breaking news
NTR district Latest News
-
నిబంధనలు లే అవుట్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తాడిగడప మునిసిపాలిటీలో అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాలకు అడ్డు, అదుపు లేకుండాపోయింది. అనధికార లే అవుట్లు, అనుమతిలేని భవనాలు, అదనపు అంతస్తులకు రేటు కట్టి మరీ రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ దందా అంతా పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత కనుసన్నల్లోనే జరుగుతోంది. మునిసిపాలిటీ పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణం చేపట్టినా టౌన్ ప్లానింగ్ సిబ్బంది, నియోజకవర్గ ముఖ్యనేత నియమించిన ఏజెంటు అక్కడ వాలి పోయి నిర్మాణదారులతో బేరం కుదుర్చుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో తాడిగడపలో యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపైన ‘సాక్షి’లో వరుసగా కథనాలు రావడంలో టౌన్ ప్లానింగ్ అధికారిని ఉన్నతాధికారులు బదిలీ చేశారు. దీంతో కొద్దికాలం అక్రమ అంతస్తులకు అడ్డుకట్ట పడింది. ఇటీవల తాడిగడప మునిసిపల్ కమిషనర్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీ అయ్యేముందు నియోజకవర్గ ముఖ్యనేత, టౌన్ప్లానింగ్ సిబ్బందితో కుమ్మకై ్క అనధికార నిర్మాణాలకు పచ్చ జెండా ఊపారు. దీంతో అనధికార లేఅవుట్లలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. కొత్తగా వచ్చిన కమిషనర్ ఈ అక్రమ కట్టడాలపై దృష్టి సారించి అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఉంది. ● తాడిగడప– పెద్దపులిపాక రోడ్డులో 74/1ఏ, 74/1బీ, 74/1సీ సర్వే నంబర్లలో ఉన్న 3.30 ఎకరాల్లో అనధికార లేఅవుట్ వెలిసింది. ఈ లే అవుట్లో ఎటువంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా భవన నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే పది నుంచి 12 వరకు భవనాల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఈ భవన నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ఇప్పటికే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్లాట్కు రూ.లక్ష చొప్పున బేరం కుదుర్చుకుని, రూ.6 లక్షలు అడ్వాన్స్గా పుచ్చుకు న్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ ముఖ్యనేతకు అంతకు ముందే భవన నిర్మాణదారులు కప్పం చెల్లించారని స్థానికులు బహిరంగ పేర్కొంటున్నారు. ● యనమలకుదురు శివాలయం కాలువ కట్ట కింద భవన నిర్మాణాలపై నిషేధం ఉంది. అయినప్పటికీ సర్వే నంబరు 9/4లో 1.65 ఎకరాల్లో లేఅవుట్ వేసి అనధికారికంగా భవన నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రాంతంలో 15కు పైగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాల వెనుక నియోజకవర్గ ముఖ్యనేత హస్తంతోపాటు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి, భవన యజమానులకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ● యనమలకుదురు మెయిన్ రోడ్డు వద్ద ఉన్న గ్రామ కంఠంలో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ ముఖ్యనేత ఇరుకు రోడ్డులో ఎలాంటి అనుమ తులు తీసుకోకుండా ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనం వైపు టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. యనమలకుదురు డొంకరోడ్డు, కానూరు, తాడిగడప ప్రాంతాల్లో పెంట్ హౌస్ నిర్మాణాలకు సైతం ఒక్కొదానికి రూ.5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. అనధికార లేఅవుట్లలో విద్యుత్ లైన్లు తాడిగడప– పెద్దపులిపాక రోడ్డులో అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లలో విద్యుత్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే రూ.5 లక్షలు తీసుకొని విద్యుత్ శాఖ అధికారి ఒకరు అక్రమ లేఅవుట్లలో విద్యుత్ సౌకర్యం కల్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గ ముఖ్యనేత అండదండలు ఆ అధికారికి ఉండటంతో ప్రతి పనికీ ఓ రేటు కట్టి వసూలు చేస్తూ రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఆ అధికారి ముడుసేల వసూళ్లలో ‘నవ’ శకానికి నాంది పలికారు. కొత్త కమిషనర్ దృష్టిసారించాల్సిందే.. తాడిగడప మునిసిపాలిటీలో వెలుస్తున్న అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలపై కొత్తగా వచ్చిన మునిసిపల్ కమిషనర్ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. అక్రమాలపై కొరడా ఝళిపించడంతోపాటు, అందుకు బాధ్యులైన టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాడిగడప మునిసిపాలిటీలో విచ్చల విడిగా అక్రమ లేఅవుట్లు ఆ లేఅవుట్లలో అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు అనధికార లే అవుట్లలో ముడుపులు తీసుకొని విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్న వైనం పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత, టౌన్ ప్లానింగ్ సిబ్బంది సహకారం విద్యుత్ హైటెన్షన్ వైర్ల సమీపంలో.. విద్యుత్ టవర్ లైనుకు పది మీటర్ల వరకు 119 జీవో ప్రకారం ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టకూడదు. టవర్ లైన్ కింద గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేయాలి. అందుకు భిన్నంగా యనమలకుదురు కొండ వెనుక టవర్ లైన్ కిందనే అక్రమ నిర్మా ణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకు చేతులు తడిపారు. మూడంతస్తు లకు అనుమతి తీసుకుని ఐదంతస్తుల భవనం నిర్మి స్తున్నారు. 40 ఫ్లాట్లు టవర్ లైన్ కింద నిర్మిస్తుండటం విశేషం. ఇటీవల భవన నిర్మాణ కార్మికుడు పనిచేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు వది లాడు. స్థానికులు ఫిర్యాదు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు తుతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించి 14 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, ఒక్క పైసా జమచేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. -
దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఉత్తరాంధ్రలోని విజయనగరం, భోగాపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి పలు భక్త బృందాలు శనివారం ఇంద్ర కీలాద్రికి తరలివచ్చాయి. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దుర్గమ్మకు ఆషాఢ సారె సమ ర్పించాయి. అమ్మవారికి సారె సమర్పించేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. భక్తుల రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. వందకు పైగా భక్త బృందాలు.. భవానీదీక్ష సేవా పీఠానికి చెందిన పులపా మల్లేశ్వరరావు గురు భవానీతో పాటు భోగాపురం, విజయనగరం నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. వినాయకుడి గుడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఉత్తరాంధ్ర సంప్రదాయం మేరకు అమ్మవారికి పలు రకాల పండ్లు, పూజా సామగ్రి, మిఠాయిలను అమ్మవారికి సమర్పించారు. ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకున్న అనంతరం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద సారె సమర్పించారు. కృష్ణా, గుంటూరుతో పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి శనివారం పెద్ద ఎత్తున భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి విచ్చేశాయి. ఈ ఒక్క రోజే సుమారు వందకు పైగా భక్తబృందాలు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించాయని ఆలయ అధికారులు తెలిపారు. 5వ అంతస్తుకు చేరిన క్యూ రెండో శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మహా మండపం లిఫ్టు మార్గం ద్వారా వచ్చే భక్తులను ఐదు, ఆరు అంతస్తుల్లో దింపేశారు. అక్కడి నుంచి భక్తులు మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీ నేపఽథ్యంలో ఐదో అంతస్తు వరకు క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం రద్దు చేసి బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. రూ.300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు క్యూలైన్లు, రూ.100 టికెటు కొనుగోలు చేసిన వారికి రెండు క్యూలైన్లు, సర్వ దర్శనానికి మూడు క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమితించారు. మరో వైపున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గ మాలార్చన, శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం -
కార్తికేయుడికి వెండి బిస్కెట్ల సమర్పణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన తాళం నితిన్ కుమార్ కుటుంబ సభ్యులు 2.3 కిలోల వెండి బిస్కెట్లను శనివారం సమర్పించారు. ఉదయం స్వామివార్లను దర్శించుకున్న అనంతరం వెండి బిస్కెట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందజేశారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్య శర్మ, వెంకటేశ్వరావు, కిషోర్, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేరాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలిపెనమలూరు: నేరాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి.వి.జి.అశోక్కుమార్ ఆదేశించారు. కానూరు అన్నే కల్యాణ మండపంలో కృష్ణా జిల్లా ఇయర్లీ క్రైమ్ మీటింగ్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగాయన్నారు. వాటి నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మదక ద్రవ్యాల నివారణ, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేరాలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. రానున్నకాలంలో క్రైమ్ రేట్ తగ్గేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. తొలుత ఐజీ అశోక్కుమార్కు డీఎస్పీ శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు, సబ్ డివిజన్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ ఈఏపీసెట్ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఏపీ ఈఏపీసెట్–2025(ఎంపీసీ స్ట్రీమ్) పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఎన్సీసీ, స్పోర్ట్స్అండ్ గేమ్స్ కేటగిరికి చెందిన 570 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన శని వారం పూర్తి చేశామని హెల్త్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. నేటి షెడ్యూల్ ఇదే.. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విద్యార్థుల 60,001 నుంచి లక్ష లోపు ర్యాంకు పొందిన విద్యార్థులు, సీఏపీ–1 నుంచి 50 వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి తెలిపారు. తిరుపతమ్మకు సారె సమర్పణ పెనుగంచిప్రోలు(వత్సవాయి): ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సమరసత సేవాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారికి సారెను సమర్పించారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సారెను సమర్పించారు. సారె సమర్పించిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఈవో కిషోర్కుమార్, ట్రస్టు బోర్టు సభ్యులు బెజవాడ శ్రీనివాసరావు, పాలాది వెంకటరమణ, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సూపరిండింటెంట్ డి.వి.ఎస్.రాజు పాల్గొన్నారు. -
వల్లభనేని వంశీపై ఆగని వేధింపులు
గన్నవరం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్పై కూటమి సర్కారు వేధింపులు ఆగడం లేదు. జైలు నుంచి బయటికి వచ్చాక కూడా కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ మైనింగ్ ఆరోపణల కేసు విచారణ నిమిత్తం శనివారం గన్నవరం పోలీస్స్టేషన్కు వంశీ హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి నెలా రెండో శనివారం ఆయన విచారణ హాజరుకావాల్సి ఉంది. ఇటీవల ముక్కు సంబంధిత సమస్యకు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు శనివారం ఉదయం వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ కూడా చేశారు. దీంతో తీవ్ర జ్వరానికి గురైన వంశీమోహన్ కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. అయితే సీఐ అందుబాటులో లేరు. ఎప్పుడు వచ్చేదీ కూడా సిబ్బంది చెప్పలేదు. దీంతో మూడు గంటల వరకు స్టేషన్ ప్రాంగణంలోనే వంశీ నిరీక్షించారు. అనంతరం స్టేషన్కు చేరుకున్న సీఐ బి.వి.శివప్రసాద్ విచారణ నిమిత్తం మరోసారి పిలుస్తామని వంశీమోహన్కు తెలిపారు. అక్కడి నుంచి వంశీ ఆత్కూరు, హనుమాన్జంక్షన్ పోలీస్స్టేషన్లకు వెళ్లి కోర్టు ఆదేశాల మేరకు సంతకాలు చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి వంశీమోహన్ బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు పలువురు ఉన్నారు. -
జిల్లా జైలును సందర్శించిన న్యాయమూర్తులు
విజయవాడలీగల్: నగరంలోని జిల్లా జైలును శనివారం కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్, నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అంజని ఎస్.ఎస్.రామ ఆదిత్య రిషిక్ సందర్శించారు. జైలులో ఖైదీలకు అందుతున్న మౌలిక సదుపాయాలు, భోజనం, వైద్య సహాయం, ఉచిత న్యాయసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు అందరూ క్రమశిక్షణ అలవర్చుకుని పరివర్తన తెచ్చుకోవాలని జిల్లా జడ్జి గుట్టల గోపీ ఆకాంక్షించారు. జాతి కోసం మధ్యవర్తిత్వంలో భాగంగా రాజీపడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను ఖైదీలు తమ న్యాయవాదులను సంప్రదించి మీడియేషన్ కేంద్రానికి పంపితే రాజీ చేసుకోవచ్చని జడ్జి ఎ.సత్యానంద్ సూచించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మీడియేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జైలులో ఫిర్యాదుల బాక్సును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జైలర్ గణేష్, మండల లీగల్ సర్వీసు అథారిటీ సిబ్బంది, ప్యానల్ న్యాయవాదులు పగిడిపల్లి రాము, కంచర్ల త్రినాథ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పులిచింతలకు 20,077 క్యూసెక్కులు విడుదల
సత్రశాల (రెంటచింతల): సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రెండు యూనిట్ల నుంచి, రెండు క్రస్ట్గేట్ల ద్వారా మొత్తం 20,077 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో ప్రాజెక్టు డ్యామ్ ఈఈ సుబ్రహ్మణ్యం, ఏడీఈ ఎన్.జయశంకర్ శనివారం తెలిపారు. విద్యుత్ ప్రాజె క్టులోని రెండు యూనిట్ల ద్వారా 8,757 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతలకు విడుదల చేసి 1.874 ఎంఎం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రెండు క్రస్ట్గేట్ల ద్వారా 11,320 క్యూసెక్కులు వరద నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిమట్టం ప్రాజెక్టు పూర్తి స్థాయి 75.50 మీటర్లకు నీరు చేరుకుందని, రిజర్వాయర్లో గరిష్ట స్థాయిలో 7.080 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. -
సూపర్ స్వచ్ఛత లీగ్లో విజయవాడ
పటమట(విజయవాడతూర్పు): స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సూపర్ స్వచ్ఛత లీగ్లో నగరపాలక సంస్థ ఎంపికైందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మునిసి పల్ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగబోయే స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నట్లు వివరించారు. దీనికి కారణమైన ప్రజలకు, పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇండోర్, నవీ ముంబై, సూరత్ నగరాల జాబితాలో విజయవాడ నగరం కూడా చేరినందుకు సంతోషంగా ఉందని మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విపత్తుల సమయాన నగరంలో పదివేల పారిశుద్ధ్య కార్మికులతో, 200 మందికి పైగా అధికారులతో, 32 మందికి పైగా ఐఏఎస్లతో నిర్వహించి ఇబ్బందులు తప్పించామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది వల్లే సాధ్యం మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర -
రిజిస్ట్రేషన్ స్టాంప్ల చోరీ ముఠా అరెస్ట్
గన్నవరం: స్టాంప్లు చోరీచేసిన దొంగలముఠాను శుక్రవారం గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో డీఎస్పీ సిహెచ్. శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి గన్నవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయ తలుపులు పగులకొట్టి బీరువాలోని రూ.13.56 లక్షల విలువైన స్టాంప్లను అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులు విసన్నపేట మండలం తాతకుంట్లకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు, దొంగిలించిన స్టాంప్లను విక్రయించేందుకు విజయవాడ వెళ్తున్న ప్రధాన నిందితుడైన వడ్లమూడి చెన్నరావు, ఆతనికి సహకరించిన వడ్లమూడి రాంబాబు, వడ్రాణపు శ్రీనివాసరావును ఆగిరిపల్లి వద్ద అదుపులో తీసుకున్నారు. అనంతరం వీరిని విచారించగా గన్నవరంతోపాటు 2023లో పటమట సబ్రిజిస్ట్రార్ ఆఫీస్లో చోరీకి విఫలయత్నం చేయడంతోపాటు 2024లో రూ. 8 లక్షల స్టాంప్లను అపహరించినట్లు నిందితులు అంగీకరించారు. తాతకుంట్లకు చెందిన చెన్నరావు పటమటలో ఓస్టాంప్ వెండర్ వద్ద పనిచేస్తూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరి వద్ద నుండి రూ. 14 లక్షల విలువగల స్టాంప్లను స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు చెన్నరావు కాలికి గాయం కావడంతో ఆస్పత్రికి తరలించినట్లుగా చెప్పారు. ఈ కేసులో అదుపులో తీసుకున్న ఏనుగు అంకినీడు పాత్రపై లోతైన విచారణ చేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా వీరి నుంచి స్టాంప్లను కొనుగోలు చేసి విక్రయిస్తున్న స్టాంప్ వెండర్ విఠలరావుకు కూడా నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. ఈ కేసును వేగవంతంగా చేధించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. గన్నవరం సీఐ బీవీ.శివప్రసాద్, సీసీఎస్ సీఐ ఆర్. గోవిందరాజు, ఎస్ఐ వీరవెంకటేశ్వరరావు, లాఅండ్అర్డర్ ఎస్ఐ శ్రీధర్, క్రైం హెడ్కానిస్టేబుల్ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
రామవరప్పాడు: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ సెక్రెటరీ జి.దేవి సూచించారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. రామవరప్పాడు జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి మెనూ అమలు, భోజనం నాణ్యత తదితర విషయాలను తెలుసుకున్నారు. రాగి జావ నాణ్యతను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పలు సూచనలు చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలను సందర్శించారు. గొల్లపూడి హైస్కూల్లో వంటశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, సివిల్ సప్లై అధికారులు, జిల్లా విద్యాశాఖ నుంచి ప్రభాకర్, నిర్మల, వెంకట రమణ, ప్రసాద్ పాల్గొన్నారు. -
లదీస్తే కేసులు..
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025రసిస్తే అరెస్టులు! మైలవరంలో కొనసాగుతున్న అరాచక పర్వం నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి గుంటూరు నవభారత్నగర్కు చెందిన ఆళ్ల శివారెడ్డి కుటుంబం రూ.లక్ష విరాళాన్ని శుక్రవారం అందజేసింది. నికొండలమ్మకు ఆషాఢ సారె గుడ్లవల్లేరు: శ్రీ కొండలమ్మవారికి గుడ్లవల్లేరు మండలం వేమవరం సర్పంచి మన్నెం పద్మావతి ఆధ్వర్యంలో భక్తులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం సారెను సమర్పించారు. నిరసన ర్యాలీ మునిసిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ తమ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 7న్యూస్రీల్ -
కనెక్షన్.. కలెక్షన్!
డబ్బులిస్తేనే ఇంటికి తాగునీరు‘లక్షలు ఇచ్చి కాంట్రాక్టు తెచ్చుకున్నాం.. ఇంటికి ఐదు వందలేగా.. ఇవ్వలేరా? డబ్బులు ఇవ్వకపోతే మీకు పైపులైన్ కనెక్షన్ ఇవ్వటం కుదరదు.. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే కనెక్షన్లు ఇవ్వాలని పైనుంచి ఒత్తిడి ఉంది..’ ఇదీ వీఎంసీలో పరిస్థితి. తాగునీటి సరఫరాకు పాత పైపులైన్లు తొలగించి కొత్తవి పైపులైన్లు వేస్తున్నారు. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టరు డబ్బులిస్తేనే కనెక్షన్ ఇస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతుండటం చర్చనీయాంశం అవుతోంది. పటమట(విజయవాడతూర్పు): నగరంలో నిరంతర తాగునీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. తుప్పు పట్టిన జీఐ పనులతో ఇనుప కిలుము, నలకలతో కూడిన నీరు కుళాయిల నుంచి వస్తున్నాయి. దీనికితోడు లీకేజీలు పెరిగిన కొండప్రాంతాలు, శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరా సమస్యాత్మకంగా మారింది. దీంతో పైపుల మార్పిడి అనివార్యం అయ్యింది. నగరంలో కొత్త లైన్లు.. విజయవాడ నగరంలో నిరంతరం(24/7) తాగునీటి సరఫరా అందించేందుకు ఇంజినీరింగ్ విభాగం ఇటీవల ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నగరంలోని 64 డివిజన్లలో అమృత్ 1.0, అమృత్ 2.0లో పాతపైపులైన్లు తొలగించి కొత్తవి వేయటానికి నిధులు కూడా కేటాయింపులు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్లో గిరిపురం, ఉడ్పేట ప్రాంతంలో సుమారు 2వేల కుటుంబాలు నివాసాలుంటాయి. ఈ ప్రాంతంలో ప్రతి ఎసెస్మెంట్కు అమృత్ 1.0లో తాగునీటి కనెక్షన్ ఇవ్వాలని వీఎంసీ భావించింది. అందుకు అనుగుణంగా రూ. 50లక్షల వరకు నిధులు కూడా కేటాయించింది. దీనిపై ఇటీవల నగరానికి చెందిన ఓ కాంట్రాక్టరు టెండరు కూడా దక్కించుకున్నారు. సుమారు 25 కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుకు ఇరువైపులా, వీధుల్లో, సందుల్లో మెయిన్పైపు లైన్ల నుంచి ఇంటింటి కనెక్షన్ ఇచ్చేందుకు పైపులు వేశారు. పైపు సైజ్ మార్చాలని చెప్పినా.. స్థానిక అవసరాలకు తగిన విధంగా గతంలో కంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో జనాభా పెరిగిందని, జనాభాకు అనుగుణంగా ప్రధాన పైపులైన్లు, ఇంటింటి కనెక్షన్లకు పైపుల సైజు పెంచాలని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. గతంలో మాదిరే 3ఎంఎం పీవీసీ పైపులైన్లు వేస్తున్నారు. అదీ నాసిరకం పైపులతో.. రోడ్డు మధ్య నుంచి ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చే సమయంలో ఏవైనా బరువైన వాహనాలు వాటిపై ఎక్కితే నుజ్జునుజ్జు అయ్యేంతలా అవి ఉన్నాయి. ఆ నిబంధన సాకుతో వసూళ్లు.. రోడ్డు మధ్యలో నుంచి ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చేందుకు రోడ్డును తవ్వాల్సి ఉంది. తవ్విన రోడ్డును కాంట్రాక్టరే పూడ్చాల్సి ఉంది. ఇది సదరు కాంట్రాక్టరుకు టెండర్లలోనే నియమంగా ఉంచారు. దీన్నే అదునుగా చేసుకున్న కాంట్రాక్టర్ స్థానికుల నుంచి డబ్బులు వసూలు చేయటం ప్రారంభించారు. ‘మీ కోసం రోడ్డు తవ్వుతున్నాం.. మళ్లీ అది మేమే పూడ్చాలి.. ఇంకా మెయిన్లైన్ నుంచి ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చే కప్లింగ్ అందుకు అయ్యే ఖర్చు మీరే భరించాలి.. అందుకు ఇంటికి రూ. 500 ఇవ్వాలి.. లేనిపక్షంలో మీకు కనెక్షన్లు ఇవ్వం’ అని స్థానికులను బెదిరిస్తున్నారు. అదేమని అడిగితే కనెక్షన్ ఇవ్వను ఎవరికి చెప్పుకుంటారో అంటూ బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై ప్రమాదకరంగా వదిలేసిన పైపులైన్లు వీఎంసీలో వింత పోకడ తాగునీటి సరఫరాలో తారస్థాయికి అవినీతి స్థానికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ నాసిరకం పైపులతో ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు ఎవరికీ డబ్బులివ్వద్దు.. నూతన పైపులైన్లు వేస్తున్నాం. డబ్బులు ఇవ్వాలని ఎవరైనా అడిగితే వీఎంసీకి అధికారులకు ఫిర్యాదు చేయండి. ఎవరికీ పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వీఎంసీనే ప్రతి ఇంటికీ పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేస్తుంది. నాసిరకం పైపులు అనే అంశాన్ని సాంకేతికంగా ధ్రువీకరించుకోవాలి. కాంట్రా క్టరు ఎలాంటి పైపులైప్లు వేస్తున్నారో పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – సామ్రాజ్యం, సర్కిల్–3 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రమాదకరంగా మారిన పైపులు.. ఈ ప్రాంతంలో కనెక్షన్లు ఇచ్చేందుకు వేసిన పైపులైన్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. రోడ్డుకి చివర కొసలు ఉంచేయటం, రోడ్డు వెంబడి చుట్టలుగా పైపులు వదిలేయటంతో రోడ్డులో ప్రయాణించే వారంతా ప్రమాదాలబారిన పడుతున్నారు. రోడ్డు మార్జిన్లలో ఉండటంతో వాహనాలకు తగలి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. -
తరలివస్తున్న భక్తబృందాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల నేపథ్యంలో అమ్మవారికి సారెను సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్త బృందాలు తరలివస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు కుటుంబ సమేతంగానూ, కాలనీలు, అపార్టుమెంట్లలో నివాసం ఉండే వారు బృందాలుగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. తెల్లవారుజామున ఆరు గంటల నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉదయం 10 గంటల తర్వాత రద్దీ అనూహ్యంగా పెరిగింది. రద్దీ నేపథ్యంలో మహా మండపంలోని లిఫ్టులను 5వ అంతస్తులోనే భక్తులను దింపేశారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం సుమారు వందకు పైగా భక్తబృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనాలు నిలిపివేయడంతో పాటు మధ్యాహ్నం రెండు గంటల వరకు రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. రూ.300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఇక సర్వ దర్శనానికి రెండు గంటల పైగానే సమయం పట్టిందని భక్తులు పేర్కొంటున్నారు. వీకెండ్లోనూ రద్దీకి అవకాశం రెండో శనివారం, ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ ఈవో శీనానాయక్ అంచనా వేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను ఏ విధంగా ముందుకు నడపాలనే దానిపై శనివారం సిబ్బందికి సూచనలు చేశారు. ముఖ్యంగా 11.30 నుంచి 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేయగా, ఈ సమయాన్ని మరింత పెంచే ఆలోచన చేస్తున్నారు.దుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న రద్దీ -
ప్రజా భద్రత గాలికి..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘మాట్లాడితే.. లోపలేయండి’ అని ఆ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఆదేశించిందే తడవు.. పోలీసులు ముందూవెనుకా చూడకుండా అమలు చేస్తున్నారు. ప్రశ్నించిన వారి పై ఎదురు కేసులు పెట్టి వేధిస్తున్నారు. స్థానిక సమ స్యలపై మట్టి, బూడిద, ఇసుక దోపిడీపై ప్రశ్నించిన పౌరులు, ప్రజా సంఘాల నాయకులపై కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తూ పోలీసులే రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. సోషల్ మీడి యా కేసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధి రాసిన రాజ్యాంగమే తమకు శిరోధార్యమన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు విస్తుపోతున్నారు. ప్రశ్నిస్తే కేసులే.. ● కూటమి ప్రభుత్వ తీరు, మైలవరం నియోజక వర్గంలో కుంటుపడిన అభివృద్ధి, యథేచ్ఛగా జరుగుతున్న మట్టి మాఫియా వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇబ్రహీంపట్నంకు చెందిన సీనియర్ జర్నలిస్టు వెలమా రామారావుని మైలవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని విచారించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రామారావు తనకు అరోగ్యం సక్రమంగా లేదని చెప్పినప్పటికీ కనీసం కనికరం లేకుండా తీసుకెళ్లి దాదాపుగా ఎనిమిది గంటలకు పైగా విచారణ జరిపారు. డయాలసిస్ అనంతరం గురువారం మరలా పోలీసుస్టేషన్కు రావాలంటూ ఆదేశించి పంపినట్లు తెలిసింది. ● మైలవరం నుంచి నూజివీడు వెళ్లే ప్రధాన రహదారి ప్రారంభం నుంచి ఐదు కిలోమీటర్ల మేర తవ్వి వెట్ మిక్స్ వేసి వదిలేశారు. నాలుగు నెలలు గడిచినా ఈ రహదారి నిర్మించకపోవడం వల్ల స్థానిక ప్రజలు నరకయాతన పడుతున్న నేపథ్యంలో సీపీఎం మండల కార్యదర్శి చాట్ల సుధాకర్ ఆధ్వర్యంలో వెల్వడంలో జూలై 1వ తేదీన ధర్నా నిర్వహించారు. గతంలో కూడా ఇలానే ధర్నాలు నిర్వహించడంతో తన పరువుపోతుందని భావించిన ప్రజా ప్రతినిధి పోలీసులను రంగంలోకి దింపారు. వెంటనే పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని చాట్ల సుధాకర్ని అదుపులోకి తీసుకొని బైండోవర్ కేసు పెట్టారు. దీనిపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ● ఇటీవల మైలవరం ప్రజా ప్రతినిధికి చెందిన హైదరాబాద్ భూ వివాదంలో హైడ్రా కూల్చి వేతలపై టీవీలలో వచ్చిన వీడియోలను సోషల్మీడియాలో షేర్ చేసినందుకు గానూ చెవుటూరుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను మైలవరం పోలీసులు వేధింపులకు గురి చేశారు. ఈ ఘటనలో షేర్ చేసిన వ్యక్తిని కాకుండా ఎటువంటి పోస్టు పెట్టని వైఎస్సార్ సీపీ కార్యకర్తను గంటల సేపు పోలీసుస్టేషన్లో కూర్చోబెట్టి వేధించడంతో అతని కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ● మైలవరం మండల పరిధిలో సోషల్ మీడియాలో పోస్టులపై మరి కొంతమందిని పోలీసుస్టేషన్కు పిలిచి వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాకుండా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గానూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఏడు కేసులు నమోదు చేశారు. జర్నలిస్టులనూ వదలరు.. స్థానికంగా జరుగుతున్న మట్టి, ఇసుక, బూడిద మాఫియాలపై కథనాలు రాసిన జర్నలిస్టులకు సైతం నోటీసులు ఇస్తామంటూ పోలీసులు వేధిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జర్నలిస్టులు కథనాలు ఎలా రాయాలో కూడా పోలీసులే చెప్పే స్థాయికి నియోజకవర్గంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ప్రజాప్రతినిధికి జీహుజూర్ అంటున్న పోలీసులు ప్రజా భద్రతను గాలికొదిలేసి అక్రమ కేసుల నమోదుపైనే ఆసక్తి సోషల్ మీడియాలో పోస్టులపై వేధింపులు సమస్యలపై పోరాడిన ప్రజా సంఘాల నాయకులపై బైండోవర్లు జర్నలిస్టులకూ తప్పని పోలీసుల వేధింపులు మైలవరం నియోజకవర్గంలో ప్రజా భద్రతను గాలికొదిలేసిన పోలీసులు, ప్రజా ప్రతినిధి ఆదేశాలను శిరసావహిస్తూ.. జీ హుజూర్ అంటున్నారు. నియోజకవర్గంలో మర్డర్లు, చైన్ స్నాచింగ్లు, గంజాయి సరఫరా, నాటు సారా, రోడ్డు ప్రమాదాలు, పేకాట, కోడి పందేలు, మట్టి దోపిడీ వంటి ఎన్నో నేరాలు యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ వాటన్నింటినీ వదిలేసి అక్రమ కేసులపై పోలీసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రజా ప్రతినిధి అవినీతిపై కానీ, రోడ్ల సమస్యలపై కానీ, ప్రభుత్వ పనితీరుపై కానీ ఒక్కపోస్టు పెట్టినా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టులు చేస్తున్నారు. అదే టీడీపీ నాయకులు రెచ్చగొడుతూ ఎన్ని పోస్టులు పెట్టినా పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. మైలవరం పోలీసుల తీరుపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
గంజాయి చాక్లెట్లు స్వాధీనం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు ఈగల్ టీం, జిల్లా పోలీసు, ఆర్పీఎఫ్, జీఆర్పీ సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వ ిహిస్తున్నట్లు జీఆర్పీ డీఎస్పీ రత్నరాజు తెలిపారు. ఈగల్, పోలీసు, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది శుక్రవారం కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఏలూరు నుంచి విజయవాడ మధ్య ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను బీహార్ నుంచి చైన్నెకి తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా జీఆర్పీ డీఎస్పీ రత్నరాజు విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ రైల్వేస్టేషన్లో కూడా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. గంజాయి ఎక్కువగా రైలులోనే రవాణా అవుతోందని, ఈ గంజాయి నెట్వర్క్ను నిర్మూలించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. గంజాయిని కలిగి ఉన్నా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీఆర్పీ సీఐ జే.వి రమణ, ఎస్ఎన్పురం సీఐ లక్ష్మీనారాయణ, ఆర్పీఎఫ్ సీఐ ఫతేఆలీబేగ్, సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గమ్మ సేవలో మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని వెండి పళ్లెంతో సహా సమర్పించారు. వెండి పళ్లెంను అమ్మవారి పూజా కార్యక్రమాలను ఉపయోగించాల్సిందిగా ఆలయ అధికారులను మంత్రి కోరారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను బహూకరించారు. 20న ఏపీ ఎంఏయూ ఎన్నికలు లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ గుర్తింపు సంఘమైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ నియామకాలకు ఈ నెల 20 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. గిరిబాబు తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 19న నామినేషన్లు స్వీకరిస్తామని, 20 నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొడాలి శేషయ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని వెల్లడించారు. అదే రోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశమై వైద్య ఉద్యోగుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం తీర్మానాలు చేస్తారని వివరించారు. శిక్షణలో క్రమశిక్షణ అవసరం కోనేరుసెంటర్: ఫైరింగ్ శిక్షణను సజావుగా సద్వినియోగం చేసుకోవాలంటే సిబ్బందికి క్రమశిక్షణ అవసరమని జిల్లా ఎస్పీ ఆర్ గంగా ధరరావు పేర్కొన్నారు. మంగినపూడి బీచ్ సమీపంలోని ఫైరింగ్ శిక్షణ కేంద్రంలో జిల్లాలోని పోలీసు అధికారులకు శుక్రవారం ఫైరింగ్లో శిక్షణ నిచ్చారు. కార్యక్రమాన్ని ఎస్పీ పర్యవేక్షించి, ఫైరింగ్కు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడేందుకు సంసిద్ధులై ఉండాలన్నారు. ఫైరింగ్లో ప్రతి ఒక్కరు మెలకువలు నేర్చుకుని అత్యుత్తమ ప్రతిభను కనబరచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అత్యంత కీలకమైనవన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని జిల్లాకు మంచి పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చేందుకు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యాధరపురం కబేళా వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపీహెచ్(ఫీమేల్), ఎంఎల్టీ వకేషనల్ విభాగంలో జూనియర్ లెక్చరర్స్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ హఫీజ్ షేక్ అహ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీహెచ్కు బీఎస్సీ నర్సింగ్, ఎంఎల్టీకి బీఫార్మసీ, ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీలో కనీస 50 శాతం మార్కులు ఉండా లని వివరించారు. ఆసక్తిగల వారు సంబంధిత అర్హత పత్రాలతో ఈ నెల 14వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని తెలిపా రు. ఇంటర్వ్యూ, డెమో 15వ తేదీ ఉదయం 10 గంటలకు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 98858 41277లో సంప్రదించాలన్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో.. మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణకాంత్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ, ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం), కామర్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు ఒక్కో పోస్టు, తెలుగు, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సంబంధిత సబ్జెక్టులో 50శాతం మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఈనెల 16వ తేదీలోపు మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డెమో, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. -
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి చిలకలపూడి(మచిలీపట్నం): దేశవ్యాప్తంగా 90 రోజుల్లో అత్యధిక కేసుల పరిష్కారం కోసం మీడియేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, న్యాయ మూర్తులు, న్యాయవాదులు కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి అన్నారు. బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా న్యాయ ప్రక్రియలో కూడా మార్పులు రావాలని, సత్వరమే న్యాయం అందిస్తే కక్షిదారులకు న్యాయవ్యవస్థపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. లోక్అదాలత్, మీడియేషన్ సెంటర్లలో కేసులు పరిష్కరించి కక్షిదారుల శాంతియుత జీవనానికి అందరూ సహకరించాలన్నారు. ప్రతిష్ట మరింత పెంచే దిశగా.. కేసులు పరిష్కరించటంలో జిల్లా వ్యాప్తంగా 64 మంది శిక్షణ పొందిన న్యాయవాదులను, సోషల్ వర్కర్లను, మీడియేటర్లను ఏర్పాటు చేసినట్లు జడ్జి తెలిపారు. 90 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్గా జిల్లాలో అన్ని బార్ అసోసియేషన్లలో కేసులు పరిష్కరిస్తామన్నారు. న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య మాట్లాడుతూ సత్వరమే కేసులు పరిష్కరిస్తే న్యాయశాఖ గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయన్నారు. శిక్షణ సమయంలో మీడియేటర్లతో ఉభయ పార్టీలను శాంతియుతంగా పరిష్కరించి అప్పీలు లేని విధంగా తీర్పులు ఇస్తామని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. పోతురాజు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, గురుకుల వసతి గృహాల నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 34 ఎస్సీ వసతి గృహాల్లో 2218 మంది విద్యార్థులు, 26 బీసీ వసతి గృహల్లో 1259మంది, మూడు ఎస్టీ వసతి గృహాల్లో 341 మంది, రెండు మైనార్టీ సంక్షేమ వసతి గృహలలో 64 మంది విద్యార్థులు ఉంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ వసతిగృహాల సంక్షేమ అధికారులపై ఆధారపడి ఉంటుందన్నారు. సంక్షేమ అధికారులు విద్యార్థులకు తల్లిదండ్రులతో సమానమని, వారికి మెరుగైన వసతితోపాటు విద్యను అందించాలని సూచించారు. దోమ తెరలను తప్పక ఏర్పాటు చేసుకోవాలని, హాస్టల్ మరమ్మతులకు సంబంధించి తగు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఆలసత్వం వహిస్తే సహించబోనని హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జి.మహేశ్వరరావు, మైనార్టి సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, వెనకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ అధికారిణి ఎ.విజయశాంతి, గురుకుల విద్యాలయ సంక్షేమ అధికారి మురళీకృష్ణ, సహాయ సంక్షేమ అధికారులు వి.గణేష్, టి.గాయత్రి, ఎం.విజయ తదితరులు పాల్గొన్నారు. -
ఫసల్ బీమాను సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై), పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంట బీమా(ఆర్డబ్ల్యూబీసీఐఎస్) పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఆయా పంటల బీమా పథకాలపై వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో దిగుబడి ఆధారిత పీఎంఎఫ్బీవై కింద వరి, ఎర్ర మిరప, మొక్కజొన్న, పెసర పంటలను, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ కింద పత్తి పంటను నోటిఫై చేసినట్లు చెప్పారు. వరికి గ్రామాన్ని, ఎర్ర మిరపకు మండలాన్ని, మొక్కజొన్న, పెసర పంటలకు జిల్లాను బీమా యూనిట్లుగా నోటిఫై చేసినట్లు వివరించారు. పీఎంఎఫ్బీవై అమలుకు టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ అమలుకు ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంపిక చేశామన్నారు. రైతులు, కౌలురైతులు ఈ పథకాల్లో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి పంట రుణం పొందిన రైతులకు రుణంతోపాటు విజ్ఞప్తి మేరకు బీమా ప్రీమియం కూడా మంజూరు చేస్తారన్నారు. పంట రుణం తీసుకోని రైతులు కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ), బ్యాంకుల్లో ప్రీమియం చెల్లించి జాతీయ పంట బీమా పోర్టల్ (ఎస్సీఐపీ)లో నమోదు చేసుకొని ఈ పథకంలో చేరవచ్చన్నారు. గ్రామ సచివాలయం, తపాలా కార్యాలయాలు కూడా సీఎస్సీగా పనిచేస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ–కేవైసీ నమోదు తప్పనిసరి.. రైతులు బీమా పరిహారం పొందాలంటే ఈ–పంట నమోదు, ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి వ్యవసాయ, ఉద్యాన అధికారులు, సిబ్బంది రైతులు పంట బీమా పథకాలను సద్వినియోగం చేసుకునేలా వారికి మార్గనిర్దేశనం చేయాలని ఆదేశించారు. వరికి ఎకరాకు రూ. 42,500 పంట బీమా మొత్తం కాగా, ప్రీమియం కింద రూ.850 చెల్లించాలన్నారు. రైతులు ఆగస్టు 15వ తేదీలోగా బీమా చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజకుమారి, ఉద్యాన అధికారి పి.బాలాజీకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):ఏపీ ఈఏపీ (ఇంజనీరింగ్,అగ్రికల్చర్,ఫార్మసీ)(ఎంపీసీ స్ట్రీమ్) సెట్–2025లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం నుంచి ప్రారంభం కానుంది. నగరంలోని రమేష్ ఆసుపత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల పరిశీలనకు అన్ని ఏర్పాటు చేశామని హెల్ప్లైన్ సెంటర్ జిల్లా కోఆర్టినేటర్ ఎం.విజయసారధి చెప్పారు. షెడ్యూల్ ఇదే.. ● తొలిరోజు శనివారం ఒకటి నుంచి 60వేలు లోపు ర్యాంకు పొందిన ఎన్సీసీ,స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ● 13వ తేదీన 60001 నుంచి లక్ష లోపు ర్యాంకు పొందిన ఎన్సీసీ, స్పోర్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు, 1నుంచి 50 వేల లోపు ర్యాంకు పొందిన సీఏపీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ● 14వ తేదీన 100001 నుంచి 150000లోపు ర్యాంకు పొందిన ఎన్సీసీ, స్పోర్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు, 50001 నుంచి లక్ష లోపు ర్యాంకు పొందిన సీఏపీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని చెప్పారు. ● 15వ తేదీన 150001 నుంచి చివరి ర్యాంకు వరకు ఎన్సీసీ,స్పోర్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు, 100001 నుంచి 150000 ర్యాంకు పొందిన సీఏపీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ● 16వ తేదీన సీఏపీ–150001 నుంచి చివరి ర్యాంకు పొందిన సీఏపీ అభ్యర్థులతోపాటు విభిన్న ప్రతిభావంతులు, ఆంగ్లో ఇండియన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరిలో ఒకటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి తెలియజేశారు. హెల్ప్లైన్ సెంటర్లో స్పెషల్ కేటగిరీకి చెందిన ర్యాంకర్ల సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలిస్తామని, జనరల్ కేటగిరీకి చెందిన ర్యాంకర్ల సర్టిఫికెట్లను ఆన్లైన్లో పరిశీలిస్తామని ఆయన వివరించారు. మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య పెనమలూరు: మద్యానికి బానిసగామారి అప్పులు చేసిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెనమలూరులో చోటుచేసుకుంది. పెనమలూరు సీఐ వెంకటరమణ కథనం మేరకు శ్రీకాకుళంకు చెందిన బోద్రోతు సింహాచలం(40), అతని భార్య సుజాత ఉపాఽధి కోసం పెనమలూరు వచ్చి పాత పోలీస్స్టేషన్ ప్రాంతంలో ఉంటున్నారు. ఇద్దరు తాపీ పనులు చేస్తారు. అయితే సింహాచలం మద్యానికి బానిసగా మారాడు. మద్యం కోసం అనేకచోట్ల అప్పులు చేశాడు. దీంతో భార్య కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళం వెళ్లి పోయింది. కాగా సింహాచలం తాను ఉంటున్న ఇంట్లో చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఇరుగుపొరుగు వారు సింహాచలం మృతిసమాచారాన్ని అతని భార్యకు తెలుపటంతో ఆమె వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి పెనమలూరు: కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్్ కాలేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పెనమలూరు సీఐ వెంకటరమణ కథనం మేరకు..తాడిగడప మిత్రా జ్యువెల్స్లో ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు ఎస్.వెంకటరమణ (70) గురువారం రాత్రి మందులు కొనటానికి ఇంటినుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తూ సిద్ధార్థ ఇంజినీరింగ్కాలేజీ వద్ద బందరురోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటరమణ తలకు బలమైన గాయం కావడంతో అతనిని పోరంకిలో ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్పై ఉన్న భార్యభర్తలకు కూడా గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై మృతుడి కుమారుడు పవన్సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. -
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు : కలెక్టర్
