుకు ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు.సమన్వయమే మన బలంఆపరేషన్ సిందూర్లో భారత్ పైచేయి సాధించడానికి మెరుగైన పరిస్థితుల అవగాహన, యుద్ధభూమిపై పారదర్శకత, మూడు దళాల మధ్య సమన్వయం కీలకంగా పనిచేశాయని చౌహాన్ అన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు ఒకే ఆపరేషనల్ చిత్రంపై అవగాహన ఉండటం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగామని వివరించారు. అదే సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం, సైన్యానికి ఆపరేషనల్ స్వేచ్ఛ లభించడం కూడా విజయానికి కారణమైందని చెప్పారు.2025 ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ అనంత్నాగ్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించాయి. తదనంతరం పాకిస్థాన్ సైనిక చర్యలకు దిగడంతో భారత్ తన దాడులను విస్తరించి పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. మే 10న ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) మధ్య సంప్రదింపుల అనంతరం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి ఉద్రిక్తతలు ఆగిపోయాయి.ఇదీ చదవండి: అమెరికా ఆశలు తగ్గుముఖం! -
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్కు కటీఫ్ చెప్పాల్సిందేనా?
ఇరాన్పై అమెరికా ఆంక్షల ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలు వెంటనే వాటిని తగ్గించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇరాన్ను ఆర్థికంగా ఒంటరిని చేసి.. చివరకు అమెరికాతో చర్చలు, ఒప్పందానికి దిగేలా ఒత్తిడి చేయడమే వాషింగ్టన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ హెచ్చరికలకు ఇరాన్ ప్రధాన భాగస్వాములైన చైనా, రష్యా ఎంతవరకు తలొగ్గుతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో ఈ పరిణామం భారత్కు మాత్రం కొత్త చిక్కును తెచ్చిపెట్టింది.ఒకవైపు అమెరికాతో వేగంగా బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం.. మరోవైపు ఇరాన్తో భారత్కు ఉన్న చారిత్రక, వాణిజ్య, వ్యూహాత్మక బంధం. ఈ రెండింటినీ సమతుల్యం చేయడం ఢిల్లీకి సవాల్గా మారింది. ముఖ్యంగా ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న హెచ్చరిక నేపథ్యంలో.. భారత్ ఎంతవరకు అమెరికా ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే ఇది భారత్కు పూర్తిగా కొత్త పరిస్థితి కాదు.రష్యా విషయంలో వెనక్కి తగ్గని ఢిల్లీఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాపై అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ మాస్కోతో సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదు. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి భారీగా క్రూడ్ కొనుగోళ్లను కొనసాగించింది. 2026 జూన్లో రష్యా చమురు భారత్ మొత్తం క్రూడ్ దిగుమతుల్లో సగానికి పైగా వాటా సాధించినట్లు రాయిటర్స్ డేటా పేర్కొంది. అంటే అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని భారత్ కొనసాగించింది. అయితే ఇరాన్ విషయంలో సమీకరణాలు కొంత భిన్నంగా ఉన్నాయి.ఇప్పటికే భారీగా తగ్గిన వాణిజ్యంభారత్–ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యం గతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2018–19లో దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం.. 2025–26లో సుమారు 1.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భారత్ ప్రధానంగా ఇరాన్కు బియ్యం, టీ, ఔషధాలు తదితర వస్తువులను ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం కావడం, యూఏఈ వంటి మార్గాల ద్వారా చెల్లింపులు, రీ-ఎగుమతులపై ఆంక్షల ప్రభావం పెరగడం భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా బాస్మతి, టీ, ఫార్మా రంగాలపై ప్రభావం పడొచ్చు. అయితే ఇరాన్తో వాణిజ్యం ఇప్పటికే పరిమిత స్థాయికి చేరినందున.. భారత్ మొత్తంగా ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ కంటే, కొన్ని రంగాల్లోని ఎగుమతిదారులపై ప్రభావమే ఎక్కువగా ఉండొచ్చు.చమురు కంటే పెద్ద ముప్పు.. హర్ముజ్భారత్కు ఇరాన్ విషయంలో అసలు ఆందోళన కేవలం ఆ దేశం నుంచి ఎంత చమురు కొనుగోలు చేస్తున్నామన్నది కాదు.. హర్ముజ్ జలసంధి. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తత పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్లో దీనివల్ల దిగుమతి బిల్లు పెరగడంతో పాటు రూపాయి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగొచ్చు.అయితే తాజా అమెరికా ఆంక్షల ప్రకటన తర్వాత వెంటనే చమురు ధరలు పెరగలేదు. ఆంక్షలు ఇరాన్పై ఒత్తిడిని పెంచి, చివరకు దౌత్యపరమైన పరిష్కారానికి దారితీయవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లలో కనిపించాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర 2.35 శాతం తగ్గి 92.17 డాలర్ల వద్ద ముగిసింది.ఇదీ చదవండి: జింగ్పిన్ రాక.. భారత్తో బంధం బలపడేనా?చాబహార్ను వదులుకోవడం అంత సులభమా?ఇరాన్తో భారత్ సంబంధాల్లో చాబహార్ పోర్టు మరో కీలక అంశం. పాకిస్థాన్ను దాటకుండా అఫ్గానిస్థాన్, మధ్య ఆసియాకు చేరుకునే మార్గంగా ఇది భారత్కు వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో చాబహార్లో భారత కార్యకలాపాలు కొనసాగించడం సవాల్గా మారుతున్నప్పటికీ.. ఇరాన్తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటే ఈ కీలక కనెక్టివిటీ మార్గంపై భారత్ తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్ భారత్కు కేవలం వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు.. పశ్చిమాసియాలో వ్యూహాత్మక భాగస్వామి కూడా.మరి మోదీ సర్కార్ ఏం చేస్తుంది?ప్రస్తుతానికి భారత్పై అమెరికా నేరుగా ఆంక్షలు విధించలేదు. తాజా చర్యల్లో భారత్ను లక్ష్యంగా చేసుకున్న నిర్ణయం కూడా కనిపించలేదు. దీంతో ఢిల్లీకి ఇంకా కొంత దౌత్యపరమైన వెసులుబాటు ఉంది. అమెరికాతో సంబంధాలను దెబ్బతీయకుండా.. అదే సమయంలో ఇరాన్తో అవసరమైన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడం భారత్ ముందున్న వాస్తవిక మార్గంగా కనిపిస్తోంది. రష్యా విషయంలో అనుసరించినట్టుగా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆంక్షల పరిధిలోకి వెళ్లకుండా సంబంధాలను పరిమిత స్థాయిలో కొనసాగించే ప్రయత్నం చేయొచ్చు.కటీఫ్ కాదు.. కత్తిమీద సాము!కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో “ఇరాన్కు భారత్ కటీఫ్ చెబుతుంది” అనుకోవడం తొందరపాటు అంచనా. అదే సమయంలో అమెరికా హెచ్చరికలను పూర్తిగా విస్మరించి ఇరాన్తో యథావిధిగా ఆర్థిక సంబంధాలు కొనసాగించడం కూడా ఢిల్లీకి అంత సులభం కాదు. వాణిజ్యం ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయింది. చమురు విషయంలో భారత్కు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలున్నాయి. కానీ చాబహార్, మధ్య ఆసియా కనెక్టివిటీ, పశ్చిమాసియాలో వ్యూహాత్మక ప్రయోజనాలు, హర్ముజ్ భద్రత వంటి అంశాలను ఒక్కసారిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. అందుకే భారత్ ముందున్న మార్గం ‘ఇరాన్కు కటీఫ్’ కంటే.. ‘అమెరికా ఆంక్షలకు చిక్కకుండా ఇరాన్తో అవసరమైన సంబంధాలను కొనసాగించడం’ అయ్యే అవకాశమే ఎక్కువ.రష్యా విషయంలో అమెరికా ఒత్తిడిని తట్టుకుని జాతీయ ప్రయోజనాలను కాపాడుకున్న భారత్.. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తుందా? లేక అమెరికాతో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఇస్తుందా? ఈ సమతుల్యమే మోదీ సర్కార్కు అసలు పరీక్ష.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
మేం సిద్ధం.. మా దాడి మొదలవుతుంది: ఇరాన్
ఇరాన్పై అమెరికా ఆంక్షలను మరింత విస్తరించడంతో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆదాయ మార్గాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కొత్త ఆంక్షలను ప్రకటించింది. అయితే ఈ చర్యలకు తాము భయపడబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. ఆంక్షలను ఎదుర్కొనేందుకు ‘పూర్తిగా సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించడంతోపాటు.. అవసరమైతే అమెరికా ప్రయోజనాలు, కీలక ఇంధన మార్గాలపై ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించింది.అమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా చేస్తున్న ఆంక్షల బెదిరింపులనుOperation Economic Outcast ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములు కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గబోరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. అమెరికా మరిన్ని దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకునే స్థితిలో లేదని ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో వాణిజ్యం చేస్తున్న దేశాలు అమెరికా హెచ్చరికలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తమకు సమాచారం అందుతోందన్నారు. దీంతో ఆంక్షల విషయంలో అమెరికా ఒత్తిడికి దీటుగా దౌత్య, ఆర్థిక మార్గాల్లో ప్రతిఘటనకు ఇరాన్ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.‘పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే అమెరికాకు మరింత ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ‘పూర్తిగా సిద్ధంగా ఉంది’ అని ప్రకటించారు. అమెరికా తమపై ఆర్థిక దాడికి దిగితే.. తమ వద్ద కూడా ప్రతిస్పందించేందుకు అవసరమైన సాధనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘ఇక మేం కేవలం రక్షణాత్మక చర్యల కోసమే పరిమితం కాబోం. శత్రువులు మా నుంచి దాడిని ఎదురుచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చైనా, రష్యాలు అమెరికా తాజా చర్యలను అంగీకరించలేదని, ఇతర దేశాలు కూడా వాషింగ్టన్ ఒత్తిడికి తలొగ్గకపోవచ్చని మదానిజాదే పేర్కొన్నారు.అమెరికా ప్రయోజనాలే టార్గెట్?ఆర్థిక ఆంక్షల విషయంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ మొహెబ్బీ కూడా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా కీలక ప్రయోజనాలు, ఇంధన రవాణా మార్గాలపై భారీ దెబ్బలు తప్పవని హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అంతేకాదు.. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను మరింత తగ్గించే అవకాశం ఉందని కూడా ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. అదే జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.60 మందిపై అమెరికా ఆంక్షలుఇరాన్కు వచ్చే ప్రతి కీలక ఆదాయ మార్గాన్ని అడ్డుకునే లక్ష్యంతో అమెరికా తాజా చర్యలకు దిగింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై కొత్త ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని బెసెంట్ హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ చమురు ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.అయితే ఇరాన్ చమురు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనా ఆర్థిక సంస్థలను తాజా ఆంక్షల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. ఇరాన్తో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలు అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి వెలేస్తామని బెసెంట్ ఇప్పటికే హెచ్చరించారు.ఆరు నెలలుగా యుద్ధం.. తగ్గని వేడిఅమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా.. సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఇటీవలి వారాల్లో పెద్దస్థాయి దాడులు కొంత తగ్గినా.. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం మాత్రం ఇంకా దూరంగానే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సాంప్రదాయిక సైనిక సామర్థ్యం దెబ్బతిన్నప్పటికీ.. క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే సామర్థ్యం మాత్రం ఆ దేశానికి మిగిలి ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, చమురు నౌకలు, కీలక ఇంధన మార్గాలపై ముప్పు కొనసాగుతోంది.ఆర్థిక దెబ్బకు.. సైనిక కౌంటర్?ఇరాన్ను ఆర్థికంగా ఒంటరి చేసేందుకు అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తుండగా.. వాటికి తలొగ్గకుండా ఎదురుదాడికి సిద్ధమని ఇరాన్ స్పష్టం చేయడం ఇప్పుడు కీలక పరిణామంగా మారింది. ఒకవైపు **చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానంపై అమెరికా ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు హర్ముజ్ జలసంధి, ఇంధన సరఫరా మార్గాలను ఇరాన్ ప్రతీకార చర్యలకు ఉపయోగించే అవకాశం ఆందోళన కలిగిస్తోంది.డొనాల్డ్ ట్రంప్ గనుక ఆర్థిక యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తే.. ఇరాన్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ను లొంగదీసుకోవాలని అమెరికా చూస్తుంటే.. ‘‘ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు.. అవసరమైతే ఎదురుదాడికి దిగుతాం’’ అనే సంకేతాలను టెహ్రాన్ స్పష్టంగా ఇస్తోంది. దీంతో ఇరాన్-అమెరికా ఘర్షణ మరోసారి ఆర్థిక రంగం నుంచి సైనిక చర్యల దిశగా మళ్లుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట -
ట్రంప్, నెతన్యాహు వారసులపై ఇరాన్ కన్ను!
ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మొన్నటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ప్రణాళికలు వేస్తోందన్న చర్చ జరిగింది తెలిసిందే. ఇప్పుడు శత్రుదేశాల వారసులపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుల్లో ఒకరిని ఇరాన్ హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకి ఇద్దరు కొడుకులు. అయితే వాళ్ల భద్రత కోసం ఆయన భారీగా ఖర్చు పెడుతున్నారంటూ ఈ మధ్యకాలంలో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆయన స్పందిస్తూ.. ఇరాన్ తన కుమారుల్లో ఒకరిని లక్ష్యంగా చేసుకుని హత్యకు ప్రయత్నించిందని చెప్పారు. కుటుంబానికి భద్రత కల్పించడం విలాసం కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రయత్నం ఎప్పుడు, ఎలా జరిగిందన్న వివరాలను నెతన్యాహు వెల్లడించలేదు. అలాగే కొడుకులు యాయిర్, అవ్నెర్లలో ఎవరిని టార్గెట్ చేశారన్నది కూడా చెప్పలేదు. బారన్పై బౌంటీ?మరోవైపు ఇరాన్ ప్రభుత్వ టీవీలో ప్రసారమైన ఓ వీడియో అమెరికాలో కలకలం రేపింది. ‘‘Where to Kill Barron Trump’’ పేరుతో ప్రసారమైన ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ 20 ఏళ్ల కుమారుడు బారన్ కదలికలను చూపిస్తూ, అతడి గురించి వివరాలు ప్రస్తావించినట్లు కథనాలు పేర్కొన్నాయి. అతడిని లక్ష్యంగా చేసుకునేందుకు 10 మిలియన్ డాలర్ల (రూ.95 కోట్లకు పైగా) బహుమతిని ప్రకటించినట్లు సమాచారం.బారన్ భద్రతా బలగాల కళ్లుగప్పి ఎలా కదులుతున్నాడన్న అంశాలను కూడా వీడియోలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎక్స్బాక్స్, ఫిఫా గేమ్స్, డిస్కార్డ్ వంటి ప్లాట్ఫామ్లలో అతడి ఖాతాల వివరాలు తమకు లభించాయని వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.మెలానియాపైనా గతంలో బెదిరింపులుట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్ మీడియాకు ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని కూడా ఇరాన్ ప్రభుత్వ టీవీ ఓ బెదిరింపు వీడియో ప్రసారం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. అందులో ఆమె ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాల్లో కదలికలకు సంబంధించిన వివరాలను ప్రస్తావించినట్లు సమాచారం.మరింత ముదిరిన ఉద్రిక్తతలుఇరాన్పై అమెరికా ‘ఎకనామిక్ డీ-డే’ పేరుతో కొత్త ఆంక్షలు ప్రకటించిన సమయంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ట్రంప్ వ్యాఖ్యానించగా.. అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహు కుటుంబ సభ్యులపై వెలువడిన బెదిరింపులు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి.ఇదీ చదవండి: H-1B ఉద్యోగులకు కొత్త రూల్ -
ట్రంప్ ఉక్కుపాదం.. ఇరాన్పై ‘ఎకనామిక్ డీ-డే’!
వాషింగ్టన్: ఆంక్షలు, సైనిక చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరో పిడుగు పడింది. మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ దేశానికి వచ్చే ప్రతి ఆదాయ మార్గాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని ప్రకటించింది. అంతేకాదు ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలకూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది.ఇరాన్కు ఆర్థికంగా సహకరిస్తే అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తారని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. సంస్థలు, దేశాలపై ఇక ఉపేక్ష ఉండదని బెసెంట్ తేల్చిచెప్పారు. ఇరాన్ తరఫున మనీలాండరింగ్కు పాల్పడే ఏ సంస్థ అయినా అమెరికా డాలర్ వ్యవస్థ నుంచి తొలగించబడుతుందని హెచ్చరించారు. ‘‘గడియారం తిరగడం ఇప్పుడే మొదలైంది’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ పాలక వ్యవస్థకు ఆర్థికంగా అండగా నిలిచే వారెవరైనా అమెరికా శక్తిని పరీక్షించేందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా-ఇరాన్లలో ఎవరితో సంబంధాలు కొనసాగించాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.‘గ్రే ఏరియాల్లో’ ఇక వ్యాపారాలు కుదరవుఇరాన్తో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ అమెరికా ఆంక్షలను తప్పించుకునే ప్రయత్నాలను ఇక సహించబోమని బెసెంట్ స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు, లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించే సంస్థలపై కూడా చర్యలు తప్పవన్నారు. ‘‘ఇరాన్తో ఎలాంటి ఆర్థిక సంబంధమైనా కొనసాగించడం.. బాధ్యత వహించే వారిని అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకువస్తుంది’’ అని హెచ్చరించారు.ఐదు కీలక రంగాలే లక్ష్యంఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారాలుగా ఉన్న ఐదు కీలక రంగాలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి సారించింది. డిజిటల్ ఆస్తులు, సాంకేతికత, బంగారం, విమానయానం, నౌకాయానం రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. వీటితోపాటు ఇరాన్ చమురు ఆదాయాన్ని అడ్డుకోవడం, ఆ దేశానికి సహకరిస్తున్న సంస్థలు, నౌకలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక మూలాలను తెంచే ప్రయత్నం చేస్తోంది.తాజా చర్యల్లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 60 సంస్థలు, నౌకలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్కు కీలక వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, టర్కీ, యూఏఈ వంటి దేశాలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.దేశాధినేతలకు ట్రంప్ ఫోన్లుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రపంచ దేశాల అధినేతలకు ఫోన్ చేసి ఇరాన్తో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని కోరుతున్నారని బెసెంట్ తెలిపారు. అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలు భాగస్వామ్య ప్రయోజనాలను పొందుతాయని, ఇరాన్తో సంబంధాలు కొనసాగించే దేశాలు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అయితే ఈ చర్యల వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం కూడా ఉందని అమెరికా వర్గాలు అంగీకరిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, తప్పిదాలను సరిదిద్దుకునేందుకు దేశాలకు అవకాశం ఇస్తున్నామని బెసెంట్ పేర్కొన్నారు.‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్కాస్ట్’ఇరాన్పై చేపట్టిన తాజా ఆర్థిక ఒత్తిడి కార్యక్రమాన్ని అమెరికా ‘‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్కాస్ట్’’Operation Economic Outcastగా పేర్కొంది. దీనిని బెసెంట్ ‘‘ఎకనామిక్ డీ-డే’’గా అభివర్ణించారు. ఇరాన్కు వచ్చే అన్ని ఆర్థిక మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసి ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.వెనక్కి తగ్గేదేలేఅమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా వద్ద ఇరాన్ను ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలు లేకపోవడంతోనే పాత ఆంక్షలను పదేపదే అమలు చేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ విమర్శించారు. అమెరికా ఒత్తిడికి తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు.ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీ-జాదే కూడా అమెరికా ప్రకటించిన కొత్త ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంపై స్పందించారు. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లు ఇరాన్కు కొత్తేమీ కాదని, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందనే సంకేతాలు ఇచ్చారు.రియాల్ పతనం.. రికార్డు కనిష్ఠానికిమరోవైపు అమెరికా ఆంక్షలతోపాటు యుద్ధ ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఇరాన్ కరెన్సీ రియాల్ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో పతనమైంది. ఒక డాలర్కు సుమారు 20.2 లక్షల రియాల్స్ వరకు పడిపోయింది.యుద్ధానికి ముందే అధిక ద్రవ్యోల్బణం, ప్రతికూల వృద్ధితో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సతమతమవుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం ధరలు దాదాపు 60 శాతం పెరగగా.. గొడ్డు మాంసం ధరలు 150 శాతానికి పైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో 5 శాతానికి పైగా సంకోచం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.‘ఇరాన్ పూర్తిగా కుప్పకూలుతోంది’ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఆర్థిక, సైనిక పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ‘‘పూర్తిగా కుప్పకూలుతోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆ దేశం ఆర్థిక, సైనిక పరంగా ‘డెత్ స్పైరల్’లోకి వెళ్తోందని వ్యాఖ్యానించారు.చమురు.. హర్ముజ్పైనే అసలు పోరుఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడి వెనుక ప్రధాన లక్ష్యం చమురు ఆదాయాన్ని అడ్డుకోవడమే. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడ నౌకాయానం అంతరాయానికి గురికావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు, గ్యాస్ ధరలపై ఒత్తిడి పెరిగింది.ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశానికి వచ్చే విదేశీ మారకద్రవ్యాన్ని నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, సముద్ర దిగ్బంధనం ఇరాన్పై ఒత్తిడి పెంచినా.. రాజకీయంగా ఆశించిన ఫలితాన్ని పూర్తిగా సాధించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చర్చల టేబుల్పైకి రావాల్సిందే: హెగ్సెత్అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇరాన్ ఆర్థిక ఒత్తిడిని ఎక్కువ కాలం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. చివరకు అణు కార్యక్రమంపై చర్చలకు తిరిగి రావడం తప్ప ఇరాన్కు మరో మార్గం ఉండదని అన్నారు. అవసరమైతే అమెరికా సైనిక చర్యలకు కూడా వెనుకాడబోదని హెచ్చరించారు.దీంతో ఇరాన్పై అమెరికా వ్యూహం సైనిక చర్యల నుంచి ఆర్థిక యుద్ధం వైపు మరింతగా మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానం, బంగారం, సాంకేతిక రంగాలను లక్ష్యంగా చేసుకున్న తాజా ఆంక్షలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు అమెరికా ఒత్తిడికి ఎలా స్పందిస్తాయన్నదే తదుపరి కీలక పరిణామంగా మారనుంది.ఇదీ చదవండి: మేం రెడీ.. రెండేళ్లకు సరిపడా!: ఇరాన్ -
జెన్జీ ఆగ్రహం.. హీరో కాస్త విలన్గా!
నేపాల్ రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన బాలేంద్ర ‘బాలెన్’ షా.. ప్రధాని పీఠం అధిరోహించిన కొద్ది నెలల్లోనే తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పాత రాజకీయ వ్యవస్థపై విసుగుచెందిన యువతకు ఆశాకిరణంగా కనిపించిన ఆయన.. ఇప్పుడు అదే యువత నుంచి అనూహ్య రీతిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. జెన్జీ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన బాలెన్ షా.. అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే తన రాజకీయ ఇమేజ్ను కాపాడుకోవాల్సిన పరిస్థితికి చేరుకున్నారు.మాజీ అండర్గ్రౌండ్ ర్యాపర్, సివిల్ ఇంజినీర్, ఖాట్మండు మేయర్గా తనదైన ముద్ర వేసిన బాలెన్ షా.. సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగారు. మార్చి ఎన్నికల్లో నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) భారీ మెజార్టీ సాధించడంతో.. నేపాల్లో కొత్త రాజకీయ శకానికి నాంది పలికిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నేతగా, వ్యవస్థలో మార్పు తీసుకురాగల నాయకుడిగా యువత బాలెన్ను ఆదరించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి.వరుస నిర్ణయాలతో పెరిగిన అసంతృప్తిప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలెన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. భారత్ నుంచి కొనుగోలు చేసే వస్తువులపై కస్టమ్స్ నిబంధనలను కఠినతరం చేయడం మొదటి వివాదంగా మారింది. సరిహద్దు ప్రాంతాల ప్రజలు రోజువారీ అవసరాల కోసం భారత్పై ఆధారపడుతుంటారు. మందులు, నిత్యావసర వస్తువులపై ప్రభావం పడటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. చివరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.ఆ తర్వాత భారత్తో సరిహద్దు అంశంపై బాలెన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాల వివాదంపై మూడో పక్షం సహాయంతో పరిష్కారం సాధించవచ్చనే సంకేతాలు ఇవ్వడం నేపాల్లో విమర్శలకు దారితీసింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.భారత్ అంశంలో మారిన వైఖరివిదేశీ ప్రతినిధులతో భేటీల విషయంలో బాలెన్ మొదట కఠిన వైఖరిని అవలంబించారు. మంత్రుల స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న అధికారులతో సమావేశాలకు దూరంగా ఉంటానని చెప్పిన ఆయన.. తర్వాత తన విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. భారత, చైనా రాయబారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఇదే సమయంలో ఆర్ఎస్పీ అధినేత రవి లామిచ్చానేకు భారత్లో లభించిన ప్రాధాన్యం కూడా చర్చకు దారితీసింది. లామిచ్చానే భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో సమావేశం కావడం నేపాల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది.సొంత పార్టీతోనూ దూరం?బాలెన్ పాలనా శైలిపై మరో ప్రధాన విమర్శ.. ఆయన పార్లమెంట్కు, సొంత పార్టీ కార్యక్రమాలకు తగినంత సమయం కేటాయించడం లేదనే ఆరోపణలు. ప్రధాని అయిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు పరిమితంగా హాజరయ్యారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించాయి. ఆర్ఎస్పీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడం తగ్గిందనే చర్చ మొదలైంది. దీంతో బాలెన్ షా–పార్టీ నాయకత్వం మధ్య దూరం పెరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.యువతే తిరగబడిన వేళ..బాలెన్ ఇమేజ్కు అతిపెద్ద దెబ్బ జూలైలో తగిలింది. ఖాట్మండులో మున్సిపల్ పోలీసుల చర్యలపై అసంతృప్తితో రైడ్ షేర్ డ్రైవర్ గణేష్ నేపాలి ఆత్మాహుతికి పాల్పడిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ చర్యలపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. అనధికార నివాసాల తొలగింపు, పేదలకు పునరావాసం కల్పించకపోవడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఒకప్పుడు బాలెన్కు మద్దతుగా రోడ్లపైకి వచ్చిన యువతే.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం ప్రారంభించింది.మత ఘర్షణలతో మరింత ఒత్తిడిజూలై చివర్లో నేపాల్ దక్షిణ ప్రాంతాల్లో హిందూ–ముస్లిం వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు ప్రభుత్వానికి మరో పరీక్షగా మారాయి. ఈ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు బాలెన్ తొలిసారి ప్రధానిగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చింది.ప్రజా ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన బాలెన్కు.. పాలన మాత్రం అంత సులభం కాదని ఈ 150 రోజులు నిరూపించాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన విధానం అధికారంలో కొనసాగించడం కష్టం. ప్రజల అంచనాలు, వ్యవస్థల నిర్వహణ, రాజకీయ సమన్వయం వంటి అంశాలు ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాళ్లు.జెన్జీ ఆశల నాయకుడిగా ఎదిగిన బాలెన్ షా.. ఇప్పుడు అదే తరం ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన దశకు చేరుకున్నారు. ఐదు నెలల్లో మారిన ఈ రాజకీయ పరిణామాలు.. ప్రజాదరణ ఎంత వేగంగా పెరుగుతుందో, అంతే వేగంగా తగ్గిపోవచ్చని మరోసారి చాటిచెబుతున్నాయి. -
హర్ముజ్పై పట్టు కోసం ఇరాన్ కొత్త ఎత్తుగడ
హర్ముజ్.. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి ఈ కీలక సముద్ర మార్గంపై ఆధిపత్య పోరు మరింత తీవ్రంగా మారుతోంది. జలసంధిపై ఇరాన్ ప్రభావం, అమెరికా ఒత్తిడి మధ్య నౌకల రాకపోకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలు కూడా ఈ పోరుకు మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో జలసంధిపై తన పట్టు సడలుతోందనే సంకేతాల మధ్య.. ఇరాన్ కొత్త వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించింది.గత కొంతకాలంగా హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ సూచించే మార్గం కంటే.. ఒమన్ తీరానికి సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాన్నే అంతర్జాతీయ నౌకలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. షిప్ ట్రాకింగ్ సంస్థల సమాచారం ప్రకారం.. ఇటీవల హర్ముజ్ దాటిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ మార్గంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అమెరికా నౌకాదళ భద్రతతో ఈ మార్గంలో రాకపోకలు పెరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. దీంతో హర్ముజ్పై ఇరాన్ నియంత్రణ సడలుతోందనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో.. నౌకల నుంచి సేవల పేరుతో రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ కమిషన్ ఆమోదం తెలిపింది.టెహ్రాన్ కొత్త ప్లాన్ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ‘హర్ముజ్ జలసంధి భద్రత, అభివృద్ధి కోసం వ్యూహాత్మక చర్యలు’ ప్రణాళికలోని ఆర్టికల్-3కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఇరాన్ అందించే సముద్ర భద్రత, పర్యావరణ సేవలు, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంధన సరఫరా, బీమా తదితర సేవలకు రుసుములు వసూలు చేయనుంది. ఈ ఫీజులను హర్ముజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతి పొందిన దేశాల నౌకల నుంచే వసూలు చేస్తామని ఇరాన్ తెలిపింది. చెల్లింపులు ఇరాన్ కరెన్సీ రియాల్ లేదంటే టెహ్రాన్ నిర్ణయించే ఇతర కరెన్సీలో ఉండవచ్చని వెల్లడించింది.అమెరికా మద్దతుదారులకూ వార్నింగ్ఓవైపు ట్రంప్ ఇరాన్ మద్దతుదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంక్షల మోతకు సిద్ధపడాలంటూ చెబుతున్నారు. అయితే ఇటు అమెరికా ఆంక్షలపై ఇరాన్ మరింత ఘాటుగా స్పందిస్తోంది. ఆర్థిక ఒత్తిడి కొనసాగితే హర్ముజ్ నుంచే కాదు.. పర్షియన్ గల్ఫ్ నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ హెచ్చరించారు. అమెరికా చర్యలకు మద్దతిచ్చే దేశాలను కూడా ఇరాన్ వ్యతిరేక శక్తులుగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. చమురు రవాణా విషయంలో ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్ సంకేతాలు ఇస్తోంది.నౌకలకు ఇరాన్ హెచ్చరికలుహర్ముజ్ నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమించే నౌకలకు జరిమానాలు, భవిష్యత్ ప్రయాణాలపై ఆంక్షలు, అవసరమైతే స్వాధీనం వంటి చర్యలు ఉంటాయని తెలిపింది. ఉల్లంఘన చేసే నౌకలకు సహకరించే షిప్పింగ్ సంస్థలు, సరుకు యజమానులను కూడా సమస్యాత్మక జాబితాలో చేర్చుతామని పేర్కొంది.ఇంకా రూట్లోనే..ఇరాన్ బెదిరింపులు పెద్దగా పని చేయడం లేదా? అనే చర్చా నడుస్తోంది. మరోవైపు హర్ముజ్లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. ఒమన్ మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని, ప్రపంచ చమురు సరఫరా నిరాటంకంగా కొనసాగడమే తమ లక్ష్యమని వాషింగ్టన్ చెబుతోంది. గల్ఫ్ దేశాల నుంచి బయలుదేరే భారీ క్రూడాయిల్ ట్యాంకర్లు హర్ముజ్పైనే ఎక్కువగా ఆధారపడతాయి. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఇరాన్కు సవాల్గా మారింది.ప్రపంచ చమురు మార్కెట్పై ప్రభావం?ప్రపంచ చమురు రవాణాలో హర్ముజ్ జలసంధికి అత్యంత కీలక స్థానం ఉంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 80 శాతం నౌకలు ప్రత్యామ్నాయ మార్గం పట్టినా.. హర్ముజ్పై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇరాన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రుసుముల ప్రతిపాదన నుంచి కఠిన హెచ్చరికల వరకు.. చమురు మార్గంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోంది.ఇదీ చదవండి: శత్రువులు చేతులు కలుపుతారా?.. సర్కత్రా ఉత్కంఠ! -
బంగ్లాదేశ్: హిందూ కుటుంబం కేసులో షాకింగ్ విషయాలు
ఓ కుటుంబంలోని అందరి ఫోన్లు ఒక్కసారిగా స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంటి తలుపులు లోపలికి మూసివేసి ఉన్నాయి. తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లిన బంధువులకు కనిపించిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. అయితే దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత షాక్కు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ రంగ్పూర్లోని దాస్పారా ప్రాంతంలో నివసించే రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియమ్ (12) మృతదేహాలు ఇంట్లోనే చెల్లాచెదురుగా పడి ఉన్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చనిపోయింది హిందూ కుటుంబం కావడంతో.. మత విద్వేష దాడా? అనే కోణంలోనూ తీవ్ర చర్చ జరిగింది. అయితే.. కారణం అది కాదని పోలీసులు తేల్చారు. అంతేకాదు హత్యల తర్వాత కూడా నిందితులు గంటల పాటు అదే ఇంట్లో ఉండటం, అక్కడే తినడం, స్నానం చేయడం వంటి విషయాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.అసలు ఏం జరిగింది?మొదట ఈ ఘటనను దోపిడీకి సంబంధించిన హత్య, మత విద్వేష దాడులా? అనే కోణంలో పోలీసులు అనుమానించారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, దోపిడీ జరిగినట్లు కనిపించే పరిస్థితులు ఆ కోణంలో దర్యాప్తుకు దారితీశాయి. అయితే ఆధారాలు సేకరించే కొద్దీ అసలు కథ బయటపడింది.గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పుపైకి పొరుగింటి మార్గం ద్వారా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ‘యాబా’ అనే మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నారు. ఆ శబ్దాలు విని పైకి వెళ్లిన గణపతి వారిని ప్రశ్నించడంతో.. తమను గుర్తిస్తాడనే భయంతో ఆయనను గొంతు నులిమి హత్య చేశారు. చక్రవర్తి ఎంతకీ కిందకు రాకపోవడంతో.. ఆ వెనకాలే వచ్చిన ఆయన భార్య, కుమార్తె, కుమారుడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.గణపతి చక్రవర్తి ఫ్యామిలీ (పాత ఫొటో)గురువారం ఈ ఘోరం జరగ్గా.. ఈ కేసులో ముఘ్దో, సిద్ధార్థ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.హత్యల తర్వాత కూడా ఇంట్లోనే..ఈ ఘటనలో అత్యంత షాకింగ్ అంశం.. హత్యలు చేసిన తర్వాత నిందితులు వెంటనే పారిపోలేదని దర్యాప్తులో తేలడం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఆ ఇంట్లోనే ఆరు నుంచి ఏడు గంటల పాటు ఉన్నారు. ఇళ్లంతా కలియ దిరిగారు. ఖర్జూరాలు, దోసకాయలు తిన్నారని.. స్నానం చేశారని, ఆపైనా మత్తు పదార్థం తీసుకున్న ఆనవాళ్లు లభించాయని చెప్పారు.అంతేకాదు.. దోపిడీ జరిగినట్లు కనిపించేందుకు ఇంట్లో వస్తువులను చిందరవందర చేసినట్లు, ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల మొబైల్ ఫోన్లపై కూడా ఆధారాలు తొలగించే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు.హిందువుల భద్రతపై మళ్లీ చర్చఈ ఘటనతో బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలోనూ అక్కడ హిందూ సమాజంపై దాడులు, దేవాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనారిటీలపై జరిగిన హింసాత్మక ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గతంలో తెలిపారు. అయితే తాజా ఘటన గంజాయి బ్యాచ్ పనిగా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు రంగ్పూర్ తాజా ఘటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: హ గదీ భారత్ దెబ్బంటే.. -
మిడిల్ఈస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఇరాన్ నిర్ణయంపై ఉత్కంఠ
దశాబ్దాలుగా సాగుతున్న వైరం.. ఎప్పుడూ ప్రత్యర్థులుగా కనిపించిన దేశాలు.. ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తాయా? మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లు, ఇరాన్పై పెరుగుతున్న ఆంక్షలు, ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఏర్పాటు చేసిన మక్కా రక్షణ కూటమిలో చేరాలని ఇరాన్కు ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్-సౌదీ అరేబియా.. ఈ రెండు పేర్లు వినగానే గుర్తొచ్చేది ఆధిపత్య పోరు. గల్ఫ్ ప్రాంతంలో ప్రభావం కోసం ఇరు దేశాల మధ్య ఏళ్లుగా సాగుతున్న పోటీ. యెమెన్లో హౌతీల అంశం నుంచి సిరియా, లెబనాన్ వరకు పలు పరిణామాల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. అలాంటి రెండు దేశాలు భద్రతా వేదికపై దగ్గరవుతాయా? అనే ప్రశ్న ఇప్పుడు మిడిల్ఈస్ట్లో కొత్త చర్చకు తెరతీసింది. ఒకప్పుడు ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకున్న దేశాలు.. ఇప్పుడు ఒకే భద్రతా గొడుగు కిందకు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రభావం, ప్రాంతీయ భద్రతా పరిణామాలు, మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో ఈ పరిణామం మిడిల్ఈస్ట్ భవిష్యత్ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది.మక్కా కూటమిలోకి ఇరాన్?సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఆగస్టు 7న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రక్షణ సహకారం, వ్యూహాత్మక సమన్వయం, సంయుక్త భద్రతా చర్యలు ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని ప్రకటించారు. అయితే ఈ కూటమి ఏర్పడిన కొద్ది రోజులకే మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. మక్కా ఒప్పందంలో చేరాలని ఇరాన్కు ఆహ్వానం అందినట్లు ‘అల్ మయదీన్’ నివేదించింది. ఇరాన్ పార్లమెంట్కు అనుబంధంగా ఉన్న ఖానే మెల్లత్ వార్తా సంస్థ అధిపతి మెహదీ రహీమి ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. ఆ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే ఇరాన్ ప్రభుత్వం గానీ, సౌదీ, పాకిస్థాన్, టర్కీ ప్రభుత్వాలు గానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.ట్రంప్ ప్రభావమేనా?ఈ పరిణామాల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావం ఉందా? అన్న చర్చ కూడా మొదలైంది. ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెరగడం, ఆంక్షల భయం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రాంతీయ దేశాలు తమ భద్రతా వ్యూహాలను పునరాలోచిస్తున్నాయి. ఇప్పటివరకు మిడిల్ఈస్ట్లో భద్రతకు అమెరికా కీలక శక్తిగా ఉండేది. అయితే ఇటీవలి పరిణామాల్లో ప్రాంతీయ దేశాలే తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలోకి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మక్కా కూటమి కూడా ఇదే దిశలో మరో అడుగుగా భావిస్తున్నారు. శత్రువుల మధ్య కొత్త స్నేహమా?ఇరాన్ నిజంగా మక్కా కూటమిలో చేరితే అది సాధారణ పరిణామం కాదు. ఎందుకంటే ఈ కూటమిలో ప్రధాన దేశమైన సౌదీ అరేబియాతో ఇరాన్కు గతంలో తీవ్ర విభేదాలున్నాయి. 2016లో తెగిపోయిన దౌత్య సంబంధాలు 2023లో చైనా మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైనప్పటికీ.. అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.యెమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, సౌదీ ప్రయోజనాల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సంబంధాలకు సవాలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే రక్షణ వేదికపైకి రావడం జరిగితే.. అది మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో భారీ మార్పుగా మారే అవకాశం ఉంది.ఇరాన్ లెక్కలు ఏంటి?ఇరాన్ మాత్రం ఈ పరిణామాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. ప్రాంతీయ దేశాలు తమ స్వంత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తనకు అనుకూలమైన కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితిలో టెహ్రాన్ ఉంది.అయితే.. మక్కా కూటమిలో చేరడం ద్వారా ఇరాన్కు లాభమా? లేదంటే తన పాత మిత్ర, ప్రత్యర్థి సమీకరణాలను మార్చుకోవాల్సి వస్తుందా? అన్నది కీలక ప్రశ్న.ఇరాన్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలు నిజంగా చేతులు కలిపితే.. అది ట్రంప్ హయాంలో మిడిల్ఈస్ట్లో అతిపెద్ద దౌత్య మలుపుగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికాలో కాల్పులు.. భారతీయుడి దుర్మరణం -
ఎల్ నినో సెగ.. ప్రపంచ వాణిజ్య మార్గాలకు గండం?!
ప్రపంచాన్ని ఎల్ నినో రూపంలో మరో సంక్షోభం వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న దీని ప్రభావం.. నవంబర్, డిసెంబర్ నుంచి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ సహా అనేక దేశాలు ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో.. ఎల్ నినో ప్రభావం ఇప్పుడు వాతావరణాన్ని దాటి ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలపైనా కనిపిస్తోంది.ఎల్ నినో అంటే కేవలం వర్షాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించిన మార్పు మాత్రమే కాదు. సముద్ర ఉష్ణోగ్రతలు, వాతావరణ నమూనాల్లో వచ్చే మార్పులు.. నీటి లభ్యత నుంచి రవాణా వ్యవస్థల వరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే నౌకాయాన మార్గాలు కూడా ఈ పరిణామాల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. నీటి మట్టాలు తగ్గడం, కరవు పరిస్థితులు పెరగడం వంటి పరిణామాలు అంతర్జాతీయ షిప్పింగ్కు సవాల్గా మారుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువ నిలుస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన ఈ జలమార్గం ద్వారా ప్రతి ఏడాది వేలాది నౌకలు ప్రయాణిస్తాయి. అయితే పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా కాలువలో నీటి నిల్వలు తగ్గడంతో.. నౌకల రాకపోకలపై పరిమితులు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు దాదాపు 40 నౌకలు ప్రయాణించే పనామా కాలువలో.. నీటి కొరత కారణంగా ఈ సంఖ్యను తగ్గిస్తున్నారు. దీనివల్ల సరకు రవాణా ఆలస్యం కావడం, నౌకల నిర్వహణ ఖర్చులు పెరగడం, చివరకు వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ నుంచి పరిమితులు మరింత కఠినం కావొచ్చని అంచనా వేస్తున్నారు.మరి హార్ముజ్పై ప్రభావం ఉంటుందా?ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఎల్ నినో ప్రత్యక్ష ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అక్కడి పరిణామాలు ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా పరిస్థితులు, దేశాల మధ్య సంబంధాలపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఎల్ నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, ఇంధన వినియోగం, సరఫరా వ్యవస్థల్లో మార్పులు చోటుచేసుకుంటే.. పరోక్షంగా హార్ముజ్ ద్వారా జరిగే చమురు రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కరవు, పంటల నష్టం, రవాణా అంతరాయాలు పెరిగితే.. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు, ఆహార ధరలపై ఒత్తిడి పెరగొచ్చు.ప్రపంచ ఇంధన సరఫరాలో హార్ముజ్ జలసంధి కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. అక్కడ ఏ చిన్న అంతరాయం ఏర్పడినా దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కనిపించే అవకాశం ఉంది. ఎల్ నినో ప్రత్యక్ష కారణం కాకపోయినా.. వాతావరణ మార్పులతో పెరిగే ఆర్థిక ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థల్లో అస్థిరతలు ఇంధన రంగానికి కొత్త సవాళ్లుగా మారవచ్చు.ఇతర జలమార్గాలకూ ముప్పుఎల్ నినో ప్రభావంతో ఏర్పడే పొడి వాతావరణ పరిస్థితులు ప్రపంచంలోని మరికొన్ని కీలక జలమార్గాలపైనా ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే ప్రతి ప్రాంతంలో దీనికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. తీవ్రమైన వేడి, తక్కువ వర్షపాతం, కరవు పరిస్థితులు కొనసాగితే నదులు, కాలువల్లో నీటి మట్టాలు తగ్గి.. నౌకా రవాణాకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.యూరప్లోని రైన్ నది వంటి ప్రధాన నదీ మార్గాలు పరిశ్రమలు, సరకు రవాణాకు ఎంతో కీలకం. నీటి మట్టాలు తగ్గినప్పుడు పెద్ద నౌకలు పూర్తిస్థాయిలో సరకు మోసుకెళ్లలేవు. దీంతో రవాణా సామర్థ్యం తగ్గడం, ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. డాన్యూబ్ వంటి ఇతర కీలక నదీ మార్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే.. ఇంధనం, ముడి సరుకులు, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.అంటే.. ఎల్ నినో ప్రభావం కేవలం సముద్రాల్లోనే కాదు.. నదులు, కాలువల ద్వారా జరిగే ప్రపంచ వాణిజ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ మార్పులతో పెరుగుతున్న తీవ్ర పరిస్థితులు భవిష్యత్తులో రవాణా వ్యవస్థలకు కొత్త సవాళ్లుగా మారనున్నాయి.ప్రపంచ వాణిజ్యానికి మరో సవాల్కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ సరఫరా వ్యవస్థలు ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు సరఫరా గొలుసులను ప్రభావితం చేశాయి. ఇప్పుడు ఎల్ నినో కూడా మరో సవాల్గా మారుతోంది. ఒక ప్రాంతంలో కరవు కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం.. మరో ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతినడం.. ఇవన్నీ కలిపి ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా ఆహార పదార్థాలు, ముడి సరుకులు, ఇంధన సరఫరాలో మార్పులు వస్తే.. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.భారత్కు ముప్పు ఎంత?ఎల్ నినో ప్రభావం భారత్కు అత్యంత కీలకమైన అంశం. దేశ వ్యవసాయం ఎక్కువగా రుతుపవనాలపై ఆధారపడటం వల్ల వర్షపాతం మార్పులు నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పంటల దిగుబడి తగ్గడం, నీటి వనరులపై ఒత్తిడి పెరగడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడితే.. చమురు, ఎరువులు, ఆహార దిగుమతుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.వాతావరణం నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు..ఒకప్పుడు ఎల్ నినోను కేవలం వాతావరణ పరిణామంగా మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే శక్తిగా మారింది. సముద్ర మార్గాల నుంచి వ్యవసాయ క్షేత్రాల వరకు.. ఇంధన మార్కెట్ల నుంచి ఆహార సరఫరా వరకు.. ఎల్ నినో ప్రభావాలు అనేక రంగాలపై పడే అవకాశం ఉంది.పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ఈ పరిణామం.. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావాలు చూపుతుందో రాబోయే నెలలు కీలకంగా మారనున్నాయి. అందుకే దేశాలు ముందుగానే అప్రమత్తమై.. సరఫరా వ్యవస్థలు, వ్యవసాయ ప్రణాళికలు, విపత్తు నిర్వహణ చర్యలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
వాణిజ్య చర్చలు విఫలం.. ఇక ట్రేడ్ వార్
అమెరికా–కెనడా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. మూడు రోజుల పాటు కొనసాగిన వాణిజ్య ఒప్పందం కోసం జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. చర్చలు విఫలం కావడంతో.. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం సుంకాలను విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టారిఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని అమెరికా అధికారులు వెల్లడించారు.కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ పరిణామంపై స్పందిస్తూ.. అమెరికా నిర్ణయానికి సమాన స్థాయిలో ప్రతీకార చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల ప్రకారం.. శనివారం అర్ధర్రాతి నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. అయితే అమెరికా విధించే ప్రతి డాలర్ టారిఫ్కు ప్రతిగా కెనడా కూడా అంతే మొత్తంలో సుంకాలు విధిస్తుందని కార్నీ స్పష్టం చేశారు. చివరి దశలో విఫలమైన చర్చలుఅమెరికా–కెనడా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం మూడు రోజుల పాటు వాషింగ్టన్లో చర్చలు జరిగాయి. కెనడా వాణిజ్య మంత్రి డొమినిక్ లెబ్లాంక్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ చర్చల్లో పాల్గొన్నారు. ప్రారంభంలో ఇరు దేశాలు ఒప్పందానికి దగ్గరయ్యాయని భావించినా.. కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలు విఫలమైన తర్వాత కెనడా చర్చలను తాత్కాలికంగా నిలిపివేసి, తమ ప్రతినిధులను తిరిగి ఒట్టావాకు రావాలని ప్రధాని కార్నీ ఆదేశించారు.ఏ వస్తువులపై ప్రభావం?అమెరికా విధించనున్న 50 శాతం టారిఫ్లు దాదాపు 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.7 లక్షల కోట్లకు పైగా) విలువైన కెనడా ఉత్పత్తులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, ఉక్కు, అల్యూమినియం, కలప వంటి రంగాలకు ఈ నిర్ణయం భారీ దెబ్బగా మారే అవకాశం ఉంది. అమెరికా అధికారులు మాత్రం కెనడా కోరిన కొన్ని రాయితీలకు అంగీకరించలేదని తెలిపారు. ముఖ్యంగా కార్ల తయారీ రంగం, స్టీల్, అల్యూమినియం, లంబర్ రంగాల్లో కెనడా డిమాండ్లపై విభేదాలు కొనసాగినట్లు వెల్లడించారు."కెనడా ప్రయోజనాల కోసం పోరాడతాం": కార్నీఅమెరికాతో ఒప్పందం కుదరకపోయినా.. తమ దేశ కార్మికులు, వ్యాపారాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మార్క్ కార్నీ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసేందుకు ప్రయత్నించామని, అయితే కెనడా ప్రయోజనాలకు విరుద్ధమైన ఒప్పందాన్ని అంగీకరించబోమని పేర్కొన్నారు.ట్రంప్ హెచ్చరికకెనడా ప్రతీకార టారిఫ్లు విధిస్తే.. పరిస్థితిని సమతుల్యం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ పరిపాలన హెచ్చరించింది. "వాళ్ల చర్యను సమం చేసేందుకు.. మరోసారి కఠిన చర్యలు తీసుకుంటాం" అని అమెరికా అధికారి వ్యాఖ్యానించారు.రెండు దేశాలపై ప్రభావంఅమెరికా–కెనడా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యాల్లో ఒకటి. ఇరు దేశాల మధ్య ప్రతి ఏడాది వందల బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతుంది. తాజా టారిఫ్ల నిర్ణయం అమల్లోకి వస్తే.. వినియోగదారులపై ధరల భారం పెరగడం, పరిశ్రమల సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే అమెరికా ఇతర దేశాలపై టారిఫ్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో.. కెనడాతో తాజా వివాదం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముంది.ఇదీ చదవండి: ట్రంప్.. కాస్కో, మా దాడి ఓ రేంజ్లోనే ఉంటుంది! -
జంతర్ మంతర్ చూమంతర్ కాళీ..!
కష్టాల్లో ఉన్న మనిషికి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓ హగ్ ఇస్తే చాలూ అన్నీ ఇట్టే ఎగిరిపోతాయ్ అని శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఓ డైలాగ్ చెబుతాడు. కానీ ఇక్కడో ఓ కౌగిలి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడికి ఆ ఆలింగనం ఎక్కడా లేని ధైర్యం ఇచ్చింది. అతనితో కన్నీరు పెట్టించింది. హృదయాన్ని తాకే ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.సైనిక శిక్షణ ముగింపు వేడుకలో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తోటి సైనికులు తమ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటున్న సమయంలో.. ఒంటరిగా నిల్చున్న ఓ యువ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్ అతడికి దగ్గరగా వెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.In a touching human moment in Indonesia, one soldier stood alone during the closing ceremony of a training exercise, while his colleagues celebrated with their families and loved ones.His commander noticed the situation from a distance and approached him, embracing him as if he…— The Actual Event (@Gazawins12) August 17, 2026ఇండోనేషియా ఆర్మీకి చెందిన ఓ రిక్రూట్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఈ భావోద్వేగ ఘటన జరిగింది. ఫస్ట్ TNI AD ఎడ్యుకేషన్ (ఇండోనేషియా ఆర్మీ శిక్షణ వ్యవస్థ) ముగింపు వేడుకలో భాగంగా సైనికులు పట్టాలు అందుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుక సందర్భంగా చాలామంది సైనికులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. కానీ ఓ యువ రిక్రూట్ మాత్రం అందరికీ దూరంగా ఒంటరిగా నిలబడి కనిపించాడు. చుట్టూ ఉన్నవారి ఆనందాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.అక్కడే ఉన్న కమాండర్ ఆ యువ సైనికుడి పరిస్థితిని గమనించాడు. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి ఎలాంటి మాటలు చెప్పకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అనుకోని ఆ ప్రేమాభిమానానికి ఆ రిక్రూట్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. కమాండర్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఓదారుస్తూ అధికారి కొద్దిసేపు అలాగే ఆలింగనం చేసుకున్నాడు.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎడి కార్టోనో అనే వ్యక్తి.. ఆ యువ సైనికుడు తన కుటుంబాన్ని ఎంతో మిస్ అవుతున్నాడని పేర్కొన్నారు. ఇతర సైనికులు తమ కుటుంబాలతో కలిసి వేడుక జరుపుకుంటుండగా.. అతడు ఒంటరిగా నిలబడటం కమాండర్ గమనించారని తెలిపారు. ఆ ఒక్క ఆలింగనం ఆ సైనికుడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, కుటుంబ సభ్యుల నుంచి లభించే ప్రేమను గుర్తు చేసిందని పేర్కొన్నారు.నెట్టింట ప్రశంసలుఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు కమాండర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సైనిక అధికారి కేవలం ఆదేశాలు ఇచ్చే వ్యక్తి మాత్రమే కాదని.. తన సిబ్బంది భావోద్వేగాలను అర్థం చేసుకునే నాయకుడిగా ఉండాలని పలువురు వ్యాఖ్యానించారు. “అది కేవలం ఓ కౌగిలి కాదు.. ఒంటరిగా ఉన్న సైనికుడికి ఇచ్చిన భరోసా” అంటూ పలువురు స్పందించారు. మరికొందరు ఈ ఘటనలో కమాండర్ మానవత్వాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. కఠినమైన సైనిక శిక్షణ మధ్య కూడా మానవత్వానికి చోటుందని చాటిచెప్పిన ఈ క్షణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంటోంది.జంతర్ మంతర్ చూమంతర్ కాళీ.. అని శంకర్దాదా చెప్పినట్టు ఇది ఏ మంత్రమో కాదు.. కానీ ఓ కౌగిలి చేసిన మ్యాజిక్. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్.. ఒక్క ఆలింగనంతో అతడికి ధైర్యం ఇచ్చాడు. ఆ హృదయాన్ని తాకే వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. -
రెండో ల్యాండింగ్లో.. రన్వేకు చేరువలోనే మృత్యుఘోష
అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్వేకు చేరువలోనే ఓ చార్టర్ విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగా పైలట్లు రన్వేను చూడలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.ప్రమాదానికి గురైన సెస్నా 441 (Cessna 441 Conquest) విమానం.. అలాస్కాలోని యాంకరేజ్ నుంచి బయలుదేరి కేప్ న్యూవెన్హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ ఎయిర్పోర్ట్కు వెళ్తోంది. గురువారం మధ్యాహ్నం ల్యాండింగ్కు ప్రయత్నించే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానాన్ని యాంకరేజ్కు చెందిన సెక్యూరిటీ ఏవియేషన్ సంస్థ నిర్వహిస్తోంది.రెండోసారి ల్యాండింగ్.. క్షణాల్లో విషాదంవిమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్లు మొదట ప్రయత్నించినా.. దట్టమైన పొగమంచు కారణంగా రన్వే కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అనంతరం రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నించే సమయంలో విమానం రాడార్ సంబంధాలు కోల్పోయి కూలిపోయింది. రన్వేకు సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతంలో శిథిలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అధికారులు మాట్లాడుతూ.. పైలట్లు బయట పరిస్థితులను చూడలేని స్థాయిలో ఉండడంతో కేవలం విమాన పరికరాల ఆధారంగానే నడిపినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మూడు వైపులా కొండలతో ఉన్న క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కలిగిన ప్రాంతమని చెప్పారు.మృతుల్లో..ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో అమెరికా ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. మరో నలుగురు కాంట్రాక్టర్లు. వీరంతా రాడార్ కేంద్రానికి సంబంధించిన పనుల కోసం ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని సహాయక బృందాలు ధ్రువీకరించాయి. మృతుల వివరాలను కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. మారుమూల సైనిక రాడార్ కేంద్రం వద్ద ప్రమాదంప్రమాదం జరిగిన కేప్ న్యూవెన్హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ అలాస్కాలోని నైరుతి తీరంలో ఉంది. యాంకరేజ్ నగరానికి ఇది సుమారు 725 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రాడార్ కేంద్రం అలాస్కా గగనతలాన్ని, సరిహద్దు ప్రాంతాల్లోని విమానాల కదలికలను పర్యవేక్షించే నెట్వర్క్లో భాగంగా పనిచేస్తుంది. వేగంగా మారిన వాతావరణంప్రమాదానికి ముందు ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారినట్లు అధికారులు తెలిపారు. మొదట కొంత దృశ్యమానత ఉన్నప్పటికీ.. కొద్ది సమయంలోనే దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఈ ప్రమాదంపై ఎన్టీఎస్బీ దర్యాప్తు ప్రారంభించింది. వాతావరణ పరిస్థితులు, పైలట్ల నిర్ణయాలు, విమానం సాంకేతిక పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అలాస్కా కమాండ్ అధికారులు మృతులను “కఠిన పరిస్థితుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అంకితభావం కలిగిన నిపుణులు”గా పేర్కొంటూ సంతాపం తెలిపారు.ఇదీ చదవండి: భారతీయుల కిడ్నాప్ కలకలం.. ఎక్కడో తెలుసా? -
ట్రంప్ కొత్త అస్త్రం.. ప్రతీకారం భీకరంగా ఉంటుందన్న ఇరాన్
అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్పై చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా.. దానికి ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించింది. కొత్త ఆంక్షలు, బెదిరింపులకు సమాధానం విధ్వంసకరంగా ఉంటుందని టెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది.‘అమెరికా బెదిరింపులకు గట్టి సమాధానం’.. అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి కొత్త బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి. ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీ మాట్లాడుతూ.. “భూమి, సముద్రం, గగనం, వాయు రక్షణ, సైబర్ రంగాల్లో మా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. శత్రువుల కొత్త బెదిరింపులకు శిక్షాత్మక, వినాశకర ప్రతిస్పందన ఇస్తాం” అని హెచ్చరించారు.ఆంక్షల యుద్ధం విఫలమవుతుంది: అరాఘ్చీఅమెరికా ప్రతిపాదిస్తున్న ఆర్థిక ఆంక్షలు విఫలమవుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ఆర్థిక ఒత్తిళ్లతో ఇరాన్ను లొంగదీసుకోవాలన్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. దౌత్య మార్గమే సమస్యలకు పరిష్కారమని పేర్కొంటూనే.. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ట్రంప్ లక్ష్యం.. ఇరాన్పై గరిష్ఠ ఒత్తిడిఇరాన్కు సహకరించే ఏ దేశంపైనైనా ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సోమవారం కొత్త ఆంక్షల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే ట్రంప్ మాత్రం.. “ఇరాన్ ఒక ఒప్పందాన్ని కోరుకుంటోంది. కానీ సరైన ఒప్పందానికి ఇంకా సిద్ధంగా లేదు” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, హర్ముజ్ జలసంధిని ప్రస్తుతం “అమెరికా భూభాగంగా చూస్తున్నాను” అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి.హర్ముజ్.. ఇరాన్ చేతిలో కీలక ఆయుధంప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం హార్ముజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా రోజూ భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యంతో ఈ ప్రాంతంలో నౌకా రవాణాకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ ప్రాంతంలో జరిగిన ఘటనల్లో పలువురు నావికులు ప్రాణాలు కోల్పోయారు.చమురు మార్కెట్లపై ఆందోళనఅమెరికా కొత్త ఆంక్షల హెచ్చరికలతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. ఇరాన్ చమురు సరఫరాపై ఆంక్షలు మరింత కఠినమైతే ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురులో ఎక్కువ భాగాన్ని చైనా కొనుగోలు చేస్తోంది. దీంతో అమెరికా ఒత్తిడి ప్రధానంగా బీజింగ్పైనా పడే అవకాశముంది. చైనా మాత్రం.. “ఆంక్షలు, ఒత్తిళ్లు సమస్యను పరిష్కరించవు. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం” అని స్పష్టం చేసింది.చర్చలకు ఒమన్ ప్రయత్నాలుహర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒమన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఒమన్, ఇరాన్ విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చించి.. నౌకా రవాణాపై కొత్త ఒప్పందం కోసం చర్చలు పునఃప్రారంభించే అంశాన్ని పరిశీలించారు.యెమెన్ హౌతీలతో మరో సమస్యఇదే సమయంలో యెమెన్కు చెందిన హౌతీ గ్రూప్ బాబ్ అల్ మందెబ్ జలసంధిలో సౌదీ నౌకలపై దిగ్బంధం ప్రకటించడంతో ఎర్ర సముద్ర రవాణాపైనా ప్రభావం పడింది. సౌదీ అరేబియాలోని యన్బు పోర్టుకు వచ్చే ట్యాంకర్ రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం.అమెరికా ఆర్థిక ఆంక్షల బెదిరింపులు.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు.. హర్ముజ్పై ఆధిపత్య పోరు.. ఇవన్నీ పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. దౌత్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల నుంచి వస్తున్న కఠిన ప్రకటనలు కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.ఇదీ చదవండి: ప్లీజ్.. ప్లీజ్.. మా చక్కెర కొనరా? -
హాస్పిటల్లో ట్విస్ట్.. ఖాన్ సాబ్కు ఇదేం శిక్ష?
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో.. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. చికిత్స కోసం ఆయన్ని ఇస్లామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది తెలిసిందే. అయితే ఈ ఉదయం మళ్లీ ఆయన్ని అడియాలా జైలుకు తరలించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పీటీఐ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం జైల్లో అందిస్తున్న సదుపాయాలు.. చికిత్సపై అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు వెలువడ్డ రెండ్రోజుల తర్వాతే ఆయన్ని.. గత అర్ధరాత్రి రావల్పిండి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఇస్లామాబాద్లో ఉన్న షిఫా ఆస్పత్రికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించారు. ఈ పరిణామంపై పీటీఐ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఆయన్ని నిజంగానే తరలించారా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆస్పత్రి వర్గాలు ఆయన చేరికను ధృవీకరించాయి. కోర్టు ఆదేశాల ప్రకారం.. తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 16వ తేదీ దాకా ఆయన్ని ఆస్పత్రిలోనే ఉంచుతారని అంతా భావించారు. కానీ.. ఈలోపే ట్విస్ట్ చోటు చేసుకుంది.శుక్రవారం ఉదయం.. షిఫా ఆస్పత్రిలో ఆరుగురు నిపుణుల వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు. దీంతో ఆయన జైల్లో ఉండడమే సురక్షితమని భావించి అధికారులు.. తిరిగి అడియాలాకు తీసుకొచ్చారు. కంటి సమస్య.. అంతా ఓకే అంటున్న ప్రభుత్వంఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయనకు కుడి కంటి సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రక్తనాళాల్లో సమస్య (సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లూజన్) కారణంగా ఆయనకు చికిత్స అవసరమని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు చెబుతున్నారు. జైలులో సరైన వైద్యం అందడం లేదని ఇమ్రాన్ కుటుంబం ఆరోపిస్తుండగా.. అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పాక్ ప్రభుత్వం చెబుతోంది.రివ్యూ పిటిషన్.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బఇమ్రాన్ను ఆస్పత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం అభ్యంతరాలతో తిరిగి పంపింది. అభ్యంతరాలను సరిచేసి మళ్లీ దాఖలు చేసే అవకాశం ఉంది.జైలు నుంచే రాజకీయ పోరాటం2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉన్నారు. తనపై నమోదైన కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. 2018లో పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్.. 2022లో అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయారు. ఆ తర్వాత ఆయనకు, పాక్ సైన్యానికి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ప్రస్తుతం జైలు నుంచే తన విడుదల కోసం ఇమ్రాన్, తమ అధినేత కోసం పీటీఐ నేతలు పోరాడుతున్నారు. మెరుగైన వైద్యం, కేసుల వేగవంతమైన విచారణ, విడుదల కోసం పీటీఐ దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతోంది. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఊరట?
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ను ఎట్టకేలకు ఊరట లభించిందా?. మూడేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారా?. గురువారం అర్ధరాత్రి దాటాక రావల్పిండి జైలు నుంచి ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించినట్లు ప్రచారం జరుగుతున్నాయి. ఈ విషయాన్ని పీటీఐ వర్గాలు ధృవీకరించగా.. ఆయన అభిమానులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్.. మూడేళ్లుగా అడియాలా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు.. ప్రత్యేక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఆయన చికిత్స విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆయన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది.Imran Khan has been freed from Adiala Jail and taken to Shifa Hospital tonight.He is a political prisoner because he wanted to bring democracy to Pakistan, something America does not want, they need control of the Nucs.CAN HE BECOME THE “NELSON MANDALA” OF PAKISTAN⁉️…— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) August 20, 2026అయితే రివ్యూ పిటిషన్ పేరిట రెండ్రోజులు పాక్ ప్రభుత్వం హైడ్రామా నడిపింది. చివరకు.. కోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రికి తరలిచింది. ఆయన చూపు క్షీణించిందని.. కుడి కన్ను శాశ్వతంగా కనిపించడం లేదని ఆయన తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అలాగే 73 ఏళ్ల ఇమ్రాన్కు భారీగా బరువు తగ్గి బక్కచిక్కిపోయారని చెప్పారు. మరోవైపు ఇమ్రాన్కు తక్షణ ఆస్పత్రి చికిత్స అవసరమయ్యే పరిస్థితి లేదని వైద్య నివేదికలు సూచిస్తున్నాయని పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతోంది.Imran khan was never taken to the hospital today.The dictatorship in Pakistan trying to fool everyone. Snakes in his party who are work for the army have been exposed. https://t.co/b1ZGEsNuh4 pic.twitter.com/9vghKQ9TTs— Ali (@MerruX) August 21, 2026అయితే ఆయన తరలింపు సమయంలో నడిచిన హైడ్రామాపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఆయన్ని తరలించారా?.. ఫొటోలు రిలీజ్ చేయాలంటూ.. కోరుతున్నారు. పాక్లో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోందని.. ఇమ్రాన్ ఖాన్ను చంపే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇటు కోర్టు ఆదేశాల మేరకు.. ఆయనకు వ్యక్తిగత వైద్యుడితో కూడిన వైద్య బృందం పరీక్షలు నిర్వహించేందుకు షిఫా ఆస్పత్రి సిద్ధమైంది. తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 16 వరకు ఆయన ఆస్పత్రిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇమ్రాన్ ఖాన్కు గత జనవరిలో కుడి కంటికి సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అనే సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి చికిత్స కోసం ఇస్లామాబాద్లోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)కు పలుమార్లు తరలించారు. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రికి బదులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. జైలులో వైద్య సేవలు, కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో భేటీలపై ఆంక్షలు ఉన్నాయని కూడా వారు ఆరోపించారు.పీటీఐలో కొత్త ఆశలుసుప్రీంకోర్టు ఆదేశాలతో ఇమ్రాన్ను ఆస్పత్రికి తరలించడాన్ని ఆయన పార్టీ స్వాగతించింది. కోర్టు నిర్ణయం తమకు ‘కొత్త ఆశాకిరణం’ అని పార్టీ ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ పేర్కొన్నారు. అయితే ఇమ్రాన్కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పార్టీ సిద్ధమవుతోందని తెలిపారు. సెప్టెంబర్ 27న దేశవ్యాప్త మార్చ్కు పిలుపునిచ్చిన PTI.. ఇమ్రాన్కు మద్దతుదారులను కలిసే అవకాశం కల్పించడం, ఆయనపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయడం, చివరకు ఆయనను విడుదల చేయడం వంటి డిమాండ్లను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.2023 నుంచి జైల్లోనే..మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ 2018లో పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2022లో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయారు. అనంతరం ఆయనకు, PTIకి, పాకిస్థాన్ సైనిక వ్యవస్థకు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగాయి. 2023 మే 9న ఇమ్రాన్ అరెస్టు దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, హింసకు దారితీసింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 5న తోషాఖానా కేసుతో సహా అవినీతి ఆరోపణల కేసుల్లో ఆయనను మరోసారి అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కిందటి ఏడాది అక్టోబర్-నవంబర్ నుంచి ఆయన నుంచి సోషల్ మీడియా ఖాతాలోనూ ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలతోనే ఉన్నారా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం ఆయనపై పలు కేసులు, న్యాయపరమైన సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆస్పత్రికి తరలింపు పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా మారింది.ఇదీ చదవండి: పాక్లో మరింత పవర్ఫుల్గా మునీర్! -
పెరూ ఆండీస్ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం
పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతం శక్తివంతమైన భూకంపంతో ఒక్కసారిగా వణికిపోయింది. ప్రకంపనల ధాటికి దక్షిణ భాగంలోని ఇకా, అరెక్విపా ప్రాంతాలు వణికిపోయాయి. జనాలు ఇళ్లలోంచి పరుగులు తీసి.. బయటే గడిపారు. సునామీ ముప్పు లేదని అధికారులు ప్రటించారు. ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. దక్షిణ పెరూలో గురువారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్పై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం అయాకుచో ప్రాంతంలోని పరినకోచాస్ ప్రావిన్స్లోని ఉపాహుచో పట్టణానికి వాయువ్యంగా సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. భూకంపం 66.7 కిలోమీటర్ల లోతులో సంభవించింది.ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెరూ పౌర రక్షణ విభాగం అధికారి లూయిస్ వాస్కెజ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని తెలిపారు. పరినకోచాస్ ప్రావిన్స్ మేయర్ యోనీ రేయెస్ కూడా ప్రావిన్స్ రాజధానిలో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని వెల్లడించారు.సునామీ ముప్పు లేదన్న నేవీభూకంపం తర్వాత పెరూ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నష్టం ఏమైనా జరిగిందా? అనే దానిపై అంచనా వేస్తున్నారు. మరోవైపు భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని పెరూ నేవీ స్పష్టం చేసింది.‘రింగ్ ఆఫ్ ఫైర్’లో పెరూపెరూ తరచూ భూకంపాలకు గురవుతుంది. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న అత్యంత చురుకైన భూకంప మండలమైన రింగ్ ఆఫ్ ఫైర్లో ఆ దేశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. భూకంప కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా తరచూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి.పెరూలో గతంలోనూ భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఇదే ఆండీస్ రీజియన్లో జులైలో సంభవించిన భూకంపంలో ఐదుగురు మరణించగా.. 21 మందికి గాయాలు అయ్యాయి. అంతకు ముందు 2007 ఆగస్టులో మధ్య పెరూ తీరానికి సమీపంలో 8.0 తీవ్రతతో సంభవించిన భూకంపం.. పిస్కో, చించా ఆల్టా, ఇకా ప్రాంతాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ ఘటనలో 519 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.తాజాగా సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఇది లోతైన ప్రాంతంలో సంభవించడంతో ఇప్పటివరకు పెద్దగా నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: నైజీరియాలో ఘోర విషాదం -
సూపర్మ్యాన్ స్పీడ్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు!
ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఏది అంటే.. ఠక్కున వచ్చే సమాధానం చిరుత. మరి మనుషుల్లో? జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ పేరు ముందుగా గుర్తొస్తుంది. వేగానికి పర్యాయపదంగా మారిన బోల్ట్.. ఒక్కసారి పరుగు మొదలుపెడితే ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకెళ్లేవాడు. అలాంటి పరుగుల రారాజు నమోదు చేసిన గరిష్ఠ వేగం రికార్డు బద్ధలైంది!!.ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. మనిషి సాధించలేనిది.. యంత్రం చేసి చూపించింది. చైనాకు చెందిన ‘సూపర్మ్యాన్’ హ్యూమనాయిడ్ రోబో బోల్ట్ గరిష్ఠ వేగాన్ని దాటి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రూపొందించిన రోబో.. సెకనుకు 12.66 మీటర్ల వేగంతో పరుగెత్తినట్లు సంస్థ వెల్లడించింది. అంటే గంటకు దాదాపు 45.6 కిలోమీటర్ల వేగం అన్నమాట. 2009లో బెర్లిన్లో జరిగిన 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ నమోదు చేసిన గరిష్ఠ వేగం సెకనుకు 12.42 మీటర్లు. దీంతో వేగం విషయంలో బోల్ట్ను రోబో అధిగమించినట్లయింది.Chinese humanoid robot named “Superman”, made by Unitree Robotics, surpassed Usain Bolt’s world record (12.42 meters/second) by running at 12.66 m/s (roughly 28.3 miles/h) pic.twitter.com/xobXzUPDI5— Massimo (@Rainmaker1973) August 18, 2026ఉసేన్ బోల్ట్ 2009లో బెర్లిన్లో జరిగిన 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ పరుగులో ఆయన గరిష్ఠంగా సెకనుకు 12.42 మీటర్ల వేగాన్ని అందుకున్నారు. ఇప్పుడు యూనిట్రీ విడుదల చేసిన వీడియోలో ‘సూపర్మ్యాన్’ సెకనుకు 12.66 మీటర్ల వేగంతో దూసుకెళ్లడం కనిపించింది. దీంతో బోల్ట్ గరిష్ఠ వేగం కంటే రోబో వేగం స్వల్పంగా ఎక్కువగా నమోదైంది. పరుగుల తర్వాత అది దారి తప్పి కింద పడిపోవడం గమనార్హం.నిలబడే రెండు మీటర్లు జంప్!పరుగులోనే కాదు.. జంప్లోనూ ‘సూపర్మ్యాన్’ తన సామర్థ్యాన్ని చాటింది. ఎలాంటి రన్అప్ లేకుండా నిలబడి ఉన్న చోటు నుంచే సుమారు రెండు మీటర్ల ఎత్తుకు ఎగరగలదని యూనిట్రీ తెలిపింది. ఈ రోబో కాళ్ల పొడవు సుమారు 0.85 మీటర్లు. కేవలం మూడు నెలలకు పైగా వ్యవధిలోనే దీన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో దీని వేగం, సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉందని తెలిపింది.వైరల్గా మారిన వీడియోయూనిట్రీ ఆగస్టు 17న ‘సూపర్మ్యాన్’ సామర్థ్యాలను చూపిస్తూ వీడియోను విడుదల చేసింది. వేగంగా పరుగెత్తడం, నిలబడి రెండు మీటర్ల వరకు ఎగరడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మనిషి వేగానికి ప్రతీకగా నిలిచిన బోల్ట్ గరిష్ఠ వేగాన్ని రోబో దాటిందన్న విషయం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.18 వేల రోబోలు తయారు చేసిన యూనిట్రీచైనాలోని హాంగ్జౌ కేంద్రంగా పనిచేస్తున్న యూనిట్రీ.. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే వివిధ మోడళ్లకు చెందిన సుమారు 18 వేల బైపెడల్ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. మరోవైపు యూనిట్రీ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్లోని STAR మార్కెట్లో లిస్టింగ్కు సిద్ధమవుతోంది. ఐపీఓలో భాగంగా సుమారు 6.1 బిలియన్ యువాన్లు (దాదాపు 905 మిలియన్ డాలర్లు) సమీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘సూపర్మ్యాన్’ ప్రదర్శన సంస్థ సాంకేతిక సామర్థ్యాలపై మరింత ఆసక్తిని పెంచింది. -
రాజకుటుంబానికి దూరమై.. ఆరేళ్ల తర్వాత యువరాజు రాక!
