breaking news
NTR district Latest News
-
జనసేన నుంచి వైఎస్సార్ సీపీలో చేరిక
జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, వత్సవాయి మండలం మంగొల్లు గ్రామాలకు చెందిన పలువురు కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలు జనసేన పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానిక పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ సీపీ సంస్థాగత సన్నాహక సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకుడు ఆళ్ల చల్లారావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చిల్లకల్లు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు సుంకర వేణు, సుంకర ఆంజనేయులు, సంపత్ సైదేశ్వరరావు, వారితో పాటు 8 కుటుంబాలు వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు దొంగల సింహాద్రి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. అలాగే వత్సవాయి మండలం మంగొల్లు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు చరణం కృష్ణారావు ఆ గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బొల్లం కిరణ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఆహ్వానించిన అవినాష్, తన్నీరు -
ముగిసిన ఎఫ్సీఐ సాంస్కృతిక పోటీలు
విజయవాడ కల్చరల్: భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన దక్షిణ మండల అంతర్ ప్రాంతీయ సాంస్కృతిక పోటీలు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఎంబీ భవన్లో మంగళవారం ముగిశాయి. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ మండల జోనల్ కార్యాలయానికి చెందిన ఉద్యోగులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హిందీ, తెలుగు చిత్ర గీతాలు ఆలపించారు. లఘు నాటికలు, సోలో, బృంద నృత్యాలను ప్రదర్శించారు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్మినితా లాజరస్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఉద్యోగులలో సృజనాత్మకతను వెలికి తీసే ఇటువంటి పోటీలు అవసరమన్నారు. తమిళనాడు జట్టు పలు విభాగాలలో విజేతగా నిలిచింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రీజియన్ జీఎం విజయకుమార్ యాదవ్, ప్రాంతీయ రీజియన్ జీఎం సమీర్కుమార్ వర్మ, సంస్థ అధికారులు విజయ్కుమార్ యాదవ్, సమీర్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. -
గడువులోపే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పూర్తి చేయాలి
గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా నిర్మిస్తోన్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోపు పూర్తిచేసే విధంగా పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అధి కారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను మంగళవారం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. ట్రాన్సిట్ టెర్మినల్ భవనంలో ఎయిర్పోర్ట్ అధికారులు, టెర్మినల్ కాంట్రాక్ట్ సంస్థ్ధ ప్రతినిధులతో ఆయన సమీక్ష జరిపారు. టెర్మినల్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. టెర్మినల్ నిర్మాణ పనులను దసరా నవరాత్రుల నాటికి పూర్తి చేయాలని సూచించారు. తెలుగు, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా, కృష్ణానది, ఇంద్రకీలాద్రి ఆలయ ప్రత్యేకతలను ప్రతిబింబించేలా టెర్మినల్ను తీర్చిదిద్దాలని తెలిపారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి, పలు విభాగాల అధి పతులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు -
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి
గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించాలి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వినాయక చవితి ఉత్స వాలకు ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. మండపాల్లో తాత్కాలిక విద్యుత్ వినియోగం విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. గణేష్ మండపాలను విద్యుత్ స్తంభాలు, తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల పైనుంచి విద్యుత్ తీగలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ అలంకరణలకు నాణ్యమైన వైర్లు, స్విచ్లు, ప్లగ్లు మాత్రమే వినియోగించాలని, మండపాలకు అనధికారికంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దని స్పష్టం చేశారు. విద్యుత్ వైరింగ్, ఇతర పనులను అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే చేయించుకోవాలని సూచించారు. అధిక లోడ్ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన సామర్థ్యం కలిగిన వైరింగ్, రక్షణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని, వర్షాల సమయంలో విద్యుత్ పరికరాలు, వైర్లు తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. తడిసిన విద్యుత్ పరికరాలను చేతితో తాకరాదని హెచ్చరించారు. విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసే సమయంలో భక్తులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అత్యవసర వాహనాలు, సేవలకు ఆటంకం కలగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నట్లు సీఎండీ పేర్కొన్నారు. -
భూముల రీసర్వేలో రైతుల భాగస్వామ్యం తప్పనిసరి
గన్నవరం: భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రైతులను భాగస్వాములను చేయడంతో పాటు ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. మండలంలోని కేసరపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ భూముల సర్వే ప్రక్రియ ప్రారంభం నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం వరకు రైతుల సమక్షంలోనే నిర్వహించాలని చెప్పారు. రైతుల చేతికి సరైన కొలతలతో కూడిన పట్టాదారు పాసు పుస్తకం అందజేసే వరకు వారికి సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. రీసర్వే నిర్వహించిన తర్వాత నోటీసుల రూపంలో రైతులకు చూపించిన భూహద్దులు ప్రకారం భూవివాదాలను తెలియజేయడం, డాక్యుమెంట్లతో సరిపోల్చుకుని నిర్ధారణ జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,800 బృందాలతో అత్యాధునిక రోవర్స్తో రీసర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో రీసర్వేలో సమస్యలు ఎదురైతే తక్షణ పరిష్కారం చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు 2027 నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నట్లు వివరించారు. జిల్లా సర్వే సహాయ సంచాలకుడు పూజారి లక్ష్మణరావు, తహసీల్దారు కె.వెంకటశివయ్య, గుడివాడ డివిజనల్ సర్వే ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్, మండల సర్వేయర్ మాధవరావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. బీఎడ్, స్పెషల్ బీఎడ్ ఫలితాలు విడుదల కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన బీఎడ్, స్పెషల్ బీఎడ్లకు సంబంధించిన రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య కూన రాంజీ మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు ఈ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చునని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ వీరబ్రహ్మచారి తెలిపారు. పునఃమూల్యాంకనానికి సంబంధించి దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోగా వెబ్సైట్లో సూచించిన రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ వైద్యులపై నిర్లక్ష్యం తగదు లబ్బీపేట(విజయవాడతూర్పు): నిరుపేద రోగులకు వైద్యం చేసే ప్రభుత్వ వైద్యుల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ప్రభుత్వ వైద్యుల సంఘం– ఆంధ్రప్రదేశ్(జీడీఏ–ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు ఐ.బాబ్జి శ్యామ్కుమార్ అన్నారు. ప్రభుత్వ వైద్యుల నిరసన 8వ రోజు మంగళవారం కూడా కొనసాగింది. తమకు 2016 యూజీసీ పీఆర్సీ జీతభత్యాల బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా డాక్టర్ బాబ్జి శ్యామ్కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, పాలిటెక్నిక్ కాలేజీ ఫ్యాకల్టీలకు యూజీసీ పీఆర్సీ బకాయిలు చెల్లించిన ప్రభుత్వం, ప్రభుత్వ వైద్యుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. కార్యక్రమంలో పలువురు టీచింగ్ వైద్యులు పాల్గొన్నారు. -
ఆయన చెబితే అంతా సక్రమమే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో అంతా ఆయన చెప్పిందే వేదం. నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్ వేయాలన్నా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టాలన్నా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి చెబితే సక్రమం అయిపోతుంది. అడ్డ గోలుగా వెలుస్తున్న అక్రమ లేఅవుట్లకు స్థానిక నేతలు అండదండగా నిలుస్తున్నారు. మామూళ్లు అందుకుంటున్న నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లుగా అక్రమ లేఅవుట్లు వేసేస్తున్నారు. పైగా అర్బన్ ల్యాండ్ సీలింగ్లోనో, లేక వివాదాల్లో ఉన్న భూముల్లో సైతం లేఅవుట్లు వేసేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయమంతా స్థానిక ప్రజాప్రతి’నిధి‘కి చేరుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూఆర్ఆర్పేటలో ఐదున్నర ఎకరాల అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూమిలో లేఅవుట్ వేశారు. దీనికి స్థానిక తెలుగుదేశం నాయకులు అండదండగా నిలిచారు. కన్నెత్తి చూడని అధికారులు ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు అందితే లేఅవుట్ ధ్వంసం చేసినట్లు రోడ్లకు చిన్నచిన్న గోతులు తవ్వి పత్రికలకు నోట్ పంపి ఊరుకుంటున్నారు. మరోవైపు ఎక్స్టెన్షన్ ఏరియాలలో అక్రమ లేఅవుట్లతో పాటు, అక్రమ నిర్మాణాలు కూడా తార స్థాయికి చేరుతున్నాయి. సింగ్నగర్, పాయకాపురం, గుణదల ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిబంధనలు గాలికి వదిలిపెట్టి స్థానిక రాజకీయ నాయకుల అండతో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మంజూరు అయిన ప్లాన్కు విరుద్ధంగా అదనపు యూనిట్లు, అదనపు అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. కనీసం సెట్బ్యాక్స్ కాని, పార్కింగ్ నిబంధనలు కాని పాటించకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. జీవో 119 ప్రకారం నిబంధనలు పాటించాల్సి ఉండగా, దీనికి భిన్నంగా అనుమతులకు మించి నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కళ్లముందే నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం, ఈ కట్టడాలకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. భవిష్యత్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికై నా టౌన్ప్లానింగ్ అధికారులు కళ్లుతెరిచి అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సర్వే నంబర్ 37 లో రెండు ఎకరాలు, సర్వే నంబర్ 78/ఎ1ఎ లోని 3.23 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిండి కేట్గా అక్రమ లేఅవుట్లు వేసి విక్రయాలు చేపట్టారు. రోడ్ రోలర్లతో రోడ్లు వేసి, ప్లాట్లు వేసి యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. -
ఏఐ రంగంలో మహిళలు పురోభివృద్ధి సాధించాలి
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): ప్రతిభకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను జోడించి, గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు ఏఐ వంటి రంగంలో పురోభివృద్ధి సాధించాలని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో ఆఫ్లైన్, ఆన్లైన్లో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్లను మంగళవారం ఆయన అందజేశారు. రైజ్ కేంద్రంలో ఏఐ 4 అష్యూర్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, తొలి విడతగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు పొందిన 31 మందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీ4 స్ఫూర్తితో మార్గదర్శిగా ముందుకొచ్చిన సింటిల్లా డిజిటల్ అకాడమీ సీఈవో కెంబూరు సతీష్ కుమార్ సహకారంతో 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న 31 మందికి సినిమాటిక్ ఏఐ విభాగంలో హైదరాబాద్లో ఫుల్టైమ్ ఉద్యోగాలు లభించగా మిగిలిన వారికి ఫ్రీలాన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు లభించాయన్నారు. ఏఐ కంటెంట్ క్రియేషన్, ఏఐ ఇమేజ్ జనరేషన్, ఏఐ వీడియో క్రియేషన్, ఏఐ వాయిస్ అండ్ ఆడియో, సోషల్ మీడియా మార్కెటింగ్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ తదితర నైపుణ్యాలను శిక్షణలో నేర్పించామన్నారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంటెంట్ క్రియేట్ ల్యాబ్ను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. నూతన మార్కెటింగ్ విధానం మహిళల జీవితాల్లో వెలుగు నింపుతుందని స్పష్టం చేశారు. సింటిల్లా డిజిటల్ అకాడమీ సీఈఓ కె.సతీష్ కుమార్, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, రైజ్ మేనేజర్ బి.తేజస్విని తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్లు అందజేసిన కలెక్టర్ జి.లక్ష్మీశ -
అన్నదానానికి రూ.4లక్షల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడ, భీమవరంనకు చెందిన భక్తులు రూ.4లక్షలను విరాళాలుగా సోమవారం అందజేశారు. విజయవాడ రామచంద్రనగర్కు చెందిన వై.శివకుమారి కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది.శివకుమారి పేరిట రూ.లక్ష, నాగార్జుననగర్కు చెందిన జి.రామకృష్ణ పేరిట రూ. లక్ష, భీమవరంనకు చెందిన వి.శ్రీకాంత్వర్మ పేరిట రూ. లక్ష విరాళాన్ని ఆలయ ఈవో శీనానాయక్కు అందజేశారు. విజయవాడ గుణదలకు చెందిన పరిటాల దుర్గాప్రసాద్ కుటుంబం రూ.1,00,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు. సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఏలూరు కాలువలో దూకి గల్లంతైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..కాజా గౌరీశంకర్(26) అనే యువకుడు కేదారేశ్వరపేటలోని పండ్లమార్కెట్లో ముఠా పనిచేస్తూ బ్రాహ్మణవీధిలోని తనఅక్క రౌతు లక్ష్మీ కుటుంబంతో ఉంటున్నాడు. జీతం డబ్బుల విషయంలో అక్క నిలదీయడంతో మనస్థాపానికి గురైన శంకర్ ఆదివారం మధ్యాహ్నం మీసాల రాజారావు వంతెన మీద నుంచి ఏలూరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. ఎస్ఎన్పురం పోలీసులు సోమవారం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలసి ఏలూరు కాలువలో గాలించగా జీఎస్ రాజురోడ్డు, పోలీస్ క్వార్టర్స్ వెనుక భాగాన కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి 10నఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లూరు నీరజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో కామర్స్, కంప్యూటర్ విభాగాలలో అధ్యాపక పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆమె సూచించారు. -
వ్యాధుల నుంచి విముక్తి..
గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ శ్వాసకోశ సమస్యల వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ఫిజియోథెరపిస్టు సూచనలతో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. పక్షవాతానికి గురైన వారు తిరిగి సాధారణ జీవితం గడిపేలా చేయడంతో ఫిజియోథెరపీ కీలకం. అంతేకాదు పుట్టుకతో జన్యుపరమైన లోపాలతో వైకల్యాలకు ఫిజియోథెరపీ ఎంతో అవసరం. – డాక్టర్ ఎం. ప్రభుదాస్, ఫిజియోథెరపిస్టు, విజయవాడ -
విజయవాడకు జాతీయ స్థాయి గుర్తింపు
ఢిల్లీలో అవార్డు అందుకున్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రపటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థకు మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026లో విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని 60వ డివిజన్ జాతీయ స్థాయిలో బెస్ట్ పెర్ఫార్మింగ్ డివిజన్గా ద్వితీయ ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 31వ డివిజన్ స్టేట్ బెస్ట్ పెర్ఫార్మింగ్ అవార్డ్ సాధించింది. ఈ మేరకు సోమవారం జాతీయ స్వచ్ఛ వాయు దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని పర్యావరణ భవన్లోని గంగా ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాష్ట్ర మంత్రి కృతి వర్థన్ సింగ్, కార్యదర్శి తన్మయ్ కుమార్ చేతుల మీదుగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రతినిధులు 60వ డివిజన్కు సంబంధించిన జాతీయ స్థాయి బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డు అవార్డును స్వీకరించారు. రూ.30 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. అలాగే 31వ డివిజన్కు రాష్ట్ర స్థాయి బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డు అవార్డుతో పాటు రూ.15 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. -
రొయ్యల సాగు రైతుల ఆందోళన
పెనమలూరు: తమకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరుతూ రొయ్యల సాగు రైతులు పోరంకిలోని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ రొయ్యల రైతుల సమైఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దుగ్గినేని గోపీనాధ్ విలేకరులతో మాట్లాడారు. రొయ్యల సాగు ద్వారా దేశానికి విదేశాల నుంచి ఆదాయం సమకూరుతుండగా, రొయ్యలసాగు రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిందని ఆందోళణ వ్యక్తం చేశారు. ఆరునెలల్లో టైగర్ రొయ్య ఫీడ్ కేజీకి రూ.26, వేనామయ ఫీడ్ కేజీకి రూ 21 పెంచారన్నారు.పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 45 రోజులకు ఒకసారి ఫీడ్ ధరలను సమీక్షించే పద్ధతిని రద్దు చేసి, ఏడాదికి ఒకసారి ధరలపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పవర్ ఫ్యాక్టర్ షరతులతో సంబంధం లేకుండా రొయ్యల రైతులందరికీ యూనిట్ రూ.1.50 సబ్సిడీ అందచేయాలని కోరారు. టైగర్ రొయ్యల ధరలు 30 కౌంట్ కేజీ రూ.150, 20 కౌంట్ కేజీ ధర రూ.100 చొప్పున పతనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టైగర్ రొయ్యల ధరలను స్థిరీకరణ చేయాలన్నారు. రొయ్యల రైతులకు న్యాయం చేయని పక్షంలో ఆరునెలలు రొయ్యల పంట విరామానికి అనుమతించాలని కోరారు. కమిషనర్కు వినతి... ధర్నా అనంతరం రొయ్యలసాగు రైతులు మత్య్సశాఖ కమిషనర్ శంకర్నాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫీడ్ ముడిపదార్థాల ధరలు పెరిగినందునే ఫీడ్ ధరలు పెరిగాయని, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా రొయ్యల ధరలు తగ్గాయన్నారు. 45 రోజులకు ఒకసారి ఫీడ్ ధరలు ఎలా పెంచుతారని కమిషనర్ను రైతులు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మీరంతా నిజమైన రైతులేనా? అని కమిషనర్ ప్రశ్నించడంతో ఆయన తీరుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026చివరి దశ ‘నాడు–నేడు’కు మంగళం.. వైద్య రంగంలో కీలకంగా ఫిజియోథెరపీ 7రొయ్యలసాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరుతూ పోరంకి లో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు.భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) ఆధ్వర్యంలో దక్షిణ మండల అంతర్ ప్రాంతీయ సాంస్కృతిక పోటీలు విజయవాడలో సోమవారం ప్రారంభమయ్యాయి.ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో చరిత్ర కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చివరి చైర్ పర్సన్గా పనిచేయడం తన అదృష్టమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో రూ. 60లక్షల వ్యయంతో ఆధునికీకరించిన జెడ్పీ అతిథి గృహం, సమావేశ మందిరాన్ని ఉప్పాల హారిక సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కృష్ణాజిల్లాను మూడు జిల్లాలుగా విభజించారన్నారు. 16 మండలాలతో నూతనంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైందన్నారు. కొత్తగా ఏర్పడబోయే పాలక వర్గానికి సమావేశ మందిరంతో పాటు అతిథి గృహాన్ని ఆధునికీకరించి అన్ని వసతులతో భవనాలను ప్రారంభించామన్నారు. జిల్లాలు సరిహద్దులు మాత్రమే మారాయని, అంతా కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అదికారి కృష్ణంరాజు, రమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీదేవి, జెడ్పీటీసీలు వేముల సురేష్, అన్నవరం ఎలిజిబెత్ రాణి, కొమర వెల్లి గంగాభవాని, జెడ్పీ ఉపముఖ్యకార్య నిర్వహణాధికారి ఆనంద కుమార్, తదితరులు పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యతోనే సామాజిక వికాసం సాధ్యమవుతుందని సంఘ సంస్కర్తల ఉవాచ. అక్షరాస్యత కలిగిన సమాజం త్వరగా ప్రగతి బాట పడుతుందని పలువురు మేధావులు నిరూపించిన సత్యం. కానీ ఆ విద్యను అందించే విద్యాలయాలను కూటమి ప్రభుత్వం నిధానంగా నిర్వీర్యం చేస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పేదలందరూ విద్యావంతులు కావాలని, అప్పుడు నిజమైన ప్రగతి సాధ్యమని నమ్మిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో అపూర్వమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తత్ఫలితంగా జిల్లాలో సర్కారు బడి ప్రగతి పరుగులు తీసింది. కానీ నేడు భిన్నమైన పరిస్థితులు జిల్లాలోని విద్యారంగంలో దర్శనమిస్తున్నాయని విమర్శలొస్తున్నాయి. సర్కారు విద్య ‘అవస్థలు..’ జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ దిగజారుతున్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో ఎదురవుతున్న సమస్యల కారణంగా విద్యార్థులు సర్కార్ బడులకు దూరమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 20 మండలాలు కొనసాగుతుండగా అందులో సుమారుగా 926 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్నాయి. అందులో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 88,432గా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గత విద్యా సంవత్సరం ఆ సంఖ్య 96,711గా ఉంది. సుమారుగా 8,279 మంది విద్యార్థులు ఈ ఏడాది తగ్గినట్లుగా అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఉపాధ్యాయుల కొరత.. జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలను ఉపాధ్యాయుల కొరత వెంటాడుతోంది. ప్రధానంగా జిల్లాలోని 926 విద్యాసంస్థల్లో 5,691 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూసినా ఇంకా 426 మంది ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లుగా విద్యాశాఖ అధికారులు నివేదికల్లో పేర్కొంటున్నారు. ఇటీవల సుమారుగా 80మంది తాత్కాలిక ఉపాధ్యాయుల కోసం జిల్లా విద్యాశాఖ ప్రకటన ఇచ్చినప్పటికీ అది పూర్తి స్థాయిలో చేపట్టలేదు. మౌలిక వసతులకూ నిధుల్లేవ్.. జిల్లాలో రోజువారి సమస్యలతో పాటుగా నిర్వహణ లేకపోవటంతో విద్యాసంస్థల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీలు, మెట్లు ఇలా పలు మరమ్మతులు చేయాలని విద్యాశాఖ అధికారులు పనులను గుర్తించి అంచనాలు తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు సుమారుగా రూ.200 కోట్లు అవసరమవుతాయని ఆ అంచనాలను సర్వశిక్ష అధికారులు ప్రభుత్వానికి పంపారు. కానీ ఇప్పటి వరకూ ఆ నిధులు రాకపోవటంతో పాఠశాలల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. పాఠశాలలకు దూరంగా.. ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు దూరంగా 18వేల మంది పిల్లలు ఉన్నట్లుగా అధికార నివేదికలు చెబుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో అధికారులు నిర్వహించే సర్వేలో పాఠశాలను మానివేసినవారు, అసలు పాఠశాలకు రానటువంటి వారు సుమారుగా 17,890మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు ఎక్కడ ఏ పాఠశాలలోనూ చేరలేదని అధికార నివేదికలు చెబుతున్నాయి. కొంతమంది పనులకు వెళ్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. కార్పొరేట్ కోసమేనా? కూటమి పార్టీల్లో ఉన్న పెద్దలు నిర్వహించే కార్పొరేట్ విద్యాసంస్థల కోసమే సర్కార్ బడులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను మౌలిక సదుపాయాలు లేని కారణంగా ప్రభుత్వ విద్యాసంస్థలకు పంపటానికి వెనుకంజు వేస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్లో చేర్పిస్తే ఆర్థిక భారాలతో మధ్యలోనే నిలిపివేస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఈ పరిస్థితులు అక్షరాస్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపు తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏవీ నాటి వెలుగులు.. గత ప్రభుత్వంలో నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద, అమ్మ ఒడి ఇలా అనేక పథకాలు విద్యారంగ వికాసానికి అండగా నిలిచాయని నిపుణులు సైతం చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల కారణంగా జిల్లాలో విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరగటమే కాకుండా ప్రైవేట్ నుంచి ప్రభుత్వ విద్యాసంస్థలకు విద్యార్థులు వలస బాట పట్టారు. కానీ నేడు అందుకు భిన్నంగా పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. మొండి నొప్పులకు థెరపీ మంత్ర! ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ లక్ష్మీశపీజీఆర్ఎస్లో కలెక్టర్ లక్ష్మీశఎన్టీఆర్ జిల్లాలో మొత్తం పాఠశాలలు : 926 ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య : 88,432 గతేడాది విద్యార్థుల సంఖ్య : 96,711 ఈ ఏడాది తగ్గిన విద్యార్థులు : 8,279 ఈ ఏడాది డ్రాప్ అవుట్లు : 17,890విద్యారంగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంకల్పంతో నాడు–నేడు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్లతో సర్కార్ బడులకు కొత్త రూపు తీసుకొచ్చారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దారు. ఆ క్రమంలో రెండు విడతలుగా ఎన్టీఆర్ జిల్లాలో మొదటి విడత రూ.95.32 కోట్లతో 341 పాఠశాలలను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను విస్తృతం చేశారు. అలాగే రెండో విడతగా 596 విద్యాసంస్థల్లో రూ.240.35కోట్లను విడుదల చేసి అభివృద్ధి చేశారు. అయితే జిల్లాలో ఆ పనులు చివరి దశలో ఉండగా వాటికి పది కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు నివేదికలు పంపారు. అయితే గడిచిన రెండున్నరేళ్లగా ఆ నిధులు ఇవ్వకపోవటంతో సుమారుగా 365 తరగతి గదులను చివరి దశ పనులు చేయక మూలన పెట్టారు. -
పింఛన్ల దరఖాస్తుకు 16వతేదీ తుదిగడువు
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పుల తయారీదారులు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్జెండర్ పింఛన్ కోసం అర్హులైనవారు ఈనెల 16వ తేదీలోగా అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈ–కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియను ఏడు పనిదినాల్లో పూర్తిచేయాలని కాలపరిమితిని నిర్ణయించినట్లు వివరించారు. అన్నిరకాల పింఛన్లుకు ఆధార్, రైస్కార్డు/ఆదాయ ధ్రువీకరణపత్రాలతోపాటు సంబంధిత వర్గానికి అవసరమైన ధ్రువీకరణపత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా ఇప్పటికే పింఛన్ కోసం అర్జీని సమర్పించిన వారు కూడా తమ పరిధిలోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఎఫ్సీఐ ఆధ్వర్యంలో దక్షిణ భారత సాంస్కృతిక పోటీలు విజయవాడ కల్చరల్: భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఆధ్వర్యంలో దక్షిణ మండల అంతర్ ప్రాంతీయ పోటీలకు విజయవాడ వేదికై ంది. రెండు రోజులపాటు సాగే ఈ పోటీలు విజయవాడలో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞానకేంద్రంలో సోమవారం ప్రారంభమయ్యాయి. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దక్షిణ మండల జోనల్ కార్యాలయానికి చెందిన ఉద్యోగులు ఈ పోటీలలో పాల్గొన్నారు. సోలో, గ్రూప్ నృత్యాలను, హిందీ, తెలుగు, చిత్రగీతాలను, లఘునాటికలను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్మినితా లాజరస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్మినితా లాజరస్ మాట్లాడుతూ ప్రజలకు సేవలను అందించడంలో భారత ఆహార సంస్థ ముందుందన్నారు. శాఖకు సంబంధిన ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నారంటూ అభినందించారు. పోటీల సహజమని, ప్రతీ అపజయం విజయానికి తొలి మేలికొలుపు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రీజియన్ జీఎం విజయకుమార్యాదవ్, ప్రాంతీయ రీజయన్ జీఎం సమీర్కుమార్వర్మ పాల్గొన్నారు. గుణదల(విజయవాడతూర్పు): గంజాయిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న పలువురు నిందితులను మాచవరం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు..నర్సీపట్నంకు చెందిన షేక్ సిద్దిక్ (27) ఆ ప్రాంతంలో మూడు కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. విజయవాడలోని అతని స్నేహితులతో కలసి ఈ గంజాయిని అమ్మేందుకు ఇక్కడికి తరలించాడు. మాచవరం స్మశానవాటిక వద్ద గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు సిద్ధంకాగా, స్థానికుల సమాచారం మేరకు మాచవరం ఎస్ఐ సంధ్య వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా గంజాయి విక్రయానికి సహకరించిన గుమ్మలంపాటి నాగతేజ (21), గుమ్మలంపాటి అఖిల్ (22), ఉజ్జి సాగర్ (20), షేక్ దీన్ షాద్ (26), శృంగారపాటి ప్రవీణ్(25), మురికిపూటి మహేష్ కుమార్(26)లను అరెస్ట్ చేశారు. వీరు ఉపయోగించిన సెల్ఫోన్లు, ద్విచక్రవాహనాలను సైతం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
మచిలీపట్నానికి చెందిన రాజు అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఏడాదిగా స్పాండిలైటిస్తో బాధపడుతున్నాడు. అనేక చోట్ల వైద్యుల సూచనలతో మందులను వాడుతున్నా ఫలితం కనిపించలేదు. ఓ స్నేహితుడు ఫిజియోథెరపీ చేయించుకుంటే ఉపశమనం ఉంటుందని సలహా ఇస్తే ప్రయత్నించారు. దీంతో నెల రోజుల
లబ్బీపేట(విజయవాడ తూర్పు)/మచిలీపట్నంటౌన్: వైద్య రంగంలో ఫిజియోథెరపీ నేడు అత్యంత కీలకంగా మారింది. మొండి నొప్పులకు థెరపీలతో ఉపశమనం కలిగించడమే కాక.. సుఖ ప్రసవం కోసం, హృదయ సంబంధ వ్యాధిగ్రస్తులు, పక్షవాతం రోగుల చికిత్సలో ఫిజియోథెరపీకి ప్రాధాన్యం పెరిగింది. అంతేకాదు శస్త్ర చికిత్స తర్వాత కండరాలు సాధారణ స్థితికి రావాలంటే ఫిజియోథెరపీ చేయాల్సిందే. ఇప్పుడు ప్రతి ఆస్పత్రిలో వైద్యులతో పాటు ఫిజియోథెరపిస్టులు సేవలు అందిస్తున్నారు. అంతేకాదు నగరంలో దాదాపు వందకు పైగా ఫిజియోథెరపీ క్లినిక్లు ఏర్పాటయ్యాయంటే దాని ప్రాధాన్యం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘హృదయ సంబంధ వ్యాధులు, పక్షవాతం నిర్వహణ, పునరావాసంలో ఫిజియోథెరపీ, శారీరక కార్యకలాపాల పాత్ర’ అనే నినాదంతో జరుపుకొంటున్నారు. మొండి నొప్పులకు చెక్.. వెన్నుముక నొప్పి, మెడనొప్పి వంటి వాటికి శస్త్ర చికిత్సలతో సంబంధం లేకుండా ఫిజియోథెరపిస్టులు విముక్తి కలిగిస్తున్నారు. ముఖ్యంగా మోకీలు మార్పిడి, తుంటికీళ్లు మార్పిడి శస్త్ర చికిత్సల తర్వాత మరలా కండరాలు సాధారణ స్థితికి రావడంలో ఫిజియోథెరపిస్టుల పాత్ర కీలకంగా ఉంటుంది. బైపాస్ సర్జరీలు, ఇతర మేజర్ శస్త్ర చికిత్సలు తర్వాత కూడా ఫిజియో థెరపీ అవసరం ఉంటుంది. అంతేకాదు శ్వాసకోశ సమస్యలకు బ్రీతింగ్ వ్యాయామాలు, యోగా థెరపీలతో విముక్తి కలిగిస్తున్నారు. ఇలా వైద్య పరంగా అనేక సమస్యలకు ఫిజియోథెరపిస్టులు పరిష్కారం చూపుతున్నారు. -
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా సాగాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు.జిల్లాలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో ఉత్సవాల నిర్వహణ, వినాయక ప్రతిమల ఏర్పాటు, పందిళ్లకు అనుమతులు, విద్యుత్ భద్రత, అగ్నిమాపక భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ గతేడాది జిల్లాలో ఐదు లక్షల మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రపంచ రికార్డు సాధించడంతోపాటు గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించామన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి, నిర్వాహకులు తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అనే అంశాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులను పూర్తిగా లేదా పాక్షికంగా మూసివేసేలా పందిళ్లను ఏర్పాటు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదన్నారు. డీజేలు పరిమితులకు లోబడి ఏర్పాటు చేసుకోవాలని, పందిళ్ల వద్ద శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. నిమజ్జన ప్రాంతాలను గుర్తించాలి.. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశాలను అధికారులు ముందుగానే గుర్తించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఇగ్నైట్ సెల్లో మట్టి వినాయక ప్రతిమలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా విద్యుత్ శాఖ అధికారి యు.హనుమయ్య, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు బిట్ర వెంకటేష్, వై. కిషోర్, లోయ బాలకృష్ణ, జీవీఎస్ రమణమూర్తి, వి.పల్లవరాజు పాల్గొన్నారు. -
అధునాతన విధానంతో మేలు..
ఫిజియోథెరపీలోని అధునాతన వైద్యవిధానంతో ఎంతో మేలుకలుగుతుంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు సంతరించుకుంటున్న నేపథ్యంలో మెడ, వెన్ను తదితర నొప్పులు అధికమవుతున్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించాలంటే కచ్చితంగా ఫిజియోథెరపీ ద్వారా కొన్ని పద్ధతులు అవలంభించి నివారించవచ్చు. ముందస్తు చికిత్స చేయించుకుంటే పెరాలసిస్ రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. – డాక్టర్ ఎల్. ప్రభాకర్, ఎంపీటీ (న్యూరో), మచిలీపట్నం -
పంటకాలువలో వరినాట్లు
కృత్తివెన్ను: పంట భూములకు సాగునీరందించాల్సిన కాలువలు నీటి జాడ లేక ఎండిపోవడంతో రైతులు వినూత్న నిరసనకు దిగారు. కాలువలో నీరు లేకపోవడంతో ఏకంగా దానిలోనే వరినాట్లు వేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కృత్తివెన్ను మండలం యండపల్లి పంచాయతీ పరిధిలోని యండపల్లి, గాంధీనగరం రైతులు పార్టీలకతీతంగా ఆదివారం బంటుమిల్లి–లక్ష్మీపురం ప్రధాన పంటకాలువలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. నీరున్నా.. చేరడం లేదు గుడ్లవల్లేరు లాకుల నుంచి వంతులవారీగా బంటుమిల్లి కెనాల్కు 250 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నప్పటికీ నెల రోజులుగా కృత్తివెన్నుకు చుక్కనీరు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని, పాలకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 150 ఏళ్లలో ఇదే దుస్థితి బంటుమిల్లి–లక్ష్మీపురం ప్రధాన పంటకాలువకు సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉందని, ఇంతటి దుర్భర పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని రైతులు తెలిపారు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నీటితో కళకళలాడాల్సిన కాలువలు ఎండిపోవడం దారుణమన్నారు. నాట్లు వేసిన పంటలూ ఎండిపోయాయి మండలంలో ఈ ఏడాది సుమారు 7 వేల ఎకరాల్లో ఖరీఫ్ నాట్లు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 2 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. అందులో దాదాపు 90 శాతం పంట నీరు లేక ఎండిపోయిందని రైతులు చెబుతున్నారు. తక్షణమే కృత్తివెన్నుకు కాలువల ద్వారా సాగునీరు అందించా లని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గెజిట్లో హామీ.. నీరెక్కడ? కృత్తివెన్ను శివారు ప్రాంతంతో పాటు సముద్రతీరానికి సమీపంలో ఉండటంతో రెండో పంట రబీకి కూడా సాగునీరు అందించేలా గతంలో అప్పటి మల్లేశ్వరం ఎమ్మెల్యే పిన్నెంటి పమిడేశ్వరరావు ప్రభుత్వాన్ని ఒప్పించి గెజిట్లో పొందుపరిచేలా జీవో తీసుకొచ్చినట్లు రైతులు గుర్తుచేశారు. రెండో పంట సంగతి పక్కన పెడితే కనీసం ఒక్క పంటకై నా సాగునీరు అందించకపోవడంపై వారు ప్రశ్నించారు. -
టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనచోదకుడు దుర్మరణం
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలం పరిధిలోని కిలేశపురం గ్రామంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. సెక్టార్ ఎస్ఐ బోనగిరి రాజు తెలిపిన వివరాల మేరకు నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మండ్రు కృష్ణంరాజు(37) వ్యక్తిగత పనులపై తన బైక్పై విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కిలేశపురం వద్దకు చేరుకునే సమయానికి వెనుక నుంచి దూసుకు వచ్చి న టిప్పర్ బైక్ను ఢీకొట్టింది. ఈఘటనలో రోడ్డుపై పడిన కృష్ణరాజు మీదుగా లారీ దూసుకెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జు అయి ప్రాణాలు విడిచా డు. సంఘటన జరిగిన అనంతరం డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి లారీని వెంబడిస్తూనే ఎస్ఐ రాజుకు ఫోన్ ద్వారా సమాచా రం అందించాడు. హుటాహుటినా పోలీస్ వాహనంలో వెళ్లిన ఎస్ఐ దొనబండ క్వారీల రోడ్డులో ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
కార్ల షోరూమ్పై పిడుగుపాటు
● రూ.30 లక్షల ఆస్తినష్టం ● ఆదివారం కావడంతో తప్పిన ప్రాణనష్టం ఆటోనగర్(విజయవాడతూర్పు): విజయవాడ ఆటోనగర్ ఆర్టీసీ బస్డిపో పక్కన ఉన్న హ్యూండాయ్ కార్ల షోరూమ్పై ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పిడుగు పడింది. ఆ సమయంలో ఒక్కసారిగా గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో షోరూమ్ మొదటి అంతస్తుపై పిడుగు పడటంతో రెండు క్యాబిన్లు దగ్ధం అయ్యాయి. ఇందులో అడ్మినిష్ట్రేషన్ గది, కంప్యూటర్లు కాలిపోయాయి. ఏసీలు, ఫర్నిచర్ సర్వర్ గదితో పాటు కంప్యూటర్లు దెబ్బతిన్నాయి. సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షోరూమ్ సర్వీస్ జీఎం ప్రదీప్ తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో షోరూమ్పై పిడుగు పడటంతో మంటలు వచ్చాయని స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పక్కన ఉన్న కార్లకు నిప్పు అంటుకోకుండా మంటలను అదుపులోకి తెచ్చారు. ఆదివారం కావడంతో సిబ్బంది లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. తప్పిన పెనుప్రమాదం.. ఆదివారం కావడం వల్ల షోరూమ్లో పనిచేసేవారు లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. సోమవారం నుంచి శనివారం వరకు వారంలో సుమారు 100 నుంచి 120 మందికి పైగా ఇక్కడ పనిచేస్తారని షోరూమ్ సర్వీస్ జీఎం ప్రదీప్ తెలిపారు. స్పేర్పార్ట్లు, కార్లు సర్వీస్ చేస్తుంటారు. ఆదివారం కావడం వల్ల కేవలం సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని, పిడుగు పడిన సమయంలో వారంతా వేరే గదిలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కార్లు ఉన్న ప్రాంతంలో పిడుగు పడి ఉంటే రూ.కోట్లలో నష్టం వాటిల్లేదని సమాచారం. -
వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు
చిలకలపూడి(మచిలీపట్నం): తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గుర్రంకొండ సురేంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఆదివారం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ జేఏసీ జోన్–2 తొలిదశ ఉద్యమ కార్యాచరణ సమాయత్త సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ.. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాధాకరమన్నారు. పెండింగ్లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.660 విలువ కలిగిన ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీం (ఏఏఎస్) ప్రయోజనాన్ని అమలు చేయడానికి సంవత్సర కాలంగా తాత్సారం చేయటం ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.. బీఎల్ఓ విధులు నిర్వహించిన ఉద్యోగులకు సంబంధించిన నిధులను సంవత్సర కాలంగా పెండింగ్లో ఉంచారన్నారు. మరో వైపు మూడు నెలలుగా సర్ పేరుతో సచివాలయ ఉద్యోగులతో ఆదివారం కూడా సెలవు లేకుండా నిరంతరం విధులు చేయిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, జేఏసీ నేతలు హరీష్, చవెంకటేశ్వర్లు, రవితేజ, సిద్దేశ్వరరెడ్డి, పి.అపర్ణ, రామకృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మూడే చంద్రకుమార్, కృష్ణాజిల్లా చైర్మన్ పువ్వల కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరపాలక సంస్థకు ఎన్నికలెప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీదే విజయమని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. భవానీపురంలో పశ్చిమ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి దేవినేని అవినాష్, వెలంపల్లి శ్రీనివాస్.. పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పాలన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ కార్యాచరణ సిద్ధం చేసింది. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి పాలనలో ఎటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు లేవన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో రోడ్లు, పార్క్లు, వాటర్ట్యాంకులు ప్రారంభిస్తే కూటమి నేతలు సిగ్గు లేకుండా సొంత పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తున్నారన్నారు. మనం ప్రజల కోసం పనిచేస్తే.. కూటమి ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం పని చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను వివరిస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్గా గెలిచేది మరోసారి వైఎస్సార్ సీపీ అభ్యర్థేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎంత మంది పోలీసులు వచ్చినా, గుండాలు, రౌడీలు వచ్చినా పార్టీ కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటామని పేర్కొన్నారు. వెన్నుపోటు పాలనకు రెండున్నరేళ్లు.. వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోందన్నారు. ప్రజానీకానికి కూటమి వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ఈ నెల 23 నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. పాంప్లెట్లు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి ప్రజానీకానికి తెలియజేయాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గానికి సుమారు ఏడు వేల మందికి పార్టీ పదవులు ఇచ్చారని, వారంతా అప్రమత్తంగా ఉంటూ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని 28 డివిజన్లలో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఇంటింటికీ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో కూటమి పాలన వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా వెల్లడిస్తారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తీర్పును ఇస్తారన్నారు. అనంతరం పార్టీల్లో వివిధ పదవుల్లో నియమితులైన ప్రతినిధులకు గుర్తింపు కార్డులు అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశీల, తోలేటి శ్రీకాంత్, మనోజ్ కొఠారి, గౌస్ మొహిద్దీన్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
అన్నప్రసాదానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ ఎస్బీఐ కాలనీకి చెందిన బొప్పన దుర్గా వెంకట్రామ్ కుటుంబం రూ.1,00,005, ప్రజాశక్తినగర్కు చెందిన దావూలూరి ప్రభాకరావు కుటుంబం రూ.1,00,005, మచిలీపట్నం బ్రహ్మపురానికి చెందిన టి.తారక రామారావు కుటుంబం రూ. 1.16 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. -
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. జగనన్న విద్యాకానుక పేరును మార్చి వాటి నాణ్యతను పూర్తిగా దిగజార్చారు. రాష్ట్రంలో పాఠశాలలు తెరచి మూడు మాసాలవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కిట్లు అందలేదు. అందిన వాటి నాణ్యత లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరవాలి. విద్యార్థులకు న్యాయం చేయాలి. – ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ, విద్యార్థి విభాగం -
నందమూరినగర్లో రెచ్చిపోయిన దొంగలు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని నందమూరినగర్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేలోపే ఇంటి తాళాలు పగలకొట్టి ఆ ఇల్లును కొల్లగొట్టిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందమూరినగర్ ఏడో లైన్లో మొండి రేవతి, వెంకట రమణ దంపతులు నివసిస్తున్నారు. భర్త మహేంద్ర కంపెనీలో పనిచేస్తుండగా రేవతి ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 5వ తేదీన వెంకటరమణ తన పనులకు వెళ్లిపోగా ఉదయం 10 గంటలు దాటిన తరువాత రేవతి తన ఇంటికి తాళాలు వేసి వారి బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలకొట్టి కనిపించాయి. బెడ్రూమ్లోని అలమరలో దాచుకున్న 97 గ్రాముల బంగారపు వస్తువులతో పాటు రూ.74 వేల నగదు కనిపించలేదు. దీంతో తమ ఇంట్లో దొంగతనం జరిగిందని భావించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకూ అజిత్సింగ్నగర్ ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లిన ఐదు గంటల వ్యవధిలోనే ఇంట్లో దొంగతనం జరగడంతో పోలీసులు ఇది పాత నేరస్తుల పనా.. లేక బాధితులకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఛోరీకి పాల్పడి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలను, ఇతర ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల వివరాలను రాబడుతున్నారు. 97 గ్రాముల బంగారం, రూ.74 వేలు నగదు చోరీ -
సుబ్బారాయుడి ఆదాయం రూ.8.28 లక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.8,28,687లు ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా టికెట్ల ద్వారా రూ.7,16,051లు, డొనేషన్లు రూ.1,12,636 మొత్తం రూ.8,28,687 ఆదాయం సమకూరిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): బాల్య వివాహాల నిర్మూలనపై భారతదేశం నుంచి వినిపించిన గళం నేడు ప్రపంచ స్థాయి సంకల్పంగా మారిందని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు బి.కీర్తి అన్నారు. దేశంలోని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంస్థ చేస్తున్న కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించి, నవంబర్ 27న బాల్య వివాహాల నిర్మూలన దినంగా ప్రకటించడం గొప్ప విషయమని ఆమె పేర్కొనారు. మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ భాగస్వాములతో కలిసి ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ (బాల్య వివాహ రహిత భారత్) ప్రచారాన్ని 2024 సెప్టెంబర్లో ప్రారంభించామన్నారు. జిల్లాల్లోని ఏదో ఒక గ్రామంలో కనీసం ఒక్క బిడ్డ అయినా బాల్య వివాహం ముప్పులో ఉన్నంత కాలం, మా పోరాటం అసంపూర్ణంగానే ఉంటుందని చెప్పారు. కేవలం చట్టాల ద్వారా మాత్రమే బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టలేమని ఆమె పేర్కొన్నారు. అందుకే పాఠశాలలు, పంచాయతీలు, గ్రామాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఏపీ కో ఆర్డినేటర్ బి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఏలూరు కాలువలో దూకి యువకుడు గల్లంతైన ఘటనపై ఆదివారం ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు.. కాజా గౌరీ శంకర్(26) కేదారేశ్వరపేట పండ్లమార్కెట్లో ముఠా పనిచేస్తూ బ్రాహ్మణవీధిలోని అక్క రౌతు లక్ష్మి కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. నెల రోజుల నుంచి ఇంటో డబ్బులు ఇవ్వకపోవడంతో అక్క నిలదీసింది. డబ్బులు తీసుకొస్తానని ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గౌరీశంకర్ అక్క అతను పనిచేసే మేస్త్రికి ఫోన్ చేయగా ఏ రోజు డబ్బులు ఆ రోజే తీసుకుంటున్నట్లు చెప్పాడు. అనంతరం తమ్ముడికి రౌతు లక్ష్మి ఫోన్ చేయగా సాయంత్రం డబ్బులు తీసుకొస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గౌరీ శంకర్ మీసాల రాజారావు వంతెనపై నుంచి ఏలూరు కాలువలో దూకినట్లు తెలిసిన వారు ఫోన్ చేసి తెలపగా ఆమె ఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఎన్పురం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి గౌరీశంకర్ కోసం గాలింపు చేపట్టారు. తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కొండలమ్మ సన్నిధిలో జడ్జి అరుణసారిక
గుడ్లవల్లేరు: వేమవరం కొండలమ్మను చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆమెకు దేవస్థాన కమిటీ చైర్మన్ ఈడె విష్ణు వెంకట మోహన్రావు, ఈఓ ఆకుల కొండలరావు స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను అందించారు. 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలి మధురానగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీ నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి శతాధిక వృద్ధులు ఈ నెల 15వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్రాజ్ సోలంకి కోరారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పది మంది శతాధిక వృద్ధులను ఒక్కచోట చేర్చి వారి ఆశీస్సులు తీసుకుంటే దైవం ఆశీర్వాదం తీసుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయన్నారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి వారికి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 93475 72766, 98481 11138 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్ సొంత ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం చేసి తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బెంగళూరులో జరిగిన 80వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ మహిళల టీమ్ చాంపియన్ షిప్ టైటిల్ను ఏపీ సీనియర్ మహిళల బ్యాడ్మింటన్ జట్టు సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్లో తెలంగాణపై 3–1 స్కోర్తో ఏపీ జట్టు ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఫైనల్లో తమిళనాడు జట్టుతో పోటీ పడి ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 3–2 స్కోర్తో ఏపీ జట్టు విజయం సాధించింది. ఇదే చాంపియన్ షిప్లో ఏపీ జూనియర్ బాలుర జట్టు ప్రతిభ చూపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రతిభ చూపిన జట్లను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పి.అంకమ్మ చౌదరి అభినందించారు. పామర్రు: పామర్రు మండలం కురుమద్దాలి రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా జరుగుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆ రోజు ఉదయం 9గంటలకు జాబ్మేళా నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీనిలో బంధన్ బ్యాంక్ లిమిటెడ్, ట్రైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎస్బీ లైఫ్ ఇన్సూరెన్సు కో లిమిటెడ్, కురకు పైనాన్సియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, అడెక్కో ఇండియా పైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ పైవేట్ లిమిటెడ్, టీమ్ రెడ్ మేనేజ్మెంట్ పొల్యూషన్ పైవేట్ లిమిటెడ్ (డీబీఎస్ బ్యాంక్), పీటీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్విన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి 11కు పైగా ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి నరేష్కుమార్ మాట్లాడుతూ టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని తెలిపారు. అభ్యర్థులు ముందుగా హెచ్టీటీపీఎస్://ఎన్ఏఐపీయుఎన్వైఏఎం.ఏపీ.జీవోవి.ఐఎన్/ వెబ్సైట్లో పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతో పాటు, జాబ్ మేళాకు రెజ్యూమ్లతో లేదా బయోడేటా ఫారమ్లతో పాటు, ఆధార్, దానికి లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్, సర్టిఫికెట్ల్ జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 79813 68429, 96187 13243 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
తమ్ముడి పిల్లలను చూసేందుకు వెళ్తూ..