రామవరప్పాడు: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, విషజ్వరాల కట్టడికి క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశ తెలిపారు. విజయవాడరూరల్ మండలం ప్రసాదంపాడులో శుక్రవారం జరిగిన డ్రైడే ఫ్రైడే సీజనల్ వ్యాధుల అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అధికారులు, సిబ్బందితో కలసి ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందన్నారు. పర్యావరణహిత క్లాత్ బ్యాగ్స్, జ్యూట్ బ్యాగ్స్ వినియోగించాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఆయన ప్రజలకు సరఫరా చేస్తున్న రక్షిత తాగునీటిని పరిశీలించారు. మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా వంటి జ్వరాలు బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాని సూచించారు. ఈసందర్భంగా రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాలకు కలిపి ఉన్న ఎస్సీ శ్మశానవాటికలో వసతులు కరువయ్యాయంటూ జెడ్పీటీసీ సభ్యుడు సువర్ణరాజు సమస్యను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. శ్మశానంలో పిచ్చిమొక్కలు తొలగించి షెడ్, చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ను కోరారు. పారిశుద్ధ్య పరిస్థితిపై అసంతృప్తి... గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కలెక్టర్ లక్ష్మీశ, పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ను ఆదేశించారు. గ్రామంలోని డ్రెయిన్లు, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. డ్రెయిన్లలో పూడిక తీయించాలన్నారు. ఖాళీస్థలాల్లో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉందంటూ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఖాళీ స్థల యజమానులకు తక్షణమే నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. గ్రామ సర్పంచ్ సర్నాల గంగారత్నం, డీఎల్పీవో రాఘవన్, ఎంపీడీవో విగ్గిన్స్, ఈవోపీఆర్డీ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వీధి కుక్కలపై విషప్రయోగం
ఐదు కుక్కలు మృతి పెనమలూరు: కానూరులో గుర్తు తెలియని వ్యక్తి వీధి కుక్కలపై విషప్రయోగం చేయటంతో ఐదు కుక్కలు మృత్యు వాతపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కానూరు వరలక్ష్మిపురం 4వ లైన్లో మాన్విత అపార్టుమెంట్ వద్ద వీధి కుక్కలు నివసిస్తున్నాయి. వీధి కుక్కలకు స్థానికులు ర్యాబిస్ వాక్సిన్ వేసి, కుక్క పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి చెవులకు గుర్తు కూడా వేశారు. వాటి పోషణ స్థానికులే చూస్తున్నారు. అయితే బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కుక్కలపై విషప్రయోగం చేశాడు. దీంతో ఐదు కుక్కలు అక్కడికక్కడే మృతి చెందా యి. మరో ఐదు కుక్కల పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు కుక్కలను పశువుల డాక్టర్ వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై డి.జ్యోతి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. మృతి చెందిన కుక్కలకు పోలీసులు పోస్టుమార్టం చేయించగా విషప్రయోగం జరిగినట్లు నిర్థారణ అయింది. పోలీసులు అపార్టుమెంట్ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. -
ఆ చానళ్ల ప్రసారాలు నిలిపివేత
ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ తీర్మానం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేబుల్ రేట్లు అధికంగా పెంచి ఆపరేటర్లపై ఒత్తిడి చేస్తున్న బ్రాడ్కాస్టర్ల చానళ్లను నిలుపుదల చేయాలని ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు ఏకవాక్య తీర్మానం చేశారు. గురువారం విజయవాడ అలంకార్ ఇన్నందు ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధరలు పెంచిన బ్రాడ్ కాస్టర్ల చానళ్లను నిలుపుదల చేయాలని తీర్మానించినట్లు అనంతరం ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సైబర్ ఆప్టిక్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు కృష్ణమూర్తి, మల్టీ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, ఏపీసీఓ జేఏసీ అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్ వెల్లడించారు. వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదం.. వారు మాట్లాడుతూ డిజిటల్ కేబుల్ టీవీ ఇండస్ట్రీ లో పే చానెల్స్ బ్రాడ్కాస్టర్లు నిరంకుశంగా రేట్లు పెంచేశారన్నారు. ధీని వల్ల ఆపరేటర్లపై ప్రత్యక్షంగా అదనపు భారం పడి వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాఒంటి అనారోగ్యకర పోటీ వాతావరణాన్ని అడ్డుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ట్రాయ్’ వారికి అండగా నిలబడటం చాలా చారుణమన్నారు. తాము కింది స్థాయిలో ఉపాధి కోసం కేబుల్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నామని, తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. ఏ చానల్ పైనా నిషేధం విధించకుండా ప్రసారాలు చేయాలన్నారు. -
అక్కరకు రాని విజయవాడ జీజీహెచ్ ● కూటమి ప్రభుత్వంలో దిగజారిన సూపర్ స్పెషాలిటీ సేవలు ● వైద్యం లేక ప్రైవేటుకు తరలిపోతున్న వైనం ● సీటీ సర్జరీ, యూరాలజీ సర్జరీల కోసం ఎదురు చూపులు ● ఖరీదైన ఇంజెక్షన్లు సరఫరా చేయని ప్రభుత్వం ● దయనీయ స్థితిలో విజయవాడ ప్రభుత్
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేరుకే సూపర్ స్పెషాలిటీ విభాగం.. దాని సేవలు చూస్తే సాధారణ వార్డుల కంటే దయనీయం. ఐసీయూల్లోకెళ్తే ఆరోగ్యవంతులు రోగాల బారిన పడటం తధ్యమని పలువురు అంటున్నారు. అంత ర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించిన విజయవాడ సూపర్ స్పెషాలిటీ విభాగంలో నేడు కూటమి ప్రభుత్వంలో సేవలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. అంతేకాక సెంట్రల్ ఏసీ పనిచేయక, ఫ్యాన్లు తిరగక ఉక్కపోతతోనే రోగులు ప్రాణాలు పోతాయా అనే సందేహం వస్తోంది. సగం విభాగాల్లో వైద్యులు లేక ప్రైవేటు ఆస్పత్రులకు తరలిపోవాల్సి వస్తోంది. లేదంటే గుంటూరు జీజీహెచ్కు వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ సేవలు పూర్తిస్థాయిలో లేక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో ఉన్న విభాగాలివే.. గత ప్రభుత్వం విజయవాడ జీజీహెచ్లో సూపర్స్పెషాలిటీ విభాగాలైన కార్డియాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, అంకాలజీ విభాగాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం వాటిలో కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ మినహా ఇతర విభాగాల్లో అరకొరగా సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు, బైపాస్ సర్జరీలు అవసరమైన వారు, కిడ్నీలు, బ్రెయిన్ రక్తనాళాలకు స్టెంట్స్ అవసరమైన వారు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అరకొర సౌకర్యాలు.. ప్రస్తుతం యూరాలజీ, కార్డియో థోరాసిక్సర్జరీ విభాగాల్లో వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ అరకొర సౌకర్యాలు ఉండటంతోనే శస్త్ర చికిత్సలు చేయలేక పోతున్నట్లు చెబుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పించక పోవడంతో సర్జికల్ అంకాలజీ విభాగంలో సైతం శస్త్ర చికిత్సలు జరగడం లేదు. గతంలో అరుదైన జబ్బులకు ఖరీదైన ఇంజెక్షన్లను ప్రభుత్వం సరఫరా చేసేదని, ఇప్పుడు మందులు కూడా అరకొరగా ఉండటంతో చేసేది లేక రోగులు బయట కొనుగోలు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొందంటున్నారు. సేవలు దిగజారాయి.. గతంలో ప్రభుత్వాస్పత్రిలో నాణ్యమైన సేవలు అందేవి. ఇప్పుడు రోగులు వెళ్తుంటే మందులు లేవు, పరీక్షలు లేవు అంటున్నారు. ఎంఆర్ఐ రాస్తే పది రోజుల తర్వాత రమ్మని చెబుతున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. పేదలు వైద్య ఖర్చులు భరించలేక అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. – తోకల శ్యామ్కుమార్, బాడవపేట -
పోస్టాఫీసులో నగదు గోల్మాల్
జి.కొండూరు: కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి సున్నంపాడు పోస్టాఫీసు పరిస్థితి. గ్రామానికి చెందిన పలువురు ఖాతాదారులు పొదుపు చేసుకున్న సొమ్ము, డిపాజిట్లను పోస్టుమాస్టరే కాజేసిన ఘటన గురువారం వెలు గులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ పోస్టల్ శాఖలో పని చేస్తున్న క్రమంలో తన అకౌంట్ స్టేటస్ని చెక్ చేసుకోగా ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ము లేకపోవడంతో అనుమానం వచ్చి పోస్టల్శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు గురువారం సున్నంపాడు వచ్చి విచారణ చేపట్టగా.. ఇప్పటి వరకు రూ.22లక్షల వరకు ఖాతాదారుల అకౌంట్ల నుంచి మాయమైనట్లు తేలినట్లు తెలిసింది. మొత్తం రూ.50లక్షలకు పైగానే సొమ్మును పోస్టుమాస్టర్ విత్డ్రా చేసినట్లు తెలుస్తోంది. విచారణ కొనసాగుతుండడంతో శుక్రవారం అధికారులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మునిసిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన గాంధీనగర్(విజయవాడసెంట్రల్): న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు కార్మికులు గురువారం నిరసన తెలిపారు. మునిసిపల్ ఇంజినీరింగ్ (వాటర్, పార్కు, వెహికల్ డిపో మెకానిక్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్) కార్మికుల జీతాలు జీవో నంబర్ 36 ప్రకారం పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
నిర్వీర్యమవుతోన్న విద్యారంగం
ధర్నాలో పీడీఎస్యూ నేతలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ అన్నారు. గురువారం విజయవాడ ధర్నా చౌక్ నందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా విద్యారంగ సమస్యల పరిష్కారానికి పూనుకోలేదన్నారు. విద్యారంగంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఖాళీగా పోస్టులు.. రాష్ట్రంలో ఉన్న విశ్వ విద్యాలయాలకు వైస్ చాన్స్లర్లు లేక ఇన్చార్జిల పాలన కొనసాగుతోందన్నారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లతో పాటు బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పాఠశాల విలీన ప్రక్రియ వల్ల వేలాది పాఠశాలలు మూతపడుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో లోకేష్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. నిరుద్యోగ భృతి, 20లక్షల ఉద్యోగాల ఊసేలేదని, రాష్ట్రవ్యాప్తంగా 2.50లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూషణం, రాజశేఖర్, మహర్షి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు రాజేష్, నాని, లోకేష్, వీరేంద్ర, రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు మానస, సింధు, రమణ తదితరులు పాల్గొన్నారు. యువతిపై లైంగికదాడి కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): యువతిపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితునికి న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2వేలు జరిమానా విధించింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడైన విజయవాడ వాంబేకాలనీకి చెందిన అత్తిలి కనకరాజు (31)పై నేరం రుజువు కావడంతో గురువారం మహిళా సెషన్స్ కోర్ట్ జడ్జి జి. రాజేశ్వరి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. పోలీస్ కమిషనరేట్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ అజిత్ సింగ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాది తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. 2018 జూన్ 23న కుటుంబసభ్యులు పనిపై బయటకు వెళ్లగా ఫిర్యాది ఒక్కరే ఇంట్లో ఉన్న సమయంలో ఆమె మేనత్త కుమారుడు అత్తిలి కనకరాజు ఇంట్లోకి వచ్చి బలవంతంగా లైంగికదాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై అజిత్సింగ్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి సీఐ ఎంవీవీ జగన్మోహన్రావు అత్తిలి కనకరాజును గత నెల 29న అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం జడ్జి పైన పేర్కొన్న విధంగా తీర్పు ఇచ్చారు. -
మెకానిక్ల అభివృద్ధికి కృషి చేస్తా
ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంధంఆటోనగర్(విజయవాడతూర్పు): ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్కు అన్ని విధాలుగా కృషి చేస్తానని గంధం వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ఏటీఏ హాలులో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ లారీలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన పలు రకాల ఇంజిన్లు... పలు కంపెనీలకు చెందిన ఇంజిన్ ఆయిల్లతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి లారీల ఇంజిన్లు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్నాయని.. వీటి గురించి మెకానిక్లకు అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు. ఏటా రెండు సార్లు మెకానిక్లకు అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు 2025–28 సంవత్సరానికి గాను ఎన్నుకున్న నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి షేక్ దస్తగిర్, కోశాధికారి మైలు రామ్మోహనరావు, ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు,రియాజ్ గాలిబ్, రామకృష్ణప్రసాద్, కనకారావుతో పాటు కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. -
విద్యార్థులు లక్ష్యాలు నిర్దేశించుకుని శ్రమించాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ)/మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)లో సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. ఆయా సమస్యల పరిష్కారంలో ఉదాసీనతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరి గిన ఈ కార్యక్రమంలో పలు చోట్ల తల్లిదండ్రులు పాఠశాలల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసు కొచ్చారు. వాటి గురించి ప్రస్తావించాలని, వాటి పరిష్కారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన పరపతిని పెంచుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడితే సమస్యలపై చర్చించే వేదికగా తల్లిదండ్రులు మార్చారు. మధ్యాహ్న భోజనంపై అసంతృప్తి వెల్లువ విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లోని పుచ్చలపల్లి సుందరయ్య మునిసిపల్ హైస్కూల్లో పీటీఎంకు హాజరైన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును తల్లిదండ్రులు నిలదీశారు. పాఠశాలలో వసతులు కరువు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు. బాలికలు మరుగుదొడ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని, వాటి తలుపులు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు. భోజనం అరగక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తరగతి గదులపైనా ఫిర్యాదులు ఎన్టీఆర్ జిల్లాలో 300 పాఠశాలల్లో తరగతి గదుల కొరత వెంటాడుతోంది. తరగతి గదుల కొరతతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి తల్లిదండ్రులు మెగా పీటీఎంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. సుమారుగా 185 విద్యాసంస్థల్లో తరగతి గదుల నిర్మాణం చివరి దశలో ఉంది. సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేస్తే తరగతి గదులన్నీ అందుబాటులోకి వస్తాయి. ఏడాదిగా కూటమి ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వకపోవటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదుల కొరతపై తల్లిదండ్రులు ఆయా సమావేశాల దృష్టికి తీసుకొచ్చారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 1,451 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పని చేస్తున్నాయి. వాటిల్లో సుమారుగా 3.30 లక్షల మంది విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్నారు. వాటిలో సుమారుగా 509 వరకూ ప్రైవేట్ విద్యాసంస్థలు కాగా మిగిలిన 942 విద్యాసంస్థలు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి అన్నింటిలోనూ మెగా పీటీఎం సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రభుత్వ యాజమాన్యాలు అన్నింటిలోనూ ఈ సమావేశాలు జరిగాయి. అయితే చాలా చోట్ల మొక్కుబడిగానే ఈ సమావేశాలు జరిగాయి. పెడన బీజీకే జెడ్పీ ఉన్నత పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మెగా పేరెంట్స్ సమావేశానికి వంద మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా రాలేదని ఉపాధ్యాయులే పేర్కొనడం గమనార్హం. తిరువూరు జెడ్పీ బాలికోన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల హాజరు నామమాత్రంగా ఉంది. ఆలస్యంగా వచ్చిన మంత్రి రవీంద్ర మచిలీపట్నంలోని చిలకలపూడి పాండురంగ మున్సిపల్ హై స్కూలులో పిల్లల పురోగతిపైకన్నా, పాఠశాలల్లోని సమస్యలే తల్లిదండ్రుల వేదికగా ప్రధానంగా చర్చకు వచ్చాయి. కాలేఖాన్పేటలోని గోపు వెంకట నానారావు మున్సిపల్ హైస్కూల్ను పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సమావేశం ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుందని సమాచారం ఇవ్వటంతో తల్లిదండ్రులు, విద్యార్థులు సమయా నికి విచ్చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర తీరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. బంటుమిల్లి జెడ్పీ పాఠశాలలో తల్లిదండ్రుల నుంచి స్పందన కరువైంది. పాఠశాలలో 325 మంది విద్యార్థులు ఉండగా 50 మంది తల్లిదండ్రులే పాల్గొన్నారు. మెగా పీటీఎంకు ప్రైవేట్ పాఠశాలలు డుమ్మా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని విద్యాసంస్థలు మెగా పీటీఎంకు డుమ్మా కొట్టాయి. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 509 ప్రైవేట్ విద్యాసంస్థల్లో రెండు లక్షల మంది చదువు తున్నారు. సగానికి పైగా విద్యాసంస్థలు ఈ సమావేశాల ఊసే ఎత్తలేదన్న ఆరోపణలు వినిపించాయి. కొన్ని విద్యాసంస్థలు మొక్కుబడిగానే కార్యక్రమాన్ని నిర్వహించాయి. పలు విద్యాసంస్థల్లో ప్రజాప్రతినిధులు రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వటంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసహనానికి గురయ్యారు. తల్లికి వందనం పథకాన్ని గురించి పదేపదే చెప్పడం విసుగు తెప్పించింది. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి లక్ష్యాలు నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కొండపల్లి జెడ్పీ బాలికోన్నత పాఠశాల ప్లస్లో గురువారం జరిగిన పీటీఎంలో ఆయన పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒకే చోటకు చేర్చి చిన్నారుల సమగ్రాభివృద్థి లక్ష్యంగా సమావేశం జరపడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. సైబర్ దాడులకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనపై పోస్టర్లు ఆవిష్కరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు వివిధ రకాల క్రీడాపోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కలెక్టర్ పీటీఎంకు హాజరైనా కొందరు విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాలు తినడం కొసమెరుపు. డీఈఓ సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన, తహసీల్ధార్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ సీహెచ్ శ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్మన్ బాజీబీ, హెచ్ఎం హేమలత తదితరులు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన క్యూలైన్లు
గురుపౌర్ణమి, ఆషాఢ మాసోత్సవాలు, శాకంబరీ ఉత్సవాల నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే దుర్గగుడి భక్తులతో కిటకిటలాడింది. ఘాట్రోడ్డు, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు రూ.500, రూ.300, రూ.100, సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. అమ్మవారి దర్శనంలో భక్తులకు ఎటు వంటి ఇబ్బందులూ కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. అంతరాలయ దర్శనం నిలిపివేయడంతో పాటు రూ.300 టికెట్ క్యూలైన్లో నియమించిన అర్చకుడిని సైతం అక్కడి నుంచి పంపేశారు. దీంతో కొద్దిసేపు ఆలయ అర్చకులు, అధికారులకు స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ప్రధాన ఆలయంలో పాదుకలను నిలిపివేయగా, వేద ఆశీర్వచనం విధుల్లో ఉన్న అర్చకులు ఆలయం నుంచి వెలుపలకు వచ్చేశారు. ఈ వ్యవహారాన్ని ఆలయ ఈఓ దృష్టికి తీసుకెళ్లగా అర్చకులతో ఆయన మాట్లాడి సమస్యను పరిష్కరించారు. -
గిరి ప్రదక్షిణకు తరలివచ్చిన భక్తజనం
ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్ర కీలాద్రి గిరి ప్రదక్షిణకు అశేష భక్తజనం తరలివచ్చింది. గురువారం తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద ప్రచార రథంపై కొలువై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించగా, ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు పాల్గొన్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాట నృత్యాల మధ్య గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వందల మంది భక్తులు అమ్మవారి ప్రచార రథం వెంట సాగుతూ ఎనిమిది కిలో మీటర్ల గిరి ప్రదక్షిణను పూర్తి చేశారు. -
సంబరం..
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025నయన మనోహరంగా దుర్గమ్మకు శాకంబరి అలంకారం ‘విజిబులిటీ ఎసెట్స్’కు శ్రీకారం–8లోuఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించు కున్నాయి. శాకంబరి ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా కొనసాగాయి. పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శాకంబరీదేవి అలంకారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా కనక దుర్గమ్మను నయన మనోహరంగా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఉత్సవాలు పరిసమాప్తం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులపాటు జరిగిన శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో గురువారం ఉదయం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈఓ అన్నదానం పథకానికి రూ.50 వేల విరాళం సమర్పించారు. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారి మూలవిరాట్ను వివిధ రకాల పండ్లు, ఫలాలు, డ్రై ప్రూట్స్తో అలంకరించారు. ఆలయాన్ని బత్తాయి. దానిమ్మ, ఫైనాపిల్, పచ్చి ఆల్బకరా, ఖర్జూరం, యాపిల్, పుచ్చకాయలు, పలు రకాల ద్రాక్షలతో అలంకరించారు. మూడు రోజుల ఉత్సవాల్లో 36 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మ సన్నిధిలో గురుపూజా మహోత్సవం వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో గురు పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానానికి చెందిన ఘనాపాటి తంగిరాల వెంకటేశ్వర ఘనాపాటి, వేద పండితుడు అహితాగ్ని గుంటూరు రామచంద్ర సోమయాజులు, సీనియర్ ముఖ్య అర్చకుడు శంకరమంచి శివప్రసాద్, దంపతులను సత్క రించి పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదాలు, నగదు బహుమతులు అందజేశారు. కేసరపల్లి(గన్నవరం): గ్రామ పంచాయతీల ఆదాయం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ‘విజిబులిటీ ఎసెట్స్’ కార్యక్రమానికి గన్నవరం మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురంలో గురువారం శ్రీకారం చుట్టారు. హెచ్సీఎల్ క్యాంపస్ సమీపంలో పంచాయతీ నిధులు రూ.6.54 లక్షలతో చేపట్టిన కుంభకోణం డిగ్రీ కాఫీ షాపు నిర్మాణాన్ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, అదనపు కార్యదర్శి అలోక్ ప్రేమ్నగర్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని భరద్వాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణతేజ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను పెంచుకునేందుకు వీలుగా విజిబులిటీ ఎసెట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలకు చెందిన ఖాళీ స్థలాల్లో స్పోర్ట్స్ క్లబ్లు, క్రికెట్ ప్రాక్టిస్ నెట్లు, ఈత కొలనులు, కాఫీ, టీ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వాటి నిర్వహణ, సంరక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలు చేపట్టి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి వినియోగిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా కేసరపల్లిలో కాఫీ షాపు ఏర్పాటు చేయనుండటం హర్షణీయమన్నారు. గ్రామ సర్పంచ్ చేబ్రోలు లక్ష్మీమౌనిక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ, డీఎల్పీఓ జి.సంపత్కుమారి, ఏఎంసీ మాజీ చైర్మన్ పొట్లూరి బసవరావు, ఉప సర్పంచి జాస్తి శ్రీధర్బాబు, ఎంపీటీసీ సభ్యుడు శొంటి కిషోర్, కేసర పల్లి ఈఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పుచ్చలపల్లి సుందరయ్య మునిసిపల్ హైస్కూల్లో ఎమ్మెల్యే బొండా ఉమాను నిలదీస్తున్న మహిళలు 7న్యూస్రీల్ మూడు రోజులు కనులపండువగా కొనసాగిన శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో ఉత్సవాల ముగింపు పౌర్ణమి నేపథ్యంలో భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసిన ఆలయ పరిసరాలు -
డొక్కలు ఎండుతున్నాయ్ సీతమ్మా
కంకిపాడు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించి, వారి ఆకలి తీరుస్తున్న వంటకార్మికులు పస్తులతో సతమతమవుతున్నారు. నెలల తరబడి మధ్యాహ్న భోజనం బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. మరో వైపు వేతనాలు కూడా పెండింగ్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వంట ఏజెన్సీ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 1,349 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో లక్ష మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనపథకం కింద భోజనం అందిస్తున్నారు. మూడు నెలల బిల్లుల పెండింగ్ మధ్యాహ్న భోజన పథకం అమలుపై దృష్టి సారించిన కూటమి సర్కారు ఆ పథకం నిర్వహించే ఏజెన్సీ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించింది. గత విద్యాసంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలల భోజన పథకం బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో జూన్ నెల బిల్లులు కూడా అంద లేదు. జులైలో ఇప్పటికే పది రోజులు గడిచాయి. ప్రభుత్వం పెండింగ్ బిల్లుల ఊసెత్తటం లేదు. విద్యాశాఖ చెబుతున్న లెక్కల ప్రకారమే కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మార్చి నెలకు సంబంధించి రూ.79.81 లక్షలు, ఏప్రిల్ నెలకు రూ.61.70 లక్షలు, జూన్ నెలకు రూ.55 లక్షలకుపైగా బిల్లులు విడుదల కావాల్సి ఉంది. ఈ బిల్లులు విడుదల కాకపోవటంతో ఏజెన్సీ కార్మికులు అప్పులు తెచ్చి మరీ ఏజెన్సీలను నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి చిక్కీ, గుడ్లు, బియ్యం, తాటి బెల్లం, రాగిపిండి అందిస్తోంది. వంటలకు అవసరమైన వస్తు సామగ్రి గ్యాస్, కూరగాయలు, వంట నూనెను కార్మికులే సమకూర్చుకుని విద్యార్థులకు సకాలంలో భోజనం అందిస్తున్నారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పడుతున్నా, తమ అవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఏజెన్సీ కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బిల్లులు చెల్లించకపోగా, వాటిలోనూ కోతలు విధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రూ.10 వేలకు బిల్లు పెడితే రూ.8 వేలు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేస్తుండటంతో ఆర్థికంగా నష్టం జరుగుతోందని కొందరు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వాపోతున్నారు. వేతనాలు కూడా పెండింగే బిల్లులుతో పాటు వేతనాలు కూడా పెండింగ్లోనే పడుతున్నాయి. ఒక్కో కార్మికుడు/కార్మికురాలికి రూ.3 వేల వేతనం అందుతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి వెయ్యి రూపాయలు పెండింగ్ పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 2,255 మంది కార్మికులకు ఏప్రిల్ నెలకు రూ.22 లక్షల జీతాలు పెండింగ్లో ఉండగా, జూన్ నెలకు సంబంధించి రూ.67.50 లక్షలు అందాలి. బిల్లులకు తోడు జీతాలు కూడా పెండింగ్ పడటంతో కార్మికుల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కృషి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భోజన పథకం కార్మికుల సంక్షేమానికి కృషి చేసింది. జీతాలు, ఏజెన్సీ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ కార్మికుల అభ్యున్నతికి పాటుపడింది. విద్యా ర్థులకు రుచికరమైన భోజనం అందించటంలో నిరంతరం పర్యవేక్షణ చేసింది. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పెండింగ్ బిల్లులు, జీతాల బకాయిలతో అష్టకష్టాలు పడాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఆకలి మంటలు మూడునెలలుగా విడుదల కాని భోజన పథకం బిల్లులు కార్మికులకు వేతన బకాయిల చెల్లింపులోనూ తీవ్ర జాప్యం అవస్థలు పడుతూ విద్యార్థుల ఆకలి తీరుస్తున్న కార్మికులు బిల్లులు, వేతనాలు చెల్లించాలి మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మికుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పడుతున్నాయి. ప్రస్తుతం మూడు నెలల బిల్లులు అందాల్సి ఉంది. జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. భోజన పథకాన్ని కార్మికులు సమర్థంగా నడుపుతున్నారు. పెండింగ్ బిల్లులు, జీతాల విడుదలపై పాలకులు, అధికారులు దృష్టి సారించాలి. అప్పుడే కార్మికులపై భారం తప్పుతుంది. – తాడంకి నరేష్, సీఐటీయూ జిల్లా నేత -
డీఎస్ఓగా మోహన్బాబు బాధ్యతల స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారిగా జి.మోహన్బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఎస్ఓగా పనిచేసిన వి.పార్వతి తూర్పుగోదావరి జిల్లా డీఎస్ఓగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న మోహన్బాబును కృష్ణాజిల్లా డీఎస్ఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కలెక్టర్ డి.కె. బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. సీజనల్ వ్యాధులపై కమాండ్ కంట్రోల్ రూమ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే వివిధ శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. 91549 70454 సెల్ నంబరుతో కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం, యాంటీ లార్వాల్ ఆపరేషన్లు, ఫాగింగ్, ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్ అండ్ క్లోరినేషన్, ఆస్పత్రుల్లో వైద్య సేవలు, ఇంటింటి ఫీవర్ సర్వే తదితరాలపై క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని వివరించారు. సీజనల్ వ్యాధులు, విష జ్వరాల నియంత్రణపై వివిధ శాఖల అధికారుల మధ్య పటిష్ట సమన్వయం, సమాచార మార్పిడి, తక్షణ స్పందనకు వీలుగా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కంట్రోల్ రూమ్కు చేరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి ప్రత్యేక బృందాలకు అందించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. ప్రజలతో పాటు అధికారులు, సిబ్బంది ఎవరైనా సీజనల్ వ్యాధులకు సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్కు తెలపొచ్చని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 11న ఫ్రైడే – డ్రైడే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అన్ని నియోజకవర్గాల ప్రత్యేక అధికారులకు సూచించామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. -
రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలకు జట్ల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): విశాఖపట్నంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించాలని పాపులర్ షూ మార్ట్ ఎండీ చుక్కపల్లి అరుణ్కుమార్ అన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సబ్ జూనియర్ బాక్సింగ్ సెలక్షన్స్కు ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి కృష్ణాజిల్లా తరఫున ఎంపికై న జట్టులోని సభ్యులను అభినందించి స్పోర్ట్స్ కిట్లను ఆయన అందజేశారు. బాలుర జట్టులో జ్యోతి శివ, జాన్, సందీప్ సాగర్, సూర్య ప్రణవ్, కార్తీక్, చైతన్య, జీవన్ కుమార్, బాలికల జట్టులో కె.కార్తిక, హేమశ్రీ ఎంపికయ్యారు. ఉమ్మడి కృష్ణాజిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరరాఘవులు, కార్యదర్శి కె.వి.చైతన్యకుమార్, కోశాధికారి బి.బాలాజీ, కార్యనిర్వాహక కార్యదర్శి బి.రాజా రమేష్, అసోసియేషన్ బాక్సింగ్ కోచ్లు హేమంత్ రెడ్డి, సాయి ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. -
అప్రమత్తత అవసరం
సీజనల్ వ్యాధులపై గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ అన్నారు. సీజనల్ వ్యాధులతో పాటు ఉపాధి హామీ పథకం అమలు, ఉద్యాన పంటల పెంపకం అంశాలపై కలెక్టర్ లక్ష్మీశ బుధవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డెంగీ, మలేరియా, డయేరియా కేసులు నమోదుకాకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఎక్కడైనా వ్యాధి కేసు నమోదైతే పరిసర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎక్కడా వర్షపునీరు నిలిచిపోకుండా చూడాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్స్ను విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. జ్వరాల కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్కు అందిస్తే అక్కడి నుంచి ఆయా ప్రాంతాల క్షేత్రస్థాయి బృందాలను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. సమన్వయం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజా భాగస్వామ్యంతో ర్యాలీలు.. డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలను ప్రాణంపెట్టి చేయాలని.. దీనివల్ల ప్రజలకు ఆరోగ్య భద్రత లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. దోమల నియంత్రణతో పాటు సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు, డిజిటల్ కంటెంట్, వీడియో షార్ట్ క్లిప్పింగ్స్ వంటి వాటితో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజా భాగస్వామ్యంతో ప్రత్యేకంగా ర్యాలీలు వంటివి నిర్వహించాలని స్పష్టం చేశారు. తాగునీటి వాటర్ సోర్స్లతో పాటు ఫిల్టర్ పాయింట్లను నిరంతరం తనిఖీ చేయాలని.. ఎక్కడా కలుషితమయ్యే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లు చేపట్టాలని.. ఓవర్హెడ్ రిజర్వాయర్ల క్లీనింగ్, క్లోరినైజేషన్ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం, ఆశా, సచివాలయ సిబ్బందితో అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. రైతులకు అవగాహనఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఉపాధి హామీ పథకం ఆసరాతో ఉచితంగా పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టేలా ప్రోత్సహించి రైతుకు మంచి ఆదాయం వచ్చేలా చేయాలని, దీనికి సంబంధించి నిర్దేశించిన నాలుగు వేల ఎకరాల లక్ష్యంలో ఒక్క సెంటు కూడా తగ్గడానికి వీల్లేదని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలు తదితరులు రైతులకు అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇప్పటికి దాదాపు 50 శాతం లక్ష్యాలను చేరుకున్నందున మిగిలిన లక్ష్యాన్ని యుద్ధప్రాతిపదికన చేరుకునేందుకు కృషిచేయాలని స్పష్టం చేశారు. సన్న, చిన్నకారు రైతులను పేదరికం నుంచి బయటపడేసేందుకు ఇదో గొప్ప మార్గమని.. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యవసాయ, ఉద్యాన, ఉపాధి హామీ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డ్వామా పీడీ ఎ.రాము, డీపీవో పి.లావణ్యకుమారి, ఇన్చార్జి డీఎంహెచ్వో జె.ఇందుమతి, జిల్లా మలేరియా అధికారి వి.మోతిబాబు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కో ఆర్డినేటర్ జె.సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు మహా ధర్నా
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో గురువారం మహాధర్నాను నిర్వహిస్తున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ చెప్పారు. స్థానిక సున్నపుబట్టీల సెంటర్ సమీపంలోని పీడీఎస్యూ కార్యాలయంలో సంఘం సభ్యుల సమావేశం జరిగింది. భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిందని, విద్యారంగంలో సమస్యలన్నీ అలాగే ఉన్నాయని చెప్పారు. పాఠశాలల విలీన ప్రక్రియ వల్ల రాష్ట్రంలో వేలాది పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు, పేద విద్యార్థులకు దూరమైన పీజీ విద్య, అందరికీ అమలు కాని తల్లికి వందనం, మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం తదితర అనేక సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మహా ధర్నాను నిర్వహిస్తున్నామని చెప్పారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.మహర్షి, ఎం.సునీల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు అఖండ, రామకృష్ణ పాల్గొన్నారు. -
నకిలీ టూల్స్ విక్రయిస్తున్న దుకాణంపై కేసు నమోదు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పాతబస్తీలో నకిలీ టూల్స్ విక్రయిస్తున్న దుకాణంపై వన్టౌన్ పోలీసులు బుధవారం రాత్రి దాడి చేసి, కేసు నమోదు చేశారు. పాతబస్తీలోని ఓ దుకాణంలో తమ కంపెనీకి చెందిన టూల్స్ స్థానంలో నకిలీవి విక్రయిస్తున్నట్లుగా పవర్ టూల్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్కుమార్ బుధవారం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దానిపై సీఐ గురుప్రకాష్ తన సిబ్బందితో రాజా రంగయ్యప్పారావు వీధిలోని విజయశ్రీ టూల్స్ గోడౌన్పై దాడి చేసి, తనిఖీలు నిర్వహించారు. రూ.15 లక్షల విలువైన కంపెనీ నకిలీ సరుకును గుర్తించి, సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తల్లి చెంతకు చేరిన తప్పిపోయిన బాలుడు గన్నవరం: స్థానిక విమానాశ్రయంలో తప్పిపోయిన బాలుడు ఎట్టకేలకు తల్లి చెంతకు చేరాడు. ఈ మేరకు ఆ బాలుడిని అతడి తల్లి ప్రసన్నకు గన్నవరం పోలీసులు అప్పగించారు. విమానాశ్రయంలోకి తప్పిపోయి వచ్చిన బాలుడిని ఎయిర్పోర్ట్ అధికారులు మంగళవారం రాత్రి పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ బాలుడి గురించి సామాజిక మాధ్యమల్లో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లి గన్నవరం పోలీసులను ఆశ్రయించింది. నాగాయలంక మండలం సొర్లగొందికి చెందిన ప్రసన్న భర్త శివకృష్ణతో నెలకొన్న విభేదాల కారణంగా ఏడేళ్ల కుమారుడు అనిల్కుమార్తో పాటు గన్నవరం వచ్చి ఓ ఆశ్రమంలో వంట పని చేస్తోంది. ఈ నేపథ్యంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన అనిల్కుమార్ విమానాశ్రయంలోకి వెళ్లి తప్పిపోయాడు. చివరికి పోలీస్స్టేషన్కు చేరుకున్న తల్లి ప్రసన్న చెంతకు ఆ బాలుడు చేరడంతో కథ సుఖాంతమైంది. గ్రావెల్ అక్రమ తవ్వకాల్లో ప్రమాదం నందిగామరూరల్: మండలంలోని రాఘవాపురం గట్టు నుంచి గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేస్తుండగా కొండ చరియలు విరిగి పడిన ఘటనలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా పొక్లెయిన్ ఆపరేటర్కు తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని రాఘవాపురం గట్టు నుంచి రెండు, మూడు రోజులుగా రాత్రి వేళల్లో గ్రావెల్ అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గట్టు భాగంలో బుధవారం తెల్లవారుజామున గ్రావెల్ తవ్వుతున్న పొక్లెయిన్, లోడింగ్ కోసం సిద్ధంగా ఉన్న టిప్పర్పై కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ దాసరి చిన్న వెంకటేశ్వర్లు(27), పొక్లెయిన్ ఆపరేటర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటినా విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా టిప్పర్ డ్రైవర్ చిన్న వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్న వెంకటేశ్వర్లు గడిచిన నాలుగు నెలలుగా నందిగామలోనే నివాసముంటున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ ప్రమాదంలో పొక్లెయిన్ మట్టి కిందకు కూరుకుపోగా లారీ పూర్తిగా ధ్వంసంమైంది. కృష్ణానదిలో మహిళ మృతదేహం లభ్యంవన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకు వచ్చిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రకాశం బ్యారేజీ 56వ కానా వద్ద బుధవారం ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమీపంలోని పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విచారణలో ఆ మృతదేహం వాంబేకాలనీలో నివాసముండే పద్మప్రియ(50)గా గుర్తించారు. పద్మప్రియ కుమారుడు యగ్ని హేమంత్ తన తండ్రి 15 ఏళ్ల క్రితం మరణించాడని, తనను, తన చెల్లెలను తల్లి చూసుకుంటూ వచ్చిందని తెలిపారు. 2022లో తన చెల్లి మరణించినప్పటి నుంచి మానసికంగా స్థిమితం లేక పదేపదే బయటకు వెళ్లటం, ఎక్కువగా మాట్లాడటం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఆమెకు చికిత్స చేయిస్తున్నానని, బుధవారం ఉదయం నిద్ర లేచి చూడగా ఇంట్లో తల్లి కనపడలేదని చెప్పాడు. ఆమె కోసం వెతుకుతున్నట్లు వివరించాడు. వన్టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండ చరియలు విరిగి పడి టిప్పర్ డ్రైవర్ మృతి పొక్లెయిన్ ఆపరేటర్కు గాయాలు, వాహనాల ధ్వంసం -
మున్సిపల్ కమిషనర్ల సంఘ సమస్యల పరిష్కారానికి వినతి
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్ల సంఘం(ఏపీఎంసీఏ) ప్రతినిధి బృందం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సంఘం తరఫున మంత్రికి ఇతర శాఖల నుంచి మున్సిపల్ కమిషనర్లుగా డెప్యుటేషన్పై నియమించడం, అలాగే శాశ్వతంగా ఇతర శాఖల అధికారులను మున్సిపల్ పరిపాలనలో మార్చడం, మున్సిపల్ కమిషనర్ల హక్కులను హరించడమేనని వినతిపత్రం అందించారు. మున్సిపల్ పరిపాలనలో అనుభవజ్ఞులైన అధికారులకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని, అన్ని స్థాయిలలో సమయానుకూలంగా పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్ను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ వ్యవహారాలపై ప్రత్యేక శిక్షణ సంస్థను అమరావతిలో ఏర్పాటు చేయడం ద్వారా అధికారులకు అభివృద్ధి పరమైన సమగ్ర దిశానిర్దేశం అందించవచ్చుని, అందుకు సంస్థ నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని విపతిపత్రంలో పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్లపై పెండింగ్లో ఉన్న ఆర్థికేతర అభియోగాల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో సంఘ అధ్యక్షుడు నాగ నరసింహరావు, ప్రధాన కార్యదర్శి బి.బాలస్వామి, విశాఖపట్నం ప్రాంతీయ సంచాలకులు(ఆర్డీఎంఏ) వి.రవీంద్రతో పాటు ఉపాధ్యక్షుడు భవాని ప్రసాద్, ట్రెజరర్ శివారెడ్డి సంఘ కార్యవర్గ సభ్యులు, నిర్వాహక కార్యదర్శులు పాల్గొన్నారు. చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష విజయవాడలీగల్: చెక్ బౌన్స్ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుదరవల్లి వెంకట నర్సయ్యకు ఏడాది జైలుశిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ ఫస్ట్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి తవ్వా ప్రకాష్బాబు తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే మాచవరానికి చెందిన బోడి సీతారామరాజు వద్ద 2020వ సంవత్సరంలో నర్సయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి 15 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత 2021లో సీతారామరాజుకు రూ.17.70 లక్షల చెక్ను ఇచ్చాడు. చెక్ బౌన్స్ అవ్వడంతో సీతారామరాజు కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఇరువురి న్యాయవాదుల వాదనలు విన్న ఫస్ట్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి నర్సయ్యకు ఏడాది జైలు శిక్ష, 2 వేలు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. -
ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన ఫలితాలు రాబట్టాలి
హనుమాన్జంక్షన్ రూరల్: ప్రభుత్వం, దాతలు అందిస్తున్న సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. బాపులపాడు మండలం రేమల్లేలోని జెడ్పీ హైస్కూల్ను బుధవారం ఆయన సందర్శించారు. మాక్సిమస్ ఏఆర్సీ లిమిటెడ్ సౌజన్యంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన ఆర్వో ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్, భోజనశాలను కలెక్టర్ బాలాజీ ప్రారంభించారు. మాక్సిమస్ ఏఆర్సీ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి దేవినేని నన్హరామ్ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఎన్.లూథర్పాల్ చాంబర్లో పాఠశాల ఉపాధ్యాయులతో కలెక్టర్ డీకే బాలాజీ సమావేశమయ్యారు. గురువారం నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ నిర్వహణ, ఏర్పాట్లపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో మొక్క నాటారు. గుడివాడ ఆర్డీవో జి.సుబ్రహ్మణ్యం, తహసీ ల్దార్ మురళీకృష్ణ, ఎంఈవో బాలాసింగ్ పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
గజదొంగలు!