బ్రిటన్ రాజకుటుంబంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ఆరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిపోయిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ మళ్లీ బ్రిటన్కు తిరిగి రానున్నారు. పిల్లల చదువు కోసం ససెక్స్ దంపతులు బ్రిటన్లో ఎక్కువ కాలం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది కేవలం కుటుంబ అవసరాల కోసమా? లేదంటే రాజకుటుంబంతో సంబంధాల పునరుద్ధరణకు అడుగులా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.ప్రిన్స్ హ్యారీ, మేఘన్ తమ పిల్లలు ప్రిన్స్ ఆర్చీ (7), ప్రిన్సెస్ లిలిబెట్ (5)తో కలిసి ఈ నెలలోనే బ్రిటన్కు రానున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సెప్టెంబర్లో పిల్లలు బ్రిటన్లోని పాఠశాలలో చేరే అవకాశం ఉందని సమాచారం. దీంతో ససెక్స్ కుటుంబం అమెరికాలోని కాలిఫోర్నియా జీవితం నుంచి కొంతకాలం పాటు బ్రిటన్ కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే హ్యారీ–మేఘన్ రాజకుటుంబానికి చెందిన ‘వర్కింగ్ రాయల్స్’గా మాత్రం తిరిగి వ్యవహరించబోరని తెలుస్తోంది. కేవలం స్వతంత్ర సభ్యులుగానే కొనసాగుతారని.. రాజభవనంలో కాకుండా ప్రత్యేక నివాసంలో ఉండే అవకాశం ఉందని బ్రిటన్ టాబ్లాయిడ్లు కథనాలు ఇస్తున్నాయి..అసలు ఆరేళ్ల క్రితం ఏం జరిగింది?హ్యారీ–మేఘన్ దంపతులు 2020 జనవరిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకుటుంబంలో సీనియర్ సభ్యులుగా తమ అధికారిక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది మార్చిలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అనంతరం వారు అమెరికాకు వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని మాంటెసిటోలో స్థిరపడిన ఈ దంపతులు అక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సుమారు 14.7 మిలియన్ డాలర్ల విలువైన భవనంలో నివసిస్తూ.. మీడియా ప్రాజెక్టులు, వ్యాపార ఒప్పందాలతో తమ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కొనసాగించారు.సంచలన ఆరోపణలు?హ్యారీ–మేఘన్ నిర్ణయం వెనుక రాజకుటుంబంలో ఎదురైన ఒత్తిళ్లు, మీడియా వ్యవహారాలు ప్రధాన కారణాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా మేఘన్ రాజకుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పలుమార్లు బహిరంగంగా మాట్లాడారు. 2021లో ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజభవనంలో తనకు ఎదురైన ‘చేదు’ అనుభవాల్ని వివరిస్తూ సంచలన ప్రకటనలు చేశారు. హ్యారీ కూడా తన తండ్రి కింగ్ చార్లెస్, అన్న ప్రిన్స్ విలియమ్తో తన సంబంధాల్లో వచ్చిన విభేదాలను వెల్లడించారు. 2023లో విడుదలైన తన ఆత్మకథ ‘స్పేర్’లో విలియమ్తో విభేదాలను ప్రస్తావించడం మరింత సంచలనంగా మారింది.మధ్యలో బ్రిటన్కు వచ్చినా.. అమెరికాకు వెళ్లిన తర్వాత హ్యారీ పలుమార్లు బ్రిటన్కు వచ్చారు. ముఖ్యంగా తన తండ్రి కింగ్ చార్లెస్ పట్టాభిషేకం సందర్భంగా 2023లో లండన్కు వచ్చారు. అలాగే రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల సమయంలో 2022లో కూడా కుటుంబంతో కలిసి బ్రిటన్లో ఉన్నారు. ఇటీవల కూడా హ్యారీ–మేఘన్ పిల్లలతో కలిసి బ్రిటన్ను సందర్శించారు. ఈ సందర్భంగా కింగ్ చార్లెస్కు ఆర్చీ, లిలిబెట్లను కలిసే అవకాశం లభించింది.ఇకపై ఏం జరగొచ్చు?తాజా నిర్ణయం రాజకుటుంబంలో పూర్తిస్థాయి పునరాగమనంగా భావించడం లేదు. హ్యారీ–మేఘన్ ఇకపై కూడా ‘నాన్ వర్కింగ్ రాయల్స్’గానే కొనసాగనున్నారు. రాజకుటుంబ అధికారిక కార్యక్రమాల్లో వారికి మళ్లీ కీలక పాత్ర ఉండకపోవచ్చని సమాచారం.మరోవైపు హ్యారీకి సంబంధించిన భద్రతా వివాదం ఇంకా పూర్తిగా ముగియలేదు. రాజకుటుంబ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్రిటన్లో ఆయనకు కల్పించే భద్రతపై వివాదం చెలరేగింది. దీనిపై కోర్టులో పోరాడిన హ్యారీకి అనుకూల ఫలితం రాలేదు. అయితే తండ్రి కింగ్ చార్లెస్తో సంబంధాలు కొంత మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ అన్న ప్రిన్స్ విలియమ్తో ఉన్న దూరం మాత్రం ఇంకా కొనసాగుతోంది. -
కెన్యాలో తీవ్ర విషాదం.. హెలికాఫ్టర్ కూలి ఏడుగురి మృతి
కెన్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సఫారీ ప్రయాణంలో ఉన్న హెలికాప్టర్ కుప్పకూలడంతో ఏడుగురు మరణించారు. మృతుల్లో ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ దంపతులతో పాటు ఐదుగురు అమెరికన్లు కోల్పోయారు. ఉత్తర కెన్యాలోని మారుమూల ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.కెన్యా పౌర విమానయాన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. లోయిసాబా కన్జర్వెన్సీ నుంచి ఎవాసో న్యిరో ప్రాంతానికి వెళ్తుండగా ఉదయం 9.13 గంటలకు సాంబురు కౌంటీలోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఘటన సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు, ఒక పైలట్ ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే హెలికాప్టర్లో ఉన్నఅంతా మృతి చెందినట్లు సాంబురు పోలీసు కమాండర్ డేవిడ్ న్కోరోయ్ వెల్లడించారు.🇰🇪 Tragedy in Kenya.Seven people were killed in a helicopter crash in northern Kenya, according to authorities and local media.Among the victims were five Americans, including a Telemundo executive, as well as an Ecuadorian security official.No known cause yet. Writer:…— Mario Nawfal (@MarioNawfal) August 19, 2026మృతుల్లో ఐదుగురు అమెరికా పౌరులు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈక్వెడార్ నేషనల్ ఇంటెలిజెన్స్ సెంటర్ డైరెక్టర్ పేరు మిచెల్ సెన్సీ-కాంటూగి.. ఆయన సతీమణి స్టెఫనీ హోలిహాన్ కూడా మృతి చెందారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన అమెరికా రాయబార కార్యాలయం.. స్థానిక అధికారులతో కలిసి కాన్సులర్ సహాయం అందిస్తున్నట్లు పేర్కొంది. BREAKING: An aircraft has crashed at Lolokwe Mountain in Samburu County, Kenya, the Kenya Civil Aviation Authority (KCAA) says.The Eurocopter EC130 B4, registration 5Y-GYM, was flying from Loisaba to Ewasonyiro when the accident occurred at around 9:13am on Wednesday, August… pic.twitter.com/hpCIgr7cXC— The New Times (Rwanda) (@NewTimesRwanda) August 19, 2026మృతుల వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఫ్లోరిడాకు చెందిన టెలిముండో మీడియా సంస్థ ఉన్నతాధికారి జోసే సువారెజ్ (55) మృతుల్లో ఒకరని స్థానిక మీడియా తెలిపింది. ఆయన టెలిముండో ఫ్లోరిడా స్టేషన్లకు అధ్యక్షుడు, జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ప్రమాదానికి ముందు వాళ్లంతా సరదాగా గడిపిన చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.One of these photos captured a moment of joy before the flight. The other is a portrait of Michele Sensi-Contugi, Ecuador’s intelligence chief.Hours later, a helicopter carrying seven people crashed near Mt. Ololokwe in Samburu County, Kenya.More details of the tragedy 👇 pic.twitter.com/GcSaWzPL1R— LESAMBURUI (@hon_lesamburui) August 19, 2026It has now emerged that one of the American tourists who perished in the Eurocopter EC130 B4 aircraft at Mt Ololokwe near Kirish in Samburu County, Kenya while covering the route from Loisaba to Ewaso Nyiro is Jose Alberto Suarez, President and General Manager of Telemundo 31,… pic.twitter.com/UoJxWn4T6L— JaHomaBay (@HassanMcOjwang) August 19, 2026ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లేడీ లోరీ హెలికాఫ్టర్స్కు చెందినదిగా అధికారులు తెలిపారు. ఇది చార్టర్ ఫ్లైట్గా నడుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. మౌంట్ ఒలోలోక్వే పర్వత పాద ప్రాంతంలోని క్లిష్టమైన భూభాగంలో హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు కెన్యా రెడ్క్రాస్, ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.కెన్యాలో పర్యాటక రంగం విస్తృతంగా ఉండటంతో దూర ప్రాంతాలకు ప్రయాణికులను తరలించేందుకు హెలికాప్టర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో దేశంలో హెలికాప్టర్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ కెన్యాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఓ ఎంపీ సహా ఆరుగురు మృతి చెందారు. తాజా ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. -
ముందుచూపే ఇరాన్ను బతికించిందా?.. ఇక మీదట ఎలా?
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతులపై ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్పై మరిన్ని కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలు తీసుకుంటామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఇరాన్ ప్రభుత్వం.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది? ఇక మీదట ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇరాన్పై అమెరికా ఇప్పటికే విస్తృతమైన ఆంక్షలు అమలు చేస్తోంది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా ఇరాన్కు చెందిన వ్యక్తులు, నౌకలు, విమానాలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ జాబితాను మరింత విస్తరించేందుకు వాషింగ్టన్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు వ్యాపారానికి సహకరిస్తున్న సంస్థలు, ఆర్థిక లావాదేవీలు, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్ చమురుకు చైనా ప్రధాన కొనుగోలుదారు. దీంతో అక్కడి చిన్న రిఫైనరీలపై అమెరికా ఇప్పటికే ద్వితీయ ఆంక్షలు విధించింది. ఇరాన్తో లావాదేవీలు నిర్వహించే పెద్ద చైనా బ్యాంకులపైనా చర్యలు తీసుకునే అవకాశముందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ఇరాన్ చమురు ఆదాయానికి మరింత గండి పడటమే కాకుండా అమెరికా–చైనా సంబంధాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.హర్ముజ్ మూసుకుపోతే..ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మరో కీలక సమస్య హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో యుద్ధానికి ముందు దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగేది. ఇప్పుడు యుద్ధం, దిగ్బంధనం కారణంగా నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ఇరాన్కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్కూ ఆందోళన మొదలైంది.అయితే హర్ముజ్ను తెరిచే విషయంలో ఇరాన్ కూడా తన షరతులను స్పష్టం చేస్తోంది. అమెరికా దిగ్బంధనం ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, చమురు ఆంక్షలు తొలగించడం, సైనిక చర్యలను నిలిపివేయడం వంటి హామీలు లభించే వరకు జలసంధిని తెరవబోమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు.సముద్ర మార్గం దెబ్బతింటే..హర్ముజ్ సంక్షోభం సుదీర్ఘమైతే దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇరాన్ ముందుగానే గుర్తించింది. సముద్ర మార్గాల్లో సరుకుల రవాణా దెబ్బతిన్నా దేశంలో ఆహారం, వినియోగ వస్తువులు, పారిశ్రామిక ముడిసరుకుల కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంది. పాకిస్థాన్, టర్కియే తదితర దేశాలతో ఉన్న భూ సరిహద్దుల ద్వారా సరుకులను దిగుమతి చేసుకుంటోంది. కాస్పియన్ సముద్రం మీదుగా రష్యా, మధ్య ఆసియా దేశాల నుంచి సరుకులను తీసుకొచ్చే మార్గాలపైనా దృష్టి పెట్టింది.యుద్ధానికి ముందే సరిహద్దు ప్రావిన్సులకు కొన్ని అధికారాలు అప్పగించి అత్యవసర వస్తువుల నిల్వలను పెంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఆ ముందస్తు నిల్వలే సంక్షోభ సమయంలో ఇరాన్కు కొంత ఊరటనిస్తున్నాయి.చమురు ఆదాయం తగ్గితే..అయితే ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు ఉన్నప్పటికీ ఇరాన్కు అసలు సమస్య ఆదాయమే. దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ప్రధాన ఆదాయ వనరు. యుద్ధం, ఆంక్షలు, రవాణా సమస్యల కారణంగా చమురు ఎగుమతులు దెబ్బతింటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుంది. అదే సమయంలో యుద్ధంతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునర్నిర్మాణానికి అదనపు ఖర్చులు అవసరమవుతాయి.ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. చమురు ఆదాయం మరింత పడిపోతే ఈ భారమంతా సామాన్య ప్రజలపై పడే ప్రమాదం ఉంది.ఇంధన కొరత ముంచుకొస్తుందా?చమురు ఎగుమతుల సమస్యకు తోడు ఇరాన్కు ఇంధన సరఫరా కూడా సవాలుగా మారుతోంది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వ్యవస్థలు యుద్ధానికి ముందే ఒత్తిడిలో ఉన్నాయి. దిగ్బంధనం మరింతకాలం కొనసాగితే ఈ రంగాల్లో సంక్షోభం తీవ్రమయ్యే అవకాశం ఉంది.శరదృతువు, చలికాలం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంధనం, విద్యుత్, గ్యాస్ కొరత ఏర్పడవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా తగ్గించి.. గృహ అవసరాలకు సరఫరాను కాపాడాల్సిన పరిస్థితి రావచ్చని వియన్నా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ స్టడీస్కు చెందిన ఆర్థికవేత్త మహ్దీ ఘోద్సీ పేర్కొన్నారు.ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే వ్యక్తిగత వాహనాలకు ఇచ్చే సబ్సిడీ పెట్రోల్ కోటాలను తగ్గించింది. ఇంధన ధరలు పెంచే అంశాన్నీ పరిశీలిస్తోంది.యుద్ధానికి ముందే బలహీనంగా..ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి ప్రస్తుత యుద్ధమే కారణం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒంటరితనం, దేశీయ అవినీతి, పాలనా వైఫల్యాలు ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. ఇప్పుడు వీటికి యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతుల అంతరాయం తోడయ్యాయి.అంటే ఇరాన్ ప్రస్తుతం ఒకేసారి రెండు యుద్ధాలు చేస్తోంది. బయట సైనిక పోరాటం కొనసాగుతుండగా.. లోపల ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడుకునే పోరాటం సాగుతోంది.పెజెష్కియాన్ ప్రభుత్వం ఏం చేస్తోంది?ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం వచ్చే రెండేళ్లకు ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాలను నిర్దేశించుకుంది. మార్కెట్లను స్థిరీకరించడం, ప్రజల జీవనోపాధిని రక్షించడం, దేశ ఆర్థిక స్థైర్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంది. అయితే అత్యవసర చర్యలు కొంతకాలం మాత్రమే ఉపశమనం కల్పించగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు దేశీయంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.ఇక ముందు ఎలా?ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ముందు రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో రాజీకి వచ్చి ఆంక్షలు, దిగ్బంధనం నుంచి ఉపశమనం పొందడం ఒకటి. ఒత్తిడికి తలొగ్గకుండా సైనిక, ఆర్థిక ప్రతిఘటనను కొనసాగించడం రెండోది. ఇరాన్ ఇప్పటివరకు రెండో మార్గానికే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అయితే యుద్ధం, హర్ముజ్ సంక్షోభం, చమురు ఎగుమతుల అంతరాయం మరింతకాలం కొనసాగితే ఇరాన్ ముందస్తు ఏర్పాట్లకు కూడా పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు, అత్యవసర నిల్వలు కొంతకాలం దేశాన్ని ఆదుకోగలిగినా.. చమురు ఆదాయం లేకుండా దీర్ఘకాలం ఆర్థిక వ్యవస్థను నడపడం మాత్రం కష్టమే.అదే సమయంలో హర్ముజ్ జలసంధి సంక్షోభం ఇరాన్ సరిహద్దులు దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయంగా ధరలు పెరగవచ్చు. ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా పెరిగే ప్రమాదం ఉంది. -
ఆ ఒక్క పాటతో అన్ని వందల కోట్లు వచ్చాయా?
ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన ఆ పాట.. 14 ఏళ్లు గడిచినా యూట్యూబ్లో తన జోరు కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా కోట్లాది మందిని అలరించిన ఆ సాంగ్ తాజాగా మరో రికార్డు సృష్టించింది. ఒకప్పుడు యూట్యూబ్లో బిలియన్ వ్యూస్ అందుకున్న తొలి వీడియోగా చరిత్ర సృష్టించిన అదే పాట.. ఇప్పుడు 6 బిలియన్ మార్క్ను అందుకుని తన సత్తా చాటింది. అంతటి ఆదరణ పొందిన ఈ పాట.. సింగర్ పీఎస్వైకి ఎంత ఆదాయాన్ని తెచ్చిపెట్టిందన్నదే ఇప్పుడు ఆసక్తికరం.దక్షిణ కొరియా పాప్ స్టార్ పీఎస్వై పాడిన ‘గంగ్నమ్ స్టైల్’ తాజాగా 6 బిలియన్ వ్యూస్ దాటి మరో సెన్సేషన్గా మారింది. 2012 జులైలో విడుదలైన ఈ పాట.. అదే ఏడాది డిసెంబర్లో యూట్యూబ్లో ఫస్ట్ బిలియన్ వ్యూస్ సాధించిన తొలి వీడియోగా చరిత్ర సృష్టించింది. 2013లో ఈ పాటకు సుమారు 1.23 బిలియన్ యూట్యూబ్ వ్యూస్ ఉన్న సమయంలో.. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నికేష్ అరోరా ఈ వీడియోకు 8 మిలియన్ డాలర్లకుపైగా యాడ్ రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అప్పటి లెక్కల ప్రకారం 8 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.50 కోట్లకుపైనే.6 బిలియన్ల వ్యూస్తో రెవెన్యూ ఎంతంటే..తాజాగా ‘గంగ్నమ్ స్టైల్’ 6 బిలియన్ వ్యూస్ దాటింది. 2023 డిసెంబర్లో 5 బిలియన్ మార్క్ చేరుకున్న ఈ వీడియో.. మరో బిలియన్ వ్యూస్ సాధించడానికి రెండేళ్ల ఏడు నెలల సమయం తీసుకుంది. అంటే.. విడుదలై దాదాపు 14 ఏళ్లు గడిచినా ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదన్నమాట.యాడ్ ఆదాయ రేటును కేవలం సూచికగా తీసుకుని 6 బిలియన్ వ్యూస్కు వర్తింపజేస్తే.. యూట్యూబ్ ప్రకటనల ద్వారా వచ్చే మొత్తం దాదాపు రూ.250–300 కోట్ల స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే యూట్యూబ్ ప్రకటన రేట్లు, ప్రేక్షకులు ఉన్న దేశాలు, మానిటైజేషన్, యాడ్ వీక్షణలు తదితర అంశాల ఆధారంగా ఈ ఆదాయం మారుతుంది. ఇతర ఆదాయ మార్గాలను కూడా కలిపి చూస్తే.. ఎంత లేదన్నా ‘గంగ్నమ్ స్టైల్’ ద్వారా మొత్తం సంపాదన సుమారు రూ.800 కోట్లకుపైగా ఉండొచ్చన్నది అంచనా.ఆ మొత్తం మొత్తం పీఎస్వైకే దక్కుతుందా?‘గంగ్నమ్ స్టైల్’కు యూట్యూబ్ మాత్రమే ఆదాయ వనరు కాదు. డిజిటల్ డౌన్లోడ్లు, మ్యూజిక్ స్ట్రీమింగ్, లైసెన్సింగ్, ప్రకటనలు, ఇతర వాణిజ్య ఒప్పందాలు కూడా ఉన్నాయి. 2013లోనే ఈ పాట డిజిటల్ డౌన్లోడ్లు, ప్రకటనలు, ఆన్-డిమాండ్ సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.అయితే యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం పీఎస్వైకి దక్కదు. ప్లాట్ఫామ్ వాటాతో పాటు మ్యూజిక్, వీడియో హక్కుదారులు, రికార్డ్ లేబుల్, ఇతర భాగస్వాములకు కూడా ఆదాయం పంచబడుతుంది. అయినప్పటికీ.. అన్ని ఆదాయ మార్గాలను కలిపి చూస్తే పీఎస్వైకి ఈ పాట ద్వారా భారీ మొత్తమే దక్కినట్లు చెప్పొచ్చు. ఆ పాట ఎలా పుట్టిందంటే..‘గంగ్నమ్ స్టైల్’ పుట్టుక వెనుక దక్షిణ కొరియాలోని గంగ్నమ్ ప్రాంత జీవనశైలే ప్రధాన ప్రేరణ. గంగ్నమ్లో పుట్టి పెరిగిన పీఎస్వై.. అక్కడి ఉన్నతవర్గాల జీవనశైలి, వారి ఫ్యాషన్, హంగూ ఆర్భాటాలను తనదైన శైలిలో పాటగా మలిచారు. యూ జంగ్ హ్యుంగ్తో కలిసి సాహిత్యం రాయడంతో పాటు మ్యూజిక్ను రూపొందించిన పీఎస్వై.. సరదా పదాలు, వ్యంగ్యభరితమైన భావన, ఆకట్టుకునే బీట్ను జోడించారు. ఇక గుర్రపు స్వారీని తలపించే డ్యాన్స్ స్టెప్ పాటకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఇలా పెద్దగా అంచనాలు లేకుండా రూపొందిన ఈ పాట.. ప్రపంచ సంగీత చరిత్రనే మార్చేసే సంచలనంగా మారింది.ప్రపంచాన్ని ఊపేసిన గుర్రపు స్టెప్పు2012లో విడుదలైన ‘గంగ్నమ్ స్టైల్’ కొరియన్ భాషలో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. పీఎస్వై వేసిన ప్రత్యేకమైన గుర్రపు స్వారీ తరహా డ్యాన్స్ పాటకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. అమెరికా బిల్బోర్డ్ హాట్ 100లో ఈ పాట ఏడు వారాల పాటు రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా యూట్యూబ్ చరిత్రలో 1 బిలియన్ వ్యూస్ అందుకున్న తొలి వీడియోగా ‘గంగ్నమ్ స్టైల్’ నిలిచింది. ఈ పాట తర్వాత.. పీఎస్వై నుంచి ఆ స్థాయి ఆల్బమ్ రాలేదు. కానీ, అప్పటి నుంచి ఆయన టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా క్రేజ్ లేని రోజుల్లోనే.. యూట్యూబ్తో గంగ్నమ్ స్టైల్ సంచనాలు సృష్టించడం, ఇప్పుడు 6 బిలియన్ వ్యూస్తో మరో మైలురాయిని అందుకోవడం.. క్రేజ్ను ఏదీ అడ్డుకోలేదని నిరూపించింది. -
ఇరాన్తో సంబంధాలు కట్.. యూఏఈ సంచలన ఆరోపణలు
పశ్చిమాసియా సంక్షోభం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఇరాన్–యూఏఈ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. గల్ఫ్లో నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ ఆరోపించగా.. ఆ వాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధార ఆరోపణలని, ఇలాంటి ప్రకటనలు ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలిగిస్తాయని ఇరాన్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. మరోవైపు.. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్తో అన్ని రకాల వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.మంగళవారం గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు తమ వైపు దూసుకొచ్చినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ రెండు క్షిపణులను గుర్తించాయని పేర్కొంది. వాటిలో ఒకటి యూఏఈ ప్రాదేశిక జలాల వెలుపల సముద్రంలో పడగా.. మరో క్షిపణి తమ ప్రాదేశిక జలాల్లోనే కూలిపోయిందని వెల్లడించింది.ఆ తర్వాత విడుదల చేసిన మరో ప్రకటనలో.. ఈ రెండు క్షిపణులు సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకున్నట్లు తమ అంచనాల్లో తేలిందని యూఏఈ పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.‘నిరాధార ఆరోపణలు’.. ఇరాన్ కౌంటర్యూఏఈ ఆరోపణలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశం నుంచి యూఏఈపై క్షిపణి ప్రయోగించారన్న ఆరోపణలను ‘పూర్తిగా ఖండిస్తున్నట్లు’ ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ప్రాంతీయ దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలకు ఇలాంటి ఆరోపణలు విఘాతం కలిగిస్తాయని అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిరాధార ఆరోపణలకు దూరంగా ఉండాలని యూఏఈ సహా ప్రాంతీయ దేశాలకు సూచించారు.అమెరికా, ఇజ్రాయెల్ చర్యల కారణంగా ఇప్పటికే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని బఘాయీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తప్పుడు ఆరోపణలు చేయడం ప్రాంతీయ భద్రతను మరింత దెబ్బతీస్తుందని అన్నారు.యూఏఈలో మిసైల్ అలర్ట్ఈ ఆరోపణలకు కొద్దిసేపటి ముందు యూఏఈ ప్రజలకు ఫోన్ ద్వారా అత్యవసర హెచ్చరిక సందేశం వచ్చింది. ‘సంభావ్య క్షిపణి ముప్పు’ ఉన్నందున సమీపంలోని సురక్షిత భవనంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు. కొద్దిసేపటికే ఆ అలర్ట్ను ఉపసంహరించుకున్నారు.జూన్లో తప్పుడు అలారం వెలువడిన తర్వాత.. జూలైలో జరిగిన మరో ఘటనలో క్షిపణి యూఏఈ భూభాగంలోకి ప్రవేశించకపోయినప్పటికీ హెచ్చరిక జారీ చేశారు. తాజాగా వచ్చిన అలర్ట్ మాత్రం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత ఆందోళనకు దారితీసింది.ఇరాన్తో సంబంధాలు కట్!తాజా పరిణామాల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో అన్ని రకాల వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈ విదేశాంగశాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ఇరాన్–యూఏఈ సంబంధాలు మరింత దిగజారే పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్లపై దాడులుయూఏఈకి చెందిన ప్రభుత్వ చమురు సంస్థ ADNOC ట్యాంకర్లు గత కొన్ని వారాలుగా వరుస దాడులకు గురవుతున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు పెరిగాయి.ఫిబ్రవరి 28న మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ దాడుల్లో యూఏఈ తీవ్రంగా ప్రభావితమైన దేశంగా నిలిచింది. దాదాపు 3,000 క్షిపణులు, డ్రోన్లు యూఏఈ వైపు ప్రయోగించినట్లు సమాచారం. అయితే జూన్లో ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం దాడులు తగ్గాయి. తాజాగా ఆ ఒప్పందం కుప్పకూలడంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.‘హర్ముజ్ మూసివేత కొనసాగుతుంది’మరోవైపు ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే వరకు హర్ముజ్ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తన వైఖరిని వెల్లడించింది. యూఏఈ నుంచి గల్ఫ్ వెలుపలికి వెళ్లే నౌకలకు హర్ముజ్ కీలక మార్గం కావడంతో.. ఇరాన్ తాజా ప్రకటన యూఏఈ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ చమురు రవాణాపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.హర్ముజ్.. మరోసారి యుద్ధ కేంద్రంగా!ఒకవైపు క్షిపణి ఆరోపణలు, మరోవైపు వాణిజ్య ఆంక్షలు, ఇంకోవైపు హర్ముజ్ మూసివేతపై ఇరాన్ హెచ్చరికలు.. మొత్తంగా గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ.. యూఏఈ మాత్రం సముద్ర రవాణాపై ముప్పు పెరిగిందని చెబుతోంది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్పై ఆధిపత్యం తమదేనంటూ ఓ మ్యాప్(ఏఐ జనరేటెడ్) రిలీజ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి చుట్టూ పరిణామాలు తదుపరి రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
ట్రంప్ కితాబుపై భారత్ రియాక్షన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎన్నికల వ్యవస్థను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలన్న తన వాదనకు భారత్ ఎన్నికల విధానాన్ని ట్రంప్ ఉదాహరణగా చూపించారు. భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే భారత్లో గుర్తింపు ఆధారిత ఓటింగ్ విధానం అమలవుతోందని.. అందుకే అమెరికాలోనూ ఆ తరహా చట్టం రావాలంటూ ఆయన చట్టసభలపై ఒత్తిడి పెంచారు. దీంతో భారత్ స్పందించింది.భారత ఎన్నికల యంత్రాంగం విశ్వసనీయత, పటిష్ఠత ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో నిరూపితమయ్యాయని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై తాను ప్రత్యేకంగా స్పందించబోనని చెప్పారు. అయితే భారత ఎన్నికల నిర్వహణ వ్యవస్థ విశ్వసనీయత, పటిష్ఠత ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన వాస్తవమని పేర్కొన్నారు. భారత్లో ఎన్నికలు భారీ స్థాయిలో జరిగినప్పటికీ.. ఓటింగ్ ప్రక్రియలో గుర్తింపు, పారదర్శకతకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.అమెరికాలో ఓటర్ల అర్హతను మరింత కఠినంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని వాదిస్తున్న ట్రంప్.. ఇందుకు భారత్ ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపించారు. ఇటీవల భారత్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అంత భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నప్పటికీ.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారి సంఖ్య ఒక శాతానికి లోపే ఉందని చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఓటరుకూ చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు పత్రం అవసరమని ప్రస్తావించారు.భారత్ సీఈసీతో అమెరికా అధికారుల చర్చలుట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేరును కూడా ప్రస్తావించారు. ఈ నెల ప్రారంభంలో ఆయన అమెరికా ప్రభుత్వ అధికారులతో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డు లేకుండానే ఎన్నికలు ఎలా నిర్వహించగలుగుతున్నారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రశ్నించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఓటరు గుర్తింపు నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆయన వాదిస్తున్నారు.‘సేవ్ అమెరికా యాక్ట్’కు ట్రంప్ పట్టుదలఅమెరికా ఎన్నికల ప్రక్రియలో పౌరసత్వ ధ్రువీకరణ, ఓటరు గుర్తింపును తప్పనిసరి చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ ‘SAVE America Act’కు మద్దతు కూడగడుతున్నారు. అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హతను నిర్ధారించే నిబంధనలను ఈ బిల్లు మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వానికి ఆధారాలు సమర్పించడంతో పాటు.. దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు నిబంధన అమలు చేయాలని ట్రంప్ కోరుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్పైనా ఆంక్షలు విధించాలన్నది ఆయన ప్రతిపాదనలో కీలక అంశం.భారత్ మోడల్నే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?అమెరికా ఎన్నికల్లో ఓటరు అర్హత, పౌరసత్వ ధ్రువీకరణపై రాజకీయ చర్చ తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో ట్రంప్ భారత్ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే ఎన్నికలను భారత్ నిర్వహిస్తున్న తీరును ఆయన తన వాదనకు మద్దతుగా ఉపయోగించుకున్నారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం మాత్రం ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. భారత ఎన్నికల వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం, విశ్వసనీయత ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే స్పష్టం చేసింది. దీంతో అమెరికా ఎన్నికల సంస్కరణల చర్చలో భారత్ ఓటరు గుర్తింపు విధానం మరోసారి అంతర్జాతీయంగా ప్రస్తావనకు వచ్చింది. -
ఇమ్రాన్ ఖాన్కు బిగ్ షాక్!
జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ.. పాకిస్థాన్ ప్రభుత్వం చివరి నిమిషంలో హైడ్రామాకు దిగింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే అంశంపై మరోసారి అనిశ్చితి నెలకొంది.మంగళవారం మూడు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇమ్రాన్ ఖాన్ను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. రెండు రోజుల్లోగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా.. సెప్టెంబర్ 16న కేసు తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్ను ఆసుపత్రిలోనే ఉంచేందుకు ధర్మాసనం అనుమతించింది.తొలుత ‘అమలు చేస్తాం’ అన్న ప్రభుత్వంఅయితే సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరీ భిన్నంగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ‘అక్షరాలా, స్ఫూర్తితో అమలు చేస్తాం’ అని ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్కు ఆయన పార్టీ నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాకపోయినా.. జైలులోనే సాధ్యమైనంత ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే.. సుప్రీం ఆదేశాలపై ప్రభుత్వ సమీక్షకొద్ది గంటల్లోనే సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. కోర్టు ఉత్తర్వులను పూర్తిగా అమలు చేయడం కాకుండా.. వాటిలో తగిన మార్పులు చేయాలని కోరుతూ సమీక్ష పిటిషన్ దాఖలు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి ఆజమ్ నజీర్ తరార్ ప్రకటించారు. సంబంధిత చట్టాన్ని పరిశీలించిన తర్వాత.. సుప్రీంకోర్టును సమీక్ష పిటిషన్ ద్వారా ఆశ్రయించి ఉత్తర్వుల్లో తగిన మార్పులు కోరాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ను ఆసుపత్రికి తరలించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అమలుపై ఉత్కంఠ నెలకొంది.‘జైల్లో నరకం చూపిస్తున్నారు’.. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై ఆయన కుటుంబ సభ్యులు మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేశారు. జైల్లో ఆయనను ఒంటరిగా ఒక సెల్లో బంధించారని, ఎవరితో మాట్లాడనీయడం వలేదని, తాగేందుకు మురికి నీరు ఇస్తున్నారని అన్నారు. అంతేకాకుండా హెపటైటిస్తో బాధపడుతున్న ఖైదీల మధ్య ఆయనను ఉంచారని పేర్కొన్నారు. ఆయనను ‘డెత్ సెల్’లో ఉంచినట్లుగా ఉందని పీటీఐ అంటోంది. జైల్లో ఇమ్రాన్తో ఎవరూ మాట్లాడకూడదనే ఆంక్షలు ఉన్నాయని, చివరకు జైలు గార్డులు సైతం ఆయనను పలకరించేందుకు అనుమతి లేదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పాకిస్థాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ విషయంలో ‘సైకాలజికల్ టార్చర్ స్ట్రాటజీ’ని అనుసరిస్తోందని ములాఖత్ అయిన సోదరి ఆరోపించారు. పరిస్థితి రోజురోజుకూ మరింత కఠినంగా మారుతోందని.. తమ సోదరుడిపై ఆశను నిలుపుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. లండన్లో ఉన్న కొడుకులైతే.. ఆయన్ని మళ్లీ చూస్తామో లేదో అనే ఆందోళన సైతం వ్యక్తం చేశారు. అయితే షెహబాజ్ ప్రభుత్వం మాత్రం అవన్నీ ఆరోపణలనేనని.. జైలులో ఆయనకు సాధ్యమైనంత మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెబుతోంది.సోదరి పిటిషన్తో విచారణఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయనకు కంటి చూపు మందగించడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్, పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇమ్రాన్కు తక్షణమే వైద్య చికిత్స అందించాలని వారు పిటిషన్లలో కోరారు. ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసేందుకు ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఆయనకు అవసరమైన వైద్య చికిత్స అందించాలని, కుటుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది.మూడేళ్లుగా జైలులోనే..73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. పలు కేసుల్లో ఆయనకు శిక్షలు పడటంతో అడియాలా జైలులో నిర్బంధంలో కొనసాగుతున్నారు. అయితే తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఆరోపిస్తున్నాయి.ఇమ్రాన్ ఖాన్ 2018లో పాకిస్థాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2022 ఏప్రిల్లో పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది. దీంతో తన పదవీకాలం పూర్తికాకముందే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయనపై అవినీతి సహా పలు అంశాలకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని కేసుల్లో ఆయనకు విధించిన శిక్షలు నిలిపివేయబడ్డాయి లేదా రద్దయ్యాయి. మరికొన్ని కేసుల్లో అప్పీళ్లు ఇంకా ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నాయి.నెలల తర్వాత సోదరితో ముఖాముఖిసుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మరో సోదరి నోరీన్ నియాజీ ఆయనను జైలులో కలిశారు. చాలా నెలల తర్వాత ఇమ్రాన్తో ఆమె ముఖాముఖిగా మాట్లాడటం ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులతో ఇమ్రాన్ ఖాన్ భేటీకి కూడా సుప్రీంకోర్టు అనుమతించడంతో ఈ సమావేశం జరిగింది.చికిత్స విషయంలో మళ్లీ ఉత్కంఠసుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం వాటిపై సమీక్ష కోరాలని నిర్ణయించడం ఇమ్రాన్ ఖాన్ వైద్య చికిత్స అంశాన్ని మరోసారి రాజకీయ, న్యాయ వివాదంగా మార్చింది. ఒకవైపు మాజీ ప్రధాని ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం జైలులోనే ఆయనకు సాధ్యమైనంత మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని చెబుతోంది.ఇప్పుడు ప్రభుత్వం దాఖలు చేయనున్న సమీక్ష పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నదే కీలకంగా మారింది. సెప్టెంబర్ 16న జరగనున్న తదుపరి విచారణకు ముందు ఇమ్రాన్ ఖాన్ను ఆసుపత్రికి తరలిస్తారా? లేదంటే ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో మార్పులు చేస్తుందా? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
హర్ముజ్లో ఒక్కసారిగా మారిన సీన్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమదే పైచేయి అని ఇరాన్ చెప్పుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకేసి తమ భూభాగంలోకే వస్తుందంటూ మ్యాప్ రిలీజ్ చేశారు. అయితే.. తాజా షిప్పింగ్ గణాంకాలు మాత్రం ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తోంది.గత రెండు వారాల్లో హర్ముజ్ గుండా ప్రయాణించిన నౌకల్లో అత్యధిక శాతం ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకున్నాయి. దీంతో హర్ముజ్పై ఇరాన్ గతంలో ఉన్నంత స్థాయిలో నియంత్రణ కొనసాగించడం కష్టమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అమెరికా నౌకాదళ బలగాల ఉనికి, ఇరాన్ నౌకలపై దాడుల భయం, చమురు రవాణా మార్గాల్లో మార్పులు.. ఈ జలసంధిలో శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.షిప్పింగ్ డేటా సంస్థ కేప్లర్ గణాంకాల ప్రకారం.. గత రెండు వారాల్లో హర్ముజ్ జలసంధి గుండా వెళ్లిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఉపయోగించాయి. ఈ మార్గాన్ని ఐక్యరాజ్యసమితి అనుమతించినప్పటికీ.. ఇరాన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.నెల రోజుల క్రితం వరకు ఈ మార్గంలో దాదాపు ఎలాంటి నౌకా రాకపోకలు లేవని కేప్లర్ తెలిపింది. ఇప్పుడు మాత్రం పెద్ద సంఖ్యలో వాణిజ్య నౌకలు ఇరాన్ అభ్యంతరాలను పక్కనబెట్టి ఒమన్ వైపు నుంచి ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ ఉత్తర ఒమన్ తీరానికి సమీపంలోని మార్గాలను ఉపయోగించే నౌకలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. అమెరికా నౌకాదళ రక్షణపై ఆధారపడుతూ కొన్ని నౌకలు ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.కేప్లర్ క్రూడ్ ఆయిల్ విశ్లేషణ విభాగం అధిపతి హోమయూన్ ఫలక్షాహీ స్పందిస్తూ.. హర్ముజ్పై ఇరాన్ కొంతవరకు నియంత్రణ కోల్పోయినట్లు కనిపిస్తోంది అని అంటున్నారు.ఇరాన్ టోల్ వసూళ్లకూ బ్రేక్!హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుంచి రవాణా రుసుములు వసూలు చేయాలని ఇరాన్ గతంలో ప్రయత్నించింది. అయితే నౌకలు ఇరాన్ ప్రాధాన్యమిస్తున్న మార్గాన్ని కాకుండా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకోవడంతో ఆ ప్రయత్నాలను అమలు చేయడం కష్టంగా మారింది. ఇరాన్ టోల్ వసూలు చేయాలన్న ప్రతిపాదనను మధ్యప్రాచ్యంలోని చాలా దేశాలు అంగీకరించడం లేదని పికరింగ్ ఎనర్జీ పార్ట్నర్స్ వ్యవస్థాపకుడు డాన్ పికరింగ్ పేర్కొన్నారు.అంటే.. నౌకల రాకపోకలను బెదిరించడం మాత్రమే కాకుండా వాటి నుంచి తన నిబంధనల ప్రకారం రుసుములు వసూలు చేయాలన్న ఇరాన్ ప్రయత్నానికీ ఇప్పుడు పరిమితులు ఏర్పడుతున్నాయి.చమురు ట్యాంకర్లలో ‘డార్క్ ట్రాఫిక్’హర్ముజ్ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు చమురు రవాణాలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నాయి. కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలు వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ (వీఎల్సీసీ)ను ఉపయోగించి పెర్షియన్ గల్ఫ్ నుంచి హర్ముజ్ మీదుగా చమురును తరలిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాన్ని దాటిన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇతర ట్యాంకర్లకు చమురును బదిలీ చేస్తున్నట్లు సమాచారం.ఇరాన్ దాడుల ముప్పు నుంచి తప్పించుకునేందుకు కొన్ని ట్యాంకర్లు తమ ట్రాన్స్పాండర్లను ఆపివేస్తున్నాయి. కొన్ని నౌకలు వారాలపాటు తమ గుర్తింపు సంకేతాలను నిలిపివేస్తున్నాయి. దీంతో సాధారణ షిప్పింగ్ ట్రాకింగ్ వ్యవస్థలకు అవి కనిపించకుండా పోతున్నాయి. ఈ విధానాన్ని ‘డార్క్ ట్రాఫిక్’గా వ్యవహరిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, ఇతర సాంకేతిక వ్యవస్థలతో కొన్ని నౌకలను గుర్తించగలిగినా.. వాటి కదలికలను పూర్తిస్థాయిలో అంచనా వేయడం కష్టమవుతోంది.ట్రంప్.. అదే మాటమరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హర్ముజ్పై అమెరికాదే పైచేయి అని స్పష్టం చేస్తున్నారు. అమెరికా నౌకాదళ బలగాలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. హర్ముజ్పై తమకు పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ ప్రకటించారు.మంగళవారం మరింత దూకుడుగా స్పందించిన ఆయన.. హర్ముజ్ను అమెరికా నియంత్రణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతేకాదు.. జలసంధి మ్యాప్ను షేర్ చేస్తూ దానిని ‘కొత్త అమెరికా భూభాగం’గా అభివర్ణించారు. అమెరికా ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ స్పందిస్తూ.. హర్ముజ్ గుండా వెళ్తున్న చమురు, హర్ముజ్ను తప్పించి ఇతర మార్గాల ద్వారా తరలిస్తున్న చమురు కలిపి ఒక వారంలో రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్లకు చేరుకుంది.యుద్ధానికి ముందు హర్ముజ్ ప్రాంతం గుండా రోజుకు సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరిగేది. ప్రస్తుత ప్రవాహం దానికి దగ్గరగా ఉండటాన్ని చూపిస్తూ.. ఇరాన్ హర్ముజ్ను పూర్తిగా మూసివేయడంలో విఫలమైందని అమెరికా వాదిస్తోంది.అరాఘ్చీ కౌంటర్ఇరాన్–అమెరికా మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రంగా కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్తో ఎలాంటి చర్చలు జరగడం లేదని, ప్రస్తుతం ఎలాంటి చర్చలు షెడ్యూల్ కాలేదని చెప్పారు. అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతోందని, హర్ముజ్లోని సముద్రపు గనులను తొలగించినట్లు కూడా ఆయన ప్రకటించారు. దీనికి భిన్నంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఘాటుగా స్పందించారు. అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోవడంతో ఇప్పుడు ఇరాన్ షరతులపై చర్చలు జరపాలని ‘వేడుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు.ఇరాన్–యూఏఈ మధ్యా ఉద్రిక్తత!హర్ముజ్ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్–యూఏఈ మధ్య కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. వాటిలో ఒక క్షిపణి యూఏఈ ప్రాదేశిక జలాల్లో పడిందని.. మరో క్షిపణి ఆ జలాలకు వెలుపల సముద్రంలో పడిందని తెలిపింది.అయితే ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఖండించారు. అవి నిరాధార ఆరోపణలని.. ఇలాంటి వ్యాఖ్యలు ఇరుగు పొరుగు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసి ప్రాంతీయ నమ్మకాన్ని బలహీనపరుస్తాయని అన్నారు.మరోవైపు.. ఇరాన్తో వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలన్నింటినీ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.చమురు ధరలపై ప్రభావంహర్ముజ్ ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్పైనా ప్రభావం చూపుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 59 సెంట్లు లేదా 0.7 శాతం పెరిగి బ్యారెల్కు 91.46 డాలర్లకు చేరాయి. మూడు వారాల తర్వాత తొలిసారిగా ఈ స్థాయికి చేరడం గమనార్హం. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ధర 75 సెంట్లు లేదా 0.9 శాతం పెరిగి 85.25 డాలర్లకు చేరింది. హర్ముజ్ మీదుగా చమురు రవాణాకు అంతరాయం కొనసాగితే.. సరఫరా భయాలు మరింత పెరిగి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.ఇరాన్–ఒమన్ చర్చలపై ఆశలుహర్ముజ్లో నౌకాయానాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలకు జలసంధి తీర ప్రాంతాలు ఉండటంతో స్వేచ్ఛాయుత నౌకాయానంపై ఒక ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. అమెరికా ప్రత్యక్ష భాగస్వామ్యం లేకుండా ఈ చర్చలు జరగడం ట్రంప్కు అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది.ఇరాన్–ఒమన్ మధ్య హర్ముజ్ రవాణా ఒప్పందం కుదిరిన తర్వాతే అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలను పునఃప్రారంభించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించే అవకాశం ఉందని ఖతార్ విదేశాంగశాఖ ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ తెలిపారు.‘షరతులు నెరవేర్చే వరకు క్లోజ్’ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ మాత్రం తమ వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను తొలగించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులను అమెరికా నెరవేర్చే వరకు హర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో హర్ముజ్ కేవలం నౌకాయాన సమస్యగా కాకుండా.. ఇరాన్–అమెరికా మధ్య రాజకీయ, సైనిక, ఆర్థిక పోరాటానికి ప్రధాన వేదికగా మారింది.ఎవరి పట్టు ఎంత?ఇరాన్ దాడుల ముప్పుతో కొన్ని వాణిజ్య నౌకలు తమ కదలికలను గుర్తించే ట్రాన్స్పాండర్లను ఆపేస్తున్నాయి. మరికొన్ని నౌకలు ప్రమాదకర మార్గాలను వదిలి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అదీ అమెరికా రక్షణ నడుమ. అయితే 80 శాతానికి పైగా నౌకలు ఒమన్ మార్గాన్ని ఎంచుకోవడం మాత్రం హర్ముజ్పై ఇరాన్ సంప్రదాయ ఆధిపత్యానికి గట్టి సవాలుగా మారింది. అదే సమయంలో చమురు రవాణా యుద్ధానికి ముందు స్థాయికి ఇంకా చేరుకోకపోవడం అమెరికా పూర్తి నియంత్రణ వాదనకూ పరిమితులు ఉన్నాయని చెబుతోంది. అందుకే ప్రస్తుతం హర్ముజ్లో కనిపిస్తున్నది ఒకరి సంపూర్ణ విజయం కాదనేది విశ్లేషకుల మాట. -
ఇక ఇన్స్టాగ్రామ్.. ఫేస్బుక్ మునుపటిలా ఉండవు!
సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితంలో ఓ భాగమైపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు, రీల్స్, వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నాం. అయితే ఇంతగా అలవాటైన ఈ సోషల్ మీడియా అనుభవం అతిత్వరలో మారిపోనుందా?.. ఇది వరకులా అది మనకు వినోదం పంచడం సాధ్యం కాదా?. మెటాపై కేసు విచారణలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం, వారి వ్యక్తిగత డేటా రక్షణ అంశాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అమెరికాలో మెటా సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన కీలక కేసు ఇప్పుడు విచారణ దశకు చేరుకుంది. ఈ కేసులో మెటా ఓడిపోతే.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఇప్పటివరకు వినియోగదారులకు అత్యంత సాధారణంగా కనిపించే అనేక ఫీచర్లు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, అమెరికాలోని 30 రాష్ట్రాలు కలిసి వేసిన ఈ కేసు మెటాపై ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక జరిమానా విధించే పరిస్థితికీ దారితీయొచ్చు కూడా. ఏం జరిగింది?2023లో అమెరికాలోని 30 రాష్ట్రాలు మెటాపై కేసు దాఖలు చేశాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి కీలక రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించేలా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను రూపొందించి, వారు ఎక్కువసేపు ఆ ప్లాట్ఫామ్లలో ఉండేలా చేస్తున్నారని రాష్ట్రాలు ఆరోపించాయి. అంతేకాదు.. చిన్నారుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫెడరల్, రాష్ట్ర చట్టాలను మెటా ఉల్లంఘించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారులను పదేపదే యాప్లోకి తిరిగి తీసుకురావడానికి నోటిఫికేషన్లు, సిఫార్సు వ్యవస్థలు, ఆటోప్లే వీడియోలు, అనంతంగా కంటెంట్ చూపించే విధానం వంటి ఫీచర్లను ఉపయోగిస్తోందని రాష్ట్రాలు చెబుతున్నాయి.నేటి నుంచే కీలక విచారణమెటాపై అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన ఈ కీలక కేసులో ప్రధాన విచారణ నేటి నుంచి(ఆగస్టు 18) ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జ్యూరీ ఎదుట వాదనలు జరగనున్నాయి. విచారణ సుమారు 6–8 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రాలు మెటా యువతను ఎక్కువసేపు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఉండేలా డిజైన్ చేసిందని ఆరోపిస్తున్నాయి. దీంతో.. తీర్పు ఎలా రానుందా? అనే ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది.మెటా ఓడితే ఏం మారొచ్చు?ఈ కేసులో రాష్ట్రాలు కేవలం డబ్బు జరిమానా మాత్రమే కోరడం లేదు. పిల్లలు, టీనేజర్ల కోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పనిచేసే విధానాన్నే మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.అందులో ముఖ్యమైనవి..టీనేజర్ల ఖాతాలకు తల్లిదండ్రుల ధ్రువీకరణ తప్పనిసరి చేయడం.పిల్లలు, టీనేజర్లు అనేక ఖాతాలు సృష్టించకుండా నియంత్రణలు విధించడం.యువ వినియోగదారులకు కనిపించే లైక్ కౌంట్లను తొలగించడం.ఒక కంటెంట్ తర్వాత మరొకటి నిరంతరం చూపించే ఇన్ఫినిట్ స్క్రోల్ను నిలిపివేయడం.టీనేజర్లను ఎక్కువసేపు యాప్లో ఉంచేలా పనిచేస్తున్న రికమెండేషన్ అల్గారిథమ్లలో మార్పులు చేయడం.ముఖం, శరీర రూపాన్ని మార్చే కొన్ని ఇమేజ్ ఫిల్టర్లను తొలగించడం.వీడియోలు ఆటోమేటిక్గా ప్లే అయ్యే ఆటోప్లే ఫీచర్ను నిలిపివేయడం.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వంటి తాత్కాలికంగా కనిపించి మాయమయ్యే పోస్టులను పరిమితం చేయడం. ఇవన్నీ చూస్తే.. ఈ కేసు, మెటాకు రాబోయే తీర్పు ఎంతో కీలకమని స్పష్టమవుతోంది. వ్యతిరేకంగా వస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల ప్రాథమిక వినియోగ అనుభవమే మారిపోయే అవకాశం ఉంది.పిల్లలను ‘యూజర్లు’గా మార్చడమే లక్ష్యమా?ఇదే ఈ కేసులో ప్రధాన ఆరోపణ. పిల్లలు, టీనేజర్లు ప్లాట్ఫామ్లలో ఎక్కువసేపు ఉండేలా మెటా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఫీచర్లను రూపొందించిందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఒక వీడియో పూర్తయిన వెంటనే మరొకటి మొదలవడం, స్క్రోల్ చేస్తూనే కొత్త కంటెంట్ రావడం, తరచూ నోటిఫికేషన్లు రావడం వంటి అంశాలు వినియోగదారులను మళ్లీ మళ్లీ యాప్లోకి తీసుకువస్తాయని వాటి వాదన. అంటే.. యూజర్ యాప్ను ఉపయోగిస్తున్నాడా? లేక యాప్ యూజర్ను ఉపయోగిస్తోందా? అనే పెద్ద ప్రశ్న ఈ కేసులో ముందుకు వస్తోంది.లైక్ బటనే కీలకం?సోషల్ మీడియాలో లైక్ అనేది సాధారణంగా కనిపించే చిన్న సంఖ్య. కానీ పిల్లలు, టీనేజర్లపై దాని ప్రభావం పెద్దదిగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎంతమంది లైక్ చేశారు? ఇతరుల పోస్టులకు తన పోస్టుకు వచ్చిన స్పందన ఎంత? ఇతరులతో పోలిస్తే తాను ఎలా ఉన్నాను? అనే ఆలోచనలు యువతలో సామాజిక పోలికలకు దారితీయొచ్చని ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో మెటా స్వయంగా నిర్వహించిన పరిశోధనల నుంచి కూడా రాష్ట్రాల న్యాయవాదులు ఆధారాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. లైక్ కౌంట్లు సోషల్ కంపారిజన్*కు దారితీస్తాయని, ఇన్స్టాగ్రామ్లో అలాంటి పోలికలు ఒంటరితనం, శరీర రూపంపై ప్రతికూల భావన, నెగెటివ్ మూడ్తో సంబంధం కలిగి ఉన్నాయని మెటా అంతర్గత పరిశోధనలు సూచించినట్లు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మెటా వాదన ఏంటి?అయితే ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండిస్తోంది. యువతకు మద్దతు ఇవ్వడంలో తమ సంస్థకు దీర్ఘకాలిక నిబద్ధత ఉందని, కేసులోని ఆధారాలు తమ వైఖరిని సమర్థిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే మరో రాష్ట్రంలో మెటాకు ఎదురుదెబ్బ తగిలింది. న్యూ మెక్సికోలోని ఒక కేసులో మెటాపై 942 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంతో పాటు యువ వినియోగదారులకు సంబంధించిన పలు మార్పులు చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లలోపు వినియోగదారులకు లైక్ కౌంట్లను తొలగించడం, నగ్న చిత్రాలకు సంబంధించిన మెసేజింగ్ను నిరోధించడం, పుష్ నోటిఫికేషన్లను నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం వంటి ఆదేశాలు అందులో ఉన్నాయి. మెటా ఆ తీర్పును అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసు చాలా పెద్దదే!న్యూ మెక్సికో కేసు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం. కానీ తాజా కేసులో 30 రాష్ట్రాలు కలిసి మెటాను ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అమెరికా జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందువల్ల మెటా ఈ కేసులో ఓడిపోతే.. తీర్పు ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అమెరికా అంతటా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పిల్లలు, టీనేజర్ల అనుభవాన్ని మార్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా భవిష్యత్తుపై ప్రభావం?ఈ కేసు మరో అసలు ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. పిల్లలను ఆకర్షించడానికి రూపొందించిన సోషల్ మీడియా ఫీచర్లకు ఎంతవరకు పరిమితులు ఉండాలి? కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే చిన్నారుల మానసిక ఆరోగ్యం, గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలా? తల్లిదండ్రుల నియంత్రణ ఎంతవరకు ఉండాలి?. మెటా ఓడితే.. లైక్ల సంఖ్య కనిపించని ఇన్స్టాగ్రామ్, నిరంతర స్క్రోల్ లేని ఫేస్బుక్, తల్లిదండ్రుల అనుమతి అవసరమయ్యే టీనేజర్ ఖాతాలు, పరిమితమైన నోటిఫికేషన్లు వంటి కొత్త సోషల్ మీడియా అనుభవం మొదలయ్యే అవకాశం ఉంది. -
బిచ్చగాళ్ల దేశమనుకుంటున్నారు.. పరువు తీయొద్దు!: పాక్
విదేశాల్లో పాకిస్థానీయుల భిక్షాటన, అక్రమ వలసల వ్యవహారం ఆ దేశ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాల్లో పాక్ పౌరులపై భిక్షాటన, వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమ నివాసం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ అప్రమత్తమైంది. తాజాగా హజ్, ఉమ్రా యాత్రల పేరిట సౌదీ అరేబియాకు వెళ్లే తమ పౌరులు.. భిక్షాటనకు పాల్పడొద్దంటూ బతిమాలినంత పని చేస్తోంది.పాకిస్థాన్ ఎంబసీ సౌదీ అరేబియాలోని తమ పౌరులను ఉద్దేశించి ఈ సూచనలు చేసింది. హజ్, ఉమ్రా యాత్రికులతో పాటు సౌదీలో పనిచేస్తున్న పాకిస్థానీయులు కూడా స్థానిక చట్టాలను, తమ వీసా నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరింది. ముఖ్యంగా మక్కా, మదీనా పవిత్ర ప్రాంతాల పరిసరాల్లో భిక్షాటన, అనధికారికంగా విరాళాలు లేదా డబ్బులు సేకరించడంపై సౌదీ అధికారులు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తున్నారని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు, నిర్బంధం, డిపోర్టేషన్ వంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఏఐ వీడియోతో..తమ హెచ్చరికను మరింత బలంగా తెలియజేసేందుకు పాకిస్థాన్ ఎంబసీ సోషల్ మీడియాలో ఓ ఏఐ రూపొందించిన వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఓ వ్యక్తిని సౌదీ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నట్లు చూపించారు. స్థానిక చట్టాలను ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను ఈ వీడియో ద్వారా యాత్రికులకు వివరించారు. అనుమతి లేని సేవలను వినియోగించుకోవద్దని, చట్టబద్ధమైన మార్గాల్లోనే ఆర్థిక సహాయం, విరాళాల సేకరణ చేపట్టాలని సూచించారు.దేశ పరువు దెబ్బతినేలా వ్యవహరించవద్దని పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చింది.پاکستان سے انے والے تمام عمرہ زائرین اور ورکرز کے نام اہم پیغام pic.twitter.com/BzOScR3lFP— Pakistan Embassy Saudi Arabia (@PakinSaudiArab) August 16, 2026సౌదీ నుంచే వేలాది మంది వెనక్కి..విదేశాల్లో పాక్ పౌరుల భిక్షాటన వ్యవహారం కొత్తది కాదు. పాక్ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2025లో సౌదీ అరేబియా నుంచి సుమారు 24 వేల మంది పాకిస్థానీయులను భిక్షాటనకు సంబంధించిన ఆరోపణలపై వెనక్కి పంపినట్లు సమాచారం. యూఏఈ నుంచి దాదాపు 6 వేల మంది, అజర్బైజాన్ నుంచి సుమారు 2,500 మంది పాక్ పౌరులను కూడా వెనక్కి పంపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో భిక్షాటన సంబంధిత కేసులే కాదు.. వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమ నివాసం, ఇతర ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలు, నేరాలకు సంబంధించిన కేసులు కూడా డిపోర్టేషన్లకు కారణాలుగా ఉన్నాయి.38 వేలకుపైగా డిపోర్ట్పాక్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025లో సౌదీ అరేబియా సహా గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల నుంచి వివిధ కారణాలతో 38,616 మంది పాకిస్థానీయులు డిపోర్ట్ అయ్యారు. వీరిలో సౌదీ అరేబియా నుంచి 27,692 మంది, యూఏఈ నుంచి 6,794 మంది, ఒమన్ నుంచి 2,537 మంది ఉన్నారు. అయితే వీరంతా భిక్షాటన కేసుల్లోనే వెనక్కి పంపినవారు కాదని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది.విమానాశ్రయాల్లోనే అడ్డుకట్టవిదేశాల్లో సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం దేశంలోనే చర్యలు ప్రారంభించింది. 2025లో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 66,154 మందిని పాక్ విమానాశ్రయాల్లోనే ‘ఆఫ్లోడ్’ చేసినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) వెల్లడించింది. సరైన పత్రాలు లేకపోవడం, ప్రయాణ ఉద్దేశంపై అనుమానాలు, ఇతర ఇమ్మిగ్రేషన్ సమస్యల కారణంగా పలువురిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.ఈ వ్యవహారంలో ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ నెట్వర్క్లు, అక్రమ వలసలకు సహకరిస్తున్న ఏజెంట్లపై కూడా FIA దృష్టి పెట్టింది. కొందరు ఉమ్రా వీసాలను ఉపయోగించుకుని సౌదీకి వెళ్లి అక్కడ భిక్షాటనకు పాల్పడుతున్నట్లు, మరికొందరు అక్కడి నుంచి ఇతర దేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాక్ అధికారులు గుర్తించిన సందర్భాలు ఉన్నాయి.2024లోనే సౌదీ హెచ్చరికభిక్షాటన వ్యవహారంపై సౌదీ అరేబియా 2024లోనే పాకిస్థాన్ను హెచ్చరించింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని పాక్ ప్రభుత్వం తమ పౌరులకు స్పష్టంగా చెప్పాలని సూచించింది. మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రాంతాల్లో భిక్షాటనపై సౌదీ కఠిన వైఖరి అవలంబిస్తోంది. అయినప్పటికీ సమస్య కొనసాగుతుండటంతో తాజాగా మరోసారి పాక్ తన పౌరులను అప్రమత్తం చేసింది.విదేశాల్లో భిక్షాటన, అక్రమ వలస నెట్వర్క్లు పాకిస్థాన్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని ఆ దేశ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ సెనేట్ కమిటీకి సమర్పించిన వివరాల ప్రకారం.. 2019 నుంచి 2025 మధ్య వివిధ దేశాల నుంచి 7,873 మంది పాకిస్థానీయులు డిపోర్ట్ కాగా.. వారిలో 1,064 మంది భిక్షాటన కారణంగా వెనక్కి పంపబడ్డారు. ఈ నేపథ్యంలో హజ్, ఉమ్రా యాత్రికులకు పాక్ తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశాల్లో భిక్షాటనకు పాల్పడి దేశ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దని, సౌదీ చట్టాలను కచ్చితంగా పాటించాలని ఇస్లామాబాద్ స్పష్టం చేస్తోంది. హజ్–ఉమ్రా యాత్రల సమయంలో జరిగే ఒక్కో ఘటన మొత్తం పాకిస్థాన్ పౌరులపై ప్రతికూల ప్రభావం చూపకుండా ముందుగానే నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. -
‘భారత్ను చూడండి’.. ఓటర్ ఐడీపై అమెరికాకు ట్రంప్ క్లాస్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల సంస్కరణల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికాలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు, పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్న ఆయన.. ఈసారి తన వాదనకు భారత్ ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా చూపించారు. అమెరికా కాంగ్రెస్ సేవ్ అమెరికా యాక్ట్(SAVE America Act)ను ఆమోదించాల్సిందేనని పట్టుబడుతూ.. భారత్లో ఓటర్ల గుర్తింపు కోసం అమలవుతున్న విధానాన్ని ప్రశంసించారు.భారత్లో ఎన్నికల సమయంలో ఓటర్లు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రంతో ఓటు వేస్తున్న విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్తో తనకు జరిగిన సంభాషణను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘ఎన్నికల నిర్వహణపై భారత సీఈసీ మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమెరికాలో తగిన గుర్తింపు కార్డు లేకుండా ఎన్నికల నిర్వహణను ఆయన తప్పుబట్టారు. 2024లో సుమారు 60 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత్లో ప్రతీ ఓటర్ దగ్గర గుర్తింపు కార్డు ఉంది’’ అని ట్రంప్ అన్నారు. భారత్లో ఓటర్ల గుర్తింపునకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాలోనూ ఇలాంటి విధానం ఉండాల్సిన అవసరం ఉందని ట్రంప్ వాదిస్తున్నారు. అమెరికా ఫెడరల్ ఎన్నికల్లో అర్హత కలిగిన పౌరులు మాత్రమే ఓటు వేసేలా పౌరసత్వాన్ని నిర్ధారించడంతో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాలని ఆయన కోరుతున్నారు.SAVE America Act అంటే..ట్రంప్ మద్దతు ఇస్తున్న SAVE America Act ప్రధానంగా అమెరికా ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం అవసరమయ్యేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించారు.ఓటర్ల జాబితాల్లో పౌరసత్వ అర్హత లేని వ్యక్తులు ఉంటే వారిని గుర్తించి తొలగించే ప్రక్రియను కూడా కఠినతరం చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. మెయిల్ ద్వారా ఓటింగ్పైనా పరిమితులు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. వైద్య కారణాలు, వైకల్యం, సైనిక సేవ, ప్రయాణం వంటి కొన్ని పరిస్థితులకు మినహాయింపులు ఇవ్వాలని ప్రతిపాదించారు. తక్షణమే ఈ బిల్లును ప్రతిపాదించాలని ట్రంప్ కోరుతున్నారు.‘పౌరులే ఓటు వేయాలి’అమెరికా ఎన్నికల్లో పౌరసత్వం లేని వ్యక్తులు ఓటు వేస్తున్నారన్న ఆరోపణలను ట్రంప్ చాలాకాలంగా ప్రస్తావిస్తున్నారు. **‘అమెరికా ఎన్నికల్లో ఓటు హక్కు అమెరికా పౌరులకే ఉండాలి’** అన్నది ఆయన ప్రధాన వాదన. అందుకే ఓటరు నమోదు దశలోనే పౌరసత్వాన్ని నిర్ధారించాలని కోరుతున్నారు. అయితే అందుబాటులో ఉన్న పరిశోధనలు, ఎన్నికల డేటా ప్రకారం పౌరేతరుల అక్రమ ఓటింగ్ చాలా అరుదైన ఘటన అని విశ్లేషణలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ అంశాన్ని ట్రంప్ ఎన్నికల సంస్కరణల చర్చలో కీలకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.భారత్నే ఎందుకు ఉదాహరణగా చూపించారు?భారత్లో ఎన్నికల సమయంలో ఓటర్ల గుర్తింపు కోసం ఫొటో ఓటర్ ఐడీతో పాటు ఎన్నికల సంఘం ఆమోదించిన ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగిస్తారు. ఓటరు జాబితాలో పేరు ఉండటంతో పాటు పోలింగ్ కేంద్రంలో గుర్తింపు నిర్ధారణకు ఈ పత్రాలు కీలకంగా ఉంటాయి. ఈ విధానాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాలోనూ ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే భారత్, అమెరికా ఎన్నికల వ్యవస్థలు, ఓటరు నమోదు విధానాలు, చట్టపరమైన నిబంధనలు ఒకేలా ఉండవు. కాబట్టి భారత్లోని విధానాన్ని అమెరికాలో యథాతథంగా అమలు చేయడం సాధ్యమా? అనేది వేరే ప్రశ్న.అమెరికాలో రాజకీయ దుమారంSAVE America Actపై అమెరికాలో తీవ్ర రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్, రిపబ్లికన్లు ఈ బిల్లును ‘ఎన్నికల సమగ్రతను కాపాడే కీలక సంస్కరణ’గా అభివర్ణిస్తున్నారు. మరోవైపు డెమొక్రాట్లు, పౌరహక్కుల సంస్థలు మాత్రం అదనపు గుర్తింపు, పౌరసత్వ పత్రాలను తప్పనిసరి చేయడం వల్ల అర్హత ఉన్న కొంతమంది ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పాస్పోర్టు, జనన ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలను సమర్పించడం తప్పనిసరి అయితే.. వాటిని సులభంగా పొందలేని ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని విమర్శకులు చెబుతున్నారు.మధ్యంతర ఎన్నికల వేళ మళ్లీ చర్చ2026 అమెరికా మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల భద్రత, ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణ అంశాలు మరోసారి రాజకీయ చర్చలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ SAVE America Actపై తన ఒత్తిడిని మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో భారత్ ఓటర్ ఐడీ విధానాన్ని ఆయన ఉదాహరణగా చూపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్లో అమలవుతున్న గుర్తింపు ఆధారిత ఓటింగ్ విధానాన్ని ప్రశంసిస్తూ.. అమెరికాలోనూ ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణకు కఠిన నిబంధనలు ఉండాలన్న తన వాదనకు ట్రంప్ మరింత బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ఓటర్ ఐడీ విధానం ట్రంప్ రాజకీయ వాదనలో కొత్తగా ప్రస్తావనకు రావడం.. అమెరికా ఎన్నికల సంస్కరణలపై సాగుతున్న చర్చకు మరో కోణాన్ని జోడించింది. -
‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్లో వినిపిస్తున్న కొత్త స్వరం
అమెరికా–ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్లో అంతర్గత చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. యుద్ధ మార్గమా? లేక దౌత్య మార్గమా? అనే ప్రశ్నపై దేశ రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖటామీ చేసిన వ్యాఖ్యలు టెహ్రాన్లో కొత్త చర్చకు దారితీశాయి.‘‘యుద్ధంతో ఎప్పటికీ జీవించలేం.. సమస్యలను పరిష్కరించేందుకు దౌత్య మార్గాలను అన్వేషించాలి’’ అని ఖటామీ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత ఇరాన్ విధానంపై పరోక్ష విమర్శలుగా భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే.. దేశ అంతర్గత సమస్యలు, ప్రజల జీవన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.సంస్కరణవాద నేత ఖటామీ స్వరంమహ్మద్ ఖటామీ 1997 నుంచి 2005 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సంస్కరణవాద భావజాలానికి దగ్గరగా ఉన్న నేతగా గుర్తింపు పొందారు. పాశ్చాత్య దేశాలతో సంబంధాల మెరుగుదల, రాజకీయ సంస్కరణలు, పరిమిత దౌత్య విధానాలకు ఆయన మద్దతు ఇచ్చేవారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా.. ఇరాన్లో ఆయనకు ఉన్న రాజకీయ ప్రభావం కారణంగా తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలో శాంతి, చర్చల ప్రస్తావన చేయడం రాజకీయంగా కీలక సంకేతంగా మారింది.‘‘ప్రజలు యుద్ధంలో జీవించలేరు’’యుద్ధం ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని ఖటామీ స్పష్టం చేశారు. విదేశీ శక్తుల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు, సాధారణ జీవనం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఉండాలని సూచించారు. అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఘర్షణలు కొనసాగితే ప్రజలపై మరింత భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.మరోవైపు కఠిన వైఖరిలో అధికార వర్గంఅయితే ఇరాన్ అధికార వ్యవస్థలోని కీలక వర్గాలు మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. సుప్రీం లీడర్ వర్గం విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్లో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా ప్రతిఘటన విధానానికే మద్దతు ఇస్తోంది. భద్రత, విదేశాంగ విధానం, ప్రాంతీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే ఐఆర్జీసీ.. అమెరికా, ఇజ్రాయెల్పై వ్యతిరేకతను దేశ రక్షణలో భాగంగా చూస్తోంది.అధ్యక్షుడి పాత్ర పరిమితంప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గతంలో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అనుకూలంగా మాట్లాడిన నేతగా గుర్తింపు పొందారు. అయితే ఇరాన్ రాజకీయ వ్యవస్థలో తుది నిర్ణయాధికారం సుప్రీం లీడర్, భద్రతా వ్యవస్థ చేతుల్లో ఉంటుంది. అందువల్ల అధ్యక్షుడి వైఖరి కంటే.. సుప్రీం లీడర్ వర్గం, సైనిక వ్యవస్థ నిర్ణయాలే కీలకంగా మారుతాయి.ఆర్థిక సమస్యలు.. ప్రజల్లో అసంతృప్తిఇరాన్లో యుద్ధ వాతావరణం, ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతలో ఉద్యోగాలు, జీవన ప్రమాణాలు, అంతర్జాతీయ అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. యుద్ధం మరింత కొనసాగితే ఈ సమస్యలు తీవ్రం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దేశంలో కొంత వర్గం దౌత్యానికి అవకాశం ఇవ్వాలని కోరుతోంది.ముందున్న మార్గం ఏంటి?ఖటామీ వ్యాఖ్యలు వెంటనే ఇరాన్ విదేశాంగ విధానాన్ని మార్చే అవకాశం లేకపోయినా.. దేశంలో ఉన్న అంతర్గత భిన్నాభిప్రాయాలను మాత్రం బయటపెట్టాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కఠినంగా ముందుకు వెళ్లాలనే వర్గం.. మరోవైపు దేశ ప్రయోజనాల కోసం చర్చలకు అవకాశం ఇవ్వాలనే వర్గం మధ్య ఇరాన్లో చర్చ కొనసాగుతోంది. యుద్ధం మరింత తీవ్రం అవుతుందా? లేదంటే దౌత్యానికి కొత్త మార్గం తెరుచుకుంటుందా? అనేది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంది. ఖటామీ వ్యాఖ్యలు మాత్రం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో కొత్త ప్రశ్నలకు తెరలేపాయి. -
ఇన్ఫ్లుయెన్సర్ కావడం ఇక ఈజీ కాదు!