● బైక్ను మోపెడ్ ఢీ కొనడంతో రోడ్డుపై పడిపోయిన ప్రైవేట్ టీచర్ ● అతనిపై నుంచి వెళ్లిన ట్రాక్టర్.. చికిత్స పొందుతూ మృతి కంచికచర్ల: ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు తన తమ్ముడి పిల్లలను చూసేందుకు విజయవాడ వెళ్తుండగా కీసర గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు జగ్గయ్యపేట హయత్నగర్లో నివాసముంటున్న దాసరి అనిల్ సుందర్(41) జగ్గయ్యపేట సమీపంలోని బోదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పరిధిలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు రోజు కావటంతో విజయవాడలో ఉన్న తన తమ్ముడి పిల్లలను చూసేందుకు బైక్పై బయలుదేరాడు. కంచికచర్ల మండలం కీసర సమీపంలోకి రాగానే టీవీఎస్ మోపెడ్ను అడ్డదిడ్డంగా నడుపుతున్న వ్యక్తి బైక్ను ఢీ కొట్టాడు. దీంతో బైక్పై ఉన్న అనిల్ సుందర్ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో విజయవాడ వైపునకు వెళ్తున్న ట్రాక్టర్ అనిల్ సుందర్పై నుంచి వెళ్లింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనిల్ సుందర్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాల వివరాలపై దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ చెప్పారు. -
వస్త్ర దుకాణంలో రూ.11 లక్షలు కాజేసిన క్యాషియర్
కృష్ణలంక(విజయవాడతూర్పు): పని చేసే చోటనే ఓ క్యాషియర్ తన చేతివాటం ప్రదర్శించి సుమారు రూ.11 లక్షల సంస్థ సొమ్మును కాజేసిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సారపరెడ్డి సాయికుమార్ నగరంలోని బెంజ్సర్కిల్ సమీపంలో ఉన్న ఓ వస్త్ర షోరూంలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ కస్టమర్ తమ క్రెడిట్ బిల్లును ఉపయోగించుకోవడానికి హైదరాబాద్లోని వారాహి సిల్క్స్ బ్రాంచ్కు వెళ్లారు. అక్కడ సిబ్బంది ఆ బిల్లును వెరిఫై చేయగా ఆ క్రెడిట్ బిల్లును విజయవాడ బ్రాంచ్లోనే వినియోగించినట్లు చూపిస్తుందని చెప్పారు. అనుమానం వచ్చిన మేనేజర్ పి.బాలకృష్ణ విజయవాడ బ్రాంచ్ సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా సాయికుమార్ స్వయంగా ఆ క్యాష్ను విత్డ్రా చేసినట్లు కనిపించింది. ఫుటేజీ ఆధారంగా అతడిని పిలిచి ప్రశ్నించగా తాను రూ.31,449లను సొంతానికి వాడుకున్నట్లు అంగీకరించాడు. అంతటా ఆ మొత్తాన్ని షోరూమ్కు చెల్లించి రాతపూర్వకంగా రాసిచ్చి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఘటన తర్వాత షోరూం యాజమాన్యం ఆడిట్ నిర్వహించగా రూ.11 లక్షలకు సంబంధించిన బిల్లులను అదేవిధంగా మోసం చేసి నగదు తీసుకున్నట్లు తేలింది. సంస్థను మోసం చేసిన సాయికుమార్పై చర్యలు తీసుకోవాలని షోరూం మేనేజర్ బాలకృష్ణ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాగాయలంక: వర్షాభావ పరిస్థితుల్లో వరుణుడు కరుణించాలని సంకల్పంతో స్థానిక కృష్ణానది తీరంలోని శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్లో కొలువైన శ్రీరామలింగేశ్వర శివలింగానికి ఆదివారం సహస్ర ఘటాల(1008)తో కృష్ణానదిలోని సముద్రపు జలాలతో భక్తులు విశేష అభిషేకం నిర్వహించారు. ప్రసన్న గణ పతి దేవస్థానం అర్చకుడు బ్రహ్మశ్రీ అంబా సాయికిరణ్ శర్మ ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం, భక్తుల ఆర్థిక సౌజన్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఘటాలతో తెచ్చిన నదీ జలం నేరుగా శివలింగంపై కాకుండా పైపులో పోసిన నీరు శివలింగంపై పడేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం శివలింగాన్ని పూర్తిగా మూసివేస్తూ ఇటుకలతో చతురస్రం గది నిర్మించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు జలాభిషేకం కొనసాగింది. అనంత రం స్వామికి నవహారతులు సమర్పించారు. సాయంత్రం అభిషేకం పూర్తయ్యే సమయానికి రోజూ మాదిరిగానే వర్షం పడటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు తాడేపల్లికి చెందిన మార్కాపురం వెంకటరమణ, వెంకటేశ్వరరావు(55)లు భార్యాభర్తలు. వెంకటేశ్వరరావు బార్బర్ షాపు నడుపుతుంటాడు. ఈ నెల 3న షాపు నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న వెంకటేశ్వరరావును ఆటో ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన వెంకటేశ్వరరావును అజిత్సింగ్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మృతి చెందాడు. ఘటనపై వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక ( పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నిత్యాన్నదాన పథకానికి పలువురు భక్తులు ఆదివారం విరాళాలు సమర్పించారు. వారికి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనం రద్దు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ మాసం నేపథ్యంలో తెల్లవారుజామున అమ్మవారికి ఖడ్గమాలార్చనను రెండు షిఫ్టులలో నిర్వహించారు. ఉదయం లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమంలో సైతం ఉభయదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో వైపున అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు ఉదయం 11.40 గంటలకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. అరగంట తర్వాత తిరిగి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో రద్దీ మరింత అధికం కావడంతో మహా నివేదన అనంతరం అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ.300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి రూ. 500 టికెట్ల విక్రయాలు ప్రారంభించారు. దీంతో వీఐపీలు, సిఫార్సులపై విచ్చేసిన వారికి సైతం అంతరాలయ దర్శనం కల్పించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): సర్కార్ బడుల్లో చిన్నారుల భుజాలపై పుస్తకాల బరువుతోపాటు.. చిరిగిన బ్యాగుల భారం పడుతోంది. కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన ‘విద్యార్థి మిత్ర’ కిట్లలోని బ్యాగులు కొద్ది రోజులకే చిరిగిపోతుండటంతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. పుస్తకాలు కింద పడిపోకుండా చేతులతో పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని వారు చెబుతున్నారు. నాడు నాణ్యతతో కూడిన కిట్లు రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సర్కార్ బడుల్లో చిన్నారులకు అన్ని రకాలుగా అండగా ఉండే లక్ష్యంతో జగనన్న విద్యా కానుక పేరుతో కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ క్రమంలో పుస్తకాలు, వర్క్బుక్, యూనిఫామ్, బూట్లు, బెల్టు, సాక్సులు ఇలా నాణ్యమైన పలు వస్తువులతో కూడిన బ్యాగ్ను విద్యార్థులకు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు అందించే జగనన్న విద్యాకానుక కిట్ల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విద్యార్థులు వాపోతున్నారు. పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టుగా పేరు మార్చి నాణ్యత లేని వస్తువులను ఇస్తున్నారని మండిపడుతున్నారు. అంతంత మాత్రంగా పంపిణీ ఎన్టీఆర్ జిల్లాలో 20 మండలాలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 920 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 88,432 మంది విద్యార్థులు ఉన్నట్లుగా ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వారందరికీ విద్యార్థి మిత్ర కిట్లను అందజేయాల్సి ఉంది. 2025–2026 విద్యా సంవత్సరంలో ఉన్న సంఖ్యలో పదో తరగతి విద్యార్థులను తీసివేసి ఇండెంట్ను అధికారులు పంపించారు. కొత్తగా చేరిన వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన కిట్లు రాకపోవడం, పాఠశాలలు మానివేసిన పాత విద్యార్థుల కిట్లను కొత్తవారికి అందించారు. పాఠశాలలు తెరిచి మూడు మాసాలైనా ఇంకా చాలా మందికి పూర్తి స్థాయి వస్తువులతో కూడిన కిట్లు అందలేదని విద్యార్థులు వివరిస్తున్నారు. బ్యాగులు, బూట్లు ఇప్పటికీ చాలా మందికి పెండింగ్లో ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. నాసిరకంతో అవస్థలు విద్యార్థులకు అందిన బ్యాగులు ఇతర వస్తువులు నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బ్యాగులు విద్యార్థులకు అందించిన నెల రోజుల్లోనే అవి చిరిగిపోవడం ప్రారంభమైంది. పుస్తకాలతో బడికి వెళ్తున్న విద్యార్థులు వాటిని తీసుకెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. బూట్ల విషయంలోనూ అదే నాణ్యత వెంటాడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇటీవల సీపీఎం నేతల బృందం ఎ.కొండూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో సమావేశమైనప్పుడు వారి స్కూల్ బ్యాగులు చూసి అవాక్కయ్యారు. చిరిగిన బ్యాగులతో విద్యార్థులు అవస్థలు పడటంపై వారు నాణ్యతపై ప్రశ్నించారు. జిల్లాలోని అనేక ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చిరిగిన బ్యాగులతో కుస్తీ పడుతున్నారు. మండిపడుతున్న తల్లిదండ్రులు చిన్నారుల అవస్థలను చూసి తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే కిట్లు గతంలో చక్కగా ఉండటమే కాకుండా మా పిల్లలు ఇబ్బందులు లేకుండా బడులకు వెళ్లే వారని ఇప్పుడు పుస్తకాలు బ్యాగ్లో నుంచి ఎక్కడ పడిపోతాయోనని బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం అందించే బ్యాగులు, బూట్లు నాణ్యమైనవి ఇస్తే బాగుం టుంది. పిల్లలను ఎందుకు కష్టాలపాలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.8716 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతోంది. -
రుణాల పేరుతో వల
లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ నేరగాళ్లు పోలీసుల అంచనాలకు సైతం అందకుండా కొత్త ఎత్తులతో ప్రజలను చిత్తు చేస్తున్నారు. అసలు ఏ రూపంలో మోసగాళ్లు వస్తున్నారో తెలుసుకోవడం ఇప్పుడు పోలీసులకు పెద్ద చాలెంజ్గా మారింది. రుణాలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరిట ఇలా అనేక రకాలుగా ప్రజలను మోసం చేస్తున్న నేరగాళ్లు సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగతున్న సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అంతేకాదు ఇటీవల సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసు మాషా అల్లా కూడా ఇన్స్టా వేదికగా చేసిన ప్రచారంతోనే ప్రజలు మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ● మీ ఓటీపీ, సీవీవీ, పిన్, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఒక చిన్న నిర్లక్ష్యం మీ జీవిత కాల పొదుపులను క్షణాల్లో కోల్పోయేలా చేస్తుంది. ● ఆన్లైన్లో అప్రమత్తంగా ఉండాలి. నకిలీ ఉద్యోగాలు, పెట్టుబడి ఆఫర్లు, అనుమానాస్పద లింకులు, తెలియని ఏపీకె ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ● ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దు. ● లోన్ యాప్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తక్షణ లోన్ పేరుతో వచ్చే అనధికారిక యాప్స్ను నమ్మవద్దు. ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ ఫీజు అంటూ ముందుగా చెల్లింపులు చేయవద్దు. ● ఒక్క క్లిక్ మీ ఫోన్ మొత్తం ప్రమాదంలో పడవచ్చు. ట్రాఫిక్ చలానా పేరుతో వచ్చే నకిలీ లింకులు, ఏపీకే ఫైల్స్ను నమ్మవద్దు. ● మొబైల్ పోయిన వెంటనే చర్యలు తీసుకోవాలి. మన ఫోన్లో ఉన్న బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేయించి, సీఈఐఆర్ ద్వారా ఐఎంఈఐని బ్లాక్ చేయించాలి. ● కేవలం 15 నిమిషాల ఆలస్యం కూడా నష్టాన్ని పెంచవచ్చు. కృష్ణలంక ప్రాంతానికి చెందిన యువతి ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం ఇన్స్ట్రాగామ్లో అన్వేషించడం మొదలు పెట్టింది. దానిలో ఉద్యోగ అవకాశాలు అనే ప్రకటన చూసి, వివరాలు తెలుసుకుంది. ఆమెకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తానని నమ్మించి దాదాపు రూ.2 లక్షల వరకూ వసూలు చేసి మోసం చేశారు. ఇలా మోసగాళ్లు ఈజీమనీ కోసం కొత్త కొత్త ఎత్తులను ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుని ఏదో రూపంలో వారిని దోపిడీ చేస్తూ, మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కంచికచర్ల ప్రాంతానికి చెందిన మహిళ.. తన భర్తకు గుండె వైద్యం కోసం రూ.10 లక్షల వరకూ అప్పుచేసి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. పిల్లలు కూడా చదువు పూర్తయినా ఉద్యోగాలు రాలేదు. ఇలాంటి తరుణంలో ఆమెకు ఒక తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద రూ.50 లక్షల వరకూ రుణ మంజూరు అవుతుందని చెప్పారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె.. అంత మొత్తం అవసరం లేదు. సగం ఇప్పించినా చాలని చెప్పి, వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చింది. అప్పుడే అసలు కథ మొదలైంది. టీడీఎస్ ముందుగా చెల్లించాలని, ప్రాసెసింగ్ చార్జీలంటూ దాదాపు రూ.5 లక్షలకు పైగా ఆమె నుంచి వసూలు చేశారు. అనంతరం ఫోన్ కలవడం లేదు. దీంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తెలియని వ్యక్తి నుంచి పంపిన లింక్లను క్లిక్ చేయకూడదు. అంతేకాదు తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఫోన్కాల్స్తో మాట్లాడటం కూడా సురక్షితం కాదు. వీడియో కాల్స్ అసలు మాట్లాడవద్దు. ఇటీవల కాలంలో ఇన్స్టా, ఫేస్బుక్ వంటి వాటిలో ఆకర్షణీయమైన ప్రకటనలు వస్తున్నాయి. వాటిని క్లిక్ చేసే మీ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతాం, ఓటీపీ చెప్పమని ఫోన్ చేస్తుంటారు. అలాంటి వాటిని నమ్మొద్దు. డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. ఏదైనా మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930కి సమాచారం ఇవ్వండి. – డి.చవాన్, ఇన్స్పెక్టర్, ఎస్ఆర్ పేట -
అన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ ఎనికేపాడు కేవీఆర్ కాల నీకి చెందిన పి.రవిశంకర్ దంపతులు అమ్మవారిని దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి రూ.1,00,116 విరాళం అందజేశారు. హైదరాబాద్కు చెందిన చుండూరి శ్రీనివాసరావు దంపతులు అన్నదా నానికి రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీ ర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈఓ ఎన్.రమేష్బాబు, ఆలయ అధికారి శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. యువకుడు ఆత్మహత్య గన్నవరం: కుటుంబ సభ్యులు మందలించా రని ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముస్తాబాదలో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముస్తాబాదకు చెందిన నర్రా నాగసాయిరామ్(30) గ్రామంలో షామియానా దుకాణం నడుపుతున్నాడు. అతని భార్య ప్రసవం నిమిత్తం ఇటీవల పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అతను రోజు మద్యం తాగుతున్నాడు. నాగసాయిరామ్ను తండ్రి, సోదరుడు గట్టిగా మందలించారు. మనస్తాపా నికి గురైన నాగసాయిరామ్ ఉదయం 11 గంట లకు ఇంటిలో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. అనంతరం కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విద్యుత్ వినియోగదారుల సంతృప్తే లక్ష్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. నగరంలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమా వేశం జరిగింది. విద్యుత్ సరఫరాలో నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ, విద్యుత్ భద్రత, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, విద్యుత్ సబ్స్టేషన్లలో ఫీడర్ల పనితీరు, విద్యుత్ అంతరాయాల నియంత్రణ, పీక్ డిమాండ్ నిర్వహణ మొదలైనఅంశాలపై చర్చించారు. అనంతరం పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు పారదర్శకమైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తరచూ ట్రిప్పింగ్కు గురయ్యే ఫీడర్లు, ఓవర్ లోడ్ అవు తున్న ట్రాన్స్ఫార్మర్లు, బలహీనంగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. పీక్ డిమాండ్కు అనుగుణంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సేవలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎల్నినో ప్రభావం నేప థ్యంలో డిస్కమ్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితులు, తీసుకుంటున్న ముందస్తు చర్యలపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు ,సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
నకిలీ ఎస్ఐ అరెస్ట్
హనుమాన్జంక్షన్ రూరల్: పోలీస్ సబ్ ఇన్స్పె క్టర్ను అంటూ ద్విచక్ర వాహనదారుడి నుంచి దౌర్జన్యంగా డబ్బులు లాక్కున్న ఓ నకిలీ ఎస్ఐని హనుమాన్జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను హనుమాన్జంక్షన్ సీఐ ఎల్. రమణ, ఎస్ఐ ఎం.శ్రీవివాస్తో కలిసి శనివారం వెల్లడించారు. వారి కథనం మేరకు.. ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం వేలేరుకు చెందిన మాధవరపు సాంబయ్య తన బావమరిది సత్యనారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై హనుమాన్జంక్షన్కు బయలుదేరాడు. పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో నకిలీ ఎస్ఐ సరిహద్దు దుర్గాంజనేయులు వారి వాహనాన్ని అడ్డుకున్నాడు. వాహనానికి నంబర్ ప్లేట్ లేనందున జరిమానా చెల్లించాలని బెదిరించాడు. నగదు ఇవ్వకపోతే కేసు నమోదు చేసి జైలుకు పంపుతామంటూ హెచ్చరించాడు. సాంబయ్య జేబులోని రూ.6 వేలను బలవంతంగా లాక్కున్నాడు. పోలీస్ యూనిఫాం లేకుండా ఓ వ్యక్తి రోడ్డుపై దౌర్జన్యం చేయటంపై అనుమానం వచ్చిన సాంబయ్య, సత్యనారాయణ తమ వద్ద డబ్బు లాక్కున్న దుర్గాంజనేయులను నిలదీశారు. దీంతో అతను వారిద్దరిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన సాంబయ్య హనుమాన్జంక్షన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టిన హనుమాన్జంక్షన్ ఎస్ఐ ఎం.శ్రీనివాస్ గన్నవరం రాయనగర్కు చెందిన సరిహద్దు దుర్గాంజనేయులు నకిలీ ఎస్ఐగా చెలామణీ అవుతూ వాహనదారులను బెదిరించి, డబ్బులు లాక్కుంటున్నట్లుగా గుర్తించారు. హనుమాన్జంక్షన్ శివారులోని వేలేరు క్రాస్రోడ్డు వద్ద శనివారం దుర్గాంజనేయులు ఉన్నట్లుగా సమాచారం అందటంతో తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నట్లు సీఐ రమేష్, ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు చెప్పారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
ఉయ్యూరు: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని ఉయ్యూరు రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ధర్మేంద్ర ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని పెద ఓగిరాలలో కొంత మంది యువకులు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందటంతో ఎస్ఐ సురేష్బాబు తన సిబ్బందితో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా వారిలో ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. నిందితులు పోలిమెట్ల సందీప్, కట్టా నాగబాబు, చాగంటిపాటి ఆకాశ్, చీలి భార్గవ్, తలకంటి షణ్ముఖ్ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో కంకిపాడు సీఐ బి.బి. రవికుమార్, ఎస్ఐ సురేష్బాబు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ అంధ క్రికెటర్లకు ఉచిత ఆరోగ్య బీమా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న అంధ క్రికెటర్లకు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల చొప్పున ఆరోగ్య పాలసీని కల్పిస్తున్నామని ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశి నేని శివనాథ్ తెలిపారు. నగరంలోని ఏసీఏ కార్యాలయంలో అంధ క్రీడాకారులకు ఆరోగ్య పాలసీ పత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ.. ఐదుగురు అంధ క్రికెటర్లకు రూ.10 లక్షల చొప్పు ఆరోగ్య బీమా కవరేజ్ కలిగిన పాలసీలను అందజేశామన్నారు. ఏసీఏ ప్రధాన కార్యదర్శి సానా సతీష్బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగ క్రికెట్ అభివృద్థికి ఏసీఏ అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇ.అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులకు ఆరోగ్య పాలసీ చేయడం సంతోషంగా ఉందన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ దుర్గారావు, క్రీడాకారులు వెంకటేష్, రవి, దున్నా వెంకటేశ్వరరావు, కుమారి సత్యవతి పాలసీ పత్రాలను అందుకున్నారు. డెఫ్ క్రికె టర్ యశ్వంత్ నాయుడును, శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ డెఫ్ అండ్ డంబ్ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన కుమారి జోష్నారెడ్డిని సత్కరించారు. భారత అండర్–19 మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికై న కాట్రగడ్డ దీక్షను శివనాథ్ అభినందించారు. అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రట్ర కార్యదర్శి జి. రవీంద్రబాబు, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్న శేషుకుమార్
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర స్థాయి గురు పూజోత్సవంలో మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాధిపతి డాక్టర్ కె.ఆర్.జి.శేషు కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శనివారం అవార్డు అందుకున్నారు. శేషుకుమార్కు శాలువా, జ్ఞాపిక, సర్టిఫికెట్, మెడల్తోపాటు, రూ.20 వేల నగదు పారితోషకం అందజేశారు. ఈ సందర్భంగా శేషుకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందు కోవడం సంతోషంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి, అధ్యాపక సిబ్బంది, పలువురు విద్యార్థులు శేషుకుమార్, మరో అవార్డు గ్రహీత ముప్పా పద్మనాభంను అభినందించారు. -
హోల్సేల్ కాంప్లెక్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ ఫుడ్ (ఐపీఎం) డైరెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెల్లం, తేనె నమూనాల సేకరణపై ఫుడ్ సేీఫ్టీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా శని వారం గొల్లపూడి పంచాయతీ పరిధిలో ఉన్న మహాత్మాగాంధీ హోల్సేల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్లోని ఇద్దరు ప్రముఖ బెల్లం వ్యాపారుల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రంగు కలిపిన బెల్లం ఉన్నదన్న అనుమానంతో దాదాపు 3,500 కేజీల స్టాక్ను సీజ్ చేశారు. ఈ బెల్లం శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం చైన్నెలోని ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా కోర్టు ఆదేశాల మేరకు తదనంతర చర్యలు తీసుకోనున్నారు. ఈ సంద ర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ.. మూడు రోజులుగా హోల్సేల్ కాంప్లె క్స్లో 15 వరకు బెల్లం శ్యాంపిల్స్ తీశామని, వాటిల్లో కేసు నమోదు చేయగలిగే విధంగా మూడు ఉన్నాయని తెలిపారు. ఈ మూడు రోజుల్లో సుమారు రూ.3 లక్షలు విలువ చేసే ఐదు వేల కేజీల బెల్లాన్ని సీజ్ చేశామని చెప్పారు. తాము సేకరించిన శ్యాంపిల్స్ను ల్యాబ్కు పంపించామని, వాటిల్లో రంగు కలిసినట్లు రుజువైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కొందరు వ్యాపారులు స్వలాభంతో బెల్లంలో సల్ఫర్ వాడుతున్నారని అనుమానంగా ఉందన్నారు. సల్ఫర్ 100 పీపీఎం మించి వాడితే ప్రాణాలకు ప్రమాదమని, రంగు వేసిన బెల్లంతో క్యాన్సర్ (కార్సినోజెనిక్) వచ్చే ప్రమాదం ఉందని, ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం రంగులు వాడట నిషేధమని వ్యాపారులను హెచ్చరించారు. -
మెరక పేరిట మేసేస్తున్నారు!
బుడమేరులో బుసక బూచోళ్లను అడ్డుకునేదెవరు?జి.కొండూరు: బుడమేరు ఉప్పెన గాయాలు ఇంకా మానకముందే టీడీపీ నాయకులు బుడమేరును చెరబడుతున్నారు. తవ్వకాలపై నిషేధం ఉన్నప్పటికీ బుడమేరునే ఆదాయ వనరుగా మార్చుకొని.. అడ్డూ అదుపూ లేని తవ్వేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అధికారం మనదే.. ప్రజా ప్రతినిధి మనోడే.. అధికారీ మనోడే.. ఇక మనకి అడ్డేముంది అన్నట్లు సాగుతోంది బుడమేరులో బుసక, ఇసుక దందా. దీనిని అడ్డుకోవడానికి అధికారులకు మనసొప్పకపోవడంతో దందాలో అధికారుల పాత్రపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. యథేచ్ఛగా తవ్వకాలు.. బుడమేరులో ఇసుక, మట్టి కలిసి మెత్తటి బుసకగా ఏర్పడడమే అక్రమార్కులకు వరంగా మారింది. ఈ బుసకను రియల్ ఎస్టేట్ వెంచర్లలో మెరక కోసం ఎక్కువగా వినియోగిస్తుండడంతో అక్రమార్కుల పంట పండింది. మైలవరం మండల పరిధి చండ్రగూడెం గ్రామ శివారులోని బుడమేరులో గత మూడు రోజులుగా రెండు పొక్లయిన్లతో బుసక తవ్వకాలు జరుపుతూ ముప్పై ట్రాక్టర్లతో సమీపంలోని రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు కోసం మెరక చేసేందుకు తరలిస్తున్నారు. కట్టల వెంబడి, స్థానిక వంతెనకు సమీపంలో తవ్వకాలు చేస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బుసకను ట్రాక్టరు ట్రక్కు దూరాన్ని బట్టి రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా వెలగలేరు హెడ్రెగ్యులేటర్ నుంచి ఎగువ బుడమేరు 42కిలోమీటర్లు మేర విస్తరించి ఉండడంతో ఈ పరీవాహక ప్రాంతంలోని గ్రామాలలో వెంచర్లతో పాటు ఎటువంటి వాణిజ్య అవసరాలున్నా టీడీపీ నాయకులు వెంటనే వాలిపోయి గత రెండేళ్లుగా తవ్వకాలు చేయడం పరిపాటిగా మారిపోయింది. నిత్యం ఇసుక తవ్వకాలు.. బుడమేరులో ఎటువంటి ఇసుక రీచ్లకు అనుమతి లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు ఇసుక తవ్వకాలను నిత్యం కొనసాగిస్తూనే ఉన్నారు. సీసీ రోడ్లు, పక్కా డ్రెయిన్ల నిర్మాణం, వంతెనల నిర్మాణం, ప్రభుత్వ భవనాలు వంటి నిర్మాణాల్లో కృష్ణానది ఇసుకను వాడాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో బుడమేరు ఇసుకనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. నిర్మాణాలు చేసే కాంట్రాక్టర్లు, ఇసుక రవాణాదారులు టీడీపీ నాయకులే కావడంతో నాణ్యతలేని బుడమేరు ఇసుక వినియోగానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఈ విధంగా పుల్లూరు, చండ్రగూడెం, మైలవరం, చిన్ననందిగామ, కుంటముక్కల, వెల్లటూరు గ్రామాల పరిధిలో ఇసుక తవ్వకాలు రేయింబవళ్లు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క ట్రాక్టరు ఇసుక దూరాన్ని బట్టి రూ.1500నుంచి రూ.2వేల వరకు కాంట్రాక్టర్లకు విక్రయిస్తున్నారు.ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన బుడమేరులో బుసక, ఇసుక తవ్వకాలతో విధ్వంసం సృష్టిస్తుంటే అధికారులు కన్నెత్తి చూడకపోవడం దుర్మార్గం. గత చేదు అనుభవాలతోనైనా అధికారుల బుద్ధి మార్చుకోకపోతే రైతులే పోరాటానికి దిగుతారు. బుడమేరులో ఇదే తీరు కొనసాగితే కట్టలు కోతకు గురై ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. – పీవీ ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండల పరిధి దుర్గం కొండల్లోని జమ్ములవోలు ప్రాంతంలో ప్రారంభమైన బుడమేరు వెలగలేరు హెడ్రెగ్యులేటర్ వరకు 42కిలోమీటర్లు మేర ఎగువన ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే బుడమేరు ఆక్రమణకు గురై వాగు వెడల్పు తగ్గిపోవడంతో పాటు గతంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేయడం వల్ల కట్టలు బలహీనపడి 2024 ఆగస్టులో వచ్చిన వరదలకు 80కిపైగా గండ్లు పడి తీవ్ర నష్టం వాటిల్లింది. మరలా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా బుడమేరులో తవ్వకాలు జరపడం ఇప్పుడు స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. కట్టల వెంబడి పొక్లయిన్లతో భారీ గోతులు పెట్టి తవ్వకాలు జరపడం వల్ల కట్టలు కోతకు గురై వరదల సమయంలో మరలా గండ్లు పడితే తీవ్ర నష్టం జరుగుతుందని పరీవాహక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రగతి ప్రదాత
మరపురాని మహానేత..సాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతన్న బాగుండాలని కలలు కన్నారు.. ఆ కలలను సాకారం చేసి చూపించారు. కృష్ణాడెల్టా స్థిరీకరణ కోసం పులిచింతల ప్రాజెక్టు కట్టారు. 150ఏళ్ల డెల్టాను ఆధునికీకరించాలని తలపెట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న అనుబంధం విడదీయరానిది. ఆయన ముఖ్యమంత్రి కాగానే జలయజ్ఞం చేపట్టి రైతుల పాలిట అపర భగీరథుడయ్యారు. ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందించి ఎంతో మంది ప్రాణాలను నిలిపి వారి కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలు ఆయన చేసిన మేలును మనసారా స్మరించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాపై చెరగని సంతకం.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లాపై చెరగని ముద్ర వేశారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలు రెండింటినీ ఒకేసారి అమలుచేసి అన్ని వర్గాల ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. కృష్ణా జిల్లాలో రైతుల పాలిట అపర భగీరథుడయ్యారు. ఆరోగ్యశ్రీతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఫీజు రీయింబర్స్మెంట్తో ఎంతో మంది పేద విద్యార్థులను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, అధికారులుగా తీర్చిదిద్దారు. అభివృద్ధిపై ‘రాజన్న’ ముద్ర ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇప్పటికీ ఉమ్మడి కృష్ణా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వైఎస్సార్. ఆయన వర్ధంతి కార్యక్రమాలు బుధవారం జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. -
యూపీహెచ్సీలో తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని భవానీపురం 3వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ. శ్రావణ్బాబు మంగళవారం సందర్శించారు. సిబ్బంది ముఖ ఆధారిత హాజరు, వారి పనితీరు, ప్రగతి నివేదికలను పరిశీలించారు. అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ ప్రగతి, అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యులు, సిబ్బందితో సమీక్ష చేశారు. అక్కడి ఫార్మసీని పరిశీలించి, త్వరలో కాలం చెల్లనున్న మందులు, అత్యవసర మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిరోధక టీకాల లభ్యత, వాటి భద్రత, ఐఎల్ఆర్ మెయింటేన్ చేయు విధానం, ఓపెన్ వయోల్ పాలసీ, కోల్డ్ చైన్ సిస్టమ్ నమోదు వంటి అంశాలను తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకుని, తక్షణ వైద్య సహాయం అందించాలని కోరారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల సమయ పాలనలో విజయవాడ డివిజన్ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఉన్న 90.80శాతం నెలవారి సమయపాలనను అధిగమించి ఆగస్టు నెలలో 91.28 శాతం నమోదు చేసుకుని సరికొత్త రికార్డు సాధించింది. ఈ అద్భుతమైన విజయం సాధించడం పట్ల డీఆర్ఎం మోహిత్ సోనాకియా విజయవాడ డివిజన్ అధికారులు, సిబ్బందిని మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సమష్టి కృషి, సమన్వయ ప్రయత్నాల వల్లే అద్భుతమైన సమయపాలన సాధ్యమైందన్నారు. అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గాలలో సురక్షితమైన కార్యకలాపాలతో ప్రయాణికులకు సకాలంలో సేవలు అందించడంలో డివిజన్ నిబద్దత ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తి, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ మెరుగైన ఫలితాలను లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని భవానీపురం పున్నమీఘాట్లో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్, సేల్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ(సరస్) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు, విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) పున్నమీఘాట్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించడంతోపాటు గ్రామీణ కళాకారులు, చేతి వృత్తిదారులు, మహిళా స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకునే అవకాశం కల్పించడమే విజయవాడ ఉత్సవ్, సరస్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు 2016 యూజీసీ పీఆర్సీ బకాయిలు చెల్లింపుతో పాటు మరిన్ని సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వైద్యులు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. అంతేకాకుండా 30 నిమిషాల పాట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఐ. బాబ్జి శ్యామ్కుమార్ మాట్లాడుతూ 2016 నుంచి 2021 వరకూ తమకు పనిచేసిన కాలానికి రావాల్సిన జీతభత్యాలు ప్రభుత్వం వద్ద బకాయి ఉన్నట్లు తెలిపారు. వాటిని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అసోసియేషన్ ఎస్ఎంసీ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ జ్వలిత, కార్యదర్శి డాక్టర్ పి. అనీల్కుమార్, కోశాధికారి డాక్టర్ దుర్గారాణి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రత్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి
న్యాయమూర్తి ఎస్. వరలక్ష్మిచిలకలపూడి(మచిలీపట్నం): జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మి అన్నారు. జీవిత బీమా సంస్థ డివిజన్ కార్యాలయంలో మంగళవారం సంస్థ 70వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ పేద వారికి, ప్రజలకు ఉచిత న్యాయసేవా కార్యక్రమాలను అందిస్తోందన్నారు. ఎల్ఐసీ కార్పొరేట్ పథకం ప్రారంభం.. ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ నున్న నాగేశ్వరరావు ఎల్ఐసీ కార్పొరేట్ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పాలసీల అంశంలో 65.16 శాతం, ప్రీమియం ఆదాయంలో 56.66 శాతం మార్కెట్ వాటాను కై వసం చేసుకుని జీవిత బీమా సంస్థ ఇన్సూరెన్స్ రంగంలో లీడర్గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. వారోత్సవాల సందర్భంగా 7వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఎల్ఐసీ డివిజనల్ అధికారి మహమ్మద్ఖాజా, ఎంఎస్ సుబ్రహ్మణ్యం, కేడీవీఎస్ కృష్ణ, సీహెచ్ వెంకటరమణ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీలి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. -
డేగ కన్ను కప్పి..
బరితెగిస్తున్న గంజాయి మాఫియాసాక్షి ప్రతినిధి, విజయవాడ: గంజాయి నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం.. గంజాయి రవాణాపై సమాచారం ఇస్తే ఐదు వేల రూపాయలు ఇస్తామంటూ ప్రభుత్వం, పోలీసులు ఊదరగొడుతున్నా.. వాస్తవ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. గంజాయి మాఫియా తెగబడుతోంది. ఆఖరికి పోలీసు కానిస్టేబుళ్ల మీదే కత్తితో దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే గంజాయి మాఫియా ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల దగ్గర యర్నగూడెం గ్రామం వద్ద ఎన్హెచ్ సర్వీస్రోడ్డులో అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు బైక్లను ఆపి తనిఖీ చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును కత్తితో పొడిచి పారిపోయారు. ఆ నిందితులు కంకిపాడు సమీపంలో ఉన్నట్లు వచ్చిన సాంకేతిక సమాచారం ఆధారంగా పోలీసులు కంకిపాడు మండలం కోమటికుంట లాకులు డొంకరోడ్డు వద్ద పట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా అఖిదాసరి అవినాథ్ అనే నిందితుడు కానిస్టేబుల్ శ్రీనివాస్ మీద కత్తితో ఛాతీపై దాడి చేశాడు. దీంతో కంకిపాడు సీఐ నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల నిర్లక్ష్యం.. ఒకవైపు వందల కిలోల గంజాయి రవాణా చేస్తూ ముఠాలు పట్టుబడుతుంటే.. మరోవైపు వాటి వెనుక ఉన్న అసలు నెట్వర్క్ను ఛేదించడంలో పోలీసుల దర్యాప్తు సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూన్ నెలలో పట్టుబడిన 140 కిలోల గంజాయి రవాణా కేసులో మహమ్మద్ సొహైల్ పేరు ప్రధానంగా తెరపైకి రావడం, అతడు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా పటమట పోలీసు కస్టడీ నుంచి పరారు కావడం చర్చనీయాంశంగా మారింది. జూన్ నెల 9న తెల్లవారుజామున విజయవాడ శివారు నిడమానూరులో ఈగల్ బృందం ఓ లారీని తనిఖీ చేయగా, అందులో 140 కిలోల గంజాయి దొరికింది. లారీ డ్రైవర్లను విచారించగా తమిళనాడులోని కోయంబత్తూరుకు తరలిస్తున్నట్లు తేలింది. దీంతో ఈగల్ బృందం లారీని, ఇద్దరు డ్రైవర్లను పట్టుకుని విచారణ నిమిత్తం పటమట పోలీసులకు అప్పగించింది. ఈ నిందితులు ఇచ్చిన సమాచారంతో గంజాయి రవాణాకు కీలక సూత్రధారులైన కేరళకు చెందిన మహ్మద్ సొహైల్, ఒడిశాకు చెందిన అరూప్ సింగ్, రాజేష్కుమార్ సింగ్ను కూడా ఈగల్ అధికారులు విశాఖపట్నంలో పట్టుకుని పటమట పోలీసులకు అప్పగించారు. అయితే వీరిలో కింగ్పిన్ అయిన సొహైల్ జూన్ నెల 11న తెల్లవారుజామున పటమట పోలీసుల కళ్లు గప్పి వారి కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. సొహైల్ను ప్రవేశపెట్టకముందే పరారవడంతో పోలీసులు కంగుతిన్నారు. విషయం బయటకు పొక్కకుండా దాచారు. ఈ ఉదంతంపై సీపీ రాజశేఖర బాబు పటమట పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆ రోజు విధుల్లో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశారు. అయితే ఇప్పటివరకూ సొహైల్ను పట్టుకోలేకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కిలోల కొద్దీ గంజాయి.. నగరానికి ఎలా చేరుతోంది? ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలను కలుపుతూ గంజాయి రవాణా నెట్వర్క్ పనిచేస్తున్నట్లు కేసు వివరాల్లో ప్రస్తావించారు. నిడమానూరు వద్ద పట్టుబడిన 140 కిలోల గంజాయి కోయంబత్తూరుకు తరలిస్తున్నట్లు డ్రైవర్లు వెల్లడించినట్లు సమాచారం. ఇంత భారీ పరిమాణంలో గంజాయి నగర పరిధిలోకి వస్తుంటే పోలీసుల నిఘా వ్యవస్థ ఎక్కడ పనిచేస్తోంది? వాహనాలు నగరంలోకి ప్రవేశించే మార్గాలు, జాతీయ రహదారులు, బైపాస్లు, లాడ్జీలు, గోదాములు, రవాణా కేంద్రాలపై నిరంతర నిఘా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఇలాంటి భారీ సరుకులు పట్టుబడుతున్న సందర్భాలు మాత్రం ఆ నిఘా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్నాయి. విజయవాడ భౌగోళికంగా కీలక రవాణా కేంద్రం. జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, అంతర్రాష్ట్ర రవాణా సౌకర్యాలు ఉండటంతో అక్రమ రవాణా ముఠాలకు నగరం ట్రాన్సిట్ పాయింట్గా ఉపయోగపడుతుందన్న వాదన వినపడుతోంది. గతంలోనూ విజయవాడ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడిన ఘటనలు నమోదయ్యాయి. 2025లో కృష్ణలంక పోలీసుల పరిధిలో ఈగల్ బృందంతో కలిసి పోలీసులు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూడా గంజాయిని లేకుండా చేస్తామని చెబుతున్నా వాస్తవంలోకి వచ్చేసరికి అంత చిత్తశుద్ధితో ముందుకు వెళ్లడం లేదన్న వాదన వినిపిస్తోంది. -
జయ కృష్ణా.. ముకుందా.. మురారి
విజయవాడలోని ఇస్కాన్ టెంపుల్ వద్ద ఉట్టి కొడుతూ సందడి చేస్తున్న యువతబాల గోపాలా.. ముకుందా.. మురళీగానలోలా.. మురారీ.. రారా.. మము దీవించ మా ఇంటికి.. అంటూ భక్తలోకం ప్రార్థించింది. ముద్దులు మూటగట్టిన మురిపాల కన్నయ్యను చూసి పరవశించిపోయింది. గోకులంలో కేరింతలు కొట్టిన లీలా వినోదుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసింది. జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక సుగంధాలు గుబాళింపగా.. కొన్నిచోట్ల బాలకృష్ణులు, బుల్లి గోపికమ్మల రూపాలలో చిన్నారులు చూడముచ్చటగా అలరించారు. యువత, చిన్నారులు ఉట్టి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
పలు హోటళ్లకు నోటీసులు
పటమట(విజయవాడతూర్పు): విజయవాడలోని హోటళ్లలో శుభ్రతపై జరుగుతున్న తనిఖీల నేపథ్యంలో ‘సాక్షి’ శుక్రవారం ‘తనిఖీల్లో తిరకాసు’ శీర్షికన ప్రచురించిన కథనంపై నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి సిబ్బంది పంపే నివేదికల్లో డొల్లతనంపై ఈ కథనం రాగా.. శుక్రవారం జరిగిన తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణం, వసతులు సరిగా లేని హోటళ్లపై చర్యలు చేపట్టారు. ఆయా హోటళ్లకు జరిమానా విధించటంతోపాటు లోపాలను సరిచేసుకునేందుకు నిర్ణీత గడువుతో నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే తనిఖీలు జరిగిన హోటళ్లలో 50 హోటళ్లకు కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఉత్తుత్తి తనిఖీలు చేస్తున్న అధికారు తీరుపై కూడా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హోటళ్లకు రూ.15వేలు జరిమానా.. విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు హోటళ్లపై తనిఖీలు ముమ్మరం చేశారు. 37వ డివిజన్ పరిధిలోని కెనాల్ రోడ్ ప్రాంతంలో పలు హోటళ్లను తనిఖీ చేశారు. ప్రజారోగ్యానికి విఘాతం కలిగించే విధంగా అపరిశుభ్ర పరిస్థితుల్లో హోటల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు మూడు హోటళ్లకు ఒక్కొక్కదానికి రూ.5,000 చొప్పున జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. సర్కిల్–1 శానిటరీ సూపర్వైజర్ డి. సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు స్వర్ణాభరణాల సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం స్వర్ణాభరణాలను సమర్పించారు. విజయవాడ బ్యాంక్ కాలనీకి చెందిన గుంటుపల్లి శ్రీప్రణవి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. సుమారు 22.8 గ్రాముల బంగారంతో తయారు చేయించిన బంగారు బొట్టు(నవరత్నాలు, డైమండ్స్ పొదిగినది), బంగారు నత్తు(డైమండ్స్, ఎరుపు, పచ్చ రాళ్లు పొదిగినవి, బంగారు బులాకీ(డైమండ్స్, ఎరుపు, పచ్చ రాళ్లు, ముత్యం పొదిగినది)లను తయారు చేయించి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం బహూకరించారు. అందరి సహకారంతోనే ప్లాస్లిక్ నిర్మూలన సాధ్యం చల్లపల్లి: ప్రాణాంతకమైన క్యాన్సర్కు కారణమవుతున్న ప్లాస్టిక్ వస్తువులను నిషేధించటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని డెప్యూటీ ట్రైనీ కలెక్టర్ బి.నిఖిల చల్లపల్లి ప్రజలను కోరారు. ఈనెల ఒకటో తేదీ నుంచి చల్లపల్లిలో ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, గ్లాసులు, అలాగే పేపర్ గ్లాసులు, టీ కప్పులు వంటి వాటి అమ్మకాలను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. అదేరోజు అధికారులు తనిఖీలు నిర్వహించి భారీగా ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసు కుని మొదటి విడతగా హెచ్చరించి వదిలేశారు. కాగా అవే షాపులకు ట్రైనీ కలెక్టర్ నిఖిల అధికారులతో కలిసి శుక్రవారం మరలా వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పేపర్, ప్లాస్టిక్ గ్లాసుల స్థానంలో వ్యాపారులు గాజు గ్లాసులను వినియోగించటం, ప్లాస్టిక్ క్యారీబ్యాగుల వాడకం ఆపివేయటంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఆమె వెంట డెప్యూటీ ఎంపీడీవో పేర్ని మాధవేంద్రరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సూర్యరావు, కానిస్టేబుల్ రవి, స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ బోలెం నాగమణి ఉన్నారు. రైస్ కౌంటర్లలో తనిఖీలు మచిలీపట్నంటౌన్: వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాటు చేసిన రైస్కౌంటర్లను శుక్రవారం కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి టి. శివరామ ప్రసాద్ తనిఖీ చేశారు. మచిలీపట్నం నగరంలోని రెండు రైతుబజార్లలో రైస్మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతిరోజు జరిగిన విక్రయ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయటంతో పాటు సంబంధిత రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని పౌరసరఫరాలశాఖకు సంబంధించిన డెప్యూటీ తహసీల్దార్లకు సూచించారు. బియ్యం కౌంటర్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కౌంటర్ల వద్ద బియ్యం నిల్వలు తగినంతగా ఉండేలా చూసుకోవాలన్నారు. మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మచిలీపట్నం–తిరుచానూరు మధ్య వారానికి రెండు రోజులు నడిచేలా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. మచిలీపట్నం–తిరుచానూరు(07440) ప్రత్యేక రైలు ఈ నెల 11, 12, 18, 19 తేదీలలో సాయంత్రం 4.55 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07439) ఈ నెల 12, 13, 19, 20 తేదీలలో తెల్లవారుజామున 3.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరి, అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. -
రైతన్నపై అధనపు భారం!