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025బెజవాడలో3విజయవాడ నగరం ఏరియల్ వ్యూఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు పురస్కారం భవానీపురం(విజయవాడపశ్చిమ): రెడ్క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశకు పురస్కారం లభించింది. రెడ్క్రాస్ సంస్థకు నిధుల సమీకరణ, సభ్యత్వ నమోదులో విశేష ప్రతిభ కనబరచటమే కాకుండా సామాజిక సేవలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి కలెక్టర్ లక్ష్మీశ ఈ అవార్డ్ అందుకున్నారు. లక్ష్మీశను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రెడ్క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. గవర్నర్ నుంచి అవార్డ్ స్వీకరించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి ఎకే ఫరీదా, చైర్మన్ వై.డి.రామారావు, వైస్ చైర్మన్ పి.జగన్మోహన్రావు, కోశాధికారి పి.రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. వెబ్ ఆప్షన్లు ప్రారంభం ఘంటసాల: వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైందని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.సత్యప్రియ లలిత తెలిపారు. బుధవారం కళాశాలలో ఆమె మాట్లాడుతూ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న వారు 12వ తేదీ వరకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వెబ్సెట్(angrau.ac.in)లో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని సూచించారు.గోదావరి జలాలకు హారతి ఇబ్రహీంపట్నం: ఫెర్రీలోని పవిత్రసంగమం వద్ద పట్టిసీమ కాలువ ద్వారా కృష్ణానదిలో కలుస్తున్న గోదావరి జలాలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బుధవారం జలహారతి ఇచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పసుపు, కుంకుమ, చీరతో కూడిన సారె సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా 428 టీఎంసీలకు పైగా నీరు కృష్ణా డెల్టాకు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన తదితరులు పాల్గొన్నారు. నవోదయ విద్యాలయానికి స్థల పరిశీలన తిరువూరు: తిరువూరులో ఏర్పాటు కానున్న జవహర్ నవోదయ విద్యాలయం భవన నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా బుధవారం పరిశీలించారు. తిరువూరు శివారు పీటీ కొత్తూరులోని పోస్టుబేసిక్ స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో త్వరలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటవుతుందని జేసీ చెప్పారు. పీటీ కొత్తూరులో తిరువూరు పట్టణానికి చెందిన పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ కోసం స్థల పరిశీలన చేశారు. ఆర్డీఓ కార్యాలయం, ఏసీపీ, డీఎల్డీఓ కార్యాలయాలకు కూడా స్థలాలు కేటాయించనున్నామని జేసీ తెలిపారు. తొలుత ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇబ్రహీంపట్నం–జగదల్పూర్ జాతీయ రహదారిని జేసీ పరిశీలించారు. త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పూర్తి చేస్తుందని వెల్లడించారు. గంపలగూడెం మండలం తునికిపాడు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే భూములను పరిశీలించారు. తిరువూరు ఆర్డీవో కె. మాధురి, తహసీల్దార్లు పాల్గొన్నారు. ముగిసిన ‘ఈసెట్’ సర్టిఫికెట్ల పరిశీలన మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరుగుతున్న ఈసెట్–2025 పరీక్షలో ప్రత్యేక కేటగిరీకి చెందిన ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసింది. మంగళవారం 376మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. బుధవారం–191మంది సర్టిఫికెట్లను పరిశీలించామని వారిలో క్యాప్–5, ఎన్సీసీ–81, విభిన్న ప్రతిభావంతులు–32, స్పోర్ట్స్ అండ్ గేమ్స్–59, స్కౌట్స్ అండ్ గౌడ్స్–14మంది ప్రత్యేక కేటగిరీకి చెందిన ర్యాంకర్ల సర్టిఫికెట్లను పరిశీలించామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. జనరల్ కేటగిరీకి చెందిన ర్యాంకర్ల సర్టిఫికెట్లను ఆన్లైన్లో పరిశీలించామన్నారు. సుబ్బారాయుడికి రూ. 1.11కోట్ల ఆదాయం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 1,11,75,901 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. బుధ వారం ఆయన మాట్లాడుతూ దేవదాయ ధర్మ దాయశాఖ కృష్ణాజిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్వీ సాంబశివరావు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఉదయం హుండీలను తెరచి లెక్కించినట్లు తెలిపారు. 104 రోజులకు గాను నగదు రూపంలో రూ.1,11,75,901, బంగారం 41.02గ్రాములు, వెండి 2.550 కిలోలు, అమెరికన్ డాలర్లు 159 వచ్చినట్లు వివరించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అధికారులు, సేవా సమితి సభ్యులు, బ్యాంకు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.రెండు నెలల వ్యవధిలో రూ. 800కోట్లు దోపిడీసాక్షి ప్రతినిధి, విజయవాడ: యానిమేషన్, గోల్డ్, అద్విక ట్రేడింగ్.. స్కామ్ ఏదైనా బెజవాడ కేంద్రంగానే వెలుగు చూస్తున్నాయి. ప్రజలను మాయ చేసి రెండు నెలల్లోనే కోట్ల రూపాయలు దోచేశారు. జనాల అత్యాశే పెట్టుబడిగా నేరగాళ్లు వల విసురుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే దురాశే.. అసలుకు ఎసరు తెస్తోంది. భారీగా డబ్బులు కలెక్ట్ చేశాక బోర్డులు తిప్పేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు మోస పోయామని తెలుసుకున్నాక జనాలు లబోదిబో అంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోవడంతో విలవిల్లాడిపోతున్నారు. స్కామ్లు జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేయడం తప్ప, నిందితుల నుంచి సొమ్ము రికవరీ చేసి, బాధితులకు అండగా నిలిచిన దాఖలాలు లేవని భోరుమంటున్నారు. అద్విక ట్రేడింగ్ మోసంతో.. రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.6వేల వడ్డీ అంటూ తెరపైకి వచ్చారు.. కొన్ని రోజులు పాటు వడ్డీ చెల్లించి జనాల్లో నమ్మకం కల్పించారు. తమకు పరిచయం ఉన్న వారు, స్నేహితులు, ఏజెంట్లను రంగంలోకి దింపి రూ. లక్షకు రూ.6వేల వడ్డీ ఎక్కడ వస్తుందని నమ్మబలికారు. కొంత మంది తన వద్ద డబ్బులు లేకున్నా, వడ్డీ కోసం కక్కుర్తి పడి అప్పుగా తెచ్చి పెట్టుబడి పెట్టి నిండా మునిగారు. అలాగే బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవచ్చని విసిరిన వలలో పెద్ద చేపలు చిక్కి విలవిల్లాడుతున్నాయి. అద్విక ట్రేడింగ్ కంపెనీ బోర్డు తిప్పేసిన వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నల్లధనం భారీగా ఉండి పెట్టుబడులు పెట్టగలవారినే లక్ష్యంగా చేసు కొని వల విసిరారు. దీంతో అద్విక ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకులు తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం డబ్బు లు సేకరించి బోర్డు తిప్పేశారు. ఏజెంట్లు డిపాజిటర్ల నుంచి రూ.382 కోట్లు సేకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వచ్చారు. ఇందులో వడ్డీ రూపంలో కొంత మొత్తం చెల్లించినట్లు గుర్తించారు. 1150 మందికి పైగా డిపాజిటర్లు అద్విక ట్రేడింగ్ కంపెనీతో 1,700కు పైగా ఎంవోయూలు కుదుర్చుకున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న బాధితుల సంఖ్య రోజు, రోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం పోలీసులు ప్రధానంగా డిపాజిట్ల రూపంలో సేకరించిన సొమ్ము దారి మళ్లించి, ఆస్తులు కొన్నారా అనే దానిపైన దృష్టించారు. ప్రధానంగా వారి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసి, లావాదేవీలను పోలీసులు క్షుణంగా పరిశీలిస్తున్నారు. వారి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసి తాజాగా కంపెనీ ఖాతాలు, నగదు లావాదేవీలు అందించాలని పోలీసులు.. బ్యాంకులకు లేఖ రాసి, లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. నిర్వాహకులు విలాసాలకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినట్లు గుర్తించారు. పెట్టుబడి దారులను తప్పు దోవ పట్టించేందుకు గోల్డెన్ లీఫ్ కంపెనీ తెరపైకి తెచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెట్టింపు లాభాల పేరిట.. ఈ వైట్ కాలర్ మోసాలకు అన్నింటికీ జనాల అత్యాశే పెట్టుబడిగా మారినట్లు ఈ సంఘటనలు బట్టి స్పష్టం అవుతోంది. ఇలా అత్యాశకు పోయి డబ్బులు పెట్టుబడులు పెట్టి మోస పోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నా, విజయవాడ కేంద్రంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.సారెతో అమ్మవారి సన్నిధికి వచ్చిన భక్తబృందంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని శాకంబరిగా దర్శించుకున్నారు. మరో వైపున ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతుండగా.. బుధవారం ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి పలు భక్త బృందాలుగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. సుమారు 50కిపైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. శాకంబరీ ఉత్సవాలకు గోదా వరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతుల నుంచి సుమారు 25 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను సేకరించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి శాకంబరిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. కనకదుర్గనగర్, మహామండపం మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కదంబ ప్రసాదం పంపిణీ చేసింది. ఆలయ ప్రాంగణంలో చేసిన అలంకారం నుంచి ఒక్క కూరగాయ, ఆకుకూరనైనా ఇంటికి తీసుకువెళ్లాలనే భావనతో భక్తులు కూరగాయల కోసం ఎగబడటం కనిపించింది.న్యూస్రీల్ జనాల అత్యాశే ఆయుధంగా నేరగాళ్ల వల రెట్టింపు లాభాల పేరిట లూటీ నగరంలో వెలుగుచూసిన యానిమేషన్, గోల్డ్, అద్విక ట్రేడింగ్.. ఈ తరహా మోసాలే స్కామ్లు బయటపడిన సమయంలోనే పోలీసుల హడావుడి ఆ తరువాత కేసులు కోల్డ్ స్టోరేజిలోకి.. బాధితులకు జరగని న్యాయం రెండో రోజూ పోటెత్తిన భక్తజనం హరితమయంగా ఇంద్రకీలాద్రి నేడు పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం నేడు డ్రై ఫ్రూట్స్తో.. శాకంబరి ఉత్సవాలు రెండో రోజున అమ్మవారిని దుంప కూరలు, కాయగూరలతో అలంకరించారు. ఆలయం లోపల ధాన్యం కంకులతో చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. చివరి రోజైన గురువారం అమ్మవారిని పండ్లు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్తో అలంకరించనున్నారు. ఇందు కోసం యాలకులు, జీడిపప్పులతో దండలను సిద్ధం చేస్తున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని, రాత్రి వరకు అలంకరణ కొనసాగుతుందని అర్చకులు పేర్కొన్నారు. -
యానిమేషన్ పేరుతో చీటింగ్..
విజయవాడ కేంద్రంగా కిరణ్ అనే వ్యక్తి యానిమేషన్ పేరిట సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటు చేస్తున్నామని.. దేశ, విదేశాల నుంచి వస్తున్న ప్రాజెక్టుల కోసం కొంత పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు ఇస్తామని నమ్మబలికాడు. దీంతో తొలుత చెప్పిన విధంగా కొన్ని రోజుల పాటు వ్యాపారులకు పెద్ద ఎత్తున లాభాలు అందించి, పెట్టుబడి పెట్టిన వ్యాపారులకు నమ్మకం కలిగించారు. దీంతో విజయవాడ, భీమవరం, నరసరావుపేట, గుంటూరు, కడపలకు చెందిన 100 మందికిపైగా బాధితులు రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అయితే సదరు సంస్థ చెప్పిన విధంగా లాభాలు ఇవ్వకపోగా, పెట్టుబడులు కూడా వెనక్కి రాలేదు. గత కొన్ని నెలల నుంచి కంపెనీ చిల్లిగవ్వ ఇవ్వకపోవడంతో, మోసపోయామని గ్రహించి విజయవాడలోని కార్యాలయంలోకి వెళ్లి ఒత్తిడి తేవడంతో నిర్వాహకుడైన కిరణ్ బోర్డు తిప్పేసి, కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లడంతో, బాధితులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉంది. బాధితుల నుంచి సేకరించిన పెట్టుబడులు ఏమైయ్యాయో తెలియటం లేదు. కేసు పోలీసు విచారణలో ఉందంటున్నారు కాని, బాధితులకు మాత్రం న్యాయం జరగలేదు. -
విస్తృతంగా సేఫ్ క్యాంపస్ జోన్ తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మంగళవారం సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు, సమాజ శ్రేయస్సుకు దోహదపడే మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు సూచనల మేరకు డీసీపీలు కేజీవీ సరిత, కేఎం మహేశ్వరరాజు పర్యవేక్షణలో కళాశాలలు, స్కూల్స్ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని పాన్షాప్లు, బడ్డీ కొట్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజారోగ్యాన్ని పాడు చేసే పొగాకు ఉత్పత్తులపై అనుమతులకు వ్యతిరేకంగా, గుట్కా నిల్వలను ఇతర మత్తు పదార్ధాలను కలిగి ఉంటూ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా కలిగిఉన్న పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని ఆయా యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ సోదాలు నిరంతరం కొనసాగుతాయని, యువతను పాడు చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్నా, అక్రమంగా వాటిని విక్రయాలు జరిపినా ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వివిధ కళాశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గంజాయి, పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఇతర మత్తుపదార్ధాలను తీసుకోవడం వలన కలిగే అనర్థాల గురించి ప్రత్యేక నిపుణులతో అవగాహన కల్పించారు. -
కన్నప్ప.. నా పూర్వజన్మ సుకృతం
సినీనటుడు మోహన్బాబు లబ్బీపేట(విజయవాడతూర్పు): కన్నప్ప సినిమా తీయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని నిర్మాత, నటుడు మంచు మోహన్బాబు అన్నారు. శ్రీకాళహస్తిలోని భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని మార్పులతో ఈ సినిమా నిర్మించినట్లు ఆయన తెలిపారు. కన్నప్ప చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా బెంజ్ సర్కిల్లోని క్యాపిటల్ సినిమాస్లో గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో నాగ సాధువులు, మాతాజీలతో కలిసి మోహన్బాబు ఆ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ కన్నప్ప చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయవాడ వచ్చానన్నారు. నాగ సాధువులు, మఠాధిపతులు మాతాజీలను సత్కరించారు. సమావేశంలో నటుడు శివబాలాజీతో పాటు నాగ సాధువులు, పీఠాధిపతులు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, మాతాజీలు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు స్టాప్.. వాష్.. రిఫ్రెష్ అండ్ గో
లబ్బీపేట(విజయవాడతూర్పు): అర్థరాత్రి సమయాల్లో...వేకువ జామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నగర పోలీసులు ‘స్టాప్.. వాష్.. రిఫ్రెష్ అండ్ గో ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు మాచవరం మహానాడు రోడ్డులో, సత్యనారాయపురం శారద కళాశాల సమీపంలో, భవానీపురం గొల్లపూడి హైవే, తిరువూరు హైవే, జి.కొండూరు హైవే సమీపంలో పోలీసు అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారు జామున 2 నుంచి 5 గంటల వరకూ నిద్రమత్తులో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున, ఆ సమయంలో పోలీసులు వాహనాలను ఆపి నీళ్లతో ముఖం కడుక్కుని నిద్రమత్తు వీడేలా చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా చేయడం ద్వారా చాలావరకూ ప్రమాదాలను నివారించవచ్చునని పోలీసులు తెలిపారు. నేరాలపై పూర్తి స్థాయిలో నిఘా సీసీఎస్ సిబ్బందికి కృష్ణా ఎస్పీ దిశానిర్దేశం కోనేరుసెంటర్: సీసీఎస్ సిబ్బంది సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లాలోని సీసీఎస్ అఽధికారులు, సిబ్బందితో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన కేసులు, ప్రాపర్టీ రికవరీలు, నేరస్తులకు పడిన శిక్షలు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవటంతో పాటు నేరాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలన్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. తాళం ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే వారిని పసిగట్టి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్లవలసి వస్తే ముందస్తు సమాచారం పోలీసులకు తెలియపరిస్తే గస్తీ ఏర్పాటు చేస్తామని ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శిక్షలు అనుభవించి జైలు నుంచి విడుదల అయిన పాత నేరస్తులపై నిఘా ఉంచి, వారి కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఽఘాతం కలిగేలా వ్యవహరిస్తే ఉక్కుపాదం మోపాలన్నారు. నేరస్తులను గుర్తించడంలో, నేరాలు అదుపు చేయడంలో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైందన్నారు. నేరం జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఉపయోగంలో ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నారు. అపార్ట్మెంట్లు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చుకునేలా యజమానులతో మాట్లాడాలన్నారు. -
రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రాగా మార్చారు
కూటమి ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం గన్నవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసి దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. సీసీఐ 26వ జిల్లా మహాసభల్లో భాగంగా మంగళవారం కృష్ణాజిల్లా గన్నవరం మూడుబొమ్మల సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జగన్ హయాంలో చేసిన అప్పులపై గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతున్నారని మండిపడ్డారు. గడిచిన ఏడాదిలోనే రాష్ట్ర అవసరాల పేరుతో రూ.లక్ష కోట్లు, అమరావతి రాజధాని కోసం రూ.31 వేల కోట్లు అప్పులు తెచ్చారని చెప్పారు. రాజధాని నిర్మాణాల కోసం మరో రూ.30 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూడా చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. హామీలు అమలు గురించి ప్రశ్నిస్తే మాత్రం ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చేవరకు సీపీఐ పోరాడుతుందన్నారు. గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఎందుకు సమర్ధిస్తున్నారని, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడంపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు మాత్రమే ప్రధాని నరేంద్రమోదీ లబ్ధి చేకూర్చుతున్నారని ఆరోపించారు. చివరికి అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగాన్ని కూడా మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకునేందుకు లౌకికవాదులతో కలిసి కమ్యూనిస్టులు ఉద్యమిస్తారని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర నాయకులు కేవీవీ ప్రసాద్, దుర్గాభవాని, అడ్డాడ ప్రసాద్, దోనేపూడి శంకర్, జి.కోటేశ్వరరావు, పెద్దు వాసుదేవరావు, కాట్రగడ్డ రామచంద్రజోషి తదితరులు పాల్గొన్నారు. -
మధుమేహుల్లారా...టీబీ కేర్ఫుల్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో క్షయ ముప్పు పొంచి ఉంది. వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో క్షయ త్వరగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకూ శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో లేని వారికి గుండె, కిడ్నీ, కంటి రెటీనా దెబ్బతిని చూపు కోల్పోవడం వంటి విషయాలు అందరికీ తెలిసినవే. తాజాగా వాటి జాబితాల్లో క్షయ వ్యాధి కూడా చేరింది. మధుమేహుల్లో క్షయ వ్యాధి సోకుతున్న వారు పెరుగుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇటీవల కాలంలో మధుమేహుల్లో క్షయ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. క్షయ వ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్టీపీసీఆర్ కేంద్రాలకు వస్తున్న రోగులే అందుకు నిదర్శనం. సాధారణ వ్యక్తుల్లో క్షయ వ్యాధి సోకితే క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా నివారించవచ్చు. మధుమేహులకు క్షయ సోకితే ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒకప్పుడు హెచ్ఐవీ ఉన్న వారిలో క్షయ వ్యాధి ఎక్కువగా వచ్చేదని, ఇప్పుడు వారి కంటే మధుమేహుల్లో ఈ శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు క్షయ వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. నెలకు వందకు పైగానే... ఉమ్మడి కృష్ణాజిల్లాలోని క్షయ వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో నమోదవుతున్న క్షయ కేసుల్లో మధుమేహులు వంద మందికి పైనే ఉంటారనేది అంచనా. ఆర్ఎన్టీసీపీ కేంద్రాలకు రోజులో ఒకరిద్దరు మధుమేహంతో క్షయ వ్యాధి సోకి చికిత్స కోసం వస్తుంటారని నివేదికలు చెబుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వారి కంటే మధుమేహుల్లో క్షయ వ్యాధి సోకే అవకాశం ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. చక్కెర వ్యాధిగ్రస్తుల్లో పొంచి ఉన్న క్షయ ముప్పు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెరుగుతున్న కేసులు ఒకసారి వచ్చి తగ్గినా మళ్లీ రిపీట్ అవుతున్న వైనం నెలలో వంద కేసులపైనే నమోదు ఉమ్మడి కృష్ణాలో 5 లక్షలు పైనే... ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఐదు లక్షల మందికి పైనే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అంచనా. వారిలో 50 శాతం మంది మాత్రమే కచ్చితంగా మందులు వాడుతున్నారు. మరో 50 శాతం మందిలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటం లేదనేది వైద్యుల మాట. అలాంటి వారిలో గుండె, కిడ్నీలు, లివర్, కంటి వ్యాధులతో పాటు, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన క్షయ వ్యాధి సులభంగా సోకుతుందంటున్నారు. ప్రస్తుతం టీబీ ముఖ్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీబీ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. -
పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తిరువూరు: ఉపాధి హామీ పథకంలో ఉచితంగా పండ్ల తోటల పెంపకం చేపట్టే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గంపలగూడెం మండలం గోసవీడులో ఉద్యాన పంటల పెంపకం గ్రౌండింగ్ మేళాను మంగళవారం ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా మామిడిమొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టే పలు పథకాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. ఉపాధి హామీ పథకంలో ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు పెంపకం బాధ్యతలు నిర్వహించే వారికి ఆర్థిక సాయం లభిస్తుందన్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, ఆయిల్పామ్, ఆపిల్ బేర్, మునగ, మల్లె, గులాబీ తోటల పెంపకానికి సన్న, చిన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు భూమి కలిగినవారు అర్హులని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 4వేల ఎకరాల్లో పళ్లు, పూల తోటల పెంపకం లక్ష్యంగా తీసుకున్నట్లు తెలిపారు. తిరువూరు ఆర్డీవో మాధురి, డ్వామా పీడీ ఎ.రాము, ఏపీడీ పార్థసారధి, డ్వామా జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ కె.ఉష పాల్గొన్నారు. -
ప్రకృతి మాతకు ప్రణామం
సకల ప్రాణకోటికి తన శరీరం నుంచి ఆకులు, ఫలాలు, కాయగూరలు, తిండి గింజలను అందించిన ప్రకృతిమాత శాకంబరిగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువుదీరారు. వనదేవత అలంకారంలో కొలువైన దుర్గమ్మను భక్తులు దర్శించుకుని తరించారు. ప్రకృతి మాతకు ప్రణామాలు అర్పించారు. చల్లంగా చూడు దుర్గమ్మా అంటూ వేడుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం శాకంబరి ఉత్సవాలు అంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా మల్లేశ్వర స్వామి వార్లతో పాటు ఘాట్రోడ్డులోని కామథేను అమ్మ వారు, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో దేవతా మూర్తులను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించారు. నూతన యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఈఓ శీనానాయక్, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయం, ఉపాలయాలను కరివేపాకు, నిమ్మకాయలు, వివిధ రకాల కాయగూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో కూరగాయలతో ఏర్పాటు చేసిన శివలింగాకృతి, పక్కనే స్వామి వారికి నమస్కరిస్తున్న అమ్మవారు, కుమార స్వామి, గణపతి ప్రతిమలు ఆకట్టుకున్నాయి. నీటి కొలనులో సొరకాయలతో తీర్చిదిద్దిన హంసలు, దోసకాయలతో రూపొందించిన బాతులు భక్తులను కనువిందు చేస్తున్నాయి. కాకరకాయలతో చేసిన మొసలి విశేషంగా ఆకట్టుకుంంది. అమ్మవారి ప్రతిమ ఎదుట సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని శాకంబరీగా అలంకరించిన ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సారెను స్వీకరించారు. ఇంద్రకీలాద్రిపై ఘనంగాశాకంబరి ఉత్సవాలు ప్రారంభం కూరగాయలు, ఆకుకూరలతో దుర్గమ్మకు అలంకరణ మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు కదంబం కోసం బారులు తీరిన భక్తులు శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో అలంకారం ప్రత్యేకత. ఆ కూరగాయలను ఉపయోగించే తయారు చేసే కదంబ ప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. ఏడో అంతస్తులో ఉచిత ప్రసాద వితరణ వద్ద ఉదయం ఆలయ ఈఓ శీనానాయక్ అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. పిల్లా పాపలతో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తబృందాలు కదంబ ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ అన్నప్రసాద తయారీ పోటులో కదంబ ప్రసాద తయారీని పరిశీలించారు. ప్రసాదం తయారీలో ఇబ్బందులు లేకుండా భక్తుందరికీ అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చే సిన భక్తులు కాయగూరలు, ఆకుకూరలతో తయారు చేసిన దండలను సమర్పించారు. -
బంగారు కుటుంబాలకు మార్గదర్శిగా రెడ్క్రాస్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో పీ–4 విధానంలో ఎంపికైన బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు రెడ్క్రాస్ ముందుకొచ్చిందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. రాజరాజేశ్వరిపేటకు చెందిన 278 బంగారు కుటుంబాలను రెడ్క్రాస్ కమిటీ దత్తత తీసుకోనుందన్నారు. ఇదే స్ఫూర్తితో పారిశ్రామిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. బంగారు కుటుంబాల ఉన్నతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ పత్రాన్ని జిల్లా కమిటీ చైర్మన్ డాక్టర్ జి.సమరం, కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేదరికాన్ని సమాజం నుంచి దూరం చేయాలని ప్రభుత్వం పీ4 విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. బంగారు కుటుంబా ల్లోని పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించేందుకు రెడ్క్రాస్ కృషిచేయనుందని తెలిపారు. ఒక సచివాలయం పరిధిలోని అన్ని బంగారు కుటుంబాలను లేదా మొత్తం మండలాన్ని కూడా దత్తత తీసుకోవచ్చని సూచించారు. జిల్లాలో 86 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని, ఇప్పటికే 400 మందికి పైగా మార్గదర్శులు ముందుకొచ్చా రని తెలిపారు. పేద కుటుంబాలను మార్గదర్శులు తమ కుటుంబాలుగా భావించి పేదరికం నుంచి బయటపడేందుకు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి, కార్యదర్శి ఇ.చిట్టిబాబు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
ఉద్యాన పంటల సాగు విస్తృతంగా చేపట్టాలి
గన్నవరం రూరల్: రైతులు ఉద్యాన పంటల సాగును విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ సూచించారు. గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో ఆ శాఖ కమిషనర్ ఎం.వి.కృష్ణతేజతో కలసి మామిడి మొక్కలు నాటే కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన బండి శ్రీనివాసరెడ్డి 3.16 ఎకరాల్లో 221 మామిడి మొక్కలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నాటారు. ఈ సందర్భంగా శశిభూషణ్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటల సాగు చేపట్టడం లక్ష్యమని తెలిపారు. ఏటా ఉద్యాన పంటల సాగును పెంచుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం ఒక్క రోజూ రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును ప్రారంభించామని వివరించారు. రైతులకు ఉపాధి పథకం ద్వారా చేయూత, సబ్సిడీలు అందజేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ ఆరేపల్లి జేజమ్మ, పంచాయతీ రాజ్ డైరెక్టర్ షణ్ముఖకుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.వి.శివ ప్రసాద్, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డీపీఓ అరుణ, ఎంపీడీఓ స్వర్ణ లత, ఏపీఓ రాజు, ఎఫ్ఏ నాయక్, పలువురు ఉపాధి కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ -
నీరాజనం
మహానేతకు మనసున్న మారాజు.. మహానేత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని జిల్లా ప్రజలు మనసారా స్మరించుకున్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని మంగళవారం వాడవాడలా మహానేత విగ్రహాలు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన పాలనలో లబ్ధిపొందిన సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా జయంతి వేడుకలు నిర్వహించారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జిల్లాలో మంగళవారం ఘనంగా జరిగాయి. వాడవాడలా ఉన్న వైఎస్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకులు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనతో తమకున్న స్మృతులను నెమరు వేసుకు న్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. పలుచోట్ల పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు పంచిపెట్టారు. పేదలకు అన్నసంతర్పణ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. ● విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సూచనల మేరకు పార్టీ నాయ కుడు వై.సిద్ధార్థ, సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు ఆధ్వర్యంలో డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జ్లు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొని వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసిన నాయకులు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని 21 డివిజన్లలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం, అన్నదానం, వస్త్రదానం, పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. భవానీపురంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య ఆధ్వర్యంలో 50 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. ● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధి లోని పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులు మల్లాది విష్ణు, వెలం పల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నాయకులు అడపా శేషు, బెల్లం దుర్గ, పుణ్యశీల, జమల పూర్ణమ్మ, తోలేటి రవిచంద్ర, వేములకొండ తిరుపతిరావు, దొడ్డ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహితం కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ● వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో గౌతంరెడ్డి పాల్గొని మునిసిపల్ ఇంజినీరింగ్ వర్కర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ● నందిగామ నియోజకవర్గంలో నందిగామ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో, కంచికచర్ల నెహ్రూ బొమ్మ సెంటర్లో నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు పాల్గొన్నారు. నాలుగు మండలాల్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ● జగ్గయ్యపేటలోలో నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్య దర్శి మండవ శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి పాల్గొన్నారు. ● మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం రింగుసెంటర్, కీలేశపురం గ్రామాల్లో నిర్వహించిన రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జోగి రమేష్ పాల్గొన్నారు. మైలవ రంలో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్కుమార్రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ● తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు పట్టణంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం, పోలీస్ సర్కిల్ కార్యాలయం సెంటర్, బోయ బజార్, జైబావి సెంటర్, పీటీ కొత్తూరు గ్రామాల్లో నిర్వహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాసు పాల్గొన్నారు. నాలుగు మండలాల్లో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ● మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు పెనమలూరు నియోజకవర్గం అంతటా జరిగాయి. కంకిపాడు వేడుకల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి పాల్గొన్నారు. మహానేత విగ్రహానికి జెడ్పీటీసీ బాకీ బాబు, మండల అధ్యక్షురాలు మాదు శ్రీహరిరాణితో కలిసి పూల మాల వేసి నివాళులర్పించారు. కానూరు వృద్ధుల ఆశ్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నే వేణుగోపాల కృష్ణమూర్తి (చిట్టిబాబు) వితరణతో వృద్ధుల అన్న సంతర్పణ చేశారు. ● గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో గ్రామ గ్రామాన వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. వాడవాడలా ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు రాజన్న విగ్రహాల వద్ద నివాళులర్పించిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల నిర్వహణ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు పంపిణీ చేసిన నాయకులు -
అమరావతి సక్సెస్ కాదు!
మధురానగర్(విజయవాడసెంట్రల్): అమరావతి ఎప్పటికీ సక్సెస్ కాదని.. మూరెడు మట్టి తవ్వితే.. బారెడు నీళ్లు వస్తున్నాయని.. ఇటువంటి పరిస్థితులలో 50 అంతస్తుల భవనాలు ఎలా నిర్మిస్తారో చంద్రబాబుకే తెలియాలని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ విమర్శించారు. విజయవాడ గాంధీ నగర్లోని ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సంతోషంగా లేరని అన్నారు. రాజధానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే గన్నవరంలో ఎయిర్పోర్టు ఉండగా ఇప్పుడు 5వేల ఎకరాలలో ఎయిర్పోర్టు నిర్మించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే గుంటూరు, విజయవాడ ట్విన్ సిటీస్గా అభివృద్ధి చెంది ఉన్నాయని.. వాటిని మరింత అభివృద్ధి చేయాల్సిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. అమరావతి రాజధానికి 20 జిల్లాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యం.. 1987లో రాజీవ్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని చింతా మోహన్ చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 35వేల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఏకంగా 5వేల పాఠశాలలు మూసివేసిందని.. మరో 5వేల పాఠశాలలు మూసిసేందుకు రంగం సిద్ధం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం ప్రహసనంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. అప్పట్లో ఇందిరాగాంధీ ఇచ్చిన స్కాలర్షిప్లనే ఇప్పుడు తల్లికి వందనం అంటూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బడాబాబులకే ‘ఉపాధి’ ఉపాధి హామీ పథకం బడాబాబుల జేబులు నింపుతోందని చింతామోహన్ విమర్శించారు. గతంలో 90 శాతం కూలీలకు 10 శాతం మెటీరియల్కు ఉపాధి హామీ పథకంలో ఖర్చు చేసేవారన్నారు. కానీ ఇప్పుడు 90 శాతం మెటీరియల్కు 10 శాతం కూలీలకు మార్చి వేసి జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. మూరెడు మట్టి తవ్వితే.. బారెడు నీళ్లొస్తున్నాయి ఏడాదిలో 5వేల పాఠశాలలు మూసివేశారు మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ -
ఇంజినీరింగ్ ప్రవేశాలు ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇంజినీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఇటీవల విడుదల చేసింది. షెడ్యూల్ను జూలై 26వ తేదీ నాటికి పూర్తి చేసి, ఆగస్టు నాలుగో తేదీ నుంచి తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగా ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో 32 ఇంజినీరింగ్ కళాశాలలు రాష్ట్రంలో అత్యధికంగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా రెండో స్థానంలో ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధికంగా 32 ఇంజినీరింగ్ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా, నూతన కృష్ణా జిల్లా పరిధిలో ఆయా కళాశాలలు ఉన్నాయి. 32 కళాశాలలకు సంబంధించి వివిధ బ్రాంచ్లలో సుమారు 19వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 15వేల వరకూ కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. వీటికి కౌన్సెలింగ్ను నిర్వహించనుంది. అందుబాటులోకి కొత్త కోర్సులు.. జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో సీఎస్సీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ వంటి రెగ్యులర్ కోర్సులకు తోడు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి సీఎస్ఈలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సైన్స్, బ్లాక్చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, మైరెన్ మైనింగ్ వంటి కొత్త బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి. ఈఏపీ సెట్లో 29వేల మందికి పైగా.. గత నెలలో విడుదలైన ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష–2025 ఫలితాల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి 29,338మందికి పైగా క్వాలిఫై అయ్యారు. ఇక్కడ 19వేల సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే జిల్లాలో ఇప్పటికే కొంతమంది ఇంజినీరింగ్ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లారు. కొందరు ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయస్థాయి ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిపోయారు. మూడు హెల్ప్లైన్ సెంటర్లు.. అభ్యర్థులకు సాంకేతిక సమస్యల పరిష్కారానికి, రిజర్వేషన్లకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి నగరంలోని ప్రభుత్వ పొలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్, ఆంధ్రా లయోలా కళాశాలలో హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలో మూడు ప్రాంతాల్లో హెల్ప్లైన్ సెంటర్లు -
పైసా వసూల్!