సోషల్ మీడియా స్టార్ కావడం.. ఇక సరదా వ్యవహారం కాదు. కంటెంట్ క్రియేషన్ను ఓ ప్రొఫెషన్గా గుర్తిస్తూ ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం ఏకంగా డిగ్రీ కోర్సును ప్రారంభించింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి వేదికలపై కెరీర్ నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ అందించేలా ఈ కోర్సును రూపొందించారు. ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో కొత్త రూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో.. ప్రొఫెనల్ డిగ్రీ మస్ట్ అంటే ఎలా? అనే చర్చ జోరందుకుంది.ఇంటర్నెట్ తెరిస్తే చాలూ.. కంటెంట్ పేరిట బోలెడంత క్రింజ్ కనిపిస్తుంటుంది. అయితే దానికి చెక్ పెట్టాలని అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ASU) నిర్ణయించింది. స్వచ్ఛమైన కంటెంట్ క్రియేషన్లో భాగంగా బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. యూనివర్సిటీలోని వాల్టర్ క్రాంకైట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈ కోర్సు అందుబాటులోకి వచ్చింది. కేవలం వీడియోలు చేయడం, వైరల్ కావడం కాకుండా.. కంటెంట్ రూపకల్పన, పాడ్కాస్టింగ్, స్టూడియో ప్రొడక్షన్, కెమెరా ముందు ప్రెజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.వైరల్ అయితే చాలు అనుకోవద్దు..ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ భారీగా పెరిగింది. సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించి ఆదాయం పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ‘క్రియేటర్ ఎకానమీ’ కూడా వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇన్ఫ్లుయెన్సర్ జీవితం బయటకు కనిపించినంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం కొత్త కంటెంట్ సృష్టించడం, ప్రేక్షకులతో అనుసంధానం కొనసాగించడం, బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకోవడం, ఆదాయంలో అనిశ్చితిని ఎదుర్కోవడం వంటి సవాళ్లు ఉంటాయని సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్లాట్ఫారమ్లు కంటెంట్ విషయంలో కొత్త(కఠిన) రూల్స్ తెస్తున్న సంగతి తెలిసిందే.డిగ్రీతో స్టార్ అవుతారా?కంటెంట్ క్రియేషన్లో డిగ్రీ చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా స్టార్ కాలేరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరల్ కావడానికి ప్రతిభతో పాటు అదృష్టం, సరైన వ్యూహం, నిరంతర శ్రమ అవసరమని చెబుతున్నారు. అయితే ఈ కోర్సు ద్వారా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మార్కెటింగ్, వ్యక్తిగత బ్రాండింగ్, నెట్వర్కింగ్ వంటి అంశాల్లో అవగాహన పెరుగుతుందని విశ్వవిద్యాలయం పేర్కొంది. సోషల్ మీడియా రంగంలోనే కాకుండా మీడియా, ప్రకటనలు, డిజిటల్ సంస్థల్లోనూ ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.క్రియేటర్ ఎకానమీకి కొత్త గుర్తింపుఅమెరికాలో కంటెంట్ క్రియేషన్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో బిలియన్ల డాలర్ల ఆదాయం చలామణి అవుతోంది. దీంతో ఇంతకాలం కేవలం ‘టైమ్పాస్’గా భావించిన సోషల్ మీడియా కంటెంట్ సృష్టి.. ఇప్పుడు ఓ అధికారిక కెరీర్ మార్గంగా గుర్తింపు పొందుతోంది. అందుకే ఇకపై ‘ఇన్ఫ్లుయెన్సర్ అవుతా’ అంటే చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదన్న సంకేతాన్ని ఈ డిగ్రీ ఇస్తోంది. అయితే ఫాలోవర్ల సంఖ్య కంటే.. నాణ్యమైన కంటెంట్, సృజనాత్మకత, క్రమశిక్షణే విజయానికి అసలు ఆధారమని నిపుణులు గుర్తుచేస్తున్నారు. -
ఓ ఫేక్ న్యూస్.. అమెరికా–ఇరాన్ అణు చర్చల్లో కలకలం
క్షిపణులు, డ్రోన్లతో సాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. యుద్ధం కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియా వేదికలపైనా సాగుతోంది. తాజాగా ఓ తప్పుడు సమాచారం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఇజ్రాయెల్, అమెరికా రాజకీయ వర్గాల్లోకి చేరి.. చివరకు అణు చర్చలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.ఆగస్టు 5న ‘ఎక్స్’ (X) వేదికగా ఓ గుర్తుతెలియని భారతీయ ఖాతా నుంచి ఓ సంచలన పోస్టు వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీది.. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంత కాలం.. ఇరాన్ కూడా తన అణు ఆయుధాల లక్ష్యాన్ని వదులుకోదు’’ అని వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు. దీనికి అణు పేలుడు మేఘాన్ని పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా జత చేశారు.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా వహీది చేశారనే ఆధారాలు ఏవీ లేవు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసిందనే ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ ఆ పోస్టు వేగంగా వైరల్ అయింది.భారత్ టు అమెరికా వయా ఇజ్రాయెల్.. సుమారు 1.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆ భారతీయ ఖాతా నుంచి మొదలైన ఈ ప్రచారం.. కొన్ని గంటల్లోనే మరో భారతీయ ఖాతా ద్వారా హిందీలోకి అనువదించబడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు దీనిని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇజ్రాయెల్లోని ఓ టీవీ ఛానల్ ఈ తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని.. ‘‘ఇరాన్ తొలిసారి అణుబాంబు తయారీ లక్ష్యాన్ని అంగీకరించింది’’ అన్నట్టుగా కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ జెరూసలేంలోని మౌంట్ హెర్జెల్ వద్ద చేసిన ప్రసంగంలో కూడా దీనిని ఇరాన్ ఉద్దేశాలకు నిదర్శనంగా ప్రస్తావించారు.అమెరికాలోనూ ఈ ప్రచారం ప్రభావం చూపింది. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి మైక్ వాల్ట్జ్ ఈ పోస్టును షేర్ చేస్తూ.. ఇరాన్ అసలు ఉద్దేశాలను అంగీకరించిందన్న అర్థంలో వ్యాఖ్యానించారు. అమెరికా సెనేటర్ రిక్ స్కాట్ కూడా దీన్ని పంచుకున్నారు. అయితే తర్వాత మైక్ వాల్ట్జ్ తన పోస్టును ఎలాంటి వివరణ లేకుండా తొలగించారు.అణు చర్చలపై ప్రభావంఅమెరికా–ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తాము శాంతియుత అవసరాల కోసమే అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని టెహ్రాన్ చెబుతోంది. ఇలాంటి సమయంలో అణ్వాయుధాలపై ఇరాన్ నేత వ్యాఖ్యలంటూ వచ్చిన తప్పుడు ప్రచారం.. దౌత్య చర్చల వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫేక్ న్యూస్ పవర్ అది!ఈ ఘటన సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారానికి ఉన్న ప్రభావాన్ని మరోసారి బయటపెట్టింది. ఒక గుర్తుతెలియని ఖాతా నుంచి వచ్చిన నిర్ధారణ లేని పోస్టు.. భాషలు, దేశాల సరిహద్దులు దాటి.. ప్రపంచ నాయకుల ప్రసంగాల్లోకి చేరింది. నిజానిజాలు నిర్ధారించకుండానే ప్రచారం జరిగితే.. అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ నిర్ణయాలపైనా ప్రభావం చూపగలదని ఈ ఉదంతం స్పష్టం చేసింది. -
రష్యా పంజా.. మిట్టల్ స్టీల్ ప్లాంట్కు డ్యామేజ్
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తీసుకుంది. తాజా డ్రోన్ల దాడితో ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధం భీకరంగా మారింది. ఈ క్రమంలో.. క్రివీ రిహ్ స్టీల్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ ప్లాంట్పై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 14 మంది కార్మికులు గాయపడ్డారు. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వస్థలం కూడా!. రష్యా క్షిపణి దాడి కారణంగా.. మిట్టల్ ప్లాంట్లోని కీలక ఉత్పత్తి విభాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలు, బ్లాస్ట్ ఫర్నేస్ కార్యకలాపాలకు సంబంధించిన సదుపాయాలు ప్రభావితమయ్యాయి. దీంతో ఉత్పత్తి ప్రక్రియలను పాక్షికంగా నిలిపివేయాల్సి వచ్చింది. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు అధికారులు, నిపుణులు పరిశీలనలు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటు దాడి వల్ల జరిగిన ఆర్థిక నష్టంపై అధికారిక అంచనా ఇంకా వెలువడలేదు. అయితే భారీ పరిశ్రమ అయిన ఈ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల మరమ్మతుల ఖర్చుతో పాటు ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. నష్టం స్థాయిని పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 90 ఏళ్ల చరిత్ర.. వెన్నెముకలక్ష్మీ మిట్టల్కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ క్రివీ రిహ్ స్టీల్ ప్లాంట్ సాధారణ పరిశ్రమ కాదు. దాదాపు 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భారీ ఉక్కు కర్మాగారం నిర్మాణం 1931లో అప్పటి సోవియట్ యూనియన్ హయాంలో ప్రారంభమైంది. 1934 ఆగస్టులో ఇక్కడ తొలి ఉక్కు ఉత్పత్తి జరిగింది. అప్పట్లో క్రివొరిజ్స్టల్ (Kryvorizhstal) పేరుతో కొనసాగిన ఈ ప్లాంట్.. ఉక్రెయిన్ పారిశ్రామిక రంగంలో కీలకమైన సంస్థగా ఎదిగింది.2005లో లక్ష్మీ మిట్టల్ నేతృత్వంలోని మిట్టల్ స్టీల్ సంస్థ ప్రైవేటీకరణ వేలంలో ఈ ప్లాంట్ను సుమారు 4.8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆర్సెలర్తో విలీనం కావడంతో ఇది ఆర్సెలర్ మిట్టల్ క్రివీ రిహ్గా మారింది. స్వాధీనం అనంతరం ఆధునీకరణ, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, పర్యావరణ ప్రమాణాల మెరుగుదల కోసం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇనుప ఖనిజం నుంచి ఉక్కు తయారీ వరకు మొత్తం ప్రక్రియ ఒకేచోట జరిగే ఈ ప్లాంట్.. ఉక్రెయిన్ ఉక్కు పరిశ్రమకు వెన్నెముకలాంటి సంస్థల్లో ఒకటిగా నిలిచింది.ఇలాంటి వ్యూహాత్మక పరిశ్రమపై రష్యా క్షిపణి దాడి జరగడం.. కేవలం ఓ కంపెనీకి జరిగిన నష్టంగానే కాకుండా, యుద్ధ సమయంలో ఉక్రెయిన్ పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడికి మరో ఉదాహరణగా మారింది.డ్రోన్ దాడులకు ప్రతీకారమే..ఉక్రెయిన్ రష్యాలోని పలు ప్రాంతాలపై భారీ డ్రోన్ దాడులు చేసిన తర్వాతే ఈ క్షిపణి దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. ఉక్రెయిన్ దాడుల్లో రష్యాలో మరణాలు సంభవించగా.. దీనికి ప్రతీకార చర్యల్లో భాగంగానే మాస్కో ఈ దాడులు చేపట్టింది. అయితే.. తాము ఉక్రెయిన్లో సైనిక, పారిశ్రామిక లక్ష్యాలనే టార్గెట్ చేస్తున్నామని రష్యా ఖుల్లాగా ప్రకటించుకుంటోంది. క్రివీ రిహ్లోని మెటలర్జికల్ ప్లాంట్ కూడా తమ లక్ష్యాల్లో భాగమని పేర్కొంది. అయితే జెలెన్స్కీ స్వస్థలాన్ని టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధంలో కొత్త దశరష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఇరు దేశాలు సరిహద్దులు దాటి దూర ప్రాంతాలపై దాడులను పెంచుతున్నాయి. సైనిక స్థావరాలతో పాటు విద్యుత్ కేంద్రాలు, ఇంధన వనరులు, పారిశ్రామిక సంస్థలు కూడా లక్ష్యాలుగా మారుతున్నాయి. జెలెన్స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్పై గతంలోనూ రష్యా దాడులు చేసింది. తాజాగా మిట్టల్ స్టీల్ ప్లాంట్పై జరిగిన దాడి.. ఉక్రెయిన్ ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థపై యుద్ధ ప్రభావాన్ని మరోసారి స్పష్టం చేసింది. -
ట్రంప్కు మళ్లీ కోపమొచ్చింది! ఈసారి..
ఇరాన్పై యుద్ధ వ్యూహంలో తమతో కలిసిరాని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఇప్పుడు మరో మిత్రదేశంపై గుర్రుగా ఉన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చేపడుతున్న చర్యలకు మద్దతు ఇవ్వకపోవడంపై దక్షిణ కొరియాపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని పెంటగాన్ను ఆదేశించారు.ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను అణు ఆయుధాల నుంచి దూరం చేసే ప్రయత్నాల్లో అమెరికాతో కలిసి పనిచేయాలా అని దక్షిణ కొరియా అధ్యక్షుడిని ఇటీవల అడిగానని.. అందుకు సియోల్ "వద్దు, ధన్యవాదాలు" అంటూ సమాధానం ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. సైనిక విన్యాసాలపై ట్రంప్ నిర్ణయందక్షిణ కొరియా నిర్ణయంతో అసంతృప్తి చెందిన ట్రంప్.. అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరిగే వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని రక్షణ శాఖకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది జరగనున్న ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ (Ulchi Freedom Shield) విన్యాసాలను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోయిందని చెప్పారు. ముందుగానే ప్రణాళిక ఖరారైందని, అందుకే పూర్తిగా నిలిపివేయలేకపోతున్నామని స్వయంగా ట్రంపే తెలిపారు. ఈ సైనిక విన్యాసాలు ఆగస్టు 17 నుంచి 27 వరకు జరగనున్నాయి.ఉత్తర కొరియాపై ట్రంప్ వ్యాఖ్యలుఅమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై తన అసంతృప్తికి మరో కారణంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో తనకు ఉన్న మంచి సంబంధాలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ విన్యాసాలు భారీ ఖర్చుతో కూడుకున్నవని, ఉత్తర కొరియాకు అనవసరంగా శత్రుత్వ సంకేతాలు పంపుతున్నాయని ఆయన అన్నారు. తన అధ్యక్ష పదవీకాలంలో ఉత్తర కొరియా ఎలాంటి ముప్పు కలిగించకుండా గౌరవప్రదంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.మాంచి స్నేహంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య సంబంధాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీశాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పరస్పరం ఇద్దరు నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అయితే 2018లో సింగపూర్లో జరిగిన చారిత్రక భేటీతో ట్రంప్–కిమ్ సంబంధాల్లో కీలక మలుపు వచ్చింది. ఆ తర్వాత కూడా కిమ్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.ఇరాన్పై అమెరికా ఒత్తిడి వ్యూహంఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ను అణు ఆయుధాల నుంచి దూరంగా ఉంచేందుకు మిత్రదేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగానే అమెరికా చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా వైఖరి, అమెరికా సైనిక నిర్ణయం రెండు దేశాల మధ్య భద్రతా సహకారంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఉ.కొరియా సవాల్కు..ఇటు.. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గిస్తామని ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆసియా భద్రతా వర్గాల్లో చర్చకు దారితీసింది. సాధారణంగా అమెరికా-దక్షిణ కొరియా నిర్వహించే ఈ డ్రిల్స్ ఉత్తర కొరియా క్షిపణి, అణు బెదిరింపులకు ప్రతిస్పందనగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అమెరికా, దాని మిత్రదేశాలకు సవాలు విసురుతోంది. ఇలాంటి సమయంలో సంయుక్త సైనిక విన్యాసాల తీవ్రత తగ్గితే అది కిమ్ దేశానికి ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే చర్చ మొదలైంది.అయితే ట్రంప్ మాత్రం ఈ నిర్ణయాన్ని ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలతో ముడిపెట్టలేదు. కిమ్ జోంగ్ ఉన్తో తనకు ఉన్న సంబంధాలు, భారీ ఖర్చుతో కూడిన సైనిక విన్యాసాల అవసరంపై ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. మరోవైపు దక్షిణ కొరియాకు అమెరికా భద్రతా హామీలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ.. డ్రిల్స్ తగ్గింపు ఉత్తర కొరియా వైఖరిపై ప్రభావం చూపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. -
సూపర్ ఎల్ నినో విలయం తప్పదా?
ప్రశాంత మహాసముద్రంలో ఎల్ నినో ప్రభావం క్రమంగా బలపడుతోంది. 2026 చివరి నాటికి ఇది అత్యంత శక్తివంతమైన వాతావరణ పరిణామంగా మారే అవకాశం 90 శాతానికి పైగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, గాలుల మార్పులు ఈ పరిణామానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ (NOAA) తాజా అంచనాల ప్రకారం.. తూర్పు పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సముద్ర ఉపరితలంతో పాటు లోతుల్లోనూ వేడి నీరు విస్తరించడం ఎల్ నినో బలపడేందుకు మరింత దోహదం చేస్తోంది.ప్రపంచ వాతావరణంపై ప్రభావంఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే పసిఫిక్ ప్రాంతంలో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. మధ్య, తూర్పు పసిఫిక్లో వర్షపాతం పెరుగుతుండగా.. ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే పొడి వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు, వర్షపాతం, కరువులు, తుపాన్లపై ఎల్ నినో ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.చరిత్రలో అత్యంత ఘోరమైందిగా!ప్రస్తుత అంచనాల ప్రకారం గనుక ఎల్ నినో పరిణామం కొనసాగితే.. 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్నినో ఘటనల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. కొన్ని వాతావరణ నమూనాల ప్రకారం.. ఇది గతంలో నమోదైన తీవ్ర ఎల్నినో పరిణామాలతో పోటీ పడే స్థాయికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.భారత్పై ప్రభావం ఎలా?ఎల్ నినో బలపడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రతి ప్రాంతంపై ప్రభావం ఒకేలా ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్ర పరిస్థితుల ఆధారంగా ప్రభావం మారవచ్చని పేర్కొంటున్నారు. భారత్పై రుతుపవనాల తీవ్రతను బట్టి ఈ ప్రభావం కొనసాగనుందని చెబుతున్నారు.శాస్త్రవేత్తల నిఘాప్రశాంత మహాసముద్రంలోని పరిస్థితులను ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్లో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎల్ నినో తీవ్రతను బట్టి రాబోయే నెలల్లో వర్షాలు, ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులపై స్పష్టత రానుంది. -
‘మరీ ఇలా ఉన్నారేంటి!’.. ఇజ్రాయెల్ సెటిలర్ల దుశ్చర్య
ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం కేవలం భూమి, సరిహద్దులకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు నీటి వనరులపై ఆధిపత్య పోరు కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. సహజ ఊటలను ఇజ్రాయెలీ సెటిలర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా నిలిచిపోవడంతో తమ వ్యవసాయం, జీవనాధారం దెబ్బతింటోందని కన్నీరు పెడుతున్నారు. అయితే మరో వాదనతో ఇజ్రాయెలీ వర్గాలు తమ చర్యలను సమర్థించుకుంటున్నాయి.జోర్డాన్ లోయలోని ఫసాయిల్ గ్రామం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. తరతరాలుగా స్థానిక రైతులకు ఆధారంగా ఉన్న ఓ సహజ ఊట నీటిని ఇజ్రాయెల్ సెటిలర్లు మళ్లించుకున్నారు. ఆ సమీపంలోని ఓ పురాతన కొలనును నింపి.. ఈతలు కొడుతూ వినోదం పొందుతున్నారు. అదే సమయంలో కొందరు.. ఉత్త పుణ్యానికే ట్యాంకర్లలో ఊట నీటిని నింపి దారి పొడవునా పారబోసుకుంటూ పోవడం, నిర్జన ప్రదేశంలో వదిలేయడం లాంటి దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాలస్తీనా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.Israeli settler terrorists deliberately emptied Palestinian water tanks onto the ground in Ein al-Hilweh, in the northern Jordan Valley of the occupied West Bank.Palestinians in this herding community struggle every day for water after Israeli settlers seized their main spring… pic.twitter.com/EzRjMz621l— Ihab Hassan (@IhabHassane) August 10, 2026ఈ నీటితో గతంలో తమ పొలాల్లో వంకాయలు, సొరకాయలు, పుచ్చకాయలు వంటి పంటలు పండించేవారమని.. ఇప్పుడు సాగు నిలిచిపోయిందని వాపోతున్నారు. “నీరు లేకపోవడంతో మా పొలాలు ఎండిపోయాయి. కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది” అని ఫసాయిల్కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి పైపులను స్వాధీనం చేసుకున్నారని, ఊట వైపు వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.కొలనుగా మారిన ఊట.. పర్యాటక ప్రాంతమా?స్థానికులు చెబుతోంది ఏంటంటే.. ఊట నీటిని మళ్లించి పురాతన కొలనును నీటితో నింపారు. అనంతరం దానిని పర్యాటక ఆకర్షణగా ప్రచారం చేశారు. అయితే ఇజ్రాయెల్కు చెందిన కొందరు సెటిలర్లు మాత్రం మరోలా వాదిస్తున్నారు. ఈ ప్రాంతం తమ చారిత్రక వారసత్వంలో భాగమని చెబుతున్నారు. కానీ ఇందులో నిజమెంత? అనేదానిపై పురావస్తు నిపుణులు మరోలా స్పందించారు.Israeli "settlers" in the occupied West Bank diverted a spring that had long served as a lifeline for the Palestinian village of Fasayil, redirecting its water to fill a pool at an archaeological site and turning it into a tourist attraction.Palestinian farmers said the loss of…— Clash Report (@clashreport) August 14, 2026ఈ ప్రాంత చరిత్రపై పూర్తి స్పష్టత లేదని అంటున్నారు. దీంతో చరిత్ర, పురావస్తు అంశాలను ఉపయోగించి వెస్ట్ బ్యాంక్పై ఆధిపత్య భావనను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.‘ఇది నీటి యుద్ధం’.. పాలస్తీనా ఆరోపణపాలస్తీనా అధికారులు మాత్రం నీటి వనరుల నియంత్రణను పెద్ద సమస్యగా చూస్తున్నారు. నీటిని నిలిపివేయడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. “ఇది శబ్దం లేని బుల్లెట్లాంటి నీటి యుద్ధం” అని పాలస్తీనా వాటర్ అథారిటీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. వెస్ట్ బ్యాంక్లోని పలు నీటి, పారిశుద్ధ్య వనరులపై ఈ ఏడాది దాడులు జరిగినట్లు నమోదైంది. ముఖ్యంగా జోర్డాన్ లోయ ప్రాంతాల్లో నీటి వనరులపై నియంత్రణ కోసం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అతిత్వరలో ఇది తాగునీటికి విస్తరించవచ్చనే ఆందోళన సైతం వ్యక్తమవుతోంది అక్కడ. గ్రామాలపై పెరుగుతున్న ఒత్తిడినీటి సమస్యతో పాటు సెటిలర్ల దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని చెప్పారు. మరోవైపు.. ఇజ్రాయెల్ సెటిలర్లు మాత్రం అవంతా ఆరోపణలనే అంటున్నారు. ఈ ప్రాంతాలు తమ చారిత్రక, మతపరమైన వారసత్వంతో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. పురాతన ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహంలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సమర్థించుకుంటున్నారు.భవిష్యత్లో మరింత ఉద్రిక్తత?వెస్ట్ బ్యాంక్లో భూమి తర్వాత నీరు మరో ప్రధాన వివాద అంశంగా మారుతోంది. వ్యవసాయం, తాగునీరు, జీవనోపాధికి ఆధారమైన సహజ వనరులపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరు భవిష్యత్లో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఒకే రోజు.. మూడు విపత్తులు.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా
అత్యంత శక్తివంతమైన భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. ప్రకంపనల ధాటికి భవనాలు పేకమేడల్లా ఒరిగిపోతూ నేల కూలాయి. అదే సమయంలో సముద్ర గర్భంలో అలజడి రేగడంతో సునామీ వస్తుందేమోనని వణికిపోయారు. మరోవైపు.. అగ్నిపర్వతం బద్దలు కావడం అలజడి రేపింది. ఫ్లోరెస్ దీవి, మరికొన్ని చోట్ల రికార్డైన భయానక దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వేకువ జామున 7.7 తీవ్రతతో వచ్చిన ప్రధాన భూకంపంతో ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్టర్షాక్స్ భయపెట్టాయి. 6.1, 5.9, 5.6 తీవ్రతలతో వరుస ప్రకంపనలు కొనసాగడంతో ఫ్లోరెస్ తీర ప్రజలు భయం భయంగా గడిపారు. ఎండె నగరానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదు కాగా.. తూర్పు నుసా టెంగారా, పశ్చిమ నుసా టెంగారా, దక్షిణ సులవేసి ప్రాంతాల్లో సైతం జనాలు ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్ల మీదే గడిపారు. బలమైన ప్రకంపనలు పలు ప్రాంతాల్లో దాదాపు నిమిషం పాటు నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.🚨 The earthquake in Indonesia was magnitude 7.7. For many people, the early morning began with disaster. 🇮🇩#Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert pic.twitter.com/c4edaQnCEh— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 15, 2026#BREAKING : New Footage shows the Aftermath of Flores Indonesia Following 7.7m earthquake. 10 Dead & More than 1000 injured: Reports #Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert #IndonesiaEarthquake #EarthquakeNews #NaturalDisaster https://t.co/2V8cg4oQ7m pic.twitter.com/NrAVUu5g5u— Indian Observer (@ag_Journalist) August 15, 2026🚨 7.7-MAGNITUDE EARTHQUAKE HITS INDONESIA 🇮🇩A powerful earthquake struck off the coast of Ternate, causing panic and evacuations. Authorities are assessing possible damage and casualties.#Indonesia #Earthquake #BreakingNews #Ternate pic.twitter.com/WdP3JgvAGF— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 14, 2026🚨🇮🇩 BREAKING | 7.7-Magnitude Earthquake Hits IndonesiaA powerful 7.7-magnitude #earthquake struck off #Flores Island in eastern #Indonesia early Saturday, causing buildings to collapse and triggering widespread panic and evacuations. A #tsunami warning was issued but later… pic.twitter.com/OKTgVxpBaH— pradhyumn sharma (@pradhyu78651514) August 15, 2026కుప్పకూలిన భవనాలు.. వీధుల్లోకి పరుగులుభూకంపం తీవ్రతకు ఫ్లోరెస్ దీవిలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. మౌమెరే ప్రాంతంలోని పోర్టు టెర్మినల్ వెయిటింగ్ రూమ్ కూలిపోయింది. భవనాల శిథిలాలు పడుతుండటంతో ప్రజలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. “భూకంపం చాలా తీవ్రంగా అనిపించింది. ఇంట్లో ఉన్న వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశాం” అని స్థానికులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, గిడ్డంగులు, ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఆసుపత్రుల్లో కలకలం.. బయటే చికిత్సప్రకంపనలతో ఆసుపత్రుల్లోనూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోగులను భద్రత దృష్ట్యా బయటకు తరలించారు. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను బయట ఏర్పాటు చేసి తాత్కాలిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.సిక్కా ప్రాంతంలోని సెయింట్ పీటర్ మేజర్ సెమినరీలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో భవనం పైకప్పు కూలిపోయింది. అందులోని విద్యార్థులు, నన్స్ భయంతో పరుగులు తీశారు. పాస్టర్ ఒకరు రెండో అంతస్తు నుంచి దూకడంతో గాయపడ్డారు.సునామీ హెచ్చరిక.. ఎత్తివేతఫ్లోరెస్ సముద్ర గర్భంలో భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొన్ని గంటల తర్వాత హెచ్చరికను ఉపసంహరించారు.INDONESIA 🇮🇩 | #EARTHQUAKE 7.7 📹 IMAGES OF PANIC: Fear broke out near the coast of Ternate, and people had to be evacuated to safe areas. Authorities are assessing possible damage and casualties. There is a tsunami alert 🌊 pic.twitter.com/CSjsv5ckqW— Elizabeth J Trump (@eliza_Trump212) August 15, 2026మరింతగా మృతులు?ఈ ప్రకృతి విలయంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి నష్టం అంచనా వేస్తున్నాయి. ప్రాణ నష్టంపై ఇప్పుడే అంచనాకు రావడం కష్టమని ఓ అధికారి అంటున్నారు. ఇక ఆస్తి నష్టం భారీగానే జరగొచ్చని తెలుస్తోంది.బద్ధలైన అగ్నిపర్వతం.. బూడిద మేఘాలుహల్మహెరా దీవిలోని మౌంట్ ఇబు అగ్నిపర్వతం బద్దలై.. భారీగా బూడిదను వెదజల్లింది. ఏకంగా 5 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి.🚨 BREAKING: Double disaster strikes Indonesia!🌋 Mount Ibu erupted on Halmahera, blasting a massive 5 km ash plume into the sky.💥 Shortly after, a powerful 7.7-magnitude earthquake rocked Flores Island.🌊 A tsunami warning has been activated for coastal areas.Stay safe and… pic.twitter.com/xviRMcR5i6— Byte Brief (@Byte_brief) August 15, 2026రింగ్ ఆఫ్ ఫైర్..భూకంపాలు, అగ్నిపర్వతాలకు ఇండోనేషియా అత్యంత ప్రమాదకర ప్రాంతం. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉండటంతో అక్కడ తరచూ భారీ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. 1992లో ఇదే ఫ్లోరెస్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం సునామీకి దారితీసి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లో సుమత్రా సమీపంలో సంభవించిన భారీ భూకంపం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన సునామీల్లో ఒకదానికి కారణమైంది. ప్రస్తుతం ఫ్లోరెస్ దీవిలో ఆఫ్టర్షాక్స్ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
హర్ముజ్ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా!: ట్రంప్
ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా కేవలం దాని నియంత్రణ మాత్రమే తమదేనంటూ ఆయన ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్యం మోహరించామని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని మరో సంచలనానికి తెర తీశారు. “ఇరాన్ను ఓడించడం ఖాయం. ఆ తర్వాత.. అతి త్వరలో హర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయం ఎలా అమలు చేస్తారు? దీనికి అంతర్జాతీయంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ చెబుతుండగా.. ఇరాన్పై మరింత కఠిన ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.‘కొంత ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు’.. అమెరికన్లకు ట్రంప్ఇరాన్పై చర్యల కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రంప్ అంగీకరించారు. “అమెరికన్లు పెట్రోల్ కోసం కొంచెం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. కానీ ఇరాన్ అణ్వాయుధ శక్తిగా మారకుండా అడ్డుకోవడం ప్రపంచానికి చేసే సేవ” అని అన్నారు.హర్ముజ్పై అధికారం మాదే: ఇరాన్ స్పష్టంట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. “ఒక ట్వీట్తోనో, విమాన వాహక నౌకతోనో హార్ముజ్ను స్వాధీనం చేసుకోలేరు. ఇరాన్ ఓటమిని అంగీకరించే వరకు ఈ మార్గంపై మా నియంత్రణ కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.ప్రపంచానికి చమురు షాకే!ప్రపంచ ఇంధన మార్కెట్లకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్ఎన్జీలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీన మొదలైన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. ఫలితంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 90 డాలర్లకు చేరువైంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్కు 4 డాలర్ల స్థాయికి చేరింది.నిలిచిన చర్చలు.. పెరుగుతున్న ఉద్రిక్తతఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. యుద్ధాన్ని ముగించే దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరు కొనసాగితే.. ప్రపంచ చమురు సరఫరా, ఇంధన ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఇరాన్ నెత్తిన అమెరికా మరో పిడుగు! అవసరమైతే..
తమ డిమాండ్లు, షరతుల విషయంలో రాజీ పడబోమని.. అవసరమైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ కుండబద్ధలు కొట్టేసింది. ఈ తరుణంలో అమెరికా ఒత్తిడి మరింత పెంచింది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ‘ నో ఎండ్ ప్లాన్’తో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జలసంధిలో నౌకా దిగ్బంధాన్ని (బ్లాకేడ్) కొనసాగిస్తున్న అమెరికా సైన్యం.. అవసరమైతే నిరవధికగా ఆ పని చేయాలని భావిస్తోంది. అంటే నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏదీ లేకుండా ఇరాన్ పోర్టులకు వచ్చి పోయే నౌకలపై నిఘా కొనసాగించడం(అవసరమైతే దాడులు జరపడం) అన్నమాట.కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడం, ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నౌకాదళాన్ని కొనసాగించే సామర్థ్యం అమెరికాకు ఉందని చెప్పారు. అవసరమైనప్పుడు యుద్ధ నౌకలను మార్చుతూ హర్ముజ్ ప్రాంతంలో పహారా కొనసాగిస్తామని తెలిపారు.ఇరాన్పై మరిన్ని ఆర్థిక ఆంక్షలునౌకా దిగ్బంధంతో పాటు ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా లక్ష్యం ఇరాన్ను చర్చల బల్లపైకి తీసుకురావడమేనని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.హర్ముజ్ జలసంధే కేంద్రంగా పోరుఅణు ఒప్పందంతో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇప్పుడు హర్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకం. యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరిగేది. తమపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఈ వ్యూహాత్మక మార్గంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు హర్ముజ్ తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ చెబుతోంది.రెండు చమురు నౌకలపై దాడిహర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు నౌకలపై దాడి జరిగినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు ఇరాన్ కారణమని యూఏఈ ఆరోపించింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. నౌకల రాకపోకలు కూడా భారీగా తగ్గిపోయాయి.నౌకల రాకపోకలకు బ్రేక్యుద్ధానికి ముందు హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 130 నుంచి 140 వరకు నౌకలు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక దశలో రోజుకు కేవలం ఎనిమిది నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు సమాచారం. అమెరికా గతంలో ఇరాన్ నౌకలు, పోర్టులపై ఉన్న దిగ్బంధాన్ని కొంతకాలం సడలించినప్పటికీ.. తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. దీనివల్ల ఇరాన్కు కీలకమైన విదేశీ మారక ఆదాయంపై ప్రభావం పడుతోంది.ప్రపంచ చమురు మార్కెట్లో కలవరంఇరాన్ సంక్షోభం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా రోజుకు 43 లక్షల బ్యారెళ్ల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది దాదాపు 4 శాతానికి సమానం. అయితే మరోవైపు డిమాండ్ తగ్గడం, అమెరికా ముడిచమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు కొంత తగ్గాయి. గురువారం ధరలు 2 శాతానికి పైగా పడిపోయాయి.ట్రంప్పై దేశీయ ఒత్తిడిఇరాన్తో యుద్ధం ముగించాలని అమెరికాలోనూ ఒత్తిడి పెరుగుతోంది. పెరిగిన ఇంధన ధరలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కీలకంగా మారింది. ట్రంప్ ఈ మధ్య హర్ముజ్పై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ దీనిని ఖండిస్తూ.. ఆంక్షలు ఎత్తివేయడం, తమ నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులు నెరవేరే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని స్పష్టం చేసింది.యుద్ధం కంటే ఆర్థిక దెబ్బే వ్యూహమా?ఇరాన్పై సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ గతంలో హెచ్చరించినప్పటికీ.. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్కు ఆయుధాల సరఫరాకు సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని హెగ్సెత్ తెలిపారు.అబ్రహం లింకన్ నౌకపై వదంతులుహర్ముజ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకపై సిబ్బంది మరణించారన్న వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది. ఈ యుద్ధం ఆగదని.. తమ జీవితాలు ఇంతేనన్న వైరాగ్యంతో ఏడుగురు నేవీ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారన్నది ఇరాన్ మీడియా కథనాల సారాంశం. అయితే అది తప్పు సమాచారమని అమెరికా తెలిపింది. 260 రోజులకు పైగా సముద్రంలో ఉన్నప్పటికీ అబ్రహం లింకన్ క్యారియర్ గ్రూప్ సిబ్బంది ధైర్యంగా ఉన్నారని CENTCOM పేర్కొంది. ఆగస్టు 3న సముద్రంలో పడిపోయిన ఒక నావికుడిని కూడా సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ఈ తరుణంలో.. లింకన్ నౌకను ఒడ్డుకు రప్పించి జార్జ్ వాషింగ్టన్ నౌకతో రిప్లేస్ చేశామని, ఇది సాధారణ చర్యేనని ప్రకటించుకుంది.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు ఇప్పుడు అమెరికా–ఇరాన్ ఘర్షణలో కీలక అంశంగా మారింది. ఒకవైపు అమెరికా నిరవధిక బ్లాకేడ్, ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు ఇరాన్ వ్యూహాత్మక మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోరు ఎంతకాలం కొనసాగుతుందన్నది చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది. -
‘ఆయనకేం.. చెత్తబుట్టలో కూడా దాక్కుంటారు!’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించిన రహస్య ఆపరేషన్ అంతర్జాతీయ చర్చకు దారితీసింది. టర్కీలోని అంకారాలో నాటో సదస్సు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన్ని మరో చిన్న విమానంలోకి మార్చిన ఘటనపై విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ మీడియా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ ఘటన అమెరికా అధ్యక్షుడి భద్రతా ఆందోళనలను బయటపెట్టిందంటూ వ్యాఖ్యానించింది.నాటో సదస్సు కోసం టర్కీ వెళ్లిన ట్రంప్ తిరుగు ప్రయాణం సందర్భంగా ఎయిర్ఫోర్స్ వన్పై క్షిపణి (shoulder-fired missile) దాడి ముప్పు ఉందన్న సమాచారంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది. ముప్పు నమ్మదగినదిగా, తక్షణ చర్య అవసరమయ్యే స్థాయిలో ఉందని భావించి ఈ రహస్య మార్పిడి చేపట్టినట్లు సమాచారం.ఇరాన్ మీడియా వ్యంగ్యంఈ ఘటనను ఇరాన్ ప్రభుత్వ మీడియా తమ ప్రచారానికి ఉపయోగించుకుంది. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సైనిక శక్తికి భయపడుతున్నారనే సంకేతంగా ఈ విమాన మార్పిడిని చిత్రీకరించింది. ట్రంప్ తాజా “స్కాండల్”గా అభివర్ణిస్తూ.. ఇది ఆయనకు అవమానకర పరిస్థితి అని ఇరాన్ టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఇరాన్ దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్రంప్ను కేటరింగ్ బాక్స్లో దాచినట్లు చూపించే మీమ్ను కూడా షేర్ చేసింది. “త్వరలో చెత్త బుట్టలో దాచాల్సి వస్తుంది” అనే వ్యాఖ్యను జోడించింది.He will be hidden in a trash can before long. pic.twitter.com/ZTkAahNIKw— Iran Embassy SA (@IraninSA) August 11, 2026Brave American hero, or a coward hiding in a catering truck? pic.twitter.com/t1vcmrdcHw— Iran Embassy SA (@IraninSA) August 12, 2026కేటరింగ్ వాహనంలో రహస్య తరలింపుజూలై 8న అంకారా నుంచి బ్రిటన్కు బయలుదేరే సమయంలో ట్రంప్, ఆయనతో ఉన్న కొద్దిమంది సిబ్బందిని కేటరింగ్ ట్రక్కు ద్వారా పెద్ద విమానం నుంచి చిన్న ప్రభుత్వ విమానం C-32Aలోకి మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో అసలు ఎయిర్ఫోర్స్ వన్ వేరుగా బయలుదేరింది. అందులో సీనియర్ అధికారులు, వైట్హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉన్నారు.ఈ ఆపరేషన్ వివరాలను తొలుత వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ట్రంప్ ప్రయాణ వివరాలు, ఆయన అంకారాలో ఉన్న హోటల్ అంతస్తు వరకు ఇరాన్కు తెలిసినట్లు అమెరికా అధికారులు ఆందోళన చెందారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అలాగే ఇలాంటి డీకాయ్ ఆపరేషన్లు(మోసపూరిత భద్రతా వ్యూహం) సర్వసాధారణమేనని వ్యాఖ్యానించింది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఘటనఅమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్పై గతంలోనూ దాడి కుట్ర ఆరోపణలు వచ్చాయి. 2024లో ట్రంప్ అప్పటి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయన హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ ఓ ఇరానియన్పై కేసు నమోదు చేసింది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్ల యుద్ధం మొదలైంది. అయితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులకు శాశ్వత ముగింపు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటికీ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విమాన మార్పిడి ఘటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.భద్రతా చర్యా? రాజకీయ ప్రచారమా?అమెరికా వర్గాల ప్రకారం ఇది అధ్యక్షుడి భద్రత కోసం తీసుకున్న ముందస్తు జాగ్రత్త మాత్రమే. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సమాచారంతోనే డీకాయ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే కేవలం ఒక ఏజెన్సీ సమాచారంతోనే.. అదీ ధృవీకరణ చేసుకోకుండానే అమెరికా భద్రతా బలగాలు ట్రంప్ను అలా తరలించారని తర్వాత తెలిసింది. ఏది ఏమైనా.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరాన్ మాత్రం దీన్ని అమెరికా బలహీనతకు సంకేతంగా చూపిస్తూ ప్రచారం చేస్తోంది. ట్రంప్ను రక్షించేందుకు చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కొత్త కారణంగా మారింది. -
ఎర్రకోట ఘటన: యూఎన్ నివేదికలో షాకింగ్ విషయాలు
ఎర్రకోట బాంబు పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి వెనుక అల్ఖైదా అనుబంధ సంస్థ ప్రమేయం ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ఓ నివేదిక విడుదల చేసింది. అంతేకాదు.. దక్షిణాసియాలో ఉగ్రవాద నెట్వర్క్లు విస్తరిస్తున్నాయన్న ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని చెబుతూనే.. పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది.2025 నవంబర్ 10 సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (రెడ్ఫోర్ట్) సమీపంలో లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ దాడి అల్ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) పనేనని ఐరాస భద్రతా మండలి పర్యవేక్షణ బృందం తెలిపింది.గతంలో పెద్ద స్థాయిలో కార్యకలాపాలు సాగించిన ఉగ్ర సంస్థలు ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయని యూఎన్ వెల్లడించింది. అల్ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ కూడా చిన్న చిన్న రహస్య సెల్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోందని.. లాజిస్టిక్స్, ఆర్థిక నెట్వర్క్లను బలోపేతం చేసుకుంటోందని.. అక్కడి నుంచి ాడులు జరుపుతోందని నివేదిక వెల్లడించింది. భద్రతా సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు వికేంద్రీకృత నెట్వర్క్లను ఉగ్ర సంస్థలు ఉపయోగిస్తున్నాయని హెచ్చరించింది.కొనసా..గుతున్న దర్యాప్తుఎర్రకోట పేలుడు ఘటనపై భారత దర్యాప్తు సంస్థలు లోతైన దర్యాప్తు జరుపుతున్నాయి. పలువురిని అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA).. పేలుడు వెనుక ఉన్న కుట్ర, నిధుల మార్గాలు, ఉగ్ర నెట్వర్క్లపై దృష్టి సారించింది. ఈ మధ్యలో మరికొన్ని కుట్రలు వెలుగులోకి రావడం గమనార్హం. అయితే రెడ్ఫోర్ట్ పేలుడు వ్యవహారంలో ఉగ్ర నెట్వర్క్ల పాత్రపై భారత్ తీవ్రంగా స్పందించింది. సరిహద్దు దాటి పనిచేస్తున్న ఉగ్ర సంస్థలపై అంతర్జాతీయ స్థాయిలో కఠిన చర్యలు అవసరమని భారత్ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. మరోవైపు ఈ తరహా ఆరోపణలపై పాకిస్థాన్ సాధారణంగా తనపై వచ్చే ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. ఉగ్రవాదానికి తాము మద్దతు ఇవ్వడం లేదని ఇస్లామాబాద్ పేర్కొంటోంది.బంగ్లాదేశ్పై కన్ను?అల్ఖైదా ఐఎస్(AQIS) తన కార్యకలాపాలను విస్తరించేందుకు బంగ్లాదేశ్ను వేదికగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని యూఎన్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాసియాలో కొత్త సెల్స్ను ఏర్పాటు చేసి ప్రాంతీయ స్థాయిలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోందని పేర్కొంది.పాకిస్థాన్–అఫ్గానిస్థాన్ ఉద్రిక్తతల మధ్య...పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్ర దాడులపై కూడా యూఎన్ నివేదిక ప్రస్తావించింది. తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) దాడులు పెరగడం, వాటికి ప్రతిగా పాకిస్థాన్ చర్యలు తీసుకోవడం వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయని తెలిపింది. అల్ఖైదా అనుబంధ గ్రూపులు పాకిస్థాన్లోని కొన్ని దాడులతో సంబంధం కలిగి ఉన్నాయని కూడా నివేదిక పేర్కొంది.ఉగ్రవాదుల చేతుల్లో ఏఐ ఆయుధం?ఉగ్ర సంస్థలు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాయని యూఎన్ హెచ్చరించింది. బాంబుల తయారీ సమాచారం, లక్ష్యాల ఎంపిక వంటి అంశాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ (ISIL-K) కూడా ఏఐ సాయంతో ప్రచార కంటెంట్ను పలు భాషల్లో వేగంగా వ్యాప్తి చేస్తోందని వెల్లడించింది.మారుతున్న ఉగ్ర వ్యూహాలు.. పెరుగుతున్న ముప్పుఉగ్ర సంస్థలు కేవలం ఆయుధాలతో కాకుండా ఫైనాన్స్, డిజిటల్ ప్రచారం, చిన్న సెల్స్, కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ తమ నెట్వర్క్లను బలోపేతం చేసుకుంటున్నాయని యూఎన్ పేర్కొంది. రెడ్ఫోర్ట్ పేలుడు ఘటనను AQISతో అనుసంధానించడం భారత్కు అత్యంత కీలక పరిణామంగా మారింది. దక్షిణాసియాలో అల్ఖైదా అనుబంధ సంస్థలు మళ్లీ పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఈ నివేదిక కొత్త హెచ్చరికలు జారీ చేసింది. -
ట్రంప్ బిగ్ వార్నింగ్: హర్ముజ్ మాదే.. ఇక వదులుకోం!
పశ్చిమాసియా సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ.. హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై పూర్తి నియంత్రణ అమెరికాదేనని.. ఇక మీదట దానిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని, ఇరాన్ దీనిని ఎదుర్కొనే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ‘‘ఉక్కు గోడ’’గా అభివర్ణించారు. అయితే తన పోస్ట్ చివర్లో ‘అల్లాహ్కు స్తుతి’ అంటూ ట్రంప్ ముగించారు. సాధారణంగా ఇస్లామిక్ సందర్భాల్లో వినిపించే ఈ పదబంధాన్ని ట్రంప్ ఇరాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్య ధోరణిలో ఉపయోగించినట్లు భావిస్తున్నారు.వీక్ ఇరాన్!ఇరాన్కు నౌకాదళం, వైమానిక దళం బలహీనంగా ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ సైనికులకు జీతాలు కూడా అందడం లేదని వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్రంగా దెబ్బతిన్నదని, వెనక్కి తగ్గుతోందని పేర్కొన్నారు.తగ్గమంటున్న ఇరాన్ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. హార్ముజ్ జలసంధిపై అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందన్న వాదన వాస్తవాన్ని మార్చలేదని పేర్కొంది. హార్ముజ్ ఇంకా మూసివేసే ఉందని, ఇరాన్ పెట్టిన షరతులు అంగీకరించే వరకు దానిని తిరిగి తెరవబోమని పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (PGSA) స్పష్టం చేసింది. అమెరికా అధికారులు పదేపదే చేస్తున్న ప్రకటనలు పరిస్థితిని మార్చలేవని వెల్లడించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధం ఎత్తివేయడం, తమ ఆస్తులపై ఆంక్షలు తొలగించడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ముందుకు తెస్తోంది. ఈ షరతులు నెరవేరే వరకు జలసంధి విషయంలో వెనక్కి తగ్గబోమని చెబుతోంది.ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావంప్రపంచ చమురు సరఫరాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. నౌకల రాకపోకలు తగ్గడం, భద్రతా భయాలు పెరగడంతో చమురు ధరలు, రవాణా వ్యయాలపై ప్రభావం కనిపిస్తోంది.చర్చలపై ట్రంప్ వ్యూహంఇరాన్తో చర్చల విషయంలో ట్రంప్ భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తాము తక్కువ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని, ఇది ఒక చెస్ ఆటలా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాత్రం అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, మధ్యవర్తుల ద్వారా కేవలం సందేశాల మార్పిడి మాత్రమే జరుగుతోందని తెలిపారు. -
రష్యా తరఫున రంగంలోకి మాజీ సీజేఐ చంద్రచూడ్!
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మరో కీలక అంతర్జాతీయ బాధ్యతను చేపట్టారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న న్యాయ వివాదంలో రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా ఆయన నియమితులైనట్లు సమాచారం. ప్రభుత్వ బ్యాంకు ఓష్చాడ్బ్యాంక్ (Oschadbank) దాఖలు చేసిన పెట్టుబడి వివాదానికి సంబంధించిన కేసులో ఈ నియామకం జరిగింది.ఈ వివాదం 1998 రష్యా–ఉక్రెయిన్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT) కింద విచారణకు వస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బ్యాంకు ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలకు జరిగిన నష్టమే ఈ కేసుకు కేంద్రంగా ఉంది. ఈ మేరకు గ్లోబల్ ఆర్బిట్రేషన్ రివ్యూ (Global Arbitration Review) నివేదికను ఉటంకిస్తూ బార్ అండ్ బెంచ్ ఓ కథనం ఇచ్చింది.భారీ నష్టం అంటూ బ్యాంకు క్లెయిమ్ఉక్రెయిన్ ప్రభుత్వ ఆధీనంలోని ఓష్చాడ్బ్యాంక్.. డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సాన్, జపోరిజ్జియా ప్రాంతాల్లోని తన ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలను రష్యా సైనిక చర్యల కారణంగా కోల్పోయినట్లు పేర్కొంటోంది. 2022లో రష్యా పూర్తి స్థాయి సైనిక దాడి ప్రారంభించిన తర్వాత ఈ నష్టం జరిగిందని బ్యాంకు వాదిస్తోంది. ఈ నేపథ్యంలో పరిహారం కోరుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించింది. బ్యాంకు చేసిన క్లెయిమ్ విలువ వందల మిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు సమాచారం.2025 జూలైలో ఓష్చాడ్బ్యాంక్ రష్యాకు వివాదానికి సంబంధించిన నోటీసు పంపినప్పటికీ.. రష్యా స్పందించకపోవడంతో ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు నివేదికలు చెబుతున్నాయి.ముగ్గురు సభ్యులతో ట్రిబ్యునల్ఈ కేసును ముగ్గురు సభ్యులతో కూడిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ విచారించనుంది. కోస్టారికా మాజీ వాణిజ్య మంత్రి, ఆర్బిట్రేటర్ డయాలా జిమెనెజ్ను రష్యా, ఓష్చాడ్బ్యాంక్ సంయుక్తంగా ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా ఎంపిక చేశాయి. మరో సభ్యుడిగా ఓష్చాడ్బ్యాంక్ తరఫున గ్రీస్కు చెందిన ఆర్బిట్రేటర్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ స్టావ్రోస్ బ్రెకౌలాకిస్ను ఎంపిక చేశారు. రష్యా తరఫున మూడో సభ్యుడిగా మాజీ సీజేఐ చంద్రచూడ్ను నియమించింది.అప్పట్లో తిరస్కరణచంద్రచూడ్కు రష్యా తరఫున అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ వ్యవహారాల్లో ఇది తొలి పరిచయం కాదని నివేదికలు చెబుతున్నాయి. గతంలో వింటర్షాల్ డియా అనే చమురు, గ్యాస్ సంస్థకు సంబంధించిన వివాదం, అలాగే ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ ప్రసార సంస్థ ఉక్రెనెర్గోకు సంబంధించిన ఒప్పంద వివాదాల్లో రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా వ్యవహరించాలంటూ ఆయనను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ ప్రతిపాదనలను చంద్రచూడ్ గతంలో తిరస్కరించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఇక ఆ సమయంలో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (PCA) ఆయనను వింటర్షాల్ కేసులో నియామక అధికారిగా ఎంపిక చేసిన రోజే రష్యా నుంచి ఈ సంప్రదింపులు వచ్చినట్లు సమాచారం. ఆ విషయాన్ని వెల్లడించిన అనంతరం చంద్రచూడ్ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నట్లు నివేదికలు తెలిపాయి.యుద్ధం.. లీగల్వార్.. ఇప్పుడు చంద్రచూడ్రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సైనిక రంగానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానాలు, పెట్టుబడి వివాదాల వరకు విస్తరించింది. యుద్ధం కారణంగా ఆస్తులు, వ్యాపారాలు, పెట్టుబడులకు జరిగిన నష్టాలపై ఇరు దేశాలకు చెందిన సంస్థలు అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తున్నాయి. అలాంటి కీలక వివాదంలో మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా నియమితులు కావడం ఇప్పుడు అంతర్జాతీయ న్యాయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ట్రంప్కే షాక్ ఇచ్చిందా? ఐయామ్ ప్రెగ్నెంట్ అంటూ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఈసారి కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయం కాదు.. ఆయన పక్కన నిల్చున్న ఓ మహిళ. ట్రంప్ కీలక ఆదేశంపై సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన కనిపించిన మహిళపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వైరల్ అయ్యాయి. చివరకు ఆ మహిళే స్పందించి అసలు విషయం వెల్లడించాల్సి వచ్చింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో వ్యాక్సినేషన్ విధానానికి సంబంధించి కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తున్నారు. ఆ సమయంలో ఓ మహిళ ఆయన పక్కన నిల్చున్నారు. వీడియోలో ఆమె పదేపదే తల ఊపుతూ, ఒక చేయిని తన పొట్టపై ఉంచుకున్నట్లు కనిపించింది. ఆ వెంటనే మత్తులోకి జారుకున్నట్లు కనిపించిన ట్రంప్.. హఠాత్తుగా అప్రమత్తం అయ్యారు. దీంతో కొందరు సోషల్ మీడియా యూజర్లు విచిత్రమైన వాదనలు మొదలుపెట్టారు.Claims she has a button fitted on her belly, and when she gets the nod that he’s asleep she moves her hand and presses a button that wakes him. They’re calling her The Zapper. No idea if it’s true but it *appears* to line up. pic.twitter.com/hgx4x6iQp6— Tim Brannigan (@tim_brannigan) August 11, 2026ట్రంప్కు షాక్ ఇచ్చిందా?..కొందరు నెటిజన్లు ఆమె చేతిలో ఏదో పరికరం ఉందని, ట్రంప్ను అప్రమత్తం చేసేందుకు విద్యుత్ షాక్ ఇచ్చిందంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు. ఈ ప్రచారం వేగంగా వ్యాపించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె పేరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ (Jayme Leagh Franklin). ఆమె అమెరికాలోని కన్జర్వేటివ్ మీడియా, లైఫ్స్టైల్ బ్రాండ్ ది కన్జర్వేటర్ (The Conservateur) వ్యవస్థాపకురాలు, సీఈవో.నెట్టింట వస్తున్న వింత ఆరోపణలపై స్పందించిన ఫ్రాంక్లిన్.. తాను గర్భవతినని వెల్లడించారు. తన పొట్టపై చేయి పెట్టుకోవడానికి కారణం అదే అని స్పష్టం చేశారు. “నేను కేవలం గర్భవతిని మాత్రమే” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ట్రంప్కు తాను షాకిచ్చి అప్రమత్తం చేశానంటూ తనపై వస్తున్న ఊహాగానాలను చూసి ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపారు.ఆ కార్యక్రమంలో ఎందుకు ఉన్నారు?వైట్హౌస్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ట్రంప్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ల మధ్య ఫ్రాంక్లిన్ నిల్చున్నారు. బాలల వ్యాక్సినేషన్ సిఫార్సుల్లో మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేస్తున్న సమయంలో ఈ వీడియో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఫ్రాంక్లిన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ట్రంప్తో కలిసి ఓవల్ ఆఫీస్లో ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎవరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్?జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ గతంలో ట్రంప్ పాలనలో పనిచేశారు. నార్త్ కరోలినాకు చెందిన ఆమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ నుంచి 2020లో పట్టా పొందారు. 2019లో అమెరికా సెనేట్లో లెజిస్లేటివ్ ఇంటర్న్గా పనిచేసిన ఆమె.. 2020 ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కోయలిషన్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. అనంతరం ట్రంప్ తొలి వైట్హౌస్ పాలనలో కరస్పాండెన్స్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె నడుపుతున్న ది కన్జర్వేటర్.. రాజకీయాలు, సంస్కృతి, విశ్వాసం, ఫ్యాషన్, బ్యూటీ అంశాలపై కంటెంట్ అందించే కన్జర్వేటివ్ మీడియా సంస్థగా కొనసాగుతోంది. అదీ అసలు ముచ్చట. -
వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణంలో జరిగిన రహస్య మార్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాటో సదస్సు తర్వాత అంకారా నుంచి బయలుదేరే సమయంలో ఆయన్ని ఎవరి కంటా పడకుండా మరో విమానంలో తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఎయిర్ఫోర్స్ వన్లో ఎక్కినట్లు కనిపించేలా ఓ డమ్మీ ఆపరేషన్ నిర్వహించి.. అనంతరం ఓ క్యాటరింగ్ ట్రక్కు ద్వారా ట్రంప్ను మరో సైనిక విమానంలోకి తరలించినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై ట్రంప్కు తాజాగా ప్రశ్న ఎదురైంది. భద్రతా కారణాలతో ఎయిర్ఫోర్స్ వన్ నుంచి మరో విమానానికి తనను తరలించారన్న ప్రచారాన్ని ట్రంప్ ధృవీకరించారు. ‘‘విమానం మార్చాలన్న నిర్ణయం పూర్తిగా సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులదే. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“నేను సీక్రెట్ సర్వీస్, మిలిటరీ చెప్పినట్లే చేస్తాను. వారు వేరే విమానంలో వెళ్లాలని చెప్పారు. అది కూడా అంతే భద్రత కలిగిన విమానమే. వారు కోరడంతో నేను అలా చేశాను. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అని ట్రంప్ అన్నారు. అయితే ఆ ముప్పు ఇరాన్ నుంచే ఉందా? అనే విషయంపై ఆయన ధాటవేత ధోరణి ప్రదర్శించారు. తనపై ఉన్న ముప్పు వివరాలను తాను సీక్రెట్ సర్వీస్ వాళ్లను ఎక్కువగా అడగలేదని ఆయన చెప్పారు. “నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి” అని పేర్కొన్నారు.“మీకు తెలియని చాలా బెదిరింపులు నాకు ఉన్నాయి. ప్రభావవంతమైన అధ్యక్షులకు ఇలాంటి బెదిరింపులు సహజమే. దాదాపు ఆరు సంవత్సరాల కాలంలో నా కంటే ఎక్కువ చేసిన అధ్యక్షుడు ఎవరూ లేరని నేను భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను దేని గురించి ఆందోళన చెందను. ఏదైనా సరే.. నా వైఖరి అదే” అని అన్నారు.ఇరాన్ను నమ్మను: ట్రంప్ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నేను ఇరాన్ను నమ్మను. వారు నాతో నిరంతరం అబద్ధాలు చెప్పారు. ఇరాన్ను నమ్మే చివరి వ్యక్తి నేనే” అని అన్నారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొంటూ.. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.“ప్రస్తుతం హార్ముజ్ జలసంధిపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఎవరైనా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ట్రంప్ అన్నారు.ఆనాడు జరిగింది ఇదే..టర్కీలోని అంకారా నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ తొలుత ఎయిర్ఫోర్స్ వన్ విమానం ఎక్కారు. అయితే కొద్దిసేపటికే భద్రతా వ్యూహాన్ని మార్చిన అధికారులు ఆయనను రహస్యంగా మరో విమానంలోకి తరలించారు. సాధారణంగా విమానాలకు ఆహారం, సరఫరాలు తరలించే క్యాటరింగ్ ట్రక్ను ఉపయోగించి ట్రంప్ను విమానాశ్రయంలో మరో ప్రాంతానికి తీసుకెళ్లి, ఎయిర్ఫోర్స్ C-32A విమానంలో ఎక్కించారు.అదే సమయంలో అసలు ఎయిర్ఫోర్స్ వన్ విమానం మాత్రం ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ఆపరేషన్ను భద్రతా వర్గాలు ఒక “డీకాయ్ ఆపరేషన్”గా పరిగణిస్తున్నాయి. ఇరాన్కు చెందిన వర్గాల నుంచి ట్రంప్ను లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్ర దేశాధినేతల ప్రయాణాలు ఎప్పుడూ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతుంటాయి. అయితే “దేనికీ భయపడను” అంటూ చెప్పుకునే ట్రంప్ విషయంలో ఇరాన్ ముప్పు నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ రహస్య విమాన మార్పు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా చెప్పుకునే ట్రంప్ ప్రయాణంలో జరిగిన ఈ “సీక్రెట్ స్విచ్” భవిష్యత్తులో అధ్యక్షుల రక్షణ వ్యూహాలకు మరో కొత్త అధ్యాయంగా మారుతుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది. -
హర్ముజ్పై ఉడుంపట్టు.. ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్పై ఆంక్షలు, నౌకా దిగ్బంధం కొనసాగుతున్న వేళ.. అమెరికా దళాలు రంగంలోకి దిగాయి. హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌకపై నిబంధనలు ఉల్లంఘించిందని చెబుతూ చర్యలు చేపట్టింది. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో.. హర్ముజ్పై పూర్తి నియంత్రణ మాదే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హర్ముజ్లో అమెరికా ఇప్పటిదాకా బ్లాకేడ్కే పరిమితం కాగా.. తాజా దాడులకూ దిగింది. ఇరాన్ పోర్టు వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన పనామా జెండా కలిగిన ఓ కార్గో నౌకను అమెరికా దళాలు అడ్డుకున్నాయి. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో ఆ నౌక స్టీరింగ్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని రెండు హెల్ఫైర్ క్షిపణులు ప్రయోగించి దాన్ని నిర్వీర్యం చేశాయి. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారంగా ప్రకటించింది. హర్ముజ్ దిగ్బంధాన్ని దాటేందుకు ప్రయత్నించిన వాణిజ్య నౌకల్లో ఇప్పటివరకు 55 నౌకలను దారి మళ్లించామని, మూడు నౌకలను నిలిపివేశామని, రెండు నౌకలను తనిఖీ చేశామని అమెరికా వెల్లడించింది. తద్వారా హర్ముజ్పై తాము పూర్తిగా పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే.. హర్ముజ్ మా నియంత్రణలోనే.. ట్రంప్ఇరాన్ పరిస్థితి “బాగానే సాగుతోంది” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని, తమ నౌకాదళం అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. ఇరాన్ను నమ్మలేమని, గతంలో ఆ దేశం పలుమార్లు అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. అంతేకాదు ఇరాన్తో చర్చల్లో గత దశాబ్దాల ఘర్షణల్లో జరిగిన నష్టాలకు పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించడం మరింత ఉద్రిక్తతకు కారణమైంది. అయితే ట్రంప్ తాజా ప్రకటనను ఇరాన్ ఎలా స్వీకరిస్తుందనేది చూడాలి.మా ఈ డిమాండ్లు.. నిబంధనలు నేరవేరాల్సిందే!: ఇరాన్హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తమ డిమాండ్లను అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసింది. అవి..అమెరికా యుద్ధ చర్యలు, బెదిరింపులకు పూర్తిగా ముగింపుఇరాన్ పోర్టులపై నౌకా దిగ్బంధం ఎత్తివేతఅమెరికా సైనిక బలగాల ఉపసంహరణయుద్ధ నష్టాలకు పరిహారంఆంక్షల తొలగింపుస్తంభింపజేసిన ఇరాన్ నిధుల విడుదలప్రాంతీయ కాల్పుల విరమణ.. ఈ షరతులు నెరవేరే వరకు హర్ముజ్ మూసివేత కొనసాగుతుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధికారి మొహ్సెన్ రెజాయి తెలిపారు.ఒమన్ మధ్యవర్తిత్వం.. చర్చలు తుది దశలో?అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు లేవని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. ఒమన్ మధ్యవర్తిత్వంతో హర్ముజ్ భవిష్యత్ నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. నౌకల రాకపోకల కోసం కొత్త మార్గాలపై ఒప్పందం చివరి దశకు చేరుకుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. ఖతార్ కూడా ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు గణనీయమైన పురోగతిలో ఉన్నాయని పేర్కొంది.90 డాలర్లకు చేరువలో.. “ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ మార్గం ద్వారా గతంలో చమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు సాగేది. అయితే సంక్షోభంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు దాదాపు 90 డాలర్లకు చేరువైంది. హర్ముజ్ మార్గం ద్వారా గతంలో ప్రపంచంలోని చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో ఐదో వంతు రవాణా అయ్యేది.బాబ్ అల్ మందెబ్లో హౌతీ దాడి.. నలుగురు మృతిమరోవైపు ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందెబ్ జలసంధిలో హౌతీలు వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్థానీలు, ఒక ఇండోనేషియా పౌరుడు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. సౌదీ సైనిక సామగ్రిని తరలిస్తున్న నౌకను లక్ష్యంగా చేసుకున్నామని హౌతీలు ప్రకటించారు. అయితే ఆ నౌక సౌదీ యాజమాన్యంలో లేదని, ఈజిప్టు కంపెనీలకు చెందినదని సమాచారం.అటు.. వెస్ట్ బ్యాంక్లో ఉద్రిక్తతలుఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోనూ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 76 మంది పాలస్తీనియన్లు, వారిలో 18 మంది చిన్నారులు మరణించారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.ప్రపంచం చూపు హర్ముజ్పైనే!హర్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ వైఖరులు పరస్పర విరుద్ధంగా కొనసాగుతున్న వేళ.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది. ఒకవైపు అమెరికా పూర్తి నియంత్రణ తమదేనని చెబుతుండగా.. మరోవైపు తమ షరతులు నెరవేరే వరకు హర్ముజ్ తెరవబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.చర్చలు పురోగమిస్తాయా? లేదంటే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న. హర్ముజ్ సంక్షోభం పరిష్కారం కాకపోతే.. దాని ప్రభావం చమురు ధరల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం వరకు పడే అవకాశం ఉంది. -
నేడు సంపూర్ణ సూర్యగ్రహం.. 2 నిమిషాలు పట్టపగలే చీకటి!
ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చి పూర్తిగా కప్పివేయడంతో బుధవారం (ఆగస్టు 12) సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళే చీకట్లు కమ్ముకోగా.. సూర్యుడి బాహ్య వాతావరణమైన ‘కరోనా’ స్పష్టంగా కనిపించనుంది. అయితే ఆకాశంలో అద్భుతం జరుగుతున్నా.. భారత్ మాత్రం ఈసారి సూర్యుడి ‘మాయ’ను ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని కోల్పోనుంది.భారత కాలమానం ప్రకారం.. పాక్షిక గ్రహణం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. రాత్రి 9.15 గంటల ప్రాంతంలో సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. రాత్రి 11.16–11.17 గంటల సమయంలో గరిష్ఠ దశకు చేరుకుంది. ఆగస్టు 13 తెల్లవారుజామున సంపూర్ణ దశ ముగుస్తుంది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గ్రహణం పూర్తిగా వీడిపోతుంది. జ్యోతిష విశ్వాసాలు.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం?జ్యోతిష సంప్రదాయాల ప్రకారం.. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కర్కాటక రాశిలోని ఆశ్లేషా నక్షత్రంలో కేతుగ్రస్త సూర్యగ్రహణంగా సంభవిస్తుందని భావిస్తారు. గ్రహణం కనిపించే ప్రాంతాల్లో నివసించే ఆశ్లేషా నక్షత్రజాతకులు, కర్కాటక రాశివారు గ్రహణ శాంతి, జపం, దానధర్మాలు చేయడం శ్రేయస్కరమని జ్యోతిష పండితులు సూచిస్తారు. అయితే ఈ గ్రహణం భారత్లో కనిపించదు కాబట్టి.. ఇక్కడ నివసించే వారికి ప్రత్యేక గ్రహణ శాంతులు అవసరం లేదని సంప్రదాయాలు చెబుతున్నాయి. అయితే..జ్యోతిష విశ్వాసాల ప్రకారం కర్కాటక, సింహ, మేష, ధనుస్సు రాశులపై ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉండొచ్చని, వృషభ, కన్య, తుల, కుంభ రాశులకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెబుతారు. మిగిలిన రాశులైన మిథున, వృశ్చిక, మకర, మీన రాశులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని పేర్కొంటారు. ఇవి సాధారణ గోచార ఫలితాలు మాత్రమేనని, వ్యక్తిగత ఫలితాలు జన్మకుండలి ఆధారంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో గాయత్రీ మంత్రం, ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం, మహామృత్యుంజయ మంత్ర జపం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.2034 వరకు భారత్కు ఎదురుచూపులే!ఆగస్టు 12న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో జరుగుతుంది. గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారత్లో సూర్యుడు అస్తమించి ఉంటాడు. దీంతో దేశంలోని ఏ ప్రాంతం నుంచీ ఈ గ్రహణాన్ని చూడలేం. భారత్ నుంచి తదుపరి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడాలంటే ఇంకా కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే. 2034 మార్చి 20న భారత్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉంది. అంతవరకు భారతీయ ఖగోళ అభిమానులు ఈసారి గ్రహణాన్ని అంతరిక్ష సంస్థల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మాత్రమే వీక్షించాల్సి ఉంటుంది. అంటే 27 ఏళ్ల తర్వాత యూరప్కు అరుదైన అవకాశంఈ సంపూర్ణ సూర్యగ్రహణం యూరప్కు ప్రత్యేకమైనది. 1999 తర్వాత యూరప్ ప్రధాన భూభాగంలో కనిపించే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. సుమారు 98 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పాక్షిక గ్రహణాన్ని చూడగల అవకాశం ఉంది. దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు సంపూర్ణ గ్రహణ మార్గంలో ఉండి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.ఎక్కడ కనిపించనుంది?సంపూర్ణ గ్రహణ మార్గం ఉత్తర ప్రాంతాల నుంచి ప్రారంభమై యూరప్ వైపు సాగుతుంది. ప్రధానంగా.. గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్లోని కొన్ని ప్రాంతాలు సంపూర్ణ గ్రహణాన్ని వీక్షించే అవకాశం పొందనున్నాయి. స్పెయిన్లోని లియోన్, వల్లడోలిడ్, జరగోజా, టెరుయెల్, వాలెన్సియా వంటి నగరాలు గ్రహణాన్ని చూసేందుకు అత్యుత్తమ ప్రాంతాలుగా నిలవనున్నాయి. మాడ్రిడ్, బార్సిలోనా నగరాల్లో సూర్యుడిలో 99 శాతానికి పైగా భాగం కప్పుకున్నా.. సంపూర్ణ గ్రహణం మాత్రం కనిపించదు.రెండు నిమిషాలకు పైగా పగలే చీకటిసంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడి ముఖాన్ని పూర్తిగా కప్పివేస్తాడు. ఆ సమయంలో సూర్యకాంతి తగ్గిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పగటి వేళే చీకటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ దశ గరిష్ఠంగా 2 నిమిషాల 18 సెకన్ల వరకు కొనసాగనుంది.ఈ సమయంలో..సూర్యుడి కరోనా స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయి. ప్రకాశవంతమైన నక్షత్రాలు, గ్రహాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఖగోళ శాస్త్రవేత్తలకు ఇది పరిశోధనలకు కీలక సమయం.సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది?చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యకు వచ్చినప్పుడు సూర్యకాంతిని అడ్డుకుంటాడు. చంద్రుడి నీడ భూమిపై పడిన ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పితే దాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. కొంత భాగం మాత్రమే కప్పితే అది పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది.గ్రహణాన్ని చూసేవారు జాగ్రత్త!గ్రహణాన్ని వీక్షించే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. ✅ ప్రత్యేక సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ మాత్రమే ఉపయోగించాలి.❌ సాధారణ సన్గ్లాసెస్తో సూర్యుడిని చూడకూడదు.❌ టెలిస్కోప్, బైనాక్యులర్, కెమెరా, సెల్ఫోన్ కెమెరాలతో నేరుగా చూడటం ప్రమాదకరం. సరైన రక్షణ లేకుండా గ్రహణ సమయంలో సూర్యుడిని చూడటం కంటి చూపుకు శాశ్వత నష్టం కలిగించే ప్రమాదం ఉంది. -
అమెరికాలో కల్లోలం.. వాటర్ సిస్టమ్స్పై సైబర్ దాడులు
అమెరికాలో కీలక మౌలిక వసతులపై సైబర్ దాడుల ముప్పు మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి హ్యాకర్ల లక్ష్యంగా మారింది తాగునీటి సరఫరా వ్యవస్థలు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వాటర్ సిస్టమ్స్, వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లపై జరిగిన సైబర్ దాడులు భద్రతా వర్గాలను అప్రమత్తం చేశాయి. ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారు? అని అమెరికా దర్యాప్తు సంస్థలు పరిశీలన ప్రారంభించాయి.జూలై చివరి వారంలో మిన్నెసోటాలోని 30కి పైగా స్థానిక నీటి సరఫరా వ్యవస్థలు సమన్వయ సైబర్ దాడులకు గురయ్యాయి. ఆ తర్వాత ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), సైబర్ భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. కనీసం ఏడు రాష్ట్రాల్లోని నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి వ్యవస్థల్లోకి హ్యాకర్లు చొరబడినట్లు అధికారులు గుర్తించారు.అమెరికాలోని నీటి సరఫరా వ్యవస్థలు కోట్లాది మంది ప్రజల రోజువారీ జీవితంతో ముడిపడి ఉన్నాయి. సరస్సులు, నదులు, భూగర్భ జలాల నుంచి సేకరించిన నీటిని శుద్ధి చేసి.. పైపుల ద్వారా ఇళ్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది.నీటి ఒత్తిడి, పంపుల పనితీరు, రసాయనాల మోతాదు వంటి అంశాలను నియంత్రించే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లు (PLCs) ఈ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పుడు ఇవే పరికరాలు హ్యాకర్ల టార్గెట్గా మారాయి. ఇంటర్నెట్కు అనుసంధానమైన కంట్రోల్ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించి వాటిలోకి ప్రవేశించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.బలహీనమైన పాస్వర్డ్లు, భద్రతా లోపాలు, అప్డేట్ చేయని సాఫ్ట్వేర్లను ఉపయోగించుకుని హ్యాకర్లు వ్యవస్థల్లోకి చొరబడే అవకాశం ఉంటుంది. ఒకసారి నియంత్రణ వ్యవస్థలపై పట్టు సాధిస్తే.. పాస్వర్డ్లను మార్చడం, ఆదేశాల్లో మార్పులు చేయడం, పరికరాల పనితీరును ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది.ఈ దాడుల వెనుక ఇరాన్ హ్యాకర్ల పాత్ర ఉందా? అనే అంశంపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరాన్కు అనుబంధంగా పనిచేసే సైబర్ గ్రూపులు గతంలో కూడా కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు ఉన్నాయని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఏ దేశాన్నీ ఈ దాడులకు బాధ్యుడిగా ప్రకటించలేదు. మరోవైపు ఇరాన్ పేరుతో మరో దేశం లేదంటే గ్రూప్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందా? అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం జరిగిన దాడుల వల్ల తాగునీరు కలుషితమైనట్లు.. ప్రజల ఆరోగ్యానికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నీటి వ్యవస్థలను మాన్యువల్గా నిర్వహించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ప్రజలకు నీటిని మరిగించి వినియోగించాలని సూచనలు కూడా ఇచ్చారు.సైబర్ భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి దాడుల అసలు లక్ష్యం కేవలం నీటి సరఫరాను నిలిపివేయడం మాత్రమే కాకపోవచ్చు. ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకాన్ని దెబ్బతీయడం కూడా సైబర్ యుద్ధ వ్యూహాల్లో భాగమని వారు హెచ్చరిస్తున్నారు.ఈ ఘటనల నేపథ్యంలో అమెరికా నీటి సరఫరా సంస్థలు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తున్నాయి. నీటి వ్యవస్థలను నేరుగా ఇంటర్నెట్కు అనుసంధానం చేయకుండా చూడటం, బలమైన ఫైర్వాల్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, మల్టీ-లేయర్ అథెంటికేషన్ అమలు చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే డిఫాల్ట్ పాస్వర్డ్లను మార్చడం, అవసరం లేని రిమోట్ యాక్సెస్లను నిలిపివేయడం, అత్యవసర పరిస్థితుల్లో వ్యవస్థలను మాన్యువల్గా నడిపించే సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.డిజిటల్ యుగంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే జరగవని.. విద్యుత్, నీరు, రవాణా వంటి కీలక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సైబర్ దాడులు భవిష్యత్తులో మరింత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని తాజా ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. -
అయ్యో ట్రంప్.. మరీ ఇలానా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత కోసం చేపట్టిన ఓ అసాధారణ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్.. అక్కడి నుంచి బయలుదేరే సమయంలో కనిపించిన దృశ్యాల వెనుక ఓ రహస్య వ్యూహం ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.కెమెరాల ముందు ట్రంప్ పాత ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ఎక్కినట్లు కనిపించారు. కానీ అది కేవలం డీకాయ్ (మభ్యపెట్టే ఏర్పాటు) మాత్రమేనని.. అసలు ఆయనను ఓ చిన్న సైనిక విమానంలోకి రహస్యంగా తరలించినట్లు సమాచారం. ఈ మొత్తం ఆపరేషన్లో ఓ సాధారణ క్యాటరింగ్ ట్రక్ కీలక పాత్ర పోషించడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.టర్కీ నుంచి బయలుదేరే ముందు ట్రంప్ పాత ఎయిర్ఫోర్స్ వన్లో ప్రయాణిస్తారని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో భద్రతా అధికారులు చివరి నిమిషంలో ప్రణాళిక మార్చినట్లు తెలుస్తోంది.ట్రంప్ ముందుగా ఎయిర్ఫోర్స్ వన్లోకి ఎక్కినట్లు కనిపించిన తర్వాత.. విమానం మరో వైపు నుంచి క్యాటరింగ్ ట్రక్ దగ్గరకు వెళ్లింది. సాధారణంగా విమానాలకు ఆహారం, ఇతర సరఫరాలు అందించే ఆ వాహనాన్ని ఈసారి భద్రతా వ్యూహంలో భాగంగా ఉపయోగించారు. ట్రక్ సహాయంతో ట్రంప్, ఆయన సిబ్బందిని ఎవరికీ కనిపించకుండా బయటకు తీసుకొచ్చి C-32A సైనిక విమానంలోకి తరలించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.డీకాయ్గా పాత విమానం.. అసలు ప్రయాణం మరో విమానంలోఈ వ్యూహం కారణంగా మీడియా ప్రతినిధులు, కొంతమంది సిబ్బంది కూడా ట్రంప్ పాత ఎయిర్ఫోర్స్ వన్లోనే ప్రయాణిస్తున్నారని భావించారు. కానీ ఆయన మాత్రం C-32A విమానంలో బ్రిటన్కు చేరుకున్నట్లు సమాచారం.ఎందుకీ రహస్య ఆపరేషన్?ట్రంప్ టర్కీలో ఉన్న సమయంలో ఇరాన్ అనుబంధ వర్గాల నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారం అందినట్లు నివేదికలు తెలిపాయి. అధ్యక్షుడి ప్రయాణ మార్గం, విమానం వివరాలు బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.ఖతార్ విమానంపై మళ్లీ చర్చఈ ఘటనతో ఖతార్ అందించిన కొత్త బోయింగ్ 747-8 విమానం భద్రతా సామర్థ్యాలపై మరోసారి చర్చ మొదలైంది. అయితే వైట్హౌస్ మాత్రం అధ్యక్షుడి రక్షణ కోసం అత్యున్నత భద్రతా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.అగ్రరాజ్య అధ్యక్షుడి ప్రయాణం(అందునా ట్రంప్).. రెండు విమానాలు.. రహస్య మార్గం.. ఓ క్యాటరింగ్ ట్రక్.. ట్రంప్ భద్రతా ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది. -
కొలంబియా భూకంపం: ఒక్క కుదుపు.. సెకన్లలో శవాల దిబ్బలు!
ప్రకృతి కన్నెర్ర చేస్తే.. మనిషి నిర్మించిన ప్రపంచం క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. అప్పటివరకు జనజీవనంతో కళకళలాడిన నగరాలు భూమి ఒక్కసారి కంపించగానే శిథిలాల గుట్టలుగా మారిపోతాయి. కట్టుకున్న ఇళ్లు కూలిపోతాయి.. కుటుంబాలు చెల్లాచెదురవుతాయి.. ప్రాణాలతో బయటపడిన వారి కళ్ల ముందు తమ ఆత్మీయులను కోల్పోయిన విషాదం జీవితాంతం వెంటాడుతుంది..భూకంపాలకు అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటైన లాటిన్ అమెరికా.. ఇలాంటి ఎన్నో ప్రకృతి విలయాలకు సాక్షిగా నిలిచింది. భూమి పొరల్లో చోటుచేసుకున్న కదలికలు కొన్ని సెకన్లలోనే నగరాల రూపురేఖలను మార్చేశాయి. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. తాజాగా కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం మరోసారి ఈ ప్రాంతంలోని పాత విషాదాలను ప్రపంచానికి గుర్తుచేసింది. ఈ ప్రకంపనల ధాటికి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Powerful 7.4-magnitude earthquake hits Manizales, Colombia 🇨🇴 (10.08.2026)@AmirSaeedAbbasi @HussainAhmedCh8 @KulAalam #Colombia pic.twitter.com/FI2lrySjd8— Media Talk (@mediatalk922) August 11, 2026హైతీ.. ప్రపంచాన్ని కదిలించిన విషాదంలాటిన్ అమెరికా చరిత్రలో అత్యంత భయానక భూకంపాల్లో 2010లో హైతీలో సంభవించిన ప్రకంపనలు ఒకటి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0 మాత్రమే అయినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం ఊహించని స్థాయిలో కనిపించింది. రాజధాని పోర్ట్–ఔ–ప్రిన్స్ నగరం తీవ్రంగా దెబ్బతింది. వేలాది భవనాలు కూలిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాలు శిథిలాలుగా మారాయి. భూకంప నిరోధక ప్రమాణాలు లేని నిర్మాణాలు భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి.ఈ విపత్తులో సుమారు 3.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక దేశం మొత్తం కోలుకోవడానికి ఏళ్లు పట్టింది.నిద్రలోనే మృత్యువు ఒడిలోకి వేలమంది.. 1868లో ఈక్వెడార్, కొలంబియా ప్రాంతాలను కుదిపేసిన భూకంపాలు మరో మహా విషాదాన్ని మిగిల్చాయి. **7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు** అనేక పట్టణాలను నేలమట్టం చేశాయి. ప్రజలు గాఢనిద్రలో ఉన్న సమయంలో సంభవించిన ఈ భూకంపం.. క్షణాల్లో వేలాది ఇళ్లను శిథిలాలుగా మార్చింది. ఈక్వెడార్లో సుమారు 40 వేల మంది, కొలంబియాలో మరో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. చారిత్రక రికార్డుల ప్రకారం.. ఇబారా నగరం కొన్ని క్షణాల్లోనే విధ్వంసానికి గురైందని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.పెరూలో భూకంపం.. కదిలిన పర్వతం1970లో పెరూలో సంభవించిన భూకంపం ప్రకృతి శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచానికి చూపించింది. 7.9 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు అండీస్ పర్వతాల్లో భారీ మంచు, రాళ్ల కొండచరియలు విరిగిపడేలా చేశాయి. మంచు, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం వేగంగా దూసుకొచ్చి యుంగే, రన్రాహిర్కా ప్రాంతాలను కప్పేసింది. కొన్ని నిమిషాల్లోనే అక్కడి జనజీవనం పూర్తిగా తారుమారైంది. ఈ ఘటనలో సుమారు 66,794 మంది మరణించారు. ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు ఎంతటి ప్రాణాంతకంగా మారతాయో ఈ ఘటన చాటిచెప్పింది.ఈక్వెడార్లో ప్రకృతి ప్రకోపం.. 40 వేల మంది బలి1797లో ఈక్వెడార్లో సంభవించిన భూకంపం ఆ దేశ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఘటనల్లో ఒకటి. 8.3 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనలు భారీగా కొండచరియలు విరిగిపడేలా చేశాయి. రియోబాంబా, లతకుంగా, అంబాటో వంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విషాదంలో సుమారు 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.చిలీ.. భూకంపాల దేశంలో విషాద జ్ఞాపకంప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం 1960లో చిలీలో 9.5 తీవ్రతతో నమోదైంది. అయితే అత్యధిక మరణాలు మాత్రం 1939లో వచ్చిన చిల్లాన్ భూకంపంలో చోటుచేసుకున్నాయి. 8.3 తీవ్రతతో వచ్చిన ఆ ప్రకంపనలు చిల్లాన్, కాన్సెప్సియన్ నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. బలహీన నిర్మాణాల కారణంగా సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం తర్వాత చిలీ భూకంప నిరోధక నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.వెనిజులా నుంచి అర్జెంటీనా వరకు.. విషాదాల ఆనవాళ్లులాటిన్ అమెరికాలో మరెన్నో భూకంపాలు వేలాది కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చాయి. 1812 వెనిజులా భూకంపం సుమారు 26 వేల మందిని, 1868 అరికా భూకంపం దాదాపు 25 వేల మందిని, 1976 గ్వాటెమాలా భూకంపం 23 వేల మందిని బలిగొన్నాయి. 1797 వెనిజులా భూకంపం, 1861 అర్జెంటీనా భూకంపం కూడా వేలాది ప్రాణాలను హరించాయి. కొన్ని ప్రాంతాల్లో భూకంపం తర్వాత వచ్చిన సునామీలు, అగ్ని ప్రమాదాలు మరణాల సంఖ్యను మరింత పెంచాయి.ఎందుకింత ప్రాణ నష్టం?లాటిన్ అమెరికా భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారడానికి ప్రధాన కారణం.. ఈ ప్రాంతం భారీ టెక్టానిక్ పలకల సరిహద్దులపై ఉండటమే. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉన్న చిలీ, పెరూ, ఈక్వెడార్, కొలంబియా వంటి దేశాలు తరచూ భౌగోళిక కదలికలను ఎదుర్కొంటుంటాయి.సముద్రపు అడుగున ఉన్న నాజ్కా టెక్టానిక్ ప్లేట్.. దక్షిణ అమెరికా ప్లేట్ కిందికి జారిపోవడం వల్ల భూమి లోపల భారీ ఒత్తిడి పేరుకుపోతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భారీ ప్రకంపనలు సంభవిస్తాయి. అందుకే ఈ ప్రాంతంలో తరచూ శక్తివంతమైన భూకంపాలు చోటుచేసుకుంటుంటాయి.ప్రకృతి హెచ్చరిక.. మనిషికి గుణపాఠంభూకంపాలను ఆపడం మనిషి చేతుల్లో లేదు. కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడం మాత్రం సాధ్యమే. భూకంప నిరోధక నిర్మాణాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సమర్థవంతమైన విపత్తు నిర్వహణ ప్రణాళికలు ఎన్నో ప్రాణాలను కాపాడగలవు. లాటిన్ అమెరికా భూకంప చరిత్ర ఒక చేదు నిజాన్ని చెబుతోంది. భూమి కదిలేది కొన్ని సెకన్లే.. కానీ ఆ ప్రకంపనలు మిగిల్చే విషాదం తరతరాల పాటు నిలిచిపోతుంది అని. -
కాల్పుల తర్వాత కౌగిలింతలా? పీవోకేలో పొలిటికల్ గేమ్!
పీవోకేలో ఆందోళనలు, భద్రతా చర్యల తర్వాత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వరం మార్చారు. నెలలుగా కొనసాగుతున్న నిరసనలపై కఠిన వైఖరి ప్రదర్శించిన ప్రభుత్వం.. ఇప్పుడు చర్చల ప్రతిపాదనతో ముందుకొచ్చింది. సమస్యలకు పరిష్కారం బలప్రయోగంలో లేదని, చర్చల ద్వారానే మార్గం కనుగొనాలని షెహబాజ్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై నిరసనకారుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పీవోకేలో జరిగిన తీవ్ర నిరసనలు, భద్రతా చర్యల నేపథ్యంలో షెహబాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్రవ్యోల్బణం, భారీ విద్యుత్ ఛార్జీలు, ఆర్థిక నిర్లక్ష్యం, ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఆందోళనలు ఉధృతమయ్యాయి. అయితే “సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’’ అని షెహబాజ్ పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వం కూడా నిరసనకారులతో చర్చల ప్రక్రియను కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.క్రాక్డౌన్ తర్వాత మారిన స్వరంపీవోకేలో రెండు నెలలకు పైగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. విద్యుత్ ధరల తగ్గింపు, ఆర్థిక సమస్యల పరిష్కారం, రాజకీయ సంస్కరణలు వంటి డిమాండ్లతో వారు ఆందోళనలు చేస్తున్నారు. నిరసనల్లో విద్యార్థులు, వ్యాపారులు, రవాణా కార్మికులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)పై గతంలో కఠిన చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే వర్గాలతో చర్చలకు సిద్ధమని ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిరసనకారులు మాత్రం ఇది సమస్యల పరిష్కారానికి నిజమైన ప్రయత్నమా? లేదంటే ఆందోళనల తీవ్రతను తగ్గించేందుకు చేస్తున్న వ్యూహమా? అని ప్రశ్నిస్తున్నారు.‘అల్లర్లకు ప్రయత్నిస్తే సహించం’చర్చలకు సిద్ధమని చెబుతూనే షెహబాజ్ హెచ్చరికలు కూడా చేశారు. శాంతియుతంగా తమ సమస్యలను చెప్పేవారితో చర్చిస్తామని, అయితే ప్రాంతంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం గతంలో కొందరు నిరసనకారులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపించింది. ఈ ఆరోపణల ఆధారంగానే భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.ఎన్నికల వేళ రగిలిన అసంతృప్తిపీవోకేలో ఎన్నికల ప్రక్రియ కూడా వివాదాలకు కారణమైంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని JAAC ఆరోపించింది. ఘర్షణలు, భద్రతా బలగాల చర్యల మధ్య ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్–నవాజ్ (PML-N) ఆధిపత్యం సాధించినట్లు సమాచారం. 45 ఎన్నికైన స్థానాల్లో మెజారిటీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకున్నట్లు తెలుస్తోంది.మృతుల సంఖ్యపై భిన్న వాదనలుజూన్లో ప్రారంభమైన ఘర్షణల్లో కనీసం 11 మంది మరణించినట్లు అధికారిక పలు వార్తా కథనాల నివేదికలు చెబుతుండగా.. నిరసనకారుల వర్గాలు మాత్రం మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ గణాంకాలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండిస్తోంది.‘దేశభక్తులే’ అంటున్న పీఎంఎల్–ఎన్షెహబాజ్ సన్నిహితుడు, పీఎంఎల్–ఎన్ నేత రానా సనావుల్లా కూడా నిరసనకారులపై స్వరం మార్చారు. JAACలో ఉన్న వారిలో 99 శాతం మంది దేశభక్తులేనని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.చర్చల వెనుక రాజకీయ లెక్కలు?అణచివేతతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు చర్చల ప్రతిపాదన చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా అసంతృప్తిని తగ్గించడం, ప్రాంతంలో శాంతి నెలకొల్పడం ప్రభుత్వానికి సవాల్గా మారింది. అణచివేత తర్వాత చర్చల మాట ఎత్తిన షెహబాజ్ ప్రభుత్వం.. నిజంగా సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తుందా? లేదంటే ఇది కేవలం రాజకీయ వ్యూహమా? అన్నది ఇప్పుడు పీవోకేలో ప్రధాన చర్చగా మారింది.నెలల తరబడి నిరసనలను ఎదుర్కొనేందుకు కఠిన వైఖరి అవలంబించిన ప్రభుత్వం.. ఇప్పుడు శాంతి, చర్చల భాష మాట్లాడటం పీవోకేలో కొత్త చర్చకు దారితీసింది. విమర్శకులు దీనిని “ముందు అణచివేత.. తర్వాత సామరస్య పాఠాలు” అంటూ వ్యంగ్యంగా అభివర్ణిస్తున్నారు. -
రివర్స్ రీయింబర్స్మెంట్.. ట్రంప్ నయా గేమ్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు దౌత్యపరమైన ఆధిపత్య పోరుగా మారింది. ఐదు నెలలపాటు కొనసాగిన ఘర్షణల తర్వాత పరిస్థితులు కొంత చల్లబడతాయని భావిస్తున్న సమయంలో.. ఇరు దేశాలు పరస్పరం కొత్త డిమాండ్లు, ఆరోపణలతో ముందుకు రావడం అంతర్జాతీయ ఆందోళనలకు కారణమవుతోంది.యుద్ధంలో తమకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డిమాండ్లను తిరస్కరించడమే కాకుండా.. గత ఘర్షణల్లో అమెరికా పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి ఇరాన్ బాధ్యత వహించాలని, తమ నష్టాలకు టెహ్రాన్ నుంచే పరిహారం కోరుతామని స్పష్టం చేశారు.హర్ముజ్ తెరవాలంటే ఇరాన్ షరతులుహర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని కఠినంగా వెల్లడించింది. అమెరికా చర్యల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టాలను భర్తీ చేయాలని, అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతోంది. యుద్ధ పరిస్థితుల్లో నిలిచిపోయిన తమ ఆస్తులను విడుదల చేయాలని, మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించాలని కూడా టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.ఈ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించే వరకు హర్ముజ్ విషయంలో తమ వైఖరిలో మార్పు ఉండకపోవచ్చనే సంకేతాలను ఇరాన్ ఇస్తోంది. హర్ముజ్ జలసంధి తమ భద్రత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని టెహ్రాన్ చెబుతోంది.ట్రంప్ ఎదురుదాడి.. ‘పరిహారం మాకే రావాలి’ఇరాన్ డిమాండ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యుద్ధంలో అమెరికన్ల ప్రాణ నష్టానికి, గత ఘర్షణల్లో జరిగిన నష్టాలకు ఇరాన్ బాధ్యత వహించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నుంచి పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు అమెరికా పరిహారం చెల్లించాలన్న డిమాండ్ను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. గతంలో ఇరాన్ చర్యల వల్ల అమెరికా ఎదుర్కొన్న నష్టాలను ప్రస్తావిస్తూ.. బాధ్యత టెహ్రాన్పైనే ఉందని వాదిస్తున్నారు.ఆంక్షలతో ఒత్తిడి పెంచాలన్న అమెరికా వ్యూహంప్రస్తుతం ఇరాన్పై సైనిక చర్యల కంటే ఆర్థిక ఒత్తిడి పెంచడంపైనే అమెరికా దృష్టి పెట్టిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం అయితే ఇరాన్ చర్చలకు రావాల్సి వస్తుందని ట్రంప్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇరాన్ మాత్రం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఆంక్షలు తమను బలహీనపర్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమని ఆరోపిస్తూ.. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో పోరాడతామని స్పష్టం చేస్తోంది.ప్రపంచానికి ఎందుకు కీలకం హర్ముజ్?పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్తో కలిపే సన్నని సముద్ర మార్గమే హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో ఇది అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. మధ్యప్రాచ్యం నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి ఇంధన సరఫరా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. హర్ముజ్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంధన సరఫరాలో అనిశ్చితి ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్–అమెరికా వివాదంలో హర్ముజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారింది.ట్రంప్పై ఎన్నికల ఒత్తిడి.. ఇరాన్కు కలిసొస్తుందా?అమెరికాలో రాజకీయ పరిణామాలు కూడా ఈ సంక్షోభంపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్తో దీర్ఘకాలిక ఘర్షణ కొనసాగితే దేశీయంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ అమెరికా అధికారి చార్లెస్ కుప్చాన్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ఒత్తిడి కారణంగా చర్చల్లో ఇరాన్కు కొంత వ్యూహాత్మక ఆధిక్యం లభించే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో టెహ్రాన్ చేస్తున్న డిమాండ్లు అమెరికాకు అంగీకరించలేని స్థాయిలో ఉన్నాయని ఆయన విశ్లేషించారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుఇరాన్–అమెరికా వివాదం ప్రభావం పశ్చిమాసియాలో ఇతర ప్రాంతాలపైనా కనిపిస్తోంది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా.. యెమెన్లో హౌతీ దళాల చర్యలు పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. గాజా శాంతి ప్రయత్నాలపైనా అనిశ్చితి కొనసాగుతోంది.హర్ముజ్ తాళం ఎవరి చేతిలో?ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య అసలు పోరు కేవలం పరిహారం, ఆంక్షల అంశానికే పరిమితం కాలేదు. ఇది మిడిల్ఈస్ట్లో ఆధిపత్యం, భద్రత, ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపే పెద్ద సంక్షోభంగా మారింది.ఇరాన్ తన డిమాండ్లపై పట్టుబడుతుండగా.. ట్రంప్ కూడా వెనక్కి తగ్గే సూచనలు ఇవ్వడం లేదు. చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా? లేదంటే హర్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచ సంక్షోభానికి కేంద్రంగా మారుతుందా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. -
సింపుల్.. ఈ 7 టిప్స్ పాటిస్తే వందేళ్లు బతికేయొచ్చు!
మనిషి వందేళ్లు జీవించాలనే కల ఎప్పటినుంచో ఉంది. కానీ మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఆ కల అందరికీ సులభంగా నెరవేరడం లేదు. అయితే ఆరోగ్యంగా, చురుగ్గా శతాధిక వయసు దాటిన ఓ బామ్మ మాత్రం సుదీర్ఘ జీవితానికి పెద్ద పెద్ద రహస్యాలు అవసరం లేదంటోంది. రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లే ఆరోగ్యానికి పునాది అని బంగారు మాట చెబుతోంది.ఆమె వయసు 111 ఏళ్లు. ఇంకా ఆరోగ్యంగానే ఉంది. ఉత్సాహంగా, చురుగ్గా ఉన్న ఈ బామ్మ జీవన విధానం నెట్టింట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వయసు పెరిగినా.. శరీరాన్ని కదిలిస్తూ ఉండటమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెబుతోంది. అంతేకాదు.. తాను పాటించే ఏడు సూత్రాలే తన దీర్ఘాయుష్షుకు కారణమని చెబుతున్నారు. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం, పరిమితంగా ఆహారం తీసుకోవడం, ప్రశాంతమైన మనసుతో జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని ఆమె నమ్మకం.తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని రుగావో ప్రాంతానికి చెందిన వాంగ్ గైయింగ్ అనే ఈ బామ్మ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచారు. వందేళ్లు దాటిన వారి సంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతంగా రుగావోకు పేరుంది. ఐదు తరాల కుటుంబంతో కలిసి జీవిస్తున్న వాంగ్.. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పొలాల్లో పనులకు సాయం చేసేవారు. వేరుశెనగలు, పుచ్చకాయల కోత వంటి పనుల్లో పాల్గొనేవారు.ప్రస్తుతం వయసు కారణంగా పనులు తగ్గించినా.. ఇంట్లో చిన్న చిన్న పనులు మాత్రం స్వయంగా చేసుకుంటారు. టేబుళ్లు తుడవడం, బట్టలు మడతపెట్టడం వంటి పనులను వ్యాయామంగా భావిస్తారు. “శరీరం కదులుతూ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది” అనేది ఆమె నమ్మకం.ఆహారంలోనూ అదే సూత్రంవాంగ్ ఎప్పుడూ కఠినమైన డైట్ను పాటించలేదు. అన్ని రకాల ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడమే తన అలవాటు అని చెబుతారు. కుడుములు, ఆవిరితో ఉడికించిన బన్స్ వంటి సాధారణ ఆహారాలతో పాటు చేపలు ఆమెకు ఎంతో ఇష్టం. జీర్ణం కావడానికి సులభంగా ఉండటంతో చేపలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఎంత ఇష్టమైన ఆహారమైనా అతిగా తినకూడదనేది ఆమె సూత్రం.కోపానికి దూరం.. ప్రశాంతతకు దగ్గరదీర్ఘాయుష్షుకు ఆహారం మాత్రమే కారణం కాదని వాంగ్ చెబుతారు. మంచి మనసు, ప్రశాంతమైన ఆలోచనలు కూడా ఎంతో ముఖ్యమని అంటారు. ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలని ఆమెకు ఓ నియమం ఉంది. అది కుటుంబ సభ్యులను అభినందించడం కావచ్చు.. పాత స్నేహితుడికి ఓ మెసేజ్ పంపడం కావచ్చు. ఎవరితోనైనా గొడవ జరిగినా ఎక్కువసేపు ఆలోచిస్తూ బాధపడకుండా నిద్రపోతే ఉదయం అంతా సర్దుకుంటుందని ఆమె నమ్మకం.12 గంటల నిద్ర.. క్రమబద్ధమైన జీవనంవాంగ్ రోజువారీ జీవితం కూడా చాలా క్రమబద్ధంగా ఉంటుంది. రాత్రి 7 గంటలకే నిద్రకు వెళ్లి.. ఉదయం 7 గంటలకు నిద్ర లేస్తారు. మధ్యాహ్నం ఒకటి లేదా రెండు చిన్న కునుకులు కూడా తీసుకుంటారు. ఆమె జీవన విధానం చూస్తే.. దీర్ఘాయుష్షు కోసం ఖరీదైన పద్ధతులు, ప్రత్యేక మందులు అవసరం లేదని తెలుస్తోంది. శరీరాన్ని చురుగ్గా ఉంచడం, పరిమితంగా తినడం, ప్రశాంతంగా జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేస్తాయని ఈ 111 ఏళ్ల బామ్మ చెబుతోంది. వయసు పెరగడం సహజం.. కానీ ఆరోగ్యంగా, ఆనందంగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించడం మన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందేమో!బామ్మ చెప్పిన జీవన రహస్యాల్లో ప్రధానంగా 7 పాయింట్లు.. 1. బద్ధకించకూడదుబద్ధకం ఏ వయసు వాళ్లకైనా మంచిది కాదు. వయసు పెరిగినా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. ఇంటి పనులు కూడా ఒకరకంగా వ్యాయామమే!.2. బ్యాలెన్స్డ్ ఫుడ్సుదీర్ఘమైన ఆయుషు కోసం కఠినమైన డైట్ లాంటి వేవీ అక్కర్లేదు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం.3.అతిగా తినకూడదుఇష్టమైన ఆహారం అయినా మితంగా తీసుకోవాలన్నది ఆమె సూత్రం.4. సులభంగా జీర్ణమయ్యే ఆహారానికి ప్రాధాన్యంఈ తరహా ఆహారం.. ఆరోగ్యానికి మంచివి5. మంచి మనసుతో జీవించాలిప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలన్నది ఆమె అలవాటు.6. కోపం, ఆందోళనకు దూరంగా ఉండాలిసమస్యలను ఎక్కువగా మదిలో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండటం.7. క్రమబద్ధమైన నిద్ర అలవాటురాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం.. మధ్యలో విశ్రాంతి తీసుకోవడం. అది ఏడు గంటలా?, 8 గంటలా? అనేది మీ ఇష్టం.కొసమెరుపు.. వాంగ్ గైయింగ్ నివసించే రుగావో ప్రాంతం దీర్ఘాయుష్షుకు పేరుగాంచింది. అక్కడ 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు గణనీయంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ప్రాంతంలో 672 మంది శతాధికులు (100 ఏళ్లు దాటిన వారు) ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ ప్రాంత ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు దీర్ఘాయుష్షుకు కారణాల్లో ఒకటిగా పరిశోధకులు భావిస్తున్నారు. -
ఇరాన్ను లొంగదీసుకునేందుకు మరో మాస్టర్ప్లాన్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు చేస్తూ.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచుతున్న ఆయన తీరు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. “ఇది యుద్ధం కాదు.. చెస్ గేమ్ లాంటిది” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన వ్యూహానికి అద్దం పడుతున్నాయి. సైనిక చర్యల కంటే ముందుగా ఆర్థిక ఒత్తిడి, ఆంక్షలు, దౌత్యపరమైన ఎత్తుగడలతో ఇరాన్ను చర్చల బాట పట్టించాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఇరాన్తో అమెరికా ప్రస్తుతం “పాక్షిక చర్చలు మాత్రమే” జరుపుతోందని ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. “ఇరాన్లో భారీ ద్రవ్యోల్బణం ఉంది. వారి వద్ద డబ్బు లేదు. మేం పరిస్థితిని గమనిస్తున్నాం” అని ట్రంప్ పేర్కొన్నట్లు అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ తెలిపింది.వెంటనే మరో సైనిక చర్యకు దిగకుండా.. ఇరాన్ ఆర్థిక పరిస్థితిని మరింత ఒత్తిడికి గురిచేసే విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇటీవల ఇరాన్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు మాట మార్చడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక, రాజకీయ ప్రభావాలను అంచనా వేసుకుంటూనే.. ఒత్తిడి ద్వారా ఫలితం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఓసారి దాడుల మాట.. మరోసారి చర్చల బాట!ట్రంప్ విదేశాంగ విధానంలో ఈ మార్పు కొత్తది కాదు. ప్రత్యర్థి దేశాలపై గరిష్ఠ ఒత్తిడి తీసుకురావడం.. ఆ తర్వాత చర్చలకు మార్గం సుగమం చేయడం ఆయన శైలిలో కనిపించే అంశం. ఇరాన్ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు సైనిక శక్తిని ప్రదర్శిస్తూ హెచ్చరికలు చేయడం.. మరోవైపు చర్చలకు అవకాశం ఉందని చెప్పడం ద్వారా టెహ్రాన్పై మానసిక ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందని అంచనాలు ఉన్నాయి.“ఇది చెస్ ఆట లాంటిది. చివరకు అంతా సర్దుకుంటుంది” అని ట్రంప్ చెప్పడం కూడా ఈ వ్యూహాన్నే సూచిస్తోంది. చమురు ధరలు తగ్గుతున్నాయని, దీంతో యుద్ధ ప్రభావం అమెరికా ప్రజలపై పెద్దగా పడటం లేదని ఆయన పేర్కొన్నారు.మారిన సమీకరణాలుఅమెరికా–ఇరాన్ వివాదం కొత్తది కాదు. ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ మొదలైన వివాదం.. ఆంక్షలు, చమురు ఎగుమతులు, ప్రాంతీయ ఆధిపత్య పోరు వరకు విస్తరించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రధాన పట్టు హర్ముజ్ జలసంధిపై ఉంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.హర్ముజ్ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే అమెరికా ముందుగా నౌకాదళ ఆంక్షలు, చమురు ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, కానీ మధ్యవర్తుల ద్వారా చర్చలకు అనుకూల వాతావరణం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.అదసలు సాధ్యమేనా?ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి అమెరికాకు కొత్త వ్యూహం కాదు. దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. చమురు ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆంక్షలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేశాయి. అయితే ఇరాన్ను పూర్తిగా లొంగదీయడం మాత్రం అంత సులభం కాలేదు. ఆంక్షల మధ్య కూడా చైనా వంటి దేశాలకు చమురు విక్రయించడం, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు అనుసరించడం ద్వారా టెహ్రాన్ కొంతవరకు నష్టాన్ని భర్తీ చేసుకుంటోంది.అంటే.. ఆంక్షలు ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, అవి ఇప్పటివరకు ఆ దేశాన్ని పూర్తిగా అమెరికా షరతులకు తలొగ్గే స్థాయికి తీసుకురాలేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ట్రంప్ ఆర్థిక ఒత్తిడితో పాటు దౌత్యపరమైన ఒత్తిడిని కూడా కలిపి ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.ట్రంప్కు నెతన్యాహూ షాక్ఇదిలా ఉండగా.. గాజా అంశంలో అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ పూర్తిగా ఆయుధాలు పక్కన పెట్టేంత వరకు గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ ఉండదని నెతన్యాహూ స్పష్టం చేశారు. ఈ అక్టోబర్లో ఇజ్రాయెల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తన దేశ ప్రజల ముందు తాను కఠిన వైఖరినే కొనసాగిస్తున్నానని చూపించుకోవాల్సిన రాజకీయ ఒత్తిడి కూడా ఆయనపై ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.హౌతీల దాడులతో మరింత ఉద్రిక్తతమరోవైపు యెమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని అల్-మఖా పోర్టుపై దాడి చేశారు. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు సమాచారం. హౌతీల చర్యలు, హార్ముజ్ వివాదం, గాజా యుద్ధ పరిణామాలు కలిసి మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి.ట్రంప్ వ్యూహం ఫలిస్తుందా?ఇరాన్తో ఘర్షణను పూర్తిస్థాయి యుద్ధంగా మార్చకుండా.. ఆర్థిక ఒత్తిడి, చర్చలు, వ్యూహాత్మక బెదిరింపులతో తన లక్ష్యాలను సాధించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. అణు కార్యక్రమం, చమురు ఆంక్షలు, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ ఆడుతున్న ఈ ‘చెస్ గేమ్’లో ఇరాన్ చివరకు ఏ ఎత్తు వేస్తుంది? లేదంటే ఈ వ్యూహం మరోసారి పశ్చిమాసియా యుద్ధం అంచులకు తీసుకెళ్తుందా?.. రాబోయే రోజుల్లోనే తెలిసేది. -
కిమ్ వింత సలహా!.. ఏంటో తెలుసా?
ఉత్తర కొరియాలో మండుతున్న ఎండలు ఇప్పుడు మరో ఆసక్తికర చర్చకు దారితీశాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ప్రజలు వేడిని తట్టుకునేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఓ వింత సలహా ఇచ్చారు!. ఆయన సూచన మేరకు.. ప్రజలంతా కుక్క మాంసం సూప్ తినాలని అక్కడి ప్రభుత్వ మీడియా సూచిస్తోంది. అంతేకాదు దీనిని సంప్రదాయ ఆరోగ్య ఆహారంగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తోంది.ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో ఇటీవల ఉష్ణోగ్రతలు 36.7 డిగ్రీల సెల్సియస్ (98.1 ఫారెన్హీట్)కు చేరుకున్నాయి. దీంతో వేసవి వేడిని ఎదుర్కొనే ఆహారాలపై అధికార పార్టీ పత్రిక రోడాంగ్ సిన్మున్ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. పుచ్చకాయ, దోసకాయలు, చేపల గంజి, పెసరపప్పు వంటి చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలతో పాటు.. డాంగోగి (కుక్క మాంసం) సూప్ను కూడా "పోషకాహారం"గా పేర్కొంది.‘వేడి వేడితోనే పోతుంది’.. పాత నమ్మకంకొరియన్ సంస్కృతిలో కొన్ని ప్రాంతాల్లో కుక్క మాంసాన్ని గతంలో నుంచి బలాన్నిచ్చే ఆహారంగా భావించే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా వేసవిలో అత్యంత వేడి రోజులుగా భావించే సాంబోక్ (Dog Days of Summer) సమయంలో దీనిని తినే ఆచారం ఉందని చెబుతారు. "వేడిని వేడితోనే జయించాలి" అనే నమ్మకంతో కుక్క మాంసం సూప్ శరీరానికి శక్తినిస్తుందని కొందరు విశ్వసిస్తారు.అసలు శాస్త్రీయ నిజం ఏమిటి?కుక్క మాంసం తింటే శరీరంలోని వేడి తగ్గుతుందని లేదంటే ఎండ వేడిని ప్రత్యేకంగా తట్టుకునే శక్తి వస్తుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఇతర మాంసాహారాల మాదిరిగానే ఇందులో ప్రోటీన్, కొవ్వు, కొన్ని పోషకాలు ఉండవచ్చు. అవి శరీరానికి శక్తిని అందించవచ్చు. కానీ తీవ్రమైన ఎండలో శరీరాన్ని చల్లబరచడానికి ప్రధానంగా అవసరమయ్యేవి మాత్రం తగినంత నీరు తాగడం, ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉంచుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం అని వైద్య నిపుణులు చెబుతారు. వేసవిలో అధిక కొవ్వు, బరువైన ఆహారాలు కొందరిలో జీర్ణ సమస్యలు కూడా కలిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.సంప్రదాయమా? ప్రచారమా?కుక్క మాంసాన్ని వేసవి ఆహారంగా ప్రచారం చేయడం వెనుక కేవలం ఆరోగ్య నమ్మకం మాత్రమే కాకుండా.. ఉత్తర కొరియా ప్రభుత్వ ప్రచార కోణం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల సంప్రదాయాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం స్థానిక సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అదే సమయంలో కఠిన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలకు "పరిష్కారాలు" చూపిస్తున్నామనే సందేశాన్ని కూడా ఇవ్వాలనుకుంటోంది.కిమ్ ఇమేజ్కు మరో ప్రచారంవేసవి వేడి నేపథ్యంలో ఉత్తర కొరియా మీడియా మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ ప్రజల కోసం కష్టపడే నాయకుడిగా చూపించే కథనాలను కూడా ప్రసారం చేస్తోంది. గతంలో తీవ్రమైన ఎండలు, వర్షాలను లెక్కచేయకుండా నిర్మాణ పనులను పరిశీలించారని, ప్రజల సంక్షేమం కోసం పనిచేశారని అధికారిక మీడియా పేర్కొంది. ఇప్పుడు ఆయన ఈ సలహా ఇచ్చారంటూ ప్రచారం చేస్తోంది.ప్రపంచవ్యాప్తంగా చర్చఉత్తర కొరియా సూచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఒకవైపు ఇది అక్కడి సంప్రదాయ ఆహార సంస్కృతిలో భాగమని కొందరు చెబుతుండగా.. మరోవైపు ఆధునిక వైద్య శాస్త్రం మాత్రం దీన్ని వేడిని తగ్గించే ప్రత్యేక పరిష్కారంగా గుర్తించడం లేదు. రికార్డు వేడి వేళ కిమ్ సర్కార్ ఇచ్చిన ఈ సలహా.. సంప్రదాయం, నమ్మకం, శాస్త్రం మధ్య చర్చకు తెరలేపింది. -
భారత్పై 100 శాతం టారిఫ్.. తిప్పలు అమెరికాకే?
రష్యా చమురు వంకతో.. భారత్, చైనాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదన అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయం అమెరికా ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుందని రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ హెచ్చరించారు. భారీ టారిఫ్లు విధించడం అంటే.. స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించారు.రష్యాపై ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై అమెరికా సెనేట్లో చర్చ సందర్భంగా భారత్, చైనాల నుంచి వచ్చే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే సెనేట్ ఆమోదం పొందడంతో.. నెక్స్ట్ ప్రతినిధుల సభ వద్దకు వెళ్తుంది. ఆ తర్వాత ట్రంప్ దాని మీద సంతకం చేస్తే.. అమల్లోకి వస్తుంది. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా స్పందించిన సెనేటర్ రాండ్ పాల్.. ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.“భారం అమెరికన్లపైనే పడుతుంది”టారిఫ్ల వల్ల విదేశీ కంపెనీలే నష్టపోతాయన్న ట్రంప్ వాదనను రాండ్ పాల్ కొట్టిపారేశారు. దిగుమతి సుంకాల అసలు భారం అమెరికా దిగుమతిదారులు, వినియోగదారులపైనే పడుతుందని అన్నారు. ఇప్పటికే జీవన వ్యయాల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లపై మరింత భారం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.Breaking: "America imposing 100% tariffs on India and China is the economic equivalent of shooting ourselves in the foot," warns US Senator Rand Paul pic.twitter.com/C2GvQOg3HY— Shashank Mattoo (@MattooShashank) August 8, 2026“100 శాతం టారిఫ్లు విధించడం ఆర్థికంగా మన కాళ్లపై మనమే తుపాకీతో కాల్చుకున్నట్లే” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నిర్ణయాలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.భారత్తో సంబంధాలపై ప్రభావం?భారత్ అమెరికాకు కీలక భాగస్వామి అని పేర్కొన్న రాండ్ పాల్.. ఇలాంటి భారీ సుంకాలు రెండు దేశాల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని సూచించారు. సెనేటర్ రాన్ వైడెన్ కూడా ఈ టారిఫ్ ప్రతిపాదనలపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం.రష్యా చమురు కొనుగోళ్లే కారణంరష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ టారిఫ్ ప్రతిపాదన తీసుకొచ్చారు. భారత్, చైనాలతో పాటు రష్యా ఇంధన వాణిజ్యానికి సహకరిస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఇచ్చేలా బిల్లు రూపొందించారు. ఈ బిల్లు అమెరికా సెనేట్లో 86-11 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే ఇది చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ ఆమోదం పొందాల్సి ఉంది.ట్రంప్ విధానాలపై చర్చగతంలో కూడా రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేయడాన్ని కారణంగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 25 శాతం టారిఫ్లు విధించారు. అయితే విస్తృత వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాల నేపథ్యంలో తర్వాత వాటిని సడలించారు.ప్రస్తుతం 100 శాతం టారిఫ్ల ప్రతిపాదన మళ్లీ తెరపైకి రావడంతో భారత్పై ప్రభావం కంటే.. అమెరికా వినియోగదారులపై పడే భారం, రెండు దేశాల సంబంధాలపై దాని ప్రభావంపై చర్చ మొదలైంది. -
షేక్ హసీనాకు బిగ్ సర్ప్రైజ్!
అధికారం కోల్పోయి దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన తర్వాత.. రాజకీయ భవిష్యత్పై దృష్టి పెట్టిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు అనూహ్య పరిణామం ఎదురైంది. భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తానంటూ ఆమె చేసిన ప్రకటనతో బంగ్లాదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ సమయంలో ఆమెను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ శిబిరం నుంచి వచ్చిన ఓ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది హసీనాకు బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు.. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకవైపు అవామీ లీగ్(Awami League) అధినేత్రి, మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి దేశానికి వస్తానని ప్రకటించగా.. మరోవైపు ఆమె ప్రధాన ప్రత్యర్థి అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నుంచి వచ్చిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ సమీకరణాలపై చర్చకు దారితీశాయి. బీఎన్పీకి చెందిన ఓ ఎంపీ.. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ను శత్రువుగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.‘అవామీ లీగ్ శత్రువు కాదు.. మిత్రులం’బీఎన్పీ ఎంపీ నసీర్ ఉద్దీన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. అవామీ లీగ్ తమకు శత్రువు కాదని, అది తమ మిత్రపక్షమని అన్నారు. “అవామీ లీగ్ మా శత్రువు కాదు. వారు మా మిత్రులు. 1971 విమోచన పోరాటంలో కలిసి పనిచేశాం. భవిష్యత్లో అవామీ లీగ్ బీఎన్పీలో విలీనం కావచ్చు” అని ఆయన వ్యాఖ్యానించిచారు.దశాబ్దాల రాజకీయ వైరంబీఎన్పీ, అవామీ లీగ్ మధ్య పోరు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత తీవ్రమైన ప్రత్యర్థిత్వాల్లో ఒకటి. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుటుంబం ఆధిపత్యంలోని బీఎన్పీ దశాబ్దాలుగా అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణ, ప్రజాస్వామ్యం, పాలన విధానం, భద్రతా అంశాలపై రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపణలు చేయడం, రాజకీయ నిరసనలు, అరెస్టులు వంటి పరిణామాలు తరచూ చోటుచేసుకున్నాయి. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న సమయంలో బీఎన్పీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అయితే ఈ వ్యాఖ్యలు బీఎన్పీ అధికారిక వైఖరిని ప్రతిబింబిస్తున్నాయా? లేదంటే ఎంపీ వ్యక్తిగత అభిప్రాయమా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే బీఎన్పీలోని పలువురు నేతలు గతంలో అవామీ లీగ్పై తీవ్ర విమర్శలు చేశారు.ఇతర రాజకీయ శక్తుల పాత్ర ఏమిటి?బంగ్లాదేశ్ రాజకీయాలు ప్రధానంగా అవామీ లీగ్, బీఎన్పీ చుట్టూనే తిరిగినప్పటికీ.. ఇతర రాజకీయ శక్తులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ పార్టీ (బంగ్లాదేశ్) ఒకప్పుడు దేశ రాజకీయాల్లో మూడో ప్రధాన శక్తిగా ఎదిగింది. మాజీ సైనిక పాలకుడు హుస్సేన్ మహమ్మద్ ఎర్షాద్ స్థాపించిన ఈ పార్టీ గతంలో పలు ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చింది.ఇటీవలి సంవత్సరాల్లో విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో కొత్త రాజకీయ శక్తులు కూడా తెరపైకి వచ్చాయి. సంప్రదాయ అవామీ లీగ్, బీఎన్పీలకు భిన్నంగా యువత, సంస్కరణలు, కొత్త రాజకీయ వ్యవస్థపై దృష్టి పెట్టే వర్గాలు ప్రాధాన్యం పొందుతున్నాయి. అయితే జాతీయ స్థాయి అధికారం కోసం ఇప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఎన్పీ–అవామీ లీగ్ మధ్యే కొనసాగుతోంది.ఢిల్లీ నుంచి హసీనా కీలక ప్రకటన2024లో జరిగిన విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో దాదాపు రెండేళ్ల తర్వాత తొలిసారి బహిరంగంగా మాట్లాడిన హసీనా.. ఈ ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వస్తానని ప్రకటించారు.1971 విమోచన యుద్ధ వార్షికోత్సవ సమయంలో స్వదేశానికి చేరుకుంటానని ఆమె పేర్కొన్నారు. తన రాజకీయ పోరాటం కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు.హసీనా ప్రకటనపై తీవ్ర స్పందనలుఅయితే హసీనా తిరిగి వస్తానన్న ప్రకటనపై బంగ్లాదేశ్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత బీఎన్పీ ప్రభుత్వం గతంలో హసీనా పాలనపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమెపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించాలని ఢాకా భారత్ను కోరింది. భారత్ నుంచి హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.బీఎన్పీలో భిన్న స్వరాలుఒకవైపు కొందరు బీఎన్పీ నేతలు హసీనాపై తీవ్ర విమర్శలు చేస్తుండగా.. మరోవైపు నసీర్ ఉద్దీన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు భిన్నమైన చర్చకు తెరలేపాయి. హసీనా, అవామీ లీగ్ భవిష్యత్పై బంగ్లాదేశ్లో రాజకీయ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి.కొత్త రాజకీయ సమీకరణాలా?ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయాలు మూడు అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. హసీనా నిజంగా డిసెంబర్లో తిరిగి వస్తారా? అవామీ లీగ్కు రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? బీఎన్పీ వైఖరిలో మార్పు వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే స్పష్టమవుతుంది. అయితే ఇప్పటివరకు ప్రత్యర్థిగా ఉన్న అవామీ లీగ్పై బీఎన్పీ ఎంపీ చేసిన “శత్రువు కాదు.. మిత్రులు” అన్న వ్యాఖ్య మాత్రం షేక్ హసీనా శిబిరంలో కొత్త ఆశలు రేకెత్తించే పరిణామంగా మారింది. -
ట్రంప్కు మరో షాక్.. కోర్టు తీర్పుతో కొత్త చిక్కులు!
అమెరికా న్యాయస్థానాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వరుస షాకులు ఇస్తున్నాయి. తాజాగా.. ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైట్హౌస్ బాల్రూమ్ ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఈ భారీ నిర్మాణాన్ని కొనసాగించేందుకు అధ్యక్షుడికి ఏకపక్ష అధికారం లేదని అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది. దీంతో 400 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,400 కోట్లకు పైగా) వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుపై తాత్కాలికంగా బ్రేక్ పడింది.వైట్హౌస్ ఈస్ట్ వింగ్ ఉన్న ప్రాంతంలో సుమారు 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ బాల్రూమ్ను నిర్మించాలని ట్రంప్ నిర్ణయించారు. దాదాపు 999 మంది అతిథులు ఒకేసారి పాల్గొనేలా ఈ హాల్ను నిర్మించాలన్నది ప్రణాళిక. దీనిని ఆయన తన కలల ప్రాజెక్ట్గా భావిస్తున్నారు. అయితే చారిత్రక భవన పరిరక్షణ సంస్థలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. వైట్హౌస్ నిర్మాణ రూపకల్పనలో ఇంత పెద్ద మార్పు చేయాలంటే చట్టపరమైన అనుమతులు అవసరమని వాదించాయి.కాంగ్రెస్ అనుమతి కంపల్సరీ!వాషింగ్టన్ డీసీ సర్క్యూట్ అప్పీల్ కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం 2-1 మెజారిటీతో ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. “భారీ బాల్రూమ్ నిర్మించాలా వద్దా అన్నది కాంగ్రెస్ నిర్ణయించాల్సిన విషయం. కార్యనిర్వాహక అధికారంతో స్వయంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు” అని కోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పు బాల్రూమ్ నిర్మాణం పూర్తిగా నిలిచిపోవాలని చెప్పడం కాదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అనుమతి పొందిన తర్వాత నిర్మాణం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది.ట్రంప్ ఆగ్రహం..ఇంతకుముందు నిర్మాణాన్ని నిలిపివేయాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తనను వ్యతిరేకించే న్యాయమూర్తులు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైట్హౌస్ భద్రత కోసం ఈ ప్రాజెక్టు అవసరమని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. డ్రోన్లు, క్షిపణులు, జీవాయుధ ముప్పుల నుంచి అధ్యక్షుడు, ఆయన కుటుంబం, సిబ్బంది రక్షణ కోసం ఆధునిక భద్రతా ఏర్పాట్లు ఇందులో భాగమని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.భద్రత పేరుతో నిర్మాణం కొనసాగించలేరు..అయితే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న సంస్థలు ఈ వాదనలను తోసిపుచ్చాయి. బాల్రూమ్ లేకపోవడం జాతీయ భద్రతా అత్యవసర పరిస్థితి కాదని పేర్కొన్నాయి. కోర్టు కూడా భద్రతకు సంబంధించిన భూగర్భ పనులను కొనసాగించేందుకు అనుమతించింది. బంకర్లు, ఇతర భద్రతా సదుపాయాల నిర్మాణానికి మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేసింది.ఇప్పుడేం జరగనుంది?అప్పీల్ కోర్టు తన తీర్పు అమలును రెండు వారాల పాటు నిలిపివేసింది. ఈ సమయంలో ట్రంప్ ప్రభుత్వం అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 70 ఏళ్లకు పైగా వైట్హౌస్లో అతిపెద్ద నిర్మాణ మార్పుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు కోర్టు, కాంగ్రెస్ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ట్రంప్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు న్యాయస్థానం బ్రేక్ వేయడంతో.. ఇది ఆయన పాలనలో మరో కీలక న్యాయపోరాటంగా మారింది. -
అమెరికానే కాపాడలేకపోయింది.. ఇంక పాక్-టర్కీ ఏం చేస్తాయి?
పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలకు సంకేతంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మూడు దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక దేశంపై దాడిని మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించేలా రూపొందించిన ఈ రక్షణ కూటమి.. సౌదీ భద్రతా వ్యూహంలో కీలక మార్పుగా మారింది. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.టర్కీ, పాకిస్థాన్తో చేసుకున్న రక్షణ ఒప్పందాలు సౌదీ అరేబియాకు శాశ్వత భద్రతను అందించలేవని ఇరాన్ విమర్శించింది. అమెరికానే కాపాడలేకపోతోంది.. ఇంక పాక్ టర్కీలు వచ్చి ఏం చేస్తాయి?.. ఏం సాధిస్తాయి? అంటూ డీల్పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల కమిషన్ సభ్యుడు ఎబ్రహీం రెజాయీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘కాగితపు ఒప్పందాలతో భద్రత రాదు’సోషల్ మీడియా వేదికగా స్పందించిన రెజాయీ.. “టర్కీ, పాకిస్థాన్తో కుదుర్చుకున్న కాగితపు ఒప్పందాలు సౌదీకి భద్రతను తీసుకురావు. అమెరికాతో ఎన్నో ఏళ్లుగా కొనసాగించిన సంబంధాలు కూడా సౌదీకి భద్రత ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు. సౌదీ తన విధానాలను మార్చుకుంటే ఇతర దేశాల నుంచి భద్రత కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. గతంలో సౌదీ భద్రత కోసం అమెరికాపై ఆధారపడిన తీరును ప్రస్తావిస్తూ ఇరాన్ ఈ విమర్శలు చేసింది.మక్కా వేదికగా మూడు దేశాల డిఫెన్స్ డీల్అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి భద్రతా వ్యూహాలను రూపొందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.ఒకరిపై దాడి.. ముగ్గురిపై దాడిగానే!ఈ రక్షణ ఒప్పందంలోని కీలక అంశం పరస్పర భద్రత. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించేలా నిబంధనలు రూపొందించారు. దాడి జరిగిన సమయంలో పరస్పర సహకారం, రక్షణ రంగంలో సమన్వయం పెంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మూడు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.సౌదీ ఎందుకు కొత్త రక్షణ భాగస్వామ్యాల వైపు?ఇరాన్తో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరిస్తోంది. గతంలో సౌదీ చమురు కేంద్రాలు, కీలక మౌలిక వసతులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్లోని మిలీషియా గ్రూపులు ఉన్నాయని సౌదీ ఆరోపించింది. దీంతో భద్రత విషయంలో కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవాలని రియాద్ భావిస్తోంది.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం ప్రభావితమవడం వంటి పరిణామాలు కూడా ఈ రక్షణ ఒప్పందానికి కారణాలుగా మారాయి.భారత్-పాక్ కోణంలోనూ చర్చఈ ఒప్పందం మరో కోణంలోనూ చర్చకు దారితీస్తోంది. ఒకవేళ భవిష్యత్లో పాకిస్థాన్పై భారత్ సైనిక చర్య చేపడితే ఈ రక్షణ ఒప్పందం ఎలా ప్రభావితం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందంలోని పరస్పర రక్షణ నిబంధన ప్రకారం.. పాకిస్థాన్పై జరిగే దాడిని మిగిలిన దేశాలు ఎలా పరిగణిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి రక్షణ ఒప్పందాల్లో ప్రతిస్పందన విధానం, సైనిక సహాయం, దౌత్య మద్దతు వంటి అంశాలు ఆయా దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఆ లెక్కన.. ఈ ఒప్పందం ఉన్నంత మాత్రాన సౌదీ అరేబియా, టర్కీ వెంటనే ఏదైనా ఘర్షణలోకి దిగాల్సిందేనని స్పష్టమైన హామీ లేదు.మారుతున్న సమీకరణాలుపాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు సౌదీ తన భద్రతా వ్యవస్థను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల కొత్త రక్షణ కూటమి భవిష్యత్లో పశ్చిమాసియా శక్తి సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
బిల్లు పాస్.. భారత్పై ట్రంప్ 100% టారిఫ్ అస్త్రం!
ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు అందుతున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇచ్చే బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లలోనే కాకుండా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లోనూ చర్చకు దారితీసింది.రష్యా ఇంధన ఆదాయాన్ని తగ్గించడం ద్వారా మాస్కోపై ఒత్తిడి పెంచాలన్నది అమెరికా వ్యూహం. అయితే ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలు కొత్త ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది.ఏమిటీ రష్యా శాంక్షన్స్ బిల్లు?అమెరికా సెనేట్ ఆమోదించిన ఈ బిల్లు పేరు “లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026”. రష్యా చమురు, గ్యాస్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని తగ్గించడం, ఉక్రెయిన్పై యుద్ధానికి ఉపయోగపడుతున్న ఆర్థిక వనరుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.ఈ బిల్లు సెనేట్లో 86-11 ఓట్లతో భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. ఇక ఇది అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అధ్యక్షుడు ట్రంప్ సంతకం తర్వాత ఇది చట్టంగా మారనుంది.అయితే.. ఈ బిల్లు పేరులో ఇరాన్ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిణామాల్లో ప్రధాన దృష్టి రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవడంపైనే ఉంది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్లు విధించే అధికారం ట్రంప్కు ఇవ్వడమే ఈ బిల్లులో అత్యంత కీలక అంశంగా మారింది.రష్యా ఇంధనం కొనే దేశాలపై టారిఫ్ పిడుగురష్యా చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా మాస్కో ఆదాయానికి గండికొట్టాలని అమెరికా భావిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా ఇంధనాన్ని అత్యధికంగా కొనుగోలు చేసే టాప్ ఐదు దేశాలపై అమెరికా అధ్యక్షుడికి 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారం లభిస్తుంది.అంటే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించే దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. దీంతో ఇంధన కొనుగోళ్ల అంశం కేవలం ఆర్థిక వ్యవహారంగా కాకుండా అంతర్జాతీయ దౌత్య అంశంగా మారనుంది.భారత్, చైనాలపైనే ఎందుకు గురి?ప్రస్తుతం రష్యా చమురు, గ్యాస్కు అతిపెద్ద కొనుగోలుదారుల జాబితాలో చైనా, భారత్, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా ఉన్నాయి. ఈ దేశాల ఇంధన కొనుగోళ్లే రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలక మద్దతుగా మారాయని అమెరికా వాదిస్తోంది.2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత పాశ్చాత్య దేశాలు మాస్కోపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే రష్యా చమురు తక్కువ ధరకు లభించడంతో భారత్, చైనా వంటి దేశాలు కొనుగోళ్లను కొనసాగించాయి. దీంతో రష్యా ఇంధన ఆదాయాన్ని పూర్తిగా నిలువరించాలన్న అమెరికా ప్రయత్నాల్లో ఈ దేశాలు ప్రధానంగా మారాయి.భారత్కు అసలు పరీక్ష ఎక్కడ?రష్యా చమురు భారత్కు గత కొన్నేళ్లుగా కీలక ఇంధన వనరుగా మారింది. తక్కువ ధరకు ముడి చమురు లభించడం వల్ల దేశ ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో ఇది ఉపయోగపడుతోంది. 2026 జూన్లో భారత్ రష్యా ముడి చమురు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మే నెలతో పోలిస్తే 34 శాతం పెరిగి 4.5 బిలియన్ యూరోలకు చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి.అయితే ఇప్పుడు భారత్ ముందు రెండు కీలక అంశాలు నిలిచాయి. ఒకవైపు తక్కువ ధరకు లభించే రష్యా చమురు ద్వారా ఇంధన భద్రతను కొనసాగించాల్సి ఉంది. మరోవైపు అమెరికాతో ఉన్న వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.చైనాపైనా భారీ ప్రభావంఈ బిల్లు ప్రభావం ఎక్కువగా చైనాపై ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా శిలాజ ఇంధనాల అతిపెద్ద కొనుగోలుదారుగా చైనా కొనసాగుతోంది. 2026 జూన్ గణాంకాల ప్రకారం రష్యా ఇంధన ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయంలో చైనా వాటా గణనీయంగా ఉంది. ఐదు అతిపెద్ద కొనుగోలుదారుల ఆదాయంలో 41 శాతం చైనా నుంచే వచ్చినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.రష్యా చమురు ఎగుమతుల్లో చైనా దాదాపు సగం కొనుగోలు చేస్తుండగా.. భారత్ కూడా 36 శాతం వాటాతో కీలక కొనుగోలుదారుగా ఉంది. దీంతో ఈ బిల్లు రష్యాపైనే కాకుండా అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.లిండ్సే గ్రాహమ్ పేరుతో ఎందుకు?ఈ బిల్లుకు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కీలక రూపకర్తల్లో ఒకరు. ఉక్రెయిన్ పర్యటన అనంతరం జూలై 11న ఆయన ఆకస్మికంగా మరణించారు. అయినప్పటికీ ఆయన రూపొందించిన ఆంక్షల ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. ఆయనకు గౌరవంగా ఈ బిల్లుకు ఆయన పేరు పెట్టారు.పుతిన్, రష్యా సంస్థలపైనా చర్యలుఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉన్నతాధికారులు, సంపన్న వర్గాలు, ఆర్థిక సంస్థలపై కూడా ఆంక్షలు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న “షాడో ఫ్లీట్” చమురు నౌకల నెట్వర్క్పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.500 శాతం నుంచి 100 శాతానికి తగ్గిన టారిఫ్ ప్రతిపాదనఈ బిల్లు మొదటి రూపంలో మరింత కఠినంగా ఉంది. రష్యా ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 500 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదన ఉండేది. అయితే అమెరికా ప్రభుత్వం, చట్టసభ సభ్యుల మధ్య జరిగిన చర్చల తర్వాత దీనిని సవరించారు. చివరకు రష్యా ఇంధన కొనుగోలుదారులపై గరిష్ఠ టారిఫ్ను 100 శాతానికి పరిమితం చేశారు.ట్రంప్కు అధికారం ఇవ్వడంపై విమర్శలుఈ బిల్లుకు అమెరికాలోనే భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు డెమొక్రాట్లు ట్రంప్కు విస్తృత టారిఫ్ అధికారాలు ఇవ్వడం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. టారిఫ్ల భారం చివరకు అమెరికా వ్యాపారాలు, వినియోగదారులపైనే పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్య అవసరమని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు.ఇక ముందు ఏం జరగనుంది?ప్రస్తుతం ఈ బిల్లు అమెరికా ప్రతినిధుల సభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే ట్రంప్ సంతకం తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ప్రశ్న.. ట్రంప్ ఈ అధికారాన్ని వెంటనే ఉపయోగిస్తారా? లేదంటే భారత్, చైనా వంటి దేశాలతో చర్చలు, మినహాయింపులు, దౌత్య మార్గాలను ఎంచుకుంటారా? అన్నదే. అయితే..టారిఫ్లు అమల్లోకి రాకముందే వాటి ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికా చర్యల భయంతో చమురు కంపెనీలు, బ్యాంకులు, షిప్పింగ్ సంస్థలు తమ భవిష్యత్ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది.రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవాలన్న అమెరికా వ్యూహం ఇప్పుడు భారత్, చైనా వంటి దేశాలకు కొత్త ఆర్థిక పరీక్షగా మారింది. ట్రంప్ తీసుకునే తదుపరి నిర్ణయాలపైనే ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల భవిష్యత్ ఆధారపడనుంది. -
స్కూల్లో కాల్పులు
నొంతబురి (థాయ్లాండ్): బ్యాంకాక్ సమీపంలోని ఓ పాఠశాలలో శుక్రవారం భారీ విషాదం చోటు చేసకుంది. పద్నాలుగేళ్ల విద్యార్థి ఒకరు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉపాధ్యాయులు మరణించారు. దాదాపు 20 మందికిపైగా గాయపడ్డారు. పాఠశాలకు వచ్చే ముందే ఈ విద్యార్థి తన తాత, అమ్మమ్మలను కూడా చంపేశాడు. ఆ తరువాత తాను కూడా పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నొంతబురి ప్రావిన్స్లోని డెబ్సిరిన్ నొంతబురి పాఠశాలలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తరగతి మొదలు కాగానే నిందితుడు కాల్పులు మొదలుపెట్టాడు. ఆ తరువాత బయటకు వచ్చి మరిన్ని తూటాలు పేల్చాడు. ఒక భవనం నుంచి కాల్పుల శబ్ధం వినిపించగానే మిగిలిన తరగతి గదుల్లోని విద్యార్థులు భయంతో అక్కడే దాక్కున్నారు. నిందితుడు 20కి పైగా రౌండ్లు కాల్చాడని, ఆత్మహత్య చేసుకున్న తరువాత కూడా తుపాకీలో 30 వరకూ బుల్లెట్లు మిగిలి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంట సేపటి తరువాత పోలీసులు తలుపు తట్టి, విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఆ తరువాత విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాఠశాల వెలుపల ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు. గాయపడ్డ వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉందని పాఠశాల సమీపంలోని బాంగ్యై ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పాఠశాలకు సమీపంలోనే ఉన్న ఓ హోటల్ యజమాని అమ్పోర్న్ నియాంఫాంగ్ మాట్లాడుతూ....‘‘ముందు ఒక బుల్లెట్ పేలిన శబ్ధం వచ్చింది. ఆ తరువాత కొంతసేపు నిశ్శబ్ధం. దీని తరువాత వరుస పేలుడు శబ్దాలు వినిపించాయి’’అని గుర్తు చేసుకున్నాడు. హోటల్ ముందున్న చిన్న రహదారి పిల్లలతో కిక్కిరిసిపోయిందని, చాలామంది ఏడుస్తూ కనిపించారని చెప్పాడు. విద్యార్థి ఇంట్లో మృతదేహాలు... కాల్పుల అనంతరం పోలీసులు నిందితుడి తాత, అమ్మమ్మ ఇంటికి వెళ్లగా తలుపులు మూసి కనిపించాయి. ఎవరూ స్పందించకపోవడంతో అధికారులు తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా తుపాకీ గాయాలతో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. నిందితుడు ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదని, బాగా చదువుకునే వాడని అతడి మామ, తాత, అక్కచెల్లెళ్ల ద్వారా తెలిసింది. ఇంట్లోకానీ, బడిలో కానీ సమస్యలు ఉన్న విషయం తమకు తెలియదని వారు స్పష్టం చేశారు. అయితే... కాల్పుల ఘటన తరువాత పాఠశాలను సందర్శించిన థాయ్లాండ్ ప్రధాని అనుతిన్ చార్న్విరకుల్ మాత్రం నిందితుడు పాఠశాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు చెప్పడం గమనార్హం. అలాగే పాఠశాకు వచ్చే ముందే నిందితుడు ఇంట్లో తాత, అమ్మమ్మలను హత్య చేసినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సువుంచ్వీ ధ్రువీకరించారు. కాల్పుల కోసం నిందితుడు ఉపయోగించిన తుపాకీ తాత పేరుతో రిజిస్టర్ అయి ఉందని పోలీసుల ద్వారా తెలిసింది. దాడులకు ముందు నిందితుడు మూక కాల్పులపై ఆన్లైన్లో వెతికాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. -
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ బిగ్ సిగ్నల్
పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయా? నెలల తరబడి కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణకు తెరపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఆయుధ నిల్వలు, యుద్ధ సామర్థ్యంపై చర్చలు సాగుతుండగా.. మరోవైపు కీలక దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకోవడం ఆసక్తిని రేపుతోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం “చాలా త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నా” అని ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు.క్షిపణుల నిల్వలపై వస్తున్న ప్రశ్నలపైనా ట్రంప్ స్పందించారు. కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలు తమ వద్ద భారీగా ఉన్నాయని, మరికొన్ని ఆయుధాల నిల్వలు పరిమితంగా ఉన్నాయని అంగీకరించారు. అయితే అమెరికా సైన్యం మాత్రం “చాలా మంచి స్థితిలోనే ఉందని” స్పష్టం చేశారు.ఇటీవల ఇరాన్తో నెలల తరబడి సాగిన యుద్ధంలో అమెరికా సైన్యం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి క్షిపణుల నిల్వలను భారీగా వినియోగించిందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయుధాల లభ్యతపై చర్చ మొదలైంది. అయితే ఆయుధాల కొరతను అధిగమించేందుకు అమెరికా రక్షణ సంస్థలు కొత్త తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా పేట్రియాట్, టామాహాక్ క్షిపణుల ఉత్పత్తిని పెంచుతున్నట్లు వెల్లడించారు.హర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం?మరోవైపు ఇరాన్, అమెరికా, ఒమన్ మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి తాత్కాలిక ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఈ మార్గంలో ఆంక్షలు, భద్రతా సమస్యలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.మోదీ–నెతన్యాహు ఫోన్కాల్పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో చర్చించారు. భారత్–ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా ఇరువురు నేతలు సమీక్షించినట్లు మోదీ తెలిపారు.Received a phone call from Prime Minister Benjamin Netanyahu. We reviewed progress on various aspects of the India-Israel Special Strategic Partnership which continues to grow from strength-to-strength.We also exchanged views on the current situation in West Asia.@netanyahu— Narendra Modi (@narendramodi) August 6, 2026ప్రాంతీయ భద్రతపై సౌదీ–ఫ్రాన్స్ చర్చలుతాజా పరిస్థితులు, ఎర్ర సముద్రంలో నౌకా రవాణా స్వేచ్ఛపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్చించారు. హౌతీ దాడుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఇరువురు నేతలు దృష్టి సారించారు.చమురు ధరలు మళ్లీ పైకిపశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 82 డాలర్లకు పైగా చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర కూడా 77 డాలర్లకు ఎగబాకింది. హర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకలపై ఆంక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంట్లో ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించే నౌకలకు భారీ జరిమానాలు విధించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్ తీవ్ర ఆరోపణలు.. గ్యాస్ నష్టంపై వ్యాఖ్యలుఅమెరికా గరిష్ఠ ఆర్థిక ఒత్తిడి విధానాన్ని కొనసాగిస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల కారణంగా రోజుకు దాదాపు 230 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నష్టపోతున్నామని పేర్కొన్నారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుఇరాన్–అమెరికా యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా, ప్రాంతంలోని ఇతర దేశాల్లోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యెమెన్లో హౌతీ దాడుల్లో కనీసం 18 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు జరిగినట్లు హౌతీ వర్గాలు ప్రకటించాయి. లెబనాన్–ఇజ్రాయెల్ మధ్య రోమ్లో జరిగిన చర్చలు ముగిశాయి. చర్చలు ఫలప్రదంగా సాగాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ చర్చలు పక్కకు జరిగిన సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.గాజాలో పిల్లల మరణాలపై యూనిసెఫ్ ఆందోళనగాజాలో పరిస్థితిపై యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025 అక్టోబర్ కాల్పుల విరమణ తర్వాతి 300 రోజుల్లో కనీసం 300 మంది పిల్లలు మరణించినట్లు తెలిపింది. రోజుకు సగటున ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.ఇరాన్పై యుద్ధం ముగింపుకు చేరుకుంటోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, హర్ముజ్ ఒప్పంద ప్రయత్నాలు, చమురు ధరల పెరుగుదల.. పశ్చిమాసియా సంక్షోభం కీలక మలుపులోకి ప్రవేశించిన సంకేతాలుగా కనిపిస్తున్నాయి. -
ఆ పెద్దమనిషిలా కాదు.. నేనైతే కుట్ర అనను!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీల మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కార్నీకి అనుకోని అవాంతరం ఎదురైంది. అయితే ఇదే అదనుగా ఆయన ట్రంప్పై పరోక్షంగా సెటైర్లు సంధించారు. కెనడాలో గృహ నిర్మాణ విధానంపై టొరంటోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మార్క్ కార్నీ మాట్లాడుతుండగా టెలిప్రాంప్టర్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఆయన చిరునవ్వుతో స్పందిస్తూ.. “టెలిప్రాంప్టర్ పనిచేయడం నిలిచిపోయిందని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఆ పెద్దమనిషిలా.. ప్రత్యేక ప్రపంచ నేతలా కాకుండా దీనైతే నేను కుట్రగా భావించడం లేదు” అని వ్యాఖ్యానించారు. కార్నీ వ్యాఖ్యలతో అక్కడున్నవారు ఘోల్లున నవ్వారు. PM Carney trolls Donald Trump: "I would like to inform you that the teleprompter has ceased to function. Unlike a certain world leader, I do not view this as a conspiracy." pic.twitter.com/JxKIzTNwZJ— National broadcaster (@broadcast0147) August 6, 2026కార్నీ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించినవేనన్న చర్చ నడుస్తోంది. గతంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి హెడ్ ఆఫీస్కు వెళ్లిన ట్రంప్.. జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే సమయంలో టెలిప్రాంప్టర్, ఎస్కలేటర్ సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఘటనల వెనుక కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్రంప్ విచారణకు డిమాండ్ చేయడం అప్పట్లో చర్చకు దారితీసింది.ట్రంప్ విధానాలపై కార్నీ పోరాటంట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా–కెనడా సంబంధాల్లో పలు విభేదాలు చోటుచేసుకున్నాయి. కెనడా దిగుమతులపై అమెరికా సుంకాలు విధించడం, కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. దేశ ఆర్థిక, దౌత్య విధానాల్లో అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ వాణిజ్య విధానాలను వ్యతిరేకిస్తూ కెనడా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలోని బలమైన దేశాలు ఆర్థిక సంబంధాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాయని కార్నీ చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో చర్చకు వచ్చాయి. -
ఇరాన్ నాయకత్వంలో చీలిక?.. అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
ఇరాన్ అగ్ర నాయకత్వంలో విభేదాలు నెలకొన్నాయన్న ఊహాగానాల మధ్య అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ప్రస్తుతం సంప్రదింపులు జరపడం “చాలా కష్టంగా మారింది” అని ఆయన వ్యాఖ్యానించడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. యుద్ధ పరిస్థితుల వేళ దేశ అత్యున్నత నాయకత్వం మధ్య సమన్వయం ఎలా ఉందన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అయితే పదవి చేపట్టిన తర్వాత ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చకు కారణమైంది. ఇప్పటివరకు ఎక్కువగా రాతపూర్వక ప్రకటనల ద్వారానే ఆయన స్పందిస్తున్నారు. ఇరాన్ కీలక సమయంలో ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ ప్రజల ముందుకు రాకపోవడం(ఆఖరికి తండ్రి అంత్యక్రియలకు కూడా..), నిర్ణయ ప్రక్రియ ఎలా సాగుతోందన్న అంశాలపై అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యుద్ధ సమయంలో నాయకత్వం నుంచి వచ్చే ప్రతి సంకేతాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ‘డబుల్ వాయిస్’ వినిపించారు. ఓవైపు కాస్త ప్రతికూల కామెంట్లు చేస్తూనే.. మరోవైపు మొజ్తబా ఖమేనీపై కొందరు కావాలనే ప్రతికూల ప్రచారం చేస్తున్నారని మద్దతుగా మాట్లాడారు. ఆయనతో తనకు సమావేశాలు జరిగాయని, ఎంతో ప్రశాంతంగా, తార్కికంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. “ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకుని కొందరు ఆయనపై వేరే విధమైన అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు” అని పెజెష్కియాన్ అన్నారు.ఆయనతో మాట్లాడటం కష్టం..మొజ్తబా ఖమేనీతో నేరుగా సంప్రదింపులు కొనసాగించడం కష్టంగా ఉందని ఆయన అన్నారు. దీనివల్ల కీలక నిర్ణయాల విషయంలో జాప్యం జరుగుతుందనే విమర్శలను ఆయన అంగీకరించారు. అదే సమయంలో.. ఆయన ఉనికి ఇరాన్కు గొప్ప బలమని పెజెష్కియాన్ పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో సుప్రీం లీడర్ పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు. “ప్రస్తుతం ఆయనతో మాట్లాడటం కష్టంగా ఉన్నా.. ఆయన ఉనికి మనకు గొప్ప బలం. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయన నాయకత్వం అవసరం” అని పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఇరాన్ అగ్ర నాయకత్వంలో అధికార సమతుల్యతపై పలు అంతర్జాతీయ నివేదికలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కీలక భద్రతా, విదేశాంగ నిర్ణయాల్లో అధ్యక్షుడు పెజెష్కియాన్ పాత్ర పరిమితమవుతోందని, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రభావం పెరుగుతోందని కథనాలు వెలువడ్డాయి. కొన్ని నివేదికల ప్రకారం.. విధానపరమైన విభేదాల నేపథ్యంలో పెజెష్కియాన్ రాజీనామా ఆలోచన కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ అంశాలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.యుద్ధ వేళ పెరిగిన ఉత్కంఠఇరాన్ ప్రస్తుతం ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు, మరోవైపు సైనిక ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో దేశ రాజకీయ, సైనిక వ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకంగా మారింది. సుప్రీం లీడర్ చుట్టూ నెలకొన్న అనిశ్చితి, అధ్యక్షుడి తాజా వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చకు తెరతీశాయి.అయితే పెజెష్కియాన్ వ్యాఖ్యల్లో విభేదాల కంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వాన్ని కాపాడే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం, ఆయన నిర్ణయాలపై వస్తున్న ఊహాగానాలు ఇరాన్ రాజకీయ భవిష్యత్పై ఆసక్తిని కొనసాగిస్తున్నాయి. -
హసీనా ప్రెస్మీట్ తర్వాత బంగ్లాదేశ్లో కలకలం
బంగ్లాదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ నుంచి వర్చువల్గా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కొద్ది గంటల్లోనే ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ కుటుంబ ఇంటిపై దాడి జరగడం కలకలం రేపింది. మగురా పట్టణంలోని కేశబ్మోర్ ప్రాంతంలో ఉన్న షకీబ్ పూర్వీకుల ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో పాటు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.బుధవారం రాత్రి సుమారు 8.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఇంటి కిటికీలను ధ్వంసం చేశారని, ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని మగురా సదర్ పోలీస్ స్టేషన్ అధికారి అబ్దుల్లా అల్ మమూన్ వెల్లడించారు. కొందరు స్థానికులు పెట్రోల్ బాంబులు విసిరినట్లు చెబుతున్నప్పటికీ.. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు.ప్రెస్మీట్లో పాల్గొన్న గంటల్లోనే..ఈ దాడి వెనుక షకీబ్ రాజకీయ అనుబంధమే కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ ఆరోపించింది. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ వేదికగా నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో షేక్ హసీనా మాట్లాడగా.. షకీబ్ అల్ హసన్ కూడా అందులో పాల్గొన్నారు. ఈ పరిణామాల తర్వాతే తన ఇంటిపై దాడి జరిగిందని ఆవామీ లీగ్ పేర్కొంది. “ఆవామీ లీగ్ ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరైనందుకు ఇళ్లను తగలబెడుతున్నారు. బంగ్లాదేశ్ను నయా ఫాసిజం చుట్టుముడుతోంది” అంటూ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.#BREAKING: Sheikh Hasina Press Conference Fallout.Petrol Bomb thrown at Former Bangladesh national cricket team captain and former MP from Magura-1 constituency Shakib Al Hasan's house in the city. The incident took place at Shakib's ancestral residence in Keshabmor area of… pic.twitter.com/UBXEL9BfCr— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 5, 2026అయితే దాడికి, హసీనా ప్రెస్మీట్కు మధ్య సంబంధం ఉందనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. దాడికి పాల్పడిన వారి వివరాలు, ఉద్దేశం తెలియాల్సి ఉంది.షకీబ్ అలా..బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన షకీబ్ అల్ హసన్ రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఆవామీ లీగ్ తరఫున మగురా-1 నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అయితే హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఒక హత్య కేసులో కూడా ఆయన పేరు నిందితుల జాబితాలో చేరింది. తనపై ఉన్న కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ భద్రత కల్పించాలని షకీబ్ గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం షకీబ్ బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లకుండా కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. వివిధ ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీల్లో మాత్రం కొనసాగుతున్నారు.హసీనా సంచలన వ్యాఖ్యలుఇదిలా ఉండగా.. బుధవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తానని ప్రకటించారు. “నా తిరుగు ప్రయాణం అధికారం కోసం కాదు.. బంగ్లాదేశ్ను తిరిగి అభివృద్ధి, లౌకికవాదం, అభివృద్ధి మార్గంలోకి తీసుకురావడానికే” అని ఆమె అన్నారు. తిరిగి వెళ్తే అరెస్టు చేయవచ్చని, ప్రాణహాని కూడా ఉండొచ్చని తెలిసినా స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.2024 ఆగస్టు 5న భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పదవి కోల్పోయిన తర్వాత షేక్ హసీనా భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఉంటున్నారు. బంగ్లాదేశ్లోని ప్రత్యేక ట్రైబ్యునల్ ఆమెకు మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల ఆరోపణలపై గైర్హాజరులో మరణశిక్ష విధించింది...కొనసాగుతున్న రాజకీయ అశాంతిహసీనా మీడియా సమావేశంపై బంగ్లాదేశ్లోని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలను ప్రచారం చేయొద్దంటూ కొన్ని మీడియా సంస్థలను హెచ్చరించినట్లు సమాచారం. హసీనా అనుచరులు మాత్రం దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. షకీబ్ ఇంటిపై దాడి ఘటన కూడా అదే రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకోవడం బంగ్లాదేశ్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం షకీబ్ ఇంటి వద్ద భద్రతను పెంచిన పోలీసులు.. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. -
డ్రోన్ వెంటాడింది.. చేతులు జోడించినా కనికరించలేదు!