నందిగామరూరల్: ఒకవైపు విత్తనాలు ధర.. మరోవైపు ఎరువుల ఖర్చు.. రోజురోజుకు పెరుగుతున్న కూలీ రేట్లు.. పెట్రోల్, డీజిల్ సంగతి సరేసరి.. పెరిగిన సాగు ఖర్చులకు వెనుకాడకుండా ప్రకృతి విపత్తులను తట్టుకుని.. పంట సాగు చేస్తున్న అన్నదాతలపై కూటమి సర్కారు మోపిన ట్యాక్సుల భారం వారి పాలిట గుదిబండగా మారుతోంది. వ్యవసాయ భూములు దున్ని నాలుగు రూపాయలు సంపాదించి కుటుంబాన్ని నెట్టుకొచ్చే రైతన్న బండి(ట్రాక్టర్)పై కూటమి ప్రభుత్వం ట్యాక్సులు విధిస్తోంది. నిన్న మొన్నటి వరకు ట్యాక్సులు లేకుండా దర్జాగా తిరిగిన తమ రథాలు కూటమి ప్రభుత్వం పుణ్యమాని ట్యాకులు, పెనాల్టీలు కట్టాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇదీ సంపద సృష్టేనా.. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన విధంగా.. ట్రాక్టర్లపై ట్యాక్సులు వసూలు చేసి సంపద సృష్టిస్తున్నారనే విమర్శలు సర్వత్రా నెలకొన్నాయి. ట్రాక్టర్ ప్రభుత్వం దృష్టిలో యంత్రం అయినప్పటికీ సన్న, చిన్నకారు రైతులకు మాత్రం కుటుంబ జీవనాధారమనే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడుతున్నారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లపై పలు రకాల పన్నులు విధించటమేంటని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ భారం.. ట్యాక్సులు అదనం.. నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల పరిధిలోని 69 గ్రామ పంచాయతీలలో సుమారు 750కు పైగా ట్రాక్టర్లున్నాయి. పెరిగిన సాగు ఖర్చులకు తోడు రుణాల వాయిదాలు, ఇంధనం, మరమ్మతులు, టైర్లు, డ్రైవర్ ఖర్చులతో ట్రాక్టర్ నిర్వహణే భారంగా మారిన ప్రస్తుత తరుణంలో కూటమి ప్రభుత్వం మూడేళ్ల పన్నులు, జరిమానాలు విధించటం మరింత అదనపు భారంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ట్రాక్టర్లపై వసూలు చేస్తున్న మూడు రకాల పన్నులను రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా మోటార్ వెహికల్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్కు సంబంధించి రవాణా శాఖాధికారులను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి తమకు వచ్చిన ఆదేశాలను పాటిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ ట్రాక్టర్లపై పన్నులు వసూలు చేయలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. 2019 నుంచి 2023 వరకు ట్రాక్టర్లపై ఒక్క రూపాయి కూడా పన్నులు విధించలేదని చెబుతున్నారు. 2023 సెప్టెంబర్లో పన్నులు వసూలుకు ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ రైతుల వద్ద నుంచి మాత్రం పన్నులు కూడా వసూలు చేయలేదని చెబుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం 2023 సెప్టెంబర్ నుంచి పన్నులను పెనాల్టీలతో పాటు వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు ఇలా.. ఏడేళ్ల లోపు ట్రాక్టర్కు ఇప్పటి వరకు మోటార్ వెహికల్ ట్యాక్స్ రూ. 8,970, లేబర్ ట్యాక్స్ రూ.1,480, ఏడేళ్లు దాటిన ట్రాక్టర్లకు అదనంగా గ్రీన్ ట్యాక్స్ రూ.2,960 చొప్పున వసూలు చేస్తుండటంతో అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. లేబర్, గ్రీన్ ట్యాక్స్ను ఏడాదికొకసారి రూ. 460కాగా మోటార్ వెహికిల్ ట్యాక్స్ మాత్రం మూడు నెలలకొకసారి రూ.460 చొప్పున ప్రభుత్వం వసూలు చేస్తోంది. వ్యవసాయ ట్రాక్టర్లకు మూడు రకాల ట్యాక్స్లు విధించటం సరికాదు. ఇప్పటికే పెరిగిన సాగు ఖర్చులతో పాటు ట్రాక్టర్ల నిర్వహణ కష్టంగా మారింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకు ట్రాక్టర్లకు మోటార్ వెహికిల్, లేబర్, గ్రీన్ ట్యాక్సులను ప్రభుత్వాలు వసూలు చేయలేదు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మూడు రకాల పన్నులు వసూలు చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్యాక్సుల వసూలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – డి. శేషయ్య, రైతు -
వందే.. వరదాయినీ
ఇంద్రగిరిపై వరలక్ష్మీవ్రత శోభ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం నాల్గో శుక్రవారాన్ని పురస్కరించుకుని దుర్గమ్మ చెంతన మహిళలు సామూహిక వర లక్ష్మీవ్రతాలను ఆచరించారు. దేవస్థానం మహామండపం ఆరో అంతస్తు సామూహిక వరలక్ష్మీవ్రతాలకు వేదికై ంది. ఆరో అంతస్తులో ప్రత్యేక వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ప్రత్యేక ఆర్జిత సేవగా వరలక్ష్మీవ్రతంతో పాటు ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలు వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో మామిడి తోరణాలు, అరటి చెట్లతో, ప్రధాన ఆలయాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వరలక్ష్మిగా దుర్గమ్మ.. మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించారు. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ప్రత్యేక ఆర్జిత సేవగా వరలక్ష్మీవ్రతాలను నిర్వహించారు. రూ. 1500 టికెట్పై సుమారు వంద మంది మహిళలు ప్రత్యేక ఆర్జిత సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 10 గంటలకు ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలను నిర్వహించగా, 600మందికి పైగా మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. వ్రతానికి అవసరమైన పసుపు, కుంకుమతో పాటు పూజా సామగ్రి, గాజులు, రవికలతో పాటు అమ్మవారికి నివేదనగా సమర్పించేందుకు పూర్ణాలు, చక్రెర పొంగలి, పులిహోరలను దేవస్థానమే అందజేసింది. వ్రతంలో పాల్గొన్న మహిళలకు రూ. 100, రూ. 300టికెట్ క్యూలైన్లో ఉచితంగా అనుమతించారు. కృష్ణునికి విశేష అభిషేకాలు, పూజలు.. కృష్ణాష్టమిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేద ఆశీర్వచన మండపంలో కృష్ణునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తొలుత కృష్ణుని విగ్రహానికి ఆలయ ఈవో శీనా నాయక్ అభిషేకాలు నిర్వహించారు. చైర్మన్ రాధా కృష్ణ పాల్గొన్నారు. సాయంత్రం రాజగోపురం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. బారులు తీరిన భక్తులు.. శ్రావణ మాసం నాల్గో శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఘాట్రోడ్డులోని సమాచార కేంద్రం వరకు, ఇటు మహా మండపం 5వ అంతస్తు వరకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరి కనిపించారు. భక్తులతో పాటు గత రెండు రోజులుగా శుభ ముహూర్తాల వేళ ఒక్కటైన నవ దంపతులు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. -
గ్రేటర్ లేనట్టే!
● ఊరించి.. ఉసూరుమనిపించారు!సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడకు గ్రేటర్ యోగం ఇప్పట్లో లేనట్టే! మొన్నటివరకూ గ్రేటర్ అంటూ ఊరించిన ప్రభుత్వం ఇప్పుడు పెరిగిన డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న 64 డివిజన్ల స్థానంలో 86 డివిజన్లకు పెంచుతూ శుక్రవారం విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ మూడు సర్కిళ్లు పరిధిలో ప్రస్తుతం 64 డివిజన్లుగా ఉంది. విజయవాడ నగరపాలక సంస్థను గ్రేటర్ విజయవాడగా మార్చేందుకు 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దీనికిగాను విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న నాలుగు మండలాలను కలుపుకుని గ్రేటర్గా రూపాంతరం చేయటానికి కొంతమేర కసరత్తు కూడా చేసింది. 61.88 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న విజయవాడను పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాలు, మైలవరం మండలాల్లో ఉన్న 46 గ్రామాలతో తొలుత 330 కిలోమీటర్లు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అప్పటి మునిసిపల్ కమిషనర్ జె.నివాస్ కూడా గ్రేటర్ ప్రతిపాదనపై చురుగ్గా వ్యవహరించి గ్రామాలతో కూడా చర్చలు జరిపారు. అయితే తర్వాత ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. మళ్లీ ఎన్నికల ముందు గ్రేటర్ అంటూ హామీలు ఇచ్చారు. 2025లో మళ్లీ గ్రేటర్ ప్రతిపాదన రాగా ఆయా మండలాల్లో 75 గ్రామాలను విలీనం చేయాలని, 500 కిలో మీటర్లు విస్తీర్ణంలో గ్రేటర్గా మార్చాలని ప్రభుత్వ పెద్దలు చర్యలు చేపట్టారు. దీనిపై గత ఏడాది డిసెంబర్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ప్రతిపాదన చేశారు. ఇక అంతా అయిపోతున్నట్లు ప్రచారం చేశారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో కేవలం విజయవాడకు మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, డివిజన్ల పునర్వవస్థీకరణతో 64 డివిజన్ల నుంచి 86 డివిజన్లుగా వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు డివిజన్ సరిహద్దులు కూడా మార్చారు. తాజాగా 86 డివిజన్లకే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ నగర ఏరియల్ వ్యూనోటిఫికేషన్ విడుదల.. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ 64 డివిజన్ల నుంచి 86 డివిజన్లుగా పెంచుతూ శుక్రవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. డివిజన్లు పునర్విభజన శాసీ్త్రయంగా జరగలేదని పలువురు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించటంతో విచారణ చేపట్టిన కోర్టు గురువారం ఆ పిల్ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర డివిజన్ల పునర్విభజనపై, డివిజన్ సరిహద్దులపై నోటిఫికేషన్ను విడుదల చేశారు. విజయవాడ నగరంలో 86 డివిజన్లుగా మారుస్తున్నందున దీనిపై నగరవాసులకు సమాచారం నిమిత్తం ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వీఎంసీ ప్రధాన కార్యాలయంలో, చిట్టినగర్లోని సర్కిల్–1 కార్యాలయంలో, సత్యనారాయణపురంలోని సర్కిల్–2 కార్యాలయంలో, పటమటలోని సర్కిల్–3 కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలుంటే ప్రజలు రాతపూర్వకంగా అధికారులకు అందించాలని సూచించారు. 2017లో వచ్చిన గ్రేటర్ ప్రతిపాదన సమయంలో విజయవాడ నగర జనాభా కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే. విలీన ప్రతిపాదన పంచాయతీల జనాభా నాలుగు లక్షలు. అయితే గ్రేటర్ చేయాలంటే ఆ నగర జనాభా 15 లక్షలకు మించి ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహకల్ప శాఖ నిబంధన ఉంది. ఈ మేరకు 2026 నాటికి విజయవాడ నగర జనాభా 13లక్షలుగా ఉండగా, పరిసర ప్రాంత గ్రామాల జనాభా మరో నాలుగున్నర లక్షలు ఉంది. ఆయా గ్రామాల విలీనం కలుపుకుని గ్రేటర్ విజయవాడ చేస్తే విజయవాడ జనాభా 17.5లక్షలు అవుతుంది. గతంలో విలీనం చేయాలని ప్రతిపాదించిన గ్రామాల్లో ఒకటైన తాడిగడప ఇప్పుడు మునిసిపాలిటీగా మారింది. కొండపల్లి గ్రామం కూడా మునిసిపాలిటీగా రూపాంతరం చెందింది. కానీ గ్రేటర్ ప్రతిపాదన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. -
రామ్జీ పథకం పనుల్లో నాణ్యత పాటించాలి
జయంతిపురం(జగ్గయ్యపేట): ఎన్టీఆర్ జిల్లాలో వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టే పనులు రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ పథకం ద్వారా చేపడుతున్న పనులు కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలన్నారు. పథకం ద్వారా చేపడుతున్న పనులు రైతుల వ్యవసాయ అవసరాలను తీర్చటంతో పాటు భూగర్భజలాల పెంపునకు దోహదపడేలా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యాన రైతులు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందాలని అర్హులైన రైతులు ఆ పంటల సాగుకు ముందుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో అనిల్కుమార్, తహసీల్దార్ శిరీష, డ్వామా ఏపీవో రామ కృష్ణ, డీఎల్డీవో లక్ష్మీకుమారి, ఎంపీడీవో అరుణ కుమారి, ఆర్ఐ ఆనందబాబు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఏపీఐఐసీ భూములను కలెక్టర్ పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
పంచాయతీ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు
మచిలీపట్నంఅర్బన్: గ్రామాల పారిశుద్ధ్యం, తడి–పొడి చెత్త సేకరణ, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి కీలక సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కల్లం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టెండర్ల విధానాన్ని రద్దు చేసి, కార్మికులను స్వర్ణ పంచాయతీ పోర్టల్లో నమోదు చేసి నేరుగా విధుల్లో కొనసాగించాలని కోరుతూ ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఒక్కరోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు జారీ చేసిన జీవోలను అమలు చేయాలని, కనీస వేతనాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఒకే పని చేస్తున్న కార్మికులకు రూ.1,500 నుంచి రూ.14,500 వరకు వేర్వేరు వేతనాలు చెల్లిస్తున్నారని, ఈ వ్యత్యాసాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రాపు పోలినాయుడు మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్లకు నెలకు రూ.10వేల వేతనం చెల్లించాలని జీఓ నంబర్ 680లో ఉన్నప్పటికీ అనేక పంచాయతీల్లో అమలు కావడం లేదన్నారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. జగన్, ఎం. గణేష్, కార్యదర్శివర్గ సభ్యులు వి. శ్రీనివాసరావు, నాగమణి, సభ్యులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో విజయవాడ షూటర్ల సత్తా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కేరళంలోని త్రివేండ్రంలో ది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 17వ సౌత్ జోన్ షూటింగ్ చాంపియన్షిప్–2026లో నగరానికి చెందిన షూటర్లు ప్రతిభ చూపి వివిధ విభాగాల్లో 8 పతకాలు పొందారు. ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్కు చెందిన నాగిశెట్టి జాహ్నవి ప్రతిభ కనపరచి 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, ఫైర్ ఆర్మ్స్, సీనియర్, జూనియర్, యూత్ మహిళల విభాగాల్లో మూడు కాంస్య పతకాలు కై వసం చేసుకుంది. కొసన పూర్ణిమ శ్రీనివాస్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో సీనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో మూడు రజత పతకాలు సొంతం చేసుకుంది. ఏడూరు శ్రీకర జయంత్ రెడ్డి 25 మీటర్ల జూనియర్, యూత్ మెన్ విభాగాల్లో రెండు రజత పతకాలను గెలుచుకున్నాడు. పతకాలు పొందిన షూటర్లను ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్, చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు అభినందించారు. ఆగస్టు 31వ తేదీన మొదలైన ఈ చాంపియన్షిప్ ఈ నెల 8వ తేదీ వరకు జరుగుతుంది. -
మద్యం దుకాణం వద్ద ఆర్టీసీ డ్రైవర్పై దాడి
గన్నవరం: స్థానిక కోనాయి చెరువు సమీపంలోని వైన్షాపు వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్పై కొంత మంది యువకులు దాడిచేసి కొట్టిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక కోనాయి చెరువు సమీపంలోని వైన్షాపు రాత్రి 10గంటలకు మూసివేసిన తర్వాత జానీ అనే వ్యక్తితో అధిక ధరలకు దొడ్డిదారిన మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసరపల్లి శివారు వీఎన్ పురం కాలనీకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సతీష్కుమార్ మద్యం కోసం అర్ధరాత్రి 12 గంటలకు వైన్షాపునకు వచ్చాడు. మద్యం కొనుగోలు చేసి గేటు వద్దకు వచ్చిన అతనిపై బైక్పై వచ్చిన కొంత మంది యువకులు ఇనుప రాడ్లతో దాడిచేసి కొట్టి పరారయ్యారు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో అతనిని చికిత్స నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేరే వ్యక్తి అనుకొని.. అయితే ఈ ఘటనకు ముందు వైన్షాపు వద్ద కొంత మంది యువకుల మధ్య ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో సదరు యువకులు పొరబడి గొడవ పడ్డ వ్యక్తి అనుకుని డ్రైవర్పై అకారణంగా దాడిచేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వైన్షాపు వద్ద గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యంగా మారాయని స్థానికులు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికి ఎకై ్సజ్, పోలీసులు అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందు బాబుల ఆగడాలు కారణంగా వైన్షాపు ఉన్న వీఎన్. పురం రోడ్డులో ప్రయాణించలంటేనే మహిళలు, ఆడపిల్లలు భయపడే పరిస్థితి నెలకొంది. -
డ్రైవర్ను హత్య చేసిన క్లీనర్ అరెస్ట్
పెనమలూరు: కానూరులో లారీ డ్రైవర్ను హత్య చేసిన ఘటనలో లారీ క్లీనర్ను అరెస్ట్ చేశామని డీఎస్పీ కె.ధర్మేంద్ర తెలిపారు. ఆయన పెనమలూరు పోలీస్స్టేషనల్లో గురువారం వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్కు చెందిన లారీ డ్రైవర్ ఆనంద్సర్కార్(50) లారీ మరమ్మతుల కోసం కానూరు నవతారోడ్డులో ఉన్న రమణ షెడ్డుకు గత నెల 5వ తేదీన వచ్చాడు. అతను లారీ మరమ్మతులు చేయించుకుంటూ అక్కడే ఉంటు న్నాడు. అయితే అదే లారీకి క్లీనర్గా బెంగాల్ రాష్ట్రానికి చెందిన సంజయ్హల్దార్ (36) ఆగస్టు 19వ తేదీన వచ్చాడు. అయితే ఈ నెల 30వ తేదీ రాత్రి ఇద్దరు మద్యం తాగారు. అనంతరం వారి మధ్య గొడవ మొదలయింది. దీంతో లారీ క్లీనర్ సంజయ్హల్దార్ ఇనుప రాడ్తో డ్రైవర్ ఆనంద్ సర్కార్పై విచక్షణా రహితంగా దాడి చేయటంతో అతని మృతి చెందాడు. లారీ షెడ్డు యజమాని రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు సంజయ్హల్దార్ను అరెస్టు చేశారు. యజమానుల వద్ద వివరాలుండాలి.. మద్యం తాగిన వారు విచక్షణ కోల్పోరాదని డీఎస్సీ ధర్మేంద్ర తెలిపారు. ఈ ఘటన కేవలం మద్యం సేవించిన తరువాత చిన్న వివాదం కారణంగానే హత్య జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసే వారి వివరాలు యజమానుల వద్ద ఉండాలన్నారు. ఆధార్కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు యజమానులు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా ఉంచుకోవాలని సూచించారు. బెంగాల్కు చెందిన నిందితుడు సంజయ్హల్దార్ ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేసినందుకు సీఐ వెంకటనారాయణ, ఎస్ఐలు సత్యసుధాకర్, రమేష్, వెంకటేశ్వరరావును జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు అభినందించినట్లు డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు.వివరాలు వెల్లడించిన డీఎస్పీ ధర్మేంద్ర -
రేపు రాష్ట్రస్థాయి గురు పూజోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల ఐదో తేదీన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. గురుపూజోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని జిల్లాల నుంచి ఎంపిౖకైన 183 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లకు అవార్డులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. అవార్డులు అందుకోనున్న వారి జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, వరుస క్రమంలో ఉపాధ్యాయులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు, రాజమండ్రి ఆర్జేడీ నాగమణి, డీఆర్వో వెన్నెల శ్రీను, డీఈఓ ఎల్.చంద్రకళ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బోధనలో ప్రతిభకు రాష్ట్రస్థాయి గుర్తింపు వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఎ.కొండూరు మండలం కోడూరు మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మందడపు రాంప్రదీప్, విజయవాడ రాజీవ్నగర్ ఉపాధ్యాయిని కె.గంగ ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ నెల ఐదో తేదీన విజయవాడలో జరిగే గురుపూజోత్సవాల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటారు. గత ఏడాది కోడూరు పాఠశా లకు బదిలీపై వచ్చిన రాంప్రదీప్ ఇంటింటి ప్రచా రంతో విద్యార్థుల సంఖ్యను 63 నుంచి 86కు పెంచారు. గతంలో పనిచేసిన గానుగపాడు ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా వర్గో న్నతి కల్పించడంలో, పాఠశాలకు దాతల ద్వారా రూ.50 లక్షల విలువ చేసే స్థలం, రూ.5 లక్షల విరాళాల సేకరణకు కృషిచేశారు. కొర్రా గంగ విజ యవాడ రాజీవ్నగర్లో రాజీవ్గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. గతంలో కండ్రికలో పాఠశాలలో హిందీలో నూరు శాతం ఫలితాలు సాధించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ పది విశేష అలంకారాల్లో భక్తులను కరుణిస్తారు. గురువారం జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో దసరా విశేష అలంకారాలతో రూపొందించిన పోస్టర్ను దుర్గగుడి ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు ఆవిష్కరించారు. ఈ మేరకు 11వ తేదీ నుంచి అమ్మవారు పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల తొలి రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఇక విజయ దశమి మంగళవారం సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో హంసవాహన సేవతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారిలోని ప్రతిభను వెలికితీసి ఉపాధి, స్వయం ఉపాఽధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఎన్టీఆర్ కలెక్టరేట్లో కంటెంట్ క్రియేషన్ స్టూడియో, అకాడమీ, ల్యాబ్లను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటెంట్ క్రియేషన్ స్టూడియో, అకాడమీ యువతకు ఉపాధి కల్పించే వేదికగా నిలుస్తాయన్నారు. జిల్లాలోని జానపద కళలు, సంప్రదాయాలు, పండుగలు, స్థానిక వంటకాలు, కళాకారుల ప్రతిభను డిజిటల్ రూపంలో డాక్యుమెంట్ చేసి భద్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లా రెవెన్యూ అధికారి జి.లక్ష్మీనరసింహం, ఆర్డీఓ వెన్నెల శ్రీను, డీపీఆర్ఓ టి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ భక్తురాలి మృతి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తురాలు మహా మండపం రెండో అంతస్తులో అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో భక్తురాలిని దేవస్థాన అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆ ఘటన గురువారం చోటు చేసుకుంది. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన కె. పద్మ(61), తన భర్త నాంచారయ్యతో కలిసి గురువారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అన్న ప్రసాదం స్వీకరించేందుకు మహామండపం రెండో అంతస్తులో దింపాలని లిఫ్టు సిబ్బందికి కోరింది. అయితే గ్రౌండ్ప్లోర్లో దింపిన సిబ్బంది.. అక్కడి నుంచి మెట్లపై రెండో అంతస్తుకు వెళ్లాలని సూచించారు. అయితే మెట్లు ఎక్కే క్రమంలో పద్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది వెంటనే పద్మను గ్రౌండ్ ఫ్లోర్లో దింపి, అక్కడి నుంచి దేవస్థాన అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో పద్మ మృతి చెందగా.. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ నివాసానికి తీసుకెళ్లినట్లు ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ఘటనపై వన్టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని తెలుస్తోంది. ఎందుకిలా? కనీసం వృద్ధులు, వికలాంగులను అన్నదానం జరిగే ఫ్లోర్లో లిఫ్టు ద్వారా దింపాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్ర, శని, ఆదివారాలలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదాన భవనంలో అన్న ప్రసాద వితరణను ప్రారంభిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మరి కొంత మంది భక్తులు పేర్కొంటున్నారు. -
తనిఖీలకూ ఉందో లెక్క!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణాజిల్లాను వాణిజ్య రాజధానిగా పేర్కొనటం పరిపాటి. అత్యధిక ఆదాయం ఇక్కడ ఉన్న డివిజన్ల నుంచే ప్రభుత్వానికి లభిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. కానీ వస్తున్న ఆదాయానికి కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి వ్యవహార శైలి ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. వ్యాపారులతో అధికారులు కుమ్మకై ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఆ శాఖ ఉద్యోగుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు.. వాణిజ్య పన్నుల శాఖకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ డివిజన్–1, విజయవాడ డివిజన్–2, విజయవాడ డివిజన్–3 పేరుతో మూడు డివిజన్లు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 17 సర్కిల్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. మూడు డివిజన్లకు సంబంధించిన పరిధి దాదాపుగా విజయవాడల ఉంటుంది. వివిధ అంశాలపై కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా తరచుగా ఆయా వ్యాపార వర్గాలపై తనిఖీలు, ప్రత్యేక దాడులు నిర్వహిస్తుంటారు. కానీ అవన్నీ తుతూ మంత్రంగా నిర్వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్లగా చేసిన తనిఖీల్లో గట్టిగా వాణిజ్య పన్నుల శాఖకు కట్టించిన దాఖలాలు లేవని ఉద్యోగులే వివరిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది వ్యాపారులతో అధికారులతో కుమ్మకై ్క తమ చేతివాటంతో ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి చిల్లు పెడుతున్నారు. ఇదో ఉదాహరణ.. విజయవాడలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్పై డివిజన్–3 అధికారులు ఇటీవల ఆకస్మికంగా దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. స్థానిక సర్కిల్ అధికారులు కాకుండా పక్క సర్కిల్ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల వ్యవహారం జరిగేటప్పుడు హోటల్ వద్ద పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగింది. ఒక రాత్రంతా అధికారులు కాపలా కాసి తనిఖీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. హోటల్ నుంచి రికార్డులు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇది జరిగి 20 రోజులైనా ఇప్పటి వరకూ ఎటువంటి నోటీసు ఇవ్వలేదని అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. దాడులు చేసిన తరువాత వారితో ఏదైనా పంచాయతీ జరిగి ఉంటుందని, అందువల్లే నోటీసు సైతం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇదేతీరు.. గత డిసెంబర్ మాసాంతంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బాబు అహ్మద్ సెలవులో ఉన్న సమయంలో స్పెషల్ కమిషనర్గా ఉన్న ఎన్. సౌమ్య ఆదేశాలతో విజయవాడ నగరంలోని సుమారు 20 నుంచి 25 రెస్టారెంట్లపై బృందాలుగా వెళ్లి ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ అధికారులు, సిబ్బంది అక్కడ ఉండి ఆ రెస్టారెంట్లో జరుగుతున్న వ్యాపారం, వాస్తవంగా కడుతున్న పన్ను, ఆన్లైన్ పేమెంట్ లేని రెస్టారెంట్ల తీరు తదితర పలు అంశాలను గమనించి ఆయా రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. ఒక్కొక్క దానికి నాలుగు నుంచి రూ.40 లక్షల వరకూ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం మీద రెండు నుంచి మూడు కోట్ల వరకూ తేడాగా ఉన్న పన్ను, జరిమానాలు విధించినట్లు తెలిసింది. అయితే అందులో కొద్దిమంది మాత్రమే స్పందించారని, అది కూడా చాలా స్వల్పంగా చెల్లింపు చేశారని, మిగిలిన వారు పంచాయితీలతో సరి చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆర్వో కార్యాలయంపైనా విమర్శలు.. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాతో పాటుగా మరో రెండు జిల్లాల్లో టర్నోవర్ను బట్టి అధికంగా ఉన్న కేసులను విజయవాడలోని రీజనల్ కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఆ శాఖ అడిషనల్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ కార్యాలయం పని చేస్తుంది. అయితే రెస్టారెంట్ల వ్యవహారంలోనూ పలు అంశాలను ఈ కార్యాలయం అధికారులు పరిశీలించారనే వాదనలు ఉన్నాయి. అలాగే ఈ కార్యాలయం ఇప్పటి వరకూ పెద్దగా ఎటువంటి కేసులు ఛేదించిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. అటు సర్కిల్ కార్యాలయాల నుంచి ఇటు ఆర్వో కార్యాలయాల వరకూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. నగరంలోని కొన్ని రెస్టారెంట్లు ఆన్లైన్ పేమెంట్లలో ప్రభుత్వానికి మస్కా కొడుతున్నాయనే అంశాలు ఈ దాడుల్లో బయటపడ్డాయి. సాధారణంగా ఒక వ్యాపార సంస్థ అధికారికంగా ఒక బ్యాంక్ ఖాతాను నిర్వహించటం దానికి ఆన్లైన్ పేమెంట్లు చేయించటం జరగాలి. కానీ ఒక రెస్టారెంట్ ఐదారు ఖాతాలకు యూపీఏ పేమెంట్లు చేయించటాన్ని అధికారులు కనుగొన్నారు. అలాగే ఒక రెస్టారెంట్ అయితే అసలు ఆన్లైన్ పేమెంట్ లేకుండా కేవలం నగదు చెల్లింపులను మాత్రమే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారిద్దరికీ భారీగా పన్ను తేడాలు, జరిమానాలు విధించారు. అయితే వారి నుంచి ఎంత మేర చెల్లింపు చేశారనే విషయం ఇప్పటి వరకూ తేలలేదు. -
మా డబ్బులు.. మాకివ్వండి
జీజీహెచ్లో ప్రభుత్వ వైద్యుల నిరసన లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగుల నాడిచూసి వైద్యం చేయాల్సిన డాక్టర్లు ప్లకార్డులు చేబూని ఆందోళన బాటపట్టారు. గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ – ఆంధ్రప్రదేశ్ (జీడీఏ–ఏపీ) ఆధ్వర్యంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మూడు రోజులుగా నిరసన బాటపట్టారు. తొలుత పది రోజులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో మూడు రోజులుగా రోజూ అర్ధగంట పాటు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. గురువారం కూడా ఆందోళన కొనసాగించారు. జీడీఏఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్కుమార్ మాట్లాడుతూ.. తమకు రావాల్సిన బకాయిల కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాస్తే ఇవ్వలేమని సమాధానం ఇవ్వడంపై విస్మయం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వైద్యులపై ఉన్న చిన్నచూపునకు ఇది నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఎన్నో సమస్యలతో విధులు నిర్వహిస్తున్నారని, అసిస్టెంట్ ప్రొఫె సర్లు లేక ప్రొఫెసర్లే నైట్ డ్యూటీకి రావాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఈ నెల ఐదో తేదీన ఏపీ డీ–ఫార్మసీ (ఎంపీసీ, బైపీసీ)లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి గురువారం తెలిపారు. దివ్యాంగులు, సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ కేటగిరీ అభ్యర్థులు స్వయంగా హాజరు కావాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వారు ఆరో తేదీ రాత్రిలోగా ఆన్లైన్లో వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. వెబ్ఆప్షన్ల మార్పులు, చేర్పులకు ఈ నెల ఏడో తేదీ రాత్రి వరకు అవకాశం ఉందని తెలిపారు. -
జల్ జీవనంపై నిర్లక్ష్యం
తిరువూరు: ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న తాగునీటి కారణంగా కిడ్నీవ్యాధి బారిన పడుతున్న ఎ.కొండూరు మండలంలోని గిరిజనులకు రక్షిత మంచినీరు అందించడంలో ప్రభుత్వం, అధికారయంత్రాంగం ఉదాసీనవైఖరి అవలంబిస్తు న్నాయి. ఫలితంగా మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఈ మండలంలో జలజీవన్మిషన్ పథకంలో భాగంగా 854 కుళాయిలు ఏర్పాటు చేయడంతో పాటు గోపాలపురం, మాధవరంలో మూడు సంపులు, 21 ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. వాటి నుంచి అన్ని పంచాయతీలు, శివారు గ్రామాలు, తండాలకు కృష్ణా నదీ జలాలను సరఫరా చేయాలన్నది లక్ష్యం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా నదీ జలాలను ఎ.కొండూరు మండలానికి సరఫరా చేసేందుకు 2023లో రూ.49.44 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్టు పనులు గతంలోనే 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తిచేసి అన్ని గ్రామాలకు కృష్ణా నదీ జలాలను అందించడంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ శాఖల నడుమ సమన్వయం లోపించింది. ఫలితంగా రక్షిత తాగునీరు అందక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. పేదలు రోజుకు రూ.50 ఖర్చు చేసి ప్రైవేటు వాటర్ ప్లాంట్లలో మంచి నీరు కొనుక్కుని తాగాల్సివస్తోంది. పాత పైపులైన్లతోనే నీటిసరఫరా ఎ.కొండూరు మండలంలోని గ్రామాల్లో పంచాయతీలు బోరు నీటిని విడుదల చేసే పైపులైన్లలోనే కృష్ణా నదీ జలాలను కూడా సరఫరా చేస్తున్నారు. దీనితో కృష్ణా నదీ జలాలను శుద్ధి చేసినప్పటికీ ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న సాధారణ నీటితో కలసి ఆశించిన ప్రయోజనం నెరవేరడంలేదు. కృష్ణా నదీ జలాలను సరఫరా చేయడానికి ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ఆరు నెలల్లో ఈ మండలంలోని కృష్ణారావుపాలెం, రామచంద్రాపురం, కోడూరు, కంభంపాడు, ఎ.కొండూరు, ఎ.కొండూరు తండా, గోపాలపురం, చీమలపాడు, మాధవరం గ్రామాల్లో 15 మంది కిడ్నీరోగులు మృత్యువాత పడ్డారు. పలు గ్రామాల్లో తాగునీటి సమస్యతో కిడ్నీ సంబంధిత వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి తీవ్రతరం అవడంతో డయాలసిస్ చేసినా ఫలితం లేక గిరిజనులు, పేద రోగులు మృత్యు ఒడి చేరుతున్నారు. ప్రకటనలతో సరిపెడుతున్న అధికారులు రాష్ట్రంలో ఎక్కువ మంది కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులున్న ఎ.కొండూరు మండలంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు తిరువూరు, ఎ.కొండూరులో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. మండలంలోని భూగర్భ జలాల్లో కిడ్నీవ్యాధికి కారణమైన అంశాలను క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత కృష్ణా నదీ జలాల సరఫరాకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎప్పటికప్పుడు కృష్ణా నదీ జలాలను త్వరలో సరఫరా చేస్తామంటూ జిల్లా అధికారులు ప్రకటించడం మినహా పూర్తిస్థాయిలో అమలుకు నోచడం లేదు. -
రూ.25 కోట్లతో దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలకు రూ.25 కోట్లతో అంచనాలను రూపొందించామని దుర్గగుడి ఈఓ శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం గురువారం మహా మండపం నాల్గో అంతస్తులోని నూతన సమావేశ మందిరంలో జరిగింది. చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు, ఈఓ, ఏఈఓలు, సూపరిండెంటెంట్లు, ఈఈ, డీఈఈలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి విశేష అలంకారాలతో రూపొందించిన పోస్టర్ను ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మొత్తం 54 అంశాలు చర్చకు రాగా, 50 అంశాలకు ఆమోదం లభించింది. వీటిలో ఎక్కువ ప్రతిపాదనలు దసరా ఉత్సవాలకు సంబంధించినవే. ఈ సమావేశానికి ముందే సుమారు రూ.25 కోట్ల మేర బిల్లులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన పనులకు బోర్డు సభ్యులు ఆమోదం తెలపడం గమనార్హం. ఆమోదం తెలిపిన కీలక అంశాలివే... ఆస్ట్రేలియాలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం, కుంకుమార్చన నిర్వహించేందుకు ఆరుగురు వైదిక సిబ్బందిని డెప్యుటేషన్పై పంపేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. క్లోక్రూమ్, చెప్పులస్టాండ్లో పని వారిని నియమించి, వారి ద్వారా ఆయా కౌంటర్లు దేవస్థానం నడపాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. కొబ్బరి చెక్కలను పోగు చేసుకునే హక్కును బహిరంగ వేలంలో సంకాబత్లు నాగవైష్ణవి రూ.1.36 కోట్లకు హెచ్చపాటను పాడింది. ఈ వేలానికి ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. అమ్మవారి ఉత్సవాల్లో కాయలు, పండ్లను సరఫరా చేసే టెండర్ను సీహెచ్.నాగ విజయ, శ్రీవిజయ ట్రేడింగ్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పూల సరఫరా టెండర్ను ఎం. గంగాధర్రెడ్డికి కేటాయించింది. నూతన లడ్డూ పోటు భవనం పక్కనే వంటశాల కోసం రూ.40 లక్షలతో షెడ్డు నిర్మాణానికి ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. ఉత్సవాల్లో తాత్కలికంగా డ్రైవర్లు, సూపర్వైజర్ల నియామకానికి రూ.6.20 లక్షల అంచనాలకు, భక్తులను కొండపైకి, దిగువకు తీసుకెళ్లేందుకు అవసరమైన వాహనాల ఏర్పాటుకు రూ.32 లక్షలతో చేసిన అంచనాలకు, డీఈఈగా ఉద్యోగ విమరణ చేసిన వి.కోటేశ్వరరావును కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగించేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం. దసరా ఉత్సవాల్లో భక్తులకు లడ్డూ ప్రసాదాలను కొరత లేకుండా అందించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు తీర్మానించారు. ప్రస్తుతం ఆరు లడ్డూల బాక్స్ను రూ.100 చొప్పున విక్రయిస్తుండగా, దసరా నుంచి మూడు లడ్డూలను బాక్స్ రూపంలో రూ.50 చొప్పున విక్రయించాలని నిర్ణయించారు. సాక్షి కథనాలపై చర్చ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వరసగా చోటు చేసుకుంటున్న వివాదాలు, ఇతర అంశాలపై ‘సాక్షి’ వరస కథనాలుగా ప్రచురిస్తోంది. ఈ కథనాలపై ట్రస్ట్ బోర్డు సమావేశంలో చర్చకు వచ్చాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి చేసే విశేష అలంకారాలు, ఇటీవల ఆలయ అధికారులకు, ట్రస్ట్ బోర్డు సభ్యుల మధ్య చోటు చేసుకున్న వివాదం, అన్నదాన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కూటమి పార్టీకి చెందిన కొంత మంది సభ్యులు దూరంగా ఉండటంతో పాటు ‘సాక్షి’ గురువారం ప్రచురించిన ‘అమీతుమీ తేలుస్తారా... మౌనం పాటిస్తారా’ కథనంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. మరో వైపు ఆలయ వ్యవహారాలు ‘సాక్షి’కి చేరడంపైన కొంత మంది సభ్యులు చర్చను లేవనెత్తారు. అయితే అవన్నీ వాస్తవం కావడంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారని తెలిసింది. -
తనిఖీల్లో తిరకాసు
పటమట(విజయవాడతూర్పు): ఇటీవల విజయవాడలోని పలు హోటల్లు, రెస్టారెంట్లు, చేపలు, మాంసం దుకాణాల్లో నగర పాలక సంస్థ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అంతా బాగుందంటూ నివేదిక ఇచ్చారు. ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు, చేపలు, మాంసం దుకాణాల నిర్వాహకుల నుంచి కాసులు దండుకునే ఇలా నివేదికలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు మునిసిపల్ ప్రజారోగ్య విభాగం అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి నగరంలోని 64 డివిజన్లలో 286 సచివాలయ పరిధిలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 624 హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా అవన్నీ శుభ్రంగా ఉన్నాయని, ఎక్కడా సమస్య లేదని ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో చికెన్, మటన్, బీఫ్, చేపల దుకాణాలు 353 వరకు, ఆర్వోప్లాంట్లు 241 వరకు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయని, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని నివేదించారు. అధికారుల నివేదికలపై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయా సంస్థల నిర్వాహకుల నుంచి పలువురు అధికారులు డబ్బులు తీసుకునే ఇలా నివేదికలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు ఇలా.. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో వంట గదులు శుభ్రంగా ఉండేందుకు ప్రజారోగ్య విభాగం పలు నిబంధనలను సూచిస్తోంది. ఆయా వ్యాపార సంస్థలు సొంతగా ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. భోజన టేబుల్పై మూత ఉన్న తాగునీటి జగ్లు ఉంచాలి. కిచెన్ నిత్యం శుభ్రంగా ఉండాలి. మాంసం ఒక్క రోజుకంటే కూడా ఎక్కువ నిల్వ వుండకూడదు. అక్కడ పనిచేసే వర్కర్లు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు, తలకు హెయిర్ క్యాప్స్ ధరించాలి. అయితే నగరంలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఇవేమీ కన్పించవు. మాంసం దుకాణాల గోడలకు ఐదు అడుగుల వరకు టైల్స్ వేయాలి. ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. నగరంలోని చాలా దుకాణాల్లో ఇలాంటి వాతావరణం కన్పించదు. ఆర్వోప్లాంట్ల వ్యవహారంలో కూడా నిబంధనలు కఠి నంగా ఉన్నాయి. ఫిల్టర్లను ప్రతినెలా శుభ్రం చేయాలి, నీటి శాంపిల్ను ప్రతివారం ప్రజారోగ్య అధికారులు పరిశీలించాలి. నీరుపట్టే ప్రాంతంలో నీటి పారుదల సక్రమంగా ఉండాలి. అక్కడ టైల్స్ ఉండాలి. కానీ చాలా ప్లాంట్ల వద్ద ఇవేవీ కన్పించటంలేదు. పేరుకే నోటీసులు తనిఖీల్లో ప్రజారోగ్య విభాగం అధికారులు డొల్లతనం ప్రదర్శిస్తున్నారు. నగరంలో ఇప్పటి వరకు 42 రెస్టారెంట్లకు, 11 ఆర్వోప్లాంట్లకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. తమ తనిఖీల్లో కేవలం రూ.55 వేల జరిమానా విధించారు. హోటళ్లకు నోటీసులు జారీచేసిన తరువాత తాము సూచించిన అంశాలను సరిచేసుకున్నదీ లేనిదీ తిరిగి పరిశీలించడం లేదు. ఆయా సంస్థల నిర్వాహకులతో హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు ప్రైవేటు వ్యక్తుల ద్వారా బేరాలాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే ఒక్కో రెస్టారెంట్, హోటల్ రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. -
తూతూమంత్రంగా తనిఖీలు
కూటమి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో విజయవాడ నగరంలో పలుమార్లు డయేరియా వ్యాధి ప్రబలింది. వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు. గిరిపురం, ఉడ్పేట, భవానీపురం, అజిత్సింగ్ నగర్, నందమూరి నగర్, పటమట ప్రాంతాల్లో తరచూ డయే రియా ప్రబలుతోంది. గత ఏడాది అజిత్సింగ్ నగర్లో డయే రియా కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఈ వ్యాధి ప్రబలడానికి ప్రధానంగా ప్రైవేట్ ఆర్వో ప్లాంట్ల నీరు తాగడమే కారణమని జిల్లా వైద్య విభాగం, నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో మునిసిపల్ అధికారులు వాటర్ బబుళ్లలో తాగునీరు సరఫరా చేశారు. మరో వైపు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రతపై తరచూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బందరు రోడ్డులోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఎక్కువ రోజులు నిల్వవున్న మాంసాన్ని అధికా రులు గుర్తించారు. పటమటలోని మరో రెస్టారెంట్లో కూడా నిల్వ ఉన్న మాంసంతోపాటు ఆహార పదార్థాలు తయారు చేసే వంటగది శుభ్రతపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్, వీఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలు, ఆర్వోప్లాంట్ల పనితీరు, అక్కడ నెలకొన్న శుభ్రతపై నివేదిక ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నిర్వాహకులకు జరిమానా విధించాలని, అప్పటికీ ఫలితం లేకుండా ఆయా వ్యాపార సంస్థలను సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు తనిఖీలు చేపట్టి, అంతా బాగుందంటూ నివేదికలు ఇచ్చారు. ఇలా నివేదకలు ఇవ్వడంపై ఆరోపణలు వస్తున్నాయి. -
ఎంబీబీఎస్ అడ్మిషన్లలో తీవ్ర అన్యాయం
కృష్ణలంక(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన 2026 మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, తక్షణమే జీవో 102ను రద్దు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్, మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అలా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏఎన్యూ రీజియన్లో ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు 71,547 కాగా అంతకంటే మెరుగైన ర్యాంకు సాధించిన 43మంది రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్ సీట్లు కేటాయించారన్నారు. ఎస్వీయూ రీజియన్లో ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు 94,966 కాగా అంతకంటే మెరుగైన ర్యాంకు వచ్చిన 27 మంది రిజర్వేషన్ విద్యార్థులకు ఓపెన్ సీట్లు ఇవ్వకుండా రిజర్వేషన్ సీట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం ఓపెన్ కాంపిటీషన్ కంటే మంచి మార్కులు లేదా ర్యాంకులు సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ కిందనే పరిగణించాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): స్క్రబ్బర్ వ్యాపారం పేరుతో వందల మంది నుంచి రూ. కోట్లు వసూళ్లు చేసి బోర్డు తిప్పేసిన ‘మాషా అల్లా ఎంటర్ప్రైజెస్’ కేసులో ప్రధాన నిందితులైన సంస్థ ఎండీ పసుపులేటి అంకుశం, అతని భార్య సుమలను విచారణ నిమిత్తం ఎస్ఎన్పురం పోలీసులు కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐదు రోజుల పాటు నిందితులను పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్దు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు గురువారం విజయవాడ సబ్ జైలు నుంచి నిందితులను ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఈ కేసులో కోట్ల రూపాయలు మోసపోయినట్లు వెయ్యి మందికి పైగా బాధితులు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ డబ్బుకు సంబంధించి లావాదేవీల గురించి విడివిడిగా నిందితులను విచారించగా వీటిపై కొన్నింటికీ సమాధానాలు చెప్పినా కొన్ని ప్రశ్నలకు మౌనంగా దాట వేస్తున్నట్లు సమాచారం. వీరిని ఈ నెల 8వ తేదీ వరకు పూర్తిస్తాయిలో పోలీసులు విచారించనున్నారు. -
ఆత్మీయ నివాళి
ఆత్మ బంధువుకువాడవాడలా మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలుసమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి ● దివంగత నేత సేవలను స్మరించుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు ● ఉత్సాహంగా అన్నదానాలు, సేవా కార్యక్రమాలు ● పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు మౌనం పాటిస్తారా? ఉయ్యూరు బస్టాండు సెంటర్లో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న దేవభక్తుని చక్రవర్తి, పార్టీ శ్రేణులు చిట్టినగర్ జంక్షన్లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేస్తున్న వెలంపల్లి, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు అమీతుమీ తేలుస్తారా.. ఏపీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ డీఎస్ఎన్ రెడ్డి -
కృష్ణానదిలో నిలిచిపోయిన పంటు
ఇబ్రహీంపట్నం: అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన కంకరు, బూడిద, గ్రావెల్ జల రవాణా ద్వారా సరఫరా చేసే పంటు ఇసుక మేటలు అడ్డొచ్చి నిలిచిపోయింది. పది లారీలు బూడిద, కంకర సామగ్రితో సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి గుంటూరు జిల్లా తాళ్లాయిపాలెం వద్దకు బయలు దేరింది. పట్టిసీమ కాలువ ద్వారా వస్తున్న నీటితో నదిలో ఇసుక మేటలు మధ్య పంటు నీటిలో ఇరుక్కుపోయింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. రెండు రోజులుగా పంటు రవాణా నిలిచి పోవడంతో లారీల రాకపోకలు వెస్ట్ బైపాస్ మీదుగా అమరావతి ప్రాంతానికి మెటీరియల్ రవాణా చేపట్టారు. నదిలో చిక్కుకున్న పంటును డ్రెడ్జింగ్ యంత్రాల ద్వారా తీసేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే రాష్ట్రం, దేశంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక రమేష్ ఆస్పత్రి రోడ్డులోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా) కళాశాల ఆవరణలోని కృష్ణవేణి సభాఘర్ ఆడిటోరియంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్ఎంఈ–డీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ గ్రోత్పై వర్క్షాప్ బుధవారం జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు, నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందజేస్తోందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంఎస్ఎంఈ ఈడీ సుధాకర్తో పాటుగా జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి చీరాలకు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. చీరాల కొత్తపేటకు చెందిన ఎం. నాగేశ్వరరావు కుటుంబ సభ్యు లు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రానున్న పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించే చర్యలో భాగంగా ఎక్కువ డిమాండ్ ఉన్న లింగంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లో పెరగనున్న రద్దీని తగ్గించే దిశగా హైటెక్ సిటీ స్టేషన్లో తాత్కాలిక హాల్టింగ్ కల్పిస్తూ రైల్వేశాఖ ప్రకటించింది. దీని ప్రకారం దసరా, దీపావళి పండుగ సీజన్లో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 11 వరకు (15 రోజులు), అదే విధంగా క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సీజన్లు డిసెంబర్ 18 నుంచి 2027 జనవరి 19 వరకు (33 రోజులు) హైటెక్ సిటీలో తాత్కాలిక హాల్టింగ్ ఉంటుందన్నారు. హైటెక్ సిటీలో ఆగే రైళ్లు ఇవే.. ●నర్సాపూర్–లింగంపల్లి (17255) ఆయా రోజుల్లో ప్రతి రోజు ఉదయం 4.45కి హైటెక్ సిటీ చేరుకుని 4.46కి బయలుదేరుతుంది. అదే విధంగా లింగంపల్లి–నర్సాపూర్(17256) రాత్రి 9.08కి చేరుకుని 9.09కి బయలుదేరుతుంది. ● కాకినాడ టౌన్–లింగంపల్లి(12775) ఉదయం 7.10కి చేరుకుని 7.11కి బయలుదేరుతుంది. లింగంపల్లి–కాకినాడ టౌన్(12776) రాత్రి 7.08కి హైటెక్ సిటీ చేరుకుని 7.09కి బయలుదేరుతుంది. -