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతి పనికీ ఓ రేటు లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులను సిబ్బంది జలగల్లా పట్టి పీడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇస్తేనే రోగిని ఒక చోట నుంచి మరో చోటుకి తరలించే పరిస్థితి ఉందంటున్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చుకోలేని వారు వస్తే వారిని పట్టించుకోవడం లేదంటున్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటివి రాస్తే డబ్బులివ్వని వారిని రెండు మూడు రోజుల వరకూ స్కానింగ్కు తీసుకెళ్లడం లేదని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రతి పనికీ ఒక ధర నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది డిమాండ్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. పనిని బట్టి రేటు.. క్యాజువాలిటీ నుంచి వార్డుకు రోగిని వీల్చైర్లో తరలిస్తే రూ.200, స్ట్రెచ్చర్పై అయితే రూ.300, సీటీ స్కాన్కు తీసుకెళ్తే రూ.200, ఎంఆర్ఐ కోసం అయితే రూ.500, ఐసీయూలో బెడ్ కావాలంటే డిమాండ్ను బట్టి రూ.500 నుంచి రూ.2 వేలు, రోగి మృతదేహాన్ని వార్డు నుంచి కిందకు దించాలంటే రూ.500, పోస్టుమార్టం చేయాలంటే రూ.1000 ఇలా విజయవాడ జీజీహెచ్లో ప్రతి పనికి సిబ్బంది ఫిక్స్డ్ రేట్లు పెట్టి రోగుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇవన్నీ అధికారికంగా అనుకునేరు.. అదేమి కాదు. అక్కడ పనిచేసే సిబ్బంది నిర్ణయించిన రేట్లు. బాగా పేదలైతే ఆ మొత్తంలో ఒక రూ.50 తగ్గిస్తారంతే. లేదంటే బంధువులే వీల్చైర్, స్ట్రెచ్చర్లు తీసుకుని రోగులను తరలించాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. అంతేకాదు నిత్యం రోగిని బంధువులే క్యాజువాలిటీ నుంచి సూపర్స్పెషాలటీ బ్లాక్, వార్డులకు తరలించే దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. అయినా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుంటారు. పర్యవేక్షించే వారేరి.. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆర్ఎంఓలపై ఉంటుంది. ప్రస్తుతం కొత్తాస్పత్రిలో ఒక డెప్యూటీ ఆర్ఎంఓ మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, ఆమె ఏసీ గది దాటి బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా క్యాజువాలిటీ, ఐసీయూలు, ఏఎంసీ, ఆపరేషన్ థియేటర్ల వద్ద వసూళ్లు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆపరేషన్కు సిద్ధం చేసి రోగిని తీసుకెళ్లాలంటే సిబ్బందికి ముడుపులు చెల్లించుకోవాల్సిందే. ప్రాణాలు పోయినా వదలరు. మృతదేహాన్ని దించేందుకు సైతం డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఇలా ఆస్పత్రిలో యథేచ్ఛగా రోగులను దోపిడీ చేస్తున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో సిబ్బంది మరింత రెచ్చిపోతున్నారు. ఇక్కడ ఎవరిది బాధ్యత? ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్ తర్వాత సీఎస్ ఆర్ఎంఓ కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. నాల్గో తరగతి సిబ్బంది, నర్సింగ్ సేవలు, రోగులకు పెట్టే ఆహారం నాణ్యత, శానిటేషన్, సెక్యూరిటీ వంటివి అన్నీ సీఎస్ ఆర్ఎంఓ పర్యవేక్షించాలి. కొత్త ఆస్పత్రి, పాత ఆస్పత్రు లకు ఆమె ఆర్ఎంఓగా వ్యవహరించాల్సి ఉండగా, ప్రస్తుతం ఆమెను పాత ప్రభుత్వాస్పత్రికే పరిమితం చేసేశారు. ఒకవేళ అక్కడ ఏదైనా పర్యవేక్షణ అవసరమైతే డెప్యూటీ ఆర్ఎంఓను పంపించాలి. అంతేకాని, ఆస్పత్రిలో కీలకంగా వ్యవహరించాల్సిన సీఎస్ ఆర్ఎంఓను పాత ఆస్పత్రికి పంపించడం నిబంధనలకు విరుద్ధమని పలువురు వైద్యులే చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ పర్యవేక్షణ పూర్తిగా పడకేసిందంటున్నారు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులను పీక్కుతింటున్నట్లు పలువురు తమ దృష్టికి కూడా తీసుకొస్తున్నారంటూ ఆస్పత్రి ఉద్యోగులే చెపుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోగుల నుంచి భారీగా దండుకుంటున్న ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలు పోయినా వదలని వైనం సేవలను పర్యవేక్షించేది ఎవరు? సీఎస్ ఆర్ఎంఓ పాత ఆస్పత్రికే పరిమితం ఫిర్యాదు చేస్తే చర్యలు.. పాత ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు డెప్యూటీ ఆర్ఎంఓలు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఒకరు మాత్రమే వచ్చి విధుల్లో చేరారు. దీంతో సీఎస్ ఆర్ఎంఓను అక్కడ విధులు కేటాయించాం. రోగులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. సిబ్బంది ఎవరైన డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయవచ్చు. – డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ -
లోకపావని.. శాకంబరి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోకపావని.. జగజ్జనని కనకదుర్గమ్మ శాకంబరిమాతగా భక్తులను కరుణించనున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభం కానున్నాయి. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఇతర ఉపాలయాలను, దేవతా మూర్తులను ఆకుకూరలు, కాయగూరలతో విశేషంగా అలంకరిస్తున్నారు. అమ్మవారిని అలంకరించేందుకు అవసరమైన పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను దండలుగా సేవా సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 20 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను దాతలు సమర్పించారు. నగరంలోని హోల్సేల్ కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు తమ వంతుగా ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నారు. శాకంబరిగా దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం మంగళవారం ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజ, ఋత్విక్వరుణ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధనతో శాకంబరి ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు కలశస్థాపన, అగ్నిప్రతిష్టాపన, మండపారాధన వంటి వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. పదో తేదీ ఉదయం పది గంటలకు పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగుస్తాయి. శాకంబరీ ఉత్సవాలు జరిగే మూడు రోజులూ ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాలయ దర్శనం రద్దు చేసినట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే భక్త బృందాల సంఖ్య రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతుండటం, శాకంబరీ ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శాకంబరీ అలంకరణ పనులు శాకంబరీ ఉత్సవాల నేపథ్యంలో ఆలయంతో పాటు అమ్మవారి ఆలయ అలంకరణకు అవసరమైన కూరగాయల దండలను మహామండపం ఆరో అంతస్తులో సిద్ధం చేస్తున్నారు. సోమవారం ఉదయం ఈఓ శీనానాయక్ కూరగాయలు, కాయగూరలు, ఆకుకూరలకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రెండు వందల మంది సేవా సిబ్బంది ఈ కూరగాయల దండలను సిద్ధం చేస్తున్నారు. నేడు శాకంబరిగా కనకదుర్గమ్మ దర్శనం ప్రధాన ఆలయాలు, ఉపాలయాలకు కూరగాయలతో అలంకరణ మూడు రోజుల పాటు కొనసాగనున్న శాకంబరి ఉత్సవాలు ఉత్సవాల్లో ప్రత్యేకంగా కదంబ ప్రసాదం -
సమయపాలన పాటించకుంటే సస్పెన్షనే..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో సమయపాలన పాటించని అధికారులపై సస్పెన్షన్ వేటు తప్పదని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని డీఆర్వో నుంచి అధికారులకు సమాచారం అందించారు. కొందరు అధికారులు సమావేశానికి ఆలస్యంగా రావడాన్ని కలెక్టర్ గమనించి, అసహనం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలపై సమీక్షించి, వాటికి పరిష్కారం చూపేందుకు 9.30 గంటలకల్లా గ్రీవెన్స్కు హాజరుకావాలని పంపిన సమాచారాన్ని కొందరు జిల్లా అధికారులు బేఖాతరు చేయడం, విధులపై అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు భావించాల్సి వస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు గ్రీవెన్స్ హాల్ డోర్లు మూసివేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఆలస్యంగా వచ్చిన, గైర్హాజరైన అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. పీజీఆర్ఎస్లో 138 అర్జీలు పీజీఆర్ఎస్లో మొత్తం 138 అర్జీలు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 53, పోలీస్ 23, ఎంఏయూడీ 17 అర్జీలు అందాయి. పౌరసరఫరాలు, హెల్త్, పీఆర్ శాఖలకు సంబంధించి ఆరు చొప్పున, కలెక్టరేట్, డీఆర్డీఏకు మూడు చొప్పున, వ్యవసాయం, డ్వామా, విద్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సర్వే, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, విభిన్నప్రతిభా వంతలు, అగ్నిమాపక, కేడీసీసీ బ్యాంకు, ఎల్డీఎం, గనులు–భూగర్భ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, ఆర్ఐఓ, ఆర్డబ్ల్యూఎస్, రవాణా శాఖలకు సంబంధించి మిగిలిన అర్జీలు అందాయి. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. ● తమ గ్రామంలోని ఆర్ఎస్ నంబరు 63లో ఉన్న చెరువులోమట్టి అక్రమ రవాణా జరుగుతోందని, ఐదు వేల క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని లక్షకు పైగా క్యూబిక్మీటర్లు అక్రమంగా తవ్వి ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్వెంచర్లకు మట్టిని తరలిస్తున్నారని విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లికి చెందిన జమలయ్యతోపాటు మరికొందరు కలెక్టర్కు అర్జీ సమర్పించారు. ● గత ప్రభుత్వంలో కేంద్ర ఆయుష్, విద్యాశాఖల సంయుక్త ఆదేశాలనుసారం బుద్ధ యోగ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలోని 907 పాఠశాలలో 1,056 మంది యోగ శిక్షకులుగా నియమితులయ్యారని, వారిని ప్రత్యక్షంగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ ప్రతినిధులు అర్జీ అందజేశారు. జిల్లా అధికారులపై కలెక్టర్ లక్ష్మీశ ఆగ్రహం -
పోలీస్ గ్రీవెన్స్కు 62 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 62 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆయా స్టేషన్ల ఎస్హెచ్ఓలకు తగిన ఆదేశాలు ఇచ్చారు. కాగా మొత్తం 62 ఫిర్యాదులు రాగా, వాటిలో భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 37, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించి 4, కొట్లాటకు సంబంధించి 3, వివిధ మోసాలపై 05, మహిళా సంబంధిత నేరాలపై 2, సైబర్ నేరాలపై 4, ఇతర చిన్న వివాదాల, సమస్యలపై 07 ఫిర్యాదులు అందాయి. డీసీపీ ఉదయరాణితో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించడంలో సహకారం అందించారు. -
గవర్నర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఈ నెల 10న జరిగే వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేయనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్. గంగాధరరావు, పలు శాఖల అధికారులు ట్రస్ట్లో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. పర్యటన ఇలా.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ పర్యటనలో ఎటువంటి అవాంతరాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ట్రస్ట్లోకి ప్రవేశించగానే స్వామివివేకానంద విగ్రహానికి గవర్నర్ పూలమాలలు వేస్తారని, ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రవేశమార్గంలో పందిళ్లు, మొక్కల కుండీలు, కార్పెట్లు ఏర్పాటు చేయాలని, గ్రీన్రూమ్లో గవర్నర్ విశ్రాంతి కోసం సోఫా వంటి వసతులను కల్పించాలని ఆదేశించారు. విజయవాడ నుంచి స్వర్ణభారత్ ట్రస్ట్ వచ్చే మార్గంలో గవర్నర్ కాన్వాయ్ రాకపోకలకు ఎటువంటి ఆటంకం లేకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే స్నాతకోత్సవానికి ముందే విద్యార్థులను వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టాలని చెప్పారు. ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్ ప్రసన్నకుమార్, అసోసియేట్ డీన్ దొరాజీరావు, గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రహ్మణ్యం, డీపీఓ అరుణ, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మన నుంచి దూరమైనా ప్రజల మదిలో పదిలంగా కొలువై ఉన్నారు. ఆరోగ్య శ్రీతో పేదల గుండెల్లో ఊపిరయ్యారు. జలయజ్ఞంతో అపర భగీరథుడయ్యారు. సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో తన పాలనలో చేసి చూపించి సిసలైన ప్రజానాయకుడిగా జేజేలు అందుకు న్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. తన పాలనతో జిల్లా వాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మంగళవారం ఆయన 76వ జయంతి సందర్భంగా జిల్లాకు చేసిన అభివృద్ధిని జిల్లా వాసులు మరో సారి మననం చేసుకుంటు న్నారు. వైఎస్సార్ అనే పేరు వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మనకళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ‘నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా... నమస్తే తమ్ముడూ’ అంటూ ఆయన పలికే మాటలు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. 108 అంబులెన్సులను తీసుకొచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరినో బతికించి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం, కృష్ణా విశ్వవిద్యాలయం, నూజివీడు ట్రిపుల్ ఐటీ, నాగాయలంక మండ లంలో తొలి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు, కృష్ణా కరకట్ట రోడ్డు నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులతో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలో ‘రాజన్న’ ముద్ర2008 జూన్ ఆరో తేదీన అవనిగడ్డ మండలం పులిగడ్డవార్పు వద్ద కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు.కృష్ణా డెల్టా పరిధిలో 13.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా రూ.4,573 కోట్లతో ఆధునికీకరణ పనులకు పరిపాలనా అనుమతులిచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ.2,180 కోట్లు వెచ్చించారు. వైఎస్ హయాంలోనే ఈ పనుల్లో 40 శాతానికి పైగా పూర్తయ్యాయి.2008 ఏప్రిల్ 23వ తేదీన రూ.1,500 కోట్లతో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని పోర్టు పనులను ఆయన తనయుడు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి తన హయాంలో ముందుకు తీసుకెళ్లారు. పోర్టు పనులను పరుగులు పెట్టించారు.కృష్ణా డెల్టాకు ఆయువుపట్టయిన పులిచింతల ప్రాజెక్టును నిర్మించి ప్రజలకు అందించారు.అవనిగడ్డ, విజయవాడ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు అప్పటి వరకూ సింగిల్ రోడ్డుగా ఉన్న కృష్ణానది కరకట్టను రెండు లైన్ల రహదారిగా విస్తరించారు.నాగాయలంక మండలం భావదేవరపల్లిలో రాష్ట్రంలో తొలి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు.నూజివీడులో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈ కళాశాలలో ఏటా వేల మంది గ్రామీణ పేద విద్యార్థులు సాంకేతిక విద్యను ఉచితంగా అందుకుంటున్నారు.ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇప్పటికీ ఉమ్మడి కృష్ణా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకొన్న వైఎస్సార్ జయంతి వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యక్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.ఉమ్మడి జిల్లాతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి విడదీయరాని అనుబంధంఆధునికీకరణ పనులతో కృష్ణాడెల్టా ఆయకట్టుకు జీవం పోసిన వైఎస్సార్ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ.వేలకోట్ల అభివృద్ధి పనులు చేపట్టిన వైనంజిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు -
న్యాయం చేయండి
అన్యాయం అయిపోతున్నాం.. జేడీ చాంబర్ వద్ద బైఠాయించిన గ్రామ వ్యవసాయ సహాయకులు చిలకలపూడి(మచిలీపట్నం): బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందని, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులు వేడుకున్నారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీ చాంబర్ వద్ద సోమవారం రాత్రి వారు బైఠాయించారు. పిల్లాపాపలతో ఉన్న తమను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయటం ఎంతో బాధ కలిగించిందన్నారు. సచివాలయాల్లో ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న తమ వెసులుబాటు పట్టించుకోకుండా ఇష్టానుసారం బదిలీ చేశారని ఆరోపించారు. అనారోగ్య సమస్యలు, స్పౌజ్ కేసులు, చంటి పిల్లలు ఉన్న తమను సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తే ఎలా వెళ్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బదిలీల్లో అన్యాయం జరిగిందని పలుమార్లు అధికారులను కలిసి విన్నవించుకున్నామని గుర్తుచేశారు. అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, అయితే తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులు ఎత్తేశారని పేర్కొన్నారు. బదిలీలు జరిగినప్పటికీ తాము సుదూర ప్రాంతాలకు వెళ్లలేక, ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వచ్చి అధికారులకు చెప్పుకుంటే, వారు న్యాయం చేయకపోగా ఈ విధంగా మాట్లాడటం ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. -
భవానీ ద్వీపం పునర్వైభవానికి కృషి
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి పలు పర్యాటక ప్రాజక్ట్లను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. అందులో భాగంగానే భవానీ ద్వీపం పునర్వైభవానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో టూరిజం కొత్త సర్క్యూట్లపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన భవానీ ద్వీపాన్ని సందర్శించి సెల్ఫీ పాయింట్లు, మేజ్ గార్డెన్, బోటింగ్ పాయింట్లు తదితరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విజయవాడ అర్బన్ పరిధిలో గాంధీహిల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, బాపూ మ్యూజియం, మొగల్రాజపురం గుహలు, అక్కన్న–మాదన్న గుహలు వంటివి అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయని వివరించారు. అలాగే మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి ఖిల్లాను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు జిల్లాలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయని, కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు నగరానికి వచ్చే లక్షలాది మంది భక్తులు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి మధురానుభూతులతో తిరిగి వెళ్లేలా టూరిజం సర్క్యూట్లను అందుబాటులోకి తీసుకురానున్నామని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. వచ్చే దసరా ఉత్సవాల్లో విజయవాడ ఉత్సవ్ను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ పి. కృష్ణచైతన్య, బెరంపార్క్, భవానీ ఐలాండ్ మేనేజర్లు శ్రీనివాస్, సుధీర్, కొల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
పప్పీలకు ప్రేమతో..
జంతు ప్రేమికులు తమ పప్పీలతో బారులు తీరారు.. తాము పెంచుకునే పెట్లకు ప్రేమతో టీకాలు వేయించారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా లబ్బీపేటలోని డాక్టర్ ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో పెంపుడు జంతువులకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్లు వేశారు. ఈ శిబిరాన్ని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదరనాయుడు, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్తో కలిసి ప్రారంభించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించండి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్నా కానీ డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ప్రకటన చేయకపోవడం దారుణమని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్కుమార్ అన్నా రు. స్థానిక సున్నపుబట్టీల సెంటర్ సమీపంలో ఉన్న సంఘం కార్యాలయంలో పీడీఎస్యూ జిల్లా కార్యవర్గ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు ఐ.రాజేష్ అధ్యక్షత ఆదివారం జరిగింది. సమావేశానికి వినోద్కుమార్ హాజరై మాట్లాడుతూ అడ్మిషన్లు ఆలస్యం కావడం వల్ల పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన కూడా ఆలస్యమవుతాయన్నారు. ఫలితంగా ఏపీ పీజీ సెట్, ఐసెట్ వంటి ఉమ్మడి పరీక్షలు కూడా ఆలస్యంగా జరుగుతాయన్నారు. 90 రోజులలో నిర్వహించాల్సిన సెమిస్టర్ను కుదించడం, కొన్నిసార్లు సెమిస్టర్ ప్రారంభమై రెండు నెలలకే పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహర్షి, నగర అధ్యక్షుడు ధీరజ్ కృష్ణ్ణ, కార్యదర్శి సింధు, సభ్యులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యభగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సూర్యోపాసన సేవ, సూర్యనమస్కారాల్లో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. -
ఆలయానికి కూరగాయలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శాకంబరీదేవి అలంకరణకు అవసరమైన కూరగాయలు, కాయగూరలు, పండ్లను దాతలు సమర్పించగా, వాటిని ఆలయానికి తరలించారు. ఆదివారం మహామండపం ఆరో అంతస్తులో భక్తులు సమర్పించిన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లను ఈవో శీనానాయక్ పరిశీలించారు. 8వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీదేవి ఉత్సవాలను నిర్వహించనున్నారు. భక్తులు, రైతులు, దాతలు దేవస్థానానికి సమర్పించిన కాయగూరలు, కూరగాయలను ఆలయ అలంకరణకు సిద్ధం చేయాలని ఏఈవో రమేష్బాబును ఈవో ఆదేశించారు. మరో వైపు ఆలయంతో పాటు ఆలయ ప్రాంగ ణంలోని ఉపాలయాలలో కూరగాయలను అలంకరించేందుకు అవసరమైన పనులను సిబ్బంది ఆదివారం నుంచి ప్రారంభించారు. దుర్గమ్మ సేవలో డీజీపీ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్కుమార్ గుప్తా దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన హరీష్కుమార్ గుప్తాను ఆలయ ఈవో శీనానాయక్ సాదరంగా స్వాగతం పలుకగా, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ డీజీపీ హరీష్కుమార్ గుప్తాకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. డీజీపీ వెంట ఏడీసీపీ రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు ఉన్నారు. నేడు డాక్టర్స్ ట్రస్టు భవనం ప్రారంభోత్సవం లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన డాక్టర్స్ ట్రస్టు భవనాన్ని సోమవారం వెద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ప్రారంభించనున్నారు. కోవిడ్ సమయంలో అందించిన వైద్య సేవలకు గాను వైద్యులకు వచ్చిన ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ రూ.78 లక్షలు, పలువురు వైద్యులు, దాతల ద్వారా నిధులను సమీకరించి రెండేళ్ల కిందట ఈ భవన జీ+2 అంతస్తుల్లో నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో డాక్టర్స్ క్యాంటీన్ ఏర్పాటు చేయనుండగా.. మొదటి, రెండు అంతస్తుల్లో రూమ్స్ ఏర్పాటు చేస్తారు. వైద్య కళాశాలలో నిర్వహించే పరీక్షలకు వచ్చే ఎగ్జామినర్స్, ఇన్స్పెక్షన్లకు వచ్చే వారు ఉండేలా ఈ రూమ్స్ను సిద్ధ చేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ ఎస్. ఢిల్లీరావు, డీఎంఈ డీఎల్వీల్ నరసింహంలతో పాటు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. 32మంది బేస్బాల్ క్రీడాకారులు ఎంపిక నాగాయలంక: కృష్ణాజిల్లా బేస్బాల్ అసోసియేషన్లో ఆధ్వర్యంలో స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించిన సీనియర్ బేస్బాల్ సెలక్షన్స్లో 32మంది ఎంపికయ్యారు. సెలక్షన్స్ కోసం జరిగిన పోటీలకు 200మంది క్రీడాకారులు హాజరుకాగా 16మంది బాలికలు, 16మంది బాలురు సెలెక్ట్ అయినట్లు అసోసియేషన్ కార్యదర్శి సరళ శ్రీనివాసరావు ప్రకటించారు. తొలుత ఈ పోటీలను ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ స్థానిక సబ్బ్రాంచి చైర్మన్ భోగాది శివవిష్ణుప్రసాద్ ప్రారంభించారు. ఫిజికల్ డైరెక్టర్లు గాజుల లక్ష్మీప్రసాద్, బడే వెంకటేశ్వరరావు, చిల్ల సుబ్బారావు, సనకా శ్రీకాంత్, బడే పాండురంగప్రసాద్, రేపల్లె శ్రీధర్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 12, 13, 14 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలలో కృష్ణా జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ కార్యదర్శి చెప్పారు. -
అలరించిన నాట్య ప్రదర్శనలు
కూచిపూడి(మొవ్వ): కూచిపూడిలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యాం ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) సందర్భంగా నిర్వహించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రవాస భారతీయ నాట్య కళాకారిణి లహరి (అమెరికా), కోల్కతాకు చెందిన కళాకారిణి డెబ్జానిబాసు (భరతనాట్యం) అంశాలను అలరించాయి. తాళ్లాబత్తుల సింధు భార్గవి, లక్కో జుధాత్రి, ఆత్మకూరి సువర్ణ శ్రావ్య శ్రీ శార్వాణి, జి.సత్యానందిని పలు కూచిపూడి నాట్య అంశాలను ప్రదర్శించి మైమరపించారు. అతిథులు విశ్రాంత తెలుగు పండితుడు వెంపటి బాపయ్య శాస్త్రి, విశ్రాంత ఫైర్ అధికారి జోశ్యుల నాగ జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
వత్సవాయి: వేగంగా వస్తున్న లారీ ఓ ట్రాక్టర్ను వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున వత్సవాయిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొందరు ట్రాక్టర్తో ఇసుకను గ్రామంలో అవసరమైన వారికి సరఫరా చేస్తుంటారు. తెల్లవారుజామున ఇసుకను ట్రాక్టర్లో నింపుకుని రావడానికి నలుగురు కలిసి ట్రాక్టర్ తీసుకుని లింగాల మునేటి వద్దకు వెళ్తున్నారు. గ్రామశివారులో రహదారి పక్కన ట్రాక్టర్ నిలిపారు. ఇంతలో వైరా వైపు నుంచి లారీ వేగంగా వచ్చి నిలిపిఉన్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ఘటనలో ట్రాక్టర్లో ఉన్న వారు రహదారిపై పడగా డ్రైవర్ సీటులో ఉన్న చల్లా వేణు(21) రోడ్డుపై పడ్డారు. ట్రాక్టర్ తిరగబడి ఇతనిపై పడింది. ఘటనలో వేణు అక్కడిక్కడే మృతిచెందగా బాలు, ఆర్.రాంబాబు, సీహెచ్ రాముడుకు గాయాలయ్యాయి. వీరిని మెరుగైన చికిత్స కోసం జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. గ్రామస్తుల వాదన మరోలా.. ఘటనపై గ్రామస్తుల వాదన మరో రకంగా ఉంది. రహదారి పక్కనే పీఎస్కు కూతవేటు దూరంలో ఉన్న మద్యం బెల్టుషాపు కారణంగా ఘటన జరిగిందని చెబుతున్నారు. తెల్లవారుజామునే బెల్టుషాపు వద్ద రహదారిపై ట్రాక్టర్ను నిలిపి ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తుల చర్చించుకుంటున్నారు. కేవలం బెల్టుషాపు వల్లనే నిండుప్రాణం పోయిందంటున్నారు. అతనే ఆధారం వేణు కూలిపనులు చేస్తుంటాడు. ఇటీవల అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని తల్లి, భార్య విలపిస్తున్న తీరు చూపరుల కళ్లు చెమ్మగిల్లేలా చేశాయి. ఘటనపై వేణు భార్య భవాని స్టేషన్లో ఫిర్యాదుచేయగా ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేటకు తరలించారు. వేణు మరణ వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు వైద్యశాలకు వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. మద్యం బెల్టుషాపు వల్లనే ప్రమాదం అని గ్రామస్తుల ఆరోపణ -
ప్రజా రహదారులు బందీ!
కోడూరు: ప్రజలు రాకపోకలు సాగించేందుకు లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్లకు ప్రయివేటు వ్యక్తులు గేట్లు ఏర్పాటు చేసిన ఘటన కోడూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హంసలదీవి పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.17.80 లక్షలతో 300 మీటర్ల మేర నూతన సీసీ రోడ్లను నిర్మించారు. గ్రామంలోని వేణుగోపాలుడి ఆలయ పక్కనే ఉన్న చెరువు చుట్టూ ఈ రోడ్ల నిర్మాణాలను నాలుగు నెలల క్రితం చేపట్టారు. పంచాయతీరాజ్ అధికారులు ఈ రోడ్ల నిర్మాణాలు చేసి, లాంఛనంగా ప్రారంభించారు. రహదారులకు గేట్లు అయితే కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లపై గ్రామస్తులు రాకపోకలు సాగించడానికి వీల్లేకుండా కొంతమంది ప్రయివేటు వ్యక్తులు గేట్లను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి, వేణుగోపాలుడి ఆలయం, కాశీవిశ్వేశ్వర స్వామివారి ఆలయాల వద్ద ఈ గేట్లను సీసీ రోడ్లకు అడ్డుగా ఏర్పాటు చేశారు. 300 మీటర్ల రహదారి మొత్తం నాలుగు గేట్లను ప్రయివేటు వ్యక్తులు ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. వేణుగోపాలుడి ఆలయ నిర్వహణ చేపడుతున్న వ్యక్తులే ఈ గేట్లను ఏర్పాటు చేశారని, రోడ్లపై ఎవరూ నడవడానికి వీలు లేకుండా గేట్లకు తాళాలు వేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలిఈ రహదారులు వెంట గ్రామస్తులు నడవడానికి వీల్లేదని ఆలయ నిర్వాహకులు బాహాటంగానే చెబుతున్నట్లు హంసలదీవి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సీసీ రోడ్లకు అడ్డుగా ఏర్పాటు చేసిన గేట్లను వెంటనే తొలగించాలని హంసలదీవి గ్రామస్తులు కోరుతున్నారు. హంసలదీవిలో నూతన సీసీ రోడ్లపై వెళ్లకుండా గేట్లు ఏర్పాటు ప్రజల ఆగ్రహం రూ.17.80లక్షలతో నిర్మించిన రోడ్లు నిరుపయోగం గేట్లకు తాళాలు ఉన్నతాధికారులు స్పందించాలి -
ఇకపై ఇసుక ఉచితం కాదు!
మద్దూరు స్టాకు యార్డులో నిల్వ ఉన్న ఇసుక వర్షాకాలంలో కృష్ణా నదికి వరద వచ్చే అవకాశం ఉన్నందున, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక కొరత లేకుండా, స్టాకు యార్డుల్లో నిల్వ చేశాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొంటున్నాం. ప్రస్తుతం నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. దీంతో ఇసుక రీచ్లకు వెళ్లే దారుల్లో ట్రెంచ్లు కొట్టాం. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకొంటాం. – శ్రీనివాస కుమార్, మైనింగ్ డీడీ, ఉమ్మడి కృష్ణా జిల్లా సాక్షి ప్రతినిధి, విజయవాడ: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్టాకు యార్డుల్లో మైనింగ్ అధికారులు ఇసుకను నిల్వ చేశారు. జిల్లా స్థాయి కమిటీ ఇసుక రీచ్కు స్టాకు యార్డుకు ఉన్న దూరంతో పాటు, తవ్వకం, లోడింగ్, రవాణాకు సంబంధించిన ఖర్చులను దృష్టిలో పెట్టుకొని స్టాకు యార్డుల్లో మెట్రిక్ టన్ను ఇసుక ధరలను నిర్ణయించింది. దీనిని బట్టే ఉచిత ఇసుక వట్టిదేనని తేలిపోతోంది. లబ్ధిదారులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. మరోవైపు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం హరిత ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు అక్టోబర్ 15వ తేదీ వరకు నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. ఇసుక రీచ్లకు వెళ్లే మార్గాల్లో మైనింగ్ అధికారులు ట్రెంచ్లు కొట్టినప్పటికీ.. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ అక్రమ రవాణా వెనుక టీడీపీ పార్లమెంటు, ఆయా నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతల హస్తం ఉండటమేనని తెలుస్తోంది. మైనింగ్ అధికారులు దాడులు చేసి, వాహనాలను సీజ్ చేస్తున్నా.. రాత్రి వేళ్లలో ఈ దందాకు తెరలేపుతున్నారు. స్టాకు యార్డుల్లో ఇసుక నిల్వలు ఉన్నా, కృత్రిమ కొరత సృష్టించి దండుకొనే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే పచ్చనేతలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక డంపులు ఏర్పాటు చేసి, తెలంగాణ రాష్ట్రానికి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక ధరలు ఇలా.. ఇసుక రీచ్ స్టాకు యార్డు దూరాన్ని బట్టి ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీ ధరలు నిర్ణయించింది. ఏటూరు కంచికచర్ల అల్లూరుపాడు స్టాకు యార్డులో మెట్రిక్ టన్ను ఇసుక ధర రూ.174 కీసర, మొగలూరు స్టాకుయార్డుల్లో ఇసుక ధర మెట్రిక్ టన్ను రూ. 202, ఇబ్రహీంపట్నంలో స్టాకు యార్డులో మెట్రిక్ టన్ను ఇసుక ధర రూ.380గా నిర్ణయించింది. స్టాకు యార్డుల నుంచి ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది. ఏపీ శాండ్ మేనేజ్మేంట్ యాప్లో వివరాలు నమోదు చేసుకొని డబ్బులు చెల్లిస్తే, బిల్లు జనరేట్ అవుతోంది. ఈ బిల్లు స్టాకు యార్డులో చూపితే, ఇసుక లోడింగ్ చేస్తారు. ఇంత వరకు స్టాకు యార్డుల నుంచి లబ్ధిదారులు తీసుకెళ్లలేదు. ఇప్పటికీ నదుల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. మండలం స్టాకు యార్డు ప్రదేశం అందుబాటులో ఉన్న ఇసుక(మెట్రిక్ టన్నుల్లో) వత్సవాయి అల్లూరుపాడు 50,000 చందర్లపాడు ఏటూరు 30,000 కంచికచర్ల కంచికచర్ల 70,000 కంచికచర్ల కీసర 3,50,000 ఇబ్రహీపట్నం ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ 4,00,000 మొత్తం 9,00,000 కఠిన చర్యలు తప్పవు.. ఎన్టీఆర్ జిల్లాలో స్టాకు యార్డుల్లో నిల్వలు ఇలా.. ధరలు నిర్ణయించిన జిల్లా కమిటీలు వర్షాల కారణంతో స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు ఎన్టీఆర్ జిల్లాలో 9 లక్షల టన్నులు, కృష్ణాలో 7.5లక్షల టన్నులు నిల్వ నదుల్లో తవ్వకాలపై ఇప్పటికే నిషేధం అయినప్పటికీ ఆగని అక్రమ రవాణా -
జగజ్జననికి జేజేలు
భక్తజనసంద్రమైన ఇంద్రకీలాద్రి అమ్మవారికి సారె సమర్పించిన భక్తులు, అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించే భక్తులతో పాటు కొండ దిగువకు చేరుకునే భక్తులు మహా మండపం మెట్ల మార్గం ద్వారానే దిగువకు చేరుకోవాల్సి వస్తోంది. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు మహా మండపం మెట్ల మార్గంలో అడుగు తీసి అడుగు ముందుకు వేసే పరిస్థితి కనిపించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ దశలో మెట్లపై నడుచుకుంటూ వెళ్తున్న వారు ముందుకు పడిపోయేలా తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. మెట్లపై నుంచి కిందకు దిగాలంటే కనీసం అరగంటకు పైగా సమయం పడుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధికి ఆదివారం రికార్డు స్థాయిలో భక్తబృందాలు, భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఆదివారం, తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్నడూ లేని విధంగా ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు సారె సమర్పించేందుకు బారులు తీరారు. సాయంత్రం 8 గంటల వరకు భక్తులు సారె సమర్పిస్తూనే ఉన్నారు. ఒక్క రోజే సుమారు 15 గంటల పాటు ఏకధాటిన భక్తులు బృందాలుగా తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. మరో వైపున గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 70వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులతో కుటుంబాలకు కుటుంబాలు ఇంద్రకీలాద్రికి పయనమయ్యాయి. భక్త బృందాలతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఓ దశలో అమ్మవారి దర్శనానికి, సారెను సమర్పించేందుకు వేచి ఉన్న భక్తులతో లక్ష్మీ గణపతి ప్రాంగణం పూర్తిగా నిండిపోగా, క్యూలైన్లు ఓం టర్నింగ్లోని దేవస్థాన బస్సు పాయింట్ వరకు చేరింది. దిగువ నుంచి బస్సులో కొండపైకి చేరుకున్న భక్తులు బస్సు దిగిన వెంటనే క్యూలో నిల్చోవడం కనిపించింది. సర్వ దర్శనానికి మూడు గంటలు భక్తుల రద్దీతో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఉదయం నుంచి భక్తుల తాకిడి కనిపించడంతో అంతరాలయ దర్శనాన్ని ఆలయ ఈవో శీనానాయక్ రద్దు చేశారు. దీంతో రూ.300, రూ.100 టికెట్లను మాత్రమే విక్రయించారు. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. మహామండపం లిఫ్టు మార్గం ద్వారా విచ్చేసిన భక్తులను 5వ అంతస్తు వరకే అనుమతించారు. దీంతో 5వ అంతస్తు వరకు క్యూలైన్ కిటకిటలాడుతూ కనిపించింది. సర్వ దర్శనానికి మూడు గంటలు పట్టగా, టికెట్పై రెండు గంటల సమయం పట్టింది. మహామండపం మెట్ల మార్గంలో రద్దీ ఏకాదశిన దుర్గమ్మకు రికార్డు స్థాయిలో సారె ఏకధాటిన 15 గంటలపాటు కొనసాగిన సమర్పణలు -
బైక్ చోరీలు చేసే ముఠా అరెస్ట్
ఉంగుటూరు(గన్నవరం): వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠాను ఉంగుటూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శివప్రసాద్ వివరాలను వెల్లడించారు. మండలంలోని వేంపాడుకు చెందిన తుల్లిమిల్లి సీతారామయ్యకు చెందిన పల్సర్ 220 సీసీ బైక్ను గత నెల 25వ తేదీ దొంగలు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ గోవిందు, సిబ్బంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దొంగలను గుర్తించారు. చోరీకి పాల్పడిన పెద్దపారుపూడికి చెందిన ముత్యాల మనోజ్కుమార్, మరో ముగ్గురు బాలురను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వారి నుంచి వేంపాడుతో పాటు గుంటూరు, కంకిపాడు ప్రాంతాల్లో చోరీ చేసిన ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ గంగాధరరావు, డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించినట్లు సీఐ పేర్కొన్నారు. -
వైద్య సేవలకు గుర్తుగా అవార్డులు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వైద్యుల సేవలను గుర్తించి ఏటా అవార్డులను అందజేయడం అభినందనీయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డు–2025 ప్రదానోత్సవం మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్యఅతిథి మంత్రి సవిత జ్యోతి ప్రజ్వలన చేశారు. డాక్టర్లు కనిపించే దేవుళ్లుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యులు చేస్తున్న సేవలు చాలా గొప్పవని, కనిపించే దేవుళ్లు డాక్టర్లు అని చెప్పారు. ప్రత్యేక ఆహ్వానితుడు సినీనటుడు సుమన్ మాట్లాడుతూ వైద్య వృత్తి చాలా పవిత్రమైనదన్నారు. సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిల్లో కంటే సాధారణ ఆసుపత్రుల్లోనే వైద్యసేవలు పొందడానికి తాను ప్రాధాన్యమిస్తా నన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పీవీఎస్ విజయభాస్కర్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2009 నుంచి ఏటా వైద్యరంగంలో విశేష సేవలు చేసిన వైద్యులకు అవార్డులను అందజేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవై రావు, ఎస్ఎల్వీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్ పి.శ్రీనివాసరాజు, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు పీవీ రమణమూర్తి, కన్వీనర్ మురళీకృష్ణ, వైద్యులు, ఫౌండేషన్సభ్యులు పాల్గొన్నారు. సభకు ముందుగా ఫౌండేషన్ మ్యాగజైన్ను ఆవిష్కరించారు. అవార్డులు అందుకున్నది వీరే... డాక్టర్ ఆర్.మురళీబాబురావుకు లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును అందజేశారు. డాక్టర్ ఎల్.సుబ్బారావు, డాక్టర్ శశిబాల, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, డాక్టర్ ఎ.గాయత్రిదేవి, డాక్టర్ కోనేరు సత్యప్రసాద్, డాక్టర్ చింతా రవికుమార్లకు రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డులను అతిఽథులు అందజేశారు. రూట్స్ హెల్త్ సర్వీసెస్–2025 అవార్డుల ప్రదానం -
13న బెరంపార్క్లో పెయింటింగ్ పోటీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాటకులకు కొత్త అనుభూతులను అందించడానికి ఈ నెల 13వ తేదీ భవానీపురంలోని హరిత బెరంపార్క్లో ఫ్లోర్ పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆదివారం హరిత బెరంపార్క్లో జరిగిన యోగా కార్యక్రమంలో ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం పెయింటింగ్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. చిన్నారులకు డ్రాయింగ్ పోటీలుఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ 13వ తేదీ ఆదివారం ఉదయం 6.30 గంటలకు నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఫ్లోర్ పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047, పీ4 (ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం) విధానం, సే నో టు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్, స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర, సేవ్ వాటర్, రెడ్యూస్–రీయూజ్–రీసైకిల్, హరితాంధ్ర అంశాలపై పోటీలు ఉంటాయని వివరించారు. చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 70751 96840 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. సమయం కేటాయించాలి యోగా అనేది ఎవరి కోసమో కాదని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి దైనందిన జీవితంలో ప్రతి రోజూ కొంత సమయాన్ని కేటాయించాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఉదయాన్నే ముప్పావుగంట సమయాన్ని యోగాకు కేటాయిస్తే ఆ రోజు మనం చేసే ప్రతి పనిపై ఏకాగ్రత సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రత్న ప్రియదర్శిని, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ కృష్ణచైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ తరుణ్ కాకాని యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
మత్తు వదిలేలా జరిమానాలు!