ఉక్రెయిన్లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయలు విక్రయిస్తున్న ఓ సాధారణ పౌరుడిని డ్రోన్ వెంటాడి దాడి చేసిన వీడియోను ఉక్రెయిన్ విడుదల చేసింది. చేతులు జోడించి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నా.. డ్రోన్ అతడిని వెంబడించింది. చివరకు అతని మీద పడిపోయి పేలినట్లు వీడియోలో కనిపిస్తోంది.వీడియోలో ఓ వ్యక్తి వీధిలో పరుగులు తీస్తూ డ్రోన్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. డ్రోన్ అతడిని చుట్టుముట్టి వెంటాడగా.. అతడు ఓ వాహనం చుట్టూ తిరుగుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు డ్రోన్ అతడి సమీపంలో పేలినట్లు కనిపించింది. ఈ దాడిలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని తెలుస్తోంది. అయితే అతడికి గాయాలయ్యాని.. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాడని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.Today, many were shocked by yet another video of the drone “safari” Russians are carrying out against civilians in Kherson. A Russian drone deliberately hunted down a man selling vegetables and detonated right next to him. The Russians even admitted to the crime, showing zero… pic.twitter.com/uGjC7esFwR— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 4, 2026ఈ ఘటనను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ఉపయోగించడం యుద్ధ నేరమని పేర్కొంది.ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇది రష్యా డ్రోన్ దాడికి నిదర్శనమని ఆరోపించారు. దక్షిణ ఉక్రెయిన్లోని ఖెర్సన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అయితే ఇది సరిగ్గా ఎప్పుడు జరిగిందనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా దీనిని “కిరాతక చర్య”గా అభివర్ణిస్తూ.. పౌరులను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై రష్యా ఇంకా స్పందించలేదు. యుద్ధ ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. సాంకేతిక ఆయుధాలు సాధారణ పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయనే ఆందోళనలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా ఉక్రెయిన్ రష్యా భూభాగంలో జరిపిన దాడుల్లో.. చిన్నారులు సహా పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు పౌరులపై దాడుల ఆరోపణలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. -
భారత్ నుంచి హసీనా ప్రసంగం.. బంగ్లా మీడియాకు బెదిరింపులు!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి రాజకీయ కేంద్రబిందువుగా మారారు. దేశం విడిచి భారత్లో ఉంటున్న ఆమె.. బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రసంగించనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీనా ప్రసంగాన్ని ప్రసారం చేయడం, ప్రచురించడం చట్టవిరుద్ధమని దేశీయ మీడియాను హెచ్చరించింది.2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఉంటున్నారు. 2025లో నిరసనల అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా చట్టబద్ధం కాదంటూ కొట్టిపారేశారు.ఈ నేపథ్యంలో.. తాను స్వదేశం విడిచి రెండేళ్లయిన సందర్భంగా ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె వీడియో లింక్ ద్వారా ప్రసంగించనున్నారు. తన కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్తో పాటు ఇతర వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హసీనా ప్రధానంగా ఏ అంశాలపై మాట్లాడతారన్న వివరాలు వెల్లడికాలేదు.అయితే హసీనా ప్రసంగంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ఆడియో, వీడియో సందేశాలను ప్రసారం చేయడంపై గతంలో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విధించిన నిషేధాన్ని గుర్తుచేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మీడియాను హెచ్చరించింది.మరోవైపు హసీనా వర్గం మాత్రం ప్రభుత్వ వైఖరిని ఖండించింది. దేశ సరిహద్దులు దాటి కూడా భిన్నాభిప్రాయాలను అణచివేయలేరని వ్యాఖ్యానించింది. హసీనా, ఆమె పార్టీ నేతలు డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటారని గతంలో ప్రకటించారు.ఈ పరిణామాలపై భారత్ స్పందిస్తూ.. ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమమని స్పష్టం చేసింది. ఇందులో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రమేయం లేదని, అక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలకు తాము బాధ్యత వహించబోమని భారత విదేశాంగ శాఖ తెలిపింది.ఇదిలా ఉంటే.. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను కోరుతూనే ఉంది. హసీనా భారత భూభాగం నుంచి రాజకీయ ప్రకటనలు చేయడంపై ఢిల్లీకి తమ అభ్యంతరాలను తెలియజేసినట్లు బంగ్లాదేశ్ అధికారులు చెబుతున్నారు.హసీనా అధికారం కోల్పోయిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆమె వర్చువల్ ప్రసంగం నేపథ్యంలో మరోసారి రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలకు తెరలేచింది. **భారత్ వేదికగా హసీనా గళం వినిపించనుండటం.. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
కొండలు కూలాయి.. ఊర్లు మునిగాయి!
అందమైన ప్రకృతి దృశ్యాలకు పేరుగాంచిన శ్రీలంక ఇప్పుడు ప్రకృతి విలయంతో వణికిపోతోంది. భారీ వర్షాలు, వరదలు, కొండచరియల విరిగిపడటంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొండలు కూలి ఇళ్లను మట్టిలో కలిపేయగా.. ఉప్పొంగిన వరదలు గ్రామాలను నీట ముంచాయి. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులై సురక్షిత ప్రాంతాలకు తరలాల్సి వచ్చింది.శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పరిస్థితిని తీవ్రంగా మార్చాయి. శ్రీలంకలోని మధ్య కొండ ప్రాంతాలు ఈ విపత్తుకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా కాండీ (Kandy), నువర ఎలియా (Nuwara Eliya), బదుల్ల (Badulla), రత్నపుర (Ratnapura) వంటి జిల్లాల్లో భారీ వర్షాలు, కొండచరియల ప్రమాదం పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. పలు ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోగా.. ఇళ్లలోకి మట్టి, వరద నీరు చేరింది. దీంతో సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి.இலங்கையில் வெளுத்து வாங்கிய கனமழை.. 2,300 பேர் பாதிப்பு, 6 பேர் மாயம்!#Srilanka | #Flood | #HeavyRain | #PolimerNews pic.twitter.com/3x6Hw1rK7z— Polimer News (@polimernews) August 4, 2026ఎందుకీ ప్రకృతి బీభత్సం?శ్రీలంక భౌగోళిక పరిస్థితులే ఇలాంటి విపత్తులకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఆ దేశంలోని మధ్య, పర్వత ప్రాంతాల్లో ఎత్తైన కొండలు, వాలు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు నేలలోకి అధికంగా నీరు చేరి బలహీనపడుతుంది. దీంతో కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతాయి.వాతావరణ మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుండటం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. అడవుల నరికివేత, కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు కూడా ప్రమాదాన్ని మరింత పెంచే అంశాలుగా మారుతున్నాయి.మృత్యువాత.. నిరాశ్రయులుగా వేలాది మందితాజా విపత్తులో పలువురు మృతి చెందగా.. మరికొందరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఏడుగురు మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడినా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని పరిస్థితి చెబుతోంది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రీలంక సైన్యం, నేవీ, అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగాయి. పడవలు, ప్రత్యేక సహాయక బృందాల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్లపై పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు.ఒక్క వర్షం.. భారీ నష్టంశ్రీలంకకు వరదలు, కొండచరియలు కొత్త సమస్య కాదు. ప్రతి ఏటా వర్షాకాలంలో పర్వత ప్రాంతాలు ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటుంటాయి. అయితే ఈసారి వర్ష తీవ్రత ఎక్కువగా ఉండటంతో నష్టం కూడా భారీగా నమోదవుతోంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ప్రాంతాల్లో ప్రజల తరలింపు వంటి చర్యలు కీలకంగా మారాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రతపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.మొత్తంగా.. ప్రకృతి కన్నెర్రతో శ్రీలంక మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు కొండచరియలు.. మరోవైపు వరదలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
H-1B, L-1 వీసాలు.. భారతీయులకు బిగ్ షాక్!
హెచ్-1బీ, ఎల్-1 వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కొత్త వీసాలు, ఉద్యోగ మార్పుల సమయంలో మాత్రమే వసూలు చేస్తున్న అదనపు రుసుమును.. ఇకపై వీసా రెన్యూవల్ (పొడిగింపు) సమయంలోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. అటు పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ నిపుణులను కొనసాగించే కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS), కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) సంస్థలు తాజాగా ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. H-1B, L-1 వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల స్టే పొడిగింపు దరఖాస్తులపైనా అదనపు ఫీజు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రుసుము కొత్త H-1B, L-1 వీసా దరఖాస్తులు లేదంటే ఉద్యోగ మార్పు సమయంలో మాత్రమే వర్తిస్తోంది. అయితే కొత్త ప్రతిపాదన ఆమోదం పొందితే.. అదే కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగుల వీసా పునరుద్ధరణ సమయంలో కూడా సంస్థలు ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు ప్రధానంగా అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు కలిగి ఉండి.. వారిలో కనీసం సగం మంది H-1B లేదా L-1 వీసాలపై పనిచేస్తున్న సంస్థలకు వర్తించే అవకాశం ఉంది.భారతీయులపై ఎందుకు ప్రభావం ఎక్కువ?H-1B వీసా వ్యవస్థలో భారతీయ నిపుణుల వాటా అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్ రంగాల్లో వేలాది మంది భారతీయులు ఈ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమైన H-1B పిటిషన్లలో కొనసాగుతున్న ఉద్యోగాలకు సంబంధించినవి 2.91 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో భారతీయుల వాటా సుమారు 77 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. భారతీయ ఉద్యోగులను కొనసాగించే ఐటీ కంపెనీల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.ఐటీ కంపెనీలపై అదనపు భారంఅమెరికాలో భారీ సంఖ్యలో H-1B ఉద్యోగులను కలిగి ఉన్న టెక్నాలజీ సంస్థలు ఈ మార్పుతో ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అమెజాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు H-1B ఉద్యోగుల విషయంలో ముందంజలో ఉన్నాయి. వీసా పొడిగింపుల సమయంలో అదనపు రుసుము చెల్లించాల్సి వస్తే.. విదేశీ నిపుణులను కొనసాగించడం కంపెనీలకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు.ఎంత ఫీజు?ప్రస్తుతం అర్హత కలిగిన కొన్ని సంస్థలు కొత్త H-1B దరఖాస్తుల సమయంలో సుమారు 4,000 డాలర్లు, L-1 వీసాల కోసం సుమారు 4,500 డాలర్లు వరకు అదనపు రుసుము చెల్లిస్తున్నాయి. ప్రతిపాదిత మార్పు అమల్లోకి వస్తే.. ఇదే భారం వీసా పొడిగింపు దరఖాస్తులకూ వర్తించే అవకాశం ఉంది.ఎందుకీ పెంపు?అమెరికా అధికారులు చెబుతున్న ప్రకారం.. ఈ అదనపు రుసుమును 9/11 భద్రతా చర్యల్లో భాగమైన బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థ నిర్వహణకు ఉపయోగించనున్నారు. ముఖ గుర్తింపు వంటి సాంకేతికతలతో ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణలను పర్యవేక్షించే వ్యవస్థకు నిధులు సమకూర్చడమే లక్ష్యమని తెలిపారు. ఈ ప్రతిపాదన ద్వారా ఏడాదికి సుమారు 157 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది.తుది నిర్ణయం ఎప్పుడంటే..అయితే ఈ ప్రతిపాదన ఇంకా తుది నిబంధనగా మారలేదు. అమెరికా పరిపాలన తుది నిబంధనలను విడుదల చేసిన తర్వాతే అమలు తేదీ, పూర్తి వివరాలు స్పష్టమవుతాయి. ఇప్పటికే H-1B వీసా విధానంపై కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజా ప్రతిపాదనతో విదేశీ నిపుణులను నియమించుకునే కంపెనీలపై మరింత నియంత్రణ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.మొత్తంగా.. H-1B, L-1 వీసాలపై ప్రతిపాదిత కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు, వారిని నియమించుకునే ఐటీ కంపెనీలపై ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. -
ఎర్ర సముద్రంలో భారత నౌకపై దాడి.. నీట మునక
ఎర్ర సముద్రంలో భారత వాణిజ్య నౌకపై దాడి జరిగింది!. యెమెన్ తీరంలో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలో ఉన్న 13 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 14 మందిని యెమెన్ కోస్ట్గార్డ్ సురక్షితంగా రక్షించింది. ఈ దాడి ఎవరి పని? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఎంఎస్వీ ఫైజ్ నూర్ ఒలియా (MSV Faize Noore Oliya) అనే నౌకపై గుర్తుతెలియని వస్తువు(క్షిపణి/పేలుడు పదార్థం) వచ్చి తగలడంతో అది బోల్తా పడి మునిగిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బందిని యెమెన్ కోస్ట్గార్డ్ సహాయక చర్యలు చేపట్టి రక్షించి మొఖా పోర్టుకు తరలించినట్లు వెల్లడించారు. వాళ్లలో 13 మంది భారతీయులు, ఓ విదేశీయుడు ఉన్నాడు. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. పౌర నౌకపై జరిగిన ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి రక్షణ లేకుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకర పరిణామమని పేర్కొంది. భారతీయ నావికుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సోనోవాల్ తెలిపారు. రక్షించబడిన సిబ్బందికి అవసరమైన సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఘటనపై స్పందించింది. భారత జెండాతో ఉన్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిని ఖండిస్తూ.. రియాద్లోని భారత రాయబార కార్యాలయం యెమెన్ అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది. సిబ్బంది రక్షణలో సహకరించిన యెమెన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది.అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన మరింత ఆందోళనకు దారితీసింది.ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఎర్ర సముద్రం ఒకటి. సుయాజ్ కాలువ ద్వారా యూరప్, ఆసియాలను కలిపే ఈ మార్గంలో ఇటీవలి కాలంలో భద్రతా సమస్యలు పెరిగాయి. ముఖ్యంగా యెమెన్ సమీపంలోని బాబ్ అల్ మండెబ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో పలు అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. -
కింద రొమాన్స్.. పైన హారర్!
పెళ్లి అనేది జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను మరింత అందంగా మలుచుకునేందుకు ఇప్పుడు చాలా మంది జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకమైన లొకేషన్లు, అద్భుతమైన విజువల్స్ కోసం కొందరు వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తూ.. దేశాలు దాటి మరీ ఫొటోషూట్లు చేయించుకుంటున్నారు. ప్రేమను, అనుబంధాన్ని అందమైన ఫ్రేమ్లలో బంధించేందుకు చేసే ఈ ప్రయత్నాలు ఒక్కోసారి ఊహించని మలుపులు తీసుకుంటాయి. అలాంటి ఓ ప్రీ వెడ్డింగ్ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందమైన ప్రేమ దృశ్యంగా ఉండాల్సిన ఆ చిత్రం.. చూసిన వారిని కాసేపు భయపెట్టించింది. ఫొటోలో కనిపించిన ఓ వింత దృశ్యం.. “అక్కడ ఎవరైనా వేలాడుతున్నారా?” అనే అనుమానాన్ని రేకెత్తించింది. అయితే అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఇదంతా కెమెరా యాంగిల్ చేసిన మాయ అని తేలింది. అసలు ఆ ఫొటోలో ఏం కనిపించింది? నెటిజన్లు ఎందుకు షాక్ అయ్యారు?బాలికి చెందిన ఫొటోగ్రఫీ సంస్థ లెమురియాంట్స్(Lemuriarts).. టెడ్డీ, స్టెఫానీ అనే జంట ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా తీసిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందమైన ప్రదేశంలో ఆ జంట నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఫొటో మొదటి చూపులో చాలా సాధారణంగానే కనిపించింది. కానీ ఫొటో పైభాగాన్ని గమనించిన కొందరు నెటిజన్లకు మాత్రం ఓ వింత విషయం కనిపించింది. ఆకాశంలో గాల్లో వేలాడుతున్నట్లుగా కనిపించిన రెండు కాళ్లు అందరి దృష్టిని ఆకర్షించాయి.“ఎవరైనా వేలాడుతున్నారా?”ఫొటో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. “అక్కడ ఎవరో వేలాడుతున్నట్లు కనిపిస్తోంది” అంటూ కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు “మొదటిసారి చూసినప్పుడు భయమేసింది” అంటూ తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ ఫొటో ఎక్స్ (X)లోనూ వైరల్గా మారింది. లక్షలాది మంది వీక్షించడంతో.. ఆ వింత దృశ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.రొమాన్స్ కింద.. హారర్ పైన!ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. “ఒకే ఫొటోగ్రాఫర్.. కింద రొమాన్స్, పైన హారర్” అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు “ఇది క్రైమ్ సీన్ ఫొటోలా కనిపిస్తోంది” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అసలు నిజం ఏంటంటే..అయితే ఫొటోను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అసలు విషయం బయటపడింది. అవి ఎవరో వేలాడుతున్న కాళ్లు కాదని, కెమెరా యాంగిల్ వల్ల అలా కనిపించాయని నెటిజన్లు గుర్తించారు. కొంతమంది ప్రకారం.. ముందుభాగంలో నిచ్చెనపై నిలబడి ఉన్న వ్యక్తి కాళ్లు, ఫొటో తీసిన కోణం కారణంగా గాల్లో వేలాడుతున్నట్లుగా కనిపించాయి. జంటపై ఫోకస్ చేయడం, బ్యాక్గ్రౌండ్ దూరం కారణంగా ఈ వింత భ్రమ ఏర్పడింది.కెమెరా యాంగిల్ చేసిన మాయనిజానికి ఈ ఫొటోలో ఎలాంటి భయానక ఘటన లేదని స్పష్టమైంది. కేవలం సరైన కోణంలో పడిన చిత్రం.. వేలాది మందిని క్షణం పాటు అయోమయానికి గురిచేసింది. ప్రేమ జంట జ్ఞాపకంగా తీసిన ఓ ప్రీ వెడ్డింగ్ ఫొటో.. చివరకు సోషల్ మీడియాలో “మిస్టరీ ఫొటో”గా మారడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
మా వాళ్లు 30 మంది ఖతమయ్యారు.. భారత్ పనే ఇది!
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఓ ఆపరేటివ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు, నాలుగేళ్లలో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో హతమైనట్లు ఆ సంస్థ ప్రతినిధి రిజ్వాన్ హనీఫ్ పేర్కొన్నాడు. అయితే ఈ హత్యల వెనుక భారత నిఘా సంస్థలు ఉన్నాయని అతడు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోలో రిజ్వాన్ హనీఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో లష్కరే తోయిబా సభ్యులు లక్ష్యంగా దాడులకు గురయ్యారని పేర్కొన్నాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలకోట్ వంటి ప్రాంతాల్లో తమకు చెందిన వ్యక్తులు మరణించారని చెప్పాడు.“గత మూడు నుంచి నాలుగేళ్లలో 30 మందికి పైగా మా సభ్యులు భారత నిఘా ఏజెంట్ల చేతిలో హతమయ్యారు” అని అతడు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ ఘటనలను అతడు “తెలియని గన్మెన్ మోడల్”unknown gunman modelగా అభివర్ణించాడు.Lashkar-E-Taiba's First Ever Explosive Admission 🔥🔥🔥Lashkar-e-Taiba/JKUM terrorist Rizwan Hanif openly admits that more than 30 members of the outfit were eliminated by unknown gunmen (Indian agents), across Peshawar, Karachi, Rawalpindi, Rawalakot and Muzaffarabad over the… pic.twitter.com/gXr0jIeYmH— OsintTV 📺 (@OsintTV) August 3, 2026అయితే ఈ ఆరోపణలకు సంబంధించి భారత ప్రభుత్వంగానీ, ఇటు భద్రతా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్థాన్ తరచూ ఈ దాడులకు భారత్ను కారణంగా చూపుతుండగా.. న్యూఢిల్లీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నాయి.తొలిసారి.. ఒప్పుకోలులష్కరే తోయిబా అనుబంధ వ్యక్తి ఒకరు తమ సంస్థకు చెందిన ఇంతమంది సభ్యులు వరుసగా హతమైనట్లు బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి అని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్లో పలువురు ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో మరణించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఎలా పుట్టింది లష్కరే తోయిబా?లష్కరే తోయిబా పాకిస్థాన్లో ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ. 1980ల చివర్లో హఫీజ్ మహ్మద్ సయీద్, జఫర్ ఇక్బాల్, అబ్దుల్లా అజామ్లు ఈ సంస్థను స్థాపించారు. తొలినాళ్లలో ఇది మర్కజ్-ఉద్-దవా-వల్-ఇర్షాద్ అనే సంస్థకు అనుబంధంగా పనిచేసింది. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ఏర్పాటైన ఈ సంస్థ.. ఆ తర్వాత తన కార్యకలాపాలను జమ్మూ కశ్మీర్పై కేంద్రీకరించింది. కశ్మీర్లో సాయుధ పోరాటం పేరుతో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిందని భారత్ ఆరోపిస్తోంది.ముంబై దాడులతో ప్రపంచ దృష్టిలోకిలష్కరే తోయిబా పేరు 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చర్చకు వచ్చింది. ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, నరిమన్ హౌస్ సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపించింది. అనంతరం ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పలు దేశాలు ఈ సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాయి.భారత్, పాశ్చాత్య దేశాలు లష్కరే తోయిబాకు పాకిస్థాన్లోని కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని గతంలో ఆరోపించాయి. అయితే పాకిస్థాన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది.విద్వేష వ్యాఖ్యలపై వివాదంతాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన రిజ్వాన్ హనీఫ్.. గతంలోనూ ఇతర మతాలపై అభ్యంతరకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు.అసలు ఎవరి హస్తం?లష్కరే తోయిబా సభ్యులుగా చెప్పబడుతున్న వ్యక్తుల హత్యల వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. అయితే రిజ్వాన్ హనీఫ్ వ్యాఖ్యలు పాకిస్థాన్లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, వాటిపై జరుగుతున్న దాడులపై మరోసారి చర్చకు తెరలేపాయి. భారత్ షరామామూలుగానే ఈ ఆరోపణలను ఖండించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. -
ట్రంప్కు బిగ్ షాక్.. టారిఫ్లపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టారిఫ్ విధానానికి సొంత దేశంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత్ సహా 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలను నిలిపివేయాలని కోరుతూ అమెరికాలోని 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం తన అధికారాలను మించి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన ఈ పిటిషన్.. ఆయన వాణిజ్య విధానానికి మరో న్యాయ పరీక్షగా మారింది.ట్రంప్ ప్రభుత్వం గత నెలలో ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 301 కింద కొత్త టారిఫ్లను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సుంకాలు 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ఉన్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ సహా మొత్తం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఇవి వర్తిస్తున్నాయి. అయితే బలవంతపు కార్మిక వ్యవస్థ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడం, వాణిజ్య నిబంధనలను కఠినతరం చేయడమే ఈ టారిఫ్ల ఉద్దేశమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.“అధ్యక్ష అధికారాలను ఆయన దాటారు”ఈ టారిఫ్లను వ్యతిరేకిస్తూ 25 డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్(U.S. Court of International Trade) దాఖలు చేశాయి. ఒరెగాన్, న్యూయార్క్ వంటి రాష్ట్రాలు ఈ న్యాయపోరాటంలో ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం గతంలో కోర్టులు తప్పుబట్టిన విస్తృత టారిఫ్ విధానాన్నే మరో చట్టపరమైన మార్గంలో అమలు చేస్తోందని రాష్ట్రాలు ఆరోపించాయి. సెక్షన్ 301ను సాధారణంగా నిర్దిష్ట దేశాలు లేదంటే పరిశ్రమల అన్యాయ వాణిజ్య చర్యలపై ఉపయోగిస్తారని.. దాదాపు అన్ని దిగుమతులపై భారీ సుంకాలు విధించేందుకు ఉపయోగించలేమని వాదించాయి.ఈ కేసు ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు పరిశీలనలో ఉంది. పిటిషన్పై తదుపరి విచారణ షెడ్యూల్ కోసం ఇరు వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కోర్టు నిర్ణయం ట్రంప్ టారిఫ్ విధాన భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది.భారత్పై ప్రభావం ఎంత?ట్రంప్ కొత్త టారిఫ్ల పరిధిలో భారత్ కూడా ఉంది. తొలుత భారత్పై 12.5 శాతం సుంకం విధించగా.. కొన్ని చర్యల తర్వాత దాన్ని 10 శాతానికి తగ్గించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే చమురు, సహజ వాయువు, ఎరువులు వంటి కొన్ని ఉత్పత్తులకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినప్పటికీ భారత్ నుంచి అమెరికాకు వెళ్లే పలు ఉత్పత్తులపై ఈ టారిఫ్ల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.ట్రంప్ టారిఫ్ విధానంపై వరుస ఎదురుదెబ్బలుటారిఫ్లను అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు కీలక ఆయుధంగా ట్రంప్ భావిస్తున్నారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి.. అమెరికా తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. అయితే ఆయన తీసుకున్న టారిఫ్ నిర్ణయాలకు ఇప్పటికే న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. గతంలో అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విధించిన భారీ సుంకాలపై అమెరికా కోర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం ట్రంప్ ప్రభుత్వం ఇతర చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.మరోసారి కోర్టు తీర్పుపైనే ఉత్కంఠతాజాగా 25 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్.. ట్రంప్ వాణిజ్య విధానానికి కీలక పరీక్షగా మారింది. కోర్టు ఈ టారిఫ్లను నిలిపివేస్తే ట్రంప్ ఆర్థిక ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఒకవేళ కోర్టు ప్రభుత్వం వైపు మొగ్గుచూపితే.. భవిష్యత్తులో మరిన్ని దేశాలపై సుంకాల విధింపుకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం అమెరికా కోర్టు నిర్ణయం కోసం వాణిజ్య వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ తీర్పు భారత్ సహా పలు దేశాలతో అమెరికా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. -
డోస్ పెంచిన ఉక్రెయిన్.. రష్యా విలవిల
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడు పెంచిందా? నల్ల సముద్ర తీరంలోని రష్యా పర్యాటక ప్రాంతం, ఆక్రమిత క్రిమియాపై వరుస డ్రోన్ దాడులతో కీవ్ తన దాడి సామర్థ్యాన్ని మరోసారి చాటుకుందా? తాజాగా జరిగిన ఈ దాడుల్లో 11 మంది మృతి చెందినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చి జరిగిన ఈ దాడుల వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని మాస్కో ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై కీవ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.రష్యాలోని క్రాస్నొడార్ ప్రాంతంలోని ఆర్కిపో-ఒసిపోవ్కా సముద్ర తీర రిసార్ట్పై సోమవారం జరిగిన డ్రోన్ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకులతో కిక్కిరిసిన బీచ్పైకి డ్రోన్ దూసుకురావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో.. సముద్రంలో ఉన్న పర్యాటకులు, తీరంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. డ్రోన్ శకలాలు పడటంతోనే ప్రాణనష్టం జరిగినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు.🇷🇺🇺🇦 A drone has crashed onto a tourist beach in Gelendzhik, Russia, killing at least 3 and injuring 13.Gelendzhik is a prominent resort town located on the northeastern coast of the Black Sea, in Russia’s Krasnodar Territory.The incident occurred during an overnight raid,…— Mario Nawfal (@MarioNawfal) August 3, 2026ఈ డ్రోన్ను రష్యా గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుందా? లేదంటే అది నేరుగా బీచ్ను తాకిందా? అనే అంశంపై స్పష్టత లేదు. సమీపంలో ఉన్న రష్యా నౌకాదళ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్ దారి తప్పిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.క్రిమియాలో మరో నలుగురు మృతిమరోవైపు రష్యా ఆధీనంలోని క్రిమియా ప్రాంతంలో జరిగిన మరో డ్రోన్ దాడిలో నలుగురు మృతి చెందినట్లు అక్కడి రష్యా నియమిత గవర్నర్ సెర్గీ అక్స్యోనోవ్ తెలిపారు. నల్ల సముద్ర తీర ప్రాంతాలు వేసవి కాలంలో రష్యా పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాల్లో దాడులు జరగడం తీవ్ర కలకలం రేపింది.కమాండర్ లక్ష్యంగా.. రెస్టారెంట్లో?ఇదిలా ఉండగా రష్యా రాజధాని మాస్కోలోని ఓ ప్రముఖ ఇటాలియన్ రెస్టారెంట్ వద్ద జరిగిన పేలుడు ఘటనపై కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందగా.. 19 మంది గాయపడ్డారు. కుద్రిన్స్కయా స్క్వేర్లోని బాల్సీ రోస్సీ రెస్టారెంట్ వద్ద పేలుడు జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఓ మహిళ పేలుడు పదార్థాలతో రెస్టారెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని.. ఆ సమయంలో బాంబు పేలినట్లు వెల్లడించారు.తొలుత ఇది ఉగ్రదాడి అని ప్రకటించిన రష్యా.. ఆ తర్వాత ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని ఆరోపించింది. అయితే కీవ్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ పేలుడు రష్యా ఎయిరోస్పేస్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ అలెగ్జాండర్ చైకోను లక్ష్యంగా చేసుకుని జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన 55వ పుట్టినరోజు వేడుకల కోసం అదే రెస్టారెంట్లో ఉన్నట్లు కొన్ని రష్యా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటన నుంచి జనరల్ చైకో సురక్షితంగా బయటపడ్డారు.ఉక్రెయిన్లోనూ రష్యా దాడులుమరోవైపు ఉక్రెయిన్లోని జపోరిజ్జియా నగరంపై రష్యా వైమానిక దాడులు జరిపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన బాంబు దాడుల్లో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు వెల్లడించారు.ఐదో ఏడాదిలోనూ కొనసాగుతున్న యుద్ధంరష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఐదో ఏడాదిలోకి ప్రవేశించినా.. ముగింపు సంకేతాలు కనిపించడం లేదు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు డ్రోన్లు, క్షిపణులతో దాడులు కొనసాగిస్తున్నాయి. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని రష్యా, ఉక్రెయిన్ రెండూ చెబుతున్నప్పటికీ.. తాజా ఘటనల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్ర దశకు తీసుకెళ్తాయా?.. అమెరికా అధ్యక్షుడు మరోసారి జోక్యం చేసుకుంటారా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. -
ఇరాన్పై ట్రంప్ ‘టూ ఆప్షన్స్’ బాంబ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చల విషయంలో ఇరాన్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ముందు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని.. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం తప్ప మరో మార్గం లేదని అల్టిమేటం జారీ చేశారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ బహిరంగంగా అమెరికాతో చర్చలు జరగడం లేదని చెబుతున్నప్పటికీ, సమస్య పరిష్కారం కోసం చర్చలకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఇరాన్ సృష్టించిన సమస్యకు పరిష్కారం కోసం తాము చర్చలు జరుపుతున్నామని అన్నారు.“ఒకటి ఒప్పందం చేసుకోవడం.. లేదంటే పూర్తిగా లొంగిపోవడం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికప్రపంచంలోని అత్యంత కీలకమైన వాణిజ్య మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి అంశంపైనా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతంపై అమెరికా నౌకాదళానికి పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా ఇరాన్కు ఎలాంటి రాకపోకలు జరగవని స్పష్టం చేశారు. “ఒప్పందం కుదిరే వరకు లేదా పూర్తిగా లొంగిపోయే వరకు ఎలాంటి మార్పు ఉండదు” అనే రీతిలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.దాడి నుంచి చర్చల వైపు ట్రంప్ అడుగుఇరాన్పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడి చేస్తామని మొన్న హెచ్చరించిన ట్రంప్.. నిన్న ఆ సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేశారు. గల్ఫ్ దేశాలు ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నేతల సూచనలతో పాటు దౌత్య మార్గాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సోమవారం ప్రారంభమవుతాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. వాటి వివరాలను వెల్లడించలేదు.ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ రియాక్షన్ ఇదేఅంతకు ముందు అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ప్రస్తుతం వాషింగ్టన్తో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాము ఒమన్తో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. హర్ముజ్ జలసంధిలో తాత్కాలిక సురక్షిత రాకపోకల ఏర్పాటుకు సంబంధించిన చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్కు డీల్ లేదంటే పూర్తిగా లొంగిపోవడం అనే ఆప్షన్లు ఉంచారు. అయితే ట్రంప్ ఫ్రెష్వార్నింగ్పై ఇరాన్ స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. ఇరాన్ తన సార్వభౌమత్వంపై రాజీపడబోదనే సంకేతాలు ఇస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెబుతూనే, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్య మార్గాలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే క్షిపణి బెదిరింపులు, సైనిక కదలికలతో వేడెక్కిన పరిస్థితుల్లో.. ట్రంప్ తాజా అల్టిమేటం, ఇరాన్ తిరస్కరణతో తదుపరి పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
బాంబర్ బీభత్సం.. షాకింగ్ విజువల్స్ వైరల్!
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ మరోసారి ఉగ్రదాడితో వణికిపోయింది. శాంతి కోసం నిర్వహించిన ఓ నిరసన ర్యాలీనే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే దాడి దృశ్యాలు.. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ దాడి జరిగిన సమయంలో అక్కడ ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. "మిలిటెన్సీని అంతం చేయాలి.. ప్రజలకు భద్రత కల్పించాలి" అంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించి, భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో గేటు వద్దే పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు.పోలీసులే టార్గెట్.. శాంతి ర్యాలీపై పంజాస్వాత్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రకారం ఈ దాడిలో పలువురు పోలీసు సిబ్బంది కూడా మృతి చెందారు. దాడి జరిగిన ప్రాంతం కిక్కిరిసి ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పేలుడు శబ్దం వినిపించగానే ప్రజలు భయంతో పరుగులు తీశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు స్థానికులు సహకరించారు.ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. అయితే ఖైబర్ పఖ్తున్ఖ్వాలో చురుకుగా ఉన్న తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు ఇక్కడే ఎందుకు దాడులు?పాకిస్థాన్లో ఉగ్రవాద సమస్యకు అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ఒకటి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం, కొండ ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కారణంగా ఈ ప్రాంతం చాలా కాలంగా ఉగ్రవాద గ్రూపులకు స్థావరంగా మారింది. గతంలో ఈ ప్రాంతం పాకిస్థాన్ తాలిబాన్ వంటి మిలిటెంట్ గ్రూపుల ప్రభావంలో ఉండేది. పాకిస్థాన్ సైన్యం చేపట్టిన ఆపరేషన్లతో కొంతకాలం దాడులు తగ్గినా.. ఇటీవలి సంవత్సరాల్లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నాయి.TTP మళ్లీ పుంజుకుంటోందా?తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) లక్ష్యం పాకిస్థాన్లో తమకు అనుకూలమైన కఠిన ఇస్లామిక్ పాలన ఏర్పాటు చేయడం. ఈ సంస్థ భద్రతా బలగాలు, ప్రభుత్వ సంస్థలు, తమకు వ్యతిరేకంగా మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్లోని కొన్ని మిలిటెంట్ గ్రూపులకు ధైర్యం పెరిగిందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అయితే ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం తమ భూభాగం నుంచి పాకిస్థాన్పై దాడులు జరగడం లేదని చెబుతోంది.శాంతి కోరుతున్న ప్రజలే ఎందుకు బలవుతున్నారు?ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని సాధారణ ప్రజలు ఏళ్లుగా ఉగ్రవాదం, సైనిక చర్యల మధ్య నలిగిపోతున్నారు. ఒకప్పుడు పర్యాటక ప్రాంతంగా పేరున్న స్వాత్ లోయ కూడా ఉగ్రవాద ప్రభావాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు అక్కడి ప్రజలు మళ్లీ అలాంటి పరిస్థితులు రావద్దని కోరుతున్నారు. అయితే శాంతి కోసం గొంతెత్తుతున్న వారినే లక్ష్యంగా చేసుకోవడం ఉగ్రవాదుల వ్యూహంలో భాగమని నిపుణులు అంటున్నారు. ప్రజల్లో భయాన్ని పెంచడం, ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీయడం, భద్రతా వ్యవస్థను సవాలు చేయడమే ఇలాంటి దాడుల ప్రధాన ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఎవడ్రా సామి నువ్వు.. పాక్ను ఇంతలా వణికిస్తున్నావ్?పాక్కు పెరుగుతున్న భద్రతా సవాల్ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలు, మరోవైపు అంతర్గత ఉగ్రవాదం పాకిస్థాన్కు పెద్ద సవాల్గా మారాయి. కేవలం సైనిక చర్యలతోనే ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడం సాధ్యం కాదని.. స్థానిక ప్రజల విశ్వాసం, అభివృద్ధి, సరిహద్దు నియంత్రణ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.శాంతి కోసం జరిగిన ర్యాలీపై జరిగిన ఈ దాడి.. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఉగ్రవాద సమస్య ఇంకా ఎంత తీవ్రంగా ఉందో మరోసారి బయటపెట్టింది. ప్రజలు భయంతో జీవించే పరిస్థితికి ముగింపు పలకడం పాకిస్థాన్ ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది.BREAKING: A suicide blast struck Kabal Police Station in Swat district, Khyber Pakhtunkhwa, Pakistan, during a nearby peace rally. Reports indicate at least 16 people, including 10 police officers, were killed, with many others injured.#BreakingNews #Pakistan #Swat…— WorldNewsRank (@WNewsRankX) August 3, 2026 -
ట్రంప్.. అబ్బో! చాలా దూరం వెళ్లారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అంశాల్లో వలస విధానం ఒకటి. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు, భారీ స్థాయిలో బహిష్కరణలు, సరిహద్దు నియంత్రణ వంటి నిర్ణయాలతో ట్రంప్ తన మద్దతుదారుల్లో బలమైన గుర్తింపు సంపాదించారు. అయితే ఇప్పుడు అదే వలస విధానం ఆయనకు రాజకీయ సవాల్గా మారుతోందా?.. తాజా సర్వే ఫలితాలు అలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి.ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల విషయంలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్–NORC సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవడంలో, చట్టబద్ధ వలసలను పరిమితం చేయడంలో ట్రంప్ తన అధికార పరిధిని మించుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలో ఆయన వలస విధానానికి ఉన్న మద్దతు 49 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 39 శాతానికి పడిపోయింది. అంటే కేవలం కొన్ని నెలల్లోనే మద్దతు 10 శాతం పాయింట్లు తగ్గినట్లు సర్వే చెబుతోంది. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో వలసల అంశం ట్రంప్ ప్రచారంలో కీలకంగా మారిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించే విషయంలో ట్రంప్ తన అధికారాన్ని మించి వ్యవహరిస్తున్నారని 47 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. చట్టబద్ధ వలసలపై ఆంక్షలు విధించే విషయంలోనూ దాదాపు సగం మంది ప్రజలు ఆయన చర్యలు మరీ కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దాదాపు 80 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు ట్రంప్ వలస విధానాలను సమర్థిస్తున్నారు. వలసల అంశం ఇప్పటికీ ఆయన బేస్ ఓటర్లను ఏకం చేసే ప్రధాన అంశంగానే కొనసాగుతోంది. అయితే కొన్ని చర్యలపై మాత్రం విస్తృత స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. వలసదారులను గుర్తించేందుకు ట్రాఫిక్ తనిఖీలను ఉపయోగించడం, ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను నగరాల్లోకి పంపించడం వంటి చర్యలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని పలువురు అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. వలస నియంత్రణ అవసరమే అయినప్పటికీ.. దాని అమలు విధానం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని కోరుతున్నారు.వలస విధానంతో పాటు ఆర్థిక అంశాల్లోనూ ట్రంప్కు సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆయన నిర్వహిస్తున్న తీరుపై కేవలం 32 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని దాదాపు 70 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడటం గమనార్హం. అయితే రిపబ్లికన్ ఓటర్లలో మాత్రం ట్రంప్పై నమ్మకం కొనసాగుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆయన పనితీరును 69 శాతం మంది రిపబ్లికన్లు సమర్థించారు.వలసలపై కఠిన వైఖరి ట్రంప్ రాజకీయ గుర్తింపులో కీలక భాగం. సరిహద్దు భద్రత, అక్రమ వలసల నియంత్రణ అంశాలతో ఆయన తన మద్దతు వర్గాన్ని బలపరిచారు. కానీ తాజా సర్వే మరో విషయాన్ని సూచిస్తోంది. ట్రంప్ ప్రధాన మద్దతుదారులు ఆయన వెంటే ఉన్నప్పటికీ.. మధ్యస్థ ఓటర్లు, స్వతంత్ర ఓటర్లలో అసంతృప్తి పెరుగుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వలసలపై ట్రంప్ దూకుడు.. అదే అంశం ఇప్పుడు ఆయనకు కొత్త సవాల్గా మారుతోందా? తాజా సర్వే మాత్రం అమెరికన్లలో మారుతున్న అభిప్రాయాలకు అద్దం పడుతోంది. రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ అంశం కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. కఠిన వలస విధానాలు ట్రంప్కు రాజకీయ బలాన్నిస్తాయా? లేక సాధారణ అమెరికన్లలో వ్యతిరేకతను పెంచుతాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
యుద్ధానికి బ్రేక్.. ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. క్షిపణులు, దాడుల హెచ్చరికలతో హోరెత్తిన వాతావరణం ఒక్కసారిగా చర్చల వైపు మళ్లింది. ఇరాన్పై భారీ సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు దౌత్య మార్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన ట్రంప్.. సోమవారం నుంచి చర్చలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు కొంత తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇరాన్ కీలక మౌలిక వసతులపై భారీ దాడులకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. చివరి దశలో వాటిని నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు యుద్ధాన్ని విస్తరించకుండా దౌత్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ట్రంప్ చెప్పారు.ఇరాన్పై తాను చేపట్టబోయిన సైనిక చర్య సాధారణ దాడి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ దాడి జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిలిచేదని వ్యాఖ్యానించారు. “నేను ప్రజలను చంపాలని కోరుకోవడం లేదు. యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే భారీ విధ్వంసం జరిగేది.. తిరిగి నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేది” అని ట్రంప్ పేర్కొన్నారు.అందుకే యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరితే ప్రాణనష్టం, విధ్వంసం రెండింటినీ నివారించవచ్చని తెలిపారు.“ఇరాన్తో ఒక ఒప్పందం దగ్గరలోనే ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ ఒప్పందంలో ఏ అంశాలపై రాజీ కుదరబోతోందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇరాన్ కీలక వ్యాఖ్యలుమరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా అమెరికాతో చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. “అమెరికా తన హామీలను గౌరవించాలి.. పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలి” అనే సంకేతాలను పెజెష్కియన్ ఇచ్చారు.జూన్లో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందమే భవిష్యత్లో ఇరాన్ విదేశాంగ విధానానికి కీలక ఆధారంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇరాన్ తన ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గబోదని కూడా ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.టెహ్రాన్కు దౌత్య బృందాలు!అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమం చేసేందుకు మధ్యవర్తి దేశాలు రంగంలోకి దిగుతున్నాయి. గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత.. టెహ్రాన్లో పరోక్ష చర్చలకు వేదిక సిద్ధమవుతోందని సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు కాకుండా.. ఒమన్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంది.ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ అరేబియా, పాకిస్థాన్ తదితర దేశాలతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ దేశాల సహకారంతో యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి, హార్ముజ్ జలసంధి విషయంలో ఒక అవగాహనకు రావడమే లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలు సాగుతున్నాయి.హర్ముజ్ జలసంధిపై అసలు పోరుఅమెరికా-ఇరాన్ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అందుకే ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. ఒమన్తో హార్ముజ్ నిర్వహణపై జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. అయితే ఇవి అమెరికాతో నేరుగా జరుగుతున్న చర్చలు కావని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులకు హర్ముజ్ను పూర్తిగా తీసుకెళ్లడం సాధ్యం కాదని కూడా సంకేతాలు ఇచ్చింది.హర్ముజ్ కోసం తెర వెనుక డీల్!హర్ముజ్ జలసంధి విషయంలో కొత్త విధానం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు పర్యవేక్షిస్తారు? నౌకల రాకపోకలు ఎలా ఉంటాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలి? వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల్లో ఒమన్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలోనూ అమెరికా-ఇరాన్ మధ్య రహస్య దౌత్య చర్చలకు ఒమన్ వేదికగా నిలిచింది.ఇరాన్ వ్యూహం.. చర్చలు కూడా, ఒత్తిడి కూడాఇరాన్ ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే.. మరోవైపు తన వ్యూహాత్మక బలాన్ని కొనసాగిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తదితరులతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై చర్చించినట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే హార్ముజ్పై తన ప్రభావాన్ని మాత్రం కొనసాగించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.అణు అంశమే అసలు పరీక్ష!అమెరికా-ఇరాన్ మధ్య జరిగే ఏ ఒప్పందానికైనా అణు కార్యక్రమం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాలను పరిమితం చేయాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంశాలపై రాజీ కుదిరితేనే చర్చలు విజయవంతమయ్యే అవకాశం ఉంది.ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయియుద్ధ భయాల మధ్య పెరిగిన చమురు ధరలు ట్రంప్ తాజా ప్రకటనతో తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 4 డాలర్లకు పైగా పడిపోయింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభిస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి.ఎర్రసముద్రంలో ఉత్కంఠ!మరోవైపు సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన రెండు చమురు నౌకలు బాబ్ అల్ మందెబ్ జలసంధిని దాటాయి. హౌతీల హెచ్చరికల మధ్య కూడా చమురు రవాణా కొనసాగుతుండటం గమనార్హం. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు తమ ఆటోమేటిక్ ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేసినట్లు సమాచారం.ఇజ్రాయెల్ చూపు చర్చలపైనేఅమెరికా-ఇరాన్ చర్చలను ఇజ్రాయెల్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఎలాంటి రాజీ వచ్చినా అది తమ భద్రతకు ముప్పుగా భావించే ఇజ్రాయెల్.. గతంలో ఇరాన్పై కఠిన వైఖరి ప్రదర్శించింది. అందుకే ఈ చర్చలు కేవలం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య వ్యవహారం కాకుండా మొత్తం పశ్చిమాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామంగా మారాయి.యుద్ధానికి ముగింపా? లేదంటే.. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమమైనప్పటికీ.. పూర్తి ఒప్పందం ఇంకా దూరంలోనే ఉంది. హర్ముజ్ నియంత్రణ, అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపు, భద్రతా హామీలపై ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. యుద్ధం అంచుల నుంచి చర్చల బల్లపైకి వచ్చిన అమెరికా-ఇరాన్ సంబంధాలు.. నిజంగా శాంతి దిశగా అడుగులు వేస్తాయా? లేక ఇది కేవలం వ్యూహాత్మక విరామమేనా? అన్నది రాబోయే చర్చలే తేల్చనున్నాయి. -
‘ధురంధర్’ ల్యారీ మళ్లీ వార్తల్లో! ఈసారి..
సినిమాల్లో చూపించిన చీకటి ప్రపంచం.. నిజ జీవితంలోనూ అంతే భయానకంగా ఉంటుందా? పాకిస్థాన్లోని కరాచీ గ్యాంగ్వార్ ప్లేస్ ‘ల్యారీ’ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ‘ధురంధర్’లో చూపించిన ఈ ప్రాంతంలో గ్యాంగ్ కల్చర్, అండర్వల్డ్ ఆధిపత్య పోరు వాస్తవమనే విషయం మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకప్పుడు ల్యారీని తన గుప్పిట్లో ఉంచుకున్న గ్యాంగ్స్టర్ ఉజైర్ బలోచ్ సోదరుడు జుబైర్ బలోచ్పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కరాచీలోని ల్యారీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట కూర్చుని ఉన్న జుబైర్ బలోచ్పై బైక్పై వచ్చిన సాయుధులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ దాడిలో అతడికి ఛాతీ, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. పోలీసుల ప్రకారం.. చాకీవారా రోడ్డులోని సింగూ లేన్ ప్రాంతంలో జుబైర్పై దాడి జరిగింది. అతడిని వెంటనే కరాచీ సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ దాడి వెనుక ఉంది ఎవరు? అనేదానిపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. గ్యాంగ్ వార్, వ్యక్తిగత కక్షలు, పాత నేర సంబంధాలు.. ఇలా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అక్కడి అధికారులు ప్రకటించారు. ల్యారీ అంటేనే గ్యాంగ్ల గడ్డకరాచీ నగరంలోని ల్యారీ ప్రాంతానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు రాజకీయ ప్రభావం, గ్యాంగ్ల ఆధిపత్యం, ఆయుధ సంస్కృతికి ఈ ప్రాంతం కేంద్రంగా ఉండేది. చిన్న వీధుల్లో పెరిగిన గ్యాంగ్లు క్రమంగా భారీ నెట్వర్క్లుగా మారి.. ప్రాంతీయ రాజకీయాలు, స్థానిక వ్యాపారాలపై ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంతో.. నిజజీవిత ఘటనల స్ఫూర్తితో మాంచి మసాలా స్పై డ్రామాగా ‘ధురంధర్’ సినిమాను మలిచాడు దర్శకుడు ఆదిత్య ధార్.ఎవరీ ఉజైర్ బలోచ్?ఇప్పుడు కాల్పులకు గురైన జుబైర్ బలోచ్.. ఉజైర్ బలోచ్ సొంత తమ్ముడు. ఉజైర్ బెలూచ్ కరాచీలోని ల్యారీ ప్రాంతంలో రెహమాన్ డకాయిట్ వారసుడిగా ఎదిగాడు. రెహమాన్ మరణం తర్వాత అతడి కజిన్ అయిన ఉజైర్ చేతికి ల్యారీ గ్యాంగ్ పగ్గాలు వెళ్లాయి. అయితే సినిమాలో సొంత సోదర బంధంగా చూపించారు. ఆ తర్వాత.. కరాచీ అండర్వల్డ్లో ఉజైర్ పేరు మరింత ప్రభావవంతంగా మారింది. అతడిపై హత్యలు, పోలీసులపై దాడులు, ఆయుధ కేసులు సహా అనేక ఆరోపణలు ఉన్నాయి. 2012లో భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసుల్లోనూ అతడి పేరు వచ్చింది. ఆఖరికి 2020లో పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం గూఢచర్యం కేసులో అతడిని దోషిగా తేల్చి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది(సినిమాలో రణ్వీర్ హమ్జా పాత్ర ఉజైర్ను పక్కా స్కెచ్తో ఇరికించినట్లు చూపించాడు). వాస్తవంగా.. ఇప్పటికీ అతడిపై పలు కేసులు కొనసాగుతున్నాయి.ఒకప్పుడు తుపాకుల మోత, గ్యాంగ్ల ఆధిపత్యానికి పేరున్న ల్యారీ.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి రావడంతో కరాచీ భద్రతపై చర్చ మొదలైంది. ఉజైర్ బలోచ్ కుటుంబంపై జరిగిన ఈ దాడి వెనుక అసలు కథ ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.పాక్లో వాళ్ల అంతం.. ఎప్పుడూ మిస్టరీనే?పాకిస్థాన్లో గ్యాంగ్స్టర్లు, అండర్వల్డ్ డాన్లు, ఉగ్ర సంబంధం ఉన్న నేతల జీవితాలు తరచూ అనూహ్య మలుపులు తిరుగుతుంటాయి. ఆధిపత్య పోరులు, రాజకీయ విభేదాలు, ప్రత్యర్థి వర్గాల దాడులు.. ఇలా పలువురు కీలక వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఆ సమయాల్లో భారత్పైనా పాక్ ఆరోపణలు గుప్పించిన సందర్భాలు లేకపోలేదు. అయితే కొన్ని ఘటనల్లో దాడి వెనుక అసలు కారణాలు, కుట్రదారులు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. -
దారి తప్పిన రాకెట్.. మెరుపు వేగంతో చంద్రుడిపై ఢీ
అంతరిక్షంలో దారితప్పిన ఓ భారీ రాకెట్ ఇప్పుడు చంద్రుడివైపు దూసుకెళ్తోంది. గంటకు దాదాపు 8 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. అతి త్వరలోనే చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టనుంది. ఈ అనూహ్య పరిణామాన్ని శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే.. చంద్రుడిపై మానవ నిర్మిత వస్తువు ఢీకొట్టినప్పుడు జరిగే ప్రభావాలను అధ్యయనం చేసేందుకు ఇది అరుదైన అవకాశంగా మారనుంది. అదే సమయంలో భవిష్యత్ అంతరిక్ష యాత్రల్లో రాకెట్ వ్యర్థాల నిర్వహణ, అంతరిక్ష ట్రాఫిక్ నియంత్రణపై కొత్త సవాళ్లను కూడా తెరపైకి తెస్తోంది.స్పేస్ఎక్స్ కిందటి ఏడాది జనవరిలో ప్రయోగించిన రాకెట్లోని అప్పర్ స్టేజ్ (పై భాగం) అదుపు తప్పి అంతరిక్షంలో తిరుగుతూ చంద్రుడి ఢీకొనే మార్గంలోకి వచ్చింది. చంద్రుడిపై ఉన్న ఐన్స్టీన్ క్రేటర్ సమీపంలో ఇది కూలిపోతుందని అంతరిక్ష పరిశీలకుడు బిల్ గ్రే అంచనా వేశారు. భారత కాలమానం ప్రకారం సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ ఢీకొట్టు సమయంలో రాకెట్ వేగం గంటకు 8,700 కిలోమీటర్లు (సెకనుకు సుమారు 2.4 కిలోమీటర్లు) ఉండనుంది. ఇది ధ్వని వేగం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ.అనుకోకుండా.. ఢీచంద్రుడిపై మానవ నిర్మిత వస్తువు అదుపు తప్పి ఢీకొట్టడం ఇది రెండోసారి. అంతకుముందు 2022లో ఓ చైనా రాకెట్ భాగం చంద్రుడి అవతలి వైపున కూలి రెండు భారీ గోతులను సృష్టించింది. తాజాగా జరగనున్న ఈ ఘటన కూడా చంద్రుడిపై అంతరిక్ష వ్యర్థాల ప్రభావంపై మరోసారి చర్చకు దారితీస్తోంది. అయితే ఈ రాకెట్ చంద్రుడిని ఢీకొట్టడం అనుకోకుండా జరుగుతున్న పరిణామమే తప్ప.. ఇది స్పేస్ఎక్స్ ప్రణాళికలో భాగం కాదు. రాకెట్ పైభాగాన్ని సరైన సమయంలో సూర్యుడి కక్ష్యలోకి మళ్లించి ఉంటే ఈ ఢీకొట్టు ప్రమాదాన్ని నివారించవచ్చని అంతరిక్ష నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. అందుకు అవసరమైన నియంత్రణ, ఇంధన సామర్థ్యం లేకపోవడంతో అది అంతరిక్షంలో తేలుతూ చివరకు చంద్రుడి ఢీకొట్టు మార్గంలోకి చేరింది.90 అడుగుల గోతిని తవ్వే అవకాశంఈసారి రాకెట్ చంద్రుడి భూమికి కనిపించే వైపునే ఢీకొట్టనుంది. దాదాపు 4,500 కిలోల బరువున్న ఈ రాకెట్ భాగం ఢీకొట్టడంతో సుమారు 90 అడుగుల వెడల్పు, 16 అడుగుల లోతు ఉన్న గోతిని సృష్టించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఢీకొనే సమయంలో వెలువడే కాంతి మెరుపు ఒక్క క్షణం మాత్రమే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పైకి ఎగిసే దుమ్ము, రాళ్ల మేఘం మాత్రం కొన్ని నిమిషాల పాటు టెలిస్కోపుల ద్వారా కనిపించే అవకాశం ఉంది.చంద్రుడిపై పరిశీలనకు అవకాశంఈ ఘటనను శాస్త్రవేత్తలు ఒక ప్రమాదంగా మాత్రమే కాకుండా పరిశోధన అవకాశంగా చూస్తున్నారు. చంద్రుడిపై మానవ నిర్మిత వస్తువుల ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ ఢీకొట్టు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. నాసాకు చెందిన లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్ (LRO), దక్షిణ కొరియాకు చెందిన దనూరి లూనార్ ఆర్బిటర్ ఢీకొట్టడానికి ముందు, తర్వాత చంద్రుడి ఉపరితల చిత్రాలను సేకరించనున్నాయి.భవిష్యత్ చంద్ర యాత్రలకు హెచ్చరికచంద్రుడిపై మళ్లీ మానవులు అడుగుపెట్టేందుకు అమెరికా, చైనా వంటి దేశాలు పోటీపడుతున్నాయి. ప్రైవేటు సంస్థలు కూడా చంద్ర యాత్రల్లోకి అడుగుపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతరిక్ష వ్యర్థాల నియంత్రణ, రాకెట్ భాగాల కదలికలపై పర్యవేక్షణ మరింత కీలకమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రాకెట్ ఢీకొట్టు ప్రమాదకరం కాకపోయినా.. భవిష్యత్లో చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పడిన తర్వాత ఇలాంటి ఘటనలు పెద్ద సవాలుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
జాగ్రత్త.. అమెరికాలోనూ ఇదే పరిస్థితి రావొచ్చు: ట్రంప్
ఒకవైపు స్పెయిన్ సరిహద్దులో వేలాది మంది వలసదారుల ప్రవాహం.. మరోవైపు అమెరికా సరిహద్దులపై రాజకీయ చర్చ. స్పెయిన్లోని సియుటా ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ వలస సంక్షోభాన్ని ఉదాహరణగా చూపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్రమ వలసల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. యూరప్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు భవిష్యత్లో అమెరికాలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.“ఆ దృశ్యాన్ని గుర్తుంచుకోండి. తప్పు విధానాలు కొనసాగితే మూడేళ్లలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి రావొచ్చు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. స్పెయిన్లోని సియుటా(Ceuta)లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. సరిహద్దుల రక్షణ, అక్రమ వలసల నియంత్రణపై కఠిన చర్యలు అవసరమని ఆయన అన్నారు.అమెరికా వలసలపై ట్రంప్ ఆందోళనఅక్రమ వలసల నియంత్రణ ట్రంప్ రాజకీయ అజెండాలో మొదటి నుంచీ కీలక అంశంగా ఉంది. అమెరికా–మెక్సికో సరిహద్దు నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు ప్రవేశించడంపై ఆయన గతంలోనూ తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయాలని, అక్రమంగా వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పదేపదే డిమాండ్ చేశారు.స్పెయిన్ సరిహద్దులో జరిగిన ఘటనను కూడా ట్రంప్ ఇదే వాదనకు ఉదాహరణగా చూపించారు. నియంత్రణ లేని వలసలు ఏ దేశానికైనా సామాజిక, భద్రతా సమస్యలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.అసలేం జరిగింది?ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో నుంచి స్పెయిన్కు చెందిన చిన్న భూభాగం సియుటాలోకి గత రెండు రోజులుగా వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. యూరప్లోకి చేరేందుకు ప్రయత్నించే వలసదారులకు సియుటా కీలక మార్గంగా మారింది.గురువారం నుంచి సరిహద్దు వద్ద పరిస్థితులు తీవ్రంగా మారాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు కంచెలు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొందరు సముద్ర మార్గంలో ఈదుకుంటూ స్పెయిన్ భూభాగంలోకి చేరేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో జరిగిన ప్రమాదాల్లో కనీసం 57 మంది మృతి చెందినట్లు సియుటా ప్రాంత అధ్యక్షుడు జువాన్ జీసస్ వివాస్ వెల్లడించారు. కొందరు సముద్రంలో మునిగి చనిపోగా, మరికొందరు సరిహద్దు కంచె వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.24 గంటల్లోనే 60 వేల మంది?సియుటా ప్రాంతంలోకి గత 24 గంటల్లోనే దాదాపు 60 వేల మంది ప్రవేశించినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు. అయితే స్పెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ మాత్రం గురువారం నుంచి సుమారు 50 వేల మంది సరిహద్దు దాటినట్లు అంచనా వేసింది. వీరిలో చాలా మందిని తిరిగి మొరాకోకు పంపించినట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు. 48 వేల మందికి పైగా ఇప్పటికే మొరాకోకు తిరిగి వెళ్లిపోయారని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరికొందరు కూడా గంటల వ్యవధిలో వెనక్కి వెళ్తున్నారని పేర్కొంది.ఎందుకు ఒక్కసారిగా పెరిగింది వలసల ప్రవాహం?సియుటా వైపు ఇంత భారీ సంఖ్యలో వలసదారులు రావడానికి ప్రధాన కారణం.. యూరప్లోకి ప్రవేశించే అవకాశంగా ఈ మార్గాన్ని భావించడమే. ఆఫ్రికాలోని పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత, మెరుగైన జీవితం కోసం చేసే ప్రయత్నాలు అనేక మందిని యూరప్ వైపు నడిపిస్తున్నాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి సరిహద్దు దాటే ప్రయత్నం జరగడం అసాధారణమని అధికారులు చెబుతున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాలు కూడా వలసదారులను ప్రేరేపిస్తున్నాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఆరోపించారు.స్పెయిన్ చర్యలు.. యూరప్లో ఆందోళనపరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పెయిన్ అదనపు భద్రతా బలగాలను సియుటాకు పంపింది. సైన్యం, పోలీసులు, డ్రోన్లు, సముద్ర భద్రతా బృందాలను రంగంలోకి దించింది. ఈ ఉదంతంపై యూరోపియన్ యూనియన్(EU) కూడా స్పందించింది. యూరప్ నిబంధనలను పాటించకుండా ఎవరినీ అనుమతించబోమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ స్పష్టం చేశారు.స్పెయిన్లోని సియుటా సంక్షోభం ఇప్పుడు కేవలం ఆ దేశ సమస్యగా కాకుండా.. యూరప్ సరిహద్దు భద్రత, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వలసల సమస్యపై మరోసారి చర్చకు దారితీసింది. ట్రంప్ వ్యాఖ్యలతో ఈ అంశం అమెరికా రాజకీయాల్లోనూ మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. -
ట్రంప్ను టెన్షన్ పెడుతున్న ఇజ్రాయెల్
అంతా తన ప్లాన్ ప్రకారమే సాగుతుందని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అనూహ్యంగా ఓ కొత్త సవాల్ ఎదురైంది. సన్నిహిత మిత్రదేశం నుంచే వస్తున్న సంకేతాలు ఇప్పుడు వాషింగ్టన్లో చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు కీలక అంతర్జాతీయ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరి ఈ ప్రక్రియకు పరీక్షగా మారుతోంది.గాజాలో మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హమాస్, ఇతర సాయుధ గ్రూపులు పూర్తిగా నిరాయుధీకరణకు అంగీకరించాయని, దీనితో శాశ్వత శాంతి దిశగా ముందడుగు పడిందని ఆయన వెల్లడించారు.ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల ప్రణాళికలో హమాస్ ఆయుధాలు వదిలేయడం ప్రధాన అంశంగా ఉంది. ఇప్పటివరకు దీనిపై ప్రతిష్ఠంభన కొనసాగగా.. తాజాగా అంగీకారం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఒప్పందం అమలులో భాగంగా బందీల విడుదల, ఖైదీల మార్పిడి, సైనిక బలగాల క్రమంగా ఉపసంహరణ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. అయితే ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఒప్పందం అమలు, భద్రతా హామీలు, భవిష్యత్ పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని కోరుతోంది. తమ దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.ట్రంప్ దృష్టి మాత్రం ఈ పరిణామాలను దౌత్య విజయంగా మార్చుకోవడంపైనే ఉంది. అమెరికా మధ్యవర్తిత్వంతో దీర్ఘకాలిక పరిష్కారం సాధించాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఒప్పందంలోని నిబంధనలు అమలు కావడం, వాటిపై ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల స్పందన ఇప్పుడు కీలకంగా మారనుంది.గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండకూడదని, ఆయుధ వ్యవస్థలు తొలగించాల్సి ఉంటుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పర్యవేక్షణలో కొత్త పరిపాలనా వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ప్రణాళికలో ఉంది. అనంతరం పాలస్తీనా అథారిటీ సంస్కరణలతో గాజా బాధ్యతలు చేపట్టే అంశం కూడా ఇందులో భాగంగా ఉంది.అయితే నెతన్యాహు ప్రభుత్వంలోనే ఈ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. కఠిన వైఖరి కలిగిన వర్గాలు ఎలాంటి రాజీ చర్యలనైనా వ్యతిరేకించే అవకాశం ఉంది. దీంతో ట్రంప్ ప్రయత్నాలు కేవలం హమాస్తో ఒప్పందానికే పరిమితం కాకుండా.. ఇజ్రాయెల్ రాజకీయ సమీకరణాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.మరోవైపు పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై కూడా దృష్టి పెరుగుతోంది. కీలక జలమార్గాల్లో నౌకాయాన రక్షణ కోసం పలు దేశాలు కలిసి మారిటైమ్ డిఫెన్స్ అలయన్స్ను ఏర్పాటు చేశాయి. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర మార్గాల భద్రతకు ఈ కూటమి ప్రాధాన్యం ఇస్తోంది.ఇప్పుడు అసలు పరీక్ష ఒప్పందం ప్రకటించడం కాదు.. దాన్ని అమలు చేయడమే. ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు నెతన్యాహు ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది? గాజాలో శాంతి ప్రక్రియ ముందుకు సాగుతుందా? లేదంటే కొత్త అడ్డంకులు ఎదురవుతాయా?.. హమాస్ ఏదైనా సడన్ ట్విస్ట్ ఇస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.ట్రంప్ తీవ్రంగా నిరాశ చెందుతారు: అమెరికా అధికారిఇజ్రాయెల్ తన అంగీకారాలకు కట్టుబడి ట్రంప్ 20 అంశాల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని అమెరికా సీనియర్ అధికారి కోరారు. ప్రణాళిక అమలుకు ఇజ్రాయెల్ సహకరించకపోతే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “చాలా నిరాశ చెందుతారని” హెచ్చరించారు. బందీల విడుదల, యుద్ధం ముగింపు కోసం కుదిరిన ఒప్పందాన్ని ఇరు పక్షాలు గౌరవించాలని ఆయన అన్నారు. గతంలో అనుమానాలు ఉన్నప్పటికీ హమాస్ బందీలను అప్పగించిందని, ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా తన హామీలను నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. -
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్!