సభ్యులకు సమాచారం ఇవ్వరా?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం గురువారం వాడిగా వేడిగా జరిగే అవకాశం కనపడుతోంది. దసరా ఉత్సవాలకు ముందు జరిగే ఈ కీలక ఈ సమావేశం అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దుర్గగుడి చైర్మన్తో పాటు ఆలయ అధికారులకు, ట్రస్ట్ బోర్డు సభ్యుల మధ్య వ్యవహారాలు గత కొన్ని రోజులుగా నివురు గప్పిన నిప్పులా మారాయి. ట్రస్ట్ బోర్డు సమావేశానికి వచ్చే అజెండాలను ఆమోదించాలని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, బుధవారం సాయంత్రం ట్రస్ట్ బోర్డు సభ్యులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఏదైనా బోర్డు సమావేశంలోనే తేల్చుకుందామని బోర్డు సభ్యులు కరాకండిగా తేల్చి చెప్పేశారు. దేవస్థానానికి చెందిన కొంత మంది అధికారుల తీరే దీనికి కారణమని ట్రస్ట్ బోర్డు సభ్యులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులంటే కేవలం ఆలయ అధికారులు చేసిన ప్రతిపాదనలను ఆమోదించడానికే ఉన్నామా అని ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన ఏ అంశాన్నైనా ప్రశ్నిస్తే వారికి నచ్చడం లేదని తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయానికి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తించి ఆ విభాగం అధికారికి తెలిపినా ప్రయోజనం ఉండటం లేదంటున్నారు. మరో వైపు గత నెల 21వ తేదీన జరిగిన నూతన అన్నదాన భవనం, లడ్డూ పోటు భవనాల ప్రారంభోత్సవం, అంతకు ముందు అభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని తమ దృష్టికి తీసుకురాకపోవడంతో వారు గుర్రుగా ఉన్నారు. సీనియర్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, కూటమి పక్షాలకు చెందిన కొందరు ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై బుధవారం తమ పశ్చిమ నియోజకవర్గ ప్రజా ప్రతినిధితో సైతం బోర్డు సభ్యులు చర్చించినట్లు తెలిసింది. ప్రతిపాదనల ఆమోదానికేనా? ట్రస్ట్ బోర్డు కేవలం దేవస్థానం చేసిన ఖర్చులు, ప్రతిపాదనలను ఆమోదించడానికే ఉందా అని పలువురు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. దసరా ఉత్సవాలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు ఇప్పటికే ఆలయ అధికారులు ట్రస్ట్ బోర్డు సభ్యుల ముందు ఉంచారు. అయితే వాటికి సంబంధించి ఏయే పనులకు ఖర్చు ఎంత మొత్తం చేస్తున్నారని వారు ఆరా తీస్తారు. తాము కేవలం ఆలయ ఈవోకు మాత్రమే ప్రతిపాదనల గురించి చెప్పుకుంటామని, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏదైనా అడగాల్సి ఉంటే నేరుగా ఈవోను అడిగి తెలుసుకోవాలని బహిరంగంగా చెప్పడంతో ఆ సమావేశంలో ఉన్న సభ్యులు అవాక్కయ్యారు. ముందు చర్చ.. ఆ తర్వాతే అజెండా గురువారం జరిగే సమావేశంలో ముందు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే అజెండాపై చర్చించాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. కొంత మంది ఆలయ ఉద్యోగులు, సిబ్బంది కనీసం బోర్డు సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదని వారు పేర్కొంటున్నారు. నేటి సమావేశంలో దసరా ఉత్సవాల ప్రతిపాదనలను ఆలయ అధికారులు సభ్యుల ముందు ఉంచుతున్నారు. తమకు సంతృప్తికరమైన సమాధానం వచ్చిన తర్వాతే అజెండాను ముందుకు తీసుకువెళ్లామని, అవసరమయితే రాత్రి 10 గంటలైనా బోర్డు సమావేశం కొనసాగిస్తామని సభ్యులు పేర్కొంటున్నారు. మహామండపం నాల్గో అంతస్తులో దేవస్థానం గత నెల 27వ తేదీన నూతనంగా సమావేశ మందిరాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఆహ్వానం లేదు. ఆ రోజు ఉదయం 10.30గంటల సమయంలో ట్రస్ట్ బోర్డు కార్యాలయంలో ఉన్న ఇద్దరు, ముగ్గురు సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. అదీ కూడా ప్రారంభోత్సవానికి పది నిమిషాల ముందు సమాచారం ఇవ్వడంపై వివాదం చోటు చేసుకుంది. ఇదే అంశంపై గురువారం జరిగే సమావేశంలో మిగిలిన సభ్యులు ఆలయ అధికారులను నిలదీయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దుర్గగుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు నిపుణులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు వస్తున్నారనే సమా చారం కూడా ఇవ్వడం లేదనేది ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆరోపణ. అధికారులకు ఒక రోజు ముందే ఆయా అధికారుల పర్యటన, పనుల పరిశీలన సమాచారం ఉన్నా.. ఎందుకు ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఇవ్వడం లేదో ఈ సమావేశంలో నిగ్గు తేల్చుకుంటామని వారు చెబుతున్నారు. గత నెల 21న ఆలయ ప్రాంగణంలోని రూ.కోట్లతో నిర్మించిన అన్నదాన భవనం, ప్రసాదాల పోటు ప్రారంభోత్సవానికి కనీసం డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కు ఆహ్వాన పత్రికను అందజేయకపోవడంపై ఆ పార్టీకి చెందిన సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక 28వ తేదీన నూతన సమావేశ మందిరంలో దేవస్థాన ఈవో, ఆలయ అధికారులతో జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా ట్రస్ట్ బోర్డు చైర్మన్, బోర్డు సభ్యులకు సమాచారం ఇచ్చారు. తీరా సమావేశానికి హాజరైన సీనియర్ ట్రస్ట్ బోర్డు సభ్యుడిని ఆలయ అధికారి సిబ్బంది ముందే బయటకు పంపడాన్ని ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఇదే అంశాన్ని తోటి సభ్యులకు వాట్సాప్ ద్వారా పంచుకొని ఆవేదన చెందిన ఘటన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
బుడమేరు కన్నీళ్లకు రెండేళ్లు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరాన్ని బుడమేరు వరదలు ముంచెత్తి సరిగ్గా నేటి రెండేళ్లు. 2024 సెప్టెంబర్ 1వ తేదీ బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కొందరైతే.. మరికొందరు ఇళ్లు, విలువైన వస్తువులు, వాహనాలు కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఆది నుంచి నిర్లక్ష్యమే బుడమేరు వరదలు సంభవించిన దగ్గర నుంచి నేటి వరకూ కూటమి ప్రభుత్వం అదే నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తోంది. ఆగస్టు 31వ తేదీ 2024వ తేదీనే బుడమేరు కట్ట తెగి వరద నీరు బెజవాడ నగరానికి చేరుతోందని తెలిసినప్పటికి నగరంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. సెప్టెంబర్ 1వ తేదీ ఇంకా కళ్లు తెరిచి నిద్రలేవకముందే వరద నీరు వందల ఇళ్లను ముంచెత్తేశాయి. దీంతో పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ఆ వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. ప్రభుత్వం ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా చాలా వరకూ తగ్గడంతో పాటు బాధితులు సురక్షిత ప్రాంతాలకు చేరేవారు. నాడు ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో.. వరద బాధితులను ఆదుకోవడంతో పాటు బుడమేరును పరిరక్షించడంలో కూడా నేటికి ప్రభుత్వం అదే నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తోంది. విచ్చలవిడిగా బుడమేరు ఆక్రమణలు ఇంత పెద్ద ఎత్తున్న విపత్తు నెలకొన్నా.. లక్షలమంది ప్రజల జీవితాలు రోడ్డున పడినా కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేకుండా పోయిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నాడు వరదల సమయంలో బుడమేరు ప్రక్షాళన చేస్తామని.. ఆక్రమణలను తొలగిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నేటికి వాటిని ఆచరణలో పెట్టలేదు. బుడమేరు పరిరక్షణకు చర్యలు కాదు కదా కనీసం కొత్తగా బుడమేరులో ఆక్రమణలను కూడా అడ్డుకోవడంలో విఫలమవుతుంది. బుడమేరు వరదల తర్వాత న్యూఆర్ఆర్పేట, సన్సిటీ కాలనీ, ఇందిరానాయక్నగర్, రామకృష్ణాపురం, దేవినగర్, బుడమేరు కట్ట ప్రాంతాల్లో ఆక్రమణలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పటికై నా ప్రభుత్వం బుడమేరు విషయంలో మొద్దునిద్రను వీడి.. బుడమేరు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని.. ఇరువైపులా వారధి మాదిరిగా రిటైనింగ్ వాల్ను నిర్మించాలని నగర ప్రజలు, నాయకులు కోరుతున్నారు. బుడమేరు ముంపు నివారణలో కూటమి ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తోంది. బుడమేరు ముంపు రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని స్వయాన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికి శూన్యంగానే ఉండటం సిగ్గుచేటు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం బుడమేరు ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలి. – కె.దుర్గారావు, సీపీఎం నేత -
దుర్గమ్మకు బంగారు హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ.1.20 లక్షల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. సత్యనారాయణపురానికి చెందిన ఉపద్రష్ట శ్రీనివాస్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, డీఈఓ కిషోర్కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన ఐసెట్లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో సోమవారం మొదలైంది. ఎన్సీసీ–22, దివ్యాంగులు–20, సీఏపీ–11, స్పోర్ట్స్ అండ్ గేమ్స్–5, స్కౌట్స్ అండ్ గైడ్స్–1 చొప్పున మొత్తం 59 మంది సర్టిఫికెట్లను పరిశీలించామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్–10001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఆంగ్లో ఇండియన్స్ కేటగిరీలో ఒకటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరి శీలిస్తామని వివరించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): గంజాయి సంస్కృతిని సమూలంగా నిర్మూలించడంతో పాటు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల భయాలను తొలగించి ఎన్టీఆర్ జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చడమే ధ్యేయమని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణ, గంజాయి సమూల నిర్మూలనకు తీసుకొచ్చిన మూడు ప్రత్యేక ప్రచార రథాలు, ప్రచార గుర్రాలను తన కార్యాలయం వద్ద ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, ఈగల్ చాలెంజ్లపై వినూత్నరీతిలో అవగాహన కోసం డిజిటల్ స్క్రీన్లు కలిగిన మూడు ప్రచార రథాలు వారం రోజులు నగర వ్యాప్తంగా తిరుగుతాయన్నారు. గుట్టలు, కొండ ప్రాంతాల్లో అవగాహన కోసం గుర్రాలను, మెక్ అనౌన్స్ మెంట్ సౌకర్యం ఉన్న అత్యాధునిక మాట్రిస్ 4టీ డ్రోన్ల ద్వారా విస్తృత ప్రచారంచేస్తామ న్నారు. గంజాయి విక్రేతల సమాచారమందిస్తే రూ.5 వేలు, వినియోగదారుల సమాచారం తెలిపితే రూ.1500 బహుమతిగా ఇస్తామన్నారు. ఇప్పటికే గంజాయి విక్రయదారులపై తీవ్ర చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 32 మందిపై పీఐటీ ఎన్డీపీఎస్ యాక్ట్ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. 15 వేల మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించి, 1,287 మంది వినియోగదారులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, డాక్టర్ కె.తిరుమలేశ్వర రెడ్డి, కె.జి.వి.సరిత, కె.కృష్ణ ప్రసన్న, జి.రామకృష్ణ, ఏసీపీ దామోదర్, ఇన్స్పెక్టర్ గుణరాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం గన్నవరం: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి సోమవారం నాలుగు గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు చెందిన ఐఎక్స్ 2875 విమానం షెడ్యూల్ ప్రకారం రోజూ బెంగళూరు నుంచి ఉదయం 6.15గంట లకు బయలుదేరి 7.35లకు ఇక్కడికి చేరుకుంటుంది. అయితే సాంకేతిక కారణాల వల్ల విమానం సుమారు ఐదు గంటల ఆలస్యంగా బయలుదేరి 12.38 గంటలకు ఇక్కడికి చేరు కుంది. విమానం ఆలస్యం కావడంతో బెంగ ళూరు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్లో నిరీక్షించాల్సి వచ్చింది. -
సంరప్రదాయ సారథి
నృత్యానికి సొబగులద్దిన వేదాంతం పార్థసారథివిజయవాడ కల్చరల్: కూచిపూడి నృత్యమంటే కేవలం అడుగులు, అభినయం కాదు. తరతరాలుగా వస్తున్న తెలుగు సంస్కృతికి సజీవ రూపం అంటూ ఆ నృత్య సంప్రదాయానికి సరి కొత్త సొబగులు అద్దిన నాట్యాచార్యుడు వేదాంతం పార్థసారథి. ఆ సంప్రదాయాన్ని భుజాన వేసుకొని దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వందలాది మందికి కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. నగరానికి నృత్యాన్ని వృత్తిలా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తూ, శాసీ్త్రయతకు పెద్దపీట వేస్తూ తనదైన శైలిలో పార్థసారథి అర్ధ శతాబ్దంగా కూచిపూడికి నృత్య సేవలు అందిస్తున్నారు. పార్థసారథి సోదరులు వేదాంతం రాధేశ్యాం, వేదాతం రామలింగశాస్త్రి, వేదాంతం పాండు రంగ శర్మ, వారి కుమారులు అందరూ కూచిపూడి నృత్యనికే అంకితమయ్యారు. గురువుల చెంత నేర్చుకొని.. వేదాంతం పార్థసారథి చిన్ననాటి నుంచే కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. వేదాంతం కుటుంబంలో కొనసాగుతున్న నృత్య సంప్రదాయాన్ని అందిపుచ్చుకొని కఠోర శ్రమతో సాధన సాగించారు. తండ్రి వేదాంతం సూర్యనారాయణ శర్మ వద్ద తొలి అడుగులు నేర్చుకున్నారు. వెంపటి చినసత్యం, వేదాంతం పార్వతీశం వంటి గురువుల శిక్షణ ఆయనకు బలమైన పునాదిగా మారింది. వేదాంతం కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ స్థాపించి సంప్రదాయ కూచిపూడిలో శిక్షణ నిస్తున్నారు. సంప్రదాయ నృత్యాలు భారతీయ ఆత్మ సంప్రదాయ నృత్యాలను భారతీయ ఆత్మగా భావించాలని వేదాంతం పార్థసారథి సూచించారు. కూచిపూడి నృత్యం, భరతనాట్యం, కథక్, కథాకళీ, ఒడిస్సీ వంటి సంప్రదాయాలు ఏవైనా గురుముఖంగానే పరిపక్వత కలుగుతాయని పేర్కొన్నారు. కూచిపూడి నృత్యాన్ని సామాన్య ప్రేక్షకులకు చేరువ చేయాలంటే నృత్య రూపకాలది ప్రత్యేక స్థానం. బృందావనం, భక్త ప్రహ్లాద, గిరిజా కల్యాణం, వాగ్గేయకార రచనా వైభవం, అన్నమయ్య, రామదాసు వంటి నృత్య రూపకాలను పార్థసారథి రూపొందించారు. పురాణ భక్తి సాహిత్య ఇతివృత్తాలను నృత్యభాషలో అందంగా రూపొందించడం ఆయన ప్రత్యేకత. కళలకు స రిహద్దులు లేనట్లుగా తన బృందంతో శ్రీలంక, మలేషియా వంటి దేశాలతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెండువేలకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. -
ఇళ్ల స్థలాలపై మాట తప్పారు
● రెండున్నరేళ్లలో ఏ ఒక్కరికై నా స్థలాలు ఇచ్చారా? ● సెప్టెంబర్ 15వ తేదీ లోపు స్పందించకపోతే ఖాళీ ఇళ్ల స్వాధీనం, గృహప్రవేశాలు చేస్తాం ● ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఇళ్ల పట్టాల విషయంలో మాట తప్పిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాల రిజిస్ట్రేషన్, టిడ్కో, జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల తక్షణ పంపిణీ వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యాన పేదలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేశారు. మ్యూజియం రోడ్డులో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన పేదలు, సీపీఎం నేతలు కలెక్టరేట్లోకి దూసుకు వెళ్లి బైఠాయించారు. కార్యాలయం గేట్లు ఎక్కి నిరసన తెలియజేశారు. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్లోకి వెళ్లి జేసీ ఎస్.ఇలక్కియకు సామూహిక అర్జీలు అందించారు. సమస్యలు తెలియజేశారు. డీఆర్వో లక్ష్మీ నరసింహం ఆందోళనకారుల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్లు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు, పెద్ద కంపెనీలకు లక్షల ఎకరాల భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం.. పేదలకు 2, 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల భవనాలు వేగంగా పూర్తవుతున్నప్పటికీ, పేదల ఇళ్ల నిర్మాణాలు మాత్రం ఐదేళ్లు, పదేళ్లుగా మొండి గోడలతో, ఖాళీ స్థలాలుగా పెండింగ్లో ఉండటం అన్యాయమన్నారు. ప్రభుత్వం దొంగాట టిడ్కో ఇళ్ల కోసం యాభై వేల నుంచి రూ. రెండు లక్షల రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేసి పదేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అప్పగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పేదల ఇళ్లను అమ్ముకుంటున్నారన్నారు. 2025 నుంచి ప్రజలు పీజీఆర్ఎస్ ద్వారా వందలాది దరఖాస్తులు ఇస్తున్నా కనీసం రసీదులు ఇవ్వకుండా ప్రభుత్వం దొంగాట ఆడుతోందని మండిపడ్డారు. కలెక్టర్ ఇచ్చే హామీని బట్టే తదుపరి చర్యలు ఉంటాయని, ౖపైపె మాటలు చెబితే కలెక్టరేట్ కార్యాలయాన్ని వంటా వార్పుతో పూర్తిగా దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్లు చేయాలని డెడ్లైన్ విధించారు. ఆ లోపు ప్రభుత్వం స్పందించకపోతే లబ్ధిదారులతో తామే నేరుగా గృహప్రవేశాలు చేస్తామని, ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతి భూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సీపీఎం నేతలు బోయి సత్యబాబు, బి. రమణరావు, పి.కృష్ణ, కె.దుర్గారావు, ఈవీ నారాయణ, ఆదిలక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్న దానానికి గన్నవరం మండలం ముస్తాబాదకు చెందిన జి.రాఘవేంద్ర ప్రసాద్, పద్మజ సోమవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కనకదుర్గనగర్ నుంచి మహామండపానికి అనుసంధా నంగా నిర్మిస్తున్న ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ పనులను వేగంగా పూర్తి చేసి దసరాకు అందుబాటులోకి తీసుకురావాలని దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం కన్నబాబు, రామచంద్రమోహన్ పరిశీలించారు. కనకదుర్గనగర్, గోశాల, మహామండపం వద్ద వెలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులను తనిఖీచేశారు. తొలుత ప్రతిపాదించిన విధంగా ఆలయ ఇంజినీరింగ్ అధికారులు మార్కింగ్ చేయగా, వాటి ప్రకారం పనులు జరిగితే తలెత్తే ఇబ్బందులను చర్చించారు. ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ను మహామండపానికి, నూతన అన్నదాన భవనానికి అనుసంధానంగా నిర్మించాలని సూచించారు. ఈ మేరకు చైన్నెకి చెందిన ప్లానర్లతో ఉన్నతాధికా రులు చర్చలు జరిపారు. మహామండపం క్యూ లైన్లలో అధికారులు స్వయంగా నడిచి భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. తొలుత రామచంద్రమోహన్ అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడి ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఇంజినీర్ శేఖర్, దుర్గగుడి ఈఈ ఎల్.రమాదేవి, డీఈఈలు, ఎఈఈలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పోలవరం ఎడమ కాలువపై పాయకరావుపేట వద్ద సెప్టెంబర్ రెండో తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరిగే జలహారతి కార్యక్రమానికి ఏపీఎస్ ఆర్టీసీ వెయ్యి బస్సులు నడపనుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి 100 బస్సులు పాయకరావుపేటకు వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ రెండు, మూడు తేదీల్లో జిల్లాలోని ప్రయాణికులకు అసౌకర్యం కలగనుంది. ఈ అసౌకర్యాన్ని ప్రయాణికులు అర్థం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి నీలిమ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ప్రణాళిక వేసు కుని రెండు రోజులపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
వరించిన పురస్కారాలు
పార్థసారథి సేవలను గుర్తించి మద్రాస్ తెలుగు అకాడమీ, ముంబాయ్ తెలుగు సమతి, ఖరగ్పూర్ సాహిత్య సమితి, కళానిలయం వారి జాతీయ స్థాయి పురస్కారం, రాష్ట్ర సాంస్కృతిక సమితి పురస్కారం, అమ్మా కల్చరల్ ఆర్ట్స్ పురస్కారం, మువ్వగోపాల సాంస్కృతిక సమితి పురస్కారం లభించాయి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, వేదాంతం సత్యనారాయణ శర్మ వంటి మహనీయులు ఆశీస్సులు లభించడం విశేషం. కూచిపూడి కేవలం నృత్యకళకాదు, అది తెలుగు నేల మీద సంస్కృతికి ప్రతిబింబం. ఆ ప్రతిబింబాన్ని తరతరాలకు అందిచేందుకు తన వంతు కృషి చేస్తున్న వేదాంతం పార్థసారథి వంటి కళాకారులు చిరస్మరణీయులు -
ముగిసిన ఫుట్బాల్ చాంపియన్ షిప్
మైలవరం: ఏపీ ఎఫ్ఏ సీనియర్ మెన్– 2026 ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ చాపియన్షిప్ సోమవారం ముగిసింది. విశాఖపట్నం చాంపియన్షిప్ దక్కించుకోగాగా, తిరుపతి రన్నరప్, విజయనగరం మూడవ స్థానం కై వసం చేసుకుంది. ఫైనల్లో తిరుపతిపై విశాఖపట్నం 2–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మూడో స్థానం కోసం ఈస్ట్ గోదావరి, విజయనగరం జట్టు తలపడగా విజయనగరం 4–2గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. జిల్లా స్థాయి ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఏపీఎఫ్ఏ లక్ష్యం అని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి శ్రీధర్ తెలిపారు. -
పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): బాధితులకు తక్షణ న్యాయం, సహాయం అందించే అధికారం, ప్రజలకు నేరుగా సేవ చేసే అద్భుత అవకాశం ఒక్క పోలీస్ శాఖలోనే లభిస్తుందని డీసీపీ కేజీవీ సరిత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తూ సోమవారం ఉద్యోగ విరమణ పొందిన 13 మంది అధికారులు, సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని అభినందించి, శాలువాలు కప్పి సత్కరించారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో సీఏఓ ఐవీఆర్ నాగవర్ధన్, ఎస్ఐలు జె.జ్ఞానదేవ్, ఎస్.సాయిబాబా, పీఎస్ఎస్ రెడ్డి, ఎం.శ్రీనివాసప్రసాద్, ఎం.శ్రీధర్, రిజర్వ్ ఏఎస్ఐ జీఎస్ఎన్మూర్తి, బి.ప్రసాద్, సీహెచ్ శివాజీ, హెడ్ కానిస్టేబుల్ బీఎన్వీకేడీ ప్రసాద్, ఎస్.పాండురంగయ్య, హోంగార్డులు కె.లక్ష్మీనారాయణ, పి.రమణ ఉన్నారు. వారి సత్కార కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ప్రేమ్కుమార్, ఆర్ఐలు శ్రీనివాసరావు, సుధాకర్రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సోమయ్య పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం తగదు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం తగదని అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. గ్రీవెన్స్ పరిష్కారంలో జిల్లాను రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేందుకు కృషిచేయాలని కోరారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యను వాస్తవంగా పరిష్కరించారా? వారు సంతృప్తి చెందారా? అనేదే కీలకమన్నారు. ఆర్డీఓలు, తహసీ ల్దార్లు, సర్వేయర్లు అర్జీలను కేవలం కార్యాలయ స్థాయిలో పరిశీలించకుండా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలపై ఆరా తీయాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలు సుకుని, నిబంధనల మేరకు న్యాయబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రత్యేకించి జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, వాటి పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొత్తం 161 అర్జీలు జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో వివిధ సమస్యల పరిష్కారం కోసం 161 అర్జీలు వచ్చాయని అధికా రులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 46, పోలీస్ 23, పురపాలక పట్టణ అభివృద్ధి 23, పంచాయతీరాజ్ శాఖకు 10, మిగిలిన శాఖలకు సంబంధించి అర్జీలు వచ్చాయని వివరించారు. స్వచ్ఛాంధ్రలో జిల్లా మెరవాలి స్వచ్ఛాంధ్ర–2026లో ఎన్టీఆర్ జిల్లాకు ఎక్కువ అవార్డులు వచ్చేలా అధికారులు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ప్రతి శాఖ, స్థానిక సంస్థ తమ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, వాటి ఫలితాలను స్పష్టంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జాబితా అడిగితే సమాధానం లేదు
నేతన్న సేవలో పథకం అమలులో నేత కార్మికు లకు తీరని అన్యాయం జరిగింది. లబ్ధిదారుల్లో చాలా మంది అనర్హులు ఉన్నారని గుర్తించాం. అసలు అర్హుల జాబితాలను ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించడం లేదు. లబ్ధిదారులను గుర్తించడంలో పారదర్శక పాటించలేదు. అధికారులు నిష్పక్షపాతంగా నడుచుకుని జాబితాలను ప్రదర్శిస్తే అనర్హులను గుర్తించి, వివరాలు అందజేస్తాం. లేదా అధికారులే విచారణ చేసి అనర్హులను తొలగించాలి. – కటకం ప్రసాద్, సీనియర్ మాజీ కౌన్సిలర్, పెడన -
● ఒత్తిళ్లకు తలొగ్గి నేత కార్మికులకు అన్యాయం చేసిన అధికారులు
● అర్హులందరికీ న్యాయం చేయాలని చేనేత కార్మికుల డిమాండ్ పెడన: ‘నేతన్నకు సేవలో’ పథకం అమలులో చంద్రబాబు ప్రభుత్వం అర్హులకు మొండిచేయి చూపింది. తెలుగు తమ్ముళ్ల సిఫార్సులకే పెద్దపీట వేసి అనర్హులకు లబ్ధి చేకూర్చింది. ఎన్నికల సమయంలో నేత కార్మికుల ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్ర బాబుతో పాటు కూటమి పార్టీల నాయకులంతా ‘నేతన్న నేస్తం’ పథకానికి మించి సాయం చేస్తామంటూ హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని విస్మరించారు. రెండేళ్లు ఎదురు చూసిన చేనేత కార్మికులు కడుపుమండి రోడ్డెక్కడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ‘నేతన్న సేవలో’ అంటూ పథకం పేరు మార్చి కుటుంబానికి రూ.25 వేలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పింది. అయితే అరకొరగా నిధులు విడుదల చేసింది. ఆ నిధుల్లోనూ అర్హులకు అరకొరగా ఇచ్చి, తమ పార్టీ నాయకులు సూచించిన వారికి మగ్గం లేకున్నా, ఇతర వృత్తుల్లో ఉన్నా లబ్ధిచేకూర్చింది. దీంతో అర్హులైన చేనేత కార్మికులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో పారదర్శకంగా.. చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేతన్న నేస్తం’ పథకం తీసుకొచ్చారు. ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబా నికి ఏడాదికి రూ.24 వేల చొప్పున క్రమం తప్ప కుండా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. 4,832 మంది కుటుంబాలకు మేలు జరిగింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పథకం అమలుచేసి ఆదుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగింది. సచివాలయ సిబ్బంది చేనేతల ఇళ్ల వద్దకు వెళ్లి జియోట్యాగింగ్ చేసి ఆ తర్వాత అర్హుల పేర్లు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేసి జాబితా రూపొందించారు. ఈ జాబితాలను సచివాలయాల వద్ద ప్రదర్శించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఫలితంగా అర్హులు అందరికీ ఈ పథకం కింద లబ్ధిచేకూరింది. ఇప్పుడు సిఫార్సులు ఉంటేనే.. చంద్రబాబు ప్రభుత్వంలో నేతన్న సేవలో పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు హడా వుడిగా పూర్తి చేశారు. చేనేత, జౌళి శాఖ అధికారులు కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి గప్చిప్గా దరఖాస్తులను స్వీకరించారు. ఎటువంటి విచారణ లేకుండానే కూటమి నాయకులు చెప్పిన పేర్లతో జాబితాలక రూపొందించారు. ఈ జాబితాలను ఎక్కడా వెల్లడించలేదు. మగ్గం లేని, ఇతర వృత్తుల్లో ఉన్న వారికి సైతం లబ్ధిచేకూర్చారు. 4,393 మందితో జాబితా రూపొందించారు. వీరిలో 215 మందికి వివిధ కారణాలతో పథకం వర్తింప జేయలేదు. మిగిలిన వారికి ఆగస్టు ఏడో తేదీన రూ.25 వేల చొప్పున సాయం అందించారు. అయితే ఒకే ఇంటిలో ముగ్గురికి పథకం వర్తింపజేయడం, మెకానిక్లను కూడా అర్హులుగా గుర్తించడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కూటమి నాయకులు అనర్హులకు లబ్ధి చేకూర్చి, వారి వద్ద వాటాలు దండుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో మరోసారి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మరో 1,072 మందికి లబ్ధి చేకూరుస్తామని వెల్లడించారు. నేను పుట్టి పెరిగింది పెడనలోనే. బతుకుదెరువు కోసం 12 ఏళ్ల క్రితం చీరాల వెళ్లాం. అక్కడ కూడా పరిస్థితి బాగోలేక తిరిగి పెడన వచ్చి ఆరేళ్లు గడిచాయి. ఆధార్కార్డు, రేషన్ కార్డు అన్నీ ఇక్కడకు మార్పించుకున్నాం. మగ్గంపైనే ఆధారపడి బతుకుతున్నాం. నేనూ, నా భార్య నాగేశ్వరకుమారి మగ్గం నేస్తున్నాం. దరఖాస్తు చేసినా పథకం వర్తింపజేయలేదు. డబ్బులు ఎప్పుడు పడతాయా అని రోజూ బ్యాంక్కు వెళ్లి ఆరాతీస్తున్నాం. – ఉటుకూరి నాగవెంకటేశ్వరరావు, పోలవరపు పేట, పెడన నేతన్న సేవలో పథకం వర్తించలేదు. 50 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. నాకు చేనేత గుర్తింపు కార్డు కూడా ఉంది. అయినా పథకం వర్తింపజేయలేదు. అర్హత ఉన్నా అన్యాయం చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారొచ్చి ఫొటోలు తీసుకువెళ్లారు. అయినా పథకం రాలేదు. అద్దె ఇంట్లో ఉంటూ నేత నేసుకుంటున్నాం. పథకం వర్తింపజేసి ఆదుకోవాలని వేడుకుంటున్నాం. – పేరిశెట్టి రుక్మిణి, పోలవరపు పేట, పెడన నేతన్న సేవలో పథకంలో మొదట 4,393 మంది అర్హులను గుర్తించాం. వారిలో 215 మందికి ఆధార్, సాంకేతిక కారణాలతో లబ్ధిచేకూరలేదు. రెండో సారి మరో 1,072 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించాం. 215 మందితో పాటు 1,072 మందికి కూడా త్వరలోనే నగదు జమ అవుతుంది. ఇంకా వీరి నగదు విడుదల కాలేదు. అనర్హులు ఉన్నారని లిఖితపూర్వకంగా మా దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా వారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటాం. – సీహెచ్ విజయ్బాబు, చేనేత, జౌళిశాఖ ఏడీ, మచిలీపట్నం -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముంపు సమస్య
బుడమేరు వరదల్లో విజయవాడ నగరం ముంపునకు గురికావడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే ప్రధాన కారణం. వరద నీరు వస్తుందని లోతట్టు ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయడంలో విఫలమైంది. వరద బాధితుల ఎన్యూమరేషన్లోనూ అనేక లోపాలు జరిగాయి. ప్రచార ఆర్భాటమే తప్ప సహాయ చర్యలు నామమాత్రంగానే చేపట్టి చేతులు దులుపుకున్నారు. వారధి వద్ద గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించిన విధంగా బుడమేరుకు రెండువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలి. – కేవీ భాస్కరరావు, సీపీఐ నేత -
పోలీస్ పీజీఆర్ఎస్లో 98 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 98 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు అందకున్నారు. అందులో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్హెచ్ఓలకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో భూ, ఆస్తి తగాదాలపై 41, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, వివిధ మోసాలపై 22, మహిళా సంబంధిత నేరాలపై 5, కొట్లాటలపై 4, దొంగతనాలపై 4, ఇతర వివిధ సమస్యలపై 17 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీసీపీతో పాటు, పలువురుసిబ్బంది పాల్గొన్నారు. నిమ్మకూరు(పామర్రు): తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్ చంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు తెలుగు సంస్కృతి అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో సంస్కృత సప్తాహ మహోత్సవాలు ఏపీలో జరిగాయి. దీనిలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఏపీఆర్జేసీ, ఏపీఆర్ఎస్ల నిర్వహణలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో శోభాయాత్ర జరిగింది. టీటీడీ కమ్యూనిటీ హాల్ విద్యార్థులు సంస్కృత భాష గొప్పదనాన్ని వివరించారు. అనంతరం పలువురిని సత్కరించారు. ఏపీఆర్జెసీ కళాశాల ప్రధానాచార్యులు సాంబశివరావు, ఏపీ గురుకుల పాఠశాల ప్రధానాచార్యులు మండలి బ్రహ్మణేశ్వరమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు భవానీపురం(విజయవాడపశ్చిమ): ముకుంద జ్యూవెలరీ ఫ్యాక్టరీ ఔట్లెట్ విజయవాడలో ప్రారంభించిన సందర్భంగా వినియోగదారులకు నాణ్యమైన బంగారు, వజ్రాభరణాలను మరింత అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించే ప్రారంభోత్సవ అమ్మకాల్లో 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 6.99 శాతం వీఏ, జీరో మేకింగ్ చార్జీలు వంటి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై 2 నుంచి 12 శాతం వరకు వీఏ, హాల్మార్క్ గోల్డ్ జ్యువెల్లరీ, స్టోన్స్ ఉన్న ఆభరణాలపై 65 శాతం వరకు ఎక్సేంజ్ విలువ అందిస్తున్నట్లు చెప్పారు. డైమండ్ ఆభరణాలపైకూడా 25 శాతం వరకు వీఏ ఆఫర్తోపాటు క్యారెట్కు రూ.48,450 నుంచి ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయని నరసింహారెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక ప్రారంభోత్సవ సేల్ను నగరం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పీఆర్సీ కమిషనర్ను నియమించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషనర్ను నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషనర్ను నియమించేలోపు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ఏపీజేఏసీ, అమరావతి రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం ఎన్టీఆర్ జిల్లా యూనిట్ జిల్లా జాయింట్ కలెక్టర్కు ఉద్యోగుల సమస్యలతో కూడిన నోటీసు/వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మొత్తం 29 డిమాండ్లతో కూడిన నోటీసు అందజేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి వర్క్ టు రూల్ పాటిస్తామని, మంగళవారం నల్లబ్యాడ్జ్లు ధరించడం, 3, 5వ తేదీలు భోజన విరామ సమయం లో ప్రదర్శనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ వైఎస్ రావు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు పి.లక్ష్మి, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్. శ్రీనివాసరావు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు సంపత్, డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అమరావతి చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారుల సత్తా
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 24 నుంచి 27 వరకు తిరుపతిలో నిర్వహించిన అమరావతి స్టేట్లెవల్ చాంపియన్షిప్లో జిల్లా నుంచి వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా విభాగాల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ హర్షం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు, కోచ్లు భాస్కర్ (బ్యాడ్మింటన్), నవీన్ కుమార్ (ఆర్చరీ), స్వామి (వెయిట్ లిఫ్టింగ్), ఇషాక్, చిరంజీవి (బాక్సింగ్), సంతోష్ (బాస్కెట్బాల్), ఆంజనేయులు, శిరీష (యోగా), క్రీడాకారులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే డిమాండ్ల సాధన
చల్లపల్లి: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు, కొత్త పీఆర్సీ అమలు, మధ్యంతర భృతి వంటి అంశాలు ప్రభుత్వాన్ని బతిమిలాడితే రావని పోరాటాలు చేసి సాధించుకోవాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) మాజీ ఎమ్మెల్సీలు కె.ఎస్.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో ఆదివారం జరిగింది. తొలుత జాతీయ పతాకాన్ని యూటీఎఫ్ జిల్లా పూర్వ గౌర వాధ్యక్షుడు జి.వి.తాతారావు, ఎస్టీఎఫ్ఐ పతా కాన్ని సీనియర్ నాయకుడు పాగోలు రమేష్, యూటీఎఫ్ పతాకాన్ని జిల్లా మాజీ ఆడిట్ కమిటీ కన్వీనర్ పి.ఎస్.ఆర్.మూర్తి ఆవిష్కరించారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ షాకత్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన సభలో కె.ఎస్.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు ప్రసంగించారు. అనుకు న్నది సాధించే వరకూ అలుపెరుగని పోరాటం చేసే సంస్థ యూటీఎఫ్ అని పేర్కొన్నారు. 2027 మర్చిలో జరగనున్న ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న ఎం.హనుమంతరావును సభకు పరిచయం చేశారు. హనుమంతరావు విజయానికి యూటీఎఫ్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హనుమంతరావు మట్లాడుతూ తనను గెలిపిస్తే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఫెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. టెట్ విషయంలో లోకేష్ జోక్యం చేసుకోవాలి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని కోరారు. టెట్కు వ్యతిరేకంగా సెప్టెంబర్ మూడో తేదీన నిర్వహిచే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకరావు కార్యదర్శి నివేదికను, కోశాధికారి ఎం.వరప్రసాద్ ఆర్థిక నివేదికలను, సహ అధ్యక్షురాలు టి.ఝాన్సీ మహిళా నివేదికలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు కె.ఎ.ఉమామహేశ్వరరావు, ఎస్.పి.మనోహర్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర రావు, ఎన్.నాగేశ్వరరావు, సీనియర్ నాయకుడు పి.వినోద్బాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు -
ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలి
మచిలీపట్నంఅర్బన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, అందుకు అనుగుణంగా పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ రీఆర్గనైజ్డ్ టీచర్స్ యూనియన్ (డీపీఆర్టీయూ) రాష్ట్ర అధ్య క్షుడు డాక్టర్ డి.శ్రీను డిమాండ్ చేశారు. టెట్ మినహాయింపుతోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ డీపీఆర్టీయూ (ఆంధ్రప్రదేశ్) కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ.. పీఆర్సీ కాలపరిమితి పూర్తయి మూడేళ్లు గడిచినా ప్రభుత్వం కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడం సరికాదన్నారు. వెంటనే పీఆర్సీని ప్రకటించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు జి.వి. ఎస్.పెరుమాళ్లు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యా యులకు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రాంబాబు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ను రూపొందించి, తక్షణమే ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు బి.విజయలక్ష్మి, కె.గౌరీ, గౌరవ అధ్యక్షుడు డి.సత్యనారాయణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఘనంగా నవదిన ప్రార్థనలు ప్రారంభం
పెద్దఆవుటపల్లి(గన్నవరం): ఉంగుటూరు మండలం పెద్దఆవుటపల్లిలోని బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జరగనున్న ఫాతిమా మాత మహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నవదిన ప్రార్థనలను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గన్నవరం విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ పసల థామస్ పతాకావిష్కరణ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జపమాల, దివ్యబలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ.. మరియతల్లి విధేయతపై వ్యాక్యోపదేశం చేశారు. ఆమె ఎంతో వినయంతో విధేయతతో దేవుని ప్రణాళిక, రక్షణ చరిత్రకు నాంది పలికారని వివరించారు. రెక్టార్ రెవరెండ్ ఫాదర్ జ్వాన్నేస్ నీలూరి మాట్లాడుతూ.. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ ఆరో తేదీ వరకు రోజూ సాయంత్రం నవదిన ప్రార్థనలు, జపమాల, దివ్యబలిపూజ జరుగుతా యని తెలిపారు. ఏడో తేదీన ప్రత్యేక ప్రార్థనలు, తేరు ఆశీర్వాదం, ఫాతిమా మాత స్వరూప ప్రదక్షిణ ఊరేగింపు, ఎనిమిదో తేదీన ఎనికేపాడు మేరిమాత ప్రోవిన్సుకు చెందిన రెవరెండ్ ఫాదర్ కరుణాకర్ కాసు నేతృత్వంలో సమష్టి దివ్యబలిపూజ జరుగుతాయని వివరించారు. క్రీస్తు విశ్వాసులు పాల్గొని ఈ మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుండా శ్రీనివాసరావు (49), మల్లేశ్వరి దంపతులు భవానీపురం శివాలయం వీధిలోని ఓ ఇంట్లో నివసిస్తున్నారు. అతను గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి యజమాని విశ్వనాథ శర్మ, మల్లేశ్వరితో కలిసి శ్రీనివాసరావు ఇంటి ఆవరణలో ఉన్న మామిడిచెట్టు కాయలు కోస్తున్నాడు. కొద్దిసేపటికి మల్లేశ్వరి ఇంట్లోకి వెళ్లిపోయింది. శ్రీనివాసరావు తన చేతిలో ఉన్న స్టీల్ రాడ్తో చెట్టుకొమ్మ చివరి భాగంలో ఉన్న కాయను కోసేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు ఆ స్టీల్ రాడ్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై శ్రీనివాసరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతను కదలకపోవడంతో మల్లేశ్వరి, ఇంటి యజమాని విశ్వనాథ శర్మ 108 అంబులెన్స్ సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి శ్రీనివాసరావు చనిపోయాడని నిర్ధారించారు. మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మవారి నగల కోసం చెత్తలో వెతుకులాట పెదకాకాని: శివాలయంలో మాయమైన భ్రమరాంబ వారి ఆభరణాల కోసం డంపింగ్ యార్డులో వెతకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆగస్టు 14న పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూలతోపాటు బంగారు ఆభరణాలు అలంకరించారు. 18న అమ్మవారి మంగళసూత్రం, నాన్తాడు కనిపించడం లేదని అర్చకులు అధికారులకు చెప్పారు. ఆ వారం రోజులు విధులు నిర్వహించిన అర్చకులకు 19న షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 26న ఐదుగుర్ని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆభరణాలు మాయమై దాదాపు 17 రోజులు గడుస్తున్నాయి. ఆదివారం పోలీసులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చెత్త వేసే ప్రదేశంలో వెతడం ప్రారంభించారు. ఇన్ని రోజుల తరువాత ఇలా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
అక్కాచెల్లెళ్ల పసుపు, కుంకుమ తుడిచేసిన ట్రాక్టర్
● అతివేగంగా బైక్ను ఢీకొట్టిన వైనం ● పెళ్లికి వచ్చి వెళ్తున్న తోడల్లుళ్లు దుర్మరణం గంపలగూడెం/ఎర్రుపాలెం: ఒక ప్రమాదం అక్కా చెల్లెళ్ల పసుపు, కుంకుమను తుడిచేసింది. అతి వేగంగా, అజాగ్రత్తగా ట్రాక్టర్ నడిపిన డ్రైవర్ బైక్ను ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు. మృతులిద్దరూ తోడల్లుళ్లు కావడంతో వారి కుటుంబంలో తీర్చలేని విషాదాన్ని నింపింది. ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన ముల్లంగి లాజర్, జవ్వాయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరిని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పెసరమల్లి నాగరాజు వివాహం చేసుకున్నాడు. మరో కుమార్తెకు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొరకొప్పుల రమేష్తో వివాహం జరిగింది. నాగరాజు బతుకుదెరువు నిమిత్తం ఇటీ వల హైదరాబాద్ వెళ్లగా, రమేష్ ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులోని రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. వారిద్దరు ఆదివారం బుచ్చిరెడ్డిపాలెంలోని తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా రామాలయం వెనకాల మెయిన్ రోడ్డుపై మలుపు వద్ద గ్రావెల్ లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్ను ఢీకొట్టాడు. ఆపై ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడగా నాగరాజు, రమేష్ దాని కిందపడి తీవ్రగాయాలతో అక్కడక్కడే మృతి చెందారు. ఒకే ప్రమాదంలో తోడల్లుళ్లు ప్రాణాలు విడవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలిసి వారి భార్యాపిల్లలు, కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ ఎం. రమేష్కుమార్ జేసీబీ సాయంతో ట్రాక్టర్ను తొల గించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. నాగరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె, రమేష్కు భార్య ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెసరమల్లి నాగరాజు (ఫైల్) కొరకొప్పుల రమేష్ (ఫైల్) -
ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకొచ్చిన కారు
ఇబ్రహీంపట్నం: స్థానిక రింగ్ సెంటర్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్త్ను ట్రాఫిక్ పోలీసులపైకి ఓ కారు ప్రమాదవశాత్తూ దూసుకొచ్చింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. టైర్ ఊడిపోయి డివైడర్ను ఢీకొట్టి పోలీసుల సమీపంలో కారు ఆగిపోవడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆర్ఎస్ఐ శివరామకృష్ణ కథనం మేరకు.. హైదరాబాద్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు డ్రైవర్ హైవే మధ్యన ఉన్న రింగ్ను గుర్తించడంలో విఫలమయ్యాడు. రింగ్ సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కారు టైర్ విరిగిపోయి డివైడర్ను ఢీకొట్టింది. డివైడర్కు రెండు మీటర్ల దూరంలో ఆర్ఎస్ఐ శివరామకృష్ణ, సిబ్బంది డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారి సమీపంలోకి వచ్చి కారు ఆగిపోవ డంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారు టైర్ విరిగి పోకుండా ఉంటే పోలీసులపైకి కారు దూసుకెళ్లి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కారును యాక్షి డెంట్ టోయింగ్ వ్యాన్తో పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
న్యాయవాదుల సహకారంతోనే సత్వర న్యాయం
విజయవాడలీగల్: న్యాయవాదుల సహకారంతోనే కక్షిదారులకు సత్వర న్యాయం సాధ్య మని కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యామిని శనివారం తొలిసారిగా విజయవాడ విచ్చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్కు విచ్చేసి న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో తాను విజయవాడలో న్యాయాధికారిగా పనిచేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో పని చేస్తేనే సత్వర న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్ట పెరుగుతుందని పేర్కొన్నారు. బీబీఏ అధ్యక్షుడు విష్ణు భొట్ల లక్ష్మీనారాయణ విజయవాడ న్యాయ స్థానం సముదాయంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. బీబీఏ కార్యవర్గ సభ్యులు ఇస్సాంశెట్టి ఉషాజ్యోతి, వేములపల్లి పద్మజ, రామతేజ, ఎం.శ్రీకాంత్ తదితరులు న్యాయమూర్తికి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్ కుమార్, రాగి గంగాభవాని, ఎం. జైకర్, తగరం కిరణ్ బాబు, వీబీఏ మీడియా కమిటీ చైర్మన్ విజయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని -
సాహసం... శ్వాసగా... సాగిపో!