లబ్బీపేట(విజయవాడతూర్పు): అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మద్యం సేవించి పట్టుబడితే మందుబాబుల జేబులు ఖాళీ అవుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు తనిఖీలతో పాటు, మద్యం తాగి వాహనాల నడిపిన వారిని గుర్తిస్తున్నారు. ఇటీవల పెద్ద సంఖ్యలో అలాంటి వారు పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఒకసారి జరిమానా కట్టిన వారు మళ్లీ మద్యం సేవించి రోడ్డు మీదకు రావడానికి భయపడేలా జరిమానాలు విధిస్తున్నారు. అంతేకాదు పోలీసుల తనిఖీల్లో ఎంత మోతాదులో మద్యం సేవించారో నిర్ధారణ అయిన దానిమేరకు జరిమానాలు విధిస్తున్నారు. ఒకే రోజు 280 మందికి జరిమానాలు నగరంలోని 1,3,5,6 ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 280 మంది మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా 100 ఎంఎల్ కంటే ఎక్కువ మద్యం సేవించిన 9 మందికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధించారు. మిగిలిన 271 మందికి రూ.10 వేలు చొప్పున జరిమానా వేశారు. ఇలా ఒకే రోజు రూ.28.45 లక్షలు జరిమానాలు విధించారు. ఈ నెల 3న కూడా 25 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిలో ఐదుగురికి రూ.15 వేలు చొప్పున, 20 మందికి రూ.10 వేలు జరిమానాలు విధించారు. ఇలా మద్యం సేవించి పట్టుబడిన వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్రమాదాల నివారణ కోసమే... మద్యం తాగి వాహనాలు నడుపుతుండటంతో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాహన చోదకులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే తమతో పాటు ఎదుటి వ్యక్తి ప్రాణాలకు సైతం ముప్పు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. దీంతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని నివారించే లక్ష్యంతోనే తనిఖీలు చేస్తున్నారు. వారి కదలికలపై నిఘా పోలీసుల తనిఖీల్లో భాగంగా అసాంఘీక శక్తులపై కూడా నిఘా పెంచుతున్నారు. రౌడీలు కేడీలు, బాడ్ ఎలిమెంట్స్ ఉన్న వారి ఫోటోలు, వేలి ముద్రలు , వివరాలు సేకరిస్తున్నారు. అలాంటి వారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వాహనాలపై తిరుగుతున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అలాంటి వారిని సైతం గుర్తిస్తున్నారు. అంతేకాకుండా సివిల్ పోలీసులు సైతం వారి కదలికలపై నిఘా ఉంచుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే రూ.10 వేలు ఫైన్ 100 ఎంఎల్ కంటే ఎక్కువ తాగితే రూ.15 వేలు జరిమానా శనివారం ఒక్కరోజే 280 మందికి రూ.28.45 లక్షలకు పైగా ఫైన్ అసాంఘిక శక్తులపై ప్రత్యేక దృష్టి అంటున్న సీపీఅసాంఘిక శక్తులపై ఉక్కుపాదంనగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపనున్నాం. అలాంటి వారిపై నిఘా ఏర్పాటు చేశాం. వారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలి. –ఎస్వీ రాజశేఖరబాబు, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్జిల్లా -
అన్ని కోణాల్లో నరసింహరాజు కేసు దర్యాప్తు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఆదిత్య ఫార్మసీ చైర్మన్ సాగి వెంకట నరసింహరాజు మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమా.. లేక ఇతర ఒత్తిళ్లు.. ఇతరత్రా ఇబ్బందులు ఇంకా ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదిత్య ఫార్మసీ చైర్మన్ నరసింహరాజు విజయవాడలో శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై నరసింహరాజు సతీమణి శాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకూ కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్, కాల్డేటా ఆధారంగా నరసింహరాజు రాసిన సూసైడ్ నోట్తో పాటు ఆయన కాల్డేటాను, నగరానికి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎవరెవరిని కలుసుకున్నారు, ఎవరెవరు ఆయన్ను బెదిరించి నొత్తిళ్లు తీసుకువచ్చారనే విషయాలను రాబడుతున్నారు. నరసింహరాజుకు అప్పులిచ్చిన వారిలో ఎవరు అతని ఇంటి మీదకు, ఆ కంపెనీల వద్దకు వచ్చి గొడవలు చేశారని విచారణ చేస్తున్నారు. నరసింహరాజు సూసైడ్ నోట్లో రాసిన.. ఆయన సతీమణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విజయవాడకు చెందిన ఆడిటర్ పిన్నమనేని పరంధామయ్య, వైజాగ్ ప్రాంతానికి చెందిన ఫార్మా కంపెనీకి చెందిన బుద్దరాజు శివాజీల పాత్ర ఏమిటి, వారు ఎవరెవరి ద్వారా వారిపై ఒత్తిళ్లు తీసుకువచ్చారు. వారికి సహకరించిన పెద్ద తలకాయలు ఎవరు.. వారిలో ప్రభుత్వ పెద్దల హస్తం ఏమైనా ఉందా.. లేక నేర చరిత్ర కలిగిన వారున్నారా.. అనే విషయాలను తెలుసుకుంటున్నారు. నరసింహరాజు కాల్ డేటా, ఇతర పూర్తి ఆధారాలు సేకరించిన తరువాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. సూసైడ్ నోట్లో రాసిన శివాజీ, పరంధామయ్య కోసం గాలింపు -
విదేశీ వైద్య విద్యార్థుల సమస్యను వారంలో పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసుకున్న వైద్య విద్యార్థుల సమస్యను వారంలోగా పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ డాక్టర్స్ వింగ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతున్న విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు నాగ రాధాకృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ వైద్య విద్య గ్రాడ్యుయేట్లకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఇంటర్న్షిప్, క్లర్క్షిప్ కాలాలను శాసీ్త్రయంగా పొడిగించాలని డాక్టర్ రాధాకృష్ణ అన్నారు. గాయపడిన ఎఫ్ఎంఏలను ఆయన పరామర్శించారు. మహిళా వైద్యులపై పోలీసుల క్రూరత్వాన్ని ఖండించారు. అంతకు ముందు విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర వైద్య విద్యార్థుల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వైద్య విద్యార్థులు 13 నెలలుగా శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాu8లో సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 20257నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. మత్తు వదిలేలా జరిమానాలు! విజయవాడలోని అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. శాకంబరిగా తిరుపతమ్మ పెనుగంచిప్రోలు: శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారు ఆదివారం శాకంబరీ దేవిగా కొలువుదీరారు. భక్తులు పెద్ద సంఖ్య లో దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు. -
ఎవరి జేబులోకెళ్లాయో!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామినర్స్కు రెమ్యూనరేషన్ నిధులు ఎటు వెళ్లాయో అంతుచిక్కడం లేదు. ఎందుకంటే ఇంటర్ బోర్డు అధికారులేమో రెమ్యూనరేషన్ ఇచ్చేశామని చెబుతుంటే ఎగ్జామినర్స్ అందలేదని స్పష్టం చేస్తున్నారు. ఇంటర్బోర్డు అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల తీరుతో అధ్యాపకులు అల్లాడుతున్నారు. గడిచిన రెండేళ్లుగా అధ్యాపకులకు బోర్డు నుంచి రావాల్సిన నిధులు పక్కదారి పట్టినట్లు ప్రచారం జరుగుతున్నా అధికారులెవరూ నోరు విప్పడం లేదు. వివరాల్లోకి వెళితే ఇంటర్మీడియెట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన రెమ్యూనరేషన్లను విధులు నిర్వహించిన అధ్యాపకులకు బిల్లుల చెల్లింపులో రెండేళ్లుగా అనేక అవకతవకలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐపీఈ (ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్) పరీక్షల్లోనూ, సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ప్రయోగ పరీక్షలు తప్పనిసరి. వీటిలో పాల్గొనే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఒకేషనల్ ఎగ్జామినర్లకు రెండేళ్లుగా రెమ్యూనరేషన్ బకాయి పెట్టారు. జిల్లాలో సుమారు 250 మంది ఎగ్జామినర్లు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి సుమారు రూ.7500 నుంచి రూ.15 వేల వరకు రావాల్సి ఉంది. నగరంలో ఎస్ఆర్ఆర్లో స్పాట్, ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఒప్పించి ప్రాక్టికల్స్ తంతు ముగించేశారు 2024 వృత్తి విద్యాకోర్సుల పరీక్షల బకాయిలు చెల్లిస్తేనే, 2025 సంవత్సరపు ప్రయోగ పరీక్షలు నిర్వహణకు సహకరిస్తామనీ, లేకపోతే బాయ్కాట్ చేస్తామని అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే విధులకు హాజరు కావాలని బోర్డు అధికారులు ఎలాగోలా ఒప్పించి ప్రాక్టికల్స్ తంతు ముగించేశారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా 2024కు సంబంధించి ఏ ఒక్క అధ్యాపకుడికి చెల్లించలేదని వారు చెబుతున్నారు. ఈ ఏడాది సైతం అరకొరగానే చెల్లింపులు జరిగాయని వివరిస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో ఉండే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంప్రదించి రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్లందరికీ న్యాయం చేయాలని విన్నవించినా స్పందన కరువైందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కదారి పట్టాయనే ఆరోపణలు రాష్ట్రంలో ఇలాంటి అధ్యాపకులు సుమారు 2500 నుంచి 3000 మంది వరకు ఉన్నారు. వీరికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు పెద్దస్థాయి ఉద్యోగులు పక్కదారి పట్టించారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ బోర్డు అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు తెర తీసిన విధానాలు ప్రస్తుత స్థితికి కారణమని తెలుస్తోంది. గతేడాది మూల్యాంకనం చేసిన అధ్యాపకుల రెమ్యూనరేషన్లు సైతం కొంతమందికి పూర్తిగా చెల్లించలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరికి నిధులలేమి కారణం చూపిస్తూ కోత విధించారని తెలిసింది. నిబంధనల మేరకు కేటాయించిన నిధులు ఏమయ్యాయని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. వృత్తివిద్యా కోర్సుల ఫీజులు గందరగోళం ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్న మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశ రుసుం విషయంలో ఇంటర్మీడియెట్ అధికారులు గందరగోళానికి అవకాశం ఇస్తున్నారు. కమిషనర్ ఆదేశాల ప్రకారం వృత్తివిద్యలో చేరిన విద్యార్థులు రెండురకాల లేబొరేటరీ ఫీజులను మాత్రమే చెల్లించాలి. కానీ గ్రూప్–డి ల్యాబ్ ఫీజు రూ.495 సైన్స్ విద్యార్థుల నుంచి మాత్రమే వసూలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు, ఒకేషనల్ విద్యార్థుల నుంచి కూడా ఆ మొత్తాన్ని కొంతమంది ప్రిన్సిపాళ్లు వసూలు చేస్తున్నారని సమాచారం. దీంతో ఒకేషనల్ అడ్మిషన్లపైనా వ్యతిరేక ప్రభావం చూపుతోందనీ అధ్యాపకులు వాపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం పుస్తకాలు, నోట్సులు, బ్యాగు, ఉచిత భోజనం అందిస్తూ ప్రవేశాలు పెరిగేందుకు కృషి చేస్తుంటే, పేద విద్యార్థులపై అదనపు ఫీజు భారం మోపడం అన్యాయమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులబాధ్యతారాహిత్యం ప్రాక్టికల్ ఎగ్జామినర్ల రెమ్యూనరేషన్బకాయిలపై అధ్యాపకుల ఆగ్రహం రెండేళ్లుగా రెమ్యూనరేషన్ఎగ్గొట్టడంపై తీవ్ర విమర్శలు పేద విద్యార్థుల అడ్మిషన్ ఫీజులూ అడ్డుగోలుగా వసూళ్లు వృత్తి విద్యా కోర్సుల మొదటి ఏడాది ఫీజులపై ఫిర్యాదు చేసినా స్పందన సున్నా సమాచారం కోరితే నిర్లక్ష్య సమాధానం ఒకేషనల్ కోర్సులో 2025–2026 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది వృత్తివిద్య గ్రూపులో చేరబోయే విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెల్లించవలసిన మొత్తం ఫీజు ఎంతో తెలియజేయగలరని ఆర్టీఐ చట్టం క్రింద భీమవరానికి చెందిన కె.శ్రీనివాసరావు సమాచారం కోరారు. గ్రూప్–డి ల్యాబ్ ఫీజు విషయంలోనూ స్పష్టమైన వివరాలు పంపాలనీ నివేదించారు. దీనికి సంబంధిత హోదాలో ఉన్న అధికారి సమాచారం ఇవ్వ కుండా తిరస్కరించారని తెలిసింది. దీనిపై దరఖాస్తుదారు మళ్లీ బోర్డుకు అప్పీలు చేశారు. దీనిపైనా స్పష్టత కరువైందని దరఖాస్తుదారుడు చెబుతున్నారు. -
బీమా.. రైతుకు భారం
కంకిపాడు: రైతు సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించింది. రైతులపై భారం మోపుతోంది. ప్రీమియం సొమ్ము చెల్లిస్తేనే పంటల బీమా వర్తించేలా మార్గదర్శకాలను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. కూటమి అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలపై కోట్లాది రూపాయల ప్రీమియం భారం పడుతోంది. మరోవైపు అన్నదాత సుఖీభవ ఎప్పుడు అందుతుందో తెలియక, సాగుకు పెట్టు బడుల కోసం రైతులు దిగులు చెందుతుంటే ప్రీమియం సొమ్ము చెల్లించాలంటూ అధికారులు తెస్తున్న ఒత్తిడి తలకు మించిన భారంగా మారిందంటూ ఆవేదన చెందుతున్నారు. 4.47 లక్షల ఎకరాల్లో సాగుభూమి కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో 4.47 ఎకరాల్లో (1.79 లక్షల హెక్టార్లు) సాగు భూమి ఉంది. వరి, చెరకు, పసుపు, పత్తి, వేరుశనగ, కూరగాయలు, కంద కూరగాయలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగు పనులకు ఉపక్రమించారు. జిల్లాలో వ్యవసాయ పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. పంటల బీమా నుంచి తప్పుకున్నకూటమి సర్కార్ కూటమి సర్కార్ పంటల బీమా నుంచి కూడా తప్పుకుంది. రైతు నెత్తిన భారాన్ని మోపి చోద్యం చూస్తోంది. కృష్ణా జిల్లాలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి, పసుపు పంటలను ఎంపిక చేశారు. జిల్లాలో 1.68 లక్షల హెక్టార్లు (4.21 లక్షల ఎకరాలు) సాగు జరుగుతోంది. వరిని గ్రామం యూనిట్ కింద ఎకరాకు రైతు వాటాగా రూ.830 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంది. పసుపు పంటకు జిల్లా యూనిట్గా బీమా వర్తింప జేయనున్నారు. జిల్లాలో 5,500 ఎకరాల్లో పసుపు సాగు జరగనుంది. దీనికి ఎకరానికి రూ.1100 ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. జిల్లాలో రైతులపై భారం ఈ రెండు పంటలకు వర్తింపజేయనున్న బీమాకు రైతులపై రూ 35.56 కోట్లు మేరకు భారం పడనుంది. వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు ఆగస్టు 15వ తేదీ కాగా, పసుపు పంటకు జులై 31 ఆఖరిగడువుగా నిర్దేశించారు. ఎప్పుడు అందుతుందో.. అప్పుడే రెండో ఏడాదిలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తోంది. అధికారులు ఓ వైపు అర్హుల జాబితాను రూపొందించే పనిలోనే ఉన్నారు. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ సొమ్ము ఎప్పటికి రైతు ఖాతాలకు చేరుతుందో తెలీని దిక్కుతోచని స్థితి. ఖరీఫ్ సాగుకు పెట్టుబడులు సమకూర్చుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే పంటల బీమా పొందేందుకు ప్రీమియం చెల్లించాల్సిందేనని సర్కారు తేల్చి చెప్పటం, ఉత్తర్వులు జారీ చేయటంపై అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా అందలేదు రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్న ప్రధాన హామీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాలన చేపట్టి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకూ రైతు సంక్షేమానికి బాటలు వేయలేదు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట మేరకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు అందించాల్సి ఉంది. తొలి ఏడాది జిల్లాలో రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. జిల్లా పంట బీమా బీమా రైతు ప్రీమియం నమోదు యూనిట్ మొత్తం (రూ) ఎకరాకు గడువు కృష్ణా వరి గ్రామం 41,500 830 15.8.25 కృష్ణా పసుపు జిల్లా 1,10,000 1100 31.7.25 ఉచిత పంటల బీమాకు తిలోదకాలు ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ప్రీమియం చెల్లించాలి కృష్ణా జిల్లాలో వరి, పసుపు పంటలకు బీమా జిల్లా రైతులపై రూ.35.56 కోట్ల భారం కృష్ణాజిల్లాలో సాగు విస్తీర్ణం : 1.79 లక్షల హెక్టార్లు పసుపు సాగు : 2,200 హెక్టార్లు వరి సాగు : 1.68 లక్షల హెక్టార్లు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజననాడు వైఎస్సార్ సీపీ హయాంలో ఉచిత బీమా ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ప్రధాన మంత్రి ఫసల్ బీమా అమలుకు పాలకులు చర్యలు తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడులకు నష్టం వాటిల్లితే రైతులకు ఆర్థిక సాయం అందించడం, వాతావరణ అంశాల ఆధారంగా సంభవించిన నష్టంతో దిగుబడులు తగ్గితే బీమా పరిహారం చెల్లించడం ప్రధాన మంత్రి ఫసల్ బీమా ఉద్దేశం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ బీమాను ప్రభుత్వమే భరించింది. ఉచితంగా వైఎస్సార్ పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంది. -
అల్లూరి పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ స్ఫూర్తి దాయకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. అల్లూరి 128వ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్యం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా బ్రిటీషు వారిపై ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎప్పటికీ చిర స్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తి మార్గంలో పయనిస్తూ.. భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అన్నారు. 27 ఏళ్ల వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యాన్ని ఢీకొని వీర మరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎస్. శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి డి.ఎంఎఫ్ విజయకుమారి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్.వి.మోహన్రావు, డివిజనల్ పీఆర్వో కె. రవి, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ జి.లక్ష్మీశ -
ఇంటింటికీ తెలియజేయండి
చంద్రబాబు మోసాలను వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డిమొగల్రాజపురం (విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన మోసాలను వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి తెలియజేయాలని ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డి అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని మారుతీనగర్ రామాలయం వీధిలోని లయన్స్ భవన్లో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరించే కార్యక్రమం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథి వేణుగోపాల్రెడ్డి క్యూ ఆర్ కోడ్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సూపర్సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పట్టించుకోవడం లేదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచాడని.. సూపర్సిక్స్ పథకాలను నమ్మి ఓట్లు వేసిన ఓటర్లు మాత్రం ఓడిపోయారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆయన విలువ రాష్ట్ర ప్రజలకు తెలిసిందన్నారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మాటలు నమ్మి తాము మోసపోయామని కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని టీడీపీ నాయకులే చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ నాయకుల ఫోన్లను కూడా అధికారులు, పోలీసులు లిఫ్ట్ చేసేవారు కాదని చెప్పారు. మార్పు కనిపిస్తోందివైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలు, పరామర్శలకు వస్తున్న ప్రజాధరణను చూసి అధికారుల్లో సైతం మార్పు కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నాయకులు ఫోన్లకు స్పందించడమే కాకుండా గౌరవంగా మాట్లాడుతున్నారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటూ ప్రజలు ఒత్తిడి చేస్తుండటంతో రానున్న రోజుల్లో కూటమిలోని నాయకులు బయట తిరగలేని పరిస్థితులు వస్తాయన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింతగా ప్రచారం చేయాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వారితో నేతలు, కార్యకర్తలు మాట్లాడాలన్నారు. విజయవాడను నిర్లక్ష్యం చేస్తే సహించం.. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ తాము అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్థి పేరుతో విజయవాడను నిర్లక్ష్యం చేస్తే సహించబోమన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో నగరాభివృద్ధివైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రూ.600 కోట్లతో నగరాభివృద్ధి చేశామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల కంటే తాము అధికారంలోకి వస్తే మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కలిసి బాండ్లు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇలా ఏ పథకాన్నీ అమలు చేయలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధినే తాను చేశానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీని వదిలి వెళ్లిన నాయకులంతా మళ్లీ వచ్చి పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని అవినాష్ పేర్కొన్నారు. కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, నాయకులు కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు అడపా శేషు, పుప్పాల కుమారి, రామిరెడ్డి, అంబేడ్కర్, అమర్నాథ్, నిర్మలాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలపరిష్కారానికి కృషి
కోనేరుసెంటర్: సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కృష్ణా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఆయన పోలీసు దర్బార్ నిర్వహించారు. దీనిలో ఎస్పీ సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసువృత్తి కత్తిమీద సాములాటిదన్నారు. అలాంటి వృత్తిలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో మెలగాల్సి ఉంటుందన్నారు. యూనిఫామ్ మన ఐడెంటిటీని తెలియజేస్తుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ప్రధానమైందన్నారు. సివిల్ పోలీసులతో పాటు ఏఆర్ సిబ్బంది విశిష్టమైన సేవలను అందిస్తున్నారన్నారు. మీతో పాటు హోంగార్డులు సైతం పోలీసుశాఖకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సిబ్బంది సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. సిబ్బంది ఉద్యోగంతో పాటు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు దర్బారులో సిబ్బంది అనేక సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఇతర సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. కృష్ణా ఎస్పీ గంగాధరరావు -
వయస్సు 24.. చోరీలు 24
మధురానగర్(విజయవాడసెంట్రల్): నాలుగు నెలలో 12 చోరీలు చేసిన నిందితుడు ఉయ్యాల రాజేష్(24)ను గుణదల పోలీసులు అరెస్టు చేసి రూ. 6లక్షలు విలువ చేసే 60గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ డి. దామోదరరావు తెలిపారు. స్థానిక గుణదల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అలా దొరికాడు.. గుణదల మురళీనగర్ కట్టమీద ఇటీవల చోరీ జరిగింది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుణదల పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనుమానితులు, నేరస్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందానికి అందిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక యువకుడు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. జల్సాలకు అలవాటు పడి.. విచారణలో నిందితుడు అజిత్సింగ్నగర్కు చెందిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్(24)గా గుర్తించామని ఏసీపీ చెప్పారు. జల్సాలకు అలవాటు పడిన రాజేష్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడ్డాడన్నారు. ఈ క్రమంలో రాజేష్పై అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్లో క్రైమ్ సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేశామని చెప్పారు. 2024 సెప్టెంబర్లో దొంగతనం కేసులో గుణదల పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించామని తెలిపారు. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన రాజేష్ నేర ప్రవృత్తి మార్చుకోకుండా చోరీలకు పాల్పడ్డాడని.. నాలుగు నెలల వ్యవధిలో 12 దొంగతనాలు చేశాడని వివరించారు. సాంకేతిక ఆధారాలు ఆధారంగా.. సాంకేతిక పరిజ్ఞానం, చోరీ జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు పరిశీలించి పాత నేరస్తులతో పరిశీలించగా రాజేష్ను నిందితుడుగా గుర్తించామని ఏసీపీ చెప్పారు జరిగిందన్నారు. రాజేష్పై ఇప్పటికే పలు పోలీస్స్టేషన్లలో 12 కేసులు ఉన్నాయన్నారు. గుణదల పోలీస్స్టేషన్ పరిధితో పాటు పటమట, రాజోలు, నూజివీడు, నర్సాపురం, నాయుడుపేట పోలీస్స్టేషన్ పరిధిలో రాజేష్ చోరీలు చేశాడని వివరించారు. నేరస్తుడుని అరెస్టు చేయటంతో పాటు అతని వద్ద నుంచి రూ.6లక్షలు విలువచేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. నాలుగు నెలల్లో 12 దొంగతనాలు ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు రూ. 6లక్షలు విలువైన ఆభరణాలు స్వాధీనం -
అగార్ ఉడ్ మొక్కల సాగుతో అధిక లాభాలు
త్రిపుర ప్రభుత్వ ఎన్టీఎఫ్పీ డైరెక్టర్ ప్రసాదరావు లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రపంచంలోనే అత్యంత విలువైన చెట్టు అగార్ ఉడ్ అని, దీని సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని త్రిపుర ప్రభుత్వ ఎన్టీఎఫ్పీ డైరెక్టర్, ఐఎఫ్ఎస్ అధికారి ప్రసాదరావు అన్నారు. విజయవాడ ఎంజీరోడ్డులోని ఓ హోటల్లో గురువారం మందిర డెవలపర్స్ ఆధ్వర్యంలో అగార్ ఉడ్పై వ్యవసాయ పెట్టుబడితో అధిక లాభాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రసాదరావు మాట్లాడుతూ అగార్ ఉడ్ ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం, మెడిసిన్, సౌందర్య సాధనాలలో విరివిగా వాడుతున్నట్లు తెలిపారు. ఈశాన్య దేశాలలో పెరిగే అగార్ ఉడ్ మొక్కలను గత 10 నుంచి 15 ఏళ్లుగా కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విరివిగా సాగు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమ్మకాలు ఎగుమతులు అన్ని క్లియరెన్సులు అందిస్తూ కొన్ని రూ. వేల కోట్లు బిజినెస్ను అంచనా వేస్తూ అగార్ ఉడ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మందిర డెవలపర్స్ చైర్మన్ జీవీ శేషగిరి తదితరులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీ
గన్నవరం: స్థానిక సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ చోరీ జరిగిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి దొంగలు కార్యాలయంలోకి చొరబడి సుమారు రూ. 13.56లక్షల విలువైన నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు, తోక బిళ్లలను అపహరించుకుపోయారు. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక చింతలపేటలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే అధికా రులు, సిబ్బంది బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. తిరిగి గురువారం విధులకు హాజరైన సిబ్బంది కార్యాలయ తలుపు గొళ్లెం పగులకొట్టి ఉండడం గమనించి సబ్ రిజిస్ట్రార్ వీవీవీ ప్రసాద్కు సమాచారం ఇచ్చారు. దీంతో కార్యాలయానికి చేరుకున్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డు రూమ్ తలుపులు తీసి ఉండి స్టాంపులు భద్రపరిచిన బీరువా పగులకొట్టి ఉండడటాన్ని గుర్తించారు. ఆధారాల సేకరణ.. సబ్రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కార్యాలయాన్ని పరిశీలించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ దొంగల వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ రవీంద్రనాథ్, జిల్లా రిజిస్ట్రార్ మూర్తి, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ బీవీ శివప్రసాద్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులు, సిబ్బంది నుంచి చోరీ ఘటనపై వివరాలు సేకరించారు. సీసీఎస్ సీఐ గోవిందరాజు నేతృత్వంలోని బృందం కార్యాలయ పరిసరాల్లోని సీసీ ఫుటేజ్లను సేకరించి దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై సబ్రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవి మిస్సింగ్.. సుమారు రూ.13,56,300 విలువైన రూ. 50 నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు 3,600, రూ.100 ధర కలిగిన నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు 3,600, తోక బిళ్లలు రూ.50 ధర కలిగినవి 12,500, రూ.100 ఖరీదు కలిగినవి 4,609 చోరీకి గురైనట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉండడం పట్ల ఆఫీస్లో పనిచేసే ప్రైవేట్ సిబ్బంది వ్యవహరశైలిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. ఈ చోరీ ఘటన వల్ల గురువారం స్థానిక సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. చోరీకి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరణ, విచారణ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయినట్లు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ తెలిపారు. తిరిగి శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రూ.13.56లక్షల విలువైన స్టాంప్లు అపహరణ గన్నవరంలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు -
మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో మునిసిపల్ ఇంజినీరింగ్(వాటర్, పార్కు, వెహికల్ డిపో మెకానిక్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్) కార్మికులు వినూత్న ప్రదర్శన చేపట్టారు. అర్ధనగ్నంగా మొలలకు వేప కొమ్మలు కట్టుకుని నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి నినాదాలు చేశారు. జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ప్రభుత్వంలో కదలిక.. మున్సిపల్ యూనియన్ నగర గౌరవాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మెతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేయకుండా జీతాలు పెంచే విధంగా వెంటనే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికులతో విజయవాడ ధర్నా చౌక్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు జ్యోతిబసు, నగర కోశాధికారి స్టీఫెన్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజలకు ఉరితాడుగా మారిన 120 జీఓను రద్దు చేయాలని, పర్యావరణంతో పాటు స్థానికుల జీవనోపాధిని కాపాడాలని రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు అధ్యక్షతన గురువారం కొల్లేరు ప్రజల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వారు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని విమర్శించారు. కొల్లేరు ప్రజలకు హానికరమైన ఎకో సెన్సిటివ్ జోన్ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కొల్లేరు ప్రజలకు సీపీఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు సంఘం సీనియర్ నాయకుడు వై. కేశవరావు మాట్లాడుతూ.. మూడో కాంటూరు నుంచి ఐదో కాంటూరు వరకు పది కిలోమీటర్ల దూరంలో సున్నితమైన పర్యావరణ ప్రాంతం పేరుతో 26 నిబంధనలు విధించి మొత్తం కొల్లేరును పూర్తిగా అటవీ శాఖ చేతుల్లో పెట్టబోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీని ప్రభావం ఏలూరు జిల్లాలోని నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, ఏలూరు, పెదపాడు, మండవల్లి, కై కలూరు, ఆకివీడు మండలాల్లోని కొల్లేటి ప్రాంతంలోని 89 గ్రామాలపై పడుతుందన్నారు. అధికారులు తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయాలను సేకరించి నివేదికలు పంపించడం దారుణమన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. కొల్లేరు ప్రజలకు ఉరితాడుగా మారిన జీఓ 120ను రద్దు చేయాలి రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ -
నిద్రలేమికి అనేక కారణాలు
నేటి యువత ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతోంది. నిద్రలేమికి అనేక కారణాలున్నాయి. వాటిలో రోజూ ఒకే సమయానికి పడుకోకపోవడం, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎక్కువగా టీవీలు, స్మార్ట్ఫోన్లు చూడటం, ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో పడుకోవడం, నిద్రలో గురక రావడం, నైట్స్లీప్ డిజార్డర్, రక్తహీనత వంటి కారణాలు ఉన్నాయి. నిద్రలేమి ఉన్న వారికి స్లీప్ ల్యాబ్లో స్టడీ చేస్తాం. ఆక్సిజన్ శాచురేషన్, బ్రెయిన్ యాక్టివిటీ, బాడీ యాక్టివిటీ, ఏ సైకిల్లో ఉన్నారో తెలుసుకుంటాం. నిద్రలేమికి కారణాలను అంచనా వేసి అవసరమైన వైద్యం చేయడం, సూచనలు ఇవ్వడమో చేస్తుంటాం. వైద్యుల సూచన లేకుండా నిద్రమాత్రలు వాడటం సరికాదు. – డి.అనీల్కుమార్, న్యూరాలజిస్ట్ -
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు
ఈగల్ టీం ఐజీ రవికృష్ణ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ టీం ఐజీ ఆరే రవికృష్ణ తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈగల్ టీం సభ్యులు, పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా గురువారం విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై కోరమండల్ ఎక్స్ప్రెస్లో తనిఖీలు నిర్వహిస్తుండగా బిహార్ నుంచి చైన్నెకు గంజాయి చాక్లెట్లను తీసుకువెళ్తన్న వ్యక్తిని గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఈ సందర్బంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నా మని తెలిపారు. గంజాయి కేసులకు సంబంధించి 80 శాతం ఒడిశా నుంచే ఇతర ప్రాంతాలకు రైళ్లలో సరఫరా అవుతున్నట్లు గుర్తించామని, దీనిని అరికట్టేందుకు అన్ని రైల్వేస్టేషన్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ సహకారంతో ఈగల్ టీంలు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాయని వివరించారు. డ్రోన్లు, శాటిటైట్ టెక్నాలజీని ఉపయోగించి అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను వదిలే ప్రసక్తే లేదని, వారి ఆస్తులను అటాచ్ చేస్తామని తెలిపారు. భవిష్యత్లో కూడా గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ఇటువంటి తనిఖీలు ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సరిత, రైల్వే సీనియర్ డీఎస్సీ షణ్ముగ వడివేల్, జీఆరీపీ డీఎస్పీ రత్నరాజు, సీఐలు జి.వి.రమణ, దుర్గారావు, ఆర్పీఎఫ్ సీఐ పతే అలీబేగ్ తదితరులు పాల్గొన్నారు. -
మేళతాళాలతో దుర్గమ్మకు సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మేళతాళాలు.. మంగళ వాద్యాలతో భక్తులు దుర్గమ్మ కొండకు తరలివస్తున్నారు. సకుటుంబ సమేతంగా అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి సారె సమర్పించేందుకు తరలివచ్చిన భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకుంది. గురువారం సుమారు 40కి పైగా భక్త బృందాలు, 1200 మందికి పైగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. సారెను సమర్పించేందుకు విచ్చేస్తున్న భక్త బృందాలు, భక్తులకు దేవస్థానం సకల సదుపాయాలను కల్పిస్తోంది. ప్రధాన ఆలయంలో మూలవిరాట్ను దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి భక్తులు సారె సమర్పిస్తున్నారు. మహామండపం ఆరు, ఏడు అంతస్తుల్లో అమ్మవారికి సమర్పించిన పసుపు, కుంకుమ, గాజులు, చలి మిడి, మిఠాయిలను మహిళలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సారె సమర్పించిన భక్తులు అమ్మవారి అన్న ప్రసాదాలతో పాటు ఉచిత ప్రసాదాలను దేవస్థానం అందించింది. 10వ తేదీ వరకు అంతరాలయ దర్శనం రద్దు? ఆషాఢం సారె, వారాంతం, శాకంబరీదేవి ఉత్స వాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు ఆలయ ఈఓ శీనానాయక్ పేర్కొన్నారు. ప్రస్తుతం రోజూ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలను ఈఓ నిలిపివేశారు. తాజాగా పదో తేదీ వరకు అంతరాలయ దర్శనం రద్దు చేయాలనే ఆలోచన చేయడం గమనార్హం. -
నిద్రలేమి.. పట్టదేమి?