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.ఎవరిపై భారం పడనుంది?ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణంఅమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది. -
భారత్తో పోలుస్తావా?.. పాక్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనల విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆ దేశ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ సర్కార్ను చూసి నేర్చుకోండి’’ అంటూ పాకిస్థాన్ పాలకులకు హితవు పలికారు. ప్రజల గొంతును అణచివేయడం కాకుండా.. వారి సమస్యలను వినే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.పాకిస్థాన్లో ఇటీవల విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్లో విద్యార్థుల నిరసనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, పేపర్ లీక్లపై కఠిన చర్యలు వంటి నిర్ణయాలు తీసుకుందని అలీమా ఖానుమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆవేదనను వినడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ విషయంలో భారత్ను చూసి పాకిస్థాన్ ప్రభుత్వం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.‘‘భారత్లో విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ పాకిస్థాన్లో ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు, బెదిరింపులే ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతును అణచివేయడం కాదు’’ అంటూ ఆమె మండిపడ్డారు. అధికార యంత్రాంగం ప్రజల హక్కులను గౌరవించకుండా వ్యవహరిస్తోందని, ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని అలీమా హెచ్చరించారు.అలీమా ఖానుమ్ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమైంది. అధికార పక్షానికి చెందిన నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడగా, పాకిస్థాన్ను భారత్తో పోల్చడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ నేతలు మాత్రం ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే విమర్శలను అంగీకరించే సంస్కృతి అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నారని, న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీమా ఖానుమ్ చేసిన "మోదీ సర్కార్ను చూసి నేర్చుకోండి" వ్యాఖ్యలు భారత్-పాకిస్థాన్ పోలికలకే కాకుండా, పాకిస్థాన్లో ప్రజాస్వామ్య పరిస్థితులపై కూడా మరోసారి చర్చను రేకెత్తించాయి.ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. కొందరు అలీమా ఖానుమ్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు భారత్ను ఉదాహరణగా చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా, ఆమె చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కొత్త దుమారానికి తెరలేపాయి.నీట్ యూజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదంపై విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించి.. పరీక్ష రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివాదం తీవ్రం కావడంతో కేంద్రం విచారణలు, సంస్కరణలపై చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో ప్రభుత్వం–నిరసనకారుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులు తమ నిరసనలను విరమించినట్లు ప్రకటించారు. -
ఒక్కసారిగా వేల మంది.. వలసల తుపానుతో షాక్లో స్పెయిన్
స్పెయిన్–మొరాకో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్రికా నుంచి యూరప్లోకి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న వేలాది మంది వలసదారులు గురువారం స్పెయిన్కు చెందిన చిన్న భూభాగం సియుటా (Ceuta) లోకి ఒక్కసారిగా ప్రవేశించారు. దీంతో సరిహద్దు వద్ద పరిస్థితి అదుపుతప్పిందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.మొరాకోలోని టరాజల్ బీచ్ ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సముద్రపు బ్రేక్వాటర్లను దాటి సియుటాలోకి ప్రవేశించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఎక్కువ మంది యువకులు ఉన్నప్పటికీ.. మహిళలు, చిన్నారులతో కూడిన కుటుంబాలు కూడా కనిపించాయి. స్పెయిన్ భూభాగంలోకి చేరుకున్న కొందరు వలసదారులు ఆనందంతో ‘‘వివా ఎస్పానా’’(స్పెయిన్కు జయహో) అంటూ నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో వలసదారులు సరిహద్దు దాటడానికి కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.INSANE FOOTAGE: Thousands of migrants continue crossing from Morocco into Spain’s Ceuta enclave, as local officials reportedly urge Madrid to declare a national emergency. pic.twitter.com/dlbbKOjBV1— Breaking911 (@Breaking911) July 30, 2026సియుటా సివిల్ గార్డ్ ఆఫీసర్స్ చీఫ్ రాచిడ్ స్బిహి మాట్లాడుతూ.. ‘‘పరిస్థితి పూర్తిగా గందరగోళంగా మారింది. ఎంతమంది సరిహద్దు దాటారో ఖచ్చితంగా చెప్పలేం కానీ వేల సంఖ్యలో ప్రజలు లోపలికి వచ్చారు. సరిహద్దు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది’’ అని తెలిపారు.సైన్యాన్ని దించాలని డిమాండ్సియుటా ప్రాంతీయ ప్రభుత్వ అధిపతి జువాన్ జీసస్ వివాస్.. తాజా పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల రక్షణ, పౌరుల భద్రత కోసం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని స్పెయిన్ ప్రభుత్వాన్ని కోరారు. సరిహద్దు వద్ద అదనపు పోలీసు బలగాలతో పాటు సైన్యాన్ని కూడా మోహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘సరిహద్దు భద్రతను కాపాడేందుకు, ప్రజల రక్షణకు మరిన్ని బలగాలు అవసరం’’ అని పేర్కొన్నారు.Thousands of migrants have streamed into the tiny Spanish territory of Ceuta in North Africa from Morocco, prompting local officials to call for help from Spain’s national government in Madrid to restore the border. pic.twitter.com/S2fTWapBzR— The Associated Press (@AP) July 30, 2026అయితే వలసల ప్రవాహాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించే అవకాశం లేదని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పరిస్థితిని వేగంగా అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.మొరాకోతో సమన్వయంసరిహద్దు పరిస్థితులను నియంత్రించేందుకు మొరాకో అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. అక్రమంగా సియుటాలోకి ప్రవేశించిన వారిని వీలైనంత త్వరగా తిరిగి పంపించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపింది. స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఫెర్నాండో గ్రాండే మార్లాస్కా శుక్రవారం సియుటాకు వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు.NEW: Spain is now deploying its military after thousands of military-aged men stormed over the border into Ceuta, Spain.Ceuta authorities are calling on Madrid to declare a national emergency after the border "totally collapsed.""The situation is absolute chaos. It’s not… pic.twitter.com/Mpe5Lc1xlK— Collin Rugg (@CollinRugg) July 30, 2026పెరుగుతున్న వలసల ప్రవాహంసియుటాలోకి వలసదారుల రాక గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతోంది. బుధవారం సముద్ర మార్గంలో సియుటాకు చేరుకునేందుకు ప్రయత్నించిన వారిలో కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గత వారం రోజుల్లోనే 1,500 మందికి పైగా వలసదారులు సియుటాలోకి ప్రవేశించారని, అక్కడి ఆశ్రయ కేంద్రాలు ఇప్పటికే నిండిపోయాయని స్థానిక అధికారులు వెల్లడించారు.స్పెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 15 వరకు దాదాపు 3 వేల మంది వలసదారులు భూమి లేదా సముద్ర మార్గాల ద్వారా సియుటాకు చేరుకున్నారు.2021 సంక్షోభం మళ్లీ గుర్తుకు!తాజా పరిణామాలు 2021 మేలో చోటుచేసుకున్న భారీ వలస సంక్షోభాన్ని గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో కేవలం రెండు రోజుల్లోనే 8 వేల మందికి పైగా వలసదారులు సియుటాలోకి ప్రవేశించారు. ఆ సమయంలో మొరాకో సరిహద్దు నియంత్రణలను సడలించిందనే ఆరోపణలు వచ్చాయి. స్పెయిన్లో చికిత్స పొందిన వెస్ట్రన్ సహారా వేర్పాటువాద నేత బ్రాహిం ఘాలీ వ్యవహారం కారణంగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి.యూరప్ ప్రవేశానికి కీలక ద్వారంఉత్తర ఆఫ్రికా తీరంలో ఉన్న సియుటా.. చారిత్రకంగా స్పెయిన్ ఆధీనంలోని ప్రాంతం. మెరుగైన జీవితం కోసం ఆఫ్రికాలోని వివిధ దేశాల నుంచి వచ్చే వలసదారులకు ఇది యూరప్లోకి ప్రవేశించే కీలక మార్గంగా మారింది. మొరాకోలోని ఫ్నిడెక్ పట్టణం నుంచి సుమారు 5 కిలోమీటర్ల సముద్ర మార్గాన్ని ఈదుకుంటూ పలువురు సియుటాకు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరు సరిహద్దు కంచెలను దాటేందుకు ప్రయత్నిస్తారు.తాజా భారీ వలసలతో సియుటా సరిహద్దులో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. స్పెయిన్ ప్రభుత్వం అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది. -
వెలుగులోకి ఘోరాలు.. రష్యాపై షాకింగ్ ఆరోపణలు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరో భయానక అంశం వెలుగులోకి వచ్చింది. యుద్ధ ఖైదీలు, సాధారణ పౌరులపై రష్యా బలగాలు లైంగిక హింసను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖైదీలను అవమానించడం, మానసికంగా దెబ్బతీయడం, ప్రతిఘటనను పూర్తిగా విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు.మాజీ ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, ఐక్యరాజ్యసమితి పరిశోధకులు, ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ల వాంగ్మూలాల ఆధారంగా.. అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలనాత్మక కథనం ప్రచురించింది. 2022లో రష్యా పూర్తిస్థాయి దాడులు ప్రారంభించిన తర్వాత ఈ తరహా ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొంది.మానసికంగా కుంగదీసే వ్యూహం?ఉక్రెయిన్కు చెందిన మాజీ ఖైదీ సెర్హీ బోయ్చుక్ తన అనుభవాలను వివరిస్తూ.. రష్యా నిర్బంధంలో ఉన్న సమయంలో చిత్రహింసలు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తనను శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా కూలదోసేందుకు లైంగిక హింసను ఉపయోగించారని ఆరోపించాడు. ఇలాంటి ఘటనలు ఒక్కరి అనుభవమే కాదని.. పలువురు మాజీ యుద్ధ ఖైదీలు కూడా ఇలాంటి ఆరోపణలే చేసినట్లు చెప్పాడు. లైంగిక హింసను శత్రువులను అవమానించే, భయపెట్టే, మానసికంగా బలహీనపరిచే వ్యూహంగా ఉపయోగిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.ఎక్కువ బాధితులు ఎవరంటే.. సాధారణంగా యుద్ధాల్లో లైంగిక హింసకు మహిళలు, చిన్నారులే ఎక్కువగా గురవుతుంటారు. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో పురుష యుద్ధ ఖైదీలపై ఇలాంటి దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి పరిశీలనలో ఉన్న లైంగిక హింసకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ శాతం బాధితులు పురుషులేనని వెల్లడైంది. రేప్, సామూహిక లైంగిక దాడులు, జననాంగాలపై హింస, విద్యుత్ షాక్లు, శారీరక చిత్రహింసలకు గురిచేసినట్లు పలువురు బాధితులు వెల్లడించారు. కొంతమంది ఖైదీలను నగ్నంగా నిలబెట్టడం, అవమానకర పరిస్థితుల్లో ఉంచడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.రష్యా స్పందన ఏంటి?అయితే ఈ ఆరోపణలపై రష్యా అధికారికంగా స్పందించలేదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలను మాస్కో ఖండిస్తూ.. అవి రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్న నిరాధార ఆరోపణలని పేర్కొంది. అంతేకాకుండా ఆక్రమిత ప్రాంతాల్లో ఐరాస దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి.అసలు తీవ్రత ఎంత?లైంగిక హింసకు సంబంధించిన వాస్తవ ఘటనల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు. సామాజిక అవమానం, ప్రతీకార భయం కారణంగా చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం.. రష్యా సైనికులపై వందల సంఖ్యలో లైంగిక హింస కేసులపై విచారణ జరుగుతోంది. ఇందులో పురుష బాధితుల సంఖ్య కూడా గణనీయంగా ఉందని అధికారులు చెబుతున్నారు.యుద్ధాల్లో ఆయుధాలు, బాంబులు మాత్రమే కాదు.. మనుషుల మనోధైర్యాన్ని దెబ్బతీసే పద్ధతులు కూడా వినియోగించబడుతున్నాయన్న దానికి ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై తుది నిర్ధారణకు అంతర్జాతీయ దర్యాప్తులు కీలకంగా మారనున్నాయి. -
అమెరికా ‘హెవీ వేవ్’ దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ ఇరాన్లోని కీలక ప్రాంతాలపై ‘హెవీ వేవ్’ పేరుతో దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులతో పాటు ఇరాక్లో ఇరాన్ అనుకూల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త చర్యలు చేపట్టడం, యెమెన్లో హౌతీల కదలికలు, హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం.. మొత్తం ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టాయి.ఇరాన్లోని రెవల్యూషనరీ గార్డ్ (IRGC)కు చెందిన స్థావరాలే లక్ష్యంగా తాజాగా అమెరికా దాడులు జరిపింది. సైనిక కమాండ్ కేంద్రాలు, మిసైల్, డ్రోన్ సదుపాయాలు, తీర రక్షణ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాలను టార్గెట్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అబాదాన్, బుషెహర్, కిష్, క్విష్మ్ దీవులు, ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. కిష్ దీవిలోని కజెరూన్ ప్రాంతంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.క్విష్మ్లో నివాస భవనంపై మిసైల్.. రెస్క్యూ కొనసాగింపుఅమెరికా దాడుల్లో క్విష్మ్ దీవిలోని ఓ నివాస భవనం దెబ్బతింది. మిసైల్ దాడితో భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇద్దరు చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించాయి. మరో ముగ్గురి కోసం శిథిలాల తొలగింపు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన యుద్ధంలో పౌర ప్రాంతాలు కూడా ప్రభావితమవుతున్నాయన్న ఆందోళనలను పెంచింది.‘ఇప్పుడు మా వంతు’.. ట్రంప్ హెచ్చరికల తర్వాతే దాడులుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలపై దాడులకు ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసిన ఆయన.. “ఇప్పుడు కొట్టే వంతు మాది” అనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ నుంచి దాడులను ఆపాలని కోరినా అమెరికా చర్యలు తప్పవని ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి.జోర్డాన్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులుఇటీవల జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు వాషింగ్టన్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ మాత్రం తమ చర్యలను అమెరికా బెదిరింపులకు ప్రతిస్పందనగా సమర్థించుకుంది. అమెరికా ఒత్తిడి కొనసాగితే ప్రతిఘటన కూడా కొనసాగుతుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది.ఇరాక్లో అమెరికా–సౌదీ దాడులు.. తీవ్ర ఉద్రిక్తతయుద్ధ ప్రభావం ఇరాక్కు కూడా చేరింది. ఇరాన్కు అనుబంధంగా ఉన్న మిలీషియా గ్రూపుల స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (PMF)కు చెందిన పలువురు సభ్యులు మరణించినట్లు సమాచారం. కనీసం 20 మంది మృతి చెందినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇరాక్ ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది.రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి మరో ముప్పుఇరాన్కు మద్దతుగా వ్యవహరిస్తున్న యెమెన్లోని హౌతీ గ్రూపు కూడా ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. సౌదీ అరేబియా చమురు రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా హోడెయిడా ప్రావిన్స్లోని హౌతీ స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధ ప్రభావం గల్ఫ్ ప్రాంతం దాటి యెమెన్ వరకు విస్తరించింది.హర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న టెన్షన్ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి యుద్ధ కేంద్రంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధించడం, అనుమతి లేని మార్గాల్లో వెళ్లే ట్యాంకర్లను అడ్డుకుంటామని హెచ్చరించడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్ నౌకాదళం మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా మాత్రం అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. హర్ముజ్లో అమెరికా ఆంక్షలను దిక్కరించిన లావిన్ ట్యాంకర్పై దాడి జరిగింది. ఇంజిన్ రూమ్పై కాల్పులు జరపడంతో నౌక దెబ్బతింది. ఈజిప్ట్ పోర్టులో డ్రోన్ దాడి కలకలం?యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందన్న సంకేతంగా ఈజిప్ట్లోని డమియెట్టా పోర్టులో అమెరికాకు చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్పై డ్రోన్ దాడి ఘటన కలకలం రేపింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు మరో నౌకకు కూడా వ్యాపించాయి. అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇది ఇరాన్ జరిపిన డ్రోన్ దాడియేనా?.. లేదంటే అగ్నిప్రమాదమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చమురు ధరలకు యుద్ధ సెగమిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడుతోంది. యుద్ధ భయాలతో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా సెంచరీ దాటేశాయి. ఇరాన్ చమురు స్థావరాలు, హర్ముజ్ జలసంధి భద్రతపై అనిశ్చితి కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రాంతీయ యుద్ధంగా మారుతున్న ఘర్షణఅమెరికా–ఇరాన్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు ఇరాక్, యెమెన్, సౌదీ అరేబియా, సముద్ర మార్గాల వరకు విస్తరించింది. ఒకవైపు ప్రతీకార దాడులు.. మరోవైపు చమురు మార్గాలపై ముప్పు.. ఇంకోవైపు మిత్ర దేశాల జోక్యం.. ఇవన్నీ కలిసి మిడిల్ ఈస్ట్లో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి. -
మళ్లీ భీకర యుద్ధం.. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా బుధవారం రాత్రి ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ భూభాగంపై దాదాపు వారం రోజుల తర్వాత అమెరికా చేపట్టిన తొలి ప్రత్యక్ష దాడులు ఇవే.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ దాడులను ధ్రువీకరించింది. ఇరాన్ నుంచి అమెరికా బలగాలపై జరిగిన దాడులకు ఇది “శక్తివంతమైన ప్రతిస్పందన” అని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు దాడులు ప్రారంభమైనట్లు తెలిపింది.U.S. forces began launching strikes against Iran at 8 p.m. ET today. The strikes are a powerful response to yesterday's attempted Iranian attacks on U.S. forces based in the Middle East.— U.S. Central Command (@CENTCOM) July 30, 2026ట్రంప్ హెచ్చరికల తర్వాతే..ఇరాన్పై దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో.. ‘‘ఇరాన్కు గట్టి సమాధానం ఇస్తాం.. చాలా బలంగా ఎదురుదాడి చేస్తాం’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు దాడి చేశారు.. ఇప్పుడు మా వంతు వచ్చింది’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.🚨 BREAKING: President Trump is warning adversaries that a forceful U.S. response is coming after a drone attack on an LNG tanker off the coast of Egypt."We're going to hit them very hard."Trump confirmed five rockets were fired and signaled that retaliation is imminent,…— Stephen Gardner (@StephenGardnerX) July 29, 2026దక్షిణ ఇరాన్లో పేలుళ్ల శబ్దాలుఅమెరికా దాడుల తర్వాత దక్షిణ ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే అమెరికా దాడుల లక్ష్యాలు, నష్టం వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.ప్రతిఘటన ఉంటుంది: ఇరాన్అమెరికా బెదిరింపులు కొనసాగినంత కాలం తమ ప్రతిఘటన కొనసాగుతుందని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అమెరికా బలగాలపై తాము చేపట్టిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.ఇరాన్ నావికా దళాలు హార్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా సమాచారం వెలువడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంపై ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతోంది.ఇరాక్లోనూ ఉద్రిక్తతలు..ఇరాక్లో అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులపై అక్కడి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్కు చెందిన 20 మంది మరణించగా.. మరో 32 మంది గాయపడినట్లు సమాచారం. ఈ పరిణామాలు ఇరాక్ను కూడా ప్రాంతీయ ఘర్షణలోకి లాగుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.చర్చల నుంచి యుద్ధం వైపు?..కొద్ది రోజుల క్రితం ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. తాజా పరిణామాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇరాన్ తీవ్ర చర్యలకు దిగితే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని ట్రంప్ గతంలో హెచ్చరించారు.అమెరికా తాజా దాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
పదేళ్ల తర్వాత తెరిచారు.. నెలకే నేలమట్టం!
గతాన్ని మరిచి కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పునఃప్రారంభమైన నెల రోజులకే మరోసారి ప్రకృతి దెబ్బకు విలవిలలాడింది. భూకంపం ధాటికి శిథిలాలుగా మారిన జపాన్లోని కుమమోటో ఏయాన్ షాపింగ్ మాల్ విషాదం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.దాదాపు పదేళ్ల కిందట భూకంపాన్ని తట్టుకుని తిరిగి నిలబడిన ఈ మాల్.. తాజాగా సంభవించిన భారీ ప్రకంపనలకు మరోసారి తీవ్రంగా దెబ్బతింది. మంగళవారం కుమమోటో ప్రాంతాన్ని వణికించిన 7.1 తీవ్రత గల భూకంపం ధాటికి 13 మంది మృతి చెందారు. అదే ఏరియాలో ఏయాన్ మాల్లోని రెండో అంతస్తు కుప్పకూలింది. ఆ తర్వాత చోటుచేసుకున్న పేలుడు పరిస్థితిని మరింత విషమంగా మార్చింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకోగా.. ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.తొలి దెబ్బ 2016లో.. మళ్లీ ఇప్పుడుకుమమోటో ప్రాంతానికి భూకంపాలు కొత్తేమీ కాదు. 2016లో వచ్చిన భారీ భూకంపాలు ఈ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆ ప్రకంపనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు దెబ్బతిన్నాయి. వాటిలో ఏయాన్ కుమమోటో షాపింగ్ మాల్ కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత మాల్ను మూసివేసి భారీ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. భూకంపాలను తట్టుకునేలా నిర్మాణంలో మార్పులు చేశారు. ఆధునిక భద్రతా ప్రమాణాలతో బలోపేతం చేశారు. చివరకు 2026 జూన్ 13న కొత్త రూపంలో తిరిగి ప్రారంభించారు.దాదాపు 200 దుకాణాలు, సినిమా థియేటర్, ఫుడ్ కోర్ట్, వేలాది వాహనాలకు పార్కింగ్ సదుపాయాలతో ఈ మాల్ కుమమోటో ప్రజలకు ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పదేళ్ల తర్వాత తిరిగి తెరుచుకోవడం స్థానికుల్లో కొత్త ఆశలు నింపింది.కొత్త ఆరంభం.. నెలకే విషాదంఅయితే ఆ ఆనందం నెల రోజులు కూడా నిలవలేదు. భారీ భూకంపం ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. ప్రకంపనలు మొదలైన వెంటనే మాల్లో ఉన్న ప్రజలను బయటకు తరలించే ప్రయత్నాలు జరిగాయి. అయితే కొద్దిసేపటికే సంభవించిన పేలుడు మరింత భయాందోళనకు గురిచేసింది. పేలుడుకు గ్యాస్ లీక్ కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం భాగాలు కూలిపోవడంతో పలువురు లోపల చిక్కుకున్నారు. శిథిలాల మధ్య ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.Footage showing an explosion at Aeon Mall Kumamoto following the magnitude 7.1 earthquake that hit southern Japan. pic.twitter.com/1K0bW6Z1cZ— HadashotIsrael (@HadashotIsrael) July 29, 2026‘సమయంతో పోరాటం’.. కొనసాగుతున్న గాలింపుభూకంపం తర్వాత జపాన్ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను ముమ్మరం చేసింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జపాన్ రక్షణ దళాలు రంగంలోకి దిగాయి. దాదాపు వేలాది మంది సిబ్బందిని సహాయక చర్యలకు మోహరించారు. జపాన్ ప్రధాని సనే తకైచి మాట్లాడుతూ.. ఇంకా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారని తెలిపారు. "ఇది సమయంతో పోరాటం. ఒక్కో ప్రాణాన్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు.భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేలాది మంది ప్రజలు ఇళ్లను వదిలి సహాయక శిబిరాలకు తరలిపోయారు. ఎండ తీవ్రత కూడా పెరగడంతో బాధితులకు ఆహారం, నీరు, ఎయిర్ కండిషనింగ్, విద్యుత్ జనరేటర్లను అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.రవాణా వ్యవస్థపై ప్రభావంభూకంప ప్రభావంతో కుమమోటో సహా పరిసర ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. క్యుషు ప్రాంతంలో బుల్లెట్ రైళ్ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ప్రభావితమయ్యాయి. అయితే జపాన్ అధికారులు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు.భారత్ సంఘీభావంజపాన్లో సంభవించిన భారీ భూకంపంపై భారత్ కూడా స్పందించింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జపాన్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల భద్రత, త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. "జపాన్లో సంభవించిన భూకంప వార్తతో తీవ్ర ఆందోళన చెందాను. జపాన్ ప్రభుత్వం, ప్రజలకు మా సంఘీభావం, మద్దతు తెలియజేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.మాల్ మాత్రమే కాదు.. ఏయాన్ కుమమోటో మాల్ కేవలం ఓ షాపింగ్ సెంటర్ కాదు. 2016 భూకంపం తర్వాత కుమమోటో ప్రజలు తిరిగి కోలుకుంటున్నారనే సంకేతంగా అది నిలిచింది. పదేళ్ల తర్వాత పునఃప్రారంభం కావడం స్థానికులకు ఓ భావోద్వేగ క్షణంగా మారింది. కానీ అదే మాల్ నెల రోజులకే మరోసారి శిథిలాలుగా మారడం ఇప్పుడు విషాదాన్ని మిగిల్చింది. ఒకసారి ప్రకృతి దెబ్బ నుంచి కోలుకున్న నిర్మాణం.. మరోసారి అదే ప్రకృతి శక్తి ముందు నిలబడలేకపోయింది. -
షా వారసుడికి అడ్డుపడుతోంది ఎవరో తెలుసా?
ఒక అవకాశం వస్తే చాలు.. చరిత్ర తిరగరాస్తానని భావించాడు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసిందనుకున్నాడు. అల్లకల్లోల పరిస్థితులు.. మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజలు.. ఇదే సరైన సమయం అనుకున్నాడు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరుతుందని ఆయన ఆశలు పెట్టుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదు. మద్దతు పెరుగుతుందని భావించిన వేళ.. వరుస సవాళ్లు ఎదురయ్యాయి. ఈ ప్రయత్నాల్లో షా వారసుడికి ఇప్పుడు చిక్కులు తప్పడం లేదు.ఇరాన్లో పాలనా మార్పు వస్తే కొత్త నాయకత్వం ఎవరిది? అనే ప్రశ్నకు సమాధానంగా తనను తాను ముందుకు తెచ్చుకున్న మాజీ షా కుమారుడు రెజా పహ్లవీ ప్రయత్నాలకు అనూహ్య అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవంలో తన తండ్రి మహ్మద్ రెజా పహ్లవీ పాలన కూలిపోయిన తర్వాత దేశం విడిచిన రెజా పహ్లవీ దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రవాస జీవితంలోనే ఉన్నారు. రాజరికం అంతమైనప్పటికీ.. షా కుటుంబ వారసుడిగా ఆయన పేరు ఇరాన్ రాజకీయాల్లో మాత్రం కొనసాగుతూనే వచ్చింది. అయితే ఇరాన్లో ఇటీవలి పరిణామాలు, అమెరికా–ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో రాజకీయ మార్పు వస్తుందనే అంచనాలతో ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు. ఇరాన్లో కొత్త వ్యవస్థ ఏర్పడితే తాత్కాలిక మార్పు దశకు తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో.. ‘నేను గమ్యం కాదు.. వంతెన మాత్రమే’రెజా పహ్లవీ తనను భవిష్యత్ పాలకుడిగా కాకుండా ప్రజాస్వామ్య మార్పుకు మార్గదర్శిగా చూపించుకునే ప్రయత్నం చేశారు. ‘‘నేను గమ్యం కాదు.. గమ్యానికి తీసుకెళ్లే వంతెన మాత్రమే’’ అంటూ ఆయన తన పాత్రను వివరించారు. ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని ప్రకటించారు. అయితే..అదే సమయంలో అమెరికా, యూరప్లో పర్యటిస్తూ ఆయన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. అమెరికాలోని కొంతమంది సంపన్న ప్రవాస ఇరానీయులు కూడా ఆయనకు ఆర్థిక సహకారం అందించారు. అయితే ఈ మద్దతు దేశంలో బలమైన ప్రజా ఉద్యమంగా మారిందా? అనే అనుమానాలు ఆ సమయంలో వ్యక్తం అయ్యాయి కూడా!.ప్రతిపక్షంలోనే అసలు పోరుఒకవైపు ఇరాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. మరోవైపు ప్రతిపక్షంలోనే విభేదాలు.. ఇంకోవైపు అంతర్జాతీయ మద్దతుపై అనిశ్చితి.. ఇలా మూడు వైపుల సవాళ్ల మధ్య పహ్లవీ రాజకీయ ప్రయాణం సాగుతోంది. రెజా పహ్లవీకి ఎదురైన అతిపెద్ద సవాలు ఇరాన్ ప్రభుత్వమే కాదు.. ప్రతిపక్షంలోని విభేదాలే. ఇస్లామిక్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు అనేకం ఉన్నప్పటికీ.. వాటి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం సమస్యగా మారింది.రాయిటర్స్ కథనం ప్రకారం.. పహ్లవీ చుట్టూ ఉన్న కొందరు మద్దతుదారులు ఇతర ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేయడం, కొందరిపై దాడులకు పాల్పడిన ఘటనలు ఉద్యమ ఐక్యతను దెబ్బతీశాయి. 2023లో ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదనే విషయం ఇప్పుడు వెలుగులోకి రావడం గమనార్హం.దాతల్లోనూ పెరిగిన అసంతృప్తిపహ్లవీకి మద్దతుగా కొందరు ఇరానియన్-అమెరికన్ వ్యాపారవేత్తలు మిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో రాజకీయ ఫలితాలు కనిపించడం లేదనే అసంతృప్తి కొందరిలో పెరిగినట్లు సమాచారం. ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయడం, ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని వారు సూచించినట్లు తెలుస్తోంది.అమెరికా మద్దతు కూడా ప్రశ్నార్థకమేఇరాన్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న పహ్లవీకి అమెరికా మద్దతు పూర్తిగా లభించలేదని విశ్లేషణలు చెబుతున్నాయి. ట్రంప్ సహా అమెరికా అధికారులు కూడా ఆయనను భవిష్యత్ ఇరాన్ నాయకుడిగా అధికారికంగా ప్రకటించలేదు. ఇరాన్లో ఆయనకు ఉన్న వాస్తవ ప్రజాదరణ, రాజకీయ స్థిరత్వంపై సందేహాలు ఉన్నట్లు తెలుస్తోంది.షా వారసత్వం.. బలంతోపాటు బలహీనత కూడా!రెజా పహ్లవీకి అతిపెద్ద బలం ఆయన కుటుంబ పేరు. చివరి షా కుమారుడిగా కొందరు ఆయనను స్థిరత్వానికి ప్రతీకగా చూస్తున్నారు. అయితే అదే గతం ఆయనకు సవాల్గా మారింది. షా పాలనలో జరిగిన అణచివేతను గుర్తు చేస్తూ కొందరు వర్గాలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న అనేక శక్తుల్లో రెజా పహ్లవీ అత్యంత గుర్తింపు ఉన్న వ్యక్తిగా ఉన్నప్పటికీ.. ఆయన ముందున్న అసలు పరీక్ష మాత్రం ఒక్కటే. విభిన్న ప్రతిపక్షాలను ఏకం చేసి, దేశంలో విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా నిలబడగలరా? అన్నదే. -
రెచ్చిపోయిన ఇరాన్.. ట్రంప్ రియాక్షన్పై టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్న వేళ.. ఇరాన్ మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించింది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మంగళవారం సాయంత్రం ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నుంచి పలు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు CENTCOM తెలిపింది. జోర్డాన్లో ఉన్న అమెరికా బలగాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. అయితే వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.‘‘ఇది ఆకస్మిక దాడికి చేసిన ప్రయత్నం. ప్రయోగించిన అన్ని క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాం’’ అని అమెరికా కమాండ్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం లేదని తెలిపింది.ట్రంప్ చర్చల మాటలు.. ఇరాన్ క్షిపణుల బదులుఇటీవల ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించిన ట్రంప్.. చర్చలకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్తో మంచి చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే చర్చలు విఫలమైతే మళ్లీ సైనిక చర్యలు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్యే ఇరాన్ క్షిపణి దాడి జరగడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది.ట్రంప్కు ఇరాన్ హెచ్చరిక సంకేతమా?ఇరాన్ తాజా చర్యను అమెరికాకు ఒక బలమైన సందేశంగా విశ్లేషకులు చూస్తున్నారు. తమను పక్కన పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అంగీకరించబోమని చెప్పే ప్రయత్నంగానే ఈ దాడిని భావిస్తున్నారు. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణల్లో భాగంగా అమెరికా బలగాలు ఇరాన్కు చెందిన పలు లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆ తర్వాత ట్రంప్ దౌత్యానికి అవకాశం కల్పిస్తూ సైనిక చర్యలను నిలిపివేశారు.మళ్లీ మొదలైన యుద్ధం?తాజా క్షిపణి దాడి నేపథ్యంలో అమెరికా తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ ఇప్పటికే ఇరాన్పై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జరిగిన దాడికి అమెరికా ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో అమెరికా నౌకాదళం, సైనిక బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తుందా? లేదంటే దౌత్య మార్గంలోనే పరిష్కారం దొరుకుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.హౌతీల దాడులతో మరింత టెన్షన్ఇదే సమయంలో యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ చమురు నౌకను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించారు. మరోవైపు సౌదీ అరేబియా, అమెరికా కలిసి ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా స్థావరాలపై దాడులు చేసినట్లు CENTCOM తెలిపింది. ఈ పరిణామాలన్నీ కలిసి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.ఇక ట్రంప్ నిర్ణయం ఏంటి?ఇరాన్ క్షిపణి దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. చర్చలకు అవకాశం ఇస్తూనే.. సైనికంగా కఠిన చర్యలకు వెనుకాడబోమన్న ట్రంప్ వైఖరి నేపథ్యంలో తదుపరి పరిణామాలు కీలకం కానున్నాయి. -
ఆ సూర్యుడే దిగి వస్తే.. 582 టన్నుల ‘పవర్ హౌస్’!
సూర్యుడు ఉదయించకపోతే ఒక్క రోజు కూడా మన జీవితం ముందుకు సాగదు. కోట్ల ఏళ్లుగా భూమికి వెలుగు, వేడి, శక్తిని అందిస్తున్న ఆ సూర్యుడి రహస్యం ఏమిటో తెలుసుకుని.. అదే శక్తిని భూమిపైనే సృష్టించాలన్నది శాస్త్రవేత్తల కల. ఇప్పటివరకు అది ప్రయోగశాలలకే పరిమితమైన ఆలోచన. కానీ ఇప్పుడు ఆ కలను నిజం చేసే దిశగా చైనా మరో భారీ అడుగు వేసింది.ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్కండక్టింగ్ ఫ్యూజన్ మాగ్నెట్ను నిర్మించి విజయవంతంగా పరీక్షించింది. ఇది చైనా చేపడుతున్న ‘కృత్రిమ సూర్యుడు’ (Artificial Sun) ప్రాజెక్టులో కీలక మైలురాయిగా మారింది. ఈ ఒక్క పరికరం వెనుక దాగి ఉన్న సాంకేతికత.. భవిష్యత్తులో ప్రపంచ విద్యుత్ అవసరాలనే మార్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.582 టన్నుల మహా అయస్కాంతం.. అంత పెద్దదెందుకు?చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసిన ఈ భారీ అయస్కాంతం సాధారణ పరికరం కాదు. దీని బరువు ఏకంగా 582 టన్నులు. ఇది 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో భారీ ‘డి’ ఆకారంలో రూపొందించారు. ఫ్యూజన్ రియాక్టర్లో అత్యంత వేడిగా ఉండే ప్లాస్మాను అదుపులో ఉంచేందుకు ఈ అయస్కాంతం ఉపయోగపడుతుంది.సాధారణంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. సూర్యుడిని భూమిపై తీసుకురావడం కాదు. సూర్యుడిలో జరిగే శక్తి ఉత్పత్తి ప్రక్రియను చిన్న స్థాయిలో, నియంత్రిత పరిస్థితుల్లో పునరావృతం చేయాలన్నదే ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.అసలు ‘కృత్రిమ సూర్యుడు’ అంటే ఏమిటి?సూర్యుడి గుండెలో ప్రతి క్షణం కోట్లాది హైడ్రోజన్ అణువులు కలుస్తూ అపారమైన శక్తిని విడుదల చేస్తుంటాయి. ఈ ప్రక్రియనే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఇదే ప్రక్రియను భూమిపై సృష్టించి విద్యుత్గా మార్చగలిగితే.. దాదాపు అంతులేని స్వచ్ఛమైన శక్తిని పొందే అవకాశం ఉంటుంది. ఫ్యూజన్ విద్యుత్లో బొగ్గు, చమురు వంటి ఇంధనాల మాదిరిగా భారీగా కార్బన్ ఉద్గారాలు ఉండవు. అందుకే దీనిని భవిష్యత్తు ‘క్లీన్ ఎనర్జీ’గా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి.100 మిలియన్ డిగ్రీల వేడి.. ఎలా అదుపు చేస్తారు?ఇక్కడే అసలు సవాలు మొదలవుతుంది. ఫ్యూజన్ రియాక్టర్లో ప్లాస్మా ఉష్ణోగ్రతలు ఏకంగా 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతాయి. అంతటి వేడిని ఏ సాధారణ పదార్థం కూడా తట్టుకోలేదు. అందుకే శాస్త్రవేత్తలు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తున్నారు. చైనా తయారు చేసిన ఈ భారీ మాగ్నెట్ పని కూడా అదే. ఇది అత్యంత వేడిగా ఉన్న ప్లాస్మాను గాల్లోనే నియంత్రిస్తూ రియాక్టర్ గోడలకు తాకకుండా చూస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. మండుతున్న అగ్నిగోళాన్ని చేతితో పట్టుకోకుండా, దూరం నుంచి అదుపు చేసే సాంకేతికత ఇది.2030 నాటికి విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంఈ ప్రయోగంతో చైనా తన ఫ్యూజన్ ప్రణాళికలో మరో ముందడుగు వేసింది. 2030 నాటికి ఫ్యూజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ఆ దేశ లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే EAST (Experimental Advanced Superconducting Tokamak) అనే ప్రయోగ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. దీన్నే ‘చైనా ఆర్టిఫిషియల్ సన్’ అని కూడా పిలుస్తారు. ఈ కేంద్రం 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను 1,066 సెకన్ల పాటు కొనసాగించి రికార్డు సృష్టించింది.అయితే ప్రమాదాలు లేవా? సవాళ్లు ఏమిటి?ఫ్యూజన్ శక్తి గురించి వింటే.. “అయితే ఇక విద్యుత్ సమస్యకు ముగిసినట్టేనా?” అనే ప్రశ్న రావచ్చు. కానీ శాస్త్రవేత్తల ముందు ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. మొదటిది.. ఖర్చు. ఇలాంటి భారీ రియాక్టర్ల నిర్మాణానికి వేల కోట్ల పెట్టుబడులు అవసరం. రెండోది.. ప్లాస్మాను ఎక్కువ కాలం స్థిరంగా కొనసాగించడం. 100 మిలియన్ డిగ్రీల వేడిని నియంత్రించడం ఇప్పటికీ అత్యంత క్లిష్టమైన పని. మూడోది.. రియాక్టర్ పదార్థాల భద్రత. ఫ్యూజన్ ప్రక్రియలో విడుదలయ్యే న్యూట్రాన్ల ప్రభావాన్ని తట్టుకునే కొత్త పదార్థాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.అయితే సంప్రదాయ అణు విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే ఫ్యూజన్లో ప్రమాదం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంధన సరఫరా ఆగిపోతే ప్రక్రియ కూడా ఆగిపోతుంది. అదుపు తప్పి భారీ అణు విపత్తుగా మారే అవకాశం చాలా తక్కువ.భవిష్యత్తు విద్యుత్కు కొత్త ఆశ582 టన్నుల ఈ భారీ అయస్కాంతం కేవలం ఓ యంత్ర భాగం కాదు.. మానవాళి శక్తి భవిష్యత్తుపై పెట్టుకున్న ఓ భారీ ఆశ. ఒకప్పుడు సూర్యుడి శక్తి మనకు అందని అద్భుతంగా కనిపించింది. ఇప్పుడు అదే శక్తి రహస్యాన్ని భూమిపై అర్థం చేసుకుని ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.ఈ ప్రయోగం వెంటనే మన ఇళ్లకు విద్యుత్ ఇవ్వకపోవచ్చు. కానీ భవిష్యత్తులో బొగ్గు, చమురు వంటి కాలుష్య ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ‘భూమిపై సృష్టించిన సూర్యుడు’ నుంచి విద్యుత్ పొందే రోజులకు ఇది వేసిన మరో పెద్ద అడుగుగా నిలవొచ్చు. -
ట్రంప్ బాంబు పేలుతుందనుకుంటే.. తుస్సుమంది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఒకే ఆరోపణను బలంగా వినిపిస్తున్నారు. ‘‘అమెరికా పౌరులు కాని వాళ్లు భారీ సంఖ్యలో.. అక్రమంగా ఓట్లు వేస్తున్నారు. అదే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోంది’’ అని పదేపదే చెబుతున్నారు. ఈ వాదననే ఆధారంగా చేసుకుని ఓటరు నమోదు సమయంలో పౌరసత్వాన్ని తప్పనిసరిగా నిరూపించాలనే వాదన తెరపైకి తెస్తున్నారు. అయితే ఆ వాదనలో ఏమాత్రం పస లేదనే ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.ఎన్నికల భద్రతను కాపాడాలంటే పౌరసత్వ ధ్రువీకరణను మరింత కఠినతరం చేయాల్సిందేనని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే సేవ్ అమెరికా యాక్ట్(SAVE America Act) లాంటి చట్టాలకు మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే ఇవి అవసరమని ఇటు రిపబ్లికన్ పార్టీ కూడా చెబుతోంది. అయితే డెమొక్రటిక్ పార్టీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇటు ఈ అంశం భారత పాఠకులకు కొత్తగా అనిపించాల్సిన అవసరం లేదు. ఇటీవల భారత్లో ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియపై కూడా తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి అర్హుల పేర్లను కొనసాగించడం, అనర్హుల పేర్లను తొలగించడం లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టామని ఎన్నికల సంఘం చెప్పగా.. ప్రతిపక్షాలు మాత్రం పలు ప్రాంతాల్లో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తం చేశాయి. దీంతో ఓటరు నమోదు, ధ్రువీకరణ, ఎన్నికల జాబితాల విశ్వసనీయత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అమెరికాలోనూ ఇదే తరహాలో SAVE America Act చుట్టూ చర్చ సాగుతోంది. అయితే అక్కడ అసలు వివాదం విదేశీయుల అక్రమ ఓటింగ్ నిజంగానే విస్తృతంగా జరుగుతోందా? లేదా అనే అంశంపైనే కేంద్రీకృతమైంది.అమెరికాలో 1996 నుంచి ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు కానివారు ఓటు వేయడం చట్టరీత్యా నేరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన ఫెడరల్ కోర్టు రికార్డులను రాయిటర్స్ విశ్లేషించగా, దేశవ్యాప్తంగా కేవలం 129 కేసులు మాత్రమే నమోదైనట్లు తేలింది. అందులో 73 మంది మాత్రమే నేరాన్ని అంగీకరించడమో లేదంటే కోర్టులు దోషులుగా నిర్ధారించాయి. అంటే.. అధ్యక్ష ఎన్నికలో కోట్లాది ఓట్లు నమోదయ్యే అమెరికాలో ఈ సంఖ్య చాలా స్వల్పమని పరిశీలన చెబుతోంది.ఈ కేసులను లోతుగా పరిశీలిస్తే మరో విషయం కూడా బయటపడింది. నమోదైన చాలా ఘటనలు పెద్ద ఎత్తున పన్నిన ఎన్నికల కుట్రలకు సంబంధించినవి కావు. గ్రీన్ కార్డు కలిగిన కొందరు శాశ్వత నివాసితులు తాము కూడా ఓటు వేయడానికి అర్హులమని పొరపాటుగా భావించడం, మరికొన్ని సందర్భాల్లో పరిపాలనా లోపాల వల్ల పేర్లు ఓటరు జాబితాలో చేరడం వంటి కారణాలే ఎక్కువగా కనిపించాయి. దేశవ్యాప్తంగా విదేశీయులు సమన్వయంతో ఎన్నికలను ప్రభావితం చేశారనే ఆధారాలు మాత్రం బయటపడలేదు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన వాదనపై వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఎన్నికల నిపుణులు, పౌరహక్కుల సంస్థలు మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తున్నాయి. విదేశీయుల అక్రమ ఓటింగ్ విస్తృతంగా జరుగుతోందని నిరూపించే బలమైన ఆధారాలు లేనప్పుడు కఠిన నిబంధనలు తీసుకురావడం వల్ల చట్టబద్ధమైన అమెరికా పౌరులే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సహజీకృత అమెరికా పౌరులు(అంటే విదేశాల్లో పుట్టి, తర్వాత అమెరికా పౌరసత్వం పొందిన వారు) అవసరమైన పత్రాలు వెంటనే సమర్పించలేక ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ లోపం కారణంగా కొందరు పౌరులు కానివారి పేర్లు పొరపాటున ఓటరు జాబితాలో నమోదైన ఘటన కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆ ఘటనలో కూడా వాస్తవంగా ఓటు వేసిన వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉందని, దానిని దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ ఎన్నికల మోసానికి నిదర్శనంగా చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు.మొత్తంగా చూస్తే, అమెరికా ఎన్నికల్లో విదేశీయులు భారీ సంఖ్యలో అక్రమంగా ఓటు వేస్తున్నారన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు బలమైన మద్దతు ఇవ్వడం లేదని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ పరిశీలన తేల్చింది. ఎన్నికల భద్రతపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నప్పటికీ, నమోదైన కేసులు మాత్రం సమస్య పరిమిత స్థాయిలోనే ఉందని సూచిస్తున్నాయి. దీంతో ట్రంప్ చేసిన ఆరోపణలు ఒకవైపు ఉంటే... అధికారిక రికార్డులు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తున్నాయని ఈ విశ్లేషణ స్పష్టం చేసింది. -
ఎల్ నినో ఎఫెక్ట్: భూమికి పొంచి ఉన్న మరో ముప్పు?!
ప్రపంచం ఇప్పటికే వాతావరణ మార్పుల సెగను ఎదుర్కొంటోంది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వేడిగాలులు, కరవు పరిస్థితులు.. మరోవైపు ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్న తుపాన్లు, వరదలు అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న ఓ పరిణామం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. సూపర్ ఎల్నినో.. గాడ్జిల్లా ఎల్నినో అంటూ చర్చకు వచ్చిన ఈ వాతావరణ ప్రభావం 2026పైనే అందరి దృష్టిని మళ్లించింది. అయితే శాస్త్రవేత్తల తాజా అంచనాలు మాత్రం అసలు ప్రభావం మరింత ఆలస్యంగా కనిపించే అవకాశాన్ని సూచిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే.. 2026 ప్రపంచంలో రెండో అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉందని అంటోంది. మరి మొదటి ఏడాది?. దానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని అంటున్నారు. 2027 మాత్రం గత శతాబ్దానికి పైగా ఉన్న ఉష్ణోగ్రత రికార్డులను సవాలు చేసే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులను పేర్కొంటున్నారు.సముద్రంలో దాగిన వేడి.. భూమిపై ప్రభావంఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సహజంగా సంభవించే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు.. ఆ వేడి ప్రపంచవ్యాప్తంగా గాలుల కదలికలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో భారీ స్థాయిలో వేడి నిల్వ ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. సముద్రం లోపల పేరుకుపోయిన ఈ వేడి క్రమంగా పైకి వచ్చి వాతావరణ వ్యవస్థలోకి చేరినప్పుడు.. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.ప్రస్తుత ఎల్ నినోను 1997-98లో నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోతో శాస్త్రవేత్తలు పోలుస్తున్నారు. అప్పట్లో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, వరదలు, కరువులు సంభవించాయి. అయితే ఈసారి పరిస్థితులు మరింత భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు భూమి ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మరింత వేడెక్కిపోయింది.2026లో మొదలై.. 2027లో తీవ్ర ప్రభావం?ఎల్ నినో ప్రభావం ఏర్పడిన వెంటనే బయటపడదు. సముద్రంలో మార్పులు చోటుచేసుకున్న తర్వాత వాటి ప్రభావం వాతావరణ వ్యవస్థపై పడేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన ఏడాది కంటే.. తర్వాతి ఏడాదిలో దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే కారణంగా 2026లో బలపడుతున్న ఎల్ నినో ప్రభావం 2027లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణంలో పెరిగిన గ్రీన్హౌస్ వాయువులు వేడిని బంధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎల్ నినో ప్రభావం కలవడంతో ఉష్ణోగ్రతలు గత అంచనాలను మించి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మారనున్న ప్రపంచ వాతావరణ ముఖచిత్రం!బలమైన ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను ప్రభావితం చేయగలదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర పొడి పరిస్థితులు ఏర్పడవచ్చు. దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఎండలు, కరవు పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫాన్ల తీవ్రత, వాటి ప్రయాణ మార్గాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.భారత్పై ఎలాంటి ప్రభావం?ఎల్ నినో ప్రభావం భారత వాతావరణంపై కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం కనిపించే సందర్భాలు గతంలో ఉన్నాయి. కొన్ని బలమైన ఎల్ నినో పరిస్థితుల సమయంలో వర్షపాతం తగ్గిన ఉదాహరణలు నమోదయ్యాయి. అయితే భారత రుతుపవనాలను ఎల్ నినో ఒక్కటే నిర్ణయించదు. హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల మార్పులు, స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ ఎల్ నినో బలపడితే వ్యవసాయం, నీటి వనరులు, వేసవి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.సహజ మార్పా? మానవ తప్పిదాల ప్రభావమా?ఎల్ నినో అనేది సహజంగా జరిగే ప్రక్రియే అయినప్పటికీ.. ప్రస్తుతం దాని ప్రభావం తీవ్రంగా కనిపించడానికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం వల్ల పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు భూమి ఉష్ణోగ్రతలను నిరంతరం పెంచుతున్నాయి. దీంతో సహజ వాతావరణ మార్పులు వచ్చిన ప్రతిసారి వాటి ప్రభావం గతంతో పోలిస్తే మరింత తీవ్రంగా కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది.మరో వేడి రికార్డుకు రంగం సిద్ధమా?ప్రస్తుత అంచనాలు నిజమైతే.. 2027 భూమి చరిత్రలోనే అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉంది. ఇది కేవలం ఉష్ణోగ్రతల రికార్డు మాత్రమే కాదు.. మారుతున్న వాతావరణ పరిస్థితులు భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లకు ఒక ముందస్తు హెచ్చరికగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో పేరుకుపోతున్న వేడి రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. భూమి వేడెక్కే వేగం ఇంకా తగ్గడం లేదు. కొత్త ఉష్ణోగ్రత రికార్డులకు వాతావరణం మరోసారి వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఎప్స్టీన్ కోట్ల సంపదకు ఏకైక వారసురాలు ఈమె!
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. లైంగిక నేరాల అభియోగాలు, ప్రముఖులతో సంబంధాలతో వివాదాస్పదంగా మారిన ఎప్స్టీన్.. 2019లో జైలులో అనుమానాస్పద రీతిలో కన్నుమూశాడు. అయితే ఇప్పటికీ ‘ఎప్స్టీన్ ఫైల్స్’ రూపంలో ఆ పేరు నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తన వందల కోట్ల ఆస్తి మీద రాసిన వీలునామా తెరపైకి వచ్చింది. ఆ వీలునామాలో కరీనా షులియాక్ అనే పేరు ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. అసలు ఆమె ఎవరు? ఎప్స్టీన్తో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది? అనే ప్రశ్నలు చర్చకు దారి తీశాయి.లైంగిక నేరాల ఆరోపణలతో తీవ్ర వివాదాస్పదంగా మారిన ఎప్స్టీన్ మరణం తర్వాత.. అతడి కోట్లాది డాలర్ల ఆస్తులకు వారసురాలిగా ఓ మహిళ పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే బెలారస్కు చెందిన దంత వైద్యురాలు కరీనా షులియాక్ (Karyna Shuliak). ఎప్స్టీన్ తన జీవితంలోని చివరి ఎనిమిదేళ్లలో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో కరీనా ఒకరు. 2019లో జైలులో ఎప్స్టీన్ ఆత్మహత్యకు కొద్ది రోజుల ముందు మార్చిన వీలునామాలో.. తన ఆస్తులకు ప్రధాన లబ్ధిదారుగా ఆమె పేరును చేర్చినట్లు దర్యాప్తు పత్రాలు వెల్లడించాయి.ఎప్స్టీన్ ఆస్తుల విలువ ఒక దశలో దాదాపు 100 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇందులో విలాసవంతమైన భవనాలు, ప్రైవేట్ దీవులు, పెట్టుబడులు, ఖరీదైన వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా 33 క్యారెట్ల వజ్రపు ఉంగరాన్ని కూడా ఆమెకు ఇవ్వాలని వీలునామాలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఆమె అతని సీక్రెట్ గర్ల్ఫ్రెండ్ అనే ఓ రూమర్ తరచూ వినిపిస్తుంటుంది.ఆమెకు 21.. అతనికి 58బెలారస్లో దంత విద్య అభ్యసించిన కరీనా.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్లో ఇంగ్లిష్ నేర్చుకుంటూ, దంత సహాయకురాలిగా పనిచేస్తున్న సమయంలో ఎప్స్టీన్తో పరిచయం ఏర్పడింది. కరీనా షులియాక్, జెఫ్రీ ఎప్స్టీన్ తొలిసారి 2011లో కలుసుకున్నారు. అప్పటికి కరీనా వయసు 21 ఏళ్లు కాగా.. ఎప్స్టీన్ వయసు 58 సంవత్సరాలు.దర్యాప్తు పత్రాల ప్రకారం.. ఎప్స్టీన్ ఆమెకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం, చదువుకు సహాయం చేస్తానని చెప్పడం ద్వారా దగ్గరయ్యాడు. మొదట్లో అతడి సహాయాన్ని అంగీకరించేందుకు కరీనా సంకోచించినప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.చిన్నప్పటి నుంచే దంత వైద్యురాలు కావాలని కలలు కన్న కరీనా.. అమెరికాలో తన చదువును కొనసాగించాలని భావించారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డెంటల్ మెడిసిన్లో చేరేందుకు ఆమె ప్రయత్నించగా.. తొలుత తిరస్కరణ ఎదురైనట్లు సమాచారం. ఆ తర్వాత ఎప్స్టీన్ తన పరిచయాలను ఉపయోగించి ఆమె అడ్మిషన్కు సహకరించినట్లు పత్రాలు వెల్లడించాయి. కొలంబియా యూనివర్సిటీకి సుమారు 2.10 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. అనంతరం కరీనా దంత విద్య పూర్తి చేసి.. అమెరికాలో పలు ప్రాంతాల్లో డెంటిస్ట్గా పనిచేసేందుకు లైసెన్స్లు పొందారు.గ్రీన్కార్డ్ కోసం వివాదాస్పద వివాహం!అమెరికాలో స్థిరపడే క్రమంలో కరీనాకు ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఎదురయ్యాయి. ఆమె స్టూడెంట్ వీసా గడువు ముగియడంతో దేశంలో ఉండటం కష్టంగా మారింది. ఈ సమయంలో ఎప్స్టీన్ ఓ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు పత్రాలు వెల్లడించాయి. 2013లో తనకు పరిచయమైన ఓ వ్యక్తితో కరీనాకు వివాహం జరిపించినట్లు సమాచారం. ఈ వివాహం ద్వారా కరీనాకు అమెరికా గ్రీన్కార్డ్ లభించింది. అనంతరం 2018లో ఆమె అమెరికా పౌరసత్వం పొందారు. అయితే ఈ వివాహం నిజమైనదా? లేక ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశారా? అనే అనుమానాలు తర్వాత వ్యక్తమయ్యాయి. అయితే అమెరికా అధికారులు ఆమె పౌరసత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఎప్స్టీన్కు ‘ఫేవరెట్’గా.. దర్యాప్తు పత్రాల్లో కరీనా ఎప్స్టీన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా కనిపిస్తారు. ఎప్స్టీన్ ఆమెను తన “ఫేవరెట్” అని పిలిచేవాడని పలు ఈమెయిల్స్ ద్వారా తెలుస్తోంది. ఆమెకు ప్రత్యేకంగా క్రెడిట్ కార్డు వినియోగం ఉండేది. ప్రయాణాలు, జీవన ఖర్చులు, కుటుంబ అవసరాలకు ఎప్స్టీన్ భారీగా డబ్బు ఖర్చు చేశాడు. రికార్డుల ప్రకారం.. వారి సంబంధ సమయంలో కరీనాకు దాదాపు 10 లక్షల డాలర్లకు పైగా చెల్లింపులు జరిగినట్లు సమాచారం. ఆమె తల్లిదండ్రులకు కూడా బెలారస్లో డబ్బు పంపినట్లు తెలుస్తోంది. కాలక్రమంలో కరీనా ఎప్స్టీన్ వ్యక్తిగత వ్యవహారాల్లో కీలకంగా మారారు. అతడి ఇళ్లలో సిబ్బంది నిర్వహణ, మరమ్మతులు, కొనుగోళ్లు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేవారని పత్రాలు చెబుతున్నాయి.అక్కడా డెంటల్ క్లినిక్!ఎప్స్టీన్కు చెందిన అమెరికా వర్జిన్ ఐలాండ్స్లోని ప్రైవేట్ దీవి లిటిల్ సెయింట్ జేమ్స్లో కూడా కరీనా కోసం డెంటల్ ఆఫీస్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అక్కడ ఆమెకు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు దర్యాప్తు రికార్డులు సూచిస్తున్నాయి. ఎప్స్టీన్ నివాసాల నిర్వహణలోనూ ఆమె పాత్ర ఉందని తెలుస్తోంది.నేరాల గురించి ఆమెకు తెలుసా?దర్యాప్తు పత్రాల్లో కరీనా ఎప్స్టీన్ వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించినప్పటికీ.. అతడి లైంగిక నేర కార్యకలాపాల్లో ఆమె భాగస్వామి అని నిర్ధారించే ఆధారాలు లేవని అధికారులు పేర్కొన్నారు. ఎప్స్టీన్ ఇతర యువతులతో ఉన్న సంబంధాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కొన్ని ఈమెయిల్స్ సూచిస్తున్నాయి. అయితే వాటి నుంచి దూరంగా ఉండాలని మాత్రమే కోరినట్లు తెలుస్తోంది.చివరి ఫోన్ కాల్ కూడా ఆమెకే!2019లో అరెస్టైన తర్వాత.. జైలు నుంచి ఎప్స్టీన్ చివరిగా మాట్లాడిన వ్యక్తుల్లో కరీనా ఒకరు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఆ సంభాషణలో కేసు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం సాగవచ్చని, తాను బలంగా ఉండాలని ఆమెకు చెప్పినట్లు సమాచారం. ఆ ఫోన్ కాల్ జరిగిన కొద్ది రోజులకే.. 2019 ఆగస్టు 10న జైలు గదిలో ఎప్స్టీన్ మృతిచెందాడు.అజ్ఞాత జీవితం, మళ్లీ..ఎప్స్టీన్ మరణం తర్వాత కరీనా కొంతకాలం ప్రజల దృష్టికి దూరంగా ఉన్నారు. అయితే తన దంత వైద్య వృత్తిని కొనసాగించారు. 2025లో న్యూయార్క్లో డెంటిస్ట్గా పనిచేసేందుకు లైసెన్స్ పొందారు. బ్రూక్లిన్లోని ఓ చిన్న క్లినిక్లో “డాక్టర్ కరీనా”గా పనిచేసినట్లు సమాచారం. అయితే ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన భారీ స్థాయిలో పత్రాలు విడుదల కావడంతో.. ఆమె గత జీవితం మరోసారి వెలుగులోకి వచ్చింది.చివరికి.. ఎప్స్టీన్ ఆస్తి మొత్తం ఆమె చేతికి వస్తుందా? లేక బాధితుల పరిహారానికి వెళ్తుందా? అనేది న్యాయ ప్రక్రియలపై ఆధారపడి ఉంది. లైంగిక నేరాల బాధితులకు పరిహారం చెల్లింపులు, న్యాయ ప్రక్రియల కారణంగా ఈ మొత్తం సంపద పూర్తిగా ఆమె చేతికి అందుతుందా? అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. అదే గనుక జరిగితే ఆమె చేతికి చిల్లిగవ్వ కూడా దొరకదు!. -
అమెరికా సియాటెల్లో కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. జనంతో కిక్కిరిసిన ఓ ఫుడ్ ఫెస్టివల్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారి సహా పలువురు గాయపడ్డారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ఫెస్టివల్ ప్రాంగణం భయానక వాతావరణంగా మారింది. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీయడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.Video: Shots heard, people fleeing at Seattle Center in Washington state. Reports of multiple victims. Livestream: Hawaiian Honey Cones. pic.twitter.com/YGv30969z2— AZ Intel (@AZ_Intel_) July 27, 2026వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో ఉన్న సియాటెల్ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అక్కడ ‘బైట్ ఆఫ్ సియాటెల్’ (Bite of Seattle) ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి వందలాది మంది సందర్శకులు తరలివచ్చారు. వివిధ రకాల ఆహార స్టాళ్లు, సంగీత కార్యక్రమాలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది.అంతా సాధారణంగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం వరుసగా కాల్పులు జరగడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కొందరు సమీప ప్రాంతాల్లో దాక్కునేందుకు ప్రయత్నించగా.. మరికొందరు తొక్కిసలాటకు గురయ్యారు.ఘటన సమయంలో ఎనిమిది రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించాయని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరికొందరు అంతకంటే ఎక్కువ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. కాల్పుల సమయంలో ఫెస్టివల్ ప్రాంగణంలో భారీ సంఖ్యలో ప్రజలు ఉండటంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సియాటెల్ అగ్నిమాపక విభాగం వెల్లడించింది. పలువురు గాయపడగా.. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు హార్బర్వ్యూ మెడికల్ సెంటర్ అధికారులు తెలిపారు.హార్బర్వ్యూ మెడికల్ సెంటర్ ప్రతినిధి సూసన్ గ్రెగ్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చిన బాధితులందరికీ తుపాకీ గాయాలు ఉన్నాయని తెలిపారు. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన బాధితులకు కూడా వైద్య చికిత్స అందిస్తున్నారు.ఘటన సమయంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఎస్టాన్ వకోనాబో పరిస్థితిని వివరిస్తూ.. కాల్పులు వినిపించగానే ప్రజలు అన్ని వైపులా పరుగులు తీశారని తెలిపారు. “ప్రజలు ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు కిందపడిపోయారు. చిన్నారుల బండ్లు కూడా పడిపోయాయి. అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది” అని చెప్పారు.కాల్పుల అనంతరం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సియాటెల్ సెంటర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజలను ఖాళీ చేయించారు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి మోనోరైల్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనపై సియాటెల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఎవరు? ఎందుకు కాల్పులు జరిపాడు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఓ అనుమానితుడని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.Seattle Shooting Suspect @komonews @lookner @CNN @cnnbrk @seattleinfo @seattletimes #seattle #seattleshooting pic.twitter.com/H2CUERXERH— Tyler Harrison (@TylerHarriledm) July 27, 2026ఘటనపై ఎఫ్బీఐ సహా పలు భద్రతా సంస్థలు దర్యాప్తులో భాగమయ్యాయి. ఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరిస్తూ.. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. జన రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటన అమెరికాలో మరోసారి తుపాకీ హింసపై చర్చకు దారితీసింది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం సియాటెల్ కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడి వివరాలు, కాల్పుల వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
ఇజ్రాయెల్కు సవాల్.. హెజ్బొల్లాకు ఖమేనీ భరోసా
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన ప్రకటన విడుదల చేశారు. మరోసారి షియా సాయుధ సంస్థ హెజ్బొల్లాకు బహిరంగంగా అండగా నిలిచారు. ఇజ్రాయెల్, అమెరికా ఒత్తిళ్లు ఎంత పెరిగినా ప్రతిఘటన ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తూ.. హెజ్బొల్లాను ఉద్దేశించి ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసెమ్కు పంపిన సందేశంలో "జిహాద్, ప్రతిఘటనే ముందుకు సాగే ఏకైక మార్గం" అని పేర్కొన్నారు. తన సందేశంలో ఖమేనీ, హెజ్బొల్లా ప్రస్తుతం "ప్రతిఘటన చరిత్రలో కీలక దశ"లో ఉందని పేర్కొన్నారు. యుద్ధాలు, ఆంక్షలు, నాయకత్వ మార్పులు వచ్చినా ప్రతిఘటన ఆగదని, పోరాట స్ఫూర్తే తమ బలమని చెప్పారు. హెజ్బొల్లా యోధులు లెబనాన్ ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారని ప్రశంసించారు.ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఘర్షణలు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అనంతరం కాల్పుల విరమణతో మధ్యప్రాచ్య పరిస్థితులు కొంత మారాయి. ఇదే సమయంలో లెబనాన్లో హెజ్బొల్లా వద్ద ఉన్న ఆయుధాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాల మధ్య ఖమేనీ చేసిన తాజా వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇరాన్కు హెజ్బొల్లా కేవలం మిత్ర సంస్థ మాత్రమే కాదు. ఇజ్రాయెల్, అమెరికా ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రాంతీయ "యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్"లో అది కీలక భాగంగా టెహ్రాన్ భావిస్తోంది. అందుకే హెజ్బొల్లాకు రాజకీయ, వ్యూహాత్మక మద్దతు కొనసాగుతుందని ఖమేనీ తాజా ప్రకటన ద్వారా మరోసారి స్పష్టం చేశారు. లెబనాన్లో ఇరాన్ ప్రభావం తగ్గలేదనే సంకేతాన్ని కూడా ఈ సందేశం ఇస్తోందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి. ఆ సంస్థ సైనిక సామర్థ్యాన్ని బలహీనపర్చేందుకు లెబనాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దేశంలోని అన్ని ఆయుధ బలగాలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని లెబనాన్ ప్రభుత్వం కూడా చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉన్నంత వరకు ఆయుధాలను వదిలే ప్రసక్తే లేదని హెజ్బొల్లా స్పష్టం చేస్తోంది.ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్ వైఖరిలో మార్పు వస్తుందేమోనని అంతర్జాతీయ వర్గాలు భావించాయి. అయితే ఖమేనీ తాజా ప్రకటనతో అలాంటి సంకేతాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్పై కఠిన వైఖరిని కొనసాగిస్తూనే, తమ మిత్ర బలగాలకు మద్దతు తగ్గబోదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.ఖమేనీ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులపై మరోసారి చర్చ మొదలైంది. ఒకవైపు శాంతి చర్చలు, కాల్పుల విరమణ ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు "జిహాద్, ప్రతిఘటనే ముందుకు సాగే మార్గం" అనే సందేశం వెలువడటం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఉద్రిక్తతలు, ఇరాన్ పాత్రపై ప్రపంచ దృష్టి మరోసారి మధ్యప్రాచ్యంపైనే కేంద్రీకృతమైంది. -
సహరాలో ఏనుగులు.. దట్టమైన అడవులు! గతం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి.. సహారా. పేరు వినగానే మన కళ్ల ముందు అంతులేని ఇసుక తిన్నెలు, మండే ఎండలు, చుక్క నీరు కూడా దొరకని నిర్మానుష్య భూభాగమే కనిపిస్తుంది. దాదాపు 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఎడారి.. ప్రస్తుతం ఉత్తర ఆఫ్రికాలోని పలు దేశాలను కప్పేసి ఉంది. కానీ వేల సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతం పూర్తిగా భిన్నంగా ఉండేదంటే నమ్మగలమా?ఇప్పుడు ఇసుక తుఫానులతో కనిపించే సహారా.. ఒకప్పుడు పచ్చని గడ్డి మైదానాలు, దట్టమైన అడవులు, ప్రవహించే నదులు, భారీ సరస్సులతో కళకళలాడిన ప్రాంతం. అక్కడ ఏనుగులు, నీటి గుర్రాలు, జిరాఫీలు, ఖడ్గమృగాలు వంటి భారీ జంతువులు సంచరించేవి. మనుషులు కూడా అక్కడ నివసిస్తూ వేటాడుతూ, చేపలు పట్టుతూ, వ్యవసాయం చేస్తూ జీవించేవారట.‘గ్రీన్ సహారా’గా మారిన ఎడారిశాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. సుమారు 11 వేల నుంచి 5 వేల సంవత్సరాల క్రితం మధ్య కాలంలో సహారా ప్రాంతం ‘ఆఫ్రికన్ వెట్ పీరియడ్’ (African Humid Period)గా పిలిచే తేమతో కూడిన దశను ఎదుర్కొంది. ఆ సమయంలో భూమి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎడారి ప్రాంతం పచ్చని భూభాగంగా మారింది. అప్పట్లో సహారాలో అనేక సరస్సులు ఏర్పడ్డాయి. కొన్ని సరస్సులు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేవని ఆధారాలు చెబుతున్నాయి. నదులు ప్రవహించడంతో జీవ వైవిధ్యం పెరిగింది. ఇప్పటి ఇసుక దిబ్బల కింద కూడా పురాతన నదీ మార్గాలు, సరస్సుల ఆనవాళ్లు శాస్త్రవేత్తలకు కనిపించాయి.గోడలపై కనిపించిన గతంసహారా ప్రాంతంలోని పురాతన రాతి చిత్రాలు కూడా అక్కడి చరిత్రను చెబుతున్నాయి. వేల సంవత్సరాల నాటి గుహలు, రాళ్లపై చెక్కిన చిత్రాల్లో ఏనుగులు, నీటి గుర్రాలు, జిరాఫీలు, పశువులు వంటి జంతువుల బొమ్మలు కనిపిస్తాయి. ఇవి ఒకప్పుడు అక్కడ విస్తారమైన జీవజాలం ఉండేదనడానికి ఆధారాలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు.. ఆ కాలంలో మనుషులు కూడా అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వేటతో పాటు పశుపోషణ, వ్యవసాయం చేసినట్లు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి.ఎలా ఎడారిగా మారింది?సహారా మార్పుకు ప్రధాన కారణం వాతావరణ మార్పులేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి అక్షం స్వల్పంగా మారడం వల్ల సూర్యకిరణాల ప్రభావం, వర్షపాతం నమూనాలు మారాయి. క్రమంగా వర్షాలు తగ్గిపోయాయి. సరస్సులు ఎండిపోయాయి. నదులు కనుమరుగయ్యాయి. పచ్చని మైదానాలు క్రమంగా ఇసుక ప్రాంతాలుగా మారిపోయాయి. వేల సంవత్సరాల పాటు జరిగిన ఈ ప్రక్రియలో సహారా ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటిగా మారింది.భవిష్యత్తులో మళ్లీ మారుతుందా?ప్రకృతి చరిత్రలో ఎడారులు శాశ్వతంగా ఒకే రూపంలో ఉండవని సహారా కథ చెబుతోంది. వాతావరణ పరిస్థితులు మారితే భూభాగాలు కూడా మారిపోతాయని ఇది నిరూపిస్తోంది. అయితే ప్రస్తుత వాతావరణ మార్పుల ప్రభావంతో సహారా మళ్లీ పచ్చగా మారే అవకాశం తక్షణ భవిష్యత్తులో లేదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి సహారా మనకు ఓ అంతులేని ఎడారిలా కనిపించినా.. దాని ఇసుక పొరల కింద ఓ పచ్చని చరిత్ర దాగి ఉంది. ఒకప్పుడు నదులు ప్రవహించిన, జంతువులు సంచరించిన, మనుషులు జీవించిన ఈ భూమి.. ప్రకృతి శక్తి ఎంత గొప్పదో చెప్పే అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. -
డబుల్ గేమ్ మొదలుపెట్టిన ట్రంప్
ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే.. అవసరమైతే భారీ సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇప్పుడు చర్చల్లో మరింత సీరియస్గా వ్యవహరిస్తోందని చెప్పిన ఆయన.. ఒప్పందం కుదరకపోతే గతం కంటే తీవ్ర స్థాయి దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.వైట్హౌస్లో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్పై భారీ దాడులకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే అమెరికా సైన్యం మాత్రం పూర్తిగా సిద్ధంగా ఉందని, ‘‘మేం సిద్ధంగా ఉన్నాం.. అవసరమైతే ముందుకు వెళ్తాం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘డీల్ లేదంటే భారీ దాడులు’ఇరాన్కు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాతో ఒక ఒప్పందానికి రావడం లేదా మరింత తీవ్ర స్థాయి సైనిక చర్యలను ఎదుర్కోవడం అని హెచ్చరించారు. ‘‘మేము వారితో మాట్లాడుతున్నాం. గతంతో పోలిస్తే ఇరాన్ ఇప్పుడు మరింత సీరియస్గా కనిపిస్తోంది. అయితే చర్చలు ఫలిస్తాయని ఇప్పుడే చెప్పలేం’’ అని ట్రంప్ అన్నారు.‘లాక్డ్ అండ్ లోడెడ్’అమెరికా సైనిక సామర్థ్యంపై ట్రంప్ మరోసారి స్పష్టత ఇచ్చారు. అవసరమైతే ఇరాన్పై మరింత భారీ దాడులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దౌత్య మార్గానికి అవకాశం ఇస్తున్నప్పటికీ.. సైనిక ఎంపికను పూర్తిగా పక్కన పెట్టలేదని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమమే ఈ వివాదానికి ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఇరాన్ మాత్రం..మరోవైపు అమెరికా ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. బెదిరింపులు, ఒత్తిళ్లతో ఇరాన్ను నియంత్రించలేరని స్పష్టం చేశారు. చర్చలకు తాము సిద్ధమే అయినప్పటికీ.. బలవంతపు షరతులను అంగీకరించబోమని పేర్కొన్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణలు, సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిపై ప్రభావం పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర రవాణాపై అనిశ్చితి నెలకొంది.ఈ పరిణామాల నేపథ్యంలో హర్ముజ్ ప్రాంతంలో వేలాది మంది నౌకా సిబ్బంది భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వందలాది నౌకలు ఆగిపోయాయని.. దాదాపు 6 వేల మంది నౌకా సిబ్బంది ఈ ప్రాంతంలోని ఉద్రిక్త పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) పేర్కొంది. నౌకల రాకపోకలకు అంతరాయాలు, భద్రతా పరమైన సవాళ్ల కారణంగా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.రష్యా, చైనాపైనా ట్రంప్ దృష్టిఇరాన్కు రష్యా, చైనా ఆయుధ సహాయం అందిస్తున్నాయన్న వార్తలపైనా ట్రంప్ స్పందించారు. ఆ దేశాల అధినేతలు ఇరాన్కు ఆయుధాలు అందించబోమని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇరాన్ విషయంలో అమెరికా తదుపరి నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిలో ఏదైనా పెద్ద పరిణామం చోటుచేసుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సఫలం అవుతాయా? లేక పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయా? అన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
ఇరాన్ ఆస్తులపై ట్రంప్ గురి.. టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధులను(ఫ్రీజ్డ్ ఫండ్స్) వినియోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధులను.. అమెరికా నౌకలు, సరుకు రవాణా నౌకలు, ఇతర సంబంధిత ఆస్తులకు జరిగిన నష్టాల భర్తీకి ఉపయోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇరాన్ చర్యల వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాషింగ్టన్ మళ్లీ దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత వేడి పెంచాయి.“ఇకపై నౌకలు, సరుకు లేదా వాటికి సంబంధించిన ఏదైనా ఆస్తికి జరిగే నష్టాలను అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ డబ్బుతో చెల్లిస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నష్టాలు భారీగా ఉండొచ్చని, అయినప్పటికీ ఇది న్యాయమైన చర్య అని ఆయన సమర్థించారు. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో రెండు సౌదీ చమురు నౌకలపై దాడులకు పాల్పడినట్లు ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ ఘాటు కౌంటర్ట్రంప్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఇతర దేశాల ఆస్తులను స్వాధీనం చేసుకుని భవిష్యత్తు నష్టపరిహారాలకు వినియోగించడం “పేలుడు స్వభావం కలిగిన ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది” అని వ్యాఖ్యానించారు. “ఒక దేశానికి చెందిన ఆస్తులను మరో దేశం సంబంధం లేని అంశాలకు ఉపయోగించడం సాధారణమైతే.. భవిష్యత్తులో ఏ దేశ ఆస్తులకూ భద్రత ఉండదు. దీని ఫలితంగా ఏర్పడే గందరగోళం శాంతియుతంగా ఉండదు” అని అరాఘ్చీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతర్జాతీయ నిబంధనలను బలహీనపరిచే చర్యగా ఆయన ట్రంప్ నిర్ణయాన్ని అభివర్ణించారు.నిధుల విలువ ఎంత?ఇరాన్పై అమెరికా ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఆర్థిక వ్యవస్థల్లో ఆ దేశానికి చెందిన భారీ మొత్తంలో నిధులు నిలిచిపోయాయి. ఈ నిధుల ఖచ్చితమైన విలువ స్పష్టంగా తెలియకపోయినా.. కొన్ని నివేదికల ప్రకారం వాటి విలువ సుమారు 124 బిలియన్ డాలర్ల నుంచి 167 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ స్తంభింపజేసిన నిధుల విడుదల ఇరాన్–అమెరికా మధ్య గత చర్చల్లో కీలక డిమాండ్గా ఉంది. అయితే ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం కూడా ముందుకు సాగలేదు.హౌతీల దాడులతో మళ్లీ ఉద్రిక్తతలుఇటీవల ఎర్ర సముద్రంలో సౌదీకి చెందిన రెండు చమురు నౌకలపై దాడులకు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు బాధ్యత వహించారు. హౌతీ అధికార ప్రతినిధి యాహ్యా సరీ మాట్లాడుతూ.. “ఎన్సీలియా (ENCELIA), లైలా (LAYLA)” అనే రెండు సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. సౌదీ రవాణా అధికారులు కూడా ఎన్సీలియా నౌకపై దాడి జరిగిందని, బాబ్ అల్-మందెబ్ జలసంధి వద్ద నౌక ముందుభాగంలో మంటలు చెలరేగినట్లు ధ్రువీకరించారు. ఇరాన్ కూడా హార్ముజ్ జలసంధిలో నిబంధనలు పాటించని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది.యుద్ధం నుంచి ఆర్థిక పోరాటం వరకుఅమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పటివరకు ప్రధానంగా సైనిక, దౌత్య స్థాయిలో కొనసాగింది. అయితే తాజా పరిణామాలతో ఆర్థిక ఆస్తులు కూడా ఈ పోరాటంలో కీలక ఆయుధాలుగా మారుతున్నాయి. ఒక దేశానికి చెందిన విదేశీ నిధులను మరో దేశం నష్టపరిహారాల కోసం వినియోగించడం అంతర్జాతీయ చట్టపరంగా కొత్త చర్చలకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాత్రం తన చర్యలను సమర్థిస్తూ.. తమ వాణిజ్య ప్రయోజనాలు, నౌకల భద్రతకు జరిగిన నష్టాలకు బాధ్యులను జవాబుదారీ చేయడమే లక్ష్యమని చెబుతోంది.న్యూయార్క్లో కత్తిపోట్ల కలకలంఇదిలా ఉండగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన రెండు కత్తిపోటు ఘటనలు కూడా చర్చనీయాంశంగా మారాయి. మాన్హాటన్లోని అప్పర్ వెస్ట్ సైడ్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన 51 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి సమయంలో నిందితుడు “అల్లాహు అక్బర్” అని నినదించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడంతో.. ఇది విద్వేష నేరమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా కారణం అయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. దాడిలో గాయపడిన ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ప్రపంచానికే ప్రమాదకర సంకేతమా?ఒక దేశానికి చెందిన స్తంభింపజేసిన ఆస్తులను మరో దేశం తన ప్రయోజనాలకు వినియోగించడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కొత్త వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాల విదేశీ నిధుల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తుల స్వాధీనం వంటి చర్యలు సాధారణ పరిణామంగా మారితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం, పెట్టుబడుల భద్రతపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ప్రపంచానికి పెరుగుతున్న సవాళ్లుఒకవైపు ఇరాన్ స్తంభింపజేసిన నిధుల వినియోగంపై అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు అమెరికాలో భద్రత, విద్వేష నేరాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. తాజా పరిణామాలు యుద్ధాలు కేవలం యుద్ధ రంగానికే పరిమితం కావని.. అవి ఆర్థిక వ్యవస్థలు, అంతర్జాతీయ నిబంధనలు, ప్రపంచ భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. -
వీడిన సౌదీ యువరాజు డెత్ మిస్టరీ.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!