ట్రెక్కింగ్కు స్వర్గధామంగా కొండపల్లి ఫారెస్ట్ ఎటు చూసినా తివాచీలా పరుచుకున్న పచ్చదనం... ప్రకృతి రమణీయమైన అందాలు... పక్షుల కిలకిలలు... సెలయేళ్ల గలగలలు... సవాలు చేసే ఎత్తయిన శిఖరాలు... అందమైన లోయలు... పురాతన చరిత్రకు సాక్షీభూతాలుగా నిలిచే కోట బురుజులు... జలపాతాలు... కోనేరులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే దృశ్యాలు... ఇవన్నీ ఎక్కడో కాదండోయ్... విజయవాడ నగరానికి అతి సమీపంలో ఉన్న కొండపల్లి ఖిల్లాపైనే... వారాంతపు సెలవుల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి సేద తీరడానికి కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సరైన గమ్యస్థానం. ఇక ట్రెక్కింగ్కు ఇంతకంటే మంచి వేదిక మరెక్కడుంటుంది...– ఎవరెస్ట్ అధిరోహకుడు ఎడ్మండ్ హిల్లరీ ఇబ్రహీంపట్నం: విజయవాడ నగరానికి సమీపంలో ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, నందిగామ, కంచికచర్ల మండలాల పరిధిలో సుమారు 28 వేల ఎకరాల్లో విస్తరించిన కొండపల్లి ఫారెస్ట్ ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామం అని చెప్పవచ్చు. అడవిలో ఫిరంగులు, సొరంగ మార్గాలు, రాతి శిలలు, జలపాతాలు యువతీ యువకులు, క్రీడాకారులు, విద్యార్థులను ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్ సమయంలో అవగాహన లోపంతో కొందరు ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. పచ్చని అందాలు ఓవైపు, ప్రకృతి సోయగాలు మరోవైపు సహజ సిద్ధంగా వెలిసిన కొండలు ఇంకొక వైపు. ఈమూడింట నడుమ ట్రెక్కింగ్ నిర్వహించడం సాహసమే. కొండపల్లి ఖిల్లా, రిజర్వ్ ఫారెస్ట్లో ఎత్తయిన కొండ ప్రాంతాలు, పశుపక్ష్యాదులు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్లో ఐదేళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల వయస్సు గల ఎవరైనా పాల్గొనవచ్చు. విజయవాడ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం రిజర్వ్ ఫారెస్ట్కు చేరుకుని ట్రెక్కింగ్ నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఎత్తయిన ఒంటిమిట్ట కొండ పైకి ట్రెక్కింగ్ చేస్తే విజయవాడ నగరం మొత్తం కనిపిస్తుంది. కొండపల్లి ఫారెస్ట్ ప్రకృతి ప్రేమికులకు వరం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో వారసత్వ సంపద సాహస క్రీడలకు వేదికగా మారింది. ఎత్తయిన కొండలు, జలపాతాలు వారసత్వ కట్టడాలు ముళ్ల పొదలతో కూడిన ఫారెస్ట్ ట్రెక్కింగ్కు అనువైనదిగా 2018లో గుర్తించడంతో ప్రకృతి ప్రేమికులకు వరంగా మారింది. ఖిల్లా నుంచి కుడి ఎడమల వైపు సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో రాతి శిలలు ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. వీటితో పాటు నెమలిధార, మావుళ్లమ్మ తీర్థం, బేబీ చిత్రకూట్, కొంగుధార, వనమాలి, చిట్టితుంబరఽ ధార, సప్త స్వరధారలు, కుడి ఎడమల జలపాతాలు దర్శనమిస్తాయి. ఫారెస్ట్లో రాచరికపు ఆనవాళ్లు కొండపల్లి ఫారెస్ట్లో ఏమూలన ట్రెక్కింగ్ ప్రారంభించినా అడవి మధ్యలో ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన కోటకు చేరుకుంటారు. కోట పరిసరాల్లో పూర్వం నిర్మించిన 13 బురుజులు ట్రెక్కింగ్ ప్రియులకు ఆహ్వానం పలుకుతాయి. కోటలోనే కాకుండా ఆటవీ ప్రాంతంలో యుద్ధ సమయాల్లో వినియోగించే ఫిరంగిని యూత్ హాస్టల్ అసోసియేషన్ క్లబ్ కార్యదర్శి విష్ణువర్థన్ బృందం గుర్తించింది. దీనితో పాటు అనేక వారసత్వ కట్టడాలు వెలుగులోకి వచ్చాయి. ట్రెక్కింగ్లో రకాలు తాడును నడుముకు కట్టుకుని ఎత్తయిన కొండపై నుంచి కిందికి దిగడాన్ని రాఫ్లింగ్ అంటారు. తాడు నడుముకు కట్టుకుని చేతితో కొండ రాళ్లను పట్టుకుని కొండ పైకి పాకడాన్ని రాక్ క్లైంబింగ్, తాడును చేతులతో పట్టుకుని కొండపైకి ఎగబాకుతూ వెళ్లడాన్ని జుమ్మెరింగ్గా పిలుస్తారు. విద్యార్థులు, మహిళలు కొండ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లడాన్ని ట్రెక్కింగ్ అంటారు. రెండు కొండల మధ్య కట్టిన తాడుకు వేలాడుతూ వెళ్లే సాహస క్రీడను జిప్లైన్, రెండు చెట్ల మధ్య ఏర్పాటు చేసిన దృఢమైన వలను పట్టుకుని చిన్నారులు పైకి ఎక్కే క్రీడను కమెండో నెట్ అంటారు. కొండపై నుంచి బెలూన్లో ఉంటూ కిందకు దొర్లి వచ్చే సాహస క్రీడను జోర్పింగ్గా పిలుస్తారు. అడవిలోని వివిధ ప్రాంతాల్లో కనిపించకుండా దాచిన వస్తువులను గుర్తించడాన్ని ట్రెజర్ హంట్ అంటారు. ట్రెక్కింగ్పై పర్యవేక్షణ కరువు రిజర్వ్ ఫారెస్ట్లో ఎత్తయిన కొండలపై సాహసంతో కూడుకున్న ట్రెక్కింగ్పై అధికారుల పర్యవేక్షణ కరువైంది. ట్రెక్కింగ్కు ఎవరు, ఎప్పుడు, ఎటువైపు వెళ్తున్నారు, వారు తిరిగి కిందకు చేరారా లేదా అనే పర్యవేక్షణ కరువైంది. కొన్ని సందర్భాల్లో ట్రెక్కింగ్ ప్రియులు దారితప్పి ఆందోళనకు గురవుతున్నారు. ఈనెల 20న ఖిల్లాకు వెళ్లిన నలుగురు యువకులు ట్రెక్కింగ్కు వెళ్లి దారి తప్పారు. రాత్రి వేళ అడవిలో చిక్కుకుని తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ఫోన్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు వారి ఆచూకీ కనుగొని సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. ట్రెక్కింగ్తో యువతీ యువకుల్లో ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ట్రెక్కింగ్ చేయగలిగిన వారు జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఒడుదొడుకులైనా సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. – ఎవరెస్ట్ అధిరోహించిన మొట్టమొదటి భారతదేశ మహిళ బచేంద్రిపాల్ ఖిల్లా, ఎత్తయిన కొండలు ట్రెక్కింగ్ ప్రియులకు అనుకూలం నిబంధనలు పాటించకపోతే ప్రమాదకరం పూర్తి అవగాహన ఉన్న గైడ్ను వెంట తీసుకువెళితే మంచిది -
డయేరియాపై అప్రమత్తంగా ఉండాలి
కంకిపాడు: డయేరియాపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ ఆదేశించారు. కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని అంకమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి ఇంటింటి సర్వే తీరు, పారిశుద్ధ్య చర్యలపై సమీక్షించారు. సీహెచ్సీలో రోగులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. డయేరియా పరిస్థితి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రెహమాన్తో సమీక్షించారు. మందుల లభ్యత, రోగుల పరిస్థితిపై ఆరా తీశారు. పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలన్నారు. ఇంటింటి సర్వే సమర్థంగా నిర్వహించాలన్నారు. వాంతులు, విరేచనాలు లక్షణాలతో పాటుగా జ్వరాలు గుర్తిస్తే ఆసుపత్రులకు తరలించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల చేరిక గురించి వివరాలు తెలుసుకోవాలన్నారు. డ్రెయిన్లు, కాలువల్లో మురుగు, వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలన్నారు. కంకిపాడుతో పాటుగా అన్ని గ్రామాల్లోనూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్డీఓ సుమలత, తహసీల్దార్ వి.భావనారాయణ, ఎంపీడీఓ బసవయ్య, సిబ్బంది పాల్గొన్నారు. డయేరియా అదుపులోనే ఉంది : కలెక్టర్ కంకిపాడులో డయేరియా అదుపులోనే ఉందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకోలుకోని కంకిపాడుశ్రీ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వాంతులు, విరేచనాల లక్షణాలతో ప్రజలు ఇప్పటివరకూ 15 మంది కంకిపాడు సీహెచ్సీలో చేరారని, తొమ్మిది మంది వైద్యం పొంది డిశ్చార్జి కాగా, ఆరుగురు వైద్యం పొందుతున్నారన్నారు. నీటి శ్యాంపిళ్లు సేకరించి గుడివాడ ల్యాబ్కు తరలించామని, ఇంటింటి సర్వే ద్వారా బాధితులను గుర్తించి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామన్నారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని భుజించొద్దని సూచించారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ పటమటకు చెందిన ఎస్.ఉమామహేశ్వరరావు, కళావతి దంపతులు రూ.1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన కూనపురెడ్డి దీప్తిశ్రీ, తేజస్వంత్ దంపతులు నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మైలవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్(ఏపీఎఫ్ఏ) ఆధ్వర్యంలో మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి స్టేడియంలో జరుగుతున్న సీనియర్ మెన్–2026 ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ చాంపియన్షిప్ రెండో రోజు శనివారం 11 లీగ్ మ్యాచ్లు విజయవంతంగా పూర్తయ్యాయి. అనంతరం జరిగిన క్వార్టర్ ఫైనల్–1 శ్రీకాకుళం–ఈస్ట్ గోదావరి జట్ల మధ్య ఆద్యంతం హోరాహోరీగా జరిగింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 0–0తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్ నిర్వహించారు. టైబ్రేకర్లో ఈస్ట్ గోదావరి జట్టు 5–4 తో శ్రీకాకుళంపై విజయం సాధించి సెమీ ఫైనల్స్ చేరుకుంది. క్వార్టర్ ఫైనల్–2 లో 1–0తో నెల్లూరుపై తిరుపతి విజయం సాధించి సెమీ ఫైనల్కు చేరుకుంది. ఇంటర్నెట్లో సెర్చ్.. రూ.6.25లక్షలకు టోపీ పటమట(విజయవాడతూర్పు): ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్లో తమకు కావాల్సిన మిషనరీని వెతికిన ఓ సంస్థకు రూ.6.25 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. దీనిపై పటమట పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనికేపాడులోని విజయ ఆగ్రో ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న సీహెచ్ దుర్గా రవీంద్రనాఽథ్ సంస్థకు వినుకొండలో ఉన్న పామాయిల్ నర్సరీకి 40 కేవీ డీజిల్ జనరేటర్ కోసం ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్లో వెతికారు. రవీంద్రనాఽథ్ ఇచ్చిన వివరాల మేరకు విశాఖపట్నంలోని ఎస్డీఎల్ ఎంటర్ప్రైజర్ డీజిల్ జనరేటర్ సప్లయర్ సంస్థ ప్రతినిధిగా నిరంజన్ అనే వ్యక్తి సంప్రదించి జనరేటర్ రూ.6.35 లక్షలు ఉందని, దీన్ని తాము 6.25 లక్షలకు ఇస్తామని ఫోన్లో ఒప్పదం కుదుర్చుకున్నారు. ఈ మేరకు జూలై 8న రూ.లక్ష, 22న 5.25 లక్షలు చెల్లించి వినుకొండలోని తమ నర్సరీలో డెలివరీ చేయాలని రవీంద్రనాథ్ సూచించారు. పేమెంట్ జరిగి నెలరోజులైనా ఇంకా డెలివరీ రాకపోవటంతో నిరంజన్కు ఫోన్ చేయగా జనరేటర్ల కొరత ఉందని ఒకసారి, తనకు ఆరోగ్యం బాగాలేదని మరోసారి కారణాలు చెబుతూ వచ్చాడు. ఫోన్ చేస్తే స్పందించటం మానేయటంతో ఎస్డీఎల్ ఎంటర్ప్రైజెస్ దానికి సప్లై చేసే లెజెండ్ పవర్ సొల్యూషన్స్ను సంప్రదించగా నిరంజన్ అనే వ్యక్తి ఈ రెండు సంస్థల్లో పనిచేయటంలేదని ఆయా సంస్థల నుంచి రిప్లయి వచ్చింది. తాము పంపిన నగదును నిరంజన్ తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేయించుకుని తనను మోసం చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని రవీంద్రనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉంగుటూరు(గన్నవరం): మండల కేంద్రమైన ఉంగుటూరుతో పాటు పరిసరర గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన దొంగ ఎట్టకేలకు చిక్కినట్లు సమాచారం. పది రోజుల క్రితం ఉంగుటూరులో జరిగిన ఓ చోరీ కేసులో బాధితుల అనుమానం మేరకు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించండంతో చోరీల గుట్టు రట్టయింది. వివరాలిలా వున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో ఉంగుటూరుతో పాటు కొయ్యగూరపాడు, నందమూరు పరిసర గ్రామాల్లో 12కు పైగా చోరీలు జరిగాయి. సుమారు రూ.రెండు కోట్లకు పైగా సొత్తు అపహరణకు గురైంది. ఈ వరుస చోరీలతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉంగుటూరు పోలీసులతో పాటు ప్రత్యేక నిఘా బృందాలతో గస్తీ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఉంగుటూరులోని ఆర్ఎంపీ వైద్యుని ఇంటిలో ఈ నెల 21న జరిగిన చోరీ ఘటనకు సంబంధించి ఫిర్యాదుదారుడు ఓ షామియానా దుకాణ యాజమాని కుమారుడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో అతనిని వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఉంగుటూరు పరిసర గ్రామాల్లో ఆతనే చోరీలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయినట్టు సమాచారం. ఆతని నుంచి చోరీకి గురైన సొత్తును రికవరీ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో టెంట్లు వేసేందుకు వెళ్లి రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇళ్లు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని అతను చోరీలకు పాల్పడడం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. గత కొన్ని నెలలుగా వరుస చోరీలతో ఉంగుటూరు పరిసర గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన దొంగ ఎట్టకేలకు దొరకడంతో బాధితులు పోలీస్స్టేషన్కు క్యూ కడుతున్నారు. -
సయ్యాట
● ఉత్కంఠభరితంగా కనోయింగ్, కయాకింగ్ ● జలక్రీడలతో శరీరానికి, మనసుకు వ్యాయామం ● విజయవాడ పున్నమిఘాట్ వద్ద ప్రత్యేక శిక్షణ ● చిన్నారులతోపాటు పారా క్రీడాకారులకూ తర్ఫీదుఅలలపై కనోయింగ్, కయాకింగ్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు భవానీపురం(విజయవాడపశ్చిమ): అలలపై సయ్యాటలాడుతూ.. పడవల్లో దూసుకెళ్తూ.. చూడచక్కని విన్యాసాలతో ఉత్కంఠభరితంగా సాగే జల క్రీడలకు కృష్ణా నది వేదికగా మారింది. ప్రకృతితో మమేకమవుతూ క్రీడా నైపుణ్యాలను పెంచుకునేందుకు భవానీపురంలోని పున్నమి హోటల్ (బెరంపార్క్) వద్ద పున్నమిఘాట్ వేదికగా మారింది. ఇక్కడ కెనోయింగ్, కయాకింగ్ వంటి జలక్రీడల (వాటర్ స్పోర్ట్స్)కు శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులతో పాటు పారా క్రీడాకారులు సైతం ఈ క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. ఉదయం, సాయంత్రం శిక్షణ పొందుతున్న చిన్నారులు జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంత మంది జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. కెనోయింగ్ వేగం.. కచ్చితత్వం.. నియంత్రణ కయాకింగ్ అనేది నీటిపై నిర్వహించే ఉత్కంఠభరితమైన జలక్రీడ. కార్బన్ ఫైబర్తో తయారు చేసి తక్కువ బరువుగల ప్రత్యేక చిన్న పడవే కయాక్. దీని పైభాగం మూసివుంటుంది. క్రీడాకారులు పడవ కిందిభాగంలో కాళ్లుచాపి కూర్చుని రెండు వైపులా బ్లేడులు కలిగిన తెడ్డును ఉపయోగిస్తూ నీటిపై దూసుకెళ్తారు. ఒకరు, ఇద్దరు, నలుగురు కూర్చునే బోట్లు ఉంటాయి. 12 మంది క్రీడాకారులు కూర్చునే బోట్ను డ్రాగన్ అంటారు. ఈ క్రీడకు సంబంధించిన ప్రతి ఈవెంట్ (స్టాండప్ పెడలింగ్, ర్యాప్టింగ్ పెడలింగ్)కు ప్రత్యేక బోట్లు, నిబంధనలు ఉంటాయి. వేగం, శరీర సమతుల్యత, ఏకాగ్రత, సమన్వయం ఈ క్రీడలో అత్యంత కీలకం. కయాకింగ్లో పలు విభాగాలు ఉన్నాయి. వాటిల్లో కయాక్ స్ప్రింట్, కయాక్ స్లాలమ్, మారథాన్, వైల్డ్ వాటర్, సీ కయాకింగ్ వంటి ప్రధాన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. స్ప్రింట్, స్లాలమ్ విభాగాలు ఒలింపిక్స్ క్రీడల్లో ఉన్నాయి. ఒక్కో విభాగంలో పోటీ విధానం, నీటి పరిస్థితులు, నిర్ణీత మార్గం, దూరం తదితర అంశాలు మారుతూ ఉంటాయి. స్ప్రింట్ విభాగంలో నిర్ణీత దూరాన్ని వేగంగా పూర్తి చేయాలి. స్లాలమ్ విభాగంలో నీటిపై ఏర్పాటు చేసిన గేట్లను సరైన క్రమంలో దాటుతూ నిర్ణీత మార్గాన్ని పూర్తి చేయాలి. వేగంతోపాటు కచ్చితత్వం, నియంత్రణ ఈ విభాగంలో కీలకం. నిబంధనలను ఉల్లంఘిస్తే పెనాల్టీ విధించే అవకాశం ఉంది. మారథాన్ కయాకింగ్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉన్నందున శరీర సామర్థ్యం ముఖ్యం. కెనోయింగ్ కూడా తేలికపాటి పడవే. దీని పైభాగం తెరిచివుంటుంది. క్రీడాకారులు మోకాళ్లపై లేదా ఎత్తయిన సీటుపై కూర్చుని ఒకవైపే బ్లేడ్ ఉన్న తెడ్డు వాడతారు. శరీరానికి, మనసుకు వ్యాయామం కయాకింగ్ జలక్రీడ సంపూర్ణ వ్యాయామంలా పని చేస్తుంది. తెడ్డును ఉపయోగించడం ద్వారా చేతులు, భుజాలు, ఛాతీ, వెన్ను, కోర్ కండరాలు చురుగ్గా పని చేస్తాయి. క్రమం తప్పకుండా శిక్షణ తీసుకోవడం ద్వారా శారీరక ధృడత్వం, సామర్థ్యం, శరీర సమన్వయం మెరుగుపడతాయి. నీటిపై కయాక్ (బోట్)ను నియంత్రించేందుకు ఏకాగ్రత, సమతుల్యత అవసరం. ఈ శిక్షణతో పిల్లలో ఆత్మ విశ్వాసం, ధైర్యం, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. క్రమశిక్షణతో శిక్షణ తీసుకోవడం వల్ల సమ యపాలన, పట్టుదల, ఓర్పు వంటి లక్షణాలు అలవడతాయి. చదువుతోపాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలనుకునే పిల్లలకు కయాకింగ్ మంచి అవకాశాన్ని అందిస్తుంది. కెనో అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. అసోసియేషన్ అధ్యక్షుడు బలరాం నాయుడు, వ్యవస్థాపకుడు శివారెడ్డి మార్గదర్శకత్వంలో కయాకింగ్ కోచ్లు వి.చిన్న బాబు, ఎం.శ్రీను, సీహెచ్.తేజ శిక్షణ ఇస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి పోటీ స్థాయి వరకు క్రీడాకారుల సామ ర్థ్యానిబట్టి శిక్షణ ఇస్తున్నారు. నీటిలో కయాక్ను ఎలా సమన్వయం చేయాలి, తెడ్డును ఏ విధంగా ఉపయోగించాలి, వేగాన్ని ఎలా పెంచాలి, మలుపులను ఎలా నియంత్రించాలి వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. కోచ్ల శిక్షణలో నేషనల్స్కు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గాయత్రి (గోల్డ్), చేతన భగవతి(బ్రాంజ్) పతకాలు సాధించటం విశేషం. శిక్షణ తీసుకునేవారికి అవసరమైన మౌలిక వసతులు, ప్రోత్సాహం అందిస్తే విజయవాడ నుంచి మరింత మంది కయాకింగ్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశాలు ఉన్నాయని కోచ్ చిన్న బాబు తెలిపారు. భవానీపురం పున్నమిఘాట్ వద్ద జరుగుతున్న శిక్షణలో సాధారణ పిల్లలతోపాటు పారా క్రీడాకారులకుకూడా అవకాశం కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పారా బోట్స్ ద్వారా శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న తాము నేషనల్స్కు వెళితే ఇండియా తరఫున మెడల్స్ తీసుకొస్తామన్న ఆత్మవిశ్వాసం ఉందని, అయితే అక్కడికి వెళ్లేందుకు రూ.లక్ష ఖర్చవుతుందని, ఆ మొత్తం భరించే దాత కోసం ఎదురు చూస్తున్నామని పారా క్రీడాకారుడు బాబూరావు తెలిపారు. -
ట్రెక్కింగ్లో నిబంధనలు పాటించాలి
కొండపల్లి అడవిలో ట్రెక్కింగ్ చేయడానికి స్థానిక అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఎక్కువగా ఉదయం వేళ ట్రెక్కింగ్ చేస్తే మంచిది. రాత్రివేళల్లో అడవిలోకి వెళ్లడం చట్టరీత్యా నేరంతో పాటు ప్రాణాలకే ప్రమాదకరం. మార్గాలపై పూర్తి అవగాహన ఉన్న లోకల్ గైడ్ను వెంట తీసుకువెళ్తే మంచిది. మత్తు పదార్థాలను తీసుకెళ్లకుండా పర్యావరణ నియమాలు పాటించాలి. సరిపడా నీరు, ఆహారం, ఫస్ట్ ఎయిడ్ కిట్, టార్చ్లైట్, పూర్తి చార్జింగ్ ఉన్న ఫోన్తో పాటు పవర్ బ్యాంక్ ఉంచుకోవాలి. – విష్ణువర్థన్, యూత్ హాస్టల్ అసోసియేషన్ కార్యదర్శి, విజయవాడ -
58 మంది దివ్యాంగులకు వాహనాల పంపిణీ
మధురానగర్(విజయవాడసెంట్రల్): విభిన్న ప్రతిభావంతులు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా తమ పనులు చేసుకునేందుకు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలు దోహదపడతాయని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టరేట్లో 58 మంది దివ్యాంగులకు శనివారం రూ.66.70 లక్షల విలువైన స్కూటర్లు పంపిణీ చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 113 దరఖా స్తులు అందగా జిల్లా ఎంపిక కమిటీ ప్రభుత్వ మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాల మేరకు దరఖాస్తులను పరిశీలించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి వాడ్రేవు కామరాజు తదితరులు పాల్గొన్నారు. -
పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు శనివారంతో పరిసమాప్తమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో శనివారం ఉదయం ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు కోటప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించగా, ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు, చైర్మన్ బొర్రా రాధా కృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వేద పండితులు యాగశాలలో గత మూడు రోజులుగా పూజించిన పవిత్ర జలాలను దేవతా మూర్తులు, ఆలయ ప్రాంగణానికి సంప్రోక్షణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, కోట రవికుమార్, శ్రీధర్ శర్మ, దేవస్థాన కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేటి నుంచి యథావిధిగా అన్ని ఆర్జిత సేవలు దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం ముగియడంతో ఆదివారం నుంచి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు యథావిధిగా జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. ఆయా సేవలకు అవసరమైన టికెట్లను ఆన్లైన్తో పాటు వాట్సాప్, దేవస్థాన ప్రాంగణంలోని సేవా టికెట్ల విక్రయ కేంద్రాలలో పొందవచ్చునని పేర్కొన్నారు. -
మీ భూమి – బ్లాక్ చెయిన్తో భూ రికార్డులకు శాశ్వత భద్రత
గన్నవరం: మీ భూమి – బ్లాక్ చెయిన్ వ్యవస్థ ద్వారా భూముల రికార్డులకు శాశ్వత భద్రత లభిస్తుందని ప్రభుత్వ భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ), ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి తెలిపారు. జిల్లాలో మీ భూమి – బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికై న గన్నవరం మండలంలోని భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్థానిక సబ్రిజి స్ట్రార్ కార్యాలయాన్ని శనివారం ఆమె పరిశీలించారు. రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో రీసర్వే పూర్తయిన ఏడు మండలాలను పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశామన్నారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల రికార్డులను బ్లాక్ చెయిన్ వ్యవస్థకు అనుసంధానం చేసి, భూమి ఎల్పీ నంబర్ ఆధారంగా డిజిటల్ ఐడీ కేటాయిస్తామన్నారు. సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శి–1 చేతన్ టీఎస్, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ విజయవాడ, గుంటూరు ఐజీలు కె.రామారావు, జి.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రర్ ఎం.ఎస్.జి.కె.మూర్తి, తహసీల్దారు కె.వెంకటశివయ్య, సబ్రిజిస్ట్రార్ వి.వి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజయ పాల సేకరణ ధర పెంపు చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) పాల సేకరణ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డెయిరీ పాలకవర్గ సమావేశం శనివారం పరిపాలనా భవనంలోని బోర్డు మీటింగ్ హాల్లో జరిగింది. తాత్కాలిక చైర్మన్గా దాసరి వెంకట బాలవర్ధనరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, పాల సేకరణ, డెయిరీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. డెయిరీకి పాలు పోసే రైతులకు ధర పెంచుతూ బోర్డు సమావేశం నిర్ణయించింది. గెదే పాలు లీటర్కు రూ.3, ఆవు పాలకు రూ.3.50 నుంచి రూ.4 వరకు పెంచుతూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. పాల సేకరణ ధర ప్రస్తుతం రూ.85గ ఉండగా, పెరిగిన ధరతో రూ.88కు చేరింది. ఆవు పాల ధర రూ.25 నుంచి రూ.29కు పెరిగింది. లక్షన్నర మంది రైతులు ప్రయోజనం చేకూరనుంది. పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ లబ్బీపేట(విజయవాడతూర్పు): పచ్చదనం, పరిశుభ్రతతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. హరితాంధ్రప్రదేశ్లో భాగంగా శని వారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ రాజశేఖరబాబు, డీసీపీ కె.జి.వి.సరిత మొక్కలు నాటారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణం అందించడానికి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని కోరారు. పోలీస్ శాఖ తరఫున శాంతిభద్రతలతో పాటు సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణలోనూ భాగస్వామ్యం కావాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీసీపీ బి.సత్యనారాయణ, ఏడీసీపీ ఎన్.వి.రమణ, ఏఆర్ ఏసీపీ రామకృష్ణంరాజు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో ముగ్గురు డిస్మిస్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులపై ప్రభుత్వం శనివారం వేటు వేసింది. డెప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కె.సంధ్య, సీనియర్ అసిస్టెంట్ కె.వి.చలపతి, జీఎస్టీఓ బి.మెహర్కుమార్ను డిస్మిస్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్కుమార్ పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది మందిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ శాఖ విచారణ చేపట్టింది. ఆరుగురిపై ఆరోపణలు రుజువైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ముగ్గురిని డిస్మిస్ చేస్తూ జీఓలు విడుదలయ్యాయి. అయితే జీఓల్లో ఎక్కడా అవినీతి ఆరోపణలను వివరించలేదు. మిగిలిన ముగ్గురికి ఇంక్రిమెంట్లు కట్ చేసినట్లు తెలిసింది. వారి డిస్మిస్ వ్యవహారంపై ఏపీపీఎస్సీ అభిప్రాయాన్ని తీసుకున్నట్లుగా జీఓల్లో పేర్కొన్నారు. డిస్మిస్ ఉత్తర్వులు విడుదల కాగానే ఆ శాఖ ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమైంది. ఈ ముగ్గురు అధికారులు ప్రతినిధ్యం వహిస్తున్న సంఘం ఇటీవల ఆ శాఖ కమిషనర్పై అవినీతి ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఒకే సామాజికవర్గానికి చెందిన వారిపై వేటు పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
కాలకూట నీరు.. జనానికి కన్నీరు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. వ్యాధి ప్రబలడానికి కలుషిత నీరే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. పైపులైన్లు కలుషితమై, కాలకూట విషాన్ని తాగుతున్నామని చెబుతున్నారు. అయితే కలుషిత ఆహారం కారణం కావొచ్చంటూ బాధితులపైనే అధికారులు నెపం నెట్టేస్తున్నారు. నీటి నమూనాలు సేకరించి ల్యాబులకు పంపిస్తున్నారు. ఆ ఫలితాల నివేదికలను బయట పెట్టకుండా తొక్కిపెడుతున్నారు. రెండురోజుల్లో కృష్ణాజిల్లా కంకిపాడు, సమీప గ్రామాల్లో 40 మంది వరకూ డయేరియా బారిన పడ్డారు. శనివారం కొత్త కేసులు లేవని వైద్యాధికారులు ప్రకటించారు. అయితే వైద్య శిబిరాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ నవీన్కు మాత్రం ఇంటింటి సర్వేలో రెండు కేసులను గుర్తించి, వారిని వైద్యం కోసం సీహెచ్సీకి తరలించామని చెప్పారు. ఇప్పటికీ సీహెచ్సీలో 15 మంది వరకు బాధితులు చికిత్స పొందుతున్నారు. గత వారంలో ఉయ్యూరులో అధికారికంగా 35 కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య 60కి పైనే ఉండొచ్చని అంచనా. ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరందరూ వేర్వేరు అనారోగ్య కారణాల వల్ల చనిపోయారని, డయేరియా మరణాలు కాదంటూ అధికారులు సాకులు చెప్పారు. క్లోరినేషన్ చేశాక నీటి పరీక్షలు డయేరియాకు తాగునీరు కలుషితం కారణ మని జనం ఆరోపిస్తుంటే, ఆహార పదార్థాల వల్ల అంటూ అధికారులు తప్పుకొంటున్నారు. తాము చేయించిన తాగునీటి పరీక్షలు సాధారణంగానే ఉన్నాయని చెబుతున్నారు. అయితే సూపర్ క్లోరినేషన్, మరమ్మతులు చేసిన తర్వాత వచ్చిన రిపోర్టులను అధికారులు చూపిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వందలాది మంది డయేరియా బారిన పడ్డారు. నాడు న్యూ ఆర్ఆర్పేటలో 300 మంది.. గత ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో 300 మందికి పైగా డయే రియా బారిన పడ్డారు. దాదాపు వారం రోజుల పాటు ఆ ప్రాంతంలో డయేరియా కేసులు వచ్చాయి. తొలుత వినాయకుడి ఊరేగింపు తర్వాత చేసిన భోజనం కారణంగా అతిసార సోకి నట్లు అధికారులు చెప్పగా, వారం రోజుల పాటు కొత్త కేసులు వస్తూనే ఉండటంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కుళాయిల్లో కలుషిత నీరు రావడం వలనే డయేరియా సోకిందని స్థానికులు చెప్పినా అధికారులు తమ నీటి పరీక్షల్లో అదేమీ లేదని కొట్టిపారేశారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి నీరు తీసుకొచ్చి దాదాపు 20 రోజుల పాటు సరఫరా చేశారు. వందల మంది ఆస్పత్రి పాలవడానికి కచ్చితమైన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది జూలైలో గిరిపురం 30 మంది వరకూ డయేరియా బారిన పడ్డారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే కుళాయిల నీరు కలుషితమైందని, అందుకే తాము వ్యాధి బారిన పడ్డామని స్థానికులు ఆరోపించారు. గత ఏడాది జూలైలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభించింది. దాదాపు 15 మంది డయేరియా బారిన పడ్డారు. వారందరూ విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిల్లో చికిత్స పొందారు. పెనుగంచిప్రోలు మండటం గుమ్మడిదుర్రు గ్రామంలో సైతం జూలైలో పది మందికి డయేరియా సోకింది. షేర్ మహమ్మద్పేటలో విష జ్వరాలు, డయేరియా విజృంభిం చింది. అపరిశుభ్ర పరిసరాలే కారణ మంటూ అప్పట్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది విస్సన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 20 మందికి డయేరియా సోకగా, అక్కడ వారం రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మాత్రం ఆయా గ్రామాల్లో డయేరియాకు కచ్చితమైన కారణాన్ని ఇప్పటికీ బయటపెట్టలేదు. తాము సరఫరా చేసిన నీరు కలుషితమని చెబితే ప్రభుత్వ పరువు పోతుందని ఈ రిపోర్టులు బయట పెట్టలేదనే విమర్శలు వినిపించాయి. వైద్య సిబ్బంది ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. ఒక మందు బిళ్ల, ఒక ఇంజక్షన్ ఇచ్చి వెళ్లి కబుర్లు చెప్పుకొంటున్నారు. రోగులు ఏమయ్యారు అనేది అవసరం లేదు వాళ్లకి. బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. రోగులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం. – ఇంద్రాణి, పునాదిపాడు, కంకిపాడు మండలం వైద్య సేవల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే డయేరియా కారణంగా ఉయ్యూరులో పలువురు ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పుడు కంకిపాడుకు విస్తరించింది. అయినా అధికారుల్లో చలనం లేదు. పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆరో ప్లాంట్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటర్ ప్లాంట్ ట్యాంకులను నిరంతరం శుభ్రం చేస్తూ ప్రజలకు సురక్షిత తాగు నీరు అందిం చాలి. కృష్ణా జలాలను తీసుకొస్తున్నా మంటూ ప్రచారంలో ఊదరగొడుతున్న పాలకులు ప్రజారోగ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. – దేవభక్తుని చక్రవర్తి, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, పెనమలూరు -
రెడ్క్రాస్ సేవలను ప్రజలకు చేరువ చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలకు అత్యవసర సమయాల్లో అండగా నిలిచేలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను విస్తృతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా వార్షిక సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. గత ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక కార్యకలాపాల నివేదిక, ఆదాయ, వ్యయ వివరాలను సమావేశంలో వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది రెడ్క్రాస్కు లభించిన అవార్డు సంస్థ లోని ప్రతి సభ్యుడు, వలంటీర్ సమష్టి కృషికి గుర్తింపని పేర్కొన్నారు. కళాశాలల్లో యూత్ రెడ్క్రాస్, ఉన్నత పాఠశాలల్లో జూనియర్ రెడ్క్రాస్ను ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. జూనియర్ రెడ్క్రాస్ ఏర్పాటు, ప్రథమ చికిత్స, సీపీఆర్పై పీఈటీలకు శిక్షణ ఇచ్చేందుకు డివిజన్ల వారీగా వర్క్షాపు నిర్వహించాలన్నారు. మచిలీపట్నంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం పక్కన, చల్లపల్లి సబ్ బ్రాంచ్ రెడ్క్రాస్కు భూమి కేటాయింపునకు చర్యలు చేపట్టాలన్నారు. బ్లడ్ బ్యాంక్కు అవసరమైన పరికరాలను సీఎస్ఆర్ నిధుల ద్వారా ఎన్హెచ్పీసీల నుంచి సమకూర్చేందుకు ఎంపీ సహకరించనున్నట్లు సమావేశంలో వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు మండలాల వారీగా షెడ్యూలు రూపొందించి విడుదల చేయాలన్నారు. అనంతరం రెడ్క్రాస్ సేవా కార్యక్రమాలకు విశేషంగా సహకరించిన వారిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ డీఆర్వో ఎస్.పోతురాజు, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డి.ఆర్.కె.ప్రసాద్, కార్యదర్శి భవిరి శంకర్నాథ్, కోశాధికారి పడమట సుకుమార్, డీఈవో యు.వి.సుబ్బారావు, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ -
చట్ట సవరణ అవసరం
ప్రభుత్వం తీర్మానం చేయాలిప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేకుండా చట్ట సవరణ చేసేందుకు అవసరమైన తీర్మానం ప్రవేశ పెట్టి ఆమోదం తెలిపాలి. తద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. – ఎంవీ మహాంకాళీశ్వరరావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ టీఏవిద్యాహక్కు చట్టం సవరణ చేసి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష లేకుండా చేయాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అదే బాటలో ఏపీ ప్రభుత్వం సైతం ముందుకు రావాలి. – ఎ. సుందరయ్య, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, యుటీఎఫ్ -
దుర్గమ్మకు రూ.4.77లక్షల విలువైన వెండి గిన్నెలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు రూ.4.77లక్షల విలువైన 1.835కిలోల వెండి గిన్నెలను శుక్రవారం కానుకగా సమర్పించారు. విజయవాడ పటమటకు చెందిన యలమంచలి రవేంద్రరావు దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. 1.835కిలోల వెండితో తయారు చేయించిన గంగాళాలను ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మైలవరం: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాధికా చారిటబుల్ ట్రస్ట్, మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి విద్యా సంస్థలు, లయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం వారి సహకారంతో స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ ఫుట్బాల్ అనే క్రీడా ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. మన దేశంలో ఫుట్బాల్లో వెనుకబడి ఉన్నామని, గ్రామ స్థాయి క్రీడాకారులకు ఫుట్బాల్లో మంచి అవకాశం ఉందన్నారు. మైలవరంలో జరుగుతున్న పోటీలలో 25 జిల్లాల నుంచి 25 టీమ్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల అసోసియేషన్ అధ్యక్షుడు శేషగిరిరావు, అనిల్కుమార్, జిల్లా చైర్మన్ రవీంద్ర రాణా, రాధిక చారిటబుల్ ట్రస్టు అధ్యక్షురాలు రాధిక, లయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం పీఎస్టీలు, ప్రోగ్రామ్ కన్వీనర్ జాస్తి వెంకటేశ్వరరావు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను మారిషస్ దేశ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ మంత్రి లచ్మన పెంటియా శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మారిషస్ మంత్రిని ఆలయ ఆధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.మచిలీపట్నంటౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి కొడమంచిలి వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక బస్టాండ్ కార్యాలయంలోని పైఅంతస్తులో ఉన్న జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయంలోని ఆయన చాంబర్లో జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల మేనేజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లతో వెంకటేశ్వర్లు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. స్వర్ణాంధ్రా – స్వచ్ఛాంధ్రా కార్యక్రమంలో భాగంగా బస్ స్టేషన్లు, టాయిలెట్ల పరిశుభ్రత, ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పించడం, పరిశుభ్రమైన తాగునీటి సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 31లోపు వెబ్ సైట్లో సెల్ఫ్ అసెస్మెంట్ పూర్తి చేయాలని, సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు సంబంధిత కమిటీల పర్యవేక్షణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సీ్త్ర శక్తి పథకం అమలుతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఆయా రూట్లలో బస్ స్టాప్ల వద్ద బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు సిబ్బందికి సూచించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026నిర్వాసితుల కన్నీటి గాథలు వినేదెవరు?7ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను అయోధ్య బాల రాముని విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ తన మిత్ర బృందంతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. అధికారులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా కలెక్టరేట్ లోని ఈవీఎం గోడౌన్ను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. గోడౌన్కు వేసిన సీళ్లను, సెక్యూరిటీ, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు.దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణ మహోత్సవం శుక్రవారం కనుల పండువగా సాగింది. ఉత్సవమూర్తులకు భక్తులు హారతులిచ్చి స్వాగతించారు.ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ పంచహారతుల సేవలో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరీష్ టాండన్ శుక్రవారం పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన జస్టిస్ హరీష్ టాండన్కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలను బహూకరించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని మహిళా అధికారులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు రాఖీ కట్టారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వచ్చి, మిఠాయి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం, భద్రత కల్పించడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. రాఖీ పండుగ స్ఫూర్తితో పరస్పర ప్రేమ, గౌరవం, సోదరభావంతో సమాజంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆస్తులు తీసుకున్నారు.. గన్నవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తాం.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించి, గృహ నిర్మాణాలు చేసుకునేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని పచ్చ పార్టీ నేతలు గత ఎన్నికల ముందు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేశారు. ప్రభుత్వం పగ్గాలు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ నిర్మాసితులకు కేటాయించిన స్థలంలో ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం గత రెండు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించినప్పటికీ.. ఇప్పటి వరకు పైసా నిధులు విడుదల చేయలేదు. కనీసం అద్దె బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఫలితంగా గత పదేళ్లుగా అరకొర వసతుల మధ్య పెరిగిన కుటుంబాలతో సర్దుకుంటూ పాత ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా ఎదురుచూపులు.. విమానాశ్రయ విస్తరణ కోసం 2016లో దావాజీ గూడెం, అల్లాపురం, బుద్ధవరం గ్రామాల్లో 423 కుటుంబాలకు చెందిన ఇళ్లు, స్థలాలను సేకరించేందుకు ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు చేపట్టేందుకు చిన్న అవుటపల్లి పరిధిలో 51 ఎకరాల భూమిని సమీకరించారు. అయితే సదరు భూమిలో అరకొరగా మెరక చేసిన అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులకు ప్లాట్లు కూడా కేటాయించలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వాసితులకు అన్ని రకాల అండగా నిలిచింది. లాటరీ పద్ధతిలో ఐదు సెంట్ల చొప్పున ప్లాట్లు కేటాయించడంతో పాటు స్టాంప్ డ్యూటీ మినహాయించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి నిర్వాసితులకు దస్తావేజులను అందజేసింది. నిర్వాసితుల గృహ నిర్మాణాలకు రెండు విడతలుగా రూ.9లక్షల చొప్పున సాయంతో సహా రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.80.48కోట్ల నిధులు కేటాయించింది. తీరా ఎన్నికల కోడ్ రావడంతో నిధులు విడుదల ప్రక్రియ నిలిచిపోయింది. రూ. లక్షల్లో అద్దె బకాయిలు.. ఏడేళ్ల క్రితం ఎయిర్పోర్ట్ మైక్రో కెనాల్ కోసం దావాజీగూడెంలోని ఎస్సీ కాలనీలో 54 కుటుంబాలకు చెందిన గృహాలను ఖాళీ చేయించారు. వీరికి ఏడాదికి రూ. 50వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంది. వీరికి అద్దె బకాయిలు కూడా సక్రమంగా చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క కుటుంబానికి సుమారు రూ. నాలుగు లక్షల వరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని నిర్వాసితులు చెబుతున్నారు. మంజూరు కాని నిధులు.. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విషయంలో అడుగు ముందుకు పడక పోవడంతో నిర్వాసితుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేటాయించిన నిధుల విడుదలను కూడా నిలిపివేశారు. ఈ ఏడాది బడ్జెట్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి రూ.32కోట్లు కేటాయించి నెలలు గడుస్తున్నా ఫలితం లేదు. రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని నిర్వాసితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ స్థలంలో పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు దట్టంగా పెరిగి అడవిని తలపిస్తోంది. నిర్వాసితుల్లో అత్యధిక మంది ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ విమానాశ్రయ విస్తరణ కోసం తమకు వారసత్వంగా వచ్చిన ఇళ్లు, స్థలాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చాం. ప్రత్యామ్నాయంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు చేసి న్యాయం చేస్తామని చెప్పారు. ఇంత వరకు గృహ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీనివల్ల ఉన్న ఇళ్లను కోల్పోయి అద్దె ఇళ్లలో బతుకుతున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. – టి. యేసురత్నం. ఎస్సీ కాలనీ, దావాజీగూడెంవిమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. మైక్రో కెనాల్ నిర్మాణంలో మా ఇంటిని తొలగించడంతో గత ఆరేళ్లుగా కుటుంబంతో అద్దె ఇళ్లలో ఉంటున్నాం. ప్రభుత్వం ఏటా ఇస్తామని చెప్పిన అద్దె కూడా చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. – ఎన్. కోటేశ్వరరావు, దావాజీగూడెం -