లబ్బీపేట(విజయవాడతూర్పు): శరీరానికి శక్తి కోసం ఆహారం ఎంత అవసరమో, మెదడుకు నిద్ర అంత ముఖ్యం. మెదడు సక్రమంగా పనిచేయా లంటే రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. నేటి యువతలో ఎక్కువ మంది నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. విద్యార్థులతో పాటు, యువ ఉద్యోగులు సైతం అర్ధరాత్రి 12 గంటలు దాటే వరకూ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లతో కాలక్షేపం చేస్తున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి విధి నిర్వహణలో నిమగ్నమవుతున్నారు. నిద్రలేమి సమస్య ఉన్న ఉద్యోగులు విధినిర్వహణపై దృష్టి పెట్టలేకపోతున్నారు. చదివిన అంశాలు గుర్తుండక విద్యార్థులు సతమతమవుతున్నారు. అంతేకాదు వారు పలు శారీరక, మానసిక రుగ్మతలకు గురవు తున్నారని ఇటీవలి అధ్యయనాల్లో వెల్లడైంది. మంచి నిద్రపోవాలంటే.. ● మనిషి శరీర తత్వాన్ని బట్టి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ● రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకేసమయానికి నిద్రలేవడం చేయాలి. ● ఒకేసారి ఏకకాలంలో నిద్రపోవాలి. నాలుగు గంటలకు ఒకసారి, రెండు గంటలు మరోసారి కాదు. ● మంచి నిద్రకోసం బెడ్రూమ్ను చీకటిగా ఉంచుకోవడంతో పాటు, శబ్దాలు లేకుండా చూసుకోవాలి. ● నిద్రలోనే మెదడులోని వ్యర్థాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ● విద్యార్థులకు సరిగా నిద్రలేక పోతే, రాత్రి చదివినవి ఉదయానికి గుర్తుండవు. ప్రస్తుతం మిడ్నైట్ కల్చర్ బాగా పెరిగింది. అర్ధరాత్రి వరకూ రోడ్లమీదే ఎక్కువ మంది గడిపేస్తున్నారు. యువతీయువకులు స్మార్ట్ఫోన్లతో అర్ధరాత్రి దాటే వరకూ కాలక్షేపం చేస్తున్నారు. ఫలితంగా తీవ్ర నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నిద్రలేమి అనేక ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్న మిడ్నైట్ కల్చర్ అర్ధరాత్రి దాటే వరకూ స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం ఫలితంగా మానసిక, శారీరక సమస్యల దాడి అప్రమత్తం కాకుంటే దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం రాత్రివేళల్లో స్మార్ట్ఫోన్లు ఎక్కువ సేపు చూసే వారిలో కంటి లోని మెలకొనిన్ అనే పదార్థం కరిగిపోతుంది. అలాంటి వారికి నిద్రపట్టదు. క్రమేణా నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం ఉంది. నిద్రలేమికి గురయ్యే వారిలో కోపం, చిరాకు పెరిగిపోతాయి. నిస్సత్తువ ఆవహించి, తెల్లారి లేచిన తర్వాత పనిపై దృష్టి పెట్టలేరు. వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతారు. పగలు చదివిన అంశాలు మెదడులో నిక్షిప్తం కావాలంటే సరైన నిద్ర అవసరం. నిద్రలేమి సమస్య ఉన్న వారిలో చదివిన అంశాలు గుర్తుండని పరిస్థితి నెలకొంటోంది. ఒబెసిటీ ఉన్న వారు గురకతో రాత్రి వేళల్లో తరచూ తుళ్లిపడి లేస్తుంటారు. శ్వాసనాళాలు మూసుకుపోవడంతో గురకతో పాటు, ఒక్కోసారి గుండెపోటు, మెదడుపోటుకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి వారి ఆరోగ్య పరిస్థితిని స్లీప్ ల్యాబ్లో అధ్యయనం చేస్తారు. ప్రతి ఒక్కరికీ నాన్ రాపిడ్ ఐ మూమెంట్ (ఎన్ఆర్ఈఎం), రాపిడ్ ఐ మూమెంట్(ఆర్ ఈఐ) అనే రెండు రకాల నిద్ర ఉంటుంది. ఇది గంటన్నరకు ఒకసారి సైకిల్ మారుతుం టుంది. కొందరికి రెండూ కలిసి పోవడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో నిద్రలోనే లేచి నడవడం వంటివి చేస్తుంటారు. -
బీభత్సం సృష్టించిన లారీ
● ఆర్టీసీ బస్సును ఢీకొని దూసుకెళ్లిన లారీ ● డివైడర్ దాటి మరో లారీని ఢీకొన్న వైనం ● నుజ్జునుజ్జయిన రెండు లారీల క్యాబిన్లు ● క్యాబిన్లలో ఇరుక్కుపోయిన డ్రైవర్లు, క్లీనర్లు ● తీవ్ర గాయాలపాలైన డ్రైవర్లు, క్లీనర్లు కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక జాతీయ రహదారిపై సత్యంగారి హోటల్ జంక్షన్ వద్ద బుధవారం వేకువ జామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని ఆ తరువాత డివైడర్ను దాటి రెండో వైపు ప్రయాణిస్తున్న మరో లారీని ఎదురుగా బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు క్యాబిన్లలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. వినుకొండకు చెందిన బొమ్మిడి నాగార్జున, తాడేపల్లిగూడెంనకు చెందిన ఆరిమెల్లి వెంకటేష్ లారీ డ్రైవర్లుగా జీవిస్తున్నారు. మంగళవారం రాత్రి నాగార్జున పది టైర్ల లారీలో సన్ఫ్లవర్ ఆయిల్ లోడ్చేసుకుని క్లీనర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి కాకినాడ నుంచి గొల్లపూడి బయలుదేరాడు. వెంకటేష్ మరో లారీలో స్టీల్ సామగ్రి లోడ్ చేసుకుని క్లీనర్ గల్ల వంశీకృష్ణతో కలిసి విజయవాడ నుంచి తణుకు బయలుదేరాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జాము ఆరుగంటల సమయంలో కృష్ణలంకలోని సత్యంగారి హోటల్ జంక్షన్ వద్దకు రాగానే సన్ఫ్లవర్ ఆయిల్ లోడ్తో మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు వైపు మంగళగిరి నుంచి బస్టాండ్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ తరువాత డివైడర్ పై నుంచి అవతలి వైపునకు దూసుకెళ్లి స్టీల్ సమగ్రితో తణుకు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఏం జరిగిందోనని ఘటనా స్థలానికి పరుగులు పెట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, క్రేన్ సాయంతో డ్రైవర్లు, క్లీనర్లను బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ప్రభుత్వా స్పత్రికి తరలించారు. లారీ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు వెనుక వైపు అద్దం పగిలిపోయింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సీఐ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది హైవే మీద అడ్డంగా ఉన్న రెండు లారీలను క్రేన్ సాయంతో తొలగించారు. ఆర్టీసీ డ్రైవర్ ఎం.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వైభవంగా సారె సంబరం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు ఆషాఢ మాస సారెను తమ సంప్రదాయాల మేరకు సమర్పిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బుధవారం అమ్మవారికి సారె సమర్పించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ప్రారంభమైన సారె సంబరం సాయంత్రం వరకు కొనసాగింది. మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్త బృందాలకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా భక్త బృందాలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారి దర్శనం అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి భక్తులు సారె సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో తమ తోటి భక్త బృందాలకు, భక్తులకు సారెను ప్రసాదంగా పంపిణీ చేశారు. బుధవారం 30కి పైగా భక్త బృందాలు, 500 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని చాటాలి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పి, భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్లో జరుగుతున్న పనులను పర్యాటక, మునిసిపల్ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. కళాత్మక సౌందర్యం ఉట్టిపడేలా వేసిన మ్యూరల్ పెయింటింగ్స్ను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఎక్స్పీరియన్స్ సెంటర్లో మిగిలిన పనులు త్వరితగతిన పూర్తిచేసి వీలైనంత త్వరగా పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. భవనం చుట్టూ ఫెన్సింగ్ పనులను పూర్తిచేయాలన్నారు. చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని, శతాబ్దాల చారిత్రక నేపథ్యం కలిగిన కొండపల్లి బొమ్మల విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎ.శిల్ప, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తన, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఎన్సీసీ రెజిమెంట్ను సందర్శించిన డీడీజీ
గన్నవరం: స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల ఆవరణలోని 3(ఏ) ఆర్అండ్వీ ఎన్సీసీ రెజిమెంట్ యూనిట్ను ఆంధ్ర, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ ఎయిర్ కమోడోర్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ నరసింగ్ సైలాని బుధవారం సందర్శించారు. తొలుత కాకినాడలోని ఎన్సీసీ హెడ్క్వార్టర్స్కు చెందిన గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్మోహన్ అగర్వాల్తో పాటు వచ్చిన డీడీజీ ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. రెజిమెంట్లో జరుగుతున్న హార్స్ రైడింగ్ శిక్షణ, ఇతర కార్యకలాపాల గురించి డీడీజీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్ల హార్స్ షోను స్వయంగా తిలకించారు. ఎన్సీసీ క్యాడెట్లు చేసిన హార్స్ రైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు డీడీజీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం డీడీజీ నరసింగ్ సైలాని మాట్లాడుతూ.. ఎన్సీసీ శిక్షణ విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు. దేశ రక్షణకు అవసరమైన ఉన్నతమైన నైపుణ్యాలు కలిగిన క్యాడెట్లను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక రెజిమెంట్ యూనిట్ అభివృద్ధిలో ఆధునికీకరణ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. కల్నల్ సి.కె.నాయక్, ఎయిర్ వింగ్ కమాండర్ అజిత్ రాఠి, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.వి.ఎస్.కిషోర్, యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ తీర్థప్రసాద్, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ డాక్టర్ ఎల్.జయబాల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ వింగ్ పరిశీలన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఎన్సీసీ ఎయిర్ వింగ్ను డీడీజీ నరసింగ్ సైలాని పరిశీలించారు. ఎన్సీసీ క్యాడెట్లకు అందిస్తున్న పైలెట్ శిక్షణ, ట్రైనింగ్ విమానాల పని తీరును పర్యవేక్షించారు. -
ఆలయాలపై జరిగిన దాడులపై విచారణ చేపట్టాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హిందూ ఆలయాలపై గతంలో జరిగిన దాడులపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులు, కూల్చివేతకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో జాతీయ హిందూ ధార్మిక సదస్సు–2025 బుధవారం జరిగింది. ఈ సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి సాధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సు పాల్గొన్న మాధవ్ మాట్లాడుతూ.. దేవాలయాల ద్వారానే మన దేశ నిర్మాణం, సామాజిక వ్యవస్థల ప్రతిష్ట జరిగాయన్నారు. దేవాలయాలు, గోవులను సంరక్షిస్తే మన ధర్మం నిలుస్తుందన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ మాట్లాడుతూ.. తిరుపతి, తిరుమల క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా గుర్తించాలని కోరారు. తిరుమల, తిరుపతిలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలని కోరారు. దేవాలయ భూములు, ఆస్తులను ఆన్లైన్ చేయాలని కోరారు. ఈ సదస్సులో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సంఘటనా కార్యదర్శి రవి కుమార్, సాధుపరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణ రావు, గజల్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు నాగోతు రమేష్ నాయుడు, అడ్డూరి శ్రీ రాం, మిట్టా వంశీ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రోజూ యోగ సాధన చేయడం ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసికంగా ప్రశాంతత చేకూరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. వ్యతిరేక ఆలోచనలు దూరమవుతాయని తెలిపారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 రోజుల పాటు నిర్వహించిన యోగా ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని అసోసియేషన్ హాలులో బుధవారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ హాజరై యోగ సాధన చేసిన వారికి సర్టి ఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. యోగాంధ్ర కార్యక్రమం జిల్లాలో విజయవంతం కావడంలో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ పాత్ర ఉందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఆరు వేల మంది యోగా గురువులతో తొమ్మిది లక్షల మందికి యోగాను చేరువ చేశామని తెలిపారు. యోగాను వ్యాయామంగా కాకుండా జీవితంలో ఒక భాగంగా చూడాలన్నారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మిరియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. యువత చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే యోగ సాధన చేయాలన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దాసరి కాశీ విశ్వనాథ్, కార్యదర్శి పి.వి.రమణ, కోశాధికారి ఎ.లావణ్యకుమార్, రిటైర్డ్ డీసీపీ హరికృష్ణ, యోగా గురువు అంకాల సత్యనారాయణతో పాటుగా యోగ సాధకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సభ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ యోగ సాధకులతో కలిసి యోగాసనాలు, ప్రాణా యామం చేశారు. యోగా గురువు అంకాల సత్యనారాయణను కలెక్టర్ లక్షీశ తోపాటుగా అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. -
నిలబడదాం.. నిలదీద్దాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకు వచ్చేలా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ సీపీ రీజనల్ ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల ముందు బాబు, పవన్లు బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రజలు నిలదీసేలా ఇంటింటికీ వెళ్లి వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నియోజకవర్గ ఇన్చార్జిలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం బుధవారం విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ పేరుతో రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. అనంతరం దానిని స్కాన్ చేసి ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్సిక్స్ హామీలు, ఇంటింటికీ ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియజేస్తూ ఇచ్చిన బాండ్ల గురించి వివరించారు. ఎన్ని హామీలు ఇచ్చారు.. ఎన్ని అమలు చేశారనే విషయాలను ప్రతి ఇంటికీ వెళ్లి ఎలా అవగాహన కలిగించాలని పార్టీ ప్రతినిధులకు వివరించారు. కక్షే లక్ష్యం.. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా సంక్షేమ పథకాల అమలును విస్మరించి వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు. వాళ్లు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేస్తామన్నారు. ప్రతి గ్రామం, పట్ణణం, మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబును ఎవరూ నమ్మరని.. బాండ్లు ఇచ్చి మరీ నమ్మించారని, కానీ ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. వాటిపై ప్రజలు నిలదీసేలా చైతన్యం తీసుకు వద్దామన్నారు. ● మాజీ మంత్రి, పార్టీ మైలవరం ఇన్చార్జి జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాలతో గద్దెను ఎక్కారన్నారు. పార్టీ నాయకులందరం ప్రజలకు అండగా నిలుద్దామన్నారు. మాట ఇస్తే తప్పే కుటుంబం కాదని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. ● మాజీ మంత్రి, పార్టీ విజయవాడ పశ్చిమ ఇన్చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది కాలంగా ప్రజలకు చేసిందేమి లేదన్నారు. వైఎస్ జగన్ ఒక్క పిలుపు ఇస్తే లక్షలాదిగా ప్రజలు వస్తున్నారన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ● మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ ఇన్చార్జి మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో అబద్దాల పుట్ట అన్నారు. జగన్ సుపరిపాలన, చంద్రబాబు మోసపు పాలన గురించి ప్రజలకు తెలియజేద్దామన్నారు. ● మాజీ ఎమ్మెల్యే, పార్టీ పామర్రు ఇన్చార్జి కై లే అనిల్కుమార్ మాట్లాడుతూ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన..కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసం అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండి న వారికి నెలకు రూ.1500 ఇలా అనేక హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఇంటింటికీ ఇచ్చిన బాండ్లపై ప్రశ్నించేలా చైతన్యం తీసుకురావాలి ఆగస్టు 4 వరకూ గ్రామస్థాయిలో కార్యక్రమం వైఎస్సార్ సీపీ రీజనల్ ఇన్చార్జి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయవాడలో వైఎస్సార్ సీపీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం చంద్రబాబు అంటే మోసం.. చంద్రబాబు అంటే మోసం గ్యారంటీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా పార్టీ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. జగన్ నాయకత్వంలో మనమంతా మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. -
తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలలు
పటమట(విజయవాడతూర్పు): చదువుకోవటం ఇష్టంలేక హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు చిన్నారులను బుధవారం పటమట పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల మేరకు హైదరాబాద్కు చెందిన 8వ తరగతి చదివే కందుకూరి సూర్యప్రకాష్(13), కర్నూలు జిల్లా నందికొట్కూరు, మారుతీనగర్కు చెందిన 9వ తరగతి చదివే కత్తిపోగు రాజ్ కుమార్(15) కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండ లం, ఏకమూరు గ్రామంలోని రెహబత్ వలంటరీ హాస్టల్లో ఉంటూ స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకుంటున్నారు. వీరిద్దరూ బుధవారం ఉదయం 7.30గంటలకు హాస్టల్లో చెప్పకుండా బయటకు వచ్చారు. దీనిపై సదరు హాస్టల్ వార్డె న్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశా రు. బాలురు ఇరువురూ బుధవారం పట మట ఆటోనగర్లో సంచరిస్తున్నారని, పంటకాల్వ రోడ్డులో ఉన్నారని స్టేషన్కు సమాచారం రావటంతో అక్కడికి వెళ్లిన పటమట సీఐ పవన్కిషోర్ బాలురును విచారించగా విషయం తెలిసింది. దీంతో వెంటనే సంబంధిత హాస్టల్కు, తల్లిదండ్రులకు సమాచారం అందించి అప్పగించారు. 17 క్రషర్లు సీజ్కంచికచర్ల: మండలంలోని పరిటాల, దొనబండ క్వారీలు, క్రషర్లను మైనింగ్, పర్యావరణ, ఇరిగేషన్శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు విరుద్ధంగా క్రషర్లు నడుపుతున్నారని గుర్తించి 17 క్రషర్లను తాత్కాలికంగా సీజ్ చేశారు. రెండు రోజుల నుంచి తమ పంట పొలాలు క్రషర్ల వల్ల దుమ్మూ, ధూళితో నిండి ఉంటున్నాయని, దీంతో పంటలు దెబ్బ తింటున్నాయని, క్రషర్ల యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. విష యం తెలుసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, మైనింగ్ ఏఈ, ఇరిగేషన్ ఏఈలు క్వారీలు, క్రషర్లను తనిఖీ చేశారు. ఇరిగేషన్ అధికారులు కాచేటి వాగుపై అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని ఇరిగేషన్ ఏఈ రాజేష్ తెలిపారు. -
ప్రణాళికలపై స్పష్టమైన అవగాహన అవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలోని ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహన ఉండాలని, ఆయా నియోజకవర్గాల బలాలు, బలహీనతల విశ్లేషణ ద్వారా, వృద్ధికి అవకాశమున్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులకు సూచించారు. జిల్లా, నియోజకవర్గ దార్శనిక కార్యాచరణ ప్రణాళికలపై కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారులు, ప్రణాళికల రూపకల్పన బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాల సాధనకు నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలు దోహదం చేస్తాయన్నారు. ఆయా నియోజకవర్గాల జీసీడీపీతో పాటు నియోజకవర్గ స్థూల విలువ జోడింపు, తలసరి ఆదాయాలను పెంచేందుకు వీటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం దార్శనిక ప్రణాళికల లక్ష్యమని స్పష్టం చేశారు. లక్ష్యం ఇదే.. ప్రస్తుతం ఉన్న రూ. 3.52 లక్షల జిల్లా తలసరి ఆదాయాన్ని 2047 నాటికి రూ.55 లక్షలకు చేర్చాలనేది లక్ష్యమని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో సేవా రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పశు పోషణ, ఉద్యాన, ఆక్వా కల్చర్, పరిశ్రమలు తదితరాలపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని సూచించారు. బంగారు కుటుంబానికి పీ4తో ఉన్నత భవిష్యత్తును నిర్మిద్దామని అధికారులకు సూచించారు. సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
కాసుల మేత.. అబద్ధాల పూత
అది కార్పొరేషన్ స్థలం కాదు.. ఆ స్థలాన్ని గతంలోనే ఏపీఐఐసీకి కేటాయించారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఆ స్థలాన్ని ఏపీఐఐసీ నుంచి ప్రభుత్వం తీసుకుని ఆర్టీసీకి కేటాయించింది. ఆ స్థలంలో బస్టాండ్ నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన సైతం చేసింది. ఆ స్థలంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని విజయవాడ మునిసిపల్ కౌన్సిల్లో టీడీపీ కార్పొరేటర్లు ప్రతిపాదించారు. కార్పొరేషన్ స్థలం కాకపోవడంతో ఆ ప్రతిపాదనను కౌన్సిల్ తిరస్కరించింది. చేపల మార్కెట్లో షాపుల కోసం రూ. లక్షల్లో వసూలు చేసిన టీడీపీ నాయకులు తమ పాచిక పారకపోవడంతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అబద్దాల ప్రచారానికి తెరతీశారు. బస్స్టేషన్తో మహర్దశ సింగ్నగర్ ప్రాంతంలో బస్స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బస్టాండ్ నిర్మిస్తే సింగ్నగర్ చుట్టుపక్కల ప్రాంతాలైన అంబాపురం, నైనవరం, జక్కంపూడి, షాబాదు, నున్న, ఆగిరిపల్లి, అడవినెక్కలం, నూజివీడు పరిసర గ్రామాల ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. విస్తరిస్తున్న సింగ్నగర్ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని బస్టేషన్ను ఇక్కడ ఏర్పాటుచేస్తే కచ్చితంగా ఈ ప్రాంతాలన్నిటికి మహర్దశ పడుతుంది. – నేరెళ్ల శివప్రసాద్, సింగ్నగర్ ప్రజలందరికీ మేలు సింగ్నగర్లో బస్స్టేషన్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజ లు అందరికీ మేలు కలుగుతుంది. సింగ్నగర్ ప్రాంతంలో నివసించే నిరుపేదలు ఎంతో కొంత ఆర్థికంగా బలపడతారు. బస్టాండ్ వెంబడే ఐకానిక్ పార్కు రానున్న నేపథ్యంలో విజయవాడలో సింగ్నగర్ మరో వాణిజ్య వాడగా అవతరించే అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టి బస్స్టేషన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి. – సిరిశెట్టి రాజా, వాంబేకాలనీసాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ ఏర్పాటుకు నగరంలోని వాంబే కాలనీలో 2.02 ఎకరాలు కేటాయించారు. బస్టాండు నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేసి, శంకుస్థాపన చేశారు. బస్టాండ్ నిర్మించే వాంబేకాలనీ, అజిత్ సింగ్నగర్ పరిసర ప్రాంతాల్లో లక్ష మందికి పైగా జనాభా ఉన్నారు. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో అక్కడ నుంచే నేరుగా హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు బస్సులు నడపాలని నిర్ణయించారు. టీడీపీ నాయకుల కాసుల వేట.. కూటమి అధికారంలోకి వచ్చాక బస్టాండ్కు కేటాయించిన స్థలంపై టీడీపీ నాయకులు కన్నేశారు. బీఆర్టీఎస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న చేపల మార్కెట్ను అక్కడికి తరలించాలనే ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగానే షాపుల నిర్వాహకులతో ఒక్కో షాపు కోసం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. బస్టాండు స్థలంలో చేపల మార్కెట్ ఏర్పాటుకు కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టారు. బస్టాండు కోసం కేటాయించిన స్థలం, పైగా కార్పొరేషన్కు చెందినది కాకపోవడంతో కౌన్సిల్ సమావేశం టీడీపీ ప్రతిపాదనను తిరస్కరించింది. గతంలో ఈ స్థలాన్ని ఏపీఐఐసీకి కేటాయించారు. ఆ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొని బస్టాండ్ కోసం ఆర్టీసీకి బదలాయించింది. ఆ స్థలం ప్రస్తుతం కార్పొరేషన్కు సంబంధించి కాదు. ఈ విషయాలు తెలిసినా అభివృద్ధిని అడ్డుకొంటున్నారని టీడీపీ నాయకులు ఆరోపణలకు దిగారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. బస్టాండుకు కేటాయించిన స్థలంలో చేపల మార్కెట్ ఏర్పాటు ప్రతిపాదనపై వాంబే కాలనీ, సింగ్ నగర్ ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు. అపార్టుమెంట్ల సముదాయం, రూ.12కోట్లతో నిర్మిస్తున్న ఐకానిక్ పార్కు, జనం రద్దీగా ఉండే ప్రాంతంలో చేపల మార్కెట్ను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నగరం వెలుపల కాకుండా ఇళ్ల మధ్య చేపల మార్కెట్ ఏమిటని నిలదీస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఫుడ్ కోర్టా? విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటిది ప్రభుత్వాస్పత్రి వద్ద ఫుడ్ కోర్టు ఏర్పాటు కోసం కౌన్సిల్లో టీడీపీ చేసిన ప్రతిపాదనలపైనా నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యతోపాటు అత్యవసర సమయంలో రోగులను తీసుకొచ్చే అంబులెన్స్లు ఆస్పత్రికి చేరకుండా ఆటంకం కలిగించే ఫుడ్ కోర్టు ఏర్పాటు ప్రతిపాదనను కౌన్సిల్ తిరస్కరిస్తే అభివృద్ధికి అడ్డు పడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపణలకు దిగడంపై ప్రజల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో తిరస్కరించి.. ఇప్పుడు గగ్గోలు విజయవాడ నగరం విస్తరించింది. ఇప్పుడు నగర అవసరాలకు నీరు సరిపోవడమే గగనంగా మారింది. ఈ పరిస్థితుల్లో నగర పాలక సంస్థకు ఐలా బకా యిలు చెల్లించకుండా, నీటి సౌకర్యం కల్పించాలనడంపైనే ప్రజల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. ఐలా పరిధిలోని జమాక్ గృహ సముదాయాలకు నీటి సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదనను కౌన్సిల్ తిరస్కరించింది. కార్పొరేషన్కు డబ్బులు చెల్లిస్తే ఆ ప్రతిపానను పరిశీలిస్తామని కౌన్సిల్ పేర్కొంది. ఇది అభివృద్ధిని అడ్డుకోవడం ఎలా అవుతుందని కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోని ఈ గృహ సముదాయాలనకు నీటిని సరఫరా చేసే ప్రతిపాదనలను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి కౌన్సిల్లో ప్రతిపాదనలు పెట్టి, తిరస్కరిస్తే గగ్గోలు పెట్టడం తగదనే భావన నగర ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అక్రమ వసూళ్ల పర్వం సాగడంలేదని టీడీపీ నాయకుల దుష్ప్రచారం ఆర్టీసీకి కేటాయించిన స్థలంలో చేపలమార్కెట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వీఎంసీ స్థలం కాకపోవడంతో టీడీపీ ప్రతిపాదనను తిరస్కరించిన కౌన్సిల్ వైఎస్సార్ సీపీ హయాంలో వాంబే కాలనీలో బస్టాండ్ కోసం 2 ఎకరాలు కేటాయింపు రూ.2.5 కోట్ల నిధులు మంజూరుచేసి శంకుస్థాపన చేసిన వైనం -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
గుడివాడరూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ మహబూబ్ షరీఫ్ మంగళవారం తెలిపారు. గుడివాడ రైల్వే స్టేషన్ పరిధిలోని దోసపాడు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మరణించినట్లు తెలిపారు. మృతుని వయస్సు 60ఏళ్లు ఉంటుందని, బ్లూబై కంపెనీ తెలుపు, నీలం రంగు గడులు గల చొక్కా(రెడీమేడ్ షర్ట్), తెలుపు, నలుపు, నీలం రంగు గడుల లుంగి ధరించి ఉన్నాడన్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9440627570, 9866221412లో సంప్రదించాలని రైల్వే ఎస్ఐ కోరారు. -
కార్మికుల సత్తా చాటుదాం
● 9న సమ్మెను విజయవంతం చేద్దాం ● రాష్ట్ర కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు పిలుపు కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేసి, కార్మిక వర్గ సత్తా చాటుదామని రాష్ట్ర కార్మిక ఉద్యోగ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, 10గంటల పని విధానాన్ని, అధిక గంటల పని విధానాన్ని, రాత్రి సమయంలో మహిళలు పని చేసే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ సమ్మెను చేపడుతున్నట్లు సంఘాలు ప్రకటించాయి. గవర్నర్పేటలోని బాలోత్సవ్ భవన్లో ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంపల్లి రవీంద్రనాథ్ అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల, రైతుల, వ్యవసాయ కూలీ చేతివృత్తులు, మహిళా, యువజన, విద్యార్థి రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. ‘ఉపాధి’లో సంస్కరణలు అవసరం.. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన మార్కెట్ విధానాన్ని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించాలని, రుణాలు రద్దు చేయాలని, రైతులకు అన్ని వేదాల సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని, రోజుకు రూ.800 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లకు వ్యతిరేకంగా, బీజేపీ దాని అనుబంధ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం సత్తా చాటేందుకు జూలై 9న జరిగే సమ్మెలో కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు, శ్రామిక మహిళా నాయకులు వెంకట సుబ్బారావమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జల్లి విల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు వై.కేశవరావు, పి.జమలయ్య, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి పాల్గొన్నారు. -
రుణాలను సద్వినియోగం చేసుకోండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి తదితరాల ద్వారా పొందిన రుణాలను తప్పనిసరిగా జీవనోపాధి కార్యకలాపాలకు ఉపయోగించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. సంపద సృష్టికి రుణాలు వాడుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన వార్షిక రుణ–జీవనోపాధి ప్రణాళిక నుంచి సూక్ష్మ రుణ ప్రణాళిక – జీవనోపాధులపై సమావేశం జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలు పొందే రుణాలపై పర్యవేక్షణ చేసి.. ఆ రుణాలను కుటుంబాల ఆర్థిక సాధికారతకు ఉపయోగపడేలా చేయిపట్టి నడిపించాలని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. రూ.1,266 కోట్లతో కార్యాచరణ.. జిల్లాలో 16 మండల సమాఖ్యలు, 767 గ్రామ సమాఖ్యలు, 24,880 స్వయం సహాయక సంఘాలు, 2,47,611మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. 2024–25లో 1,93,691మంది ఎస్హెచ్జీ సభ్యులకు రూ. 1,147.59 కోట్ల మేర రుణ మద్దతు లభించిందన్నారు. 2025–26కు సంబంధించి స్వయం సహాయక సంఘాల సభ్యుల వ్యక్తిగత జీవనోపాధి అవసరాలు ఆధారంగా దాదాపు రూ.1,266 కోట్ల వార్షిక రుణ–జీవనోపాధి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు వివరించారు. కుటుంబ స్థాయి సర్వే ఆధారంగా ఈ వార్షిక రుణ ప్రణాళికకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు ప్రచారం.. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎల్డీఎం కె.ప్రియాంక వివరించారు. బ్యాంక్ లింకేజీపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, యూఎల్బీల్లో కనీసం ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న సారె సంబరం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను దర్శించుకుని తమ కుటుంబం పిల్లాపాపలతో సంతోషంగా ఉండేలా దీవించమని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి తాము సారెగా తీసుకువచ్చిన చీరలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, మిఠాయిలను సమర్పిస్తున్నారు. సారె తీసుకువచ్చిన భక్త బృందాలకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందిస్తున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలు సారెను అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందిస్తూ సంతోషాలను పంచుకుంటున్నారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు దేవస్థానం ఉచిత ప్రసాదంతో పాటు అన్న ప్రసాదాలను అందజేస్తోంది. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఈవో శీనానాయక్ అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దుర్గగుడికి తరలివస్తున్న భక్తబృందాలు -
పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించాలి
డీసీజీ సమావేశంలో ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రజల భద్రతకు తొలి ప్రాధాన్యమివ్వాల్సిందేనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాల్లో రాజీపడే ప్రసక్తే లేదని, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ అప్రమత్తంగా ఉండా లని పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా క్రై గ్రూప్ (డీసీజీ) సమావేశం జరిగింది. మాక్డ్రిల్స్ నిర్వహించండి.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్సైట్, ఆఫ్సైట్ మాక్డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా కర్మాగారాలు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, వైద్య ఆరోగ్యం తదితర శాఖలను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని తొమ్మిది మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు. వాటిల్లో గ్యాస్ లీకేజ్, అగ్ని ప్రమాదాలు వంటివి జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతినెలా లెవెల్–1 మాక్డ్రిల్స్, ఆర్నెల్లకోసారి లెవెల్–2 మాక్డ్రిల్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా తప్పనిసరిగా సేఫ్టీ ఆడిట్ నివేదికలు పంపాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి చోళ మండలం ఎంఎస్ రిస్క్ సర్వీసెస్ సంస్థ రూపొందించిన ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ముసాయిదాపై భాగస్వామ్య పక్షాలు సలహాలు, సూచనలు చేయాలని.. వాటిని పరిగణనలోకి తీసుకొని తుది ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలపై విద్యార్థి దశలోనే అవగాహన పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వ ఐటీఐల్లోని 240 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, కర్మాగారాల డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు తదితరులు హాజరయ్యారు. -
ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6,400కోట్లు
తక్షణం విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు బకాయిపడిన ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ దాసరి భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బందెల నాసర్ జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పేరిట రూ.6400 కోట్లు బకాయిపెట్టిందన్నారు. టీడీపీ యువగళం పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా కేవలం రూ.600కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకొందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కానందున యాజమాన్యాలు వేధిస్తున్నాయని, విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక కళాశాలల్లోనే సర్టిఫికెట్లు ఉన్నాయని, విద్యార్థులు ఉన్నత విద్య చదవలేక, మరో పనికి వెళ్లలేక, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నాలుగో తేదీ నుంచి ధర్నాలు.. బకాయిలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 4 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 11న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కార్తీక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యశ్వంత్, శరత్, అమర్నాథ్, ప్రణీత్, డేవిడ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
కొండచిలువ హతం
మైలవరం: మైలవరం మండలం జంగాలపల్లి గ్రామంలో పాడుబడిన బావి వద్ద పేరుకుపోయిన చెత్తలో ఉన్న కొండచిలువను గమనించిన గ్రామస్తులు మంగళవారం కర్రలు, కత్తులతో హతమార్చారు. గ్రామానికి చెందిన రైతు వేల్పులకొండ ప్రసాద్కు పాము కన్పించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు పెట్టడంతో యువకులు పరుగున వెళ్లి దానిని హతమార్చారు. కొండ చిలువ సుమారు 10 అడుగుల పొడవు, 15కిలోలు బరువు ఉందని యువకులు తెలిపారు. కాగా జంగాలపల్లి గ్రామం నుంచి బయటికి రావాలంటే దారి మార్గం సరిగా ఉండకపోగా, కొద్దిపాటి వర్షానికి రహదారికి గండ్లు పడి కనీసం నడవడానికి కూడా గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యం పట్ల అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గృహావసరాలకు బావి నీటిని వాడుకుంటూ ఉంటారని, అదే విధంగా అక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారని గ్రామస్తులు తెలిపారు. బావి పాడైపోయి ఉండటంతో గ్రామస్తులు చెత్తా చెదారం తీసుకువచ్చి అక్కడే పడేస్తున్నారని దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, ప్రమాదకరమైన పాములు తిరుగుతూ భయానక వాతావరణం నెలకొంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగునకు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
4 వరకు హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత
కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హంసలదీవి సాగరతీరం బీచ్ గేట్లను మూసివేసినట్లు ఇన్చార్జి ఫారెస్ట్ ఆఫీసర్ మోహిని విజయలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో పాటు ఈదురుగాలులు తీవ్ర కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీ వరకు బీచ్ గేట్లను మూసి వేస్తామని వివరించారు. పర్యాటకులు సహకరించి ఈ మూడు రోజుల పాటు బీచ్కు రాకుండా ఉండాలని కోరారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచే బీచ్ గేట్లకు అటవీ అధికారులు తాళాలు వేశారు. త్వరలో ఎ.కొండూరుకు కృష్ణా జలాలు తిరువూరు: మరో 45 రోజుల్లో ఎ.కొండూరు మండలానికి కృష్ణా నదీజలాలను సరఫరా చేస్తా మని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎ.కొండూరులో జల్జీవన్ మిషన్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. త్వరితగ తిన పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత తాగు నీరందించే లక్ష్యంతో జల్ జీవన్మిషన్ అమలవుతోందన్నారు. కిడ్నీబాధిత తండాలకు కృష్ణా నదీ జలాలు ఇచ్చే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి జరుగుతోందని, ఇప్పటికే ప్రధాన పైపులైను పనులు పూర్తయ్యాయని వివరించారు. అనంతరం కంభంపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పరిశీలించారు. డెంగీపై విస్తృత అవగాహన కల్పించాలిలబ్బీపేట(విజయవాడతూర్పు): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగీ నివారణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం డెంగీ డే సందర్భంగా వ్యాధిపై అవగాహన కల్పించే రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను డాక్టర్ మాచర్ల సుహాసిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెలరోజులు యాంటీ డెంగీ, యాంటీ మలేరియా మాసంగా పాటిస్తామని తెలిపారు. డెంగీ, మలేరియా ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా వ్యాధులపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రంలో తప్పనిసరిగా ఈ నెల రోజులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతి బాబు, డీపీఎంఓ డాక్టర్ నవీన్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ బాలాజీ, డాక్టర్ కార్తీక్, డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
వరి సాగుకు విపత్తు
అవనిగడ్డ: ఖరీఫ్ సాగు ప్రారంభంలోనే కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 40 శాతానికి పైగా విత్తనాలను రైతులకు వారి గ్రామాల్లోనే అందించి ఆదుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పదిశాతం విత్తనాలు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకొంది. దీంతో కృష్ణాజిల్లా రైతులు వరి వంగడాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అరకొరగా విత్తనాలు కృష్ణాజిల్లాలో ఈ ఖరీఫ్లో 1.64 లక్షల హెక్టార్లలో రైతులు వరిసాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఎక్కువగా ఎంటీయూ 1061, బీపీజీ 5204 రకాలను రైతులు సాగుచేస్తారు. గతేడాది ఎంటీయూ 1262, 1318 రకాలను పలుచోట్ల సాగుచేయగా కొనేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. ఈ సంవత్సరం రైతులు ఆ రకాల జోలికెళ్లడం లేదు. సాధారణంగా ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలు అవసరం. ఈ సీజన్లో 1.02 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా ప్రభుత్వం 10,650 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసింది. దీంతో విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వచ్చిన లోడులు వచ్చినట్టు అయిపోతున్నాయి. రైతులు పనులు మాను కుని గంటల తరబడి ఎదురు చూసినా కొన్ని చోట్ల విత్తనాలు దొరకడం గగనంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 40 నుంచి 45 శాతం విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేసింది. అవసరమైతే డిమాండ్ను బట్టి మరో ఐదు శాతం విత్తనాలు సరఫరా చేసింది. ఈ ప్రభుత్వం పదిశాతం మాత్రమే సరఫరా చేయడంతో రైతులు విత్తనాలు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం కూడా విత్తనాల కోసం రైతులకు ఇబ్బందులు తప్పలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయిందని రైతులు తమకు తామే సర్దిచెప్పుకొన్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. కృష్ణాజిల్లాలోని బందరు, కేఈబీ కెనాల్కు ఇటీవల సాగునీరు విడుదల చేశారు. గతంలో బోర్ల కింద అక్కడక్కడా రైతులు నారుమళ్లు పోసుకున్నారు. పంట కాలువకు సాగునీరు విడుదల చేయడంతో ఇప్పుడే నారుమళ్లు పోసుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఆదిలోనే విత్తనాలకు ఈ విధంగా డిమాండ్ ఉంటే సాగు పనులు ముమ్మరం చేస్తే పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 65 శాతం మంది కౌలు రైతులున్నారు. ఏటా పంట చేతికందగానే 85 శాతం కౌలు రైతులు విత్తనాలకు తీయకుండానే ధాన్యం విక్రయిస్తారు. వీరంతా ప్రస్తుతం ఎక్కడో ఒకచోట విత్తనాలు కొనుగోలు చేసి సాగుచేయాల్సిందే. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సరిపడా విత్తనాలు ఇవ్వాలి గత ప్రభుత్వం సబ్సిడీపై అవసరమైనన్ని వరివిత్తనాలు సరఫరా చేసేది. ఇప్పుడు చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. బయట షాపుల్లో రేటు ఎక్కువ. కల్తీ విత్తనాలు వచ్చే ప్రమాదముంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాల సరఫరా పెంచాలి. – చిరివేళ్లే యానాదిరావు, పిట్టల్లంక తనిఖీలు చేస్తున్నాం అవనిగడ్డ సబ్ డివిజన్కు బీపీటీ 5204 రకం 515 క్వింటాళ్లు, ఎంటీయూ 1061 రకం 154 క్వింటాళ్లు, 1318 రకం 110 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి. ప్రస్తుతం వీటిని రైతులుకు సబ్సిడీపై అందిస్తున్నాం. ప్రైవేటు విత్తన షాపులను తనిఖీ చేస్తున్నాం. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – జయప్రద, ఏడీఏ, అవనిగడ్డ కృష్ణా జిల్లాలో 1.64 లక్షల హెక్టార్లలో వరిసాగు 1.02 లక్షల క్వింటాళ్ల వరి వంగడాలు అవసరం ప్రభుత్వం సరఫరా చేసింది 11,650 క్వింటాళ్లే.. విత్తనాల కోసం రైతులకు తప్పని ఇబ్బందులు గత ప్రభుత్వంలో 40 శాతానికి పైగా విత్తనాల పంపిణీ -
గూడూ పోయే..
రోడ్డు విస్తరణ పేరుతో వెల్వడంలో ఉన్న నా ఇంటిని కూల్చి పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు అడిగితే మీ స్థలం రోడ్డు విస్తరణకు అవసరం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు మా ఇంటిని ఎందుకు కూల్చారు? అధికారులు సమాధానం చెప్పాలి. – అడ్డగిరి జమలయ్య (గ్రామస్తుడు, వెల్వడం) నాలుగు నెలల క్రితం రోడ్డు తవ్వి వెట్మిక్స్ వేసి వదిలేశారు. ఎండొచ్చినప్పుడు దుమ్ము, వానొస్తే రోడ్డుపై గుంతలలో నీరు చేరి నరకయాతన అనుభవిస్తున్నాం. రోడ్డు బురదమయంగా మారి అడుగు బయట పెట్టలేకపోతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారిని అభివృద్ధి చేయాలి. – శివదానం శివకృష్ణ (గ్రామస్తుడు, వెల్వడం)నా ఇంటిని కూల్చి పరిహారం ఇవ్వలేదు రోడ్డును వెంటనే బాగు చేయాలి -
వంతెన నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): పెనమలూరు మండలం పోరంకిలో బందరు కాలువపై వంతెన నిర్మాణానికి సంబంధించి అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సమీక్షించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ బాలాజీ బంద రులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోరంకి వద్ద బందరు కాలువపై వంతెన నిర్మాణం గురించి సమీక్షించారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సమీ పంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆయన చర్చించారు. బందరు కాలువ కట్టపై ఇరువైపులా ఉన్న ఆక్రమణలు, భూసేకరణ, పరిహారం, నిర్మాణానికి పట్టే సమయం తదితర అంశాలపై అధికారులతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఉయ్యూరు ఆర్డీఓ బి.ఎస్.హేలా షారోన్, ఇరిగేషన్ ఎస్ఈ మోహన్రావు, రహదారులు భవనాలు ఎస్ఈ భాస్కరరావు, ఈఈ లోకేష్, కంకిపాడు తహసిల్దార్ గోపాలకృష్ణ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రాజ్ ప్రియాసింగ్ నేతృత్వంలోని బృందం మంగళవారం పరిశీలించింది. తొలుత రేమల్లె గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు పండ్లతోటల సాగు, బంద్రీ చెరువు పూడికతీత, పశువుల షెడ్ల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ చానల్ పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మామిడి మొక్కలు పెంచుతున్న రైతు సంగీతరావుతో మాట్లాడారు. సాగు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మడిచర్ల గ్రామంలో పంట కుంట, బీటీ రోడ్డు, రజక చెరువులో పూడిక తీత, పశువుల షెడ్డు నిర్మాణం, మ్యూజిక్ సోక్ పిట్ పనులను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. పీఎంఏవై–జీ పథకం కింద గ్రామంలో చేపట్టిన గృహ నిర్మాణాలను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద కానుమోలు నుంచి రంగయ్య అప్పారావు పేట, రామ శేషాపురం గ్రామాల మీదగా రామన్నగూడెం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ సీఈఓ కన్నమ్మ నాయుడు, డ్వామా పీడీ శివ ప్రసాద్ యాదవ్, డీఆర్డీఏ పీడీ హరహరినాథ్, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓ జోగేశ్వరరావు, ఏపీఓ అశోక్కుమార్, పంచాయతీ కార్యదర్శులు, పలువురు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర కీలకం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజల ఆరోగ్య పరిరక్షణకు శ్రమించే వైద్యులను సమాజంలోని అన్ని వర్గాల వారు గౌరవించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ సూచించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను మంగళవారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లా డుతూ.. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమన్నారు. నిరంతరం ప్రజాసేవపై చిత్త శుద్ధి, అంకితభావంతో పనిచేసే వైద్యులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఎంతో ప్రయాస పడి వైద్య విద్యను అభ్యసించి వ్యక్తిగత, కుటుంబ పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచటానికి కృషి చేస్తున్న వైద్యులపై ప్రజలు, నాయకుల ధోరణిలో మార్పు రావాలన్నారు. ఆఖరి క్షణం వరకు రోగుల ప్రాణాలు కాపాడేందుకు శ్రమించే వైద్యులపై దాడులు సరి కాదని పేర్కొన్నారు. విశిష్ట సేవలందించిన వైద్యులకు సత్కారం జాతీయ డాక్టర్స్ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన పది మంది వైద్యులను మంత్రి సత్య కుమార్ యాదవ్ సత్కరించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మశ్రీవాత్సవ, ప్రస్తుత డీఎంఈ, శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ డి.ఎస్.వి.ఎల్.నరసింహం, జనరల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ ఎ.అశ్విని కుమార్, కార్డియాలజిస్ల్టు డాక్టర్ ఎ.శ్రీనివాసరావు, డాక్టర్ పి.భాస్కరనాయుడు, డాక్టర్ జి.భవానీప్రసాద్, న్యూరోసర్జన్ డాక్టర్ కె.సత్యవరప్రసాద్, డాక్టర్ ఎం. కృష్ణనాయక్, డాక్టర్ ఆర్.మురళీబాబూరావు, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ టి.భారతిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి, హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, డీఎంఈ అకడమిక్ డాక్టర్ జి.రఘునందనరావు, మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ డాక్టర్స్ డే సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు సత్కారం -
దుర్గమ్మకు భక్తుల ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో భక్తులు, భక్తబృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సోమవారం ఉదయం నుంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో భక్తులు విశేషంగా తరలిరావడం కనిపించింది. ఉదయం నుంచి ప్రారంభమైన సారె సంబరం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఆలయ వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ కుటుంబం అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించింది. నగరంతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భక్తులు సారె సమర్పించేందుకు తరలివవచ్చారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పిస్తున్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. -
డివైడర్ను ఢీకొని ఇరువురు యువకులు దుర్మరణం
కోనేరుసెంటర్: రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసుల విచారణలో తేలింది. జరిగిన సంఘటనపై ఇనకుదురుపేట పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బందరు మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన దాలిపర్తి పవన్కళ్యాణ్ (23), కోడూరు గ్రామానికి చెందిన మేడా రవీంద్ర (22) మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు ట్రావెల్స్లో క్లీనర్లుగా పనిచేస్తున్నారు. సోమవారం చిన్నాపురం గ్రామంలోని మద్యం దుకాణంలో వారిద్దరూ పూటుగా మద్యం తాగి బైక్పై మితిమీరిన వేగంతో మచిలీపట్నం వస్తుండగా శారదానగర్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇరువురి తలలు పగిలిపోయి మెదళ్లు బయటికి వచ్చి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు ఇనకుదురుపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఇరువురి కుటుంబాలకు అందజేసినట్లు సీఐ పరమేశ్వరరావు తెలిపారు. పొట్టకూటి కోసం వెళ్లి అనంతలోకాలకు..! కోడూరు: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మేడ రవీంద్ర(25) తల్లిదండ్రులు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో రవీంద్ర మచిలీపట్నంలోని బంధువుల ఇంటి వద్ద ఉంటూ ఓ ప్రయివేటు ట్రావెల్స్లో క్లీనర్గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం స్నేహితుడితో కలిసి మచిలీపట్నం వెళ్తుండగా శారదనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రవీంద్ర మృతితో రామకృష్ణాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గొల్లపూడిలోని గోదావరి రుచులు హోటల్ సమీపంలో జరిగింది. ఆదివారం అర్థరాత్రి సమయంలో ఓ వ్యక్తి విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే రోడ్డులో గొల్లపూడి గోదావరి రుచులు హోటల్కు ఎదురుగా నడుచుకుంటూ వెళుతున్నాడు. వెనుక నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఆ వ్యక్తిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో మృతుని తలకు బలమైన గాయమైంది. స్థానికులు అతనిని అంబులెన్స్లో ఎక్కించారు. అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు నలుపు రంగు టీషర్టు, నలుపు రంగు నైట్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీఆర్వో పవన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ దుర్మరణం యలమర్రు(పెదపారుపూడి): విద్యుత్ మోటారు నుంచి వచ్చిన విద్యుత్ సరఫరా కారణంగా ఓ వలస కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని యలమర్రులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కలుపుకూరి సూరి(18) పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ముండ్రువారిపాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడు. సూరి తన తల్లి పాకీరమ్మతో కలిసి రెండు రోజుల క్రితం యలమర్రు గ్రామంలోని మూల్పూరి నరేంద్ర అనే రైతు పొలంలో పనులకు వచ్చారు. సోమవారం ఉదయం పొలంలో గట్లు పని చేస్తుండగా పక్కనే విద్యుత్ మోటారు నుంచి విద్యుత్ సరఫరా కావటంతో షాక్ తగిలి అక్కడికక్కడే పడి పోయాడు. తోటి కూలీలు స్థానిక పీహెచ్సీకి తరలించగా పరీక్షలు చేసిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్ఐ ప్రవీణ్కుమార్ రెడ్డి తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అపార్ట్మెంట్ పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మానసిక స్థితి బాగాలేని ఓ వృద్ధురాలు అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గొల్లపూడి సాయిపురం కాలనీలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గొల్లపూడి సాయిపురం కాలనీ ఇంద్రాణి టవర్స్లో రిటైర్డ్ ఇంజినీర్ కుంటముక్కల వెంకటేశ్వరరావు, అతని భార్య భానుమతి(65) నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు శ్రీకాంత్ 12 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాడు. భానుమతి గత ఐదేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతూ మానస సైకియాట్రిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. మందులు వాడుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆమె అపార్ట్మెంట్ పైనుంచి దూకింది. పెద్ద శబ్దం రావడంతో వాచ్మెన్ గమనించి ఆమె భర్తకు తెలియజేశాడు. తన భార్య మానసిక క్షోభ తట్టుకోలేక అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త వెంకటేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రత్యక్ష దైవాలు వైద్యులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ప్రాణాపాయంతో ఆస్పత్రికి వచ్చిన రోగికి సత్వర వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించిన వైద్యుడిని దైవంతో సమానంగా భావిస్తారు. రోగులకు సేవలు అందించే క్రమంలో పలువురు వైద్యులు ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అయినప్పటికీ తమ వృత్తి ధర్యాన్ని నెరవేరుస్తూనే ఉంటారు. కరోనా సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వైద్యుడు కరోనా బారినపడి చావు అంచులదాకా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఒకప్పుడు రోగి లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స చేసే వాళ్లు. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందు బాటులోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి వ్యాధినైనా నిర్ధారించడమే కాదు. ముందుగా లక్ష ణాలు గుర్తించే పరికరాలు వచ్చాయి. ఎంఆర్ఐ, సీటీ, పెట్సీటీలు ఉన్నాయి. దీంతో కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించగలుగుతున్నారు. చికిత్సలో సత్ఫలితాలు సాధించగలుగుతున్నారు. గర్భస్థ పిండానికి సైతం వైద్యం చేసే స్థాయికి మన వైద్యులు ఎదిగారు. అరుదైన జబ్బులకు విజ యవంతంగా చికిత్సలు అందిస్తున్నారు. జబ్బు చేసి వచ్చిన వారు నయం అయిన తర్వాత ఆస్పత్రి నుంచి వెళ్లేటప్పుడు రోగి తెలిపే కృతజ్ఞతలే వైద్యులకు సంతృప్తినిస్తాయి. ప్రాణాపాయంతో వచ్చిన వారికి పునర్జన్మ సేవలు అందిస్తూ ఇన్ఫెక్షన్స్ బారిన పడిన డాక్టర్లు ఎందరో... ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రాణం పోస్తున్నారు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం... -
బీడీసీ రిటైనింగ్ వాల్ పరిశీలించిన మంత్రి నిమ్మల
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): గతేడాది బుడమేరు కట్టకు గండ్లు పడిన ప్రాంతంలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను సోమవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. మిగులు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం పూర్తి చేస్తున్నామని, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద పాతగేట్ల స్థానంలో రూ.1.8 కోట్లతో నూతన గేట్లు అమర్చినట్లు తెలిపారు. బుడమేరు కట్ట పటిష్టత కోసం వెలగలేరు– ఈలప్రోలు మధ్య 7 కిలోమీటర్ల పొడవునా గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవునా డ్రైన్లో పూడికతీత పనులు జరుగుతున్నట్లు తెలిపారు. కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా బుడమేరు నీరు సముద్రంలో కలిసేలా రూ.9 కోట్లతో డీసిల్టింగ్ పనులు జరుగుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీలో అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంలో అవినీతి రాజ్యమేలుతోందని వైఎస్సార్ సీపీ ఎంపీపీల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ అన్నారు. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే న్యాయ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పంచాయతీరాజ్ విభాగంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, వారందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం నిబంధనలకు విరుద్ధంగా పనులను వెండార్లకు కేటాయించారని, ఇది సరికాదన్నారు. ఈ పథకాన్ని టీడీపీ నేతల జేబులు నింపుకొనే పథకంగా మార్చివేసిందన్నారు. ఉపాధి హామీ పనులు పంచాయతీల ద్వారానే జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన సమస్యల పరిష్కారానికి పూనుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను సైతం దారి మళ్లిస్తోందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను ఆగౌరవపరస్తూ చట్టాలను తుంగలోకి తొక్కుతోందన్నారు. 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు రూ.1150 కోట్లు స్థానిక సంస్థలకు వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపులో రాజకీయ జోక్యం నివారించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74, సవరణల మేరకు సర్పంచులకు ఉన్న అధికారాలను వర్తింపజేయాలని మాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని రవిశంకర్ మాట్లాడుతూ 1320 మంది పంచాయతీ సెక్రటరీలకు తక్షణమే పోస్టింగ్స్ ఇచ్చి పెండింగ్లో ఉన్న 9 నెలల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్లందరికీ తల్లికి వందనం పథకంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు వెంటనే పెంచాలని, సకాలంలో చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం ప్రతినిధులు పి.రమేష్, వి.వెంకట నారాయణరెడ్డి, సీహెచ్ బుచ్చిరెడ్డి, జె.ప్రేమ్రాజ్, సీహెచ్ రమేష్, సీహెచ్ వేమనరావు, బండారు ఆంజనేయులు, జి.అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను కాపాడాలి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం -
మానసిక నిపుణుల అవసరం పెరిగింది
త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రస్తుత సమాజంలో జీవనశైలి, దురలవాట్ల కారణంగా మానసిక రుగ్మతలు పెరిగాయని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. అందువల్ల మానసిక నిపుణుల అవసరం కూడా సమాజంలో పెరిగిందన్నారు. విజయవాడలోని ఇండ్లాస్ హాస్పిటల్స్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఎం.ఫిల్ క్లినికల్ సైకాలజీ, పీడీసీపీ కోర్సులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ఆయన విజయవాడలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి ఆయా కోర్సుల్లో అడ్మిషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మానసిక రుగ్మతలను సైతం ఆరోగ్య సమస్యలు గానే పరిగణించి చికిత్సనందించాలని సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, మానసిక వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇండ్లాస్ హాస్పిటల్స్ క్లినికల్ సైకాలజీ విభాగం డైరెక్టర్లు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ ఇండ్ల మాట్లాడుతూ మానసిక వైద్యాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ బోర్డును అమలు చేసే వరకు పోరాటం
ఆటోనగర్(విజయవాడతూర్పు): కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు తగ్గాయి. వేతనాలు విపరీతంగా తగ్గాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ గౌవర అధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెన్సీ నగర్లోని ఓ ప్రయివేట్ కల్యాణ మండపంలో సోమవారం ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ నిర్మాణరంగ సంక్షేమ బోర్డును అమలు చేయాలని, లేకుంటే పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి సంక్షేమ బోర్డును అమలుచేస్తామని కార్మికులకు మాట ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక దానిని పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు తక్కువయ్యాయని, అపార్ట్మెంట్ల నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వారంతా కార్మికులను ఒడిశా, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల వారితో పనులు చేయించుకుంటున్నారన్నారు. స్థానిక కార్మికులకు పనులు దొరకక కార్మిక కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పుట్టెపు అప్పారావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు డీవీ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ వెంకటేశ్వరరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ ఎ.కమల పాల్గొన్నారు. ఎన్నికల హామీని తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం వేతనాలు తగ్గాయి.. ధరలు పెరిగాయి కార్మిక కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 10వ జిల్లా మహాసభ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు -
క్యాన్సర్ను జయించేలా చికిత్సలు
ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే జీవితం ముగిసినట్లేనని భావించేవాళ్లు. కానీ నేడు ఎంతోమంది క్యాన్సర్ రోగులకు స్వస్థత చేకూర్చి సాధారణ జీవితం గడిపేలా చేయగలుగుతున్నాం. అదే మాకు సంతృప్తినిస్తుంది. క్యాన్సర్పై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది. ఇంకా కొందరు నాలుగో దశలో చికిత్సకోసం వస్తున్నవారు ఉన్నారు. ప్రస్తుతం అత్యాధునిక నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో సూక్ష్మదశలోనే క్యాన్సర్ను నిర్ధారించి సత్ఫలితాలు సాధించగలుగుతున్నాం. రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వంటి వాటిని అత్యుత్తమ చికిత్సా పద్ధతుల ద్వారా నయం చేయగలుగుతున్నాం. – డాక్టర్ ఎన్.సుబ్బారావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు జీవనశైలి వ్యాధులు పెరిగాయి సమాజంలో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మూడు పదుల వయస్సులోనే మధుమేహం, రక్తపోటు, ఒబెసిటీలకు గురవుతున్నారు. దీంతో హార్ట్ ఎటాక్, పక్షవాతం వంటి జబ్బుల బారిన పడుతున్నారు. ప్రతి వైద్యుడు బాధ్యతగా వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి. – డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి, మధుమేహ వ్యాధి నిపుణుడు ●రోగి కృతజ్ఞతే మాకు సంతృప్తి నిత్యం ఎంతో మంది ఆయాసం, శ్యాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో వస్తుంటారు. వారికి సరైన చికిత్స అందిస్తే వారు తర్వాత ఓపీకి వచ్చినపుడు మా పట్ల ఎంతో కృతజ్ఞతా భావం కనపరుస్తుంటారు. అదే మాకు కొండంత సంతృప్తి నిస్తుంది. కోవిడ్ సమయంలో వందలాది మందికి సేవలు అందించాం. ఆ సమయంలో మాకు కోవిడ్ సోకే అవకాశం ఉంటుందని తెలిసినా, రోగులకు చికిత్స అందించడమే లక్ష్యంగా పనిచేశాం. అదే మాకు సంతృప్తి నిస్తుంది. –టి.కార్తీక్, శ్యాసకోశ వ్యాధుల నిపుణుడు విలువలతో కూడిన సేవలు అందించాలి వైద్యుడు సమాజ సేవకునిగా పనిచేయాలి. వైద్యాన్ని వ్యాపారంగా పరిగణించకూడదు. రోగులతో మంచిగా మెలగాలి. విసుక్కోకూడదు. సమయపాలన, కమిట్మెంట్, డిసిప్లేన్ అనేది చాలా ముఖ్యం. ప్రభుత్వాస్పత్రిలకు పేదలే వస్తుంటారు. పేదలకు వైద్య సేవలు అందించే అదృష్టం ప్రభుత్వ వైద్యులకు మాత్రమే ఉంటుంది. అలాంటి చోట విద్యనభ్యసించే వారు సైతం సేవా భావాన్ని అలవర్చుకోవాలి. –డాక్టర్ ఆలపాటి ఏడుకొండలు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల -
ప్రభుత్వాలు కృషి చేయాలి..
పెడన: వస్త్ర ప్రపంచంలో ఎన్ని ఆధునిక డిజైన్లు అవతరిస్తున్నా వన్నెతగ్గనిదిగా సహజసిద్ధ కలంకారీ నిలుస్తోంది. ఈ ప్రాచీన కళకు సరికొత్త హంగులు అద్దుతున్న తరుణంలో మరింత ప్రాచుర్యం కోసం కలంకారి పరిశ్రమలు చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తోంది. ఆఫ్లైన్ బిజినెస్తో పాటు ఆన్లైన్ షాపింగ్ కూడా ఉండటంతో.. ఫ్యాషన్ డిజైన్ యూనివర్సిటీలు, కళాశాలలు దీనిపై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలోనే డెహ్రాడూన్లోని గ్రాఫిక్ ఏరా హినియన్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైన్ చేస్తున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ప్రాజెక్టు వర్క్కు కలంకారీని ఎంపిక చేసుకున్నారు. వర్సిటీలో మొత్తం 45 మంది వివిధ ప్రాంతాల్లో, ముగ్గురు ముగ్గురు చొప్పున 15 బ్యాచ్లుగా విడిపోయి ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఊటీ, వెస్ట్ బెంగాల్, బెనారస్ తదితర ప్రాంతాల్లో ప్రాజెక్టు చేస్తున్నారు. వారిలో ఒక బ్యాచ్ కృష్ణా జిల్లాలోని పెడనలో శ్రీనివాస కోరమండల్ కలంకారీ అండ్ హ్యాండ్ లూమ్స్ హౌస్ను ఎంపిక చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే వీరు ప్రాజెక్టు వర్క్ మొదలు పెట్టి 15 రోజులు అయింది. ప్రాసెసింగ్ నుంచి ప్రింటింగ్ వరకు.. ప్రాజెక్టు వర్క్ చేసేందుకు వచ్చిన విద్యార్థినులు కోరా క్లాత్ను ఏ విధంగా సిద్ధం చేయాలి, సహజ సిద్ధ రంగులు ఏ విధంగా తయారు చేస్తున్నారు.. ఏయే రంగులు వేటి ద్వారా వస్తున్నాయి.. వంటి వివరాలను తెలుసుకోవడంతో పాటు లిఖితపూర్వకంగా నమోదు చేసుకుంటున్నారు. రికార్డులు రాసుకుంటూ స్వయంగా క్షేత్రస్థాయిలో ప్రాసెసింగ్లో భాగస్వాములవుతున్నారు. కలంకారీపై తొలిసారిగా ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న డెహ్రాడూన్ వర్సిటీ విద్యార్థినులు కళకు సరికొత్త హంగులద్దడమే లక్ష్యమంటున్న విద్యార్థినులు సహజ సిద్ధ కలంకారీ కళను బతికించడానికి, మరింత ప్రాచుర్యం చెందేలా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టు వర్క్లను చేసుకునేలా విద్యార్థులను ప్రొత్సహించేలా అడుగులు వేస్తే బాగుంటుంది. విద్యార్థినులు స్వతహాగా ప్రాజెక్టు వర్క్ చేయాలని రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారికి చేయగలిన సహాయం చేస్తాం. – పిచ్చుక వరుణ్కుమార్, శ్రీనివాస కోరమండల్ అధినేత, పెడన -
సహజ సిద్ధ రంగులు ఆకట్టుకున్నాయి..
కలంకారీ డిజైన్లను ఆన్లైన్, ఇన్స్టాగ్రామ్లలో చూశా. స్వయంగా పరిశీలించి తెలుసుకోవడం కోసం ఈ ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నా. సహజ సిద్ధ రంగులతో డిజైన్లు ముద్రించడం, పర్యావరణానికి ఎటువంటి హానీ కలుగకుండా ఉండేలా ఈ పరిశ్రమలుండటం వల్ల ఈ రంగంపై దృష్టిపెట్టాను. ట్రెడిషనల్గా ఉండే ఈ కలంకారీ డిజైన్లను వెస్ట్రన్ డిజైన్వైపు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నా. – కుషుబుకుమారి, డెహ్రాడూన్ యూనివర్సిటీ -
కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
ఇఫ్టూ భవన నిర్మాణ కార్మిక సంఘాల విలీన సభ డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు కె. పోలారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఇఫ్టూ అనుబంధ.. ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం విలీన సభ జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో పోలారి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో హామీలను ఇచ్చారన్నారు. బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారానికి వచ్చి ఏడాది అయినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు అట్టడుగు స్థాయిలో ఉండడం బాధాకరమన్నారు. నూతన కమిటీ ఎన్నిక.. ఇఫ్టూ ఉపాధ్యక్షుడు ఆర్.మోహన్ మాట్లాడుతూ రెండు సంఘాలను ఒకే సంఘంగా విలీనం చేశామని, ఇకపై ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం పేరుతో పనిచేస్తుందని ప్రకటించారు. ఈ మేరకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు. నూతన సంఘానికి అధ్యక్షుడిగా ఆర్.మోహన్, ప్రధాన కార్యదర్శిగా కె.వి రమణ, ఉపాధ్యక్షుడిగా ఏసురత్నం, సహాయ కార్యదర్శిగా ఎం. నాగరాజు, కోశాధికారిగా గుబ్బల ఆదినారాయణ, మరో 12 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ఏఎన్ఎం బదిలీలకు కౌన్సెలింగ్
మచిలీపట్నం అర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏఎన్ఎం గ్రేడ్–3 ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ సోమవారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. శర్మిష్ఠ కౌన్సెలింగ్ను పర్యవేక్షించారు. ఉద్యోగులు సేవా రిజిస్టర్, ప్రాధాన్యతలు, విద్యార్హతల జిరాక్స్, పారామెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఒరిజినల్స్తో ఉదయం 8గంటల నుంచి కార్యాలయంలో కౌన్సెలింగ్కు హాజరయ్యారు. సోమవారం పొద్దుపోయేవరకు సాగిన కౌన్సెలింగ్లో 368 మంది ఎన్టీఆర్, 329మంది కృష్ణా, 94మంది ఏలూరు జిల్లాలోని ఉద్యోగులు బదిలీ అయ్యారు. మునిసిపాలిటీలతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు సీనియారిటీ జాబితాల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ ఉత్తర్వులను అందజేశారు. -
జగన్మాతకు తెలంగాణ బంగారు బోనం
కిక్కిరిసిన బ్రాహ్మణ వీధి.. బోనాలతో ఊరేగింపుగా వస్తున్న భక్తులుసాదర స్వాగతం.. కళాకారులు, కమిటీ ప్రతినిధులు, భక్తులతో ఘాట్రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో శీనానాయక్, అర్చకులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం బంగారు, వెండి బోనంతో పాటు పూజా సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను ఆలయ ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఉత్సవ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ఎన్. రమేష్బాబు, వెంకటరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపపశ్చిమ): హైదరాబాద్ లోని భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ తరఫున ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం తెలంగాణ బంగారు బోనాన్ని సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషా లతో ఉండాలని కోరుతూ గత 16 ఏళ్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి బోనాల కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 500 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. భక్తుల బారులు.. జోగిని శ్యామలాదేవి బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు ముందుకు నడిచారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి పరిసరాలకు తరలివచ్చారు. దుర్గాఘాట్కు చేరుకున్న ఊరేగింపు కృష్ణమ్మకు గంగ తెప్పను సమర్పించిన పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం దుర్గాఘాట్, ఘాట్రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన భాగ్యనగర్ బోనం 500మందితో భారీ ఊరేగింపు ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు -
మేమింతే.. మారమంతే!
వక్ఫ్ భూములపై మళ్లీ వాలిన ‘పచ్చ’గద్దలు!పెనమలూరు: తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో ఉన్న కొండపల్లి ఖాజీ వక్ఫ్ భూములను పచ్చగద్దలు ఆక్రమించే పనిలో ఉన్నాయి. ఈ భూములకు గత కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ గోపాలకృష్ణ బహిరంగ కౌలు వేలం నిర్వహించారు. వక్ఫ్ అధికారులు భూముల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టారు. అయితే అత్యంత విలువైన వక్ఫ్ భూములు ఆక్రమించటానికి కొంతమంది రంగంలోకి దిగారు. దీనిపై కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇమామ్ ఎస్హెచ్ హుస్సేనీ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. తాడిగడప, పెదపులిపాక గ్రామాలలో వక్ఫ్ భూములు దాదాపు 40 ఎకరాలకు పైగానే ఉన్నాయి. ఈ భూములు చాలా ఏళ్లుగా కొంత మంది ‘పచ్చ’నేతలు ఆక్రమించి నయాపైసా కౌలు చెల్లించకుండా సాగు చేశారు. దీనిపై ‘సాక్షి’ దిన పత్రికలో కథనాలు రావటం, వక్ఫ్ అధికారులు స్పందించటంతో ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో కౌలు బహిరంగ వేలం తహసీల్దార్ గోపాలకృష్ణ సమక్షంలో ఇటీవల నిర్వహించారు. కౌలు వేలంలో పలువురు రైతులు పాల్గొని రూ.25 లక్షలకు కౌలువేలం పాడారు. ఇక కోర్టు అనుమతులతో కౌలు పాట పాడిన వారు వక్ఫ్ భూములు సాగు చేయాల్సి ఉంది. అదును చూసి.. చొరబడి.. కొంతమంది కోర్టు ఉత్వర్వులకు వ్యతిరేకంగా, తహసీల్దార్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ వక్ఫ్ భూముల్లోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించి భూములు దున్నారని కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇమామ్ ఎస్హెచ్ హుస్సేనీ పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోడవరానికి చెందిన టి.శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు వ్యక్తులు చట్ట విరుద్ధంగా వక్ఫ్ భూముల్లోకి ప్రవేశించి భూములు దున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇమామ్ ఎస్హెచ్ హుస్సేనీ కోరారు. ఈ ఆక్రమణలపై ఇక పోలీసులు చిత్తశుద్ధితో ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కౌలు వేలం నిర్వహించినా ఆగని వైనం పోలీసులకు ఫిర్యాదు -
సత్తా చాటిన బాడీ బిల్డింగ్ క్రీడాకారులు
పెనమలూరు: రాష్ట్ర స్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చాటి పతకాలు సాధించారు. ఈ నెల 22వ తేదీన కావలిలో నిర్వహించిన సింహపురి మిస్టర్ ఆంధ్ర రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో స్పోర్ట్స్ ఫిజిక్లో ఎం.దినేష్ బంగారు పతకం గెలిచాడు. బాడీ బిల్డింగ్ 55 కేజీల విభాగంలో వి.సూర్యదేవరవరప్రసాద్, కాంస్య పతకం, 85 కేజీల విభాగంలో ఏ.నాగ అభినవ్ కాంస్య పతకం సాధించారు. క్రీడాకారులను కానూరు అశోక్ జిమ్లో ఆదివారం అభినందించి మెమెంటోలు అందజేశారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి తాల్లూరి అశోక్, కోచ్ అల్లూరిరెడ్డి, ఎమ్మెల్యే బోడెప్రసాద్, డాక్టర్ వెలినేని పవన్, యువజన సర్వీసుల శాఖ అధికారి రఘురామ్ తదితరుల అభినందించారు. ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేయండి: డీఈవో వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను విక్రయిస్తున్న విద్యాసంస్థల్లో తనిఖీలు చేసి నివేదికలు సమర్పించాలని ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల ప్రచురితమైన ‘ప్రైవేటు’ దోపిడి కథనానికి డీఈవో స్పందించారు. అలాగే వివిధ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావటంతో ఆయన మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలను తక్షణమే తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ను అధిక ధరలకు విక్రయించటం, అధిక ఫీజుల వసూలు చేసిన వారి పాఠశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ముగిసిన నాట్య ప్రాక్టికల్ పరీక్షలు కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠంలో మూడు రోజులుగా జరుగుతున్న సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. పరీక్షలకు 21 మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షలకు అధికారిగా వ్యవహరించిన సుధీర్రావు తెలిపారు. కళా పీఠం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాల కృష్ణ నట్టువాంగంతో, టీచింగ్ అసిస్టెంట్ పసుమర్తి హరినాథ శాస్త్రి మృదంగంపై సహకరించారు. ఫొటోగ్రఫీలో జిల్లాస్థాయి పోటీలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 19న ఫొటోగ్రఫీలో విశేష ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లా స్థాయిలో పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఫొటో జర్నలిస్టులు, ఫొటో గ్రాఫర్లు పోటీలలో పాల్గొనవచ్చన్నారు. జూలై 31వ తేదీలోగా తమ ఎంట్రీలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామని.. మొదటి విభాగంలో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, స్వచ్ఛాంధ్ర/స్వచ్ఛ ఎన్టీఆర్, యోగాంధ్ర అంశాలకు సంబంధించి ఫొటో ఎంట్రీలు పంపొచ్చన్నారు. రెండో విభాగంలో తల్లికి వందనం/విద్య, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం – 2 ఉన్నాయని, మూడో విభాగంలో అత్యుత్తమ న్యూస్ ఫొటో పోటీ ఉంటుందన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ (రూ. 10 వేలు), ద్వితీయ (రూ. 7వేలు), తృతీయ (రూ. 4 వేలు) బహుమతులతో పాటు రూ. 2 వేలు చొప్పున ఆరుగురికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు వివరించారు. ఒరిజినల్ ఫొటో ఎంట్రీలను డీపీఆర్వో కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, విజయవాడ–520002 చిరునామాకు నేరుగా లేదా పోస్టల్ ద్వారా సమర్పించవచ్చని, ఇతర వివరాలకు 9121215373లో సంప్రదించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. -
జగజ్జననికి జేజేలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల్లో భక్తులు జగజ్జననికి జేజేలు పలుకుతున్నారు. దుర్గమ్మకు సారె సమర్పణ కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం తరలివస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు 70 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారిని దర్శించుకునేందుకు మూడు గంటల సమయం పట్టగా, సామాన్య భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఉదయం నుంచే అంతరాలయ దర్శనం పూర్తిగా నిలిపివేశారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పణకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు ఆపేశారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే అంతరాలయ దర్శనం కల్పించారు. ఉత్సవమూర్తికి సారె సమర్పణ తెలంగాణ నుంచి అమ్మవారికి సమర్పించే బంగారు బోనంను చూసేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలోనే వేచి ఉండటంతో మరింత రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సారె ఇవ్వడానికి వచ్చిన భక్తులు తొలుత ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు. అనంతరం భక్తబృందంలోని సభ్యులకు సారెలోని పసుపు, కుంకుమతో పాటు ప్రసాదాలను పంపిణీ చేశారు. రద్దీ నియంత్రణకు దేవస్థానంలోని ఇంజినీరింగ్, పరిపాలనా విభాగం, ఇతర విభాగాల సిబ్బందికి అదనపు విధులను కేటాయించారు. సూర్యోపాసన సేవ దుర్గగుడిలో ఆదివారం సూర్యోపాసన సేవ చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్యభగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దుర్గమ్మకు సారె, బోనాలు సమర్పణ 70 వేల మందికి పైగా భక్తులకు అమ్మ దర్శనం అంతరాలయ దర్శనం రద్దు సర్వ దర్శనానికి మూడు గంటలు -
నిరంతర యోగాతో సత్ఫలితాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. ఆదివారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జరిగిన యోగాభ్యాసన కార్యక్రమం కలెక్టర్ పాల్గొన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం యోగా సాధన చేయాలన్నారు. యోగా సాధనను ఏ ఒక్క రోజుకో, నెలకో పరిమితం చేయకూడదన్నారు. నిత్యం జీవితంలో భాగం చేసుకొని సాధన చేయడం ద్వారా దాని ఫలితాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆయుష్ అధికారి డాక్టర్ రత్న ప్రియదర్శిని, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. క్రీస్తు మార్గం అనుసరణీయంగుణదల(విజయవాడ తూర్పు): సర్వమానవాళి రక్షణ ప్రణాళికలో భాగంగా ఏసుక్రీస్తు ఈ లోకానికి అరుదెంచారని, ఆయన అనుసరణీయమని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజ్ అన్నారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయంలో ఆదివారం ఉదయం సమష్టి దివ్య బలి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఈ లోకానికి వెలుగన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. అనుదిన ప్రార్థనతో పాటు భక్తి విశ్వాసాలను కొనసాగించాలని వివరించారు. దేవుడు బోధించిన ప్రేమ, జాలి, దయ వంటి సద్గుణాలను కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. -
శ్రీమన్నారాయణుడి ఆలయంలో కోటి అష్టాక్షరీ మహాయజ్ఞం
కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన ఉల్లిపాలెం గోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణస్వామి ఆలయంలో కోటి అష్టాక్షరీ మహాయజ్ఞాన్ని (శ్రీమన్నారాయణ యజ్ఞం) భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజీయర్ స్వామి తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో మహాయజ్ఞం నిర్వహణపై వివిధ వర్గాల ప్రముఖులతో స్వామీజీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 16 నుంచి 28 వరకు 13 రోజుల పాటు మహాయజ్ఞం నిర్వహించేందుకు పండితులు ముహూర్తాన్ని నిర్ణయించినట్లు స్వామిజీ చెప్పారు. దీనికి13 ప్రత్యేక యాగశాలలను నిర్మించడంతో పాటు అందులో 108 హోమగుండాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ కోటి సార్లు అష్టాక్షరీ మంత్రాన్ని జపించనున్నట్లు స్వామీజీ తెలిపారు. ఆలయంలో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు శ్రీమన్నారాయణుడి ఆలయంలో ప్రస్తుతం రూ.2 కోట్లతో అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నట్లు అష్టాక్షరీ స్వామి చెప్పారు. రూ.కోటితో గాలిగోపురం నిర్మాణం జరుగుతుండగా పనులు తుదిదశకు చేరినట్లు తెలిపారు. ఆలయం ఉత్తర, దక్షిణ ద్వారాలకు ఆర్చిల నిర్మాణాలు చేస్తున్నట్లు చెప్పారు. మహాయజ్ఞం సమయానికి అభివృద్ధి పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మహాయజ్ఞంపై రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆలయంలో ప్రతి శని, ఆదివారాలు అన్నదానం ఏర్పాటుకు కృషి చేస్తున్న దాతలను సత్కరించారు. బృందావనం పీఠాధిపతి అష్టాక్షరీ బృందావనం స్వామీజీ, అనంతపురానికి చెందిన వ్యాపారవేత్త దామోదర్దాస్, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 16 నుంచి 28 వరకు నిర్వహణ అష్టాక్షరీ స్వామి ఆధ్వర్యంలో సమావేశం -
ప్రభుత్వ పాఠశాలలో టేకు చెట్లు నరికివేత
చౌటపల్లి గ్రామస్తుల ఆగ్రహం వీరులపాడు: ప్రభుత్వ పాఠశాలలోని చెట్లను నరికి కలపను కాజేయడానికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని చౌటపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో 20 ఏళ్ల నాటి 30 టేకు చెట్లు ఉన్నాయి. వాటిలో ఐదు చెట్లు ఎండు దశకు చేరుకున్నాయి. దీంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా విద్యుత్ మిషన్తో చెట్లను కట్ చేసి తొలగించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను తొలగించాలంటే ఉన్నతాధికారుల ఆదేశాలతో పాటు మండల పరిషత్లో తీర్మానం చేసి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల ఆవరణలో ఉన్న కలపను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఎంఈవో పాల్ కెనడీని వివరణ కోరగా పాఠశాల ఆవరణలో చెట్ల తొలగించేందుకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఆయన చెప్పారు. అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్ ఘంటసాల: అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని పౌరహక్కుల సంఘం కృష్ణా జిల్లా కమిటీ సభ్యుడు జక్కా కేశవరావు అన్నారు. ఘంటసాల గోటకంలో కేశవరావు ఆదివారం మాట్లాడుతూ శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు నాయకత్వం పదేపదే ప్రకటిస్తున్నా, మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారన్నారు. మోదీ, షా ప్రభుత్వం మే 21 నుంచి మావోయిస్టు అగ్ర నాయకుల నుంచి కార్యకర్తలను పెద్ద సంఖ్యలో బూటకపు ఎన్కౌంటర్లతో కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్లో మన పౌరులను దారుణంగా చంపిన పాకిస్తాన్ పాలకులతో శాంతి చర్చలు జరపగలిగిన కేంద్రం మావోయిస్టులతో చర్చలకు నిరాకరించి నరమేథాన్ని కొనసాగించడం కుటిలనీతి కాదా అని ప్రశ్నించారు. చత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలోని సహజవనరులను పాలకులు బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలపై మావోయిస్టులు ఆప్రాంత ప్రజలను చైతన్యం పర్చడంతో గిరిజనలు, ఆదివాసీలు ఎదురిస్తుండటంతో దీనికి ప్రతిగా ఆపరేషన్ కగార్ మొదలైందన్నారు. ఈ దోపిడీకి అడ్డుపడుతున్న అటవీ చట్టాన్ని మార్చివేసి అటవీ సంరక్షణ నిబంధనలు 2022 చట్టాన్ని పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల మధ్య అప్రజాస్వామికంగా తీసుకొచ్చారన్నారు. దోపిడీ ఉన్నంతకాలం ప్రజలు హక్కుల కోసం పోరాడతారని చెప్పారు. -
ఎత్తిపోతలు.. ఉత్తమాటలు
జి.కొండూరు: ఎత్తిపోతల పథకాల విషయంలో ప్రజాప్రతినిధివి ఉత్తిమాటలుగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చింతలపూడి పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ఎన్నికల ప్రసంగాల్లో ఎమ్మెల్యే ఊదరగొట్టారు. చింతలపూడి సంగతి దేవుడెరుగు మైలవరం నియోజకవర్గానికి జీవనాడిగా ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను సైతం గాలికొదిలేశారు. దశాబ్దాల చరిత్ర ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపం కారణంగా ప్రస్తుతం మోటార్లు పని చేయడం లేదు. కాలువంతా తూడు కాడతో నిండిపోయింది. పని చేస్తున్న ఒకటి, రెండు మోటార్లు ఎత్తిపోసినా నీరు ముందుకు కదలకు రైతులు నరకయాతన పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికీ నిర్లక్ష్యం నీడలోనే తారకరామ ఎత్తి పోతల పథకం ఉండటంతో ఈ ఏడాది కూడా సాగునీరందడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్వహణను గాలికొదిలేశారు తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు గాలికొదిలేశారు. తారకరామ కుడి కాల్వపై ఉన్న నాలుగు పంప్హౌస్లలో మోటార్లు సరిగా పనిచేయని పరిస్థితి నెలకొంది. 9.25 కిలోమీటర్ల మేర ఉన్న తారకరామ కుడి కాల్వలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, తుమ్మ, జమ్ము, తూడు, మొదలైన వాటితో నిండిపోయాయి. దీంతో కాల్వలో నీరు ముందుకు నడవక పంపు హౌస్లలో ఉన్న మోటార్లకు నీరందడంలేదు. ఈ నాలుగు పంపు హౌస్లలో 14 మోటార్లు ఉండగా 8 పూర్తిగా పని చేయడంలేదు. మిగిలిన ఆరు మోటార్లు కూడా విద్యుత్ లోఓల్టేజీ కారణంగా, తూడు కాడతో మోటార్లకు నీరందక, మరమ్మతులు జరగక అంతంతమాత్రం పని చేస్తున్నాయి. ఆయకట్టు కింద 4,820 ఎకరాలు తారకరామ ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌస్ నుంచి రెండో పంప్ హౌస్కి మధ్య ఆయకట్టు సాగు భూమి 850 ఎకరాలు ఉంది. కట్టుబడిపాలెం సమీపంలో రెండో పంపుహౌస్ నుంచి మూడవ పంపు హౌస్కు మధ్య ఆయకట్టు 980ఎకరాలు ఉంది. పినపాక గ్రామం సమీపంలోని మూడవ పంప్ హౌస్ నుంచి నాలుగో పంప్హౌస్కు మధ్య ఆయకట్టు 1,123ఎకరాలు ఉంది. జి.కొండూరు సమీపంలో నాలుగో పంప్హౌస్ కింద ఆయకట్టు 1,867ఎకరాలు ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పంప్ హౌస్ల నిర్వహణను గాలికి వదిలి వేయడంతో మోటార్లు సరిగా పని చేయడం లేదు. ఈ నాలుగు పంప్ హౌస్ల కింద ఉన్న 4,820 ఎకరాల వ్యవసాయ భూమికి నీరందడంలేదు. ప్రారంభం నుంచి 6.6కిలోమీటర్లు వద్దనే నిలిచిపోయిన ఎడమ కాల్వలో సైతం తూడుకాడ పెరిగి నీరు అంతం మాత్రంగానే ప్రవహిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ ఎత్తిపోతల పథకంపై దృష్టిసారిస్తే రైతులకు కష్టాలు తొలగిపోతాయి. చింతలపూడి పూర్తి చేసి ఆరునెలల్లో నీరందిస్తానన్న ప్రజాప్రతినిధి! తారకరామ ఎత్తిపోతల నిర్వహణను గాలికొదిలేసిన వైనం మోటార్లు పనిచేయక, తూడుకాడతో నీరు ముందుకు కదలక రైతుల గగ్గోలు ఆయకట్టులో 4,820 ఎకరాల సాగు ప్రశ్నార్థకంతారకరామ కుడికాల్వపై ఉన్న నాలుగు పంపుహౌస్ల వివరాలు అంశాలు మొదటి లిఫ్ట్ రెండవ లిఫ్ట్ మూడవ లిఫ్ట్ నాల్గవ లిఫ్ట్ మోటార్లు సంఖ్య 4 4 3 3 పనిచేయని మోటార్లు 2 2 2 2 మోటార్ల కెపాసిటీ ఎచ్పీ 120 120 120 75 నీటి సామర్థ్యం క్యూసెక్లు 57.84 57.84 38.56 30.36 ఆయకట్టు ఎకరాలు 850 980 1123 1867 మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం తారకరామ ఎత్తిపోతల పథకంలో మోటార్ల మరమ్మతులకు రూ.3.57 కోట్ల వ్యయ అంచనాలతో ప్రతిపాదనలను సిద్ధం చేశాం. ఏపీ జెన్కో అధికారులు ఇటీవల పరిశీలించారు. ప్రతిపాదనలు పంపిన తర్వాత నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తాం. తారకరామ కుడి, ఎడమ కాల్వల్లో తూడుకాడ తొలగించడానికి రూ.8.9 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. –జి.వెంకటేశ్, తారకరామ ఏఈ -