సౌదీ రాజకుటుంబంలో నెలకొన్న డెత్ మిస్టరీ దాదాపుగా వీడింది. లండన్లోని ఓ విలాసవంతమైన హోటల్లో గతేడాది చివర్లో సౌదీ ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫహాద్ అల్ సౌద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన గుండె ఆగిపోవడంతోనే మరణించారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే.. మృతికి గల కారణాలపై ఇప్పుడు ఓ స్పష్టత వచ్చింది. మద్యం పార్టీలో డ్రగ్స్ కలిపిన డ్రింక్స్ సేవించడం.. అది ఓవర్డోస్ కావడం వల్లే అతను చనిపోయినట్లు బ్రిటన్ కోర్టు విచారణలో వెల్లడి కావడం కలకలం రేపుతోంది. 29 ఏళ్ల సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ ఫహాద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ బిన్ జలావి అల్ సౌద్.. లండన్లోని కెన్సింగ్టన్ ప్రాంతంలోని మారియట్ హోటల్లో నవంబర్ 25న మృతి చెందారు. రాజకుటుంబం కావడంతో.. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు జరిపారు. దీంతో విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. హోటల్ గదిలో చివరి క్షణాలు..వారానికి పైగా ఉండేందుకు నవంబర్ 19న ఆయన హోటల్లో దిగినట్లు విచారణలో తేలింది. మరణానికి ముందు రోజు రాత్రి యువరాజు సిగరెట్ తాగేందుకు హోటల్ బయటకు వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన గదికే వెళ్లిపోయారు. మరుసటి రోజు హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. బాత్రూమ్లో ఆయన అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించినా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మద్యం, డ్రగ్స్ కలయికే కారణమా?మరణంపై నిర్వహించిన టాక్సికాలజీ పరీక్షల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. యువరాజు రక్తంలో మద్యం స్థాయి అత్యంత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అది ఒక్కటే ప్రమాదకర స్థాయిలో ఉందని నిపుణులు తెలిపారు. అంతేకాకుండా పార్టీ డ్రగ్గా పిలిచే గామా హైడ్రాక్సీబ్యూటిరేట్ (GHB), గంజాయి ఆనవాళ్లు, ఆందోళన తగ్గించే మందుల అవశేషాలు కూడా గుర్తించారు. వీటి కలయిక వల్ల గుండె ఆగిపోయి మరణం సంభవించినట్లు వైద్య నిపుణులు కోర్టుకు తెలిపారు.గతంలోనూ వ్యసన సమస్యలుయువరాజు అబ్దుల్లా గతంలో మద్యం, కొన్ని ప్రిస్క్రిప్షన్ మందులపై ఆధారపడే సమస్యతో చికిత్స పొందినట్లు విచారణలో వెల్లడైంది. 2025లో బ్రిటన్లోని ఓ డీ-అడిక్షన్ క్లినిక్లో చేరి చికిత్స తీసుకున్నారని, అక్కడ డీటాక్స్ కార్యక్రమాన్ని పూర్తి చేశారని వైద్యులు తెలిపారు. అయితే చికిత్స అనంతరం నిర్ణీత ఫాలోఅప్ అపాయింట్మెంట్లకు హాజరు కాలేదని చెప్పారు.ఆత్మహత్య కాదు.. ప్రమాదవశాత్తు మరణంఈ ఘటనపై విచారణ జరిపిన అసిస్టెంట్ కరోనర్ జీన్ హార్కిన్.. యువరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సూసైడ్ నోట్ కూడా లభించలేదని, మూడో వ్యక్తి ప్రమేయానికి ఆధారాలు కనిపించలేదని తెలిపారు. మత్తు పదార్థాల మిశ్రమ ప్రభావంతో జరిగిన “ప్రమాదవశాత్తు మరణం” (Death by misadventure) గా తీర్పు నమోదు చేశారు.రాజకుటుంబంలో విషాదంసౌదీ రాజదర్బార్ కూడా యువరాజు అబ్దుల్లా మృతిని అధికారికంగా ధ్రువీకరించింది. రియాద్లోని వీఐపీ ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాజకుటుంబానికి చెందిన యువరాజు.. లండన్ లగ్జరీ హోటల్లో ఇలా విషాదాంతం చెందడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. -
రాత్రికి రాత్రే మారిన రోడ్లు.. పెట్రోల్ కార్లకు నో ఎంట్రీ!
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం వేగంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EV) దూసుకొస్తున్నాయి. అయితే ఈ మార్పును వేగవంతం చేసే విషయంలో ఓ చిన్న దేశం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. దక్షిణాసియాలోని లావోస్.. కొత్త పెట్రోల్, డీజిల్ ప్యాసింజర్ కార్ల దిగుమతులకు బ్రేక్ వేసి ఈవీల వైపు భారీ అడుగు వేసింది.లావోస్ ఒకేఒక్క నిర్ణయంతో ఆటో రంగంలో కొత్త అధ్యాయానికి తెరతీసినట్లు కనిపిస్తోంది. జూన్ 1, 2026 నుంచి కొత్తగా దిగుమతి అయ్యే ప్యాసింజర్ వాహనాల్లో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకే అవకాశం కల్పించింది. దీంతో “రాత్రికి రాత్రే రోడ్లపై మార్పు” అనే చర్చ మొదలైంది. అయితే ఇది పూర్తిస్థాయి పెట్రోల్, డీజిల్ వాహనాల నిషేధం కాదు. ప్రజా రవాణా వాహనాలు, నిర్మాణ రంగ వాహనాలు, ప్రత్యేక అవసరాల వాహనాలకు మినహాయింపులు ఉన్నాయి. ప్రధానంగా కొత్త వ్యక్తిగత కార్ల మార్కెట్ను ఈవీల వైపు మళ్లించడమే లక్ష్యం.పర్యావరణం కంటే ఆర్థిక లెక్కలే కీలకంలావోస్ నిర్ణయం వెనుక ప్రధాన కారణం కేవలం కాలుష్య నియంత్రణ కాదు. దేశానికి అవసరమైన ఇంధనంలో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు లావోస్లో విద్యుత్ ఉత్పత్తిలో జలవిద్యుత్ వాటా ఎక్కువ. అంటే.. విదేశాల నుంచి చమురు తెప్పించుకోవడం కంటే స్థానికంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను వినియోగించుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరమని ప్రభుత్వం భావిస్తోంది.చిన్న దేశం.. పెద్ద ప్రయోగంలావోస్ జనాభా, వాహన మార్కెట్ పరిమాణం భారత్తో పోలిస్తే చాలా చిన్నది. అందుకే అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని నేరుగా భారత్ వంటి భారీ ఆటో మార్కెట్కు వర్తింపజేయడం సాధ్యం కాదు. భారత్లో కోట్ల సంఖ్యలో పెట్రోల్, డీజిల్ వాహనాలు ఉన్నాయి. రవాణా వ్యవస్థ, ఛార్జింగ్ మౌలిక వసతులు, ఉద్యోగాలు, ఆటో పరిశ్రమ వంటి అనేక అంశాలు ఈవీ మార్పులో కీలకం. అందుకే భారత్ దశలవారీగా ఈవీలను ప్రోత్సహిస్తోంది. అయితే లావోస్ ప్రయోగం ఓ విషయం మాత్రం స్పష్టం చేస్తోంది. ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవాలని భావించే చిన్న దేశాలకు ఈవీలు ఒక వ్యూహాత్మక మార్గంగా మారుతున్నాయి.చైనా కంపెనీలకు కొత్త అవకాశం?లావోస్ నిర్ణయం వల్ల చైనా ఈవీ తయారీ సంస్థలకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తక్కువ ధరలో ఈవీలను అందిస్తున్న చైనా కంపెనీలు చిన్న మార్కెట్లలో వేగంగా విస్తరిస్తున్నాయి.ప్రపంచానికి సంకేతమా?లావోస్ తీసుకున్న నిర్ణయం ప్రపంచంలోని పెద్ద దేశాలకు కూడా ఓ చర్చను తెరపైకి తెచ్చింది. పెట్రోల్ యుగం నుంచి ఈవీ యుగానికి మార్పు కేవలం పర్యావరణ అంశం మాత్రమే కాదు.. అది శక్తి భద్రత, ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన నిర్ణయంగా మారుతోంది. చిన్న దేశమైన లావోస్ తీసుకున్న ఈ అడుగు.. భవిష్యత్తులో పెద్ద దేశాలు అనుసరించే మార్గాల్లో ఒకటిగా మారుతుందా? అనేది చూడాలి. -
ఇది చాల్లేదు.. ఇరాన్కు ఇంకా నొప్పి తెలియట్లేదు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇరాన్ మౌలిక వసతులపై అమెరికా బలగాలు దాడులు కొనసాగిస్తుండగా.. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్లు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు కూడా రంగంలోకి దిగడంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్పై మరింత కఠిన చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్పై భారీ స్థాయి సైనిక చర్యను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే జరుగుతున్న దాడులు సరిపోలేదని భావిస్తున్న ఆయన.. “ఇరాన్కు ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్సియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్పై గతంలో కంటే పెద్ద స్థాయిలో దాడి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. “నేను భారీ దాడి గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన వాటికంటే పెద్దదిగా ఉంటుంది. నిర్ణయం తీసుకునే దశకు చేరుకున్నాను” అని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే కొత్త దాడికి సంబంధించి అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఎలాంటి కొత్త సైనిక ఆదేశాలు కూడా జారీ కాలేదని తెలిపారు.చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు: ట్రంప్ఇరాన్ చర్చలకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ఒప్పందానికి రావడానికి సిద్ధంగా లేదని ట్రంప్ ఆరోపించారు. “వారికి ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అని వ్యాఖ్యానించారు. ఇరాన్పై ఒత్తిడి కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు.13వ రోజూ అమెరికా దాడులుమరోవైపు ఇరాన్పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. వరుసగా 13వ రాత్రి కూడా ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సామర్థ్యాన్ని తగ్గించడం, వాణిజ్య నౌకలపై ముప్పును అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతోంది.ఇజ్రాయెల్ మద్దతుపై ట్రంప్ వ్యాఖ్యలుఇటు.. ఇరాన్పై కొత్త ఆపరేషన్ జరిగితే ఇజ్రాయెల్ వెంటనే అమెరికాతో కలిసి వస్తుందని ట్రంప్ అన్నారు. “నేను అడిగితే ఇజ్రాయెల్ రెండు నిమిషాల్లో చేరుతుంది” అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా చర్యలకు ఇజ్రాయెల్ సహకారం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.హర్ముజ్ జలసంధిపై ఉత్కంఠఅమెరికా–ఇరాన్ ఘర్షణ ప్రభావం ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై పడుతోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ కూడా తనపై దాడులు కొనసాగితే ప్రాంతీయ చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.యుద్ధం విస్తరిస్తుందా?ఇరాన్కు మద్దతుగా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించారు. దీంతో మధ్యప్రాచ్య సంక్షోభం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
హిట్లర్ జన్మస్థలం.. ఇక నాజీ అడ్డా కాదు!
ఆస్ట్రియాలోని ఓ భవనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాజీ నియంతగా పేరున్న అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన చోటు అది. అయితే ఇప్పుడది సరికొత్త రూపాన్ని సంతరించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హిట్లర్ పేరిట ఆ భవనం మళ్లీ తీవ్రవాదులకు ఆకర్షణగా మారకుండా.. ఆస్ట్రియా ప్రభుత్వం వేసిన ప్లాన్ చర్చనీయాంశంగా మారింది. ఆ విషయంలోకి వెళ్తే..ఆస్ట్రియాలోని బ్రౌనౌ ఆమ్ ఇన్ పట్టణంలోని 15 సాల్జ్బర్గర్ ఫోర్స్టాడ్ట్ ప్రాంతంలో ఉన్న ఈ భవనం 17వ శతాబ్దంలో నిర్మించిన ఓ హోటల్. 1889 ఏప్రిల్లో అడాల్ఫ్ హిట్లర్ ఇక్కడే జన్మించాడు. అయితే అక్కడ ఎక్కువ కాలం నివసించలేదు. పుట్టిన కొన్ని వారాలకే అతడి కుటుంబం ఆ ఇంటిని విడిచిపెట్టింది. మూడేళ్ల వయసులోనే హిట్లర్ కుటుంబం ఆ పట్టణాన్ని పూర్తిగా వదిలి వెళ్లిపోయింది. 1938లో ఆస్ట్రియాను నాజీ జర్మనీలో విలీనం చేసే సమయంలో మాత్రమే హిట్లర్ ఈ ప్రాంతానికి తిరిగి వచ్చాడు.అతివాదులకు ‘తీర్థస్థలం’ కాకుండా..హిట్లర్ జన్మించిన ప్రదేశం కావడంతో.. ఈ భవనం భవిష్యత్తులో నాజీ అనుకూల వర్గాలకు(అతివాదులకు) ఆకర్షణ కేంద్రంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం దశాబ్దాల పాటు ఆ భవనాన్ని అద్దెకు తీసుకుంది. 2011 వరకు ఈ భవనంలో వికలాంగుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ ఉండేది. అయితే యజమాని మరమ్మతులకు అనుమతించకపోవడం, భవనాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు నిరాకరించడంతో అది కొన్నేళ్ల పాటు ఖాళీగా ఉండిపోయింది.ప్రభుత్వం స్వాధీనం.. కోర్టు పోరాటం2016లో ఆస్ట్రియా పార్లమెంట్ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వం ఆ భవనాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంది. ఇందుకు ప్రతిఫలంగా యజమానికి 8.12 లక్షల యూరోలు (సుమారు 9.5 లక్షల డాలర్లు) పరిహారంగా చెల్లించారు. అయితే పరిహారం తక్కువగా ఉందంటూ యజమాని కోర్టును ఆశ్రయించినా.. ఆ ప్రయత్నం ఫలించలేదు.కూల్చివేత ఆలోచనకు బ్రేక్..మొదట ఈ భవనాన్ని కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్టాలని అధికారులు భావించారు. అయితే చరిత్ర నిపుణులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నాజీ గతాన్ని చెరిపివేయడం కంటే.. దాన్ని గుర్తుంచుకుని సరైన సందేశం ఇవ్వడం ముఖ్యమని సూచించారు. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. 2019లో ఈ భవనాన్ని పోలీస్ స్టేషన్గా మార్చాలని ప్రకటించింది.మారిపోయిన రూపం.. కొత్త సందేశంయూరప్ స్థాయి ఆర్కిటెక్చర్ పోటీ నిర్వహించి భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించారు. పాత రూపం కనిపించకుండా ముఖభాగాన్ని కూడా మార్చేశారు. ఆధునిక కార్యాలయంలా కనిపించేలా తీర్చిదిద్దారు. ఈ మార్పు కోసం కోట్ల యూరోలు ఖర్చు చేశారు. ప్రస్తుతం పోలీసు సిబ్బంది అక్కడ విధులు ప్రారంభించారు.తీవ్రవాదానికి అడ్డుకట్టగా..హిట్లర్ పుట్టిన ప్రదేశం ఇకపై నాజీ అభిమానులకు స్ఫూర్తి కేంద్రంగా కాకుండా.. చట్టాన్ని కాపాడే పోలీస్ స్టేషన్గా ఉండాలన్నది ఆస్ట్రియా ప్రభుత్వ ఉద్దేశం. చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని దాచిపెట్టకుండా.. దానికి భిన్నమైన అర్థాన్ని ఇవ్వాలన్న ప్రయత్నంగా ఈ మార్పును పలువురు చూస్తున్నారు. హిట్లర్ జన్మించిన ఇల్లు ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాపలా కాస్తుండటం చరిత్రలో ఓ ఆసక్తికర పరిణామంగా మారింది. -
గల్ఫ్లో డ్రోన్ వార్.. ఆ ‘అదృశ్య శక్తి’ ఎవరు?.. అమెరికా ఆరా
గల్ఫ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడులు ఇప్పుడు మరో అంతర్జాతీయ రహస్యానికి తెరతీశాయి. అమెరికా కీలక నిఘా సంస్థ సీఐఏకు చెందిన రహస్య స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అయితే ఈ దాడుల వెనుక ఇరాన్ సొంత సామర్థ్యమే ఉందా? లేక మరేదైనా శక్తి సాంకేతికంగా సహకరించిందా? అన్న కోణంలో అమెరికా నిఘా వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి.ముఖ్యంగా ఇరాన్ ఉపయోగించిన డ్రోన్ల కచ్చితత్వం, లక్ష్యాలను చేరుకున్న విధానం అమెరికా అధికారుల్లో అనుమానాలు పెంచుతోంది. ఇంత అధునాతన సామర్థ్యం కలిగిన డ్రోన్లు ఎలా సిద్ధమయ్యాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.CIA స్థావరాలే లక్ష్యంగా?రాయిటర్స్ కథనం ప్రకారం.. మార్చిలో గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని సీఐఏ అనుబంధ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. సౌదీ అరేబియాలోని రియాద్ అమెరికా రాయబార కార్యాలయంలోని సీఐఏ కేంద్రం, ఇరాక్లోని మరో సీఐఏ అనుబంధ ప్రాంతం కూడా లక్ష్యంగా మారినట్లు సమాచారం. మరిన్ని రహస్య స్థావరాలు కూడా దాడుల పరిధిలోకి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడులకు ఇరాన్కు చెందిన ‘షహీద్’ డ్రోన్లను ఉపయోగించినట్లు పాశ్చాత్య నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.టెక్నాలజీ ఆ దేశానిదేనా?అమెరికా దర్యాప్తులో ఇప్పుడు కీలకంగా మారిన అంశం.. ఇరాన్ డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచడంలో రష్యా పాత్ర ఉందా అన్నది. ముఖ్యంగా రష్యాకు చెందిన ‘కొమెటా-ఎం’ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను ఇరాన్ డ్రోన్లలో ఉపయోగించారా అనే కోణంలో పరిశీలన సాగుతోంది. ఈ సాంకేతికత వల్ల డ్రోన్లు మరింత కచ్చితంగా లక్ష్యాలను చేరుకోవడంతో పాటు, వాటిని ఎలక్ట్రానిక్ జామింగ్తో అడ్డుకోవడం కూడా కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.దాడుల వెనుక నిఘా సమాచారమా?ఇరాన్కు రష్యా కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించిందా? లేక లక్ష్యాల వివరాలు, నిఘా సమాచారం కూడా ఇచ్చిందా? అనే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఇరాన్ అసలు లక్ష్యం అమెరికా రాయబార కార్యాలయాలు కావొచ్చని, సీఐఏ కేంద్రాలు అనుకోకుండా దెబ్బతిని ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై తుది నిర్ధారణకు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.రష్యా–ఇరాన్ బంధంపై కొత్త చర్చఇప్పటికే రష్యా, ఇరాన్ మధ్య సైనిక సహకారం కొనసాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ డ్రోన్ల వినియోగంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ.. గల్ఫ్లో అమెరికా లక్ష్యాలపై జరిగిన దాడుల్లో రష్యా పాత్ర ఉందా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అమెరికా, రష్యా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.డ్రోన్లతో సాగుతున్న ఆధునిక యుద్ధంలో.. ఒక దేశం దాడి చేస్తే, దాని వెనుక సాంకేతిక బలం ఎవరిది? అనే ప్రశ్న ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఇరాన్ డ్రోన్ దాడుల వెనుక నిజంగా రష్యా హస్తం ఉందా? లేక ఇది కేవలం అనుమానమేనా? అమెరికా దర్యాప్తు తేల్చాల్సి ఉంది. -
సాక్షి మార్నింగ్ రౌండప్: జులై 23.. నేటి బిగ్ హెడ్లైన్స్ ఇవే!
సాక్షి పాఠకులకు శుభోదయం!. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం మరింత వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు కొనసాగుతుండగా.. జంతర్మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో ఘర్షణల్లో పలువురు సిబ్బంది గాయపడ్డారు. మరోవైపు నీట్ అంశంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇవాళ్టి మేజర్ హెడ్లైన్స్ను పరిశీలిస్తే.. ఢిల్లీలో మళ్లీ ఉద్రిక్తత.. CJP నిరసనల్లో ఘర్షణలు నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీశాయి. జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల్లో మంగళవారం రాత్రి ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. టాల్స్టాయ్ మార్గ్ వద్ద కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న CJP ఉద్యమం నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీపై ప్రారంభమైన CJP ఉద్యమం పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ముంబైలో అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేశారు. వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. నాగ్పూర్లోనూ నిరసనకారులను పోలీసులు తరలించారు. అనుమతించిన సమయం ముగిసిన తర్వాత కూడా ఆందోళన కొనసాగించడంతో చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నీట్ లీకేజీపై కేంద్రం–రాహుల్ మధ్య వార్నీట్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ముదిరింది. గత పదేళ్లలో 150కిపైగా పేపర్ లీక్లు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించగా.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. పేపర్ లీక్ల విషయంలో రాహుల్ గాంధీ ఎంపిక చేసుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో జరిగిన లీక్లను ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. నీట్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నడ్డా స్పష్టం చేశారు.ఇరాన్పై అమెరికా దాడులు 12వ రోజుకు.. హార్ముజ్పై పెరుగుతున్న టెన్షన్మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్పై అమెరికా వరుసగా 12వ రాత్రి వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. తమపై దాడులు కొనసాగితే ప్రాంతీయ చమురు, గ్యాస్, విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.హార్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు.. చమురు సరఫరాపై ఆందోళనప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధానికి కేంద్రంగా మారింది. ఈ మార్గంలో అంతరాయం కొనసాగితే అంతర్జాతీయ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఇరాన్–అమెరికా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగితే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్పందిస్తూ.. తమ దేశం చమురు విక్రయించలేని పరిస్థితి వస్తే ఈ ప్రాంతంలోని మరే దేశం కూడా చమురు ఎగుమతి చేయలేదని హెచ్చరించారు.సోనమ్ వాంగ్చుక్ కీలక ప్రకటననీట్ నిరసనలకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని తెలిపారు.పంచదార్లకు నో మైనింగ్ జోన్.. వైఎస్సార్సీపీ పోరాటానికి ఫలితంఅక్రమ మైనింగ్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్మపోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. పంచదార్ల ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు. మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్ అనుమతులను రద్దు చేయాలని ఆదేశించారు. పంచదార్ల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పంచదార్లను నో మైనింగ్ జోన్గా ప్రకటించకపోతే ఉద్యమం చేపడతామని వైఎస్సార్సీపీ గతంలో హెచ్చరించింది.సీదిరి అప్పలరాజు అరెస్ట్తో పలాసలో ఉద్రిక్తతవైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కాశీబుగ్గ పోలీస్స్టేషన్కు తరలించారు. అప్పలరాజు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పలరాజు అరెస్ట్ను నిరసిస్తూ పలాసలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించాయి. మరోవైపు అరెస్ట్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతుకలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని చంద్రబాబు సర్కార్పై మండిపడ్డారు.తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్.. పలు జిల్లాలకు హెచ్చరికతెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.జింబాబ్వేతో టీమిండియా తొలి టీ20 నేడుఇంగ్లండ్ పర్యటన తర్వాత టీమిండియా మరో టీ20 సిరీస్కు సిద్ధమైంది. జింబాబ్వేతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ నేడు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్న ఈ సిరీస్లో భారత జట్టు ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో తమను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సొంతగడ్డపై జింబాబ్వే కూడా టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. యువ భారత్ జోరు చూపిస్తుందా? లేదంటే జింబాబ్వే షాక్ ఇస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఈరోజు ఫోకస్లో..ఢిల్లీలో CJP నిరసనలు.. పోలీసులతో ఘర్షణలునీట్ లీకేజీపై కేంద్రం–రాహుల్ గాంధీ వార్పార్లమెంట్ సమావేశాలు.. నీట్పై చర్చకు ప్రభుత్వం సిద్ధం.. మంత్రి రాజీనామాకు విపక్షాల పట్టుఇరాన్పై అమెరికా 12వ రోజు దాడులుహార్ముజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలుప్రపంచ చమురు సరఫరాపై ప్రభావంసోనమ్ వాంగ్చుక్ దీక్షపై కీలక పరిణామంపంచదార్ల విషయంలో ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటంమాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.. అప్డేట్స్తెలుగు రాష్ట్రాల్లో వర్షాల హెచ్చరికలుమరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్, విశ్లేషణలు, ప్రత్యేక కథనాల కోసం రోజంతా సాక్షి.కామ్తోనే ఉండండి. -
హమాస్కు కొత్త బాస్.. గాజా కన్నీళ్లు తుడుస్తాడా?
యుద్ధం, ఆకలి, నిరాశ్రయ జీవితంతో అల్లాడుతున్న గాజాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్ కొత్త అత్యున్నత నాయకుడిగా ఖలీల్ అల్-హయ్యా ఎన్నికయ్యారు. యాహ్యా సిన్వార్ తర్వాత సంస్థ పగ్గాలు చేపట్టిన ఆయనకు హమాస్ అంతర్గత ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నాయకత్వ మార్పుతో గాజా ప్రజల ముఖచిత్రంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు!..యుద్ధం తమ ఇళ్లను, కుటుంబాలను, భవిష్యత్ను దెబ్బతీసిన వేళ.. హమాస్ నాయకత్వ మార్పుపై గాజా ప్రజల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కొత్త నాయకుడు కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తుండగా.. మరికొందరు నాయకులు మారినా పరిస్థితులు మారకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎవరీ ఖలీల్ అల్-హయ్యా?ఖలీల్ అల్-హయ్యా హమాస్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నేత. గాజాలో జన్మించిన ఆయన.. 1987లో హమాస్ ఏర్పాటైన నాటి నుంచి సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇస్లామిక్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. అనంతరం జోర్డాన్, సూడాన్లలో ఉన్నత విద్యను అభ్యసించారు.రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన అల్-హయ్యా.. ఆ తర్వాత హమాస్లో చురుకైన నాయకుడిగా ఎదిగారు. 2006లో పాలస్తీనా శాసనసభ ఎన్నికల్లో గాజా నుంచి విజయం సాధించారు. అనంతరం హమాస్ పొలిట్బ్యూరోలో కీలక సభ్యుడిగా మారారు. హమాస్ మాజీ నేతలు ఇస్మాయిల్ హనియె, యాహ్యా సిన్వార్లకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన.. సంస్థ రాజకీయ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు.చర్చల బల్లపై కీలకంగా.. ఖలీల్ అల్-హయ్యాకు మరో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇజ్రాయెల్తో జరిగిన పరోక్ష చర్చల్లో హమాస్ తరఫున ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందాలపై ఖతార్, ఈజిప్ట్ వంటి మధ్యవర్తి దేశాలతో చర్చలు జరిపిన అనుభవం ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికతో భవిష్యత్లో హమాస్ చర్చల వైఖరి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. యుద్ధాన్ని కొనసాగించే వైఖరినే అనుసరిస్తారా? లేక చర్చలకు మరింత ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.యుద్ధం మిగిల్చిన వ్యక్తిగత విషాదంఖలీల్ అల్-హయ్యా జీవితంలోనూ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. 2007లో ఆయన ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో భార్య, పిల్లలు, సోదరులు సహా పలువురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లోనూ ఆయన కుటుంబానికి చెందిన మరికొందరు మరణించారు. ఈ వ్యక్తిగత విషాదాలు ఆయన రాజకీయ వైఖరిపై ప్రభావం చూపాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్పై కఠిన వైఖరిని కొనసాగించే నేతల్లో ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు.గాజా ప్రజలకు బతుకే ముఖ్యంహమాస్లో కొత్త నాయకుడు ఎన్నికైనప్పటికీ.. గాజాలో సామాన్య ప్రజల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇళ్లు కోల్పోయి, శిబిరాల్లో జీవిస్తున్న వేలాది కుటుంబాలకు రాజకీయ పరిణామాల కంటే రోజువారీ అవసరాలే ప్రధానంగా మారాయి. “మాకు నాయకులు మారడం ముఖ్యం కాదు.. మా పిల్లలకు ఆహారం కావాలి. తాగునీరు కావాలి. మందులు కావాలి. భయం లేకుండా జీవించే పరిస్థితి కావాలి” అని పలువురు గాజా ప్రజలు చెబుతున్నారు. మరికొందరు.. “ఏ నాయకుడు వచ్చినా మా జీవితాల్లో మార్పు కనిపించకపోతే ప్రయోజనం ఏమిటి? మాకు శాంతి కావాలి” అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆశలు.. అనుమానాలు రెండూఖలీల్ అల్-హయ్యాకు చర్చల అనుభవం ఉండటంతో కాల్పుల విరమణ, బందీల విడుదల, మానవతా సహాయం వంటి అంశాల్లో పురోగతి సాధించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం నాయకుడు మారినా హమాస్ ప్రాథమిక విధానాల్లో పెద్ద మార్పు ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆయన ఎన్నిక హమాస్ పోరాట వైఖరిని కొనసాగించే సంకేతమని విశ్లేషిస్తున్నవారూ ఉన్నారు.ముందున్న అతిపెద్ద సవాల్ ఇదేప్రస్తుతం ఖలీల్ అల్-హయ్యా ముందున్న సవాల్ హమాస్ను నడిపించడం మాత్రమే కాదు. యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న గాజాలో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు? కాల్పుల విరమణను స్థిరంగా కొనసాగించగలరా? అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య సంస్థ భవిష్యత్ వ్యూహాన్ని ఎలా రూపొందిస్తారు? అన్నది కీలకంగా మారింది.గాజాలో మానవతా సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారగా.. ఆహారం, వైద్యం, విద్యుత్, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఖలీల్ అల్-హయ్యా నాయకత్వంపై ప్రపంచం దృష్టి పెట్టినా.. గాజా ప్రజల ఆకాంక్ష మాత్రం ఒక్కటే. “మాకు రాజకీయ విజయాలు వద్దు.. మా పిల్లలు భయపడకుండా బతికే రోజు రావాలి.” -
ఇరాన్ వార్.. భారీ మూల్యం చెల్లించుకుంటున్న అమెరికా
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా ఖజానాపై భారీ భారంగా మారుతోంది. ఇప్పటివరకు ఈ యుద్ధానికి సంబంధించిన ఖర్చు 37.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.2 లక్షల కోట్లకు పైగా) చేరిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. యుద్ధ వ్యయాలను భరించేందుకు అదనపు నిధులు కేటాయించాలని ఆయన అమెరికా కాంగ్రెస్ను కోరారు.కాంగ్రెస్ కమిటీలో జరిగిన విచారణ సందర్భంగా హెగ్సెత్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ మొత్తం ఖర్చులో ఇప్పటికే జరిగిన యుద్ధ కార్యకలాపాలతో పాటు.. సెప్టెంబర్ 30 వరకు అంచనా వేసిన వ్యయాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ అదనపు నిధుల కోసం ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో కాంగ్రెస్ను దాదాపు 90 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7.7 లక్షల కోట్లకు పైగా) అదనపు నిధులు కోరారు. ఇందులో ఎక్కువ భాగం ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఖర్చులేనని సమాచారం. అంతేకాకుండా 2027 ఆర్థిక సంవత్సరానికి పెంటగాన్ ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.128 లక్షల కోట్లకు పైగా) బడ్జెట్ను ప్రతిపాదించింది. ఈ నిధులు కేటాయించకపోతే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని రక్షణ మంత్రి హెగ్సెత్ వ్యాఖ్యానించారు.యుద్ధంపై అమెరికాలో అసంతృప్తిఇరాన్తో యుద్ధంపై అమెరికాలో విమర్శలు పెరుగుతున్నాయి. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. యుద్ధ వ్యయం, ద్రవ్యోల్బణం అంశాలను ప్రతిపక్ష డెమొక్రాట్లు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్లో పలువురు సభ్యులు.. ట్రంప్ ప్రభుత్వం యుద్ధ పరిణామాలపై తమకు తగిన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. డెమొక్రాట్ సెనేటర్ పాటీ ముర్రే మాట్లాడుతూ.. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగుతుందా అన్న ఆందోళన వ్యక్తం చేశారు.18 మంది అమెరికా సైనికుల మృతిఇరాన్తో జరుగుతున్న పోరులో ఇప్పటివరకు 18 మంది అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ తెలిపింది. మరో 430 మంది వరకు సైనికులు గాయపడినట్లు వెల్లడించింది. అయితే జూలై 7 తర్వాత గాయపడిన వారిలో 96 శాతం మంది తిరిగి విధుల్లో చేరారని అధికారులు తెలిపారు.కొనసాగుతున్న దాడులుఅమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల ప్రారంభంలోనే కుప్పకూలింది. ఆ తర్వాత ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్లోని లక్ష్యాలపై దాడులను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఇంధన కేంద్రాలు, వంతెనలు, వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఖార్గ్ ద్వీపం, అణు కేంద్రాలపై ట్రంప్ హెచ్చరికలుఇరాన్లో కీలకమైన ఖార్గ్ ద్వీపం చమురు కేంద్రంపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే భూగర్భంలో ఉన్న అణు సంబంధిత కేంద్రాలపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తాజాగా ఓ లోతైన భూగర్భ అణు కేంద్రాన్ని(పికాక్స్ మౌంటెన్ (Pickaxe Mountain) “త్వరలోనే ధ్వంసం చేస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు.సైనిక సామర్థ్యాలపై ప్రభావంయుద్ధ ఖర్చులు పెరగడంతో అమెరికా సైనిక శిక్షణ కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసర నిధులు అందకపోతే సైనిక నిర్వహణ, ఆయుధాల ఆధునీకరణ, భవిష్యత్ రక్షణ ప్రాజెక్టులపై ఒత్తిడి పెరుగుతుందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ తెలిపారు.మొత్తంగా.. ఇరాన్పై సైనిక చర్య అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంత కీలకమైనదైనా.. దాని ఆర్థిక భారం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. బిలియన్ల డాలర్ల ఖర్చు, సైనిక నష్టాల మధ్య ట్రంప్ ప్రభుత్వానికి ఇరాన్ యుద్ధం సవాల్గా మారుతోంది. -
ట్రంప్ నిర్ణయంతో మిడిల్ ఈస్ట్లో కొత్త టెన్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్కు ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా సౌదీ తన భూభాగంలోనే యురేనియం శుద్ధి (ఎన్రిచ్మెంట్) చేపట్టే అవకాశం లభించనుంది. అయితే గతంలో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందాలతో పోలిస్తే.. సౌదీ డీల్లో కీలక భద్రతా నిబంధనలు లేకపోవడంపై అంతర్జాతీయంగా కలకలం రేగింది.ట్రంప్ ప్రభుత్వం ఆమోదించిన ఈ ఒప్పందం దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. దీని విలువ పదుల బిలియన్ల డాలర్లుగా ఉండనుంది. ఈ ఒప్పందం అమలైతే సౌదీ అరేబియాలో పౌర అణు విద్యుత్ కార్యక్రమాల నిర్మాణంలో అమెరికా కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇతర దేశాల కంపెనీలకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అణు ఇంధన రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని పెంచే వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందాన్ని చూస్తున్నారు.సంప్రదాయ భద్రతా నిబంధనలు లేవా?అమెరికా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాల్లో.. అణు సాంకేతికత దుర్వినియోగం కాకుండా కఠినమైన నిబంధనలు ఉండేవి. కానీ సౌదీతో కుదుర్చుకున్న తాజా ఒప్పందంలో అలాంటి కొన్ని కీలక రక్షణ చర్యలు లేకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ అనుమతి ఇవ్వడం భవిష్యత్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.వైట్హౌస్లో కీలక భేటీ తర్వాత నిర్ణయంఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో వైట్హౌస్లో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం అణు ఒప్పందంపై ముందడుగు పడింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్యాకేజీని త్వరలోనే అమెరికా కాంగ్రెస్ పరిశీలనకు పంపనున్నట్లు సమాచారం.‘123 అగ్రిమెంట్’లో భాగంగా..అమెరికా విదేశీ దేశాలతో అణు సహకారం కోసం రూపొందించే ప్రత్యేక ఒప్పందాన్ని సాధారణంగా ‘123 Agreement’ అని పిలుస్తారు. తాజా ఒప్పందంలో భాగంగా అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్, సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్ సంతకాలు చేసినట్లు సమాచారం.మిడిల్ ఈస్ట్లో కొత్త అణు సమీకరణాలు?చమురు సంపదతో ప్రపంచంలో కీలక శక్తిగా ఉన్న సౌదీ.. ఇప్పుడు అణు ఇంధన రంగంలో అడుగులు వేయడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా-సౌదీ అణు ఒప్పందం మిడిల్ ఈస్ట్ వ్యూహాత్మక సమీకరణాలను మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. -
నెతన్యాహుకు ట్రంప్ కవచం.. అమెరికా గడ్డపై అది అసాధ్యం!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘అరెస్ట్ వ్యవహారం’ అమెరికాలో ఈసారికి రాజకీయ దుమారం రేపుతోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో.. న్యూయార్క్ పర్యటనకు వస్తే నెతన్యాహును అరెస్ట్ చేసే అవకాశం ఉందని నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు స్వయానా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి కౌంటర్ ఇచ్చారు.‘‘బెంజమిన్ నెతన్యాహు అమెరికాలో ఎక్కడా, ఎప్పుడూ అరెస్ట్ కాబోరు’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల కోసం నెతన్యాహు న్యూయార్క్కు వచ్చే అవకాశం ఉండటంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.‘అరెస్ట్ చేయాలనే ప్రశ్నే లేదు’.. ట్రంప్ స్పష్టంనెతన్యాహు అమెరికా పర్యటనపై చర్చ జరుగుతున్న వేళ.. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమెరికా భూభాగంలో ఇజ్రాయెల్ ప్రధానిని అరెస్ట్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ పాత్రను కూడా ట్రంప్ ప్రశంసించారు. అయితే న్యూయార్క్ మేయర్ మమ్దానీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలకు సమాధానంగానే ట్రంప్ ప్రకటన వెలువడినట్లు భావిస్తున్నారు.మమ్దానీ వ్యాఖ్యలతో మొదలైన వివాదంన్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెతన్యాహు నగరానికి వస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తున్నామని తెలిపారు. ‘‘నెతన్యాహు ది హేగ్లో ఉండాల్సిన వ్యక్తి’’ అని వ్యాఖ్యానించిన ఆయన.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై వారెంట్ జారీ చేసిందని గుర్తుచేశారు. అయితే అదే సమయంలో చట్టాలకు లోబడే తాము పనిచేస్తామని కూడా మమ్దానీ స్పష్టం చేశారు. రాజకీయ అభిప్రాయాల ఆధారంగా కాకుండా.. న్యూయార్క్ చట్టాలు, అమెరికా నిబంధనల ప్రకారమే నిర్ణయం ఉంటుందని తెలిపారు.ఐసీసీ వారెంట్ చుట్టూ వివాదంగాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు సంబంధించి ఆరోపణలపై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఐసీసీకి తమపై అధికార పరిధి లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా.. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఐసీసీని ఏర్పాటు చేసిన రోమ్ ఒప్పందంలో భాగస్వాములు కావు. దీంతో ఐసీసీ వారెంట్లను అమలు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత అమెరికాకు లేదని నిపుణులు చెబుతున్నారు.ఇజ్రాయెల్ ఆగ్రహంమమ్దానీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందించింది. ఐసీసీని ‘నకిలీ న్యాయస్థానం’గా అభివర్ణిస్తూ.. నెతన్యాహుపై జారీ చేసిన వారెంట్ అసంబద్ధమని పేర్కొంది. మమ్దానీ దేశీయ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది.సెప్టెంబర్ పర్యటనపై ఉత్కంఠప్రతి ఏడాది సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలకు ప్రపంచ దేశాల నేతలు న్యూయార్క్కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు గత రెండేళ్ల పర్యటనల సందర్భంగా.. ఇలాంటి చర్చే నడుస్తూ వస్తోంది. అరెస్ట్ భయంతోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాల్లో.. అతి గోప్యంగా న్యూయార్క్కు చేరుకుంటున్నారనే చర్చా జరుగుతోంది. అంతేకాదు.. ఐరాసలోనూ ఆయనకు ‘నిరసన గళం’తో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. మామ్దానీ కామెంట్ల నేపథ్యంలో ఈసారి పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఐసీసీ వారెంట్.. మరోవైపు అమెరికా రక్షణగా నిలవడం.. ఇంకోవైపు న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలు.. ఈ పరిణామాలతో నెతన్యాహు అమెరికా పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
హర్ముజ్ తర్వాత మరో షాక్.. హౌతీల సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ పదో రోజుకు చేరుకున్న వేళ.. యెమెన్కు చెందిన ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులు చేసిన సంచలన ప్రకటన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య, ఇంధన నౌకలపై నావికా దిగ్బంధం విధిస్తున్నట్లు హౌతీలు ప్రకటించారు. ఈ పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న గల్ఫ్ ప్రాంతంలో మరో కొత్త యుద్ధ ఫ్రంట్ తెరుచుకునే ప్రమాదం కనిపిస్తోంది.సౌదీ నేతృత్వంలోని కూటమి యెమెన్పై విధించిన ఆంక్షలు, చర్యలకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌతీ సాయుధ విభాగం వెల్లడించింది. సౌదీకి వ్యతిరేకంగా ‘మారిటైమ్ ఎంబార్గో’ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రపంచ ఇంధన సరఫరా మార్గాలపై మరోసారి తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన బాబ్ ఎల్ మండెబ్ bab el mandeb జలసంధిపై ప్రభావం పడితే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ రెండు కీలక సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరాలో భారీ కోత వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు మార్కెట్లలో కలవరంహౌతీల ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ చమురు మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. అయితే దౌత్య చర్చలపై ఆశలు ఉండటంతో ధరలు కొంత మేర తగ్గాయి. అయినప్పటికీ.. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పితే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ చమురు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే సౌదీ అరేబియా రవాణా మార్గాలకు ముప్పు ఏర్పడితే దాని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది.ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగింపుమరోవైపు ఇరాన్పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. పదో రోజు కూడా అమెరికా వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ సైనిక కమాండ్ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, నౌకా సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇరాన్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తబ్రీజ్, చాబహార్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి పరిసర ప్రాంతాల్లో అమెరికా దాడుల ప్రభావం కనిపించినట్లు సమాచారం.ఇరాన్ మాత్రం అమెరికా దాడులకు ప్రతీకార చర్యలు కొనసాగిస్తామని ప్రకటిస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా మిత్ర దేశాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.హర్ముజ్లో ట్యాంకర్లపై దాడులుగల్ఫ్ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిలో మరో కలకలం చోటుచేసుకుంది. రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. సురక్షితం కాని మార్గంలో ప్రయాణించడంతో ఈ ఘటన జరిగిందని ఇరాన్ పేర్కొంది.అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్వతంత్ర సంస్థలు ధ్రువీకరించలేదు. మరోవైపు ఒమన్ తీరంలో ఓ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగినట్లు బ్రిటన్కు చెందిన సముద్ర భద్రతా సంస్థ వెల్లడించింది.దౌత్య ప్రయత్నాలు.. కానీ తగ్గని ఉద్రిక్తతలుయుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని పాకిస్థాన్కు చేరుకుని చర్చలు ప్రారంభించారు. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలు చేస్తోంది.అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం దౌత్యం కంటే సైనిక చర్యలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇరాన్ దాడుల్లో మరణించిన అమెరికా సైనికులకు ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.గల్ఫ్ దేశాల్లో భయంఇరాన్-అమెరికా ఘర్షణ ప్రభావం గల్ఫ్ దేశాలపై కూడా పడుతోంది. కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. తమపై జరిగిన దాడులపై ఖతార్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. నష్టపరిహారం కోరుతూ చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే హర్ముజ్ జలసంధి.. ఇప్పుడు బాబ్ ఎల్ మండెబ్ మార్గంపై కూడా ముప్పు ఏర్పడటంతో ప్రపంచ దేశాల దృష్టి మొత్తం మధ్యప్రాచ్యంపై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ మరింత విస్తరిస్తే.. అది కేవలం ప్రాంతీయ యుద్ధంగానే కాకుండా ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
దెయ్యాలతో ‘ఒక్క రాత్రి’ గడిపితే చాలూ!
ఒక ఇల్లు... బయటికి చూస్తే మామూలుగానే కనిపిస్తుంది. కానీ ఆ గడప దాటిన క్షణం నుంచి కథ మారిపోతుంది. ఆ ఇంటి గురించి ఊరంతా ఒకటే మాట. "అక్కడ ఏదో ఉంది... రాత్రిళ్లు వింత శబ్దాలు వినిపిస్తాయి... ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది..." ఇలాంటి మాటలు వింటే చాలామంది ఆ ఇంటి దగ్గరికి కూడా వెళ్లడానికి భయపడతారు. కానీ కొందరు మాత్రం అదే ఇంట్లో ఒంటరిగా రాత్రంతా గడపడానికి సిద్ధమవుతున్నారు. అదీ సరదా కోసం కాదు... ఉద్యోగం కోసం!ఈ పని చేయాలంటే ముందు ఆ ఇంట్లోకి అడుగుపెట్టాలి. సాయంత్రం నుంచి తెల్లవారే వరకు అక్కడే ఉండాలి. మధ్యలో బయటకు రావడం ఉండదు. ప్రతి గదిలో తిరగాలి. ప్రతి మూలను గమనించాలి. రాత్రి వేళ వినిపించే శబ్దాలు, తలుపులు కదిలాయా? వస్తువులు స్థానాలు మారాయా? అనుమానాస్పద ఘటనలేమైనా జరిగాయా? అనే ప్రతిదాన్ని నమోదు చేయాలి. ఇందుకోసం ప్రత్యేక కెమెరాలు, ఆడియో రికార్డర్లు, ఇతర పర్యవేక్షణ పరికరాలను కూడా అమర్చుతారు. తెల్లవారేసరికి జరిగిన ప్రతిదానిపై పూర్తి నివేదిక సిద్ధం చేస్తారు.రాత్రంతా ఎలాంటి అసాధారణ ఘటనలు నమోదు కాకపోతే... ఆ ఇంట్లో అతీంద్రియ కార్యకలాపాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్ తర్వాతే ఆ ఇంటిని కొనాలనుకునేవారు, అద్దెకు తీసుకోవాలనుకునేవారిలో ఉన్న మానసిక భయం కొంతవరకు తగ్గుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అంటే ఈ ఉద్యోగం కేవలం భూతాల కోసం కాదు... భయాన్ని తొలగించేందుకు చేసే పరీక్ష అన్నమాట!.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... కొన్ని సంస్థలు తమ ధ్రువీకరణపై అంత నమ్మకంతో ఉంటున్నాయి. ఒకసారి తాము "సురక్షితం" అని ప్రకటించిన ఇంట్లో తర్వాత నిజంగానే ఏదైనా అతీంద్రియ ఘటన జరిగినట్లు నిరూపితమైతే పరిహారం కూడా చెల్లిస్తామని హామీ ఇస్తున్నాయి. అందుకే ఈ ఉద్యోగంలో ధైర్యంతో పాటు ఓపిక, పరిశీలనా నైపుణ్యం కూడా అవసరమని చెబుతున్నారు.ఇంత సస్పెన్స్ ఉన్న ఈ ఉద్యోగం ఎక్కడ ఉందో తెలుసా? జపాన్లో. అక్కడ ఒక రాత్రి ఇలాంటి ఇంట్లో గడిపినందుకు 88 వేల యెన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.52 వేల) వరకు పారితోషికం చెల్లిస్తున్నారు. ఈ వినూత్న ఉద్యోగాన్ని చాలామంది ఇప్పుడు 'ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్', 'హాంటెడ్ హౌస్ సిట్టర్' పేర్లతో పిలుస్తున్నారు.వామ్మో జికో బుక్కెన్!జపాన్లో ఇలాంటి ఇళ్లను 'జికో బుక్కెన్' (Jiko Bukken) అని పిలుస్తారు. అంటే గతంలో హత్య, ఆత్మహత్య, అగ్నిప్రమాదం లేదా వృద్ధులు ఒంటరిగా మరణించి చాలా రోజుల తర్వాత గుర్తించిన ఘటనలు జరిగిన ఇళ్లు. అక్కడి చట్టాల ప్రకారం అలాంటి చరిత్రను కొనుగోలుదారులు, అద్దెదారులకు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. దీంతో తక్కువ ధరకు దొరికినా చాలామంది ఇలాంటి ఇళ్లకు దూరంగా ఉంటారు. ఫలితంగా వేలాది ఇళ్లు సంవత్సరాల తరబడి ఖాళీగా మిగిలిపోతున్నాయి.భయాన్ని వ్యాపారంగా మార్చి..ఈ సమస్యకు పరిష్కారంగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాయి. ముందుగా ధైర్యవంతులైన వ్యక్తులను పంపించి ఇంట్లో రాత్రంతా ఉండేలా చేస్తారు. ఎలాంటి అసాధారణ ఘటనలు లేవని ధ్రువీకరణ లభించిన తర్వాత ఆ ఇంటిపై కొనుగోలుదారుల్లో విశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తారు. దీంతో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఇళ్లకు మళ్లీ డిమాండ్ వస్తుందని యజమానులు ఆశిస్తున్నారు.మారుతున్న యువత ఆలోచనఒకప్పుడు ఇలాంటి ఇళ్లు అంటే పూర్తిగా దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇళ్ల ధరలు భారీగా పెరగడంతో "తక్కువ ధరకు మంచి ఇల్లు దొరికితే గతం గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు" అనే భావన యువతలో పెరుగుతోంది. అందుకే గతంలో అపశకునంగా భావించిన ఇళ్లు ఇప్పుడు చౌకైన గృహాలుగా కొత్త కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.మొత్తానికి... ఇది దెయ్యాల కథ కాదు... భయాన్ని అవకాశంగా మార్చుకున్న ఓ వినూత్న వ్యాపార ఆలోచన. ఒక రాత్రి ధైర్యంగా గడిపితే రూ.52 వేల సంపాదన... అదే సమయంలో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఓ ఇంటికి కొత్త జీవితం. అందుకే ఈ వింత ఉద్యోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది. -
7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
మెక్సికో-గ్వాటెమాల సరిహద్దు సమీపంలోని పసిఫిక్ తీరంలో సంభవించిన భారీ భూకంపం మధ్య అమెరికా దేశాలను వణికించింది. శుక్రవారం రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం మెక్సికోతో పాటు గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ ప్రాంతాల్లో బలంగా నమోదైంది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటివరకు భారీ ప్రాణనష్టం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం నమోదుకాలేదు.అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. భూకంప కేంద్రం మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రం, ఆక్విలెస్ సెర్డాన్ ప్రాంతానికి నైరుతి దిశగా సముద్రంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం భూమి లోపల సుమారు 15 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఆ తర్వాత 4.9 నుంచి 6 తీవ్రత మధ్య పలు ప్రకంపనలు (ఆఫ్టర్షాక్స్) నమోదయ్యాయి.సునామీ హెచ్చరికలు.. తీర ప్రాంతాల్లో అప్రమత్తతభూకంపం సముద్రంలో సంభవించడంతో అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ, మెక్సికో అధికారులు అప్రమత్తమయ్యారు. మెక్సికో నేవీ ప్రజలను తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. సుమారు ఆరు గంటల పాటు బీచ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.మెక్సికో, గ్వాటెమాల తీరాల్లో ఒక మీటర్ వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే పెద్ద ఎత్తున సునామీ ఏర్పడే పరిస్థితి కనిపించలేదని తర్వాత స్పష్టం చేశారు.భయంతో పరుగులు తీసిన ప్రజలుచియాపాస్ రాష్ట్రంలోని తపచులా నగరంలో భూకంపం మొదట స్వల్పంగా ప్రారంభమై తర్వాత తీవ్రత పెరిగింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న అలెజాండ్రా మెండోజా మాట్లాడుతూ.. "మొదట ఇది సాధారణ ప్రకంపన అనుకున్నాం. కానీ క్రమంగా తీవ్రత పెరగడంతో అందరం భవనం నుంచి బయటకు వచ్చాం" అని తెలిపారు.గ్వాటెమాల రాజధాని గ్వాటెమాల సిటీలో భూకంపం సమయంలో రద్దీగా ఉన్న రోడ్లపైకి ప్రజలు పరుగులు తీశారు. పలు భవనాలను ఖాళీ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.ఇద్దరికి గాయాలుమెక్సికోలోని తపచులాలో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఓ హైతీ వలస మహిళ భయంతో ఓ అపార్ట్మెంట్ భవనం నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. మరో వ్యక్తికి ఓ దుకాణం అద్దం పగిలి స్వల్ప గాయాలయ్యాయి.మెక్సికో అధ్యక్షురాలి స్పందనమెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మాట్లాడుతూ.. చియాపాస్, టబాస్కో రాష్ట్రాల్లో ప్రాథమికంగా ఎలాంటి పెద్ద నష్టం కనిపించలేదని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే మెక్సికో సిటీ వరకు ప్రకంపనలు అనిపించినప్పటికీ అక్కడ భూకంప హెచ్చరిక వ్యవస్థ పనిచేయలేదు. భూకంపం ప్రారంభ దశలో నమోదైన శక్తి హెచ్చరిక స్థాయిని దాటలేదని అధికారులు వివరించారు.గ్వాటెమాలలో పాఠశాలలు మూసివేతగ్వాటెమాల ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసింది. శాన్ మార్కోస్, క్వెట్జాల్టెనాంగో తదితర భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెడ్క్రాస్ అత్యవసర బృందాలను రంగంలోకి దింపి నష్టాన్ని అంచనా వేస్తోంది.భూకంపాలకు సున్నితమైన ప్రాంతంమెక్సికో, గ్వాటెమాల ప్రాంతాలు భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ భారీ భూకంపాలు సంభవించాయి. 2017లో మెక్సికోలో సంభవించిన 7.1 తీవ్రత భూకంపం వందలాది ప్రాణాలను బలిగొంది.తాజా భూకంపం మూడు దేశాల్లో ప్రకంపనలు సృష్టించినప్పటికీ.. ప్రస్తుతం పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆఫ్టర్షాక్స్, సునామీ ముప్పును దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. -
'మాకేం అవసరం'.. పెద్దన్నకు చైనా స్ట్రాంగ్ కౌంటర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. చైనా అమెరికా ఎన్నికల డేటాలో భారీ స్థాయిలో జోక్యం చేసుకుందని, దాదాపు 22 కోట్ల (220 మిలియన్) మంది అమెరికన్ ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచ రాజకీయాల్లో "పెద్దన్న"గా భావించే ఆయన.. అమెరికా ఎన్నికల భద్రతపైనే విదేశీ జోక్యం జరిగిందంటూ చేసిన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీశాయి. అయితే, ట్రంప్ ఆరోపణలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చైనా కౌంటర్ ఇచ్చింది. వైట్హౌస్లో ప్రైమ్టైమ్లో ప్రసంగించిన ట్రంప్.. 2020 ఎన్నికల సమయంలోనే చైనా అమెరికా ఓటర్ల డేటాను లక్ష్యంగా చేసుకుని చరిత్రలోనే అతిపెద్ద డేటా చోరీకి పాల్పడిందని ఆరోపించారు. దీంతో అమెరికా ఎన్నికల భద్రత తీవ్ర ప్రమాదంలో పడిందన్నారు. ఎన్నికల వ్యవస్థలోని లోపాలను "డీప్ స్టేట్"లోని కొందరు కావాలనే దాచిపెట్టారని కూడా విమర్శించారు.ట్రంప్ ఆరోపణలకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియూ చాంగ్ స్పందించారు. "అమెరికా ఎన్నికలతో మాకేం అవసరం?. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న సూత్రాన్ని చైనా ఎప్పుడూ పాటిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తిగా అమెరికా అంతర్గత అంశం. వాటి ఫలితాన్ని అమెరికా ప్రజలే నిర్ణయిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. భవిష్యత్తులో కూడా జోక్యం చేసుకోదు. అలాంటి అవసరం కూడా మాకు లేదు" అని స్పష్టం చేశారు.ఇక ట్రంప్ తన ప్రసంగంలో.. రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి అమెరికా ఎన్నికల వ్యవస్థ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న అమెరికా ఎన్నికల విధానం నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలకు ఏమాత్రం సరిపోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రతి ఓటు ఖచ్చితంగా లెక్కించబడేలా, హ్యాకింగ్ లేదంటే విదేశీ జోక్యానికి అవకాశం లేకుండా ఎన్నికల వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఎన్నికల మౌలిక వసతుల్లో ఉన్న బలహీనతలను వెల్లడించే కీలక నిఘా సమాచారాన్ని ప్రజలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.అమెరికాలో ఓటర్ల నమోదుకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేసే సేవ్ యాక్ట్ SAVE Actను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్ను ట్రంప్ కోరారు. అయితే, ఈ బిల్లు అమలైతే లక్షలాది మంది చట్టబద్ధ ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఓటర్ల హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం విదేశీయులు ఓటు వేయడం ఇప్పటికే నిషేధితమే.ఇక 2020 ఎన్నికల్లో భారీ మోసం జరిగిందన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన నిర్ధారణ లభించలేదు. ట్రంప్, ఆయన మద్దతుదారులు దాఖలు చేసిన 60కుపైగా కేసుల్లో ఎన్నికల ఫలితాలను మార్చే స్థాయి అక్రమాలు జరిగాయని ఏ కోర్టూ తేల్చలేదు. రీకౌంట్లు, ఆడిట్లు, ట్రంప్ హయాంలోని న్యాయశాఖ కూడా అలాంటి ఆధారాలు గుర్తించలేదు.అంతేకాకుండా, ఎన్నికల మోసంపై తన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయని ఏబీసీ, ఎన్బీసీ వంటి టీవీ నెట్వర్క్లపై కూడా ట్రంప్ మండిపడ్డారు. అవి ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే కుట్రలో భాగమని ఆరోపిస్తూ.. వాటి ప్రసార లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
పాక్కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్ కొత్త ఎత్తుగడ!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే.. ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారమైన బాబ్ అల్-మందెబ్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సూచించింది!. ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లతో పాటు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇప్పటికే హౌతీలు క్షిపణులు, డ్రోన్లను బాబ్ అల్-మందెబ్ ప్రాంతానికి సమీపంలో మోహరించి, ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ప్రపంచ చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.బాబ్ అల్-మందెబ్ జలసంధి(Bab al-Mandab Strait) ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్తో అనుసంధానించే ఈ జలసంధి మీదుగానే ఆసియా-యూరప్ మధ్య పెద్దఎత్తున చమురు, సహజవాయువు, ఇతర వాణిజ్య సరకు రవాణా జరుగుతుంది. ఈ మార్గం మూసివేయబడితే నౌకలు ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు, బీమా ప్రీమియాలు పెరిగి అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో హౌతీలను వ్యూహాత్మక ఒత్తిడి సాధనంగా ఉపయోగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్పై నేరుగా దాడులు జరిగితే సమాధానం కేవలం తన భూభాగానికే పరిమితం కాకుండా, ప్రాంతంలోని కీలక సముద్ర మార్గాలపై కూడా ప్రభావం చూపించేలా వ్యూహం అమలు చేసే అవకాశాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు... ఇదే సమయంలో ఈ పరిణామాలు పాకిస్థాన్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. హౌతీలు ఇటీవల సౌదీ అరేబియాపై మళ్లీ క్షిపణి దాడులు ప్రారంభించడంతో ఇస్లామాబాద్లో ఆందోళన పెరిగింది. ఒకవైపు ఇరాన్తో దౌత్య సంబంధాలు కొనసాగించాలని చూస్తున్న పాకిస్థాన్, మరోవైపు సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ భాగస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.గత ఏడాది కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం వేలాది మంది పాకిస్థాన్ సైనికులు ప్రస్తుతం సౌదీ అరేబియాలో విధులు నిర్వహిస్తున్నారు. యుద్ధం మరింత విస్తరించి సౌదీపై దాడులు తీవ్రతరమైతే.. పాకిస్థాన్ తటస్థంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి "సౌదీపై దాడి అంటే పాకిస్థాన్పైనే దాడిగా పరిగణిస్తాం. అదే మా రెడ్లైన్" అని రాయిటర్స్కు చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీలు నౌకలపై దాడులు ప్రారంభిస్తే.. ప్రపంచ వాణిజ్యంతో పాటు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో అంతరాయాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్కు.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ఇంధన దిగుమతులు, సరకు రవాణా మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం పరిస్థితి పూర్తిస్థాయి ఘర్షణకు దారితీయకపోయినా, ఇరాన్, హౌతీలు, అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్థాన్ల ప్రయోజనాలు ఒకే వేదికపై ఢీకొనే పరిస్థితి ఏర్పడుతోంది. బాబ్ అల్-మందెబ్, హర్ముజ్ జలసంధుల భద్రతపై నెలకొన్న అనిశ్చితి ప్రపంచ ఇంధన సరఫరా, సముద్ర వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముండటంతో అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తోంది. -
ఓట్ల చోరీ.. చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని పాత పాటే పాడిన ఆయన.. ఈసారి ఆసియా దేశమైన చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్ల సంఖ్యలో అమెరికన్ల ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఆ దేశం దొంగిలించిందని ఆరోపించారు. అంతేకాదు అమెరికా ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన (Data Breach)గా దీనిని అభివర్ణించారు. అమెరికా ప్రైమ్ టైమ్ స్పీచ్లో భాగంగా.. ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఎన్నికల భద్రతపై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. కోట్ల 22 కోట్ల (220 మిలియన్ల) అమెరికన్ ఓటర్ల డేటాను చైనా చోరీ చేసిందన్నారు. ఇటీవల గోప్యత నుంచి తొలగించిన (డీక్లాసిఫై చేసిన) నిఘా పత్రాల్లో చైనా భారీ స్థాయిలో అమెరికా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్నారని చెప్పారు. ఆ డేటాలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ పార్టీ అనుబంధం వంటి సున్నితమైన వివరాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమాచారాన్ని ఓటరు నమోదు ప్రక్రియతో పాటు ఇతర దురుద్దేశపూర్వక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.#WATCH | US President Donald Trump says, "The documents cover five major areas of concern. They show that over a period of years, starting during the 2020 election cycle, the People's Republic of China carried out what is believed to be the largest compromise of election data in… pic.twitter.com/V8efjdVqT1— ANI (@ANI) July 17, 2026'డీప్ స్టేట్ నిజాలను దాచింది'అమెరికా ఎన్నికల వ్యవస్థపై దాడి చేసే సామర్థ్యం చైనాతో పాటు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్కు ఉందని అమెరికా నిఘా వ్యవస్థ గుర్తించినట్లు ట్రంప్ తెలిపారు. చైనా ఎన్నికల జోక్యానికి సంబంధించిన కీలక నిఘా సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపించారు. తన తొలి అధ్యక్ష పదవీకాలంలో ఈ సమాచారం తనకు, అమెరికా ప్రజలకు తెలియకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే జాతీయ నిఘా విభాగం (ODNI), న్యాయశాఖ (DOJ), ఎఫ్బీఐ, సీఐఏలను ఆదేశించినట్లు వెల్లడించారు. సమాచారం దాచిన వారిపై ఉద్యోగాల నుంచి తొలగింపుతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని సూచించినట్లు చెప్పారు.మళ్లీ అదే మాట2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. ఆ ఎన్నికల్లో ఉపయోగించిన కొన్ని ఓటింగ్ యంత్రాల్లో లోపాలు ఉన్నాయని, ఎన్నికల వ్యవస్థలో అనేక బలహీనతలు బయటపడ్డాయని ఆరోపించారు. అమెరికా ఎన్నికల భద్రతను బలోపేతం చేయాలంటే కఠినమైన ఎన్నికల సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.ఓటర్లకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి?భవిష్యత్తులో ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఓటర్ల నమోదు సమయంలో అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే అధికారిక పత్రాలు తప్పనిసరి చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఫొటో ఐడీ లేకుండా ఓటు హక్కు కల్పించకూడదని, రాష్ట్రాలు-కేంద్రం మధ్య ఓటర్ల సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ లక్ష్యంతో రిపబ్లికన్లు మద్దతిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ SAVE America Act వంటి చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఆధారాలు చూపలేదు.. నిఘా వర్గాల వేర్వేరు అభిప్రాయాలుఅయితే తన ప్రసంగంలో ట్రంప్ ఈ ఆరోపణలకు ప్రత్యక్ష ఆధారాలు మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, అమెరికా నిఘా వర్గాలకు చెందిన కొన్ని సమాచారం ప్రకారం.. చైనా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసి ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నప్పటికీ, 2020 ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును మార్చిందని లేదంటే ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసిందని నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.అలాగే 2020 ఎన్నికల ఫలితాలను ట్రంప్ గతంలోనూ పలుమార్లు ప్రశ్నించినప్పటికీ, అమెరికా కోర్టులు, రీకౌంట్లు, అధికారిక సమీక్షల్లో ఎన్నికల ఫలితాన్ని మార్చే స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు వెలుగుచూడలేదని గతంలో తేలింది. అయినప్పటికీ ఎన్నికల భద్రత అంశాన్ని ట్రంప్ మరోసారి జాతీయ చర్చగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
శత్రువే అయినా ప్రశంసించాల్సిందే.. ఇరాన్ను పొగిడిన ట్రంప్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ.. డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఒకవైపు ఇరాన్పై సైనిక ఒత్తిడి కొనసాగిస్తూనే.. మరోవైపు అదే దేశానికి ట్రంప్ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు. శత్రుదేశాన్నే ప్రశంసించేలా ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఓ ఆసక్తికర పరిణామం ఉంది.2024 డిసెంబర్ నుంచి ఇరాన్లో నిర్బంధంలో ఉన్న అమెరికా-ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన డెనా కరారీకి తాజాగా విముక్తి లభించింది. ఆమెను ఇరాన్ విడుదల చేయడాన్ని 'సద్భావ సంకేతం' (Goodwill Gesture)గా అభివర్ణించిన ట్రంప్.. ఆ దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రూత్ సోషల్లో స్పందిస్తూ.. "ఆమె ఇప్పుడు సురక్షితంగా ఇరాన్ వెలుపల ఉంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఈ సద్భావ చర్యను అమెరికా అభినందిస్తోంది" అని పేర్కొన్నారు.ట్రంప్ పోస్టు అనంతరం మానవ హక్కుల న్యాయవాది జారెడ్ జెన్సర్.. విడుదలైన మహిళ డెనా కరారీనేనని ధృవీకరించారు. 2024లో కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇరాన్కు వెళ్లిన ఆమెను అక్కడి అధికారులు దేశం విడిచి వెళ్లనీయలేదు. అనంతరం 2025లో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ఆమెపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశారు. అంతకుముందు.. డెనా అమెరికాలోని ఓ టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం చేయడంతో పాటు ఇరాన్లో పేద పిల్లల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థను నడిపేవారు. డెనా కరారీ విడుదలకు ట్రంప్ చేసిన నిరంతర ప్రయత్నాలే కారణమని జారెడ్ జెన్సర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె అమెరికాకు తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు వెల్లడించారు. గత రెండు దశాబ్దాల్లో 20 దేశాల్లో 340 మందికిపైగా ఖైదీల విడుదలకు జెన్సర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇరాన్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ‘‘ఇరాన్ చర్చలు కోరుకుంటోంది. వారితో ఒప్పందం కుదురుతుందేమో చూడాలి. అయితే వారు సరిగ్గా, మర్యాదగా ప్రవర్తించాలి (They better behave)’’ అంటూ హెచ్చరించారు. అలా కాదని ఘర్షణలు కొనసాగితే ఇరాన్ త్వరలోనే ఓటమి పాలవుతుందని కూడా వ్యాఖ్యానించారు. అయితే చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.మరోవైపు అమెరికా హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఇరాన్కు చెందిన తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై రెండో విడత దాడులు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిస్పందించిన ఇరాన్.. ఇది తమ ఉనికికే సంబంధించిన యుద్ధమని పేర్కొంటూ, అవసరమైతే ప్రాంతీయ ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
'బిగ్ న్యూస్' అంటూ ట్రంప్ సస్పెన్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్కంఠ రేపుతున్నారు. ఇవాళ రాత్రికి ప్రత్యేక ప్రైమ్టైమ్ ప్రసంగం చేయనున్నట్లు ప్రకటించారు. "ఇది నిజంగానే చాలా పెద్ద వార్త" అంటూ ఆసక్తిని మరింత పెంచారు. అయితే ఆ ప్రకటన ఏంటన్నది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు.వైట్హౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. దీంతో.. యుద్ధం సంబంధిత ప్రకటన కాదనేది స్పష్టమైపోయింది. అయితే.. ప్రసంగంలో ప్రధానంగా అమెరికా ఎన్నికల వ్యవస్థ, మరీ ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కొత్త సమాచారం, ఓటింగ్ యంత్రాల భద్రత వంటి అంశాలు ఉండే అవకాశం ఉంది. అలాగే తాజాగా డీక్లాసిఫై చేసిన నిఘా సమాచారాన్ని కూడా ఆయన ప్రస్తావించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.ఈ ప్రసంగం నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర (మిడ్టర్మ్) ఎన్నికలకు కొద్ది నెలల ముందే రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్పై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ట్రంప్ తన మద్దతుదారులను మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు పెంచే అవకాశం ఉందని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు.మళ్లీ అదే వివాదమా?2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన ట్రంప్.. అప్పటి నుంచి ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అనేక దర్యాప్తులు, కోర్టు విచారణలు స్పష్టం చేశాయి. అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ (CISA) కూడా 2020 ఎన్నికలను అమెరికా చరిత్రలోనే అత్యంత భద్రమైన ఎన్నికలుగా పేర్కొంది.అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం 2020 ఎన్నికలకు సంబంధించిన పలు పత్రాలను సేకరించడం, దర్యాప్తులను కొనసాగించడం, ఓటింగ్ విధానాల్లో మార్పులకు ప్రయత్నించడం వంటి చర్యలు చేపడుతోంది. ఓటర్ల గుర్తింపు నిబంధనలు కఠినతరం చేయడం, మెయిల్-ఇన్ బ్యాలెట్లపై పరిమితులు విధించడం వంటి అంశాలను కూడా ట్రంప్ ముందుకు తీసుకొస్తున్నారు.ఇక ట్రంప్ ప్రసంగంపై డెమొక్రాట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలపై ఆధారంలేని ఆరోపణలను మరోసారి ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీయొద్దని వారు హెచ్చరిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 6గం. ప్రాంతంలో ట్రంప్ ప్రసంగం ఉండనుంది.. -
ఎల్ నినో ఉగ్రరూపం!.. ఫసిఫిక్ వేడితో డేంజర్ బెల్స్
భూమి వాతావరణాన్ని తలకిందులు చేసే శక్తివంతమైన ఎల్ నినోమరోసారి బలపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి కేవలం సముద్ర ఉపరితలంలోనే కాదు.. పసిఫిక్ మహాసముద్రం లోతుల్లోనే భారీగా వేడి నీటి నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ అసాధారణ మార్పులను నాసా ఉపగ్రహాలు గుర్తించడంతో ప్రపంచ వాతావరణ నిపుణులు అప్రమత్తమయ్యారు. సముద్రం అడుగున నుంచి తూర్పు పసిఫిక్ వైపు కదులుతున్న ఈ వేడి ప్రవాహాలు భవిష్యత్లో అత్యంత శక్తివంతమైన(గాడ్జిల్లా) ఎల్ నినోకు సంకేతాలా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా కనిపించే ఎల్ నినో (El Niño) పరిస్థితులతో పోలిస్తే.. ఈసారి సముద్రం వేడెక్కుతున్న వేగం, తీవ్రత భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అందుకే 2026లో ఏర్పడే అవకాశం ఉన్న ఈ ఎల్ నినోను కొందరు నిపుణులు ‘గాడ్జిల్లా ఎల్ నినో’గా అభివర్ణిస్తున్నారు.150 ఏళ్ల రికార్డును బద్దలయ్యేనా?2026-27 కాలానికి సంబంధించి వెలువడుతున్న తాజా వాతావరణ నమూనాలు సంచలన అంచనాలను చూపిస్తున్నాయి. ఈసారి ఏర్పడే ఎల్ నినో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన ఘటనలను అధిగమించే అవకాశం ఉందని కొన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. గతంలో 1997-98లో నమోదైన ఎల్ నినో ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత 2015-16 ఎల్ నినో కూడా రికార్డు స్థాయి వేడితో చరిత్రలో నిలిచింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న సముద్ర మార్పులు.. 2026 ఎల్ నినో వీటిని మించే స్థాయికి చేరవచ్చనే అంచనాలకు కారణమవుతున్నాయి.ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. 14 ప్రధాన వాతావరణ నమూనాల నుంచి సేకరించిన వందలాది అంచనాల్లో ఎక్కువ భాగం ఈసారి ఎల్ నినో బలంగా మారే అవకాశాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల పసిఫిక్లోని నినో-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని నమూనాలు అంచనా వేస్తున్నాయి.ఇది 2015-16లో నమోదైన దాదాపు 2.75 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల కంటే ఎక్కువ. ఈ అంచనాలు నిజమైతే.. గత 150 ఏళ్ల వాతావరణ రికార్డుల్లోనే ఇది అత్యంత అసాధారణమైన ఎల్ నినోగా నిలిచే అవకాశం ఉంది.నాసా ఉపగ్రహాల్లో కనిపించిన వేడి అలలుపసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెంటినెల్-6 మైఖేల్ ఫ్రైలిచ్ ఉపగ్రహం పరిశీలిస్తోంది. ఉపగ్రహ డేటాలో సముద్రం లోతుల్లో ప్రయాణించే కెల్విన్ తరంగాలు (Kelvin Waves) భారీ మొత్తంలో వేడి నీటిని తూర్పు పసిఫిక్ వైపు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎల్ నినో ఏర్పడటంలో ఈ తరంగాలు కీలక పాత్ర పోషిస్తాయి.సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంలో గాలుల ప్రవాహం, సముద్ర ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యత ఉంటుంది. అయితే ట్రేడ్ గాలులు బలహీనపడినప్పుడు.. సముద్రం లోతుల్లో దాగి ఉన్న వేడి నీరు తూర్పు వైపు కదులుతుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయి.వేగం కూడా శాస్త్రవేత్తలకు షాక్ఈసారి ఎల్ నినో తీవ్రత మాత్రమే కాదు.. అది అభివృద్ధి చెందుతున్న వేగం కూడా నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. 1997-98 ఎల్ నినో అత్యంత వేగంగా బలపడిన ఘటనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుత పరిణామాలు అంతకంటే వేగంగా మారుతున్నట్లు కొన్ని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. 2026 ప్రారంభంలో లా నినా తరహా పరిస్థితుల నుంచి ఈ ఎల్ నినో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సముద్ర మార్పులకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి తక్కువ వ్యవధిలోనే పసిఫిక్ వేడెక్కడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అసలు ఎల్ నినో అంటే..పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని పశ్చిమ ప్రాంతాలకు తరలిస్తాయి. అదే సమయంలో సముద్రం లోతుల్లోని చల్లని నీరు పైకి వస్తుంది. అయితే ఈ గాలులు బలహీనపడినప్పుడు పరిస్థితి మారుతుంది. సముద్రం అడుగున ఉన్న వేడి నీరు తూర్పు పసిఫిక్ వైపు చేరుతుంది. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిణామాన్నే ఎల్ నినో అంటారు. ఇది కేవలం ఒక సముద్ర ప్రాంతానికి పరిమితమైన మార్పు కాదు. ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపించే శక్తివంతమైన ప్రకృతి ప్రక్రియ.ప్రపంచ వాతావరణంపై ప్రభావం ఎలా?శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, వేడి గాలులు పెరగొచ్చు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, నీటి కొరత, అటవీ అగ్నిప్రమాదాలు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.భారత్పై ఎలాంటి ప్రభావం?భారత్కు ఎల్ నినో ప్రభావం అత్యంత కీలకం. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయం, నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడొచ్చు. వర్షాలు తగ్గితే పంట దిగుబడులు తగ్గడం, నీటి కొరత పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే భారత రుతుపవనాలపై ఎల్ నినోతో పాటు హిందూ మహాసముద్ర డైపోల్ (IOD), స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.వాతావరణ మార్పులతో కలిస్తే మరింత ముప్పు?ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతున్న సమయంలో.. ఇలాంటి శక్తివంతమైన ఎల్ నినో మరింత తీవ్రమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2023, 2024లో ప్రపంచం రికార్డు స్థాయి వేడిని చూసింది. ఇప్పుడు మరో బలమైన ఎల్ నినో కూడా తోడైతే.. ప్రపంచ ఉష్ణోగ్రతలు మరోసారి కొత్త రికార్డులను తాకుతాయా? అనే అంశంపై నిపుణులు దృష్టి సారించారు.ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో నిశ్శబ్దంగా పేరుకుపోతున్న వేడి.. రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారుతుందా? అన్నదే కీలక ప్రశ్న. ‘గాడ్జిల్లా ఎల్ నినో’ నిజంగా బలపడితే.. దాని ప్రభావం పసిఫిక్ తీరాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది. -
అర్ధరాత్రి సోషల్ మీడియా బంద్!
పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్లు అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు సోషల్ మీడియా వినియోగించకుండా డిఫాల్ట్ పరిమితులు విధించాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సోషల్ మీడియా యాప్లను వినియోగించకుండా నిరోధించేలా కొత్త నిబంధనలు తీసుకురానుంది.ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం.. యువతలో పెరుగుతున్న రాత్రివేళల ఫోన్ వినియోగంపై ఆందోళనలే. ఆలస్యంగా నిద్రపోవడం, ఏకాగ్రత తగ్గడం, చదువుపై ప్రభావం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు అధిక స్క్రీన్ టైమ్ కారణమవుతోందని తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వినియోగదారులను ఎక్కువసేపు యాప్లలోనే ఉంచేలా రూపొందించిన విధానాలపై విమర్శలు ఉన్నాయి.ఇందులో భాగంగా.. వినియోగదారులను నిరంతరం ఆకర్షించే కొన్ని ఫీచర్లపై కూడా బ్రిటన్ దృష్టి పెట్టింది. వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ప్లే అయ్యే విధానం వంటి ‘ఎంగేజ్మెంట్ ఫీచర్లను’ డిఫాల్ట్గా నిలిపివేయనున్నారు. అయితే వినియోగదారులు కోరుకుంటే కొన్ని సెట్టింగులను మార్చుకునే అవకాశం ఉండనుంది.పూర్తి నిషేధం కాదు.. నియంత్రణే లక్ష్యంఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు పిల్లలకు పూర్తిస్థాయి నిషేధం విధించే మార్గాన్ని కాకుండా.. బ్రిటన్ దశలవారీ నియంత్రణ విధానాన్ని ఎంచుకుంది. ఇప్పటికే చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనల దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు 16, 17 ఏళ్ల యువతపైనా రాత్రివేళ పరిమితులను తీసుకురావడం ద్వారా మధ్యస్థ మార్గాన్ని అనుసరిస్తోంది.స్క్రోలింగ్కు బ్రేక్.. నిద్రకు ప్రాధాన్యంబ్రిటన్ కొత్త నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా యాప్లలో అంతులేని స్క్రోలింగ్కు కారణమయ్యే ఫీచర్లను డిఫాల్ట్గా నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ఒక వీడియో తర్వాత మరో వీడియో ఆటోమేటిక్గా ప్లే అయ్యే విధానాన్ని నియంత్రించనున్నారు. దీంతో టీనేజర్లు రాత్రివేళల్లో ఎక్కువ సమయం ఫోన్లకు అతుక్కుపోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. "యువతకు అవసరమైన నిద్ర లభించేందుకు, చదువుపై దృష్టి పెట్టేందుకు, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి" అని బ్రిటన్ టెక్నాలజీ మంత్రి లిజ్ కెండల్ తెలిపారు.ఆస్ట్రేలియా అనుభవాలతో బ్రిటన్ జాగ్రత్తలుపిల్లల సోషల్ మీడియా వినియోగంపై కఠిన చర్యలు తీసుకున్న తొలి దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉండకుండా నిషేధం విధించే చట్టాన్ని అక్కడ తీసుకొచ్చారు. అయితే ఆ నిబంధనలను తప్పించుకునేందుకు కొందరు టీనేజర్లు కొత్త మార్గాలను అన్వేషించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. వయసు ధ్రువీకరణ వ్యవస్థలను దాటేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కూడా అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కేవలం పూర్తిస్థాయి నిషేధం కంటే.. వినియోగ అలవాట్లను నియంత్రించడం, ముఖ్యంగా రాత్రివేళల స్క్రీన్ టైమ్ను తగ్గించడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని బ్రిటన్ భావిస్తోంది.మానసిక ఆరోగ్యంపై ఆందోళనలుసోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించడం వల్ల యువతలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల్లో రాత్రివేళ సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం వల్ల నిద్ర, దృష్టి కేంద్రీకరణ, మానసిక ఆరోగ్యంలో మెరుగుదల కనిపించినట్లు తేలింది.2027 నుంచి అమలు?బ్రిటన్ ప్రతిపాదించిన సోషల్ మీడియా నియంత్రణ(పూర్తిస్థాయి) నిబంధనలను ఈ ఏడాది చివరి నాటికి పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారు. 2027 వసంతకాలం నుంచి వీటిని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల అమలును కఠినంగా పర్యవేక్షిస్తామని కూడా స్పష్టం చేసింది.ప్రపంచవ్యాప్తంగా పిల్లల సోషల్ మీడియా వినియోగంపై చర్చ జరుగుతున్న వేళ.. ఆస్ట్రేలియా పూర్తిస్థాయి నిషేధం వైపు వెళ్తుంటే.. బ్రిటన్ మాత్రం నియంత్రణల మార్గాన్ని ఎంచుకుంది. రాబోయే రోజుల్లో యువతను సోషల్ మీడియా ప్రభావం నుంచి రక్షించేందుకు మరిన్ని దేశాలు ఎలాంటి విధానాలు అవలంబిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. -
హర్ముజ్లో మళ్లీ అమెరికా బ్లాకేడ్.. ఇరాన్ సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధ మంటలు మరోసారి ఎగిసిపడే పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా నాలుగో రోజూ అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. మధ్యవర్తుల ప్రయత్నాలతో ఉద్రిక్తతలు తగ్గి.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని అంతా భావించిన వేళ.. పరిణామాలు మళ్లీ మారిపోయాయి. పరస్పర ఆరోపణలు, కవ్వింపు చర్యలతో శాంతి ఒప్పందం ప్రశ్నార్థకంగా మారింది. హర్ముజ్ జలసంధిపై అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం ఒప్పందాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఇరాన్ ఆరోపించింది. దీంతో ఆ అవగాహన ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేసింది.గత నెలలో స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం.. ఘర్షణలను నిలిపివేసి, రెండు నెలల కాలపరిమితిలో శాంతి ఒప్పందం దిశగా ముందుకు సాగాల్సి ఉంది. ఇందులో కీలకమైన అణు అంశంపై ఒప్పందం కూడా భాగంగా ఉంది. అయితే అమెరికా పదేపదే ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా మళ్లీ నౌకాదళ దిగ్బంధాన్ని అమలు చేయడం.. ఈ ఒప్పందాన్ని పూర్తిగా దెబ్బతీసిందని టెహ్రాన్ మండిపడుతోంది.హర్ముజ్పై మళ్లీ ఆధిపత్య పోరుప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి ఘర్షణ కేంద్రంగా మారింది. ఇరాన్కు చెందిన నౌకలు ఈ మార్గంలో ప్రయాణించే విషయంలో అమెరికా ఆంక్షలు విధించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ మరోసారి దాడులకు దిగిందని సమాచారం. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై కూడా ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురు, సహజ వాయువులో భారీ వాటా హర్ముజ్ మార్గం గుండా సాగుతుంది. అందుకే ఈ ప్రాంతంలో ఏర్పడే ఏ సంక్షోభమైనా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది."హర్ముజ్పై పూర్తి ఆధిపత్యం మాదే"ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. "ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా హర్ముజ్పై మా సార్వభౌమ హక్కును కాపాడుకుంటాం" అని ఆయన పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. సాధారణ పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధి నిర్వహణలో ఇరాన్తో పాటు ఒమన్కూ పాత్ర ఉంటుంది. అయితే జాతీయ భద్రత దృష్ట్యా ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో మొత్తం మార్గంపై నియంత్రణ అవసరమని ఇరాన్ వాదిస్తోంది.చర్చలకు నో చెప్పిన ఇరాన్అమెరికాతో మళ్లీ చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమపై ఒత్తిడి పెంచే చర్యలను కొనసాగిస్తే.. తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతుండగా.. తాజాగా ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్ ప్రకటన చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.హర్ముజ్పై బ్లాకేడ్.. మళ్లీహర్ముజ్ జలసంధి పరిణామాల్లో అమెరికా బ్లాకేడ్ కీలక అంశంగా మారింది. ఇరాన్పై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా అమెరికా తొలిసారి ఏప్రిల్ 13న ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే, అక్కడి నుంచి బయటకు వచ్చే నౌకలపై నౌకాదళ దిగ్బంధాన్ని ప్రారంభించింది. ఈ చర్యతో గల్ఫ్ ప్రాంతంలో నౌకాయాన ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి అవగాహన (MoU) కుదిరిన తర్వాత పరిస్థితులు కొంత చల్లబడ్డాయి. ఆ ఒప్పందంలో భాగంగా అమెరికా జూన్ 18న బ్లాకేడ్ను ఎత్తివేసింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని, తదుపరి చర్చలకు మార్గం సుగమం అవుతుందని భావించారు. కానీ తాజాగా మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా జూలై 14 నుంచి ఇరాన్ నౌకాశ్రయాలపై నౌకాదళ దిగ్బంధాన్ని పునరుద్ధరించింది. ఇరాన్ మాత్రం ఈ చర్యను ఒప్పంద ఉల్లంఘనగా అభివర్ణిస్తూ.. శాంతి ఒప్పందాన్ని అమెరికానే నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తోంది.ప్రపంచానికి కొత్త ఆందోళనహర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే.. దాని ప్రభావం అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణకే పరిమితం కాకపోవచ్చు. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన ఈ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడితే.. అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడిచమురు, సహజ వాయువులో భారీ వాటా హర్ముజ్ మార్గం గుండా సాగుతుంది. ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా సరఫరా వ్యవస్థ దెబ్బతిని.. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరల నుంచి.. రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరల వరకు కనిపించే అవకాశం ఉంటుంది.ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. హర్ముజ్లో సంక్షోభం మరింత ముదిరితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. అందుకే హర్ముజ్ జలసంధిపై అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం రెండు దేశాల సమస్యగా కాకుండా.. ప్రపంచ ఇంధన భద్రతకు, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి కొత్త సవాలుగా మారాయి. -
మాస్కోతో దోస్తీ.. భారత్పైనా ట్రంప్ గురి!
రష్యా నుంచి ముడిచమురు దిగుమతుల విషయంలో భారత్కు అమెరికా మరోసారి గట్టి హెచ్చరికలు పంపుతోంది. ఇప్పటివరకు కొన్ని వెసులుబాట్లతో కొనసాగిన పరిస్థితులకు తెరదించేలా.. రష్యా ఇంధన రంగంతో వ్యాపారాలు కొనసాగించే దేశాలపై భారీ సుంకాలు విధించే ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే మిత్రదేశం భారత్కు షాక్ ఇస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానికి పూర్తి మద్దతు తెలిపినట్లు వైట్హౌస్ వెల్లడించింది.రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే ఓ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించినట్లు వైట్హౌస్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ అధికారికంగా ధృవీకరించింది. ‘సాంక్షనింగ్ రష్యా యాక్ట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. రష్యా ఇంధన రంగంతో సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి భారీ సుంకాలు విధించే అధికారం లభిస్తుంది. ఈ బిల్లులో భాగంగా దిగుమతులపై గరిష్ఠంగా 500 శాతం వరకు టారిఫ్లు విధించే అవకాశం ఉంది. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.టార్గెట్లో భారత్, చైనాఈ బిల్లును ముందుకు తీసుకెళ్లిన రిపబ్లికన్ నేత లిండ్సే గ్రాహమ్ గతంలోనే భారత్, చైనాలను ప్రధానంగా ప్రస్తావించారు. రష్యా చమురు, గ్యాస్ ఆదాయాలకు ఈ రెండు దేశాలే కీలక ఆధారాలని ఆయన వాదించారు. భారత్, చైనా కలిసి రష్యా ఇంధన ఎగుమతుల్లో భారీ వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంటూ.. ఈ డిమాండ్ను తగ్గించడం ద్వారా మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుకు బలమైన మద్దతుదారుగా ఉన్న గ్రాహమ్.. ఇటీవల ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన అనంతరం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని పలువురు సెనేటర్లు భావిస్తున్నారు.భారత్కు ఎందుకు ఆందోళన?ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న ముడిచమురు భారత్కు కీలకంగా మారింది. దేశ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకునే రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నామని భారత్ స్పష్టం చేస్తోంది. అయితే అమెరికా కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే.. భారత్ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫార్మా, టెక్స్టైల్స్, ఐటీ సేవలు రంగాలు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని అంచనా. 500 శాతం టారిఫ్లు అమలైతే భారత ఆర్థిక వృద్ధి దాదాపు 0.5 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.ఒకవైపు ముప్పు.. మరోవైపు వాణిజ్య అవకాశంరష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలోనే.. భారత్ మరో కీలక వాణిజ్య ఒప్పందంతో ముందుకు వెళ్తోంది. భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. దీనితో భారత ఎగుమతిదారులకు బ్రిటన్ మార్కెట్లో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. అంటే ఒకవైపు రష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి.. మరోవైపు కొత్త వాణిజ్య భాగస్వామ్యాలతో అవకాశాలు.. ప్రస్తుతం భారత్ దౌత్య, ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది.చమురు కోసం స్నేహమా? ఆర్థిక భద్రతా?భారత్ మాత్రం తన వైఖరిలో మార్పు లేదని మొదటి నుంచి చెబుతోంది. ఇంధన దిగుమతులు దేశ ఆర్థిక అవసరాల ఆధారంగా జరుగుతున్నాయని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని వివరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు సెనేటర్లు రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఇది అవసరమని చెబుతుండగా.. మరికొందరు భారత్, చైనా వంటి దేశాలపై భారీ సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.ఇక ముందు ఏం జరుగుతుంది?ట్రంప్ మద్దతుతో ఈ బిల్లుకు మరింత ఊపు వచ్చినప్పటికీ.. ఇది చట్టంగా మారాలంటే కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే.. రష్యాతో భారత్ ఇంధన సంబంధాలు మాత్రమే కాదు.. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోళ్లు.. ఇప్పుడు భారత్కు ఆర్థిక లాభమా? లేక అమెరికా టారిఫ్ల రూపంలో కొత్త సవాలా? అన్నది అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక చర్చగా మారింది. -
హఫ్తా వివాదం.. యుద్ధ భారం ప్రపంచ దేశాలపైనా?
ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయగా భావించే హర్ముజ్ మరోసారి అంతర్జాతీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీసింది. జలసంధి మార్గంలో ప్రయాణించే నౌకల సరకు విలువపై 20 శాతం వరకు ఫీజు వసూలు చేయాలని ఆయన సూచించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.‘‘ఈ అత్యంత సున్నితమైన ప్రాంతానికి అమెరికా భద్రత కల్పిస్తోంది. అందుకు తగిన పరిహారం చెల్లించాలి’’ అన్నది ట్రంప్ వాదన. అయితే.. అంతర్జాతీయ జలమార్గంపై రుసుము విధించే ఆలోచనను పలువురు నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భద్రత పేరుతో తప్పనిసరి వసూలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.ఫీజు అందుకేనట!పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజూ భారీగా చమురు, గ్యాస్ రవాణా ఈ మార్గం గుండా సాగుతుంది. అమెరికా దశాబ్దాలుగా గల్ఫ్ ప్రాంతంలో నౌకాదళాన్ని మోహరించి భద్రత కల్పిస్తున్నామని చెబుతోంది. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంత రక్షణ కోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. ఇకపై అందుకు పరిహారం రావాలి’’ అని పేర్కొన్నారు. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు ఈ ఖర్చును భరించాలని ఆయన సూచించారు. విమర్శలకు స్పందనట్రంప్ ప్రతిపాదనపై విమర్శకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. భద్రత కల్పిస్తామని చెప్పి దానికి ప్రతిగా డబ్బు వసూలు చేయడం ‘ప్రొటెక్షన్ మనీ’ /‘హఫ్తా’ తరహాలో ఉందని ఆరోపిస్తున్నారు. (బెదిరించి లేదంటే ఒత్తిడి చేసి క్రమం తప్పకుండా వసూలు చేసే డబ్బును కూడా హప్తా అంటారు). అయితే అమెరికా మాత్రం ఈ విమర్శలను ఖండిస్తోంది. ఇది ఎలాంటి బలవంతపు వసూలు కాదని.. ప్రపంచ వాణిజ్య మార్గాన్ని రక్షించేందుకు చేస్తున్న ఖర్చుకు పరిహారం మాత్రమేనని చెబుతోంది.అంతర్జాతీయ చట్టాలపై ప్రశ్నలుహర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన మార్గం. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఇక్కడ నౌకలకు స్వేచ్ఛా రవాణా హక్కు ఉంటుంది. ఇలాంటి మార్గంలో ప్రయాణానికి తప్పనిసరి టోల్ లేదంటే ఫీజు విధించే హక్కు ఎవరికీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సముద్ర రవాణా సంస్థ కూడా ఇలాంటి రుసుములకు చట్టపరమైన ఆధారం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఇరాన్కు కలిసొచ్చే అంశమా?ట్రంప్ ప్రతిపాదన మరోవైపు ఇరాన్కు కొత్త వాదనను అందించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఇరాన్ కూడా హర్ముజ్పై తన ప్రభావాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేసింది. నౌకల భద్రత పేరుతో రుసుములు వసూలు చేసే ఆలోచనలను ఆ దేశ వర్గాలు ప్రస్తావించాయి. ఇప్పుడు అమెరికానే ఫీజు ప్రతిపాదించడం వల్ల.. ‘‘అమెరికాకు అవకాశం ఉంటే మాకు ఎందుకు ఉండకూడదు?’’ అనే వాదనను ఇరాన్ ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ‘‘20 శాతం ఎక్కువే.. మేము న్యాయంగా వ్యవహరిస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారు.యుద్ధం చేసింది ఎవరు.. బిల్లు చెల్లించేది ఎవరు?విమర్శకుల వాదన ప్రకారం.. ‘‘సంక్షోభాన్ని సృష్టించి.. దాని భద్రత ఖర్చును ప్రపంచానికి అప్పగించే ప్రయత్నమా?’’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రతిపాదనపై ప్రధాన విమర్శ ఇదే. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల కారణంగా ఇప్పటికే చమురు మార్కెట్లు అస్థిరంగా మారాయి. ఇంధన ధరలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడింది. ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొనే ఖర్చును అంతర్జాతీయ రవాణాపై మోపడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఆధిపత్య పోరు ముదురుతుందా?ట్రంప్ ప్రతిపాదన అసలు ఆచరణలోకి వస్తుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ ప్రకటనతో హజ్ మరోసారి అమెరికా-ఇరాన్ ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. పంచ చమురు సరఫరాకు కీలకమైన ఈ జలమార్గం.. ఇకపై కేవలం వాణిజ్య మార్గంగానే కాకుండా, రాజకీయ ఒత్తిళ్లు, సైనిక ఆధిపత్యం, ఆర్థిక పోరాటాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. -
అమెరికా బాంబులకూ అందని ఇరాన్ రహస్యం!
భూమి లోపల వందల అడుగుల లోతు.. చుట్టూ పర్వతాల రక్షణ.. అత్యాధునిక ఆయుధాలు కూడా సులభంగా చేరుకోలేని నిర్మాణం.. ఇది ఏదో సాధారణ సైనిక స్థావరం కాదు. ఇరాన్లోని ఓ రహస్య భూగర్భ కేంద్రం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ‘పికాక్స్ మౌంటెన్’. ఇరాన్ అణు కార్యక్రమానికి కీలక కేంద్రంగా మారిందన్న అనుమానాలతో పాటు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలతో ఈ రహస్య స్థావరం మరోసారి చర్చకు వచ్చింది.‘‘పికాక్స్ మౌంటెన్ (Pickaxe Mountain)ను కూడా ధ్వంసం చేస్తాం.. ఇరాన్ సిద్ధంగా ఉండాలి’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఈ రహస్య భూగర్భ కేంద్రంపైకి మళ్లించింది. ఇప్పటికే ఇరాన్లోని కీలక అణు స్థావరాలపై దాడులు చేసిన అమెరికా.. తదుపరి లక్ష్యంగా ఈ పర్వతాన్ని ఎంచుకుందా? అనే చర్చ మొదలైంది. అసలు పికాక్స్ మౌంటెన్లో ఏముంది? ఎందుకు అమెరికా దీనిపై ఇంత ప్రత్యేక దృష్టి పెట్టింది? అణు కార్యక్రమానికి ఇది ఎంత కీలకం? అన్న ప్రశ్నలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి.జాగ్రోస్ పర్వతాల్లో దాగిన ‘భూగర్భ కోట’ఇరాన్లోని జాగ్రోస్ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ కేంద్రం.. స్థానికంగా కుహ్-ఎ కొలాంగ్ గాజ్ లా (Kuh-e Kolang Gaz La) పేరుతో కూడా గుర్తింపు పొందింది. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైన నాటాంజ్(Natanz) అణుశుద్ధి కేంద్రం నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. నాటాంజ్ కేంద్రం గతంలో దాడులకు గురైనప్పటికీ.. పికాక్స్ మౌంటెన్ మాత్రం భిన్నమైన నిర్మాణంతో తయారవుతోంది. పర్వతాన్ని తొలిచి దాని లోపల భారీ సొరంగాలు, భూగర్భ గదులు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఇదే అమెరికా వ్యూహకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఓ భవనం కాదు.. పర్వతాన్ని సహజ కవచంగా మార్చుకున్న భారీ రక్షణ వ్యవస్థ.బంకర్ బస్టర్ బాంబులకూ సవాల్పికాక్స్ మౌంటెన్పై ప్రపంచ దేశాల దృష్టి పడటానికి ప్రధాన కారణం దీని లోతు. నిపుణుల అంచనా ప్రకారం ఈ భూగర్భ సముదాయంలోని కొన్ని ప్రాంతాలు భూమి లోపల 260 నుంచి 330 అడుగుల లోతులో ఉండొచ్చని తెలుస్తోంది. అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ ఆయుధాలు కూడా పరిమిత స్థాయిలో మాత్రమే చొచ్చుకుపోగలవు. సాధారణంగా ఇవి వందల అడుగుల మట్టి, రాళ్ల పొరలను లేదంటే బలమైన కాంక్రీట్ నిర్మాణాలను ఛేదించగలిగినా.. ఇంత లోతులో ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేయడం సవాల్గా మారుతుంది. అందుకే పికాక్స్ మౌంటెన్.. అమెరికా సైనిక వ్యూహాలకు ఓ పెద్ద పరీక్షగా మారింది.అసలు అక్కడ ఏం జరుగుతోంది?ఈ రహస్య స్థావరం నిర్మాణం 2020 ప్రాంతంలో ప్రారంభమైంది. నాటాంజ్లో జరిగిన విధ్వంసం తర్వాత కొత్త సెంట్రిఫ్యూజ్ అసెంబ్లీ కేంద్రం నిర్మిస్తున్నామని ఇరాన్ అప్పట్లో వెల్లడించింది. అయితే నిర్మాణ స్థాయి, భద్రతా ఏర్పాట్లు మాత్రం అనేక అనుమానాలకు దారితీశాయి. కొందరు అణు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం పరికరాల తయారీ కేంద్రం మాత్రమే కాకుండా, రహస్య యురేనియం శుద్ధి కేంద్రంగా లేదంటే కీలక అణు పదార్థాల నిల్వ ప్రాంతంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇలాంటి రహస్య భూగర్భ కేంద్రాల్లో భద్రపరిచి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఐఏఈఏకు అందని రహస్యంపికాక్స్ మౌంటెన్ ఇప్పటివరకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) తనిఖీలకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలపై మరింత ఆసక్తి, అనుమానాలు పెరిగాయి. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో.. గత దాడుల తర్వాత కూడా అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు గుర్తించారు. కొత్త భద్రతా గోడలు, బలపరిచిన ప్రవేశ మార్గాలు, తవ్వకాల ఆనవాళ్లు కనిపించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో జరిగే దాడులను ఎదుర్కొనేలా ఇరాన్ ఈ కేంద్రాన్ని మరింత బలోపేతం చేస్తోందన్న అభిప్రాయాలకు కారణమైంది.ట్రంప్ హెచ్చరికలతో పెరిగిన ఉత్కంఠగతంలో ఇరాన్ అణు కేంద్రాలపై దాడుల తర్వాత.. ఆ దేశ అణు కార్యక్రమాన్ని దెబ్బతీశామని అమెరికా ప్రకటించింది. అయినప్పటికీ పికాక్స్ మౌంటెన్ మాత్రం ఇంకా అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఈ భూగర్భ స్థావరం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అమెరికా నిజంగానే ఈ కేంద్రంపై దాడికి దిగుతుందా? లేదంటే ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు మాత్రమే ఈ హెచ్చరికలు చేస్తున్నదా? అన్నది ఆసక్తికరంగా మారింది. పర్వతం లోపల దాగిన ఈ రహస్యం.. రాబోయే రోజుల్లో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పగ తీర్చుకుందా?.. అదే ఏనుగు.. అదే కుటుంబం!
ఓ కుటుంబం ప్రాణభయంతో ఊరు విడిచింది.. ఇక ఆ ప్రమాదం తమ దరిచేరదని భావించింది. కానీ కాలం గడిచినా ఆ విషాద జ్ఞాపకం వారిని వెంటాడుతూనే వచ్చింది. ఏకంగా 14 ఏళ్ల తర్వాత అదే ఏనుగు మళ్లీ వారి జీవితాల్లోకి వచ్చి పెను విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను బలిగొన్న ‘ధుర్బే’ అనే అడవి ఏనుగు ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.నేపాల్లోని చిత్వన్ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటన.. మనిషి–వన్యప్రాణి ఘర్షణ ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి చూపించింది. ఏళ్ల క్రితం జరిగిన విషాదం నుంచి బయటపడేందుకు ఊరు మార్చుకున్న ఓ కుటుంబాన్ని.. అదే ఏనుగు మళ్లీ వెతుక్కుంటూ వచ్చినట్లు కనిపించడం స్థానికులను సైతం విస్మయానికి గురిచేసింది.2012లో మొదలైన విషాదం..షానిచర బోటే కుటుంబానికి ఈ విషాద ప్రయాణం 2012లో మొదలైంది. చిత్వన్ నేషనల్ పార్క్ సమీపంలోని మడి ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో.. ‘ధుర్బే’ అనే అడవి ఏనుగు దాడి చేసింది. ఆ ఘటనలో షానిచర తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు.కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయిన షానిచర.. ఇక అక్కడ జీవించడం ప్రమాదకరమని భావించారు. కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 9 మైళ్ల దూరంలోని జగత్పూర్కు వలస వెళ్లారు. మధ్యలో రాప్తి నది కూడా ఉండటంతో.. ఇక ఆ ఏనుగు తమను చేరుకోలేదని భావించారు. అయితే విధి మరోలా రాసింది. 14 ఏళ్ల తర్వాత.. మళ్లీ అదే ఏనుగుఇటీవల జగత్పూర్లోని షానిచర కుటుంబం నివసిస్తున్న ప్రాంతానికి ధుర్బే ఏనుగు చేరుకుంది. ఇంట్లోకి చొరబడిన ఆ ఏనుగు దాడిలో షానిచర కోడలు అశికా బోటే (25), నాలుగేళ్ల మనవడు భారత్ బోటే మృతి చెందారు. “పెద్ద నదులు దాటి వెళ్లినా మేము సురక్షితంగా ఉంటామని అనుకున్నాం. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా అదే ఏనుగు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మా ఇంటిపై దాడి చేసి నా కోడలు, చిన్న మనవడిని తీసుకెళ్లిపోయింది. ఇక మాకు పారిపోవడానికి చోటు లేదు” అని షానిచర బోటే ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనతో ధుర్బే ఏనుగు కారణంగా ఒకే కుటుంబంలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. 2012లో షానిచర తల్లిదండ్రులను బలిగొన్న ఇదే ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత ఆయన కోడలు, మనవడిని కూడా పొట్టన పెట్టుకుంది.‘పగ’ కాదు.. కానీ వెంటాడిన విషాదం!ఏనుగులు మనుషుల్లా పగ తీర్చుకుంటాయని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే ఒకే కుటుంబాన్ని 14 ఏళ్ల వ్యవధిలో రెండుసార్లు విషాదంలోకి నెట్టిన ధుర్బే ఘటన మాత్రం అందరినీ కలచివేస్తోంది. ఒకప్పుడు తమ నుంచి దూరంగా వెళ్లిపోయిన కుటుంబం వద్దకే మళ్లీ అదే ఏనుగు చేరుకోవడం.. స్థానికుల్లో.. ఇది పగేనా?, అసలు ఎందుకు పగ బట్టింది?? అనే ప్రశ్నలను రేకెత్తిస్తోంది.25 మంది ప్రాణాలు తీసిన ధుర్బేధుర్బే నేపాల్లోని అత్యంత ప్రమాదకరమైన అడవి ఏనుగుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. చిత్వన్ నేషనల్ పార్క్ అధికారుల ప్రకారం.. 2010 నుంచి ఇప్పటివరకు ఈ ఏనుగు దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏనుగు కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు పలుమార్లు ట్రాకింగ్ కాలర్లు అమర్చారు. 2016లో తొలిసారి కాలర్ అమర్చగా.. అది పనిచేయకపోవడంతో 2020లో మరోసారి, 2023లో మళ్లీ కొత్త కాలర్ను అమర్చారు. అయినప్పటికీ ధుర్బే కదలికలను పూర్తిగా నియంత్రించడం సవాల్గా మారింది.పెరుగుతున్న మనిషి–ఏనుగు ఘర్షణఅడవుల విస్తీర్ణం తగ్గడం, మానవ నివాసాలు అటవీ ప్రాంతాలకు చేరువ కావడంతో మనిషి–వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. ఆహారం, నీటి కోసం అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం.. ప్రజలు భయంతో జీవించాల్సి రావడం ఇలాంటి విషాదాలకు కారణమవుతోంది. 14 ఏళ్ల పాటు తప్పించుకున్నామని భావించిన ఓ కుటుంబాన్ని.. అదే ఏనుగు మళ్లీ విషాదంలోకి నెట్టిన ఘటన ఇప్పుడు నేపాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. -
మొజ్తబా పని అయిపోయినట్లే!.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇరాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్న ట్రంప్.. మొజ్తబా పరిస్థితి కూడా ఏమీ బాగోలేదని, ఆయన పని అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. "వారికి నౌకాదళం లేదు.. వైమానిక దళం లేదు.. గగనతల రక్షణ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. వారి కీలక నాయకులంతా హతమయ్యారు" అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఖమేనీ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ.. మేం జరిపిన దాడుల్లో అయతొల్లా ఖమేనీ చనిపోయారు. ఆ తర్వాత సుప్రీం లీడర్ అంటూ ఆయన వారసుడు మొజ్తబా ఖమేనీ వచ్చారు. ఆయన పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆయన 90 శాతం దెబ్బతిన్నారు. ఆయన పని కూడా దాదాపు అయిపోయినట్లే అని అన్నారు. అయితే మొజ్తబా పరిస్థితిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలను అమెరికా విడుదల చేయలేదు. ఇరాన్ కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు.తండ్రి మరణం తర్వాత తెరపైకి.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పేరు ఒక్కసారిగా అంతర్జాతీయ చర్చల్లోకి వచ్చింది. ఇరాన్ రాజకీయ వ్యవస్థపై ప్రభావం ఉన్న వ్యక్తిగా మొజ్తబాను పరిగణిస్తుంటారు. అయతొల్లా మరణం తర్వాత సుప్రీం ఎవరు? అనే సమయంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. అయితే.. గతంలో ఆయనపై ఉన్న విమర్శలు, వివాదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఆ గౌరవం దక్కడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే మత పెద్దలు, ఐఆర్జీసీ మాత్రం ఆయన వైపే మొగ్గు చూపించింది. అయితే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొజ్తబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అయతొల్లా ఖమేనీ కుటుంబ సభ్యులు కొందరు మరణించారు. అయితే ఆ దాడిలో కొడుకు మొజ్తాబా మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారనే ప్రచారం ప్రచారం మాత్రం జోరుగా సాగింది. ముఖ్యంగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు కూడా మొజ్తబా హాజరు కాలేదు. టెహ్రాన్లో జరిగిన అంత్యక్రియల ప్రార్థనల్లో ఆయన సోదరులు మాత్రమే పాల్గొన్నారు. దేశ అత్యున్నత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఇప్పటిదాకా కనిపించకపోవడం తీవ్ర చర్చకు కారణమైంది.త్వరలో ప్రజల ముందుకు వస్తారా?ఇటీవల మొజ్తబా ఖమేనీ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారనే ప్రచారం జరుగుతోంది. తన తండ్రి జ్ఞాపకార్థం నిర్వహించే భారీ స్మారక సభలో ఆయన పాల్గొనే అవకాశం ఉందని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సభలో ఆయన ప్రత్యక్షమైతే.. సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి బహిరంగ కార్యక్రమం కానుంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి, నాయకత్వ సామర్థ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని భావించారు.‘తండ్రి మరణానికి ప్రతీకారం’ అంటూ ప్రకటనలుఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గాయపడిన మొజ్తబా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. సందేశాలు ఏమున్నా సరే.. అత్యంత గోప్యంగా ఆయనకు చేరవేస్తూ వస్తున్నారు. అలాగే ఆయన నుంచి బదులు కూడా అలాగే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తప్పదంటూ మొజ్తబా కూడా ప్రకటన ఇచ్చినట్లు ఇరాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు నిజంగానే వస్తారా?.. ట్రంప్ ప్రకటన ఉత్తదేనని తేలుస్తారా? అన్నది కీలకంగా మారింది.హర్ముజ్పై ట్రంప్ ప్రకటన.. భగ్గుమన్న ఇరాన్ఇదే సమయంలో ట్రంప్ హర్ముజ్ జలసంధిపై కూడా కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై సముద్ర దిగ్బంధనాన్ని తిరిగి అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. హర్ముజ్ గుండా ప్రయాణించే కార్గో నౌకల నుంచి 20 శాతం రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిపై ఇరాన్ భగ్గుమంది. హర్ముజ్ విషయంలో అమెరికా జోక్యం సహించబోమని.. తమ నౌకలపై ఆధిపత్యం ప్రదర్శిస్తే బలప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది. ఇటు అమెరికాకు సహకరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గల్ఫ్ దేశాలను సైతం వారించింది. -
రాహుల్, ఖర్గేకు ఓపెన్ లెటర్.. క్షమాపణ చెప్పాల్సిందే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 'మోదీ ఎయిర్వేస్' పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.నిర్వాహకుల్లో ఒకరైన అమిత్ కరంత్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్ క్రౌడ్' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.కాగా, మెల్బోర్న్లో జరిగిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింటా అలన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. -
హర్ముజ్ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి.. ఉద్రిక్తతలతో పాటు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల కేంద్రంగా మారింది. జలసంధి గుండా వెళ్లే ప్రతి కార్గో నౌకపై 20 శాతం టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నౌకల భద్రత కోసం తాము ఎంతో చేస్తున్నామని.. భారత్ సహా పలు దేశాలు ఈ రుసుము చెల్లించాల్సిందేనని అంటున్నారాయన. దానికి ఇరాన్ కాస్త ఘాటుగానే బదులిచ్చింది.ట్రూత్ సోషల్లో ట్రంప్ చేసిన పోస్టులో.. ఇకపై అమెరికా "ది గార్డియన్ ఆఫ్ ది హర్ముజ్ స్ట్రైట్"గా వ్యవహరిస్తుందని ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య నౌకలకు భద్రత కల్పించేందుకు అమెరికా భారీ ఖర్చు చేస్తున్నందున, ఆ ఖర్చుకు ప్రతిఫలంగా హర్ముజ్ (Strait of Hormuz) గుండా వెళ్లే ప్రతి కార్గోపై 20 శాతం రుసుము వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనికి విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ.. "హర్ముజ్కు నిజమైన సంరక్షకులు ఇరానేనని అన్నారు. అంతేకాదు 20 శాతం రుసుము చాలా ఎక్కువ.. మేమైతే న్యాయమైన రుసుమే వసూలు చేస్తాం" అంటూ వ్యంగ్యంగా స్పందించారు.ఇరాన్ ఘాటు కౌంటర్ట్రంప్ వ్యాఖ్యలపై ఎక్స్ (X) వేదికగా స్పందించిన అరాగ్చీ.. "వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కల్పించే వారికి పారితోషికం ఇవ్వాలన్న ట్రంప్ మాట సరైనదే. కానీ హర్ముజ్కు ఎప్పటినుంచో నిజమైన గార్డియన్ ఇరానే. ఇకముందూ అలాగే ఉంటుంది" అన్నారు. అయితే ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్పై సెటైర్ వేస్తూ.. "20 శాతం చాలా ఎక్కువ. మేమైతే న్యాయంగా వ్యవహరిస్తాం" అని వ్యాఖ్యానించారు. దీంతో హర్ముజ్పై అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.POTUS is absolutely right. Whoever provides secure and safe passage of commercial vessels through the Strait of Hormuz should be compensated for this service. Iran has always been the GUARDIAN of the Strait and will remain so FOREVER.20% is of course too much. We will be fair— Seyed Abbas Araghchi (@araghchi) July 13, 2026మరోసారి అమెరికా బ్లాకేడ్ఇదే సమయంలో ఇరాన్పై అమెరికా మరోసారి సముద్ర దిగ్బంధనాన్ని (Maritime Blockade) అమలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. జూలై 14 సాయంత్రం 4 గంటల (ET) నుంచి ఇరాన్ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై దిగ్బంధన చర్యలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ఇరాన్ పోర్టులకు వెళ్తున్న లేదా అక్కడి నుంచి వస్తున్న నౌకలను అమెరికా దళాలు తనిఖీ చేస్తాయని, గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్ముజ్ పరిసరాల్లో ప్రయాణించే నౌకలు అమెరికా నౌకాదళంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించింది.పాత ఒప్పందం ముగిసిందా?గతంలో ఏప్రిల్ 13 నుంచి జూన్ 18 వరకు అమెరికా ఇదే తరహా దిగ్బంధనం అమలు చేసింది. అనంతరం అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంతో దానిని ఎత్తివేశారు. అయితే ఇటీవల ఆ ఒప్పందం ఇక అమల్లో లేదని ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది.ఇరాన్ మాత్రం గత నెల కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం హర్ముజ్లో రవాణాను నియంత్రించే హక్కు తమకే ఉందని, అవసరమైతే టోల్ కూడా వసూలు చేసే అధికారం ఉందని చెబుతోంది. దీనిని అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ప్రపంచ నౌకలకు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉందని వాషింగ్టన్ వాదిస్తోంది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురు, ద్రవీభవించిన సహజ వాయువు (LNG)లో దాదాపు 20 శాతం హోర్ముజ్ జలసంధి గుండా రవాణా అవుతుంది. అందువల్ల ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది.విశ్లేషకుల అంచనా ప్రకారం.. ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్ అమల్లోకి వస్తే, పూర్తిగా చమురుతో నిండిన ఒక సూపర్ ట్యాంకర్ దాదాపు 30 మిలియన్ డాలర్ల వరకు అదనపు రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఇప్పటివరకు ఇరాన్ వసూలు చేసినట్లు భావిస్తున్న రుసుము సుమారు 2 మిలియన్ డాలర్ల పరిధిలోనే ఉందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.ఇంధన వ్యయం భారీగా పెరగడంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో హర్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్ ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. -
భీకర దాడులకు దిగిన ఇరాన్.. గల్ఫ్లో మళ్లీ మంటలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా జరిపిన వరుస వైమానిక దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కౌంటర్ ఎటాక్కు దిగింది. డ్రోన్లు, క్షిపణులతో బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఖతార్, ఒమన్ ప్రాంతాల్లోని అమెరికా మద్దతు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) ప్రకారం.. బహ్రెయిన్లోని షేక్ ఇసా వైమానిక స్థావరంపై దాడి చేసింది. అక్కడి అమెరికా సైనిక కార్యకలాపాలకు సంబంధించిన డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, హెలికాప్టర్ నిర్వహణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా డ్రోన్ ఫ్లీట్లో కీలక భాగాన్ని ధ్వంసం చేసినట్లు టెహ్రాన్ ప్రకటించింది. అయితే ఈ దాడులకు సంబంధించి అమెరికా నుంచి ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ రాలేదు.ఆ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులుఅమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్, జోర్డాన్లలోనూ తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఇరాన్ తెలిపింది. కువైట్లోని అలీ అల్ సేలెం, అహ్మద్ అల్ జాబర్ సైనిక స్థావరాలు, జోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, అలాగే ఖతార్, ఒమన్లోని అమెరికా మద్దతు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ప్రకటించింది. జోర్డాన్ స్థావరంలోని ఇంధన నిల్వలు, ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే జోర్డాన్ మాత్రం.. ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది.గల్ఫ్ దేశాల్లో హైఅలర్ట్ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, యూఏఈ దేశాల్లో భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఖతార్లో ఇరాన్ దాడుల సమయంలో శకలాలు పడి ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కువైట్లోని ఓ చమురు డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్పై జరిగిన దాడిలో ఓ కార్మికుడు గాయపడినట్లు సమాచారం. ఒమన్లోనూ డ్రోన్ దాడుల నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.ఇరాన్ సైనిక సామర్థ్యాలే లక్ష్యం: అమెరికామరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM).. ఇరాన్పై చేపట్టిన తాజా దాడులను సమర్థించుకుంది. అంతర్జాతీయ నౌకా రవాణాకు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలు, చిన్న యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు అమెరికా తెలిపింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటమే తమ చర్యల ఉద్దేశమని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాజా పరిణామాలపై స్పందించారు. ‘‘మేము వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.హర్ముజ్ మూసివేశామన్న ఇరాన్తాజా ఘర్షణలకు ప్రధాన కారణంగా మారింది హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని మూసివేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. అయితే అమెరికా ఈ ప్రకటనను ఖండించింది. ‘‘హర్ముజ్ జలసంధిపై ఇరాన్కు నియంత్రణ లేదు. అంతర్జాతీయ నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయి’’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.షిప్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం.. జలసంధి మీదుగా నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. అయితే పూర్తిగా నిలిచిపోలేదని సమాచారం. కొన్ని చమురు ట్యాంకర్లు మాత్రం ఈ మార్గం గుండా ప్రయాణించినట్లు తెలుస్తోంది.నౌకలపై దాడులే అసలు కారణంహర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల నేపథ్యంలో అమెరికా ఇరాన్పై తాజా దాడులు ప్రారంభించింది. అమెరికా ఆరోపణ ప్రకారం.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ఓ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుంది. దీనికి ప్రతిగా అమెరికా దాడులు చేపట్టినట్లు తెలిపింది. అయితే ఇరాన్ మాత్రం.. అనుమతి లేకుండా ప్రయాణించిన ఓ నౌకపై హెచ్చరిక కాల్పులు మాత్రమే జరిపామని పేర్కొంది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.చమురు ధరలకు సెగహర్ముజ్ జలసంధిపై నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య దాడులు కొనసాగడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు నాలుగు శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ ధర సుమారు 79 డాలర్లకు చేరింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో రవాణా అంతరాయం ఏర్పడితే.. అంతర్జాతీయంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.మళ్లీ యుద్ధ భయాలుఅమెరికా-ఇరాన్ మధ్య గత నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందం భవిష్యత్తుపైనా తాజా పరిణామాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి సమస్యను పరిష్కరించి ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. పరస్పర దాడులతో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా దాడులు కొనసాగిస్తే.. పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హర్ముజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న ఈ పోరు.. ప్రపంచ ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. -
ట్రంప్ ‘ట్రంప్కార్డ్’ ఇక లేరు.. గ్రాహం మృతిపై అనుమానాల కలకలం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఉన్న సెనేటర్ లిండ్సే గ్రాహం (71) ఇక లేరు. ఆకస్మిక అనారోగ్యంతో ఆయన శనివారం కన్నుమూశారు. ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.గ్రాహం కార్యాలయం తొలుత దీనిని ‘‘ఆకస్మిక అనారోగ్యం’’గా పేర్కొంది. అయితే వైద్య పరీక్షల నివేదికలు వచ్చాక.. మరణంపై మరో ప్రకటన చేసింది. గుండెకు అనుసంధానమైన ప్రధాన ధమని ఏఓర్టాలో చీలిక (aortic dissection) కారణంగానే ఆయన కన్నుమూసినట్లు తెలిపింది. తన సన్నిహితుడు గ్రాహం మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత నమ్మకమైన మిత్రుల్లో ఒకరిని కోల్పోయానని పేర్కొన్నారు.‘‘లిండ్సే గ్రాహం గొప్ప వ్యక్తి, గొప్ప సెనేటర్. ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవారు. నిజమైన అమెరికన్ దేశభక్తుడు’’ అంటూ ట్రంప్ నివాళులర్పించారు. మరణానికి ముందు రోజు రాత్రి కూడా గ్రాహం తనతో మాట్లాడారని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ పర్యటన గురించి వివరించారని, సుదీర్ఘ ప్రయాణం కారణంగా అలసిపోయినట్లు చెప్పారని వెల్లడించారు.భారత్పై ద్వేషం.. అంతర్జాతీయ రాజకీయాల్లో గ్రాహం పేరు ఇటీవల భారత్ విషయంలో ఎక్కువగా వినిపించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదనకు ఆయన మద్దతు తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ సహా ఆ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. ‘‘రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఊతమిస్తే.. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది’’ అంటూ గతంలో గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్కు కీలక వారధిలిండ్సే గ్రాహం అమెరికా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా ప్రభావం చూపిన నేత. 2002లో సెనేట్కు ఎన్నికైన ఆయన.. రక్షణ, విదేశాంగ విధానాల్లో రిపబ్లికన్ పార్టీకి కీలక స్వరంగా ఎదిగారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో విమర్శకుడిగా ఉన్నప్పటికీ.. తర్వాత ఆయనకు అత్యంత సన్నిహిత మద్దతుదారుల్లో ఒకరిగా మారారు. ట్రంప్ ‘‘అమెరికా ఫస్ట్’’ విధానానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం కొనసాగాలని గ్రాహం బలంగా నమ్మేవారు.ట్రంప్ శిబిరానికి భారీ లోటులిండ్సే గ్రాహం మరణం ట్రంప్ రాజకీయ శిబిరానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. సెనేట్లో ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలిచే కీలక గొంతుకల్లో ఒకటి ఇప్పుడు లేకుండా పోయింది. ఉక్రెయిన్ పర్యటన తర్వాతే మృతి.. అనుమానాల కలకలంమరణానికి ముందు రోజు గ్రాహం ఉక్రెయిన్లో పర్యటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సమావేశమై.. రష్యాపై మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్కు మద్దతు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన మరణంపై కొన్ని MAGA వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా లేదంటే ఇరాన్ ప్రమేయం ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. మరికొందరు.. ఉక్రెయిన్ పర్యటన, రష్యాపై ఆంక్షల పిలుపు, గతంలో వచ్చిన బెదిరింపులను ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అధికారులు కూడా ఎలాంటి కుట్ర కోణాన్ని నిర్ధారించలేదు. గ్రాహం కుటుంబంలో గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉందని కూడా సమాచారం.ఇరాన్పై కఠిన వైఖరి.. ఇజ్రాయెల్కు మద్దతుగ్రాహం ఇరాన్ విషయంలో కూడా కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైనిక చర్యలకు కూడా ఆయన మద్దతు తెలిపారు. గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్కు ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనపై మధ్యప్రాచ్యంలో విమర్శలు కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. గ్రాహంను ‘‘ఇజ్రాయెల్కు గొప్ప మిత్రుడు’’గా అభివర్ణించారు.ఇక గ్రాహం స్థానంలో ఎవరు?గ్రాహం మృతితో దక్షిణ కరోలినా సెనేట్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతానికి ఆయన స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసే అధికారం రాష్ట్ర గవర్నర్ హెన్రీ మెక్మాస్టర్కు ఉంది. ఆయన తాత్కాలిక సెనేటర్ను నియమించనున్నారు. ఈ రేసులో నాన్సీ మేస్ (Nancy Mace)(దక్షిణ కరోలినా ప్రతినిధుల సభ సభ్యురాలు), రిపబ్లికన్ హౌస్ సభ్యుడు రస్సెల్ ఫ్రై (Russell Fry), లెఫ్టినెంట్ గవర్నర్పామెలా ఎవెట్ (Pamela Evette).. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇది తాత్కాలిక నియామకం మాత్రమే. గ్రాహం ఈ ఏడాది తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్నందున.. ప్రత్యేక రిపబ్లికన్ ప్రైమరీ నిర్వహించి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ సాధారణ ఎన్నికల్లో తుది పోటీ జరుగుతుంది. -
మళ్లీ ట్రిగ్గర్ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాపై మళ్లీ దట్టమైన యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. మధ్యవర్తి ఖతార్ చొరవతో కాల్పుల విరమణపై ఆశలు చిగురిస్తున్నాయనుకున్న సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దూకుడు ప్రదర్శించారు. హర్ముజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం సాయంత్రం నుంచి తాజా వైమానిక దాడులు ప్రారంభించింది. వాణిజ్య నౌకలు, పౌర నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చర్యలు కొనసాగిస్తోందని ఆరోపిస్తూ ఈ దాడులకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రకటించింది.ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య ప్రధాన యుద్ధరంగంగా మారింది. "వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యం" అని సెంట్కామ్(CENTCOM) ప్రకటించింది. మరోవైపు అమెరికా జోక్యం ఆగే వరకు హర్ముజ్లో రాకపోకలను అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. దీంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రబిందువైంది.ఓవైపు దాడులు, మరోవైపు..అమెరికా తాజా దాడులు హర్మొజ్ జలసంధికి సమీపంలోని హోర్మోజ్గాన్, ఖుజెస్టాన్, సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులపై కేంద్రీకృతమయ్యాయి. బందర్ అబ్బాస్, జాస్క్, సిరిక్, ఖెష్మ్ దీవి, చాబహార్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఖొండాబ్లోని హెవీ వాటర్ కేంద్రం సమీపంలోనూ దాడులు జరిగినట్లు సమాచారం.దీనికి ప్రతిగా హర్ముజ్ గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కాల్పులు జరిపిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన ఒక క్రూయిజ్ క్షిపణి, ఒక ఆత్మాహుతి డ్రోన్ను కూల్చివేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.నీటి పంపింగ్ కేంద్రంపై దాడి.. ఒకరు మృతిఖుజెస్టాన్ ప్రావిన్స్లోని మహ్షహర్ ప్రాంతంలో వ్యవసాయ నీటి పంపింగ్ స్టేషన్పై జరిగిన దాడిలో ఒక భద్రతా సిబ్బంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.ఐదో విడత దాడులుకాల్పుల విరమణ ప్రకటించి మూడు వారాలు కూడా గడవకముందే అమెరికా ఐదో విడత వైమానిక దాడులు చేపట్టింది. శనివారం ఒక్కరోజే ఇరాన్లో 140కి పైగా లక్ష్యాలపై దాడులు చేసిన అమెరికా.. తాజా దాడులతో మరింత ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, జోర్డాన్లోని అమెరికా ప్రయోజనాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.క్షీణించిన నౌకల రాకపోకలుయుద్ధ ప్రభావం సముద్ర రవాణాపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు సుమారు 130 నౌకలు హర్ముజ్ జలసంధిని దాటుతుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 22కు పడిపోయినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థల అంచనాలు చెబుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 79 డాలర్ల వద్దకు చేరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన పెరిగింది.భారత్కూ ప్రభావంఒమన్ తీరంలో దాడికి గురైన జీఎఫ్ఎస్ గెలాక్సీ GFS Galaxy కంటైనర్ నౌకలో చిక్కుకున్న భారతీయ నావికుల్లో 23 మందిని రక్షించినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. మరో నావికుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హర్ముజ్లో పరిస్థితులు మరింత దిగజారితే భారత చమురు దిగుమతులు, సముద్ర వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ముందు ఏం జరుగుతుంది?హర్ముజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో అమెరికా-ఇరాన్ ఎవరూ వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. ఒకవైపు అమెరికా వరుస వైమానిక దాడులతో ఒత్తిడి పెంచుతుంటే.. మరోవైపు ఇరాన్ సముద్ర మార్గాన్ని తన ఆధీనంలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిష్ఠంభన కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతపై మరింత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
రహస్య కదలికలు.. భూమిపై ఏలియన్స్ నిఘా?
భూమిపై గ్రహాంతరవాసులు (ఏలియన్స్) నిఘా పెట్టాయా? వారి అంతరిక్ష నౌకలే (యూఎఫ్వోలు) మన ఆకాశంలో సంచరిస్తున్నాయా?? దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న ఈ ప్రశ్నలకు మరోసారి ఊతమిచ్చేలా అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తాజాగా విడుదల చేసిన ఫైల్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. "నేను 28 ఏళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నా. కానీ, ఎన్నడూ ఇలాంటి వస్తువును నేను ఎప్పుడూ చూడలేదు’’ అని ఓ మాజీ సైనిక పైలట్ పేర్కొనడం, అణు ఆయుధ కేంద్రం వద్ద రహస్య వస్తువు సంచరించిన ఘటన, చైనా సమీపంలో తాజాగా నమోదైన వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మేరకు.. తాజాగా పెంటగాన్ మొత్తం 40 రికార్డులను బహిర్గతం చేసింది. వీటిలో 14 పత్రాలు, 19 వీడియోలు, నాలుగు ఆడియో ఫైల్స్, మూడు చిత్రాలు ఉన్నాయి. ఈ సమాచారం పెంటగాన్తో పాటు నాసా, సీఐఏ, ఎఫ్బీఐ, ఇంధన శాఖ వంటి కీలక అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించింది. విడుదలైన వీడియోల్లో పశ్చిమ పసిఫిక్, అట్లాంటిక్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో అమెరికా సైనిక కెమెరాలు రికార్డు చేసిన దృశ్యాలు ఉన్నాయి.The Creepiest UFO Video Ever Released By The White House 👽🛸🇺🇸What is that thing? Is it an ALIEN? 😱DOW-UAP-PR116, Unresolved UAP Report, Atlantic Ocean, 2020 pic.twitter.com/vOabmCyBb6— Interstellar (@InterstellarUAP) July 10, 2026ఈ ఫైల్స్లో అత్యంత ఆసక్తికరమైనది 2019లో నమోదైన ఒక ఘటన. అమెరికా తూర్పు ప్రాంతంలో శిక్షణ విమానయానం నిర్వహిస్తున్న ఓ సైనిక పైలట్, మరో నలుగురు సిబ్బంది తమ విమానం కిందుగా అత్యంత వేగంగా కదులుతున్న ఓ గుర్తుతెలియని వస్తువును గమనించారు. దాదాపు 10 నుంచి 15 సెకన్ల పాటు దానిని కెమెరాతో ట్రాక్ చేశారు. జూమ్ చేసి స్పష్టంగా చిత్రీకరించేలోపే ఆ వస్తువు క్షణాల్లో కెమెరా పరిధి దాటి అదృశ్యమైంది. తర్వాత వీడియోను పరిశీలించగా అది దీర్ఘచతురస్రాకారంలో (Rectangular) ఉన్నట్లు గుర్తించారు.దీనిపై సదరు పైలట్ తన నివేదికలో.. "ఎయిర్ఫోర్స్, నేవీలో 28 ఏళ్లుగా పనిచేస్తున్నా.. ఇలాంటి విమాన లక్షణాలున్న వస్తువును నేను ఎప్పుడూ చూడలేదు" అని పేర్కొనడం విశేషం.దెబ్బకు అణ్వాయుధ కేంద్రంలో లాక్డౌన్!మరో ఫైల్లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని పాంటెక్స్ అణు ఆయుధ కేంద్రం వద్ద 2015లో చోటుచేసుకున్న ఘటనను వెల్లడించారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది.. ఎలాంటి శబ్దం లేకుండా, ఇంజిన్కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకుండా గాల్లో కదులుతున్న ఓ గుర్తుతెలియని వస్తువును గుర్తించారు. దాంతో మొత్తం అణు కేంద్రాన్ని వెంటనే లాక్డౌన్ చేసి, బైనాక్యులర్లతో ఆ వస్తువును వెంబడించారు. అయితే అది ఏమిటో ఇప్పటికీ గుర్తించలేకపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.చైనా సమీపంలో తాజా కదలికలుఈసారి విడుదలైన ఫైల్స్లో అత్యంత తాజా సమాచారం 2025లో చైనా సమీప సముద్ర ప్రాంతాల్లో నమోదైన ఘటనలకు సంబంధించినది. అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్కు చెందిన సెన్సార్లు ఎల్లో సీ ప్రాంతంలో ఆరు కోణాల నక్షత్రం ఆకారంలో కనిపించిన ఓ విచిత్ర వస్తువును గుర్తించాయి. మరో వీడియోలో తూర్పు చైనా సముద్రం (ఈస్ట్ చైనా సీ) ప్రాంతంలో నిమిషాల పాటు కదులుతున్న మరో గుర్తుతెలియని వస్తువు రికార్డైంది.అలాగే 2023లో చిత్రీకరించిన మరో వీడియోలో.. ఓ రహస్య వస్తువు అమెరికా సైనిక విమానంలోని ఎలక్ట్రో-ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల పనితీరును ప్రభావితం చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఏలియన్స్ ఉన్నాయా?పెంటగాన్ విడుదల చేసిన ఫైల్స్లో.. ఈ వస్తువులు గ్రహాంతరవాసులకు చెందినవే అని ఎక్కడా నిర్ధారించలేదు. అదే సమయంలో అవి ఏమిటో కూడా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. అందుకే వీటిని అధికారికంగా యూఏపీ (Unidentified Anomalous Phenomena)గా పేర్కొంది.మిస్టరీ మరింత ముదిరిందిగత కొన్నేళ్లుగా అమెరికా ప్రభుత్వం యూఎఫ్వోలకు సంబంధించిన పలు రహస్య పత్రాలను దశలవారీగా బయటపెడుతోంది. అయితే తాజా ఫైల్స్లో మాజీ సైనిక పైలట్ వాంగ్మూలం, అణు ఆయుధ కేంద్రంలో గుర్తుతెలియని వస్తువు సంచారం, చైనా సమీపంలో నమోదైన తాజా వీడియోలు ఉండటంతో.. "భూమిపై నిజంగానే ఏలియన్స్ నిఘా ఉందా? లేదంటే మనకు ఇంకా తెలియని అత్యాధునిక సాంకేతికతేనా?" అన్న ప్రశ్నలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ రహస్యం మాత్రం ఇంకా వీడలేదు. -
ఇరాన్పైకి వెయ్యి క్షిపణులు.. నాన్స్టాప్గా ఏడాదిపాటు దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత ఎగసిపడేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్నారు. శాంతి చర్చలకు ఇరాన్ ఇప్పుడు దిగి వచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చన్న ఆయన.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే.. అమెరికా నుంచి వెయ్యి క్షిపణులు వెంటనే ఆ దేశంపై విరుచుకుపడతాయని హెచ్చరించారు. తొలి దాడితో ఆగకుండా.. అవసరమైతే ఏడాది పాటు ఇరాన్లోని కీలక ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేసేలా అమెరికా సైన్యానికి ముందుగానే ఆదేశాలు జారీ చేశానని వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "అమెరికా అధ్యక్షుడిని, ముఖ్యంగా నన్ను హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే.. వెయ్యి క్షిపణులు ఇప్పటికే లక్ష్యంగా సిద్ధంగా ఉన్నాయి. తొలి దాడి తర్వాత వేలాది క్షిపణులు వెంటనే ప్రయోగిస్తాం. అమెరికా సైన్యానికి అవసరమైన అన్ని ఆదేశాలు ఇప్పటికే ఇచ్చాం. ఒక సంవత్సరం పాటు అవసరమైతే ఇరాన్లోని ప్రతి కీలక ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది" అని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.బ్యాక్ టు బ్యాక్ వార్నింగులుట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా.. తనకు ఏదైనా జరిగితే ఇరాన్పై ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో బాంబుల వర్షం కురిపించాలని ముందుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. తనపై కొత్త హత్య కుట్రకు సంబంధించి ఇజ్రాయెల్ వద్ద ఎలాంటి తాజా సమాచారం లేదని, అయితే చాలా ఏళ్లుగా తానే ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి లక్ష్యంగా ఉన్నానని మరోసారి పునరుద్ఘాటించారు.సోలేమానీ హత్యతో మొదలైన వైరం2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్కు చెందిన అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్కు చెందిన పలువురు నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా గతంలో ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్కు అనుబంధంగా ఉన్న వ్యక్తులు కుట్రలు పన్నినట్లు వెల్లడించాయి. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. అయితే అయతొల్లా ఖమేనీ మరణంతో మళ్లీ ట్రంప్ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.శాంతి చర్చలపైనా కఠిన వైఖరిఇదిలా ఉండగా.. అమెరికాతో మళ్లీ చర్చలు కొనసాగించాలని ఇరాన్ కోరినట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా ఇప్పటికే ఇరాన్కు కాల్పుల విరమణ ముగిసిందని స్పష్టం చేసిందన్నారు. చర్చలకు అంగీకరించినా.. ఇరాన్పై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చారు.పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు?అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న సమయంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు మధ్యవర్తి దేశాలు శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు "వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి.. ఏడాది పాటు దాడులు కొనసాగుతాయి" అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మళ్లీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.