ఒంటెట్టు పోకడపై ఆగ్రహ జ్వాల
టెట్ నోటిఫికేషన్పై మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలువన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇన్ సర్వీస్ టీచర్ల కోసం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం టెట్ అంశంపై వివిధ ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను పెడచెవిన పెట్టి ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చారంటూ నాయకులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు టెట్ పరీక్షపై గత కొద్ది మాసాలుగా వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నా పాలక పక్షం స్పందించకపోవటంపై వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే మండిపడుతున్న ఉపాధ్యాయులు ప్రత్యేక టెట్లోనూ ఎటువంటి మినహాయింపులు ఇవ్వకపోవటంతో సంఘాలు ఆగ్రజ్వాలలను రగిలించినట్లయింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 2,263 ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 10,559 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా వారిలో 75శాతం ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉన్నట్లుగా ఉపాధ్యాయ సంఘాల నేతలు వివరిస్తున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో.. ఉపాధ్యాయులు సాధారణ డిగ్రీలతో పాటు వృత్తిపరమైన డీఎడ్, బీఎడ్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొంది. ఐదేళ్లలో ఉద్యోగ విరమణ చేసేవారికి మాత్రం ప్రభుత్వం దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. సుప్రీం తీర్పుతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. విద్యాహక్కు చట్టం–2009 ప్రకారం దేశంలో టెట్ విధానం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో 2011 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. 2011కు ముందు ఉన్న ఉపాధ్యాయులు సైతం ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు ఒకటో తేదీ లోపు టెట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. దీంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. అంతా గందరగోళం.. సుప్రీంకోర్టు తీర్పు, టెట్ పరీక్ష, ఉపాధ్యాయుల ఆందోళన తదితర అంశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహిస్తామంటూ ప్రకటించింది. అయితే అందులో ప్రస్తుతం ఉన్న టీచర్లకు వెసులుబాటు ఉంటుందని, కొన్ని మినహాయింపులు చేస్తారని ఉపాధ్యాయ సంఘాలు భావించాయి. అదేవిధంగా పాస్ మార్కులు తగ్గిస్తారని, ఆఫ్లైన్లో నిర్వహిస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ అటువంటివి ఏమీ లేకపోయే సరికి ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. దానికి తోడు ఈ నెల ఐదు నుంచి 16వ తేదీ వరకూ సాధారణ టెట్ నిర్వహించారు. ఈ ఫలితాలు సెప్టెంబర్ 15వ తేదీన ప్రకటించనున్నారు. ఆ ఫలితాలు రాకుండానే స్పెషల్ టెట్ పేరుతో ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో ఉపాధ్యాయుల్లో సహజంగానే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు టెట్ రాసిన ఇన్ సర్వీస్ టీచర్లు మళ్లీ టెట్కు దరఖాస్తు చేయాలా.. మరోసారి ఫీజు చెల్లించాలా.. టెట్ ఫలితం వచ్చే వరకూ వేచి ఉండాలా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పైగా సాధారణ టెట్ మాదిరిగానే అర్హత మార్కులున్నాయి. టెట్ వెయిటేజీ పరీక్ష విధానంలో సైతం ఎటువంటి మార్కులూ లేవు. మరోవైపు స్పెషల్ టెట్ నోటిఫికేషన్లో సైతం సాధారణ టెట్లో ఉన్న అంశాలే ఉండటంతో వారు విస్మయానికి గురవుతున్నారు. జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలుకృష్ణా 1,343 5,468 ఎన్టీఆర్ 920 5,091 మొత్తం 2,263 10,559 -
రూ.లక్ష కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సంక్షేమం, ఆర్థిక ప్రగతి, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ. 1,00,648కోట్ల వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషి చేయాలన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశాలు జరిగాయి. సమావేశంలోబ్యాంకింగ్, సీఎఫ్ఎల్ అధికారులతో కలిసి 2026–27 వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ప్రణాళిక ఇలా.. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ. 14,736కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 20,614కోట్ల రుణ లక్ష్యాలను ప్రతిపాదించినట్లు చెప్పారు. మొత్తం ప్రాధాన్య రంగానికి రూ.38,173కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ.62,475కోట్ల మేర లక్ష్యాలను రుణ ప్రణాళికలో పొందుపరిచినట్లు వివరించారు. ఇతర ప్రాధాన్య రంగానికి రూ.2,823కోట్ల రుణాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. గతే డాది రుణ ప్రణాళిక లక్ష్యాల సాధనలో బ్యాంకు లు మంచి ప్రగతి కనబరిచాయని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ బ్యాంకులు మరింత కీలకంగా వ్యవహరించి, లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. లీడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎంవీ తిలక్, ఆర్బీఐ ఎల్డీవో రోహిత్ అగర్వాల్, ఎల్డీఎం పి.వెంకట సుబ్బయ్య, వి.అమరేశ్వరరెడ్డి, వీఎంసీ అడిషనల్ కమిషనర్ డి.చంద్రశేఖర్, సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ స్టేట్ హెడ్ బాబూరావు, అధికారులు పాల్గొన్నారు. ప్రతిపాదనలను ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీశ -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం, మూడో శుక్రవారం, పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్రోడ్డు మార్గంలో రద్దీ కనిపించింది. శుక్రవారం కావడంతో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించిన పంచహారతుల సేవలో పలువురు ప్రముఖులు హాజరు కావడంతో ఆలయంలో సందడి వాతావరణం కనిపించింది. ఆలయ ఈవో శీనానాయక్ ఆలయ పరిసరాల్లో పర్యటించి, సిబ్బందికి సూచనలిచ్చారు. రెండో రోజుకు పవిత్రోత్సవాలు.. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు శుక్రవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఆలయ అర్చకులు, వేద పండితులు పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. -
మెట్రో రైల్ ప్రాజెక్ట్కు సహకరించాలి
పెనమలూరు: రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిందని మెట్రో రైల్ ప్రాజెక్ట్ నోడల్ అధికారి ఉదయలక్ష్మి చెప్పారు. దీనికి భూ, భవన యజమానులు, వ్యాపారులు సహకరించాలని కోరారు. పెనమలూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పెనమలూరు, గన్నవరం ప్రాంతాలకు చెందిన భూ, భవన యజమానులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ నుంచి పెనమలూరు, గన్నవరం ప్రాంతాలకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రతిపాదన సిద్ధం చేశామన్నారు. మొత్తం రూ 10,188 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు. మెట్రోలైన్ 38.40 కిలోమీటర్లు ఉంటుందని, అలాగే మొత్తం 31 స్టేషన్లు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారన్నారు. ప్రాజెక్ట్ నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తారని, కేంద్రప్రభుత్వం ఆమోదించాల్సి ఉందన్నారు. మెట్రో స్టేషన్లు ఇవే... పెనమలూరు, గన్నవరం మండలాల్లో మెట్రో రైల్ స్టేషన్ల ప్రతిపాదనలు వెల్లడించారు. పెనమలూరు మండలంలో కానూరు సిరీస్ సమీపంలో, సెంటినీ సినీమాల్ ప్రాతంలో, సిద్ధార్థ కాలేజీ ఎదురుగా ఇరిగేషన్ కాలువ కట్ట (వసంత నగర్), పోరంకి కర్లపూడి కల్యాణ మండపం సమీపంలో, శివాలయం వద్ద, పెనమలూరు సెంటర్ దాటిన తరువాత స్టేషన్లు వస్తాయన్నారు. గన్నవరం పరిధిలో కేసరపల్లి గ్రామం, ఎయిర్పోర్టు సమీపంలో హెచ్సీల్ వద్ద, బస్టాండ్, ఎంపీడీవో కార్యాలయం రోడ్డు వద్ద స్టేషన్లు వస్తాయన్నారు. భూ, భవన యజమానులు వారి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. మాకు న్యాయం చేయాలి... మెట్రో ప్రాజెక్ట్కు తాము సహకరిస్తామని, కానీ తమకు ఆశించిన స్థాయిలో పరిహారం ఇవ్వాలని భూ, భవన యజమానులు కోరారు. ప్రతిపాద మెట్రోస్టేషన్ల వద్ద భవనాలు, దుకాణాలు ఉన్నాయని అన్నారు. ప్రాజెక్ట్కు స్థలం ఇవ్వటం వలన విలువైన భూమితో పాటు, వ్యాపారాలు కోల్పోతామని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ప్రభుత్వం భూ,భవన యజమానులు, వ్యాపారులకు పూర్తిగా న్యాయం చేయాలన్నారు. పరిహారం ఎంత ఇచ్చేది వివరాలు అధికారికంగా ప్రకటిస్తే తమ నిర్ణయం తెలుపుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ రంగారావు, పెనమలూరు, గన్నవరం తహసీల్దార్లో రాజు, శివయ్య, టెక్నికల్ ఇంజినీర్లు శివప్రసాద్, శ్యామ్సుందర్, భూ,భవన యజమానులు, వ్యాపారులు పాల్గొన్నారు. -
చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ప్రమాదం!
కోదాడ రూరల్: హైవే అథారిటీ, లారీ డ్రైవర్, పోలీసుల చిన్న నిర్లక్ష్యం కోదాడ మండల పరిధిలోని దోరకుంట వద్ద జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్లోని జీడిమెట్ల నుంచి ఐరన్ స్తంభాల లోడ్తో విజయవాడ వైపు వెళ్తున్న లారీ కోదాడ దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 3.36 గంటల సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయింది. ఈ క్రమంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో డివైడర్ను ఎక్కినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. లారీ సగం డివైడర్పై, సగం రోడ్డుపై ఉండి నిలిచిపోయింది. 3.45 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. ఈ లారీ దగ్గరకు వచ్చి తృటిలో తప్పించడంతో బస్సుకు గీతలు పడ్డాయి. దీంతో ఆ బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు లారీ డ్రైవర్తో గొడవకు దిగారు. బస్సు డ్యామేజీకి డబ్బులు చెల్లించాలని ఒక డ్రైవర్ అక్కడే ఉండిపోగా మరో డ్రైవర్ బస్సును తీసుకొని వెళ్లిపోయారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఉంటే.. తెల్లవారుజామున 3.36 గంటలకు లారీ డివైడర్ ఎక్కి నిలిచిపోతే.. బస్సు 4.45 గంటలకు ఆ లారీని ఢీకొట్టగా ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఆరుగురు మృతి చెందారు. 15 మంది గాయపడ్డారు. లారీ డివైడర్ ఎక్కిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం, తొలుత ఒక బస్సు వచ్చి స్వల్పంగా ఢీకొట్టిన వెంటనే కనీసం ఇండికేటర్లు ఏర్పాటు చేసినా ఘోర ప్రమాదం తప్పేదని పేర్కొంటున్నారు. లారీ డివైడర్ ఎక్కిన గంట సమయం తర్వాత.. ఘోర ప్రమాదానికి గురైన బస్సు వచ్చి ఢీకొట్టింది. అంటే గంటకు పైగా అక్కడ రోడ్డుపై ప్రమాదకరంగా కంటైనర్ ఉందనే విషయాన్ని హైవే పెట్రోలింగ్ సిబ్బంది గానీ, పోలీసులు గానీ గుర్తించలేకపోయారు. ఆ సమయంలో ఆ రెండు శాఖల వారు ఎక్కడ ఉన్నారనేది ప్రశ్న. ఘటన స్థలాన్ని పరిశీలించిన రవాణాశాఖ అధికారులు ప్రమాదానికి గురైన బస్సును, కారణమైన లారీని ప్రమాద స్థలం నుంచి కొద్దిదూరంలో రోడ్డు పక్కన ఫంక్షన్హాల్ వెంట పెట్టారు. రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా డెప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ ఎన్.వాణి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులు, రవాణాశాఖ, రెవెన్యూ, హైవే అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైవే అథారిటీ అధికారులు 60 కిలో మీటర్లకు ఒక పెట్రోలింగ్ వాహనం నడిపితే ఎలా అని ఆమె ప్రశ్నించారు. దీనిపై పూర్తి వివరాలను ఇవ్వాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. వారి వెంట ఆర్టీఓ పురుషోత్తమరెడ్డి, ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ఎంవీఐ జిలానీ, హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉన్నారు. నిలకడగా క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి ప్రమాదంలో గాయడిన 15 మంది ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కోదాడ రూరల్ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఫ్రెష్ బస్సు డ్రైవర్ మల్లికార్జున్ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. -
నేపాల్కు వెళ్లి అదృశ్యం?
అందని కానూరువాసి క్షేమ సమాచారం పెనమలూరు: కానూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చొప్పరపు రమేష్(53) యాత్రకని నేపాల్కు వెళ్లి అదృశ్యమవ్వడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెల కొంది. అధికారులు కనీస సమాచారం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే కానూరు వసంతగోవింద్ అపార్టు మెంట్లో రమేష్ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. అతను 15 సంవత్సరాలుగా కతార్ దేశం దోహాలో సాఫ్ట్వేర్ అర్కెటిక్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. అతను ఈ నెలలో కానూరుకు వచ్చి తిరిగి 14వ తేదీన కతార్కు వెళ్లారు. అక్కడ నుంచి నేపాల్ యాత్రకు వెళ్లారు. ఆయన మంగళవారం నేపాల్ నుంచి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. బుధవారం తాను యాత్రకు బయలుదేరానని మెసేజ్ చేశారు. ఆ తర్వాత అతని నుంచి సమాచారం లేదు. కుటుంబ సభ్యుల్లో ఆందోళన నేపాల్లో వరద విలయం కారణంగా భారతీయులు గల్లంతైన ఘటన పై ఆందోళన నెలకొంది. అయితే మిస్సింగ్ జాబాతాలో రమేష్ పేరు మచిలీపట్నం కలెక్టరేట్కు వచ్చింది కాని పూర్తి సమాచారం లేదు. ఏంజరుగుతుందో సమాచారం ఇవ్వాలని కటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు. రమేష్ భార్య సనీత పటమటలంక వీఎంసీ బాలుర పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేస్తున్నారు. కుమారుడు సాయిఅఖిల్ జర్మనీలో ఉద్యోగి. కుమార్తె అల్లుడు హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం. రమేష్ వివరాలు అందితే ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
స్పెషల్ టెట్ నోటిఫికేషన్ సవరించాలి
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇన్–సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ను వెంటనే సవరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు వేముల భిక్షమయ్య ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఎన్నోసంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తూ, అర్హత కలిగిన ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులపై సాధారణ టెట్ నిబంధనలను యథాతథంగా వర్తింపజేయడం అన్యాయమన్నారు. స్పెషల్ టెట్ను ఆన్లైన్కు బదులుగా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని, ఉత్తీర్ణత మార్కులను డిపార్ట్మెంటల్ పరీక్షల తరహాలో 40 శాతానికి పరిమితం చేయాలని కోరారు. బోధన సబ్జెక్టు వరకే టెట్ పరీక్ష సిలబస్ను పరిమితం చేయాలని గతంలో పలుమార్లు ప్రభుత్వాన్ని కోరిందన్నారు. తాజా నోటిఫికేషన్లో ఈ అంశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందన్నారు. పక్కనున్న తమిళనాడు కూడా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులపై అదనపు పరీక్ష భారం మోపకుండా, వారి సుదీర్ఘ సేవా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని స్పెషల్ టెట్ నిబంధనలను పునః పరిశీలించాలన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని డీఆర్వోకు సమర్పించారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి జి.అనుగ్రహ ప్రసాద్, రాష్ట్ర కౌన్సిలర్లు కొడాలి కిషోర్, ఎస్.మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవ వైభవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో గురువారం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. వీటిలో భాగంగా తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్కు స్నపనాభిషేకం, అమ్మవారికి అలంకరణ, నిత్య పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పాత యాగశాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అఖండ దీపారాధనలతో ఉత్సవాలు ప్రారంభమ్యాయి. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు కోట ప్రసాద్, దుర్గాప్రసాద్, వేద పండితులు షణ్ముఖ శాస్త్రి పర్యవేక్షణలో అర్చకులు ఉత్సవాలను జరిపించారు. ఈవో శీనానాయక్, ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారి మూల విరాట్తో పాటు మల్లేశ్వరస్వామివారికి, ఆలయ ప్రాంగణంలో ఇతర పరివార దేవతలు, ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పవిత్రాలను అలంకరించారు. ఏటా శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో తెలిసీ తెలియక ఆలయంలో ఎటువంటి తప్పులు, అపచారాలతో కలిగే దోష నివారణకు పవిత్రోత్సవాలను జరిపిస్తామని అర్చకులు తెలిపారు. మధ్యాహ్నం ఆలయ అర్చకుల పర్యవేక్షణలో హోమాలు, యాగాలను నిర్వహించారు. ఇవి శనివారం వరకు జరుగుతాయి -
రూటు మార్చిన అతిసారం
కంకిపాడు: అతిసార వ్యాప్తి రూటు మార్చింది. నిన్న మొన్నటి వరకు ఉయ్యూరును వదలని డయేరియా కేసులు ఇప్పుడు పొరుగూళ్లుకు వ్యాపిస్తున్నాయి. కృష్ణాజిల్లా కంకిపాడులో డయేరియా కలకలం రేపుతోంది. వాంతులు, విరేచనాల లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే బుధ, గురువారాల్లో 16 మంది రోగులు వాంతులు, విరేచనాలతో చేరారు. ప్రైవేటు ఆసుపత్రులు, ఆర్ఎంపీల వద్ద లెక్కకు మించి డయేరియా బాధితులు వైద్య సేవలు పొందినట్లు సమాచారం. డయేరియా విజృంభణకు తాగునీటి కలుషితమే ప్రధాన కారణం అయ్యి ఉంటుందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉయ్యూరులో అతిసార అదుపులోకి వచ్చిందని, కొత్త కేసుల్లేవని జిల్లా కలెక్టర్ ప్రకటించిన మర్నాడే ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామం అంతటా డయేరియా కేసులు.. కంకిపాడు పట్టణం అంతటా డయేరియా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లోనే పట్టణంలోని చెరువు కట్ట, విజయలక్ష్మీ థియేటరు సెంటరు, రెల్లికాలనీ, వడ్రుపేట, లాకురోడ్డు ప్రాంతాల నుంచి రోగులు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందారు. రోగులకు ఆసుపత్రి వైద్య సిబ్బంది అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితులు కుదుటపడగానే ఇళ్లకు పంపుతున్నారు. గురువారం పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన ఆరుగురు వైద్య సేవలు పొందుతున్నారు. ఇది కేవలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి. అయితే ప్రైవేటు ఆసుపత్రులు, ఆర్ఎంపీల వద్ద అధిక సంఖ్యలో ప్రజలు వాంతులు, విరేచనాలు లక్షణాలతో వైద్యం పొందినట్లు సమాచారం. పట్టణంలో సుమారుగా 100 మంది వరకూ డయేరియా బాధితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కలుషిత తాగునీరే కారణమా? తాగునీటి కలుషితం వల్లే ప్రజలకు వాంతులు, విరేచనాలు వ్యాపించాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాగునీటి పైపులైన్లు పూర్తిగా మురుగు కాలువల వెంబడి ఉండటంతో పైపులైన్లు ద్వారా మురుగునీరు ప్రవేశించటంతో ప్రజల ఆరోగ్య పరిస్థితి ప్రమాదంలో పడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోగులకు వైద్యసేవలు అందించిన వైద్యులు సైతం తాగునీరు ప్రధానంగా అయి ఉంటుందని, ఆహార కలుషితం కూడా కారణం అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కేసులు నమోదవ్వటం వెనుక తాగునీరే కారణం అయి ఉంటుందని చెప్తున్నారు. పది రోజులు క్రితం కంకిపాడు పట్టణంలోని ట్యాంకును శుభ్రం చేసి క్లోరినేషన్ చేశారు. అయితే స్కవర్ వాల్స్ ద్వారా నీటిని విడిచిపెట్టకుండా నేరుగా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయటంతో పది రోజులు క్రితమే ప్రజలు వాంతులు, విరేచనాలతో వైద్య సహాయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య సిబ్బంది గుర్తించినట్లు సమాచారం. పలు గ్రామాల్లోనూ బాధితులు.. కంకిపాడు పట్టణంతో పాటుగా మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రొద్దుటూరు, పునాదిపాడు, గొల్లగూడెం, కోలవెన్ను గ్రామాల నుంచి డయేరియా బాధితులు వైద్యం కోసం కంకిపాడు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందారు. ప్రొద్దుటూరుకు చెందిన జాన్ అనే వృద్ధుడు డయేరియా ప్రభావంతో తీవ్ర అనారోగ్యానికి గురవ్వటంతో 108 అంబులెన్సులో బుధవారం రాత్రి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మంచాన పడ్డ రెల్లి కాలనీ.. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన రెల్లికాలనీ మంచాన పడింది. పట్టణంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులు, సాధారణ ప్రజలు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ పది రోజులు క్రితమే వాంతులు, విరేచనాల బారిన పడి స్థానికులు ఆసుపత్రుల్లో వైద్యం పొందారు. అంతే కాకుండా తీవ్ర జ్వర లక్షణాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికీ పలువురు పారిశుద్ధ్య కార్మికులు పని చేసే ఓపిక లేక సెలవుపై ఉన్నారంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాంతులు, విరేచనాలతో వస్తున్న బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. మందులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకూ రోగులను ఎవరినీ వైద్యం చేయకుండా పంపలేదు. సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. పరిస్థితి అదుపులోనే ఉంది. – డాక్టర్ రెహమాన్, కంకిపాడు సీహెచ్సీ -
తెలుగు నేర్చుకుంటున్న శ్రీలంక తెలుగు ప్రజలు
అవనిగడ్డ: శ్రీలంకలోని కొలంబోలో ఉన్న అల్ సిలోన్ తెలుగు కాంగ్రెస్ సభ్యులకు తెలుగు రాయడం, చదవడం నేర్పే కార్యక్రమం ప్రారంభమైంది. దీని ద్వారా కొలంబోలోని దాదాపు ఆరు లక్షల మంది తెలుగు ప్రజలకు మాతృభాష నేర్చుకునే అవకాశం కలిగింది. శ్రీలంక తెలుగు కాంగ్రెస్ ఆహ్వానం మేరకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ ఏడాది జూలై నెలలో శ్రీలంకలో పర్యటించారు. తెలుగు రాయడం, చదవడం నేర్పండి అంటూ శ్రీలంక తెలుగు ప్రజలు ఆయన ముందు వ్యక్తం చేసిన ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చొరవ చూపారు. హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి వెలుదండ నిత్యానందరావు, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు సహకారంతో, శ్రీలంక బుద్ధ శాసన, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హినీదుమ సునీల్ సెల్వీ ప్రోత్సాహంతో బుధవారం శ్రీలంకలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీలంకలోని తెలుగు ప్రజలకు ఇద్దరు తెలుగు టీచర్లను నియమించి శిక్షణ ఇస్తున్నారు. కిడ్నీ వ్యాధితో మరొకరి మృతి ఎ.కొండూరు: కిడ్నీ వ్యాధి మరో ప్రాణాన్ని బలి గొంది. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం మత్రియ తండా పంచాయతీ పరిధిలోని చైతన్య నగర్కు చెందిన బాణావతు హనుమ (60) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బుధవారం అర్ధరాత్రి స్వగృహంలో మృతి చెందారు. తొమ్మిదేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు కుటుంబ సభ్యులు డయాలసిస్ చికిత్స అందిస్తున్నారు. వ్యవసాయ కూలీగా ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగించే హనుమకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిడ్నీ వ్యాధి చికిత్స కోసం ఇప్పటి వరకు రూ. 8 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేదని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా కిడ్నీ వ్యాధితో మండలంలో తరచూ ఎవరో ఒకరు మృతి చెందుతున్నారు. హనుమ మృతిపై కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, సీపీఎం మండల కార్యదర్శి పానెం ఆనందరావు స్పందించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధి తీవ్రత దృష్ట్యా మండలంలో కృష్ణా జలాలను ప్రతి గ్రామానికి సక్రమంగా సరఫరా చేయాలని కోరారు. భూ యజమానుల హక్కుల కల్పనకు చర్యలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గతంలో పట్టాలు పొంది భూమిపై పూర్తి స్థాయిలో చట్టబద్ధమైన హక్కులు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానుల హక్కుల కల్పనకు సమగ్ర చర్యలు చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఎన్టీఆర్ పట్టాలు పొందినా పూర్తి స్థాయిలో చట్టబద్ధమైన హక్కులు లేని వారు సుమారు 20 వేల మంది ఉన్నట్లు తెలిపారు. అటువంటి వారికి హక్కులు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు ముందుగా క్షేత్రస్థాయిలో భూములను సర్వే చేయాలని ఆదేశించారు. పాత పట్టాలో పేర్కొన్న భూమి, ప్రస్తుతం భౌతికంగా ఉన్న భూమి వివరాలను పరిశీలించి, విస్తీర్ణం, సరిహద్దులు, సర్వే నంబర్ తదితర అంశాలను నిర్ధారించాలన్నారు. అవసరమైన చోట భూమి సరిహద్దులను గుర్తించి, భౌతిక పరిస్థితులను రికార్డుల్లోని వివరాలతో సరిపోల్చాలని ఆదేశించారు. రికార్డుల్లో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే, రికార్డుల పరిశీలన అనంతరం అర్హత కలిగిన భూ యజమానుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, ఆర్డీఓలు వెన్నెల శ్రీను, జి. అనిల్ కుమార్, తహసీల్దార్లు, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు. -
ప్రతి దశలో ‘సర్’ నాణ్యతకు ప్రాధాన్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ప్రతి దశలోనూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డెప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్కుమార్శర్మ అన్నారు. లోపాలకు తావులేకుండా దోషరహితమైన ఓటర్ల జాబితాను రూపొందించడానికి సమష్టి కృషి అవసరమన్నారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి హాల్లో రాష్ట్రంలో సర్ పురోగతిపై సమీక్ష, పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఈవో వివేక్ యాదవ్, అదనపు సీఈవో ఎస్.ఢిల్లీరావుతో పాటు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు వర్చువల్గా పాల్గొన్నారు. ప్రస్తుతం నోటీసుల జారీ, విచారణ, క్లెయిమ్లు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పురోగతిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 43,71,397 నోటీసుల పంపిణీ కాగా 16,23,774 నోటీసులపై క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయిందన్నారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు, బీఎల్ఏలు, రాజకీయ పార్టీల మధ్య సమన్వయం, సహకారం అవసరమన్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం వంటి వివిధ కారణాలతో విచారణకు హాజరుకాలేని పక్షంలో ఈఆర్వో, ఏఈఆర్వో – బీఎల్వోను సమన్వయం చేసుకుంటూ ఇంటి సందర్శన, వివిధ మార్గాల ద్వారా ఓటర్లకు సహాయ సహకారాలు అందించాలన్నారు. నోటీసులపై విచారణ అనంతరం క్వాసీ జ్యుడీషియల్ అధికారి అయిన ఏఈఆర్వోలు సమస్యను అర్థం చేసుకొని న్యాయమైన తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఫారం–6, 7, 8 తదితరాల స్వీకరణ, పరిష్కారం తదితర అంశాలనూ డాక్టర్ పవన్ కుమార్ శర్మ పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశ, ఈఆర్వోలు పాల్గొన్నారు. -
బాబు.. పింఛన్ రాజకీయం!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో కొత్త పింఛన్ల అంశానికి రాజకీయ రంగు పులుముకుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరులో జాప్యం జరగడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎన్నికలపై ప్రకటనతో.. చంద్రబాబు సర్కార్ కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇన్నాళ్లూ పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినవారికి ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణతో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునే చంద్రబాబు పాలి‘ట్రిక్స్’గా పొలిటికల్ సర్కిల్స్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనాన్ని మరోసారి బురిడీ కొట్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఒక్క పింఛన్ కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. కనీసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్ కూడా పని చేయకుండా పాలకులు చేశారంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలపై చంద్రబాబు నిబద్ధతకు నిదర్శనమే ఈ రెండున్నరేళ్ల పాలన. ఎన్నికల సమయంలో మాత్రమే సంక్షేమాన్ని స్మరించి.. పథకాలను ఎరగా వేయడానికి చంద్రబాబు హామీలు గుప్పిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలుపు కోసం అలవిగాని హామీలను ప్రజలకు ఇచ్చి నమ్మించారు. అధికారం చేపట్టాక అమరావతి తప్ప మరేదీ తమకు అక్కర్లేదు అన్నట్లూ ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పింఛన్ కోసం .. పింఛన్ ఇప్పించడంటూ రెండున్నరేళ్లుగా కనిపించిన ప్రతి అధికారిని, కూటమి నేతలను పలువురు వృద్ధులు, వితంతు మహిళలు, దివ్యాంగులు విన్నవించుకున్నారు. సచివాలయాల చుట్టూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో నాటి ఎన్నికల హామీ సీఎం చంద్ర బాబునాయుడుకు ఇప్పుడు గుర్తు వచ్చినట్లుంది. రెండున్నరేళ్లుగా ప్రజలకు ఏమీ చేయలేదు గనుక తమకు ఓట్లేసే పరిస్థితి లేదని ఆయనకు తెలుసు. ఓటమి భయంతోనే ఇప్పుడు హడావుడిగా పింఛన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనికితోడు ప్రభుత్వం ఏర్పడగానే సదరం ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ పేరిట ఉమ్మడి కృష్ణా జిల్లాలో వందలాదిమంది అర్హులైన దివ్యాంగుల పింఛన్ల తొలగించిన విషయం విదితమే. వారు సైతం పింఛన్ పునద్ధరణ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. మిగతా పథకాల సంగతి ఏమిటి ? రెండున్నరేళ్లుగా ఏమీ చేయని తాము ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ప్రజలు నిలదీసే సూచనలు కనిపిస్తున్నాయని, తాము సమాధానం చెప్పలేమని.. ఓటు అడిగే సాహసం చేయలేమని కూటమి నేతల్లో అంతర్మథనం మొదలైంది. తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని చంద్రబాబుకు సీన్ అర్థమై.. అక్టోబర్ నుంచి పింఛన్లు ఇవ్వడానికి సిద్ధం అంటూ ప్రకటించారు. ప్రజలు మాత్రం ఎన్నికలు వస్తే గానీ తాము గుర్తుకు రామా అని ప్రశ్నిస్తున్నారు. వీటికితోడు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్ హామీలు ఎందుకు అమలు చేయలేదంటే ఏమి సమాధానం చెప్పాలని కంగారు పడుతున్నారని ‘తమ్ముళ్ల’ నుంచే వినిపిస్తోంది. అన్నదాతలకు బీమా పథకం వర్తింపజేయకపోవడం, ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు అధికమంది వరిసాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈసారి పంటసాగుకు నీళ్లివ్వకపోవడంతో అన్నదాతలు ఆగ్రహంతో రగలిపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో సచివాలయాల ద్వారా పార్టీలకు అతీతంగా.. ఎప్పటికప్పుడు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు, పింఛన్లు అందించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ ఫలాలు చేరవేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా 2019–24 మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లాకు 1,77,529 ఇళ్లు మంజూరు చేశారు. అందులో ఎన్టీఆర్ జిల్లాకు 83,273, కృష్ణా జిల్లాకు 94,256 ఇళ్లు పేదలకు కేటాయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ ఫలాలు మరుగున పడిపోయాయి. ఎన్నికల సమయంలో ఇళ్లు లేని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, పంచాయతీల్లో 3 సెంట్ల చొప్పున ఇస్తామని చెప్పి రెండున్నరేళ్లు అయింది. ఇంతవరకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. కనీసం సెంటు భూమి సేకరించలేదు. ఇదే ఇప్పుడు కూటమి నేతలకు శరాఘాతంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల వేళ హడావుడిగా పింఛన్లు ఇస్తామంటూ చంద్రబాబు డ్రామాకు తెరలేపారు. గత రెండున్నరేళ్ల కాలంలో పింఛన్ల దరఖాస్తులు ఎన్ని వచ్చాయని డీఆర్డీఏ జిలా స్థాయి అధికారులను ‘సాక్షి’ ఆరా తీసింది. గత రెండున్నరేళ్లుగా ఆన్లైన్ పోర్టల్ ఆగిపోయిందని, పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు తీసుకుని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి పంపామన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయో లెక్కచెప్పలేమన్నారు. పింఛన్ల కోసం పెద్ద ఎత్తున అర్జీలు వస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు. -
అతి వేగంతోనే ప్రమాదాలు
వాహనాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. బస్సులకు స్పీడ్ లాక్ ఉండాలి. ఒకే డ్రైవర్ ఎక్కువ సేపు బస్సు నడపకుండా మరో డ్రైవర్ను నియమించాలి. వేకువ జామున డ్రైవర్లు నిద్రలోకి జారుకుని ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించినందునే పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్టాప్, రీ ఫ్రెష్ అండ్ గో కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. వేగ నియంత్రణ, సురక్షిత డ్రైవింగ్ ఎంతో ముఖ్యం. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లా ప్రమాదాలు జరుగుతున్నాయి. లారీలను రోడ్డు పక్కన నిలపకుండా ట్రక్ బేలో మాత్రమే ఆపాలి. – కె.దామోదర్, ఏసీపీ, విజయవాడ సెంట్రల్లబ్బీపేట(విజయవాడతూర్పు): అతి వేగం.. డ్రైవర్ల నిద్ర మత్తు ప్రయాణికులకు శాపంగా మారాయి. వీటి కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న యువతతో పాటు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల్లో ప్రైవేటు ట్రావెల్స్వే ఎక్కువ. మానవ తప్పిదాల కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా, పోలీసు శాఖల అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించక పోవడం, అతి వేగం, డ్రైవర్లకు అధిక పని గంటలతో నిద్ర మత్తు వంటివి ప్రధాన కారణాలని వెల్లడిస్తున్నారు. తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిన అధికారులు పెద్దగా పట్టించు కోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కూడా నిర్లక్ష్యం వీడి జాగ్రత్తలు తీసుకోవడంలేదు. మితిమీరిన వేగం ‘విజయవాడ నుంచి హైదరాబాద్ జేఎన్టీయూకు నాలుగు గంటల్లో తీసుకెళ్తాం. బెంగళూరుకు ఆరు గంటల్లో వెళ్లిపోతాం’ అంటూ ట్రావెల్స్ నిర్వహకులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. తక్కువ సమయంలో వెళ్లొచ్చనే ఆశతో ప్రయాణికులు సైతం అలాంటి ట్రావెల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ బస్సులు రోడ్డు ఎక్కిన తర్వాత 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో మరింత వేగంగా ఆ వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఆ వేగమే ప్రమాదాలకు కారణం అవుతోంది. ప్రయాణికులతో రాకపోకలు సాగించే బస్సులు 80 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లకూడదని నిబంధన ఉన్నా, దానిని ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవర్లకు అదనపు పనిగంటలు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా వేకువ జాము మూడు నుంచి నాలుగు గంటల మధ్యలోనే జరుగుతున్నాయి. సుదీర్ఘ సమయం డ్రైవింగ్ చేస్తుండటం వల్ల డ్రైవర్లకు తెలియకుండానే కనురెప్పలు పడిపోతుంటాయని, దీంతో బస్సులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయని రవాణా, పోలీసు శాఖల అధికారులు చెబుతున్నారు. చాలా వరకూ ప్రైవేటు బస్సును రాత్రి అంతా ఒకే డ్రైవర్ నడుపుతుంటాడు. ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకే డ్రైవర్ సుదీర్ఘంగా బస్సు నడపడం వల్ల అలసటకు గురై నిద్ర మత్తుకు గురవుతున్నాడు. అతివేగం, నిద్ర మత్తు కారణంగా బస్సులు అదుపు తప్పి ప్రమా దాల బారిన పడుతున్నాయని రవాణా, పోలీసు శాఖల అధికారులు పేర్కొంటున్నారు. చర్యలు ఏవీ..? వరుసగా ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతూ ప్రజల ప్రాణాలు పోతున్నా నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. నిత్యం విజయవాడ నుంచి హైదరాబాద్, చైన్నె, బెంగళూరు తది తర ప్రాంతాలకు 800 వరకూ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. ఆయా బస్సుల్లో ప్రయాణించే వారికి రక్షణ కోసం ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వేగ నియంత్రణతో పాటు, రాత్రి సమయంలో డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోకుండా ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు. డ్రైవర్ల నిద్రమత్తూ కారణమే.. గాలిలో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు ఎక్కువ ప్రమాదాలు ప్రైవేటు ట్రావెల్స్వే.. నిర్లక్ష్యం వీడి జాగ్రత్తలు తీసుకోని వైనం కోదాడ ప్రమాదానికీ డ్రైవర్ నిద్రే కారణం! గత ఏడాది అక్టోబర్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు వద్ద ఒక బైక్ను ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కింద ఇరుక్కున్న విషయాన్ని కూడా గ్రహించని డ్రైవర్ బస్సును వేగంగా నడపడంతో మంటలు చెలరేగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కోదాడ వద్ద ఆగి ఉన్న ట్రక్ను ఢీకొట్టడంలో ఆరుగురు బస్సులోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదానికి సైగం మితిమీరిన వేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అధికారులు వెల్లడించారు. ఈ రెండే కాదు బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. అదృష్ట వశాత్తూ చిన్నపాటి గాయాలతో ప్రజలు బయట పడుతున్నారు. -