గజిబిజి.. గందరగోళం!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో గజిబిజి గందరగోళంగా తయారయ్యాయి. జూన్ మాసంలో ప్రభుత్వం చేపట్టిన ఈ బదిలీల పర్వం ముగిసినప్పటికీ ఇంకా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులోకి రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇంకా అనేక సమస్యలు వెంటాడుతున్నా ఇప్పటి వరకూ వాటిని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టలేదని ఆయా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బదిలీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అమలు చేసిన నియమ నిబంధనలు మొదటి నుంచి గందరగోళంగా తయారు కావటంతో చివరి వరకూ ఉపాధ్యాయులు వాటిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చాలా రోజులు నిరసనలతో ఉపాధ్యాయులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా ఇంకా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వాటిని భర్తీ చేయరా? ఉమ్మడి కృష్ణాజిల్లాలో సగానికి పైగా మండలాల్లో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో భారీగా ఖాళీలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రెడ్డిగూడెం, చాట్రాయి, జి.కొండూరు, వత్సవాయి, జగ్గయ్య పేట, గంపలగూడెం ఇలా దాదాపుగా సగానికి పైగా మండలాల్లో ఉన్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవటంతో విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. విజయవాడ అర్బన్లోనూ మునిసిపల్ విద్యాసంస్థల్లో ఖాళీలు కనిపిస్తున్నాయి. ఇటీవల 150 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించటంతో ఆ మేర ఆయా పోస్టుల్లో భర్తీ చేయాల్సిన అధికారులు దృష్టి పెట్టకపోవటంతో ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ, ఎంటీఎస్ సిబ్బందికి సంబంధించి సుమారు ఐదారు వందల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. పోస్టింగ్ ఇచ్చినా బదిలీ కానీ వైనం.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికారులు పెద్ద సంఖ్యలో బదిలీలు నిర్వహించారు. అయితే ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న పాఠశాల నుంచి బదిలీ అయిన విద్యాసంస్థకు వెళ్లకుండా వందల సంఖ్యలో అక్కడే కొనసాగుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. బదిలీ అయిన చోటకు వేరే ఉపాధ్యాయుడు రాకపోవటంతో అక్కడి నుంచి పోస్టింగ్ ఇచ్చిన పాఠశాలకు వెళ్లలేక పలువురు ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. ఈ విధమైన పరిస్థితులు ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా శివారు ప్రాంతాల్లో ఉన్న చాలా పాఠశాలల నుంచి బయటకు వచ్చిన ఉపాధ్యాయులు వారి స్థానంలో అక్కడకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భాషా పండితులు సమస్యలతో సతమతం.. తెలుగు భాషా పండితులు, అలాగే తెలుగు బోధించే ఇతర ఉపాధ్యాయుల మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారి బదిలీల విషయంలో సందిగ్ధం నెలకొంది. వీరిలో కొంతమందికి పోస్టింగ్ ఇచ్చినా మొత్తం మీద వివాదంతో గజిబిజిగా తయారైంది. ఉర్దూ ఉపాధ్యాయుల అంశంలోనూ ఆ సంఘ నేతలు సమస్యలు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో టీచర్ల బదిలీల్లో అయోమయం సరైన కసరత్తు చేయకుండా బదిలీలు చేపట్టడంతో సమస్యలు ఇంకా సగానికి పైగా మండలాల్లో భర్తీ కాని ఖాళీలు పోస్టింగ్ ఇచ్చినా బదిలీ కాని వైనం అధికారుల తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులుసమస్యలు తక్షణం పరిష్కరించాలి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి చాలా సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దీని వల్ల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సైతం అవస్థలు పడుతున్నారు. అధికారులు త్వరితగతిన సమస్యలను పరిష్కరించి ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలి. –ఎ.సుందరయ్య, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, ఎన్టీఆర్ జిల్లా ప్రణాళిక లేకపోవటంతోనే సమస్యలు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సరైన ప్రణాళిక లేకపోవటంతో అన్ని మండలాల్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా చాలా మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖ అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలి. – ఎంవీ మహంకాళేశ్వరరావు, అధ్యక్షుడు, వైఎస్సార్ టీఏ, కృష్ణాజిల్లా కొరవడిన కసరత్తు.. విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేయకుండా, సరైన ప్రణాళిక లేకుండా బదిలీల ప్రక్రియను నిర్వహించడంతో అనేక సమస్యలు తలెత్తాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు అవగాహనా రాహిత్యంతో నిబంధనలు ఏర్పాటు చేసి బదిలీలు చేయాలని ఆదేశించటం వల్ల కూడా సమస్యలు తలెత్తాయని విద్యాశాఖ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
ముగిసిన జగన్నాథ రథయాత్ర
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీజగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పూరిలో జరుగుతున్న జగన్నాథ స్వామి రథయాత్ర తరహాలో ఇక్కడ విజయవాడ ఇస్కాన్ మందిరం అధ్యక్షుడు శ్రీమాన్ చక్రధారి దాసు నేతృత్వంలో జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు నిర్వహించడంపై భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా లోక కల్యాణార్థం సుదర్శన నారసింహ యజ్ఞం నిర్వహించారు. పూలతో అలంకరించిన ఎడ్లబండిలో శ్రీసుభద్ర మహారాణి వేంచేసి ఉండగా.. సీతానగరం వీరాంజనేయ స్వామి గుడి నుంచి ప్రారంభమైన శోభా యాత్ర ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతమ్మవారి పాదాల సమీపంలో ఏర్పాటు చేసిన గుండిచ మందిరం వరకు సాగింది. ఇందులో భాగంగా మహిళలు జగన్నాఽథ, బలభద్ర – సుభద్రల మూర్తులకు సారె సమర్పించారు. ఆలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సవాల్లో భాగంగా భరత నాట్య కళాకారులు శ్రీజ, డాక్టర్ గౌతమి, సత్యవతి చక్రవర్తి ప్రదర్శించిన నృత్యాలు భక్తులను అలరించాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన ఇస్కాన్ భక్త బృందం, రాక్ బాండ్ గానం చేసిన హరినామ సంకీర్తనలు ఆధ్యాత్మిక డోలికల్లో ముంచెత్తాయి. అలాగే మహిళల కోలాటం, పురుషుల విలువిద్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలంకరించిన ఎడ్లబండిపై శోభాయాత్రమహిళల సాంస్కృతిక ప్రదర్శనలుసీతానగరం వద్ద సారె సమర్పణకు వస్తున్న మహిళలులోక కల్యాణార్థం సుదర్శన నారసింహ యజ్ఞం భక్తజనం సారె సమర్పణ -
కనులపండువగా కల్యాణం
గుడ్లవల్లేరు: డోకిపర్రు భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణాన్ని మెయిల్ అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆధ్వర్యంలో వైభవోపేతంగా కనులపండువగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు పురిటిపాటి వీరారెడ్డి, విజయలక్ష్మి దంపతులు, బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు ఉన్నారు. వ్యక్తిపై గొడ్డలితో దాడి మైలవరం: రెడ్డిగూడెం మండలం బూరుగగూడెంలో భూ వివాదం శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బూరుగుగూడెంలో మట్టకొయ్య శ్రీను(55) తండ్రి వెంకయ్య కు కె.మనోజ్, అతని తండ్రి జయరాజు కుబుంబ సభ్యులకు ఇంటి సరిహద్దు వివాదముంది. దీంతో మనోజ్ కుటుంబసభ్యులు మట్టకొయ్య శ్రీను ఇంటిపై దాడికి దిగారు. రెండువైపులా గొడవలు పెరగగా మనోజ్ గొడ్డలితో శ్రీను తలపై బలంగా నరికాడు. దీంతో శ్రీను ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. శ్రీను కుటుంబం భయాందోళనకు గురై హుటాహుటిన రెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి స్థానిక వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. అక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అనంతరం కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గతేడాది నుంచి మమ్మల్ని చంపేందుకు అనేక సార్లు ప్రయత్నించారని, ఈ రోజు తెగించి గొడ్డలితో దాడి చేశారన్నారు. తమకు మనోజ్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, ప్రాణ రక్షణ కల్పించాలని మీడియా ద్వారా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వ బడిని కాపాడుకుందాం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనా ఉందని, సర్కార్ బడుల్లో అడ్మిషన్ల పెంపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల దగ్గర చదివించాలని కోరారు. ప్రభుత్వం ఉపాధ్యాయులని బోధనకి ఎక్కువ సమయం కేటాయించే విధంగా చూడాలని, ఆన్లైన్ పనులను ప్రభుత్వం చెప్పటం మానుకోవాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్కుమార్ మాట్లాడుతూ మోడల్ ప్రైమరీ కాన్సెప్ట్ను వినియోగించుకుని, ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రాథమిక పాఠశాలల రోల్ పెంచాలని కోరారు. ఐక్యంగా పోరాటం.. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సుందరయ్య మాట్లాడుతూ గతకాలం సంఘం కార్యకలాపాల రిపోర్ట్ను ప్రవేశపెట్టారు. జరిగిన బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాలను ఐక్యంగా నడిపి ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వంతో మాట్లాడి అనేక సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, నాయకులు మచ్చా శ్రీనివాస్, ఎం. కృష్ణయ్య, పి. నాగేశ్వరరావు, హరిప్రసాద్, కె. గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు -
విద్యార్థుల భవితను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
కోనేరుసెంటర్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులకే ఉంటుందని, అటువంటి ఉపాధ్యాయులు తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కృష్ణాజిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కృష్ణా విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు వ్యక్తిత్వ వికాసం, ప్రేరణ తరగతులను నిర్వహించారు. ఈ తరగతులకు కలెక్టర్ హాజరై ఉపాధ్యాయులకు స్వయంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్న వనరులు ఉంటే సరిపోదని సరైన ప్రజలు కూడా ఉండాలన్నారు. ఆ ప్రజలను మంచి వారిగా తీర్చిదిద్దాలంటే ఒక ఉపాధ్యాయునికే సాధ్యమవుతుందన్నారు. హను మంతుడికి తన శక్తి ఏమిటో తనకు తెలియదని, అలాగే విద్యార్థులలో ఉండే సృజనాత్మక శక్తిని గుర్తించి ప్రేరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయు లదేనన్నారు. విద్యార్థుల జీవితాలను వారి తలరాతలను మార్చగలిగే శక్తి సామర్థ్యం ఒక్క ఉపాధ్యాయుడికే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జపాన్, ఉక్రెయిన్ దేశాలు ప్రపంచ పటంలో ఎలా ఎదిగాయనే విషయాన్ని సోదాహరణంగా వివరించారు. జిల్లా విద్యాధికారి పీవీజే రామారావు మాట్లాడుతూ ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో జిల్లా 82.32 శాతం ఫలితాలను సాధించిందని, 161 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ గా నిలిచారని తెలిపారు. ఈసారి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం సాధించాలన్నారు. రిసోర్స్ పర్సన్లు గంపా నాగేశ్వరరావు, నండూరి సుబ్బారావు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చారు. ఈ ప్రేరణ తరగతుల్లో విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రాంజీ, రిజిస్ట్రార్ ఉష, ఉపవిద్యాధికారులు, జిల్లాలోని హెచ్ఎంలు పాల్గొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఉపాధ్యాయులకు స్వయంగా శిక్షణ ఇచ్చిన కృష్ణా కలెక్టర్ బాలాజీ -
ధాన్యం.. దైన్యం
వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు గ్రామానికి చెందిన రైతు వి.సూర్యప్రకాష్ నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. వెల్లంకి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మే నెలాఖరులో ధాన్యం విక్రయించాడు. మొత్తం 465 టిక్కీలు ధాన్యం కాటా వేసి పది రోజులకు పైగా పొలంలోనే ఉంచారు. లారీలు లేవని చెప్పి ధాన్యం తీసుకెళ్లలేదు. వర్షాలు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోలేదు. పన్నెండు రోజుల తర్వాత పొలంలోని ధాన్యం తరలించారు. 24 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు వేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు జమ కాలేదు. ఖరీఫ్కు సమాయత్తం కావడానికి చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్నాడు. పెట్టుబడికి డబ్బులు లేవు కొనుగోలు కేంద్రంలో మే నెలలో 185 టిక్కీల ధాన్యం విక్రయించాను. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామన్నారు. రెండు నెలలైనా డబ్బులు రాలేదు. సుమారు రూ.2లక్షలు రావాల్సి ఉంది. మళ్లీ సీజన్ ప్రారంభమైంది. పెట్టుబడికి డబ్బులు లేవు. ఽతక్షణమే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. – కె.మల్లికార్జున రావు, ఇబ్రహీంపట్నం రైతుల పక్షాన ఆందోళన చేస్తాం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. రైతులకు రెండు నెలలుగా డబ్బులు చెల్లించలేదు. మొత్తం కౌలు రైతులే ఉన్నారు. కౌలు చెల్లింపు, పెట్టుబడులకు డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఎండీని కలిస్తే త్వరలో చెల్లిస్తామన్నారు. ఇప్పటికే 15 రోజులు గడిచింది. రైతుల పక్షాన ఈనెల 30న ఆందోళన చేపడతాం. రైతుల బకాయిలు చెల్లించాలి. – జమలయ్య, కౌలు రైతు సంఘం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఏ వర్గాన్నీ వదలకుండా అందరికీ బకాయిలు పెడుతోంది. విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగులకు డీఏ బకాయిలు పెట్టినట్లే ....రైతులకు ధాన్యం సొమ్ము బకాయి పడింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోగా, వారి నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడం లేదు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ధాన్యం విక్రయించిన రైతులు డబ్బుల కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం, వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు, ఎరువులు, దుక్కులు, కౌలు చెల్లించేందుకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి వస్తే అన్నదాత సుభీభవ పథకం కింద ఇస్తామన్న రూ.20వేలు ఆర్థిక సహాయం అందించలేదు. కొన్ని కేంద్రాల వద్ద సిబ్బంది రేపు మాపు అంటూ రైతులను తిప్పుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రెండు నెలలు గడిచినా... ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ప్రభుత్వం 824 మంది రైతులకు రూ.30.27 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరంతా ధాన్యం విక్రయించి రెండు నెలలు కావస్తోంది. వీరిలో 60 శాతానికి పైగా కౌలు రైతులు ఉన్నారు. ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులతో కౌలు, ఎరువులు, పురుగుమందుల షాపుల్లో అప్పులు తీర్చాల్సి ఉంది. అప్పుల వాళ్లు, భూమి యజమానులు రైతుల ఇళ్ల చుట్టూ తిరుగుతు న్నారు. కానీ ధాన్యం విక్రయించినా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ సమాధానం చెప్పే వారు లేకపోవడంతో ఎవరిని అడగాలో కూడా తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొందరు అధికారులు మాత్రం ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి ఏ ఒక్క రైతుకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. ఇటీవల రైతు సంఘాల నాయకులు కార్పొరేషన్ ఎండీని కలిసి రైతులకు బకాయిలు చెల్లించాలని వినతిపత్రం అందించారు. త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అతీ గతీ లేదు.అప్పుల కోసం అన్నదాతల తిప్పలు జిల్లాలో 824 మంది రైతులకు రూ.30.27 కోట్లు బకాయి రెండు నెలలుగా అవస్థలు పెట్టుబడుల కోసం ఎదురు చూపులు ఖరీఫ్ సాగు పనులు మరింత భారం -
ముగిసిన పాలిసెట్–2025 సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ద్వారా నిర్వహించిన పాలిసెట్–2025 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ నెల 21వ తేదీన మొదలైన సర్టిఫికెట్ల పరిశీలన శనివారం సాయంత్రం ముగిసింది. సర్టిపికెట్ల పరిశీలన కోసం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్రా లయోలా డిగ్రీ కళాశాల, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులకు తేదీలను కేటాయించి వాటి ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలన చేసి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ సోమవారం నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవచ్చునని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. 492 మంది సర్టిఫికెట్ల పరిశీలన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 84 మంది స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 217 మంది, ఆంధ్రా లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 191 మంది సర్టిఫికెట్లను శనివారం పరిశీలించారు. మొత్తం 492 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని విజయసారథి చెప్పారు. కృష్ణాజిల్లాలో... గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తొలిసారిగా నిర్వహించిన పాలీసెట్–2025 కౌన్సెలింగ్ శనివారంతో ముగిసినట్లు కోఆర్డినేటర్ వీవీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్లో మొత్తం 1,075 మంది అభ్యర్థులు పాల్గొని తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకున్నట్లు వివరించారు. కౌన్సెలింగ్ నిమిత్తం కళాశాలలో ఏర్పాటుచేసిన సదుపాయాలపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన కళాశాల అధ్యాపక బృందం, సిబ్బందిని ఆయన అభినందించారు.రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్కు అవకాశం -
సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ మోసాల అదుపు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల ఆన్లైన్ మోసాలు బాగా పెరిగాయని, మనకు తెలియకుండానే బ్యాంక్ ఖాతాలో డబ్బులు కూడా దోచే పరిస్థితులున్నాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు నేరాలను అరికట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి వీధి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సురక్షా 360ను హోంమంత్రి అనిత శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి ఆలయం, చర్చి, మసీదులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా సురక్ష డివైన్ ఏర్పాటు, 28 స్టేషన్ అధికారులకు సురక్ష డివైన్ కిట్లు అందజేశారు. జిల్లాలోని ప్రజల భద్రత కోసం 321 గ్రామాలు, 20 మండలాలు, నాలుగు మునిసిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థలోని 64 వార్డులు మొత్తం 1211 చదరపు కిలోమీటర్లు అంతా నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దాతల సహకారంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ గుణదలలోని వెన్యూ కల్యాణ మండపంలో జరిగిన సురక్ష 360 ప్రారంభోత్సవంలో పాల్గొన్న హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందన్నారు. ఎక్కడ నేరం జరిగినా, ట్రాఫిక్ స్తంభించినా, అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తున్నారని, ఈ యాప్ని విశాఖ పోలీసులు స్ఫూర్తిగా తీసుకుని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేరాలు తగ్గించేందుకు పోలీసులు సమష్టిగా కృషి చేయాలి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలి సురక్ష 360 ప్రారంభోత్సవంలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రతి గ్రామంలో 4 సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖరబాబు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఎమ్మెల్యే సుజనా చౌదరి సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, బొండా ఉమా, సుజనాచౌదరి, కొలికపూడి శ్రీనివాసరావు, శ్రీరాం రాజగోపాల్, కలెక్టర్ జి.లక్ష్మీశ, డీసీపీ సరిత తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక దందా
పచ్చనేతల కూటమి ప్రభుత్వం కొన్ని నెలల తర్వాత ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టింది. దీంతో అధికార పార్టీ చోటా మోటా నాయకులకు ఇది వరంగా మారింది. ఉచిత ఇసుకను కృష్ణానది, మున్నేరు, కట్టలేరు ఉపనదుల్లో ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు చేర్చి రాత్రి సమయంలో పెద్ద లారీలకు లోడింగ్ చేసి తెలంగాణలోని మధిర, ఖమ్మం, వైరా తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసరలో ఓ చోటా నాయకుడు మాత్రం ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నాడని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇసుకకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. కంచికచర్ల మండలం వేములపల్లిలో లారీల్లో తరలివెళ్తున్న ఇసుక సాక్షి ప్రతినిధి, విజయవాడ: పచ్చనేతలు జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు నదుల్లో ఇసుత తవ్వకాలపై నిషేధం ఉంది. వాటిని తుంగలో తొక్కి నదుల నుంచి యథేచ్ఛగా తెలంగాణకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దందా అంతా పార్లమెంటు ప్రజాప్రతినిధి, నియోజక వర్గ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది. చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పడం తప్ప, ఆచరణలో అమలు కావడం లేదు. పర్యవేక్షించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు మామూళ్లు తీసుకొంటూ పచ్చ జెండా ఊపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. తోడేస్తున్నారు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇసుక లబ్ధిదారులకు అందుబాటులో ఉండేది. దీంతో ప్రతిఒక్కరూ సకాలంలో ఇళ్లు నిర్మించుకునేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి కానరావడం లేదు. రీచ్ల్లో కాంట్రాక్టర్కు నగదు చెల్లిస్తే చాలు ఎంత కావాలంటే అంత ఇసుకను లోడ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. నో చలానా... ఓన్లీ క్యాష్ అంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా లేకుండా విజయవాడ పార్లమెంట్ ప్రజాప్రతినిధి అనుచరులు, ఒక్కో లారీకి రూ.10వేలు ఇస్తే చాలు ఎన్ని టన్నులైనా లారీలకు నింపుతామని బహిరంగంగానే అంటున్నారు. కూటమి నేతలకు ఎవరికీ సంబంధం లేకుండా ఏకపక్షంగా పార్లమెంటు ప్రజాప్రతినిధి అనుచరులు మూడు రీచ్ల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. అధికారుల వత్తాసు జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో ఇసుక రీచ్ నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు. వాటిలో కొన్ని లారీల ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ లారీ ఇసుక ధర లక్ష రూపాయలు పలుకుతోంది. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే సమయంలో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు సైతం ఈ దందాకు వత్తాసు పలుకుతున్నారు. పార్లమెంటు ప్రజా ప్రతినిధి కార్యాలయంలో ఉండే అవినీతి‘ కిశోరం’ ఈ దందాకు రింగ్ మాస్టర్గా వ్యవహరిస్తున్నారు. ‘జగ్గయ్యపేట’లో వత్సవాయి మండలంలో ఇందుగు పల్లి, ఆళ్లూరుపాడు, పోలంపల్లి వద్ద మునేరు నుంచి ఇసుక అక్రమంగా టిప్పర్లో తెలంగాణకు తరలి పోతోంది. టిప్పర్లకు జేసీబీ ద్వారా ఇసుక లోడింగ్ చేస్తున్నారు. పెనుగంచిప్రోలు శివారులో వెంచర్లో ట్రాక్టర్లతో మునేరు నుంచి ఇసుక డంప్చేసి అర్ధరాత్రి తర్వాత లారీల్లో లోడ్ చేసి తెలంగాణకు తరలిస్తున్నారు. అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు మునేరు ఇసుక రీచ్ల నుంచి ట్రాక్టర్లలో శివాపురం, జొన్నలగడ్డ మీదుగా తెలంగాణకు తరలిపోతోంది. ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లో సాగుతోంది. చెక్పోస్టులున్నా దాటిపోతోంది జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి, రావిరాల, మల్కాపురం, అన్నవరం, గ్రామాల్లోని కృష్ణానది, మునేరు, పాలేరు నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా పక్క రాష్ట్రానికి వెళ్లిపోతోంది. చందర్లపాడు మండలం కాసరబాద నుంచి కృష్ణానది నుంచి ఇసుక లారీల్లో అక్రమంగా సరిహద్దులోని చెక్పోస్టులు సూర్యాపేట మీదుగా తెలంగాణాకు వెళ్తోంది. చెక్పోస్టులు ఉన్నా అధికారుల అండదండలతో సరిహద్దు దాటుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాలేరు, మునేరులలో నీరు ఉండటంతో ఇసుకను ఖాళీ ప్రదేశాలతో డంపింగ్ చేస్తున్నారు. తెలంగాణకు అక్రమ రవాణా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బుట్ట దాఖలు నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు తెలంగాణలో లక్ష రూపాయలు పలుకుతున్న లారీ ఇసుక ధర కోట్లలో దోచుకుంటున్న ఇసుక, మట్టి మాఫియా రింగ్ మాస్టర్గా అవినీతి ‘కిశోరం’ తిరువూరు టు తెలంగాణ తిరువూరు నియోజకవర్గ పరిసరాల్లోని తెలంగాణ సరిహద్దు గ్రామాలకు కృష్ణా నది ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీ నుంచి ఇసుకను టిప్పర్లలో తిరువూరు శివారులోని మర్లకుంట–తోకపల్లి, అక్కపాలెం, గంపలగూడెం మండలంలోని ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాల్లో దళారులు డంప్ చేస్తున్నారు. అక్కడ నుంచి ట్రాక్టర్లలో ఇసుకను కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాలకు తరలిస్తున్నారు. ట్రాక్టరు ఇసుక రూ.6వేల చొప్పున విక్రయిస్తున్నారు. మూడు రోజుల క్రితం తిరువూరు మీదుగా తరలుతున్న రెండు ఇసుక టిప్పర్లను తెలంగాణ టాస్క్ఫోర్స్ అధికారులు పెనుబల్లి మండలంలో స్వాధీనం చేసుకున్నారు. -
జగన్నాథ రఽథయాత్ర
వైభవంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇస్కాన్ ఆధ్వర్యాన శుక్రవారం సాయంత్రం నిర్వహించిన జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. విద్యాధరపురంలోని లేబర్కాలనీ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన రథయాత్ర స్వాతి థియేటర్ రోడ్, జాతీయ రహదారి మీదుగా బ్యాంక్ సెంటర్, కుమ్మరిపాలెం సెంటర్, రథం సెంటర్కు చేరుకుంది. అక్కడ నుంచి సీతమ్మవారి పాదాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుండిచ మందిరం వద్దకు చేరుకుంది. దాదాపు 6 కిలోమీటర్ల మేర రథయాత్ర జరిగింది. వేలాది మంది భక్తుల నడుమ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వేంచేసి ఉన్న రథం పురవీధుల్లో కొనసాగింది. రథయాత్ర కొనసాగినంత మేర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు, భక్తులు చీపుళ్లతో వీధులను శుభ్రం చేస్తూ పూలు చల్లారు. రథంపై ఇస్కాన్ అధ్యక్షుడు చక్రధారి దాస్, లైలా గ్రూప్ సీఈఓ గోకరాజు గంగరాజు ఆశీనులయ్యారు. తొలుత పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వామివారికి మొదటి హారతి ఇచ్చి రథం ముందు బంగారు చీపురుతో ఊడ్చారు. ముఖ్యఅతిథులుగా ఇస్కాన్ జీబీసీ శ్రీమాన్ రేవతి రమణ్ ప్రభుజీ, పారిశ్రామికవేత్త తొండెపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
పేరుకే డివిజనల్ రైల్వే ఆస్పత్రి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పేరుకే డివిజనల్ రైల్వే ఆస్పత్రి.. కానీ వసతులు మాత్రం కానరావు. విజయవాడ రైల్వే డివిజన్ దువ్వాడ నుంచి గూడూరు వరకు విస్తరించి ఉంది. ఈ పరిధిలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రధాన కేంద్రమైన విజయవాడ రైల్వే డివిజనల్ ఆస్పత్రికి వస్తుంటారు. ఇటువంటి ఆస్పత్రిలో సరైన మౌలిక సదుపాయాలు అందడం లేదని రోగులు, వారి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసతులు ఏవీ? డివిజన్లోని దువ్వాడ, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ, ఏలూరు, గుడివాడ, మచిలీపట్నం, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, బిట్రగుంట, కావలి, నెల్లూరు, గూడూరు తదితర ప్రాంతాల నుంచి అనారోగ్యంతో బాధపడే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాల నుంచి రైళ్లలో ప్రయాణించి విజయవాడ రైల్వే ఆస్పత్రికి వస్తుంటారు. కానీ సౌకర్యాలు లేకపోవడమే ఇక్కడ సమస్యగా మారింది. వృద్ధుల పరిస్థితి మరింత దయనీయం ముఖ్యంగా రైల్వే ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువగా వయోభారంతో బాధపడే విశ్రాంత ఉద్యోగులు ఉంటున్నారు. వారిలో ఎవరైనా ఒకరు అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే రోగిని వీల్చైర్లో కుర్చోపెట్టుకుని వృద్ధులే వైద్యుల వద్దకు, అక్కడ నుంచి వార్డుకు, ఎక్స్రేతో పాటు పలు రకాల పరీక్షల కోసం ల్యాబ్లకు కూడ తీసుకు వెళ్లాల్సి వస్తుంది. వయోభారంతో వీల్చైర్, స్ట్రెచ్చర్లను తోసుకుంటూవారు పడే బాధలు నిత్యం రైల్వే ఆస్పత్రిలో కనిపిస్తుంటాయి. డబ్బు కడుతున్నా అందని సదుపాయాలు ప్రతి నెలా ఉద్యోగులు జీతంలోను, విశ్రాంత ఉద్యోగులు తమ పెన్షన్లో మెడికల్ ఎలవెన్స్ రూపంలో ఏటా లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా తమకు సరైన వైద్య సదుపాయాలు విజయవాడ డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కష్టమైనా తాముండే ప్రాంతంలోనే ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. పట్టించుకోని ఉన్నతాధికారులు రైల్వే అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సరైన వైద్యసేవలు అందించకుండా సిబ్బంది చిన్నచూపు చూస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రిలో వార్డు బాయ్స్ కూడా అందుబాటులో ఉండటం లేదని.. ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని విభాగాలకు వైద్యులు లేరని, సిబ్బంది కూడా అంతంతమాత్రంగా ఉన్నారు. ఇప్పటికై నా డీఆర్ఎం, ఏడీఆర్ఎం, సీఎంఎస్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి రోగులకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ర్యాంపు మార్గంలో వీల్చైర్లో రోగిని తీసుకెళుతున్న కుటుంబ సభ్యులు విజయవాడ ఆస్పత్రిలో దివ్యాంగులు, వృద్ధులకు కనీస సౌకర్యాలు కరవు పట్టించుకోని రైల్వే ఉన్నతాధికారులు రైల్వే ఆస్పత్రిలో 10 విభాగాలు ఉన్నాయి. నిత్యం సుమారు 500 మంది ఓపీ వస్తారు. రైల్వే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే దివ్యాంగులు, నడవలేని వృద్ధులు వసతుల్లేక తిప్పలు పడుతున్నారు. రోగుల అనారోగ్య పరిస్థితి మేరకు ఆస్పత్రి సిబ్బంది వీల్చైర్లు, స్ట్రెచ్చర్లలో క్యాజ్వాల్టీ, సంబంధిత వైద్యుల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రైల్వే ఆస్పత్రిలో కానరాదు. అత్యవసర పరిస్థితిలో కూడా రోగులు అంబులెన్స్లు, ప్రైవేటు వాహనాల్లో రైల్వే ఆస్పత్రులకు వస్తే అక్కడ రోగులను వెంటనే క్యాజువాల్టీకి తరలించేందుకు వార్డుబాయ్స్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండటంలేదు. దీనిపై సిబ్బందిని అడిగితే బయట వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు ఉంటాయని వాటిపై రోగిని మీరే తీసుకు రావాలని చెబుతున్నారు. రోగుల సహాయకులే అవి ఎక్కడున్నాయో వెతుక్కుని వాటిలో క్యాజ్వాల్టీకి తీసుకెళ్తున్నారు. అక్కడ వైద్యులు పరీక్షించిన అనంతరం వారికి ఎక్స్రే, రక్తపరీక్షలకు వెళ్లాలన్నా బంధువులే రోగులను వీల్చైర్లు, స్ట్రెచ్చర్లలో తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రణమిల్లిన భక్తజనం
అమ్మవారికి సారె సమర్పణకు తరలివస్తున్న భక్త బృందాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తజనం ప్రణమిల్లారు. ఆషాఢ మాసోత్సవాలు, శుక్రవారం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారెను సమ ర్పించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఆలయ ఈవో వి. సుబ్బారావు దంపతులు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీర, సారెను సమర్పించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ● ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. దీంతో మహా మండపం ఆరో అంతస్తులో పండుగ వాతావరణం నెలకొంది కిటకిటలాడిన క్యూలైన్లు ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. మహా మండపం, లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్డులో కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300 టికెట్ క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం 4 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా, సేవలో పాల్గొనే టికెట్లకు డిమాండ్ కనిపించింది. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. మౌలిక వసతుల పరిశీలన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై నోడల్ అధికారి టి.చంద్రకుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. నోడల్ అధికారి వెంట దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ సమర్పణ
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి దర్శి వాస్తవ్యులు యారాశి శ్రీకాంత్ రెడ్డి, చంద్రిక కుటుంబ సభ్యులు వెండి నాగపడగను శుక్రవారం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్నవారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణకు 550 గ్రాములు.. సుమారు రూ. 60 వేలతో చేయించిన నాగపడగను స్వామివారి కానుకగా అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో అధికారులు సత్కరించారు. దాతలకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. సచివాలయ కార్యదర్శుల బదిలీలు షురూ మచిలీపట్నంటౌన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, 8 మున్సిపాలిటీల పరిధిలో వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న పలు విభాగాల కార్యదర్శుల బదిలీ ప్రక్రియను శుక్రవారం మచిలీపట్నం మునిసిపల్ కార్యాలయంలోని పాత కౌన్సిల్ హాల్లో ప్రారంభించారు. బదిలీ కమిటీ చైర్మన్, నగర కమిషనర్ సీహెచ్వీవీఎస్ బాపిరాజు, డీఎంఏ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నాగభూషణం పర్యవేక్షణలో ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో జరిగింది. కార్యదర్శులుగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసిన వారిని తప్పని సరిగా బదిలీ చేయడానికి జాబితాలు సిద్ధం చేశారు. సీనియారిటీ, వయసు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, రిక్వెస్టులను పరిశీలించి శుక్రవారం రాత్రికి బదిలీ జాబితాను పూర్తిచేయడానికి కసరత్తు చేస్తున్నారు. కార్యదర్శులు ప్రస్తుతం పని చేస్తున్న వార్డు, నివసించే వార్డు కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయనున్నారు. ఐసీఈయూ ప్లాటినం జూబ్లీ లోగో ఆవిష్కరణ మచిలీపట్నంటౌన్: భారత దేశ బీమా రంగ ట్రేడ్ యూనియన్ అల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ను ఏర్పాటుచేసి జూలై 1వ తేదీ నాటికి, 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ సంఘ ప్లాటినం జూబ్లీ లోగోను నాయకులు శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. స్థానిక ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ సంఘ మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి కిషోర్, నేతలు జె.సుధాకర్, డి.వాసు, ఎల్.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఉరుసు కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కాలేషా వలి బాబా ఉరుసు మహోత్సవం గురువారం రాత్రి ముగిసింది. బాబా వారికి చాదర్, గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముజావర్ల ఇళ్ల నుంచి బయలు దేరిన గంధం మహోత్సవం ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొన సాగింది. అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మత పెద్దలు హాజరయ్యారు. గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామ, వార్డు సచివాలయాల్లోని సర్వేయర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కోరారు. సమస్యల పరిష్కారానికి విజయవాడ ధర్నా చౌక్లో సర్వేయర్లు చేపట్టిన మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు శుక్ర వారంతో ముగిశాయి. ఆయన మాట్లాడుతూ జీవో నంబరు 5లో మార్పులు చేసి.. అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాలని కోరారు. నిబంధనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్నారు. బదిలీల ప్రక్రియలో సొంత మండలం నిబంధన సవరించాలని సూచించారు. దీక్షలో గ్రామ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
బంగారం రికవరీలో పోలీసుల చేతివాటం
గన్నవరం: చోరీకి గురైన బంగారం రికవరీ విషయంలో ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు చేతివాటం ప్రదర్శించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సదరు బంగారం కొనుగోలు చేసిన నగలు దుకాణం యాజమానిని కేసు నుంచి తప్పించేందుకు పెద్ద మొత్తంలో పోలీసులు వసూలు చేశారు. అంతే కాకుండా తక్కువ నాణ్యత కలిగిన బంగారంతో చోరీకి గురైన వస్తువులను తయారు చేయించి రికవరీ చూపించారు. ఈ ఘటనకు సంబంధించి సదరు నగల వ్యాపారితో ఎస్ఐ, ఓ కానిస్టేబుల్ ఫోన్లో జరిపిన సంభాషణలు బయటకు రావడంతో పోలీసుల నిజస్వరూపం బట్టబయలైంది. వివరాలిలా వున్నాయి. ఇటీవల ఆత్కూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నలుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఐదు బైక్లు, బంగారం, వెండి వస్తువులను రికవరీ చేశారు. వీరిని ఈ నెల 17న గన్నవరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆత్కూరు పోలీసులు అరెస్ట్ చూపించిన విషయం తెలిసిందే. రెండు కాసుల రికవరీలో... నిందితుల్లో ఒకరు చోరీ చేసిన రెండు కాసుల బరువైన రెండు బంగారు గొలుసులను ఏలూరులోని ఓ నగల వ్యాపారికి మాయమాటలు చెప్పి విక్రయించాడు. పట్టుబడిన దొంగ ఇచ్చిన సమాచారం మేరకు ఆత్కూరు పోలీసులు సదరు నగల వ్యాపారిని విచారించారు. అయితే సదరు వ్యాపారి నుంచి చోరీకి గురైన 22 క్యారెట్ బంగారు గొలుసులను రికవరీ చేయకుండా, అతనిని బెదిరించి తక్కువ నాణ్యత కలిగిన 18 క్యారెట్ బంగారంతో సదరు గొలుసులను తయారు చేయించారు. దీనికి ప్రతిఫలంతో పాటు నగల వ్యాపారిని కేసులో ఇరికిస్తామని భయపెట్టి రూ.30 వేలు నగదును పోలీసులు ముందుగానే వసూలు చేశారు. మరో రూ.10 వేలు నగదును ఆత్కూరు పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లో పనిచేసే ఉద్యోగి ఖాతాకు ఫోన్పే ద్వారా జమ చేయించి వసూలు చేశారు. నగదు లావాదేవీలు, బంగారం నాణ్యత, తయారీ గురించి స్వయంగా ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ మహేష్ సదరు నగల వ్యాపారితో జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులు బయటపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా డబ్బుల కోసం ఆత్కూరు పోలీసులు డిమాండ్ చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సదరు నగల వ్యాపారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు నగల వ్యాపారితో ఎస్ఐ, కానిస్టేబుల్ మహేష్ జరిపిన ఆడియో రికార్డులతో ఫిర్యాదులు ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరాయి. రాష్ట్ర డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్, ఏలూరు రేంజ్ డీఐజీ, కృష్ణాజిల్లా ఎస్పీకి కొంత మంది ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే ఈ ఫిర్యాదుపై విచారణ కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు అవాస్తవం... రికవరీ చేసిన బంగారం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఎస్ఐ సురేష్ వివరణ ఇచ్చారు. మొదట రికవరీ చూపించాల్సిన బంగారం కంటే తక్కువ బంగారం ఇవ్వడంతో మందలించామనే అక్కసుతో సదరు వ్యాపారి తమపై ఫిర్యాదు చేసి ఉండవచ్చన్నారు. చోరీ కేసుల విచారణ, దొంగలను పట్టుకునేందుకు అయ్యే ఖర్చులను రాబట్టేందుకు నగల వ్యాపారిని తమ సిబ్బంది నగదు అడిగి ఉండవచ్చని అన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం
చందర్లపాడు(నందిగామ టౌన్): విద్యుదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన చందర్లపాడు గ్రామంలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు చందర్లపాడు గ్రామానికి చెందిన బూతుకూరి గోపాలరెడ్డి (37) రోజూ మాదిరిగా శుక్రవారం కూలి పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో పంట పొలంలో ట్రాక్టర్లోని పసుపు కొమ్ముల లోడు దిగుమతి చేస్తుండగా ఒక్క సారిగా 33 కేవీ విద్యుత్ వైర్లను తాకటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరా లు సేకరించి మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నివాళులు.. చందర్లపాడు గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన గోపాలరెడ్డి మృతదేహాన్ని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ముక్కపాటి నరసింహారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఎన్ ప్రసాద్, వెలగపూడి వెంకటేశ్వరరావు, కోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు -
ప్రజలకు ముఖాలు చూపలేకపోతున్నాం
జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేటలో శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో అత్యవసర సేవలైన తాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్య నిర్వహణపై కౌన్సిల్ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. పార్టీలకు అతీతంగా టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీ సభ్యులు సమస్యలపై పాలకవర్గాన్ని ఏకపక్షంగా నిలదీశారు. ఒకానొక సందర్భంలో కూటమి పాలకవర్గానికి చెందిన టీడీపీ మహిళా కౌన్సిలర్ కంచేటి గీతారాణి తన వార్డులో పనులు చేయడం లేదని, వార్డులో తనను గెలిపించిన ప్రజలకు ముఖాన్ని చూపించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తనకు చివరి సమావేశం అని, వచ్చే సమావేశానికి తాను రానని, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ మీటింగ్ హాల్లో శుక్రవారం కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగింది. చైర్మన్ రాఘవేంద్ర మాట్లాడుతూ 15 వ ఆర్థిక సంఘానికి సంబంధించి వివిధ ప్రాజెక్టుల ద్వారా రూ.11.27 కోట్లు మంజూరయ్యాయని, వాటితో పట్టణంలోని పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రజల్లో అసంతృప్తి తొలగించలేకపోతున్నాం జనసేనకు చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ మాట్లాడుతూ ఈ కూటమి పాలనలో కోట్ల నిధులు మంజూరవుతున్నప్పటికీ ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తిని తొలగించలేకపోతున్నామన్నారు. పారిశుద్ధ్య పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కాలువల్లో వారాల తరబడి చెత్త తొలగించడంలేదని, వార్డుల్లో వీధిలైట్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. జనసేన కౌన్సిలర్ కొలగాని రాము మాట్లాడుతూ తన వార్డులో పాఠశాల వద్ద 4 స్పీడుబ్రేకర్లు వేయాలని కొన్ని నెలలుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో జనసేన సభ్యుడు గింజుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ వీధిలైట్లు లేక ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నామన్నారు. కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తా : కంచేటి గీతారాణి టీడీపీ మహిళా కౌన్సిలర్ కంచేటి గీతారాణి మాట్లాడుతూ తన వార్డులో ఎర్రకాలువ, వేపలవాగు అభివృద్ధిని ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ముఖం చూపింలేకపోతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిలర్గా కొనసాగలేనని, రాజీనామా చేస్తానని అన్నారు. టీడీపీ కౌన్సిలర్ వెంకట్ మాట్లాడుతూ శానిటేషన్ ఉద్యోగులు 144 మంది ఉన్నారని, వచ్చేది 80 మంది మాత్రమేనన్నారు. జనసేన కౌన్సిలర్ పందుల రోశయ్య మాట్లాడుతూ కోదాడ రోడ్లో ఎస్బీఐ వద్ద ఇప్పటికి 20 సార్లు పైపులైన్ మరమ్మతులు చేశారని, ఆ ఖర్చుతో కొత్త పైపులైన్ వేయించవచ్చునన్నారు. వివక్ష చూపిస్తున్నారు: వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ మనోహర్... తన వార్డులో వేపలవాగు బ్రిడ్జి కోసం ఏడాదిగా ప్రయత్నిస్తున్నా చేయడం లేదన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజున్నీసా(వైఎస్సార్ సీపీ) మాట్లాడుతూ తన వార్డులో 10 రోజుల నుంచి తాగునీరు రావడంలేదని, కనీసం వాల్వ్ తిప్పే ఆపరేటర్ కూడా లేడని వాపోయారు. వార్డుల్లో తిరగలేకపోతున్నాం చైర్మన్ను నిలదీసిన టీడీపీ, జనసేన సభ్యులు రాజీనామా చేస్తానన్న టీడీపీ మహిళా కౌన్సిలర్ పాలకవర్గ సభ్యులే ప్రతిపక్షంగా మారిన వైనం -
9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న జరపతలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గాంధీనగర్ ప్రెస్క్లబ్లో శుక్రవారం రాష్ట్ర కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందే తడవుగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల, కార్మికుల పని గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. 8 గంటల పని విధానం కార్మికుల పోరాటాల ఫలితమని ప్రభుత్వానికి గుర్తు చేశారు. యాజ మాన్యాలకు సంపద సృష్టించాలనే పేరుతో 10 గంటలకు పని పెంచడం, మహిళలు కూడా రాత్రులు విధులు నిర్వహించవచ్చని నిర్ణయాలు చేయటం ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు. ఏఐటీయూసీ డెప్యూటీ కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి, ఏఐఎఫ్టీయూ(న్యూ) రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్ బాబు, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు వెంకట సుబ్బరావమ్మ మాట్లాడుతూ కూటమి పార్టీలు ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, నూతన మార్కెట్ విధానానికి వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అసంఘటితరంగ కార్మికుల కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు త్రినాథ్ కుమార్, ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల పిలుపు -
వాణిజ్య బ్యాంకులకు దీటుగా కేడీసీసీబీ సేవలు
చిలకలపూడి(మచిలీపట్నం): వాణిజ్య బ్యాంకులకు దీటుగా కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా సేవలు అందిస్తున్నామని బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. బ్యాంకు మహాజన సభ సమావేశం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా రైతాంగానికి, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు, మత్స్యకార్మికులకు, ఉద్యోగులకు అర్హతను బట్టి రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఈ ఏడాది రూ.13,500 కోట్లు టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 7,500 డ్వాక్రా సంఘాలకు ఇప్పటివరకు రుణాలు ఇచ్చామని, దీనిని 10 వేల సంఘాల వరకు పెంచి రుణాలు విస్తృతం చేయడానికి నిర్ణయించామన్నారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం జిల్లా రైతాంగానికి రూ.2 వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. గృహా లు, వాహన కొనుగోలు, విద్యా రుణాలు, ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు రూ.100 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.3,200 కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయని, దీనిని రూ.3,700 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఫోన్పే, గూగుల్పే, పేటీఎం సౌకర్యం కల్పించామన్నారు. త్వరలో రిజిస్ట్రార్ ఆఫీస్ ఉన్న ప్రదేశాల్లో ఉన్న తమ బ్యాంకు బ్రాంచ్లలో ఈ–స్టాంపింగ్ బిజినెస్ ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది రూ.13,500 కోట్ల టర్నోవర్ లక్ష్యం బ్యాంకు ఖాతాదారులకు యూపీఐ సేవలు చైర్మన్ నెట్టెం రఘురాం