
మెక్సికోలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మతపరమైన సంబురాల్లో కొందరు దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబబ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్యకాలంలో అత్యంత హింసాత్మక ప్రాంతంగా ముద్రపడిన గువానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటోలో ఇది చోటుచేసుకుంది.
బుధవారం.. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్కు గౌరవంగా నిర్వహించిన వీధి ఉత్సవంలో స్థానికులు సంబురాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో కొందరు దుండగులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు. అప్పటిదాకా మద్యం, చిందుల్లో మునిగిపోయిన ప్రజలు.. భయంకరమైన కాల్పులతో ఒక్కసారిగా బయపడి పరుగులు తీశారు. ఆ సమయంలో చిన్నారులు కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇరాపువాటో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 12 మంది అక్కడికక్కడే మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షైన్బామ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ప్రకటించారు. దాడి వెనుక ఉద్దేశం.. దుండగుల వివరాలు తెలియరావాల్సి ఉంది.
#Nacionales | 🚨❗ Lamentable... M@asacre en fiesta en Irapuato deja 10 personas sin vida, entre ellos un menor.
Al menos 10 personas fueron asesinadas durante un ataque armado en la fiesta patronal de San Juan, en #Irapuato, #Guanajuato, informaron autoridades.
Detalles:… pic.twitter.com/yQbGKMRKhE— Plano Informativo Aguascalientes (@planoags) June 25, 2025
ఇదిలా ఉంటే.. క్రిమినల్ గ్రూపుల మధ్య తగాదాలతో గువానాజువాటో.. మెక్సికో క్రైమ్ ఏరియాగా పేరు ముద్రపడిపోయింది. గత నెలలో కూడా ఈ స్టేట్లో ఓ చర్చి కార్యక్రమంలో ఏడుగురు హత్య గురయ్యారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే ఈ రాష్ట్రంలో 1,435 హత్యలు నమోదయ్యాయి, ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెండింతల సంఖ్య కావడం గమనార్హం.