మడిచర్ల యువకుడికి తీవ్ర గాయాలు
హనుమాన్జంక్షన్ రూరల్: తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో బాపులపాడు మండలం మడిచర్లకు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన సాయల అనిల్కుమార్ (25) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణకు హైదరాబాద్ వెళ్లాడు. ఇటీవల విద్యుత్ ఏఈ నోటిఫికేషన్ విడుదల కావటంతో దర ఖాస్తు చేసిన అనిల్కుమార్ గురువారం ఆ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సొంతూరు వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అనిల్ కుమార్ తల్లిదండ్రులు అరుణలత, రత్నారావు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్షతగాత్రుడిని హుటాహుటిన విజయవాడలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. కాళ్లకు శస్త్రచికిత్స చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ప్రశాంతంగా ఏఈఈ నియామక పరీక్షలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ సంస్థల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు (ఏఈఈ) పోస్టులకు నిర్వహిస్తున్న పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి చెప్పారు. కానూరులోని సాఫ్ట్వేర్ సంస్థలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని, కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన సౌకర్యాలను పరిశీలించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ హనుమయ్య, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి -
గురువారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2026
వేకువ వెలుగు రేఖలు విచ్చుకోకముందే ఇంటికి చేరాలని.. బిడ్డను మనసారా గుండెకు హత్తుకోవాలని.. వాడి ముద్దుముద్దు మాటలతో మురిసిపోవాలనుకున్న తల్లి మురిపెం తీరలేదు.. దారికాచిన మృత్యువు ఆ చిన్నారికి తల్లిప్రేమను దూరం చేసింది. సౌదీ నుంచి వస్తున్న అన్న కన్నా ముందే అమ్మానాన్నల వద్దకు చేరాలని.. అన్నకు రాఖీ కట్టి అతని దీవెనలు అందుకోవాలనుకున్న చెల్లి ఆశ చీకటిలో కలిసిపోయింది. ఇంటర్వ్యూ బాగా జరిగిందని.. తాను కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరును కాబోతున్నానని భర్తకు ఫోన్ చేసి చెప్పిన వివాహిత సంతోషాన్ని అంతలోనే మృత్యువు చిదిమేసింది. పిల్లలు బడికి వెళ్లక ముందే ఇంటికెళ్లి, వారి ముద్దూముచ్చట తీర్చాలనుకున్న ఆ తల్లి ప్రాణం ఇనుప వస్తువుల మధ్య నలిగిపోయింది. వెంటే ఉన్న భర్తను ఒంటరిని చేస్తూ అనంత వాయువుల్లో కలిసిపోయింది. అమ్మానాన్నను చూడాలని.. వారితో కలిసి పెళ్లికి వెళ్లి బంధుమిత్రులతో సరదాగా గడపాలనుకున్న కోరిక నెరవేరకుండానే యువకుడి ప్రాణం తిరిగిరాని లోకాలకు చేరుకుంది.. తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఆఫీస్కు సెలవు పెట్టానని, ఉదయం ఆరు గంటలకల్లా ఇంటికి వస్తున్నానని చెప్పిన బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎదురుచూశారు. ఏడు గంటలైనా ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కంగారు పడ్డారు.. ఇంతలో టీవీలో బస్సు ప్రమాదం వార్త రావడం, మృతుల్లో తమ బిడ్డ పేరు ఉండటంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో 65వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
మాటలకందని
●గమ్యం చేరకుండానే తెల్లారిన బతుకులు ●కోదాడ మండలం దోరకుంట వద్ద డివైడర్పై ఆగిన ట్రాలీలారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ●గాలిలో కలిసిన ఆరుగురి ప్రాణాలు ●మరో 15 మందికి గాయాలు కోదాడ: ప్రమాదం జరిగిన సమయంలో తన భార్య పక్క సీట్లోనే కూర్చున్నా.. ఆమెను కాపాడుకోలేకపోయానని యాసారపు చిన్ని భర్త సుధాకర్ కోదాడ ప్రభుత్వాస్పత్రిలో రోదించిన తీరు అక్క డున్న వారిని కలచివేసింది. అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్న తండ్రిని పరామర్శించేందుకు చిన్నితో పాటు ఆమె భర్త సుధాకర్ రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లారు. బుధవారం రాత్రి 11 గంటలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టికెట్ బుక్ చేసుకొని తిరిగి సొంతూరుకు బయల్దేరారు. భార్యాభర్తలిద్దరు డ్రైవర్ వెనుక రెండో సీటులో కూర్చున్నారు. చిన్ని కిటికీ వైపు, సుధాకర్ ఆమె పక్కనే కూర్చున్నారు. ప్రమాదంలో చిన్నికి ఇనుప స్తంభం బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. సుధాకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బుధవారం రాత్రి హైదరాబాద్లోనే ఉండమన్నా వినకుండా బయల్దేరా మని.. అప్పటి వరకు తన పక్కనే ఉన్న భార్య క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయిందని సుధాకర్ కన్నీరుమున్నీరయయ్యాడు. సాక్షి ప్రతినిధి, విజయవాడ/కోదాడరూరల్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మృత్యుశకటంటా మారింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలను బలి తీసుకుంది. మరో 15 మంది గాయపడటానికి కారణమైంది. తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దుర్గాపురం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని బుధవారం తెల్లవారుజామున ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, మరో 15 మంది గాయపడ్డారు. మరో రెండు గంటల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అంబు లెన్సుల్లో ఇంటికొచ్చిన మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు. ఈ ప్రమాదంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన యాసారపు చిన్ని(32), పమిడిముక్కల గ్రామానికి చెందిన చెన్నకేశవుల నాగేంద్రబాబు(31), విజయవాడకు చెందిన బీటెక్ చదివిన సూరవరపు షకీనా (24), కొండూరు భావన వర్ష (23), బొల్లిపోగు మేరీజ్యోత్స్న (29), పడికిటి లక్ష్మీతేజ(30) మృతిచెందారు. భావన వర్ష సోదరుడు రెశ్వంత్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇంటికొస్తున్న అతనికి రాఖీ కట్టాలని భావన విజయవాడకు ప్రైవేట్ బస్సులో బయలుదేరి మృత్యువాతపడింది. రోడ్డు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే కోదాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరుగురి మృతదేహాలను, గాయపడిన వారిని స్థానికుల సాయంతో కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. వారు సూర్యాపేట, ఖమ్మం, విజయవాడ ఆస్పత్రుల్లో చేరారు. మృతుల కుటుంబ సభ్యు లు ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ఒక్కొక్కరుగా కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకు న్నారు. మృతదేహాలను చూసి తల్లడిల్లిపోయారు. ఆరుగురి మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో కోదాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. మృతుల్లో ఐదుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉండగా.. ‘ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉంటున్న సమయంలో మాకు ఈ శిక్ష విధించావు ఎందుకు దేవుడా..’ అని వారి కుటుంబ సభ్యులు రోదించడం చూసి ఆస్పత్రికి వచ్చిన వారు సైతం కన్నీరు పెట్టారు. మృతురాలు భావనవర్ష తల్లి దండ్రులు కోదాడకు వచ్చేంత వరకు ఆమె మృతి చెందిన విషయాన్ని బంధువులు వారికి తెలుపలేదు. వారు మార్చురీ వద్దకు వచ్చి అక్కడ ఉన్న వాతావరణాన్ని పసిగట్టి ‘నా బిడ్డ ఎక్కడ అంటూ..’ గుండెలు పగిలేలా రోదించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మృతుల పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా సూర్యాపేట కలెక్టర్.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అంబులెన్స్లను కోదాడకు పంపించి మృతదేహాలను తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన తర్వాత లారీలోని ఇనుప పిల్లర్లు జాతీయ రహదారిపై రెండువైపులా చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో పాటు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు రోడ్డుపై భారీగా ఆగడంతో ట్రాఫిక్కు అంత రాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన ఇనుప పిల్లర్లను ఒక్కొక్కటిగా క్రేన్ సహాయంలో తొలగిస్తూ నెమ్మదిగా వాహనాలను పంపించారు. మధ్యాహ్నం 12 గంటలకు లారీని కూడా హైవే పైనుంచి పూర్తిగా పక్కకు తొలగించారు. హైదరాబాద్ నుంచి ఇనుప పిల్లర్స్ లోడుతో విజయవాడ వెళ్తున్న ట్రాలీ లారీ కోదాడ దాటిన తర్వాత దోరకుంట సమీపంలో అదుపు తప్పింది. వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టి సగం డివైడర్పై మరో సగం రోడ్డుపై నిలిచింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదే మార్గంలో వచ్చింది. చీకట్లో రోడ్డుపై ఉన్న లారీని చూసిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై, తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బస్సును ఆ డ్రైవర్ పక్కకు ఆపి కిందికి దిగి హెచ్చరిక బోర్డులు పెట్టాలని లారీ డ్రైవర్కు సూచించాడు. దీనికి సాక్ష్యంగా అక్కడి పరిస్థితిని వీడియో కూడా తీసి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. బస్సు డ్రైవర్ హెచ్చరించినప్పటికీ లారీ డ్రైవర్ పట్టించుకోలేదు. రోడ్డుపై ఎలాంటి హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ బస్సు వెళ్లిన కేవలం 15 నిమిషాల తరువాత వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం బారినపడింది. -
నిమ్మ ధరలకు రెక్కలు
నందిగామరూరల్: నిమ్మ కాయల ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు అర డజను కాయలు రూ.10కే దొరికేవి. ఒప్పుడు ఒక్క యాక ధర రూ.10 పలుకుతోంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడులు తగ్గటం, మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో డజను ధర రూ.100 పలికింది. జూన్, జూలై నెలల్లో రూ.30 నుంచి రూ.40 వరకు ధర పలికింది. నాలుగైదు రోజుల నుంచి నిమ్మ ధర రికార్డు స్థాయిలో పెరగటమే కాకుండా ఏకంగా డజను రూ.120కు చేరటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో అల్లాడుతున్న వినియోగదారునికి ఆకాశాన్నంటుతున్న నిమ ధరలు శరాఘాతంగా మారాయి. కొనుగోలుకు వెనుకాడుతున్న ప్రజలు.. కూరల్లో రుచి కోసం, శీతల పానియాలు, తదితరాల్లో విరివిగా వినియోగించే నిమ్మకాయలను ప్రస్తుతం ఆలోచించి అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వినియోగదారులు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదలతో రైతుకు ఊరట లభించినప్పటికీ వినియోగదారులపై మాత్రం అదనపు భారం పడుతుందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా నిమ్మ దిగుబడులు సగానికి పైగా తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లో సరఫరా లేకపోవ టంతో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అంతే కాకుండా పెరిగిన రవాణా, కూలీల ఖర్చు సైతం వినియోగదారునిపైనే పడుతుందని నిమ్మ వ్యాపారులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో 169 ఎకరాలలో సాగు నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో 169 ఎకరాలలో రైతులు నిమ్మసాగు చేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నందిగామ మండలంలో 54 ఎకరాలు, కంచికచర్ల మండలంలో ఎనిమిది ఎకరాలు, చందర్లపాడు మండలంలో 62 ఎకరాలు, వీరులపాడు మండ లంలో 45 ఎకరాల్లో నిమ్మ సాగవుతోంది. సగానికి పైగా నిమ్మ తోటలు రెండేళ్ల నుంచి మూడేళ్ల వ్యవధి వయసుండటంతో దిగుబడులు రావటం లేదు. నిమ్మ ధరలు విపరీతంగా పెరగటంతో వినియోగదారునితో పాటు హోటళ్లు, జ్యూస్ సెంటర్లపై సైతం ప్రభావం పడుతుందని వ్యాపారులు అంటున్నారు. -
కొత్త కేసుల్లేవ్.. అదుపులో డయేరియా
ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణంలో సూపర్ క్లోరినేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉయ్యూరులో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం పర్యటించారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న పలువురు బాధితులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య శిబిరాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. బాధితులకు అందిస్తున్న మందులపై ఆరా తీశారు. ఎస్సీ కాలనీలో పైపులైను మార్పిడి పనులను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యూరులో డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. మొత్తం 22 కేసులు నమోదు కాగా ఇంకా ఐదుగురు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. కొత్త కేసులు నమోదు కాలేదన్నారు. ఆ సమయంలో పైపుల్లో నీటిని వాడొద్దు.. ముందస్తు ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా డయేరియా కేసులు పునరావృతం కాకుండా ఉయ్యూరు పట్టణంలో తాగునీటి సూపర్క్లోరినేషన్ అమలుకు ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ చెప్పారు. వాటర్ ట్యాంకులతో పాటుగా డైరెక్టు పంపింగ్లను సమయం వారీగా అత్యవసరంగా క్లోరినేషన్ చేస్తున్నారన్నారు. ఆ సమయంలో ప్రజలు ఎవరూ పైపుల్లో వచ్చే నీటిని వినియోగించవద్దని సూచించారు. వైద్య సిబ్బందితో ఇంటింటికీ క్లోరిన్ మందులు అందిస్తామన్నారు. అవసరమైన చోట్ల పైపులు మార్పు చేసే పనులు చేపట్టామన్నారు. పట్టణ ప్రజలు అందరూ కాచిచల్లార్చిన నీటిని తాగాలని విజ్ఞప్తి చేశారు. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ లోక్నాథ్ దయాకర్, ఆర్డీఓ కరుణకుమారి, మునిసిపల్ కమిషనర్ సుభాష్చంద్రబోస్, తహసీల్దార్ సురేష్కుమార్, ప్రత్యేకాధికారి డాక్టర్ సాయికిరణ్, వైద్య బృందం పాల్గొన్నారు. ఉయ్యూరులో పర్యటించిన కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ -
దుర్గమ్మ సన్నిధిలో జస్టిస్ మల్లికార్జునరావు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ లోకాయుక్తగా జస్టిస్ టి. మల్లికార్జునరావు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన జస్టిస్ టి. మల్లికార్జునరావును ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ డీఈవో కిషోర్కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను బహూకరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన రెండో ఘాట్రోడ్డు, శివాలయం వద్ద విస్తరణ పనుల నేపథ్యంలో సాంకేతిక బృందం మంగళవారం పరిశీలన చేసింది. దుర్గగుడికి న్యూ ఢిల్లీకి చెందిన మకాఫెర్రి ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్, నాగపూర్కు చెందిన ఎనార్క్ డిజైనర్స్ ఇంజినీర్లు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్న ఇంజినీర్లు కొండపైకి చేరుకునే రెండో ఘాట్రోడ్డు, శివాలయం వద్ద విస్తరణకు ప్రతిపాదించిన ఇళ్లను పరిశీలించారు. వారి వెంట దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఈ ఎల్.రమా, డీఈఈ అశోక్ ఉన్నారు. రెండో ఘాట్రోడ్డు నిర్మాణానికి అంచనా వ్యయంతో పాటు ఎన్ని నెలలో పనులు పూర్తవుతాయి, రహదారి వెడల్పు, కొండ భౌగోళిక పరిస్థితులు, భద్రతా పరమైన అంశాలపై నిపుణుల బృందం చర్చించింది. కొండ ప్రాంతంలో చేపట్టే పనులకు సాంకేతిక బృందం ఇచ్చే నివేదికే కీలకం కానుందని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. -
న్యాయం చేయాలని బాధితుల వినతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాషా అల్లా ఎంటర్ ప్రైజెస్ సంస్థను నమ్మి మోసం పోయామని, తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో బాధితులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంనకు వాణి మాట్లాడుతూ.. మాషా అల్లా ఎంటర్ ప్రైజెస్పై కేసు పెట్టామని, అయితే దర్యాప్తు సమాచారం పోలీసుల నుంచి రావడం లేదన్నారు. తమకు త్వరగా న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత వేడుకుంటున్నామన్నారు. బాధ్యులను పక్కన బెట్టి బాఽధితుల బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఫలితంగా సొంత అవసరాలకు బ్యాంకుల్లో డబ్బు వాడుకోవడానికి కుదరడం లేదన్నారు. మరో బాధితుడు సురేష్ మాట్లాడుతూ.. సంస్థ బోర్డు తిప్పేసిన తర్వాత సీఎం, హోం మంత్రిని కలిశామన్నారు. పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు బహిర్గతం చేయాలని కోరారు. -
మండలి డెప్యూటీ చైర్మన్ మాధవరావుకు సన్మానం
పెదకూరపాడు: ప్రజా సమస్యలపై గళం విని పించే నేత మాధవరావును మండలి డెప్యూటీ చైర్మన్గా నియమించడం అభినందనీయం అని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. మంగళవారం గుంటూరులోని శంకరరావు స్వగహంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాధవరావును ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంక రరావు, అన్నాబత్తున శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవి నేని అవినాష్, చీరాల, అద్దంకి, ఒంగోలు, పెనమలూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాల సమన్వకర్తలు కరణం వెంకటేష్, చింతలపూడి అశోక్కుమార్, చుండూరు రవికుమార్, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
3న టెట్ సమస్యలపై చలో విజయవాడ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ సమస్యలను పరిష్కరించకుంటే సెప్టెంబర్ మూడో తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి. మనోహర్కుమార్ ప్రకటించారు. ప్రభుత్వం విడు దల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్లో ఉపాధ్యాయులకు ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ కుమార్ మాట్లాడుతూ.. 2015లో విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు వివరణ ఇస్తూ చట్టంలో చేర్చిన అంశాల కారణంగా ఉపాధ్యాయ నియామకాలకే గాక, సర్వీసులో కొనసాగాలన్నా, ప్రమోషన్ పొందాలన్నా టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు ఐదు సంవత్సరాల లోపు ఉద్యోగ విరమణ చేసేవారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఉద్యోగోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులు కొన్ని హామీలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టెట్ నిర్వహించడానికి అంగీకారం తెలిపిందన్నారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఉపాధ్యాయుల వినతులను పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుంద రయ్య మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్లో అర్హత మార్కులు తగ్గించాలన్నారు. అనంతరం డీఈఓ, కలెక్టర్ కార్యాలయాల్లో ఆయా అధికారులకు నేతలు వినతిపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు కృష్ణయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి.లీల, జిల్లా కార్యదర్శి షేక్ ప్రైమర్ సాహెబ్, బి.రెడ్స్టార్, ఎం. లలితశ్రీ, నాయకులు ఎ. అనంత కుమార్, అబ్దుల్ హబీ, ఎ.భరత్, ఎం.లింగారెడ్డి, జి.విజయలక్ష్మి, జానకి తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు: మండలంలోని కానూరులో గుర్తు తెలి యని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు మంగ ళవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ రమేష్ కథనం మేరకు.. కానూరు బల్లెంవారివీధిలో రైతుబజార్ వద్ద గుర్తు తెలియని వక్తి మృతి చెందాడు. అతని వయస్సు 45 సంవత్సరాలు ఉంటుంది. అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు 99517 46017 నబర్కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని ఎస్ఐ రమేష్ కోరారు. చిలకలపూడి(మచిలీపట్నం): పింఛన్ బిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యయుతంగా అమలు చేయా లని ఏపీ సీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేటేటి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులందరికీ పాత పింఛన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. కలెక్టరేట్లో సీపీఎస్ ఉద్యోగులతో కలిసి ఉద్యమ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ ఒకటో తేదీన చలో విజయవాడ కార్యక్రమంపై ముద్రించిన వాల్పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనప్పటికీ ఇప్పటి వరకు సీపీఎస్పై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోపు సీపీఎస్ ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీంతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీ సీఎం దాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటో తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు ఎం.వి.శ్యామ్నాథ్, ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.నాంచారయ్య, ఏపీఆర్ఎస్ఏ సీనియర్ నాయకుడు నెల్సన్పాల్బాబు, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు శోభన్బాబు, కిరణ్కుమార్, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వర్షా సోనాకియా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణనాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా ఆమె ప్రత్యామ్నాయ దిశగా స్వయంగా వెదురుతో కుండలను తయారు చేశారు. ఆ వెదురు కుండీల్లో మొక్కలు నాటి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అమరావతి చాంపియన్షిప్ స్టేట్ మీట్కు ఎల్హెచ్ఆర్ క్రీడాకారులు
మైలవరం: అమరావతి చాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలకు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏడుగురు ఖోఖో విభాగంలో, ముగ్గురు వాలీబాల్ విభాగంలో మైలవరం మండలం నుంచి ఎంపికయ్యారని డిస్ట్రక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కోటేశ్వరరావు మంగళవారం తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థినులు ముగ్గురు కూడా ఎంపికయ్యారని పేర్కొన్నారు. తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.మాధవి, పీడీ మేజర్ మన్నే స్వామి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): భార్య చనిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించగా కృష్ణలంక పోలీసులు రక్షించారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా పెదవడ్లపూడికి చెందిన మట్టుపల్లి రాజేష్ విజయవాడ రైల్వే వర్క్ షాప్లో పనిచేస్తున్నాడు. మూడు నెలల కిత్రం అతని భార్య మృతి చెందింది. అప్పటి నుంచి అతను బాధను మరిచిపోలేకపోతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10.20 గంటలకు తన బంధువులకు వీడియో కాల్ చేసి, తనకు బతకాలని లేదని, చనిపోతున్నా నని చెప్పాడు. ఆ బంధువులు 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేష్ రైల్వే ట్రాక్పై ఉన్నట్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న కృష్ణలంక ఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు జానీ, రమణ, హోంగార్డ్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తున్న రాజేష్ను కాపాడి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): సోషల్ మీడియా వేదికగా బాలికకు పరిచయమైన ఓ యువకుడు పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించగా గర్భవతని తేలింది. పోలీసుల కథనం మేరకు.. కొత్తపేట పోలీస్ స్టేషన్ వెనుక రోడ్డు ప్రాంతంలో ఓ బాలిక తన తల్లిదండ్రులతో నివసిస్తోంది. ఆమెకు స్నాప్చాట్ ద్వారా విజయ్ అలియాస్ బబ్లూ అనే యువకుడు పరిచయమయ్యాడు. రోజూ ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ బాలికను ప్రేమిస్తున్నాని నమ్మించాడు. అయితే కొద్ది రోజుల కిందట బాలికను బయటకు తీసుకువెళ్లిన విజయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా పలు మార్లు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. కొద్ది రోజులుగా బాలికకు నలతగా ఉండటంతో తల్లి ఆస్పత్రిలో చూపగా ఆమె గర్భిణి అని వైద్యులు తేల్చారు. బాలికను తల్లిదండ్రులు విచారంచగా విజయ్ వ్యవహారం బయటకొచ్చింది. విజయ్ ఏ ప్రాంతానికి చెందిన వాడు? ఏం చేస్తుంటాడని ప్రశ్నిచగా ఆ వివరాలేవీ తెలియవని బాలిక చెప్పడంతో అందరూ కంగుతిన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కేసును సెక్టార్ ఎస్ఐ కరుణ విచారించగా, విజయ్ ఆచూకీ కోసం వెస్ట్ ఏసీపీ దుర్గారావు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మూలపాడు(ఇబ్రహీంపట్నం): అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మూలపాడు గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామంలోని ఎస్సీ ఏరియాకు చెందిన కట్టా అచ్చయ్య (52) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోసిస్తాడు. భార్య తిరపతమ్మ బయటకు వెళ్లిన సమయంలో అచ్చయ్య ఉరి వేసుకున్నాడు. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చిన తిరుపతమ్మ తన భర్త ఉరివేసుకోవడాన్ని గుర్తించి ఇరుగుపొరుగు వారికి చెప్పింది. కొన ఊపిరితో ఉన్న అచ్చయ్యను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మెడ భాగంలో గాయాలు ఉండటంతో ఆస్పత్రి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టమార్టంనకు తరలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ఓ కుమారుడు ఉన్నారు. -
ఏఐ రోబోటిక్స్పై ఆసక్తి పెంచుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రానున్న రోజుల్లో ఏఐ హ్యూమనాయిడ్ రోబోలను విరివిగా ఉపయోగిస్తారని ఎడుబాటిక్స్ సంస్థ బిజినెస్ మేనేజర్ కె.సందీప్ పేర్కొన్నారు. స్థానిక మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల వెబ్నార్ హాలులో కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ ఏఐ విభాగాలు సంయుక్తంగా ఏఐ హ్యూమనాయిడ్ రోబోటిక్స్పై మంగళవారం వర్క్షాప్ నిర్వహించాయి. సందీప్ రీసోర్స్ పర్సన్గా హాజరై ప్రసించారు. భవిష్యత్లో రోబోల వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు. కొరియా, జపాన్, చైనా దేశాల్లో ఇప్పటికే రోబోలను విరివిగా వినియోగిస్తున్నారని వివరించారు. యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ కోర్సులపై ఆసక్తి పెంచుకుని, నైపుణ్యం సాధించాలని సూచించారు. కళాశాల ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి కె. సాంబశివరావు మాట్లాడుతూ.. రోబోల పని తీరుపై విద్యార్థులకు స్వయంగా అవగాహన కల్పించేందుకు ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నామన్నారు. కళాశాల ఏఐ విభాగాధిపతి ఉదయశ్రీ, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ రాజేష్ సి.జంపాల, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మనోరంజని, అధ్యాపకులు డి.శ్రీనివాసరెడ్డి, జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవల్లో నాణ్యత, కచ్చితత్వం ముఖ్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య సిబ్బందికి సమయ పాలన ఉండాలని, వైద్య సేవల్లో నాణ్యత, కచ్చితత్వం ముఖ్యమని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు పేర్కొన్నారు. పాత ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలోని సమావేశపు హాలులో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని ఏఎన్ఎంలతో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్బాబు మాట్లాడుతూ.. గర్భిణుల్లో ప్రమాద సంకేతా లను ముందుగానే గుర్తించి, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. గర్భిణుల బరువు, రక్తపోటు, హిమోగ్లోబిన్ తదితర అంశాలను సరైన విధానంలో పరీక్షించడం, రికార్డుల్లో ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేయడంపై సిబ్బందికి అవగాహన కలిగించారు. బర్త్ ప్లాన్ను ముందుగానే సిద్ధం చేసుకోవడం, ప్రమాదం ఉన్న గర్భిణులను గుర్తించి సరైన సమయంలో ఆస్పత్రికి రిఫర్ చేయడం, రిఫరల్ సేవల ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతీదేవి, డీఐఓ డాక్టర్ శరత్బాబు, డీపీహెచ్ఎన్ఓ రేణుక, వైద్య సిబ్బంది సుహాసిని, వరలక్ష్మి, అపరంజి, లీలాశ్రీ పాల్గొన్నారు. యూపీహెచ్సీ సేవల పరిశీలన విజయవాడ నగరంలోని కండ్రిక, ప్రకాష్నగర్ యూపీహెచ్సీల్లో అందుతున్న సేవలను మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్బాబు పరిశీలించారు. వైద్యాధికారి, సిబ్బంది ముఖ ఆధారిత హాజరు, డ్రెస్ కోడ్, గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. ఫార్మసీలో స్టాక్ రిజిస్టర్లు, అత్యవసర మందులు లభ్యత, ఓపీ వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అమూల్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్బాబు -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.91 కోట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విధుల బహిష్కరించి 15 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేద రోగులకు ఉపయోగపడేలా బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా 50 మంది జూడాలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా స్టైపెండ్ రివిజన్ ఇంప్లిమెంట్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తొలుత నిరసన శిబిరంలోనే రక్తదానం చేయాలని భావించినా, అనంతరం బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తదానం చేశారు. జూడాలు విధుల బహిష్కరణతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
మార్షల్ ఆర్ట్స్లో కొండపల్లి విద్యార్థికి గోల్డ్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి శాంతినగర్కు చెందిన ఎనిమిదేళ్ల విద్యార్థి కన్నమాల ఇవాన్ రాయేల్ మార్షల్ ఆర్ట్స్లో విశిష్ట ప్రతిభ చాటి అరుదైన గౌరవం పొందాడు. ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన విజన్ మార్షల్ ఆర్ట్స్ తరఫున కరాటే పోటీల్లో పాల్గొని తన విశిష్ట ప్రతిభ కనబరిచాడు. విద్యార్థి ప్రతిభను గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ఈనెల 22న తెలంగాణ షీ పవర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మెడల్ ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, సినీ హీరో మహేష్ బాబు సతీవణి నమ్రత శిరోద్కర్, 9వ నిజాం రాజా వంశానికి చెందిన నవాబ్ రౌనక్ ఖాన్ లాంటి ప్రముఖులు ఇవాన్ను ఘనంగా సన్మానించి గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందజేశారు. ఇవాన్ను పలువురు అభినందించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్కూటీతో ఆవును ఢీ కొట్టడంతో తలకు గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హోం గార్డ్ మృతి చెందిన ఘటన భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. భవానీపురం హెచ్బీ కాలనీ ఓల్డ్ ఎంఐజీకి చెందిన తంగెళ్లమూడి రాజశేఖర్(48) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈనెల 16వ తేదీ ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి స్కూటీపై డ్యూటీకి బయలుదేరాడు. స్వాతి రోడ్డులో కేఎఫ్సీ వరకు వెళ్లే సరికే అకస్మాత్తుగా ఆవు రోడ్డుపైకి వచ్చింది. ఎదురుగా వస్తున్న ఆవును ఢీకొట్టడంతో కింద పడిపోయి తలకు బలమైన గాయమైంది. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో సిబ్బంది గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యారావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అతని భార్య శ్రీలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవును నిర్లక్ష్యంగా రోడ్డుపైకి వదిలిన యజమానిపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరారు. మచిలీపట్నంఅర్బన్: కాంట్రాక్టు మెడికల్, పారా మెడికల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా జేఏసీ నాయకులు, వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 24 నుంచి 27వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలుపుతామన్నారు. ఆగస్టు 28, 29 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆన్లైన్ విధుల బహిష్కరణ కార్యక్రమం, సెప్టెంబర్ 6న ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద, 7న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కూడా ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోతే సెప్టెంబర్ 8 నుంచి జేఏసీ నిర్ణయం మేరకు విధుల బహిష్కరణకు దిగుతామని హెచ్చరించారు. జిల్లా జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
సామాన్యులకు ధరాఘాతం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..’ అన్నట్లుగా సామాన్యుల పరిస్థితి దిగజారింది. కూటమి ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. రోజు రోజుకూ ఆకాశానికి ఎగబాకుతున్న ధరలు సగటు ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతు న్నాయి. ఒకటి కాదు రెండు కాదు ప్రధాన నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగడంతో వాటిని కొనుగోలు చేయాలంటేనే జంకుతున్నారు. బియ్యం, వంట నూనె, కంది పప్పు, మినప్పప్పు ధరలను వింటేనే సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. బియ్యం ధరలన్నా అందుబాటులో ఉంటే పచ్చడి మెతుకులతోనైనా ఆకలి తీర్చుకునేవారిమని వాపోతున్నారు. రెట్టింపైన బియ్యం ధరలు రైతుల నుంచి ధాన్యం నిల్వలు మొత్తం వ్యాపారుల చేతిలోకి వెళ్లాయి. దీంతో బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మరో వైపు వరి సాగు చేయొద్దని చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సూచించడంతో బియ్యం ధరలు మరింత పెరిగాయి. 2024వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో కర్నూల్ సోనామసూరి బియ్యం కిలో ధర రూ.40 నుంచి రూ.42 మధ్య పలికింది. కొన్ని ప్రాంతాల్లో రూ.45 వరకు విక్రయించారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో బియ్యం కొనాలంటే రూ.70 నుంచి రూ.80 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రైతు బజారులు, ప్రత్యేక కౌంటర్లలో కిలో సన్న బియ్యం రూ.52 చొప్పున విక్రయిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ప్రకటించినా అన్ని చోట్లా అమలు కావడంలేదని ప్రజలు పేర్కొంటున్నారు. పప్పులు.. వంట నూనెలదీ అదే పరిస్థితి ఇతర నిత్యావసరాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. మార్కెట్లో పామాయిల్ లీటర్ రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. వేరుశనగ, సన్ఫ్లవర్ నూనెలు కంపెనీలను బట్టి లీటరు ప్యాకెట్ ధరు రూ.175 నుంచి రూ.195 వరకూ పలుకుతోంది. 2024వ సంవత్సరం ఏప్రిల్లో వీటి ధరలు కేవలం రూ.95 నుంచి రూ.105 మధ్యే ఉన్నాయి. ప్రస్తుత నూనెల ధరలు వింటేనే సామాన్యుల గుండె గుభేలుమంటోంది. ఇక ఎండుమిర్చి ధర అమాంతం పెరిగింది. మార్కెట్లో మంచి కాయ కావాలంటే కిలోకు రూ.350 నుంచి రూ.400 వెచ్చించాల్సిందే. పంచదార ధర మొన్నటి వరకూ మార్కెట్లో రూ.40 నుంచి రూ.45 మధ్యనే కొనసాగింది. ఇప్పుడు దాని ధర రూ.70లకు పైగా ఎగబాకింది. కొన్ని మాల్స్లో విడి పంచదార రూ.65 చొప్పున విక్రయిస్తుండగా బయట మార్కెట్లో మాత్రం రూ.74 వరకూ వసూలు చేస్తున్నారు. కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి సాధారణంగా ప్రతి వంటలోనూ పెద్ద ఉల్లిపాయలు తప్పని సరి. పెరిగిన ధరలతో ఉల్లివాడకాన్ని మానుకోవాల్సి వచ్చిందని, రెండు మూడు పాయలు వాడాల్సిన కూరలో ఒకటీ అర వాడి సరి పెడుతున్నామని మహిళలు పేర్కొంటున్నారు. 2024వ సంవత్సరంలో కిలో ఉల్లిపాయలు ధర రూ.15 నుంచి రూ.18 మధ్య ఉండేది. నేడు అమాంతం పెరిగి రూ.60 దాటింది. రైతు బజా ర్లో కిలో రూ.47 చొప్పున విక్రయిస్తున్నా నాణ్యత అంతగా ఉండటంలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. చేసేదేమీ లేక మార్కెట్లోనే కొనుగోలు చేస్తున్నారు. రిటైల్ మార్కెట్లో కిలో రూ.64 చొప్పున విక్రయిస్తున్నారు. శుభకార్యాల ఇంట మరింత భారం ప్రస్తుతం శ్రావణమాసం కావటంతో వివాహాల జోరు పెరిగింది. ఈ నెల చివరి వరకు వివాహాలు ఇతర శుభకార్యాలు చేసుకోవటానికి అనువైన ముహూర్తాలు ఉన్నాయి. దీంతో చాలా మంది శుభకార్యాలను తలపెట్టారు. అయితే పెరిగిన ధరలు భారంగా మారాయని వారు వాపోతు న్నారు. బంధు మిత్రులు అందరినీ ఆహ్వానించి ఘనంగా చేసుకోవాలని తొలుత అనుకున్నా ఇప్పుడు దగ్గరి వారిని మాత్రమే శుభకార్యాలకు పిలవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ధరల పెరుగుదల భారీగా ఉన్నా, సామాన్యులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ప్రజానీకం మండిపడుతోంది. ధరలను అదుపు చేయాల్సిన పాలకులు చోద్యం చూడటం ఏమిటని ప్రశ్నిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ శాఖలు పెరిగిన ధరలను అదుపు చేసేందుకు ఏమాత్రం స్పందించకపోవటంపై అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. రైతుబజార్ తదితర ప్రాంతాల్లో మిల్లర్ల సాయంతో రూ.52 చొప్పున సన్న బియ్యం విక్రయిస్తున్నామని పాలకులు హడావుడీ చేసినా అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.విజయవాడ భవానీపురానికి చెందిన సుబ్రహ్మణ్యం దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వన్టౌన్లోని ఒక దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం నెల జీతం రూ18 వేలు. బియ్యం, నూనెలు, కూరగాయలు ఇతర నిత్యావసర ధరలు పెరగటంతో నలుగురు ఉన్న తమ కుటుంబంపై రూ.6 వేల వరకూ అదనపు భారం పడిందని ఆయన తెలిపారు. అప్పారావు అనే కార్మికుడు సైతం నెలకు రూ.15 నుంచి రూ.16 వేలు సంపాదిస్తున్నాడు. ఆ కుటుంబంపైనా అదే పరిస్థితి ఉంది. ప్రధాన నిత్యావసరాల ధరలు 2024 ఏప్రిల్ (కిలోధర) 2026 ఆగస్టు (కిలోధర) సన్న బియ్యం రూ.40 నుంచి రూ.45 రూ.70 నుంచి రూ.80 వంట నూనెలు రూ.90 నుంచి రూ.105 రూ.170 నుంచి రూ.195 పంచదార రూ.38 నుంచి రూ.40 రూ.68 నుంచి రూ.74 ఉల్లిపాయలు రూ.15 నుంచి రూ.18 రూ.55 నుంచి రూ.65 ఎండుమిర్చి రూ.140 నుంచి రూ.150 రూ.350 నుంచి రూ.400 -
సీల్డు కవరులో నీటి పరీక్షల నివేదిక!
● ఉయ్యూరులో కొత్తగా మూడు డయేరియా కేసులు ఉయ్యూరు: మండల కేంద్రమైన ఉయ్యూరులో డయేరియా ప్రబలడానికి గల అసలు కారణాలు వెల్లడించటంలో జాప్యం కొనసాగుతోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో అతిసార వ్యాపించి వారం గడుస్తున్నా నీటి, ఆహార పదార్థాల పరీక్షల నివేదికలు సీల్డు కవరులో భద్రంగా ఉంచారు. స్థానిక ప్రజలు తాగునీటి కలుషితంగానే వాంతులు, విరేచనాలు బారిన పడ్డామని బాహాటంగానే చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పరామర్శిం చిన క్రమంలోనూ బాధితులు తాగునీటి కలుషితం సమస్యను స్పష్టంచేశారు. నీటి శ్యాంపిల్స్ను గుడివాడ, గుంటూరు ల్యాబ్లకు పంపామని మంత్రి నారాయణ మొదలు వైద్య, ఆరోగ్య శాఖ జేడీ అర్జున రావు వరకు చెప్పారు. సోమవారం నమూనా పరీక్షల ఫలితాలు వస్తాయని జేడీ అర్జునరావు ఆది వారం ఉయ్యూరులో పర్యటించిన క్రమంలో మీడియాకు వెల్లడించారు. మునిసిపల్ మంత్రి నారాయణ మాత్రం గుంటూరులో పరీక్షలు చేయటం పూర్తయిందని, మరింత లోతైన పరిశీలనకు చైన్నె పంపామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులు క్రితం ఉయ్యూరు పట్టణం అంతటా ఆహార తని ఖీలు చేపట్టారు. ఈ తనిఖీల నివేదికలూ గోప్యంగానే ఉన్నాయి. అతిసార వ్యాప్తికి నీటి కలుషితం కారణమా లేక ఆహార పదార్థాల కలుషితమా?, వాతావరణంలో మార్పులా? అనేది ఇంత వరకూ నిర్ధారించలేదు. కొనసాగుతున్న ప్రత్యేక డ్రైవ్ డయేరియా ప్రబలిన నేపథ్యంలో పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. వాటరు పైపులైన్ల మార్పు పనులు ముమ్మరం చేశారు. మునిసిపాలిటీకి సంబంధించిన 85 మందితో పాటుగా మరో 50 మంది కార్మికులను నియమించి డ్రెయిన్లలో పూడికతీత పనులు, శానిటేషన్ పనులు చేపడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్చంద్రబోస్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. పది బృందాలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి. డీఎంహెచ్ఓ డాక్టర్ దయాకర్ సర్వే, శిబిరాలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం మసీదు ఎదురు రోడ్డు, పోలీసుస్టేషన్ ఎదురు రోడ్లలో ముగ్గురు అతిసార బారిన పడ్డారు. వారిలో ఒక్కరే ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం వెళ్లారు. అక్కడకక్కడా డయేరియా లక్షణాలు కనిపిస్తుండటంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్కు సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ముసునూరులో జరగనున్న నూతన పాప్కార్నికా సీడ్ ఆవిష్కరణలో పాల్గొనేందుకు ఆయన న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9.45 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొలుసు పార్థసారథి పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఏలూరు రేంజ్ డీఐజీ జి.వి.జి.అశోక్కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, బోడె ప్రసాద్, వర్ల కుమార్రాజా, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఉప రాష్ట్రపతి రోడ్డు మార్గంలో ముసునూరు బయలుదేరి వెళ్లారు. ఆ పర్యటనను పూర్తిచేసుకున్న ఉప రాష్ట్రపతి మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గవర్నర్ అబ్దుల్నజీర్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారా లోకేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు. ఉప రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఎస్ఐ, ఇద్దరు సిబ్బందిపై ఉన్నతాధికారులు శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు. దుర్గాపురం వద్ద హెచ్సీఎల్లో పనిచేసే ఉద్యోగిని క్యాంపస్లోకి వెళ్లేందుకు జాతీయ రహదారి సెంట్రల్ డివైడర్పై నిలబడి ఉంది. ఆమెను గమనించిన ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు అక్కడ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐతో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉయ్యూరు టౌన్ ఎస్ఐ ప్రతాప్రెడ్డిని వీఆర్కు పంపిస్తూ, మచిలీపట్నంనకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వడ్డికాసులను హనుమాన్ జంక్షన్, కానిస్టేబుల్ బాలాజీని గన్నవరం పోలీస్స్టేషన్లలో రిపోర్ట్ చేయాలని ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశించారు. -
పోలీస్ పీజీఆర్ఎస్లో 94 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 94 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్య తెలుసుకుని సంబంధిత ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా వచ్చిన ఫిర్యాదుల్లో ఆస్తి, భూ వివాదాలకు సంబంధించి 36, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 4, వివిధ మోసాలపై 10, మహిళా సంబంధిత నేరాలపై 9, కొట్లాటలపై 5, దొంగతనాలపై 5, వివిధ ఇతర సమస్యలపై 25 ఫిర్యాదులు వచ్చారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నూర్బాషా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓ రసూల్ సాహెబ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం నూర్బాషా ముస్లింలను విస్మరిస్తోందని నూర్బాషా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓ రసూల్ సాహెబ్ ఆరోపించారు. సోమవారం విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూర్బాషా సంక్షేమానికి ఏటా రూ.100కోట్లు కేటాయిస్తామని కూటమి హామీ ఇచ్చిందన్నారు. మేనిఫెస్టోలోనూ చేర్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా నూర్బాషాలకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మైనార్టీ మంత్రి, సంబంధిత శాఖల అధికారుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు సమర్పిస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడన్నారు. సెప్టెంబర్ 27లోగా నూర్బాషాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లకు కలిపి రూ.200కోట్లు కేటాయించాలన్నారు. లేని పక్షంలో విజయవాడ నగరంలోని మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపడతానన్నారు. నూర్బాషా సంఘం నేతలు షేక్సైదు బాజీ, డీఎం సుభాని, షేక్ హసన్ వలి పాల్గొన్నారు. మచిలీపట్నంటౌన్: మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని ఈనెల 26వ తేదీ బుధవారం ఘనంగా నిర్వహించేందుకు నగరంలోని ముస్లింలు సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని నాగ పోతరావు సెంటర్ నుంచి చింత చెట్టు సెంటర్ వరకు ఉన్న ప్రధాన రహదారిలో విద్యుత్ దీపాలతో భారీ పందిరిని ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని సెంటర్ రివైడర్లలో ఉన్న స్తంభాలకు, కోనేరు సెంటర్ సర్కిల్ చుట్టూ జెండాలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఆరోజు జగత్ ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ముస్తఫా జన్మదినం సందర్భంగా సాయంత్రం 4.30 గంటలకు నగరంలోని జామియా మసీదు నుంచి పవిత్ర ఊరేగింపు జరుగుతుందని స్థానిక ముస్లిం పెద్దలు సోమవారం ప్రకటించారు. ఈ ఊరేగింపు కొత్త మసీదు మీదుగా మంజుమన్, జవ్వారుపేట, హస్మీరజా మసీద్, ఎస్పీ బంగ్లా, టాక్సీ స్టాండు మీదుగా కోనేరు సెంటర్ కు చేరుతుందన్నారు. అనంతరం పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన మత గురువుల ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందన్నారు. నున్న(విజయవాడరూరల్): నున్న గ్రామంలో నివాసం ఉంటున్న ఎన్డీఆర్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ భార్య దీపాలి గోపాల్ పరదేశి(39)ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వీఆర్ఏ పల్నాటి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నున్న పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు, నున్న ఏఎస్ఎం కాలేజి రోడ్డులో ఎన్డీఆర్ఎఫ్ హెడ్కానిస్టేబుల్ గోపాల్ పరదేశి(మహారాష్ట్ర) కుటుంబం కేడీఎస్ ప్రసాద్ ఇంట్లో అద్దెకు ఉంటోంది. గోపాల్ భార్య దీపాలి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం దీపాలి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొంది. భర్త, ఇద్దరు పిల్లలు(పాప, బాబు) డీమార్ట్కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంలో తలుపులు వేసి ఉండటాన్ని గమనించి హెడ్కానిస్టేబుల్, స్థానికుల సహాయంతో తలుపులను పగులగొట్టి చూడగా దీపాలి ఉరి వేసుకొని ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయింది. వీఆర్ఏ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలుషిత తాగునీరే కారణం
● కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీకి వివరించిన డయేరియా బాధితులు ● ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో డయేరియాపై సమీక్ష ఉయ్యూరు: కలుషిత తాగునీటి వల్లే డయేరియా బారిన పడి ఆస్పత్రి పాలయ్యామని డయేరియా బాధితులు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి మొరపెట్టుకున్నారు. ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం సందర్శించారు. డయేరియా లక్షణాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆహారం, తాగునీరు స్వీకరణ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఉన్న బాధితులు, వారి కుటుంబ సభ్యులు కలెక్టర్ ఎదుట తమ ఆవేదన వెలిబుచ్చారు. పైపులైన్లలో వచ్చే నీటిని తాగుతున్నామని, మురుగునీరు పైపులైన్లలో కలవటంతో వాసన వస్తోందని, ఆ నీటిని తాగే వాంతులు, విరేచనాలు బారిన పడ్డామని వాపోయారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. మెరుగైన సేవలు.. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ సూచించారు. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఇంటింటి సర్వే సమర్థంగా చేపట్టి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఉయ్యూరులో డయేరియా పరిస్థితిపై ఆస్పత్రిలోని ఓ గదిలో అధికారులకు క్లాస్ తీసుకున్నారు. అదుపులో డయేరియా.. డయేరియా అదుపులోనే ఉందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో డయేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. కొత్త కేసులు పెద్దగా నమోదు కాలేదన్నారు. మంగళవారం డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పర్యటించి ప్రక్షాళన చర్యలు చేపడతామన్నారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తోందన్నారు. డీఎంహెచ్ఓ లోక్నాథ్ దయాకర్, డీసీహెచ్ఎస్ శేషుకుమార్, ఆర్డీఓ కరుణకుమారి, మునిసిపల్ కమిషనర్సుభాష్ చంద్రబోస్, తహసీల్దార్ సురేష్కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్పై ఒడిశా టు కంకిపాడు..
కంకిపాడు: కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలోని ఖాళీ స్థలాల్లో తనిఖీలు చేపట్టి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు బాలలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 7.125 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీసుస్టేషన్లో గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర వివరాలను వెల్లడించారు. ఒడిశా నుంచి బైక్పై.. కంకిపాడు పోలీసులకు అందిన సమాచారం, ఈగల్ టీమ్ సహకారంతో ఈనెల 23వ తేదీ రాత్రి పునాదిపాడు పంచాయతీ పరిధిలోని ఉలవచారు కంపెనీ వద్ద గల ఖాళీ స్థలాల్లో తనిఖీలు చేపట్టారు. గంజాయి కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకు న్నారు. వారు ఇచ్చిన సమాచారంతో పునాదిపాడు–ఉప్పలూరు రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని ఖాళీ స్థలాల్లో మరో ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పునాదిపాడు గ్రామానికి చెందిన కొండూరు బాబూ రాజేంద్రప్రసాద్, దొండ పాటి శరణ్, నందిపాముల విజయ్కుమార్, కంకిపాడుకు చెందిన యడ్ల దుర్గాప్రసాద్లను సోమవారం అరెస్టు చూపారు. మిగిలిన ముగ్గురు బాలలు కావటంతో పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు. మన్యం జిల్లా సీలేరు, ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి బైక్పై గంజాయి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బైక్ దొంగతనం కూడా.. ఈ ప్రాంతానికి తీసుకువచ్చిన గంజాయిని విక్రయించేందుకు వీరు బైక్లను దొంగతనం చేశారు. వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన మూడు బైక్లతో పాటుగా సొంత బైక్పై గంజాయిని తీసుకెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయికి బానిసలుగా తయారై అదే మార్గాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. నిందితుల వద్ద నుంచి 7.125 కిలోల గంజాయి, ఐదు ఫోన్లు, ఒక సొంత బైక్, మూడు చోరీ చేసిన బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో బండారు శేషగిరిబాబు, సుబ్బు పరారయ్యారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు సాగిస్తున్నారు. కేసులో ప్రతిభ చూపిన సీఐ బీబీ రవికుమార్, ఎస్ఐ కేవై దాసు, హెచ్సీ పి.ప్రసాద్, పీసీలు సయ్యద్ బాజీబాబు, పీఎస్ఎన్ మూర్తి, ఎస్.అశోక్, జి.రామకృష్ణలను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. -
ప్రజల సంతృప్తే అసలైన కొలమానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారం కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ప్రతిబింబిస్తేనే లక్ష్యం నెరవేరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. అర్జీల పరిష్కారానికి ప్రజల సంతృప్తే అసలైన కొలమానమని స్పష్టంచేశారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు సత్వర, నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. తీసుకున్న చర్యలు, పరిష్కారం వివ రాలు స్పష్టంగా ఉండేలా ఎండార్స్మెంట్లు రూపొందించాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు సహా సంబంధిత అధికారులు ఆన్లైన్ సమీక్షలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా, ఫిర్యాదుల పరిష్కారంలో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని కోరారు. మొత్తం 192 అర్జీలు పీజీఆర్ఎస్లో మొత్తం 192 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 66, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 52, పోలీసు శాఖకు 22 అర్జీలు అందాయి. పంచాయతీ రాజ్కు 17, వైద్య ఆరోగ్యం, స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు శాఖలకు ఆరు చొప్పున. వ్యవసాయం, ప్రజా రవాణా, కాలేజీ విద్య, పాఠశాల విద్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రహదారులు, భవనాల శాఖలకు రెండు చొప్పున, విద్యుత్, పౌర సరఫరాలు, సహకార, అటవీ, ఆర్ఐఓ, గ్రామీణ నీటిసరఫరా, గిరిజన సంక్షేమం, ఇతర శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జెడ్పీ సీఈఓ జె.అరుణ, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జె.జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ బీసీ కార్యకర్తపై దాడి
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన హనుమాన్జంక్షన్రూరల్: బాపులపాడు మండలం మల్లవల్లిలో బీసీ సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బొల్లిగర్ల కోటేశ్వరరావుపై అదే పార్టీకి చెందిన నాయకుడు, తన అనుచరులతో అర్ధరాత్రి సమయంలో దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ఓ పోలీస్ కేసులో చిక్కుకోవటంతో దాన్ని సెటిల్మెంట్ చేసేందుకు గ్రామానికి చెందిన టీడీపీ నేత అక్కినేని పరమేశ్వరరావు రూ.60వేలు ముడుపులు చెల్లించాలని తనను డిమాండ్ చేశారని బొల్లిగర్ల కోటేశ్వరరావు ఆరోపించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై వీరవల్లి పోలీస్స్టేషన్లో జరిగిన పంచాయతీలో రూ.35వేలు లంచం ఇచ్చానని, కానీ తనపై పగతో అప్పటి నుంచి పరమేశ్వరరావు కాలు దువ్వుతున్నారని కోటేశ్వరరావు వాపోయాడు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం కూడా రేమల్లే సమీపంలో బైక్పై వెళ్తుండగా నలుగురు యువకులు ఆపి తనపై దాడి చేశారని, దీంతో భయపడి అప్పటి నుంచి గ్రామం విడిచి నున్నలో తలదాచుకుంటున్నానని చెప్పాడు. అర్ధరాత్రి బీరు బాటిళ్లతో దాడి.. ఈ నెల 22వ తేదీన మల్లవల్లి రావటంతో సమాచారం అందుకున్న అక్కినేని పరమేశ్వరరావు, ఆయన అనుచరులతో మధ్యాహ్నం సమయంలో తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని బాధితుడు ఆరోపించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తమ ఇంటిపై మద్యం తాగిన ఆ యువకులు దాడి చేసి, బీరు బాటిళ్లతో తలపై బలంగా కొట్టారని కోటేశ్వరరావు చెప్పారు. తీవ్రంగా గాయపడటంతో వీరవల్లి పోలీసులకు సమాచారం అందించానని, వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్లో గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారని తెలిపారు. ఈ దాడి ఘటనపై వీరవల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. తనకు మల్లవల్లికి చెందిన టీడీపీ నాయకుడు అక్కినేని పరమేశ్వరరావు నుంచి ప్రాణహాని ఉందని, మళ్లీ స్వగ్రామం వెళ్లాలంటే భయంగా ఉందని బొల్లిగర్ల కోటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి కోటేశ్వరరావుపై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వ పాలనలో సామాన్యుడు బతికే పరిస్థితి పూర్తిగా కరువైందని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయంటూ నానా యాగీ చేసిన కూటమి నాయకులు, నేడు మార్కెట్లో ధరలు ఇంత దారుణంగా పెరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు పూట గడవక తీవ్ర అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బజార్లలో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువవడంతో దళారులు వ్యవస్థను తమ గుప్పెట్లోకి తీసుకుని, కూరగాయల ధరలను విపరీతంగా పెంచేస్తూ వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. దానిపై వెళ్తున్న భార్య దుర్మరణం.. భర్తకు తీవ్రగాయాలు గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొట్టిన ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని గుంటుపల్లి సెంటర్లో 65వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నంకు చెందిన నందం బాలగంగాధరరావు, ఆయన సతీమణి నిర్మల జ్యోతి(56) స్థానిక ఖాజీపేటలోని అంజనీ గ్రీన్పార్క్ అపార్ట్మెంటులో నివాసం ఉంటున్నారు. వారి అబ్బాయి, అమ్మాయి ఇతర రాష్ట్రాల్లో సెటిలై ఉంటున్నారు. వెనుక నుంచి ఢీకొట్టి.. భార్యాభర్తలు విజయవాడలో నిర్వహిస్తున్న బంగారం దుకాణానికి ప్రతిరోజు మాదిరిగా స్కూటీపై బయలుదేరారు. ఓ కిలోమీటర్ దూరం ప్రయాణించే సమయానికి గుంటుపల్లి సెంటర్లో వెనుకవైపు నుంచి వచ్చిన కంటైనర్ లారీ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై నుంచి కిందపడిన నిర్మల జ్యోతి తలమీదుగా లారీ చక్రాలు వెళ్లడంతో తల, ముఖం నుజ్జునుజ్జు అయ్యింది. లారీ టైర్లు దాటిన తర్వాత ఆమె పక్కనే పడిన భర్త బాలగంగాధరరావు తీవ్రమైన గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. అపరస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను పోలీసులు గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న కొందరు యువకులు బైకులతో వెంబడించి గ్రామం చివరన ఉన్న సీఏ కన్వెన్షన్ వద్ద అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో భారీగా నిలిచిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించారు. సెక్టార్ ఎస్ఐ సత్యవతి నిర్మల జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పద్మశ్రీతో మరింత కీర్తి..
మృదంగ విద్వాంసురాలు సుమతీ రామ్మోహనరావు(ఫైల్) విజయవాడ కల్చరల్: ఆడపిల్లలు గడపదాటకూడదన్న ఆ కాలంలోనే మృదంగంపై అంతులేని ప్రేమతో విద్య నేర్చుకున్నారు విజయవాడకు చెందిన దండమూడి సుమతీ రామ్మోహనరావు. పురుషాధిక్య వాద్య ప్రపంచంలో తన అద్భుత ప్రతిభతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకూ మృదంగంపై ఆమె చేతి వేళ్లు నాట్యమాడుతూనే ఉన్నాయి. అనేకమంది యువ మృదంగ కళాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నాయి. బాల్యంలోనే లయతో అనుబంధం.. 1950 అక్టోబర్ 16న జన్మించారు. ఆమెకు తొలిగురువు తండ్రి నిడుమోలు రాఘవయ్య. అనంతరం ఆమె మృదంగ విద్వాంసుడు దండమూడి రామ్మోహనరావు వద్ద మృదంగ విద్యలో ఆయన వద్ద నుంచి పుదుక్కోటై సంప్రదాయంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆయననే వివాహం చేసుకున్నారు. భరతనాట్యంలోనూ గౌరవ విభాగంలో డిప్లొమా పూర్తి చేశారు. దేశంలోనే అరుదైన ఏ టాప్ గ్రేడ్ దంపతులుగా ఖ్యాతిని పొందారు. రామ్మోహనరావుతో కలసి దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. సోలో ప్రదర్శనలో ప్రత్యేక గుర్తింపు.. సుమతి కేవలం కచేరీల్లో వాద్య సహాయకురాలిగానే నిలిచిపోలేదు. సోలో ప్రదర్శనలు ఇస్తూనే.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగీత విద్వాంసులకు వాద్య సహకారం అందించారు. గురువుగా మరో సంచలనం.. కళాకారిణిగా సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా అనేకమంది మృదంగంలో శిక్షణ నిచ్చారు. దండమూడి రామ్మోహనరావు లయ వేదికను స్థాపించి రామ్మోహనరావును స్మరించుకుంటూ శత మృదంగ నివాళి కార్యక్రమం నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రామ్మోహనరావు విగ్రహం ఏర్పాటు చేశారు. పురస్కారాలకే వన్నె తెచ్చిన సుమతి.. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి 1974, 1976 సంవత్సరాలలో బెస్ట్ మృదంగిస్ట్ పురస్కారం లభించింది. 2008లో న్యూ ఢిల్లీకి చెందిన ఇంటర్ నేషనల్ పబ్లిషింగ్ హౌస్ నుంచి బెస్ట్ సిటిజన్, 2009లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్న తొలి మృదంగ కళాకారిణి కావడం విశేషం. వివిధ సాంస్కృతిక సంస్థలు మృదంగ శిరోమణి, మృదంగ లయ విద్యాసాగర, నాద భగీరథ, సునాద సుధానిధి, నాద మృదంగ విద్వన్మణి తదితర బిరుదులతో సత్కరించాయి. సుమతీ రామ్మోహనరావు సంగీత సేవలను గుర్తించి 2021లో పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. 2022లో లోక్ సభలో పద్మశ్రీ గ్రహీతల ముఖాముఖీలో పాల్గొని అప్పటి స్పీకర్ అభినందించడం మరచిపోలేని అనుభూతి అని ఆమె వినయంగా చెప్పుకుంటారు. ఏడేళ్ల వయస్సులో సంగీత యాత్ర ప్రారంభించా. మృదంగ విద్వాంసుడు రామ్మోహనరావు ఆశీర్వాదంతో సంగీతంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నా. మా కుటుంబంలో సంగీతం వారసత్వంగా వస్తోంది. మృదంగం మీద అభిమానంతో నాదంపై పట్టు సాధించా. మహిళలు అన్ని రంగాలలోనూ రాణించగలరు. కృషి చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. – సుమతీ రామ్మోహనరావు, మృదంగ విద్వాంసురాలు -
4న దుర్గగుడిలో సామూహిక వరలక్ష్మి వ్రతం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం నాల్గో శుక్రవారాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ నాలుగో తేదీన దుర్గగుడిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తున్నట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు. ఆ రోజు మల్లికార్జున మహామండపం ఆరో అంత స్తులో ప్రత్యేక వేదికపై అమ్మవారిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదే ప్రాంగణంలో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రత్యేక ఆర్జిత సేవగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ.1500 టికెటు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే ఉభయదాతలకు అమ్మవారి కుంకుమ ప్రసాదం, శేషవస్త్రం, రవిక ముక్క, పెద్ద లడ్డూ, పూర్ణాలు, గాజులు అందజేస్తారు. అదే రోజు ఉదయం పది గంటల నుంచి 11.30 గంటల వరకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. వ్రతం అనంతరం భక్తులకు రూ.300 క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, శానిటేషన్ వర్కర్లకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని ఇఫ్టూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే మీరావలి ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్కర్లకు జీతాలు ఇవ్వాలని కోరుతూ ఇఫ్టూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో పనిచేసే వర్కర్లు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెల్లించే రూ.6 వేలను కూడా నెల నెలా ఇవ్వడం లేదన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని పర్మ నెంట్ చేయాలని, సదుపాయాలు కల్పించా లని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో డీఈఓ చంద్రకళకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కొప్పుల కుమార్, జిల్లామహిళా సంఘం అధ్యక్షురాలు ఎస్కే ఆసియా బేగం, కె.లక్ష్మి, కౌసల్య, ప్రేమ జ్యోతి, లక్ష్మి దీపిక, సువార్త, జ్యోతి, అంజలి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): నగరంలోని అంబేడ్కర్ ఉద్యానవనంలో ఒక అలంకార చెట్టుపై అరుదైన పరాన్నజీవి మొక్కను ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సీహెచ్. శ్రీనివాసరెడ్డి సోమవారం గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మొక్కను స్థానికంగా బదనిక, వదనికి, వజనిక, ఎలింగ, జిద్దూ వంటి పేర్లతో పిలుస్తారని, దీని శాసీ్త్రయ నామం డెండ్రోపోయి ఫాల్కాటా అని తెలిపారు. ఉద్యాన వనంలోని టెర్మినాలియా మంటలీ అనే అలంకార చెట్టును పరిశీ లిస్తున్న సమయంలో ఈ మొక్కను గుర్తించా మన్నారు. ఆకుపచ్చని కొమ్మలు, ఆకులు ఆకర్షణీయమైన ఎరుపు రంగు పుష్ఫగుచ్ఛాలతో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుందన్నారు. ఇది సాధారణ మొక్కల మాదిరిగా పూర్తిగా నేలపై ఆధారపడి పెరగదని, చెట్ల కొమ్మలపై పెరుగుతూ, తనకు అవసరమైన నీరు, ఖనిజ లవణాల్లో కొంత భాగాన్ని ఆ చెట్ల నుంచి పొందుతుందని వివరించారు. అయితే ఆకుపచ్చ ఆకులు ఉండటం వల్ల తన ఆహారాన్ని తానే తయారు చేసుకోగల పాక్షిక కాండ పరాన్నజీవి మొక్కగా దీనిని పరిగణిస్తారని వివరించారు. -
డెల్టాలో పంటలను బతికించే బాధ్యత ప్రభుత్వానిదే
నాగాయలంక: కృష్ణాడెల్టాలో పంటలను బతికించే బాధ్యత కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వానిదేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పేర్కొన్నారు. పగబట్టిన రీతిలో వరి పంటను చంపేద్దామనే ధోరణిలోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని మండిపడ్డారు. నాగాయలంక డిస్ట్రిబ్యూటరీ కమిటీ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డీసీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు బీసాబత్తుని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రమేష్బాబు మాట్లాడుతూ.. ఎగువున పులిచింతల, పట్టిసీమలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలతో దమ్ముగా మాట్లాడి సాగునీరు తీసుకు రావాల్సిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నీటిపారుదల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు అబద్ధాల కోరుగా మారారని విమర్శించారు. ప్రభుత్వం, అధికారుల తీరుతో కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల్లో వ్యవసాయం కష్టాల్లో పడిందన్నారు. బర్రంకుల పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కమతం నాంచారయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, సాగునీటి కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల రైతువిభాగం అధ్యక్షుడు బీమా బాబూరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు తోట సాయిబాబు మాట్లాడుతూ.. రైతుల్లో సమైక్యత లేకపోతే కష్టాలపాలు కాక తప్పదన్నారు. ఈ సంద ర్భంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్బాబు -
ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కృషి
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చడానికి కృషి చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు అన్నారు. దేశంలో యువతను నాశనం చేసేందుకు పాకిస్థాన్ డ్రగ్స్ అనే పంజాను విసురుతోందని, ఈ కుట్రలను భగ్నం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఏపీ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్) చీఫ్, ఐజీపీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయిపై యుద్ధంలో భాగంగా అజిత్సింగ్నగర్లోని సెయింట్ ఆన్స్ స్కూల్ ఆవరణలో ‘ఈగల్ చాలెంజ్’ కార్యక్రమం ఆదివారం జరిగింది. రవికృష్ణ మాట్లాడుతూ.. దేశానికి యువతే బలమని.. ఆ బలాన్ని బలహీన పరిచేందుకు శత్రుదేశాలు డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలను ఎరగా వేస్తున్నాయని ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్ మానేసిన 60 మంది యువకులకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు అందజేశారు. నార్త్జోన్ ఏసీపీ సత్యానందం, సీఐలు చంద్రశేఖర్, ఎస్.వి.వి.ఎస్.లక్ష్మీనారాయణ, అహ్మద్ అలీ, పలువురు ఎస్ఐలు, న్యాయవాది బొండా సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026విజయవాడ జీజీహెచ్లో దిగజారిన సేవలు7గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. జగ్గయ్యపేట అర్బన్: వేదాద్రిలోని శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్వీ రాజశేఖరబాబు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. సూర్యభగవానుడి విగ్రహానికి అర్చకులు పూజా కార్యక్రమాలను జరిపించారు.ఉపరాష్ట్రపతి పర్యటనకు భద్రత కట్టుదిట్టం విమానాశ్రయం(గన్నవరం): ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన సందర్భంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) దళంతో పాటు రాష్ట్ర పోలీస్ విభాగాలు విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎయిర్పోర్ట్తో పాటు రన్వే పరిసర ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. విమానాశ్రయంలో ప్రోటోకాల్, భద్రత ఏర్పాట్లను ఆదివారం పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. అనంతరం విమానాశ్రయం నుంచి ముసునూరు వరకు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో అధికారులు కాన్వాయ్ ప్రయాణించే మార్గాన్ని పరిశీలించి కీలక ప్రాంతాల వద్ద భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రపతి న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9.35 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి 9.45 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా ముసునూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ముసునూరు నుంచి విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.35 గంటలకు చేరుకుని పది నిమిషాల అనంతరం ఉప రాష్ట్రపతి న్యూఢిల్లీ బయలుదేరనున్నారు. పోలీసుల ఆంక్షలు.. హనుమాన్జంక్షన్రూరల్: ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో హనుమాన్జంక్షన్లో సోమవారం పోలీసులు ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హనుమాన్జంక్షన్ మీదగా ఏలూరు జిల్లా ముసునూరుకు ఉప రాష్ట్రపతి వెళ్తుండటంతో దారి పొడవునా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్జంక్షన్ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో దుకాణదారులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతి తిరిగి వెళ్లే వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ సూచనలు పాటించాలని చెప్పారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): జూనియర్ వైద్యుల సమ్మెతో ప్రభుత్వాస్పత్రిలో సేవలు దిగజారాయి. ఆస్పత్రిలో అవుట్ పేషెంట్లతో పాటు, అడ్మిషన్స్ కూడా గణనీయంగా తగ్గాయి. సాధారణ రోజుల్లో వచ్చే రోగుల్లో సగం మంది కూడా రావడం లేదు. అందుకు ఈ–ఆస్పత్రి వెబ్సైట్ నివేదికలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు తమకు 30 శాతం స్టైపెండ్ పెంచితేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెబుతుండగా, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ, వారిని చర్చలకు కూడా పిలవడం లేదు. దీంతో పేదలు వైద్యానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం రావడం లేదు. సగానికి తగ్గిన ఓపీ, అడ్మిషన్లు.. రోగుల జేబులకు చిల్లులు.. తీవ్రమైన అనారోగ్యంతో వస్తున్న వారికి క్యాజువాలిటీలో వైద్యం చేసేందుకు గంటల పాటు వ్యవధి పడుతోంది. అది కూడా ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ఫార్మాడీ విద్యార్థులు చికిత్స చేస్తున్నారు. ఈ నెల 21న ఏలూరుకు చెందిన ఓ మహిళ మధుమేహ దుష్ఫలితాలతో చికిత్సకోసం ఆస్పత్రికి రాగా, జూడాలు సమ్మెలో ఉన్నా రని చెప్పి పంపించేసినట్లు తెలిసింది. దీంతో ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఇలా అనేక మంది నిరుపేద రోగులకు వైద్యం లేదని పంపించి వేయడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి అప్పులు పాలవుతున్నారు. పట్టు వీడని ప్రభుత్వం.. జూడాల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం పట్టువీడటం లేదు. జూడాలు ముఖ్యంగా మూడు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. వాటిలో స్టైపెండ్ విషయంలోనే ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అది కూడా జూడాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం 3 శాతం, 5 శాతం అంటూ ప్రకటనలు చేయడంపై జూడాలు మండిపడుతున్నారు. తమ సమస్యలన్నీ పరిష్కరించే వరకూ విధులకు హాజరయ్యేది లేదని తేల్చి చెబుతున్నారు. 3014174310వ తేదీ ఈ–ఆస్పత్రి నివేదిక ప్రకారం ఓపీ, ఐపీ 21వ తేదీ ఈ–ఆస్పత్రి నివేదిక ప్రకారం ఓపీ, ఐపీ స్టైపెండ్ పెంచాలని, విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలని, ప్రతినెలా స్టైపెండ్ను సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం చేస్తున్న సమ్మెకు ప్రజారోగ్య వేదిక సంపూర్ణ మద్దతు ఇస్తోంది. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె ఎంతో న్యాయమైందని, ప్రస్తుతం అందుతున్న స్టైపెండ్పై 30 శాతం పెంపు కోరుతూ చేస్తున్న డిమాండ్ సమంజసమైనదే. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలి. – ఎంవీ రమణయ్య, ప్రజారోగ్య వేదిక, రాష్ట్ర అధ్యక్షుడు -
ఏపీ భవన్లోని శివాలయంలో దుర్గగుడి ఈవో
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఢిల్లీలోని ఏపీ భవన్లో పురాతన శివాలయం, అమ్మవారి మందిరాన్ని దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆదివారం పరిశీలించారు. ఢిల్లీకి వెళ్లిన ఈవో, ఏపీ భవన్ పరిసరాల్లో ఉన్న ఆలయాలను పరిశీలించారు. కొన్నేళ్లగా ఈ రెండు ఆలయాలు అనధికార వ్యక్తుల చేతుల్లో ఉండగా, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆలయాలను దుర్గగుడి దేవస్థానానికి అప్పగించగా, దానిని ఈవో పరిశీలించారు. ఆయా ఆలయాల్లో శాశ్వత అర్చకుడిని నియమిస్తామని, అంత వరకు కనకదుర్గాదేవి మందిరంలో అర్చకుడికి బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. కాగా ఆయన మంగళవారం వరకూ ఢిల్లీలోనే ఉండనుండటంతో విజయవాడ దుర్గగుడి ఇన్చార్జి ఈవోగా డీఈవో కిషోర్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. -
హైఓల్టేజ్తో..
ఆదివారం మద్యాహ్నం ఒక్కసారిగా హైవోల్టేజీ వచ్చింది. ఏం జరిగిందే చూసేలోపే నా దుకాణంలోని ఏసీ, కంప్యూటర్ మానిటర్, 2 ఎస్ఎంపీఎస్, సీపీయూ పాడయ్యాయి. పక్కనే ఉన్న సెలూన్లో నాలుగు లైట్లు, చెప్పుల దుకాణంలో టీవీ, న్యాయవాది ఇంట్లో కంప్యూటర్ ఎస్ఎంపీఎస్ మదర్బోర్డు పాడయ్యాయి. ఎవరో చెట్లు కొట్టడంతో హైఓల్టేజీ వచ్చి మా వస్తువులు పాడయ్యాయని చెప్పటం విడ్డూరంగా ఉంది. జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు. –చల్లా వెంకటరెడ్డి, స్థానికుడు -
గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు
పెనమలూరు: బందరు కాలువలో దూకి గల్లంతైన వ్యక్తి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టింది. పెనమలూరు ఎస్ఐ తాతాచారి తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు శ్రీహరిగార్డెన్స్లో పమిడిముక్కల గణేష్కుమార్(36) తల్లిదండ్రులతో ఉంటున్నాడు. అతను గతంలో చేపల చెరువులు చేసి ఆర్థికంగా నష్టపోయాడు. అతనికి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. అతను మాససికంగా బాధపడుతూ మనస్తాపానికి గురయ్యాడు. తాను చనిపోతానని పోరంకిలో ఉంటున్న సోదరి పద్మావతికి తరచూ ఫోన్ మెసేజ్ పెడుతున్నాడు. తండ్రికి శనివారం ఫోన్చేసి ఇంటికి వస్తున్నానని చెప్పి అతను పెనమలూరు వంతెనపై నుంచి బందరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. పోలీసులు అతని కోసం బందరు కాలువలో గాలింపు చేపట్టగా ఆచూకీ తెలియలేదు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని పోలీసులు రంగంలోకి దింరు. వారు బందరు కాలువలో గణేష్కుమార్ కోసం విస్తతంగా గాలిస్తున్నారు. -
యువతను సాహిత్యం వైపు మళ్లించాలి
విజయవాడ కల్చరల్: యువతను సాహిత్యం వైపు మళ్లించి, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చేలా కృషి చేయాలని మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అన్నారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో బందరు రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం ‘సృజనోత్సవం’ పేరుతో సాహిత్య, నృత్య సభ నిర్వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పలువురు యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు యువతను సత్ప్రవర్తన, సత్ సాహిత్యం వైపు నడిపించేందుకు కృషి చేయాలని సూచించారు. మల్లెతీగ సాహిత్య వేదిక వ్యవస్థాపకుడు కలిమిశ్రీ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య పరిరక్షణకు సంస్థ కృషి చేస్తోందన్నారు. గిడుగు రామమూర్తి వారసుడు గిడుగు వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవహారిక భాషా ఉద్యమానికి గిడుగు రామమూర్తి పంతులు ఆద్యుడని పేర్కొన్నారు. గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా వివిధ రంగాలకు చెందిన పైనేని తులసినాయుడు, షేక్ కరీముల్లా, డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్, విల్సన్రావు కొమ్మవరపు, రేపాక రఘునందన్, జ్యోతిమువ్వల, ఎంవీ కల్యాణి, డాక్టర్ వి.రఘుపతి, డాక్టర్ టి.పార్థసారథి, వసుధలకు గిడుగు–మల్లెతీగ సేవా పురస్కారాలు అందజేశారు. కవుల స్వీయ కవితాగానం, కళాక్షేత్ర డాన్స్ అకాడమీ విద్యార్థుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ ఎం. ప్రభాకర్, చిన్ని నారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ఘంటా విజయకుమార్, ఠాగూర్ గ్రంథాలయ పాలకురాలు కె. రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
మారుతీనగర్లో హైఓల్టేజీ కలకలం
● సుమారు రూ.2 లక్షల విలువైన గృహోపకరణాలు దగ్ధం మధురానగర్(విజయవాడసెంట్రల్): మారుతీనగర్లో ఆదివారం విద్యుత్ హైఓల్టేజీ రావడంతో స్థానికులు హడలిపోయారు. దీంతో సుమారు రూ.2 లక్షల విలువైన గృహోపకరణాలు పాడయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మారుతీనగర్ మసీదు రోడ్డులోని పది ఇళ్లకు హైఓల్టేజీ రావడంతో స్విచ్బోర్డు, ఏసీలు, ఫ్యాన్లు, కంప్యూటర్ల నుంచి మంటలు వచ్చాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఇళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఆఫ్ చేశారు. అప్పటికే ఆన్లో ఉన్న విద్యుత్ పరికరాలు పాడయ్యాయి. దీనిపై ఈ ప్రాంతవాసులు విద్యుత్ సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు ఘటనాస్థలికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేశారు. పక్కన వెంకటేశ్వరరావు వీధిలోలో విద్యుత్ తీగలు పక్కన ఉన్న చెట్లు కొట్టడంతో విద్యుత్ వైర్లుపై పడి హైవోల్టేజీ వచ్చిందని తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ విలువైన ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడయ్యాయని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు -
క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం
మూలపాడు(ఇబ్రహీంపట్నం): క్రీడలు ఉద్యోగుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. యునైటెడ్ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యాన మూడు రోజులుగా జరిగిన ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. మండలంలోని మూలపాడు ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన పోటీల్లో ఇరిగేషన్, ఎడ్యుకేషన్, రెవెన్యూ, సెక్రటేరియట్, పంచాయతీరాజ్, ఏపీ ఎన్జీవో, మున్సిపల్, సెక్రటేరియట్ తదితర మొత్తం పది జట్లు పాల్గొనగా, మొత్తం పది మ్యాచ్లు జరిగాయి. ఫైనల్ మ్యాచ్లో ఏపీ ఎన్జీవో, స్కూల్ ఎడ్యుకేషన్ జట్లు తలపడ్డాయి. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ టీం నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ జట్టు మెరుగైన ఆటతీరుతో ఘన విజయం సాధించి టైటిల్ కై వసం చేసుకుంది. విజేతలకు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ యూటీజేఏ అసోసియేషన్ నిర్వాహకులు పి .రమేష్ బాబు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
నిషేధం మాటల్లో.. ఫోన్లు చేతుల్లో
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడిలో సెల్ఫోన్ నిషేధం ప్రకటనలకే పరిమితమవుతోందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలయంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని దేవస్థానం అధికారులు రోజూ ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపి స్తోంది. సామాన్య భక్తుల నుంచి వీఐపీల వరకు కొందరు సెల్ఫోన్లతో ఆలయంలోకి ప్రవేశిస్తుండటం, ఫొటోలు, వీడియోలు తీస్తుండటం నిషేధం అమలుపై సందేహాలు రేకెత్తిస్తోంది. ఆదివారం పలువురు భక్తులు సర్వదర్శనం, రూ.100 టికెట్ క్యూలైన్లలో సెల్ఫోన్లతో కనిపించడమే కాకుండా మూలవిరాట్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. విషయం గమనించిన ఆలయ సిబ్బంది కొందరి ఫోన్లను స్వాధీనం చేసుకుని ఎస్ఎఫ్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. అనంతరం ఫోన్లలోని ఫొటోలు, వీడియోలను తొలగించి తిరిగి అప్పగించినట్లు తెలిసింది. ఒకేరోజు పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో భద్రతా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల గోవా ముఖ్యమంత్రితో వచ్చిన బృందంలోని ఓ వ్యక్తి గాలిగోపురం నుంచి బంగారు వాకిలి వరకు సెల్ఫోన్తో వీడియో తీసినట్లు సమాచారం. గతంలో ఓ మంత్రి వెంట వచ్చిన వ్యక్తి కూడా ఆలయంలో సుమారు ఆరు నిమిషాల పాటు వీడియో తీయగా, దానిని తొలగించినట్లు తెలుస్తోంది. ఇకనైనా ఆలయంలోకి భక్తులు, వీఐపీలు సైతం ఎవరూ సెల్ఫోన్లతో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
వెస్ట్ బైపాస్లో అదుపు తప్పిన వ్యాను
నున్న(విజయవాడరూరల్): వెస్ట్ బైపాస్లో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఘటనలో ఒకరు మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. కర్నాటక నుంచి కేఏ 40బి –7892 నంబర్ టాటా దోస్తు వాహనం ద్రాక్షపండ్ల లోడుతో అనకాపల్లి వెళ్తోంది. మార్గం మధ్యలో.. నున్న గ్రామం సమీపంలో వ్యాను అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదంలో వ్యాను ముందు సీటులో ఉన్న హేమంత్(25) ఘటనా స్థలిలో మృతి చెందగా, డ్రైవర్ రవితేజకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108లో వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు బెంగుళూరుకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృత్తివెన్నులో పట్టపగలే భారీ చోరీ కృత్తివెన్ను: పట్టపగలు నిత్యం జనసంచారం ఉండే 216 జాతీయ రహదారే సరిహద్దుగా ఉన్న గృహంలో భారీ దొంగతనం జరిగింది. కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు తెలిపిన వివరాల ప్రకారం సీతనపల్లి పంచాయతీలోని సంగమూడి గ్రామపరిధిలో కూనసాని మోహనరావు ఇల్లు కృత్తివెన్ను ప్రధాన సెంటర్కు అతిసమీపంలో ఉంది. శనివారం అతని భార్య వేరే ఊరుకు వెళ్లగా కుమారుడు స్కూల్కు వెళ్లాడు. మోహనరావు తలుపులకు తాళం వేసి పొలానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 8.5 కాసుల బంగారు నగలతో పాటు కొంత మొత్తంలో నగదును దోచుకెళ్లిపోయారు. సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు తాళాలు పగలగొట్టి ఉండటం చూసి తండ్రికి ఫోన్ చేయగా ఆయన వచ్చి దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి ఎస్ఐతో పాటు బందరు రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్, డాగ్స్క్వాడ్, క్లూస్ టీంలు వచ్చాయి. డాగ్.. కాలనీలో వీధి చివర వరకు వెళ్లింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, సీసీ టీవీ పుటేజ్లను సైతం పరిశీలిస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. జనసంచారం ఉన్న జాతీయ రహదారి పక్కనే ఇంత భారీ దొంగతనం జరగడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయొద్దు గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయవద్దని ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ అధ్యక్షులు చలసాని రాఘవేంద్రరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ 11వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘సహకార బ్యాంకుల స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటి నిర్వహణలో రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వాల జోక్యం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజలకు కో–ఆపరేటివ్ బ్యాంక్ సేవలను మరింత విస్తరించే విధంగా చర్యలు తీసుకోవాలి’అని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ కార్యదర్శి షేక్ అబ్దుల్ జిలాని తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి పెనమలూరు: కానూరు సిద్ధార్థ కాలేజీ వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకనారాయణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప రామానగర్ కాలువ కట్టపై నివసిస్తున్న పోతేపల్లి గోవిందమ్మ(70) ఇళ్లల్లో పనులు చేస్తుంటుంది. ఆమె శనివారం కానూరు సిద్ధార్థ కాలేజీ వద్ద విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారి దాటుతుండగా అతివేగంగా వచ్చిన బైక్ ఆమెను ఢీ కొట్టింది. ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె మృతి చెందింది. -
రాజకీయ కక్షతో ‘కారుమూరి’ అరెస్ట్
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కృష్ణలంక(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు అక్రమమని, ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. వైఎస్సార్ సీపీలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో అవినాష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతో అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో బీసీలకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం కల్పించి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. బీసీ నాయకులను ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. నాగేశ్వరరావుపై రాజకీయ కక్షతో వ్యవహరించడం మానుకోవాలని, ఆయన అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులపై వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ప్రజల తరఫున నిరంతరం పోరాడుతారని స్పష్టం చేశారు. వెన్నుపోటు పార్టీ కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని హితవుపలికారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ అభివృద్ధే లక్ష్యం కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కాలేజీ ప్రిన్సిపాల్, పూర్వ విద్యార్థి డాక్టర్ ఎ.ఏడుకొండలరావు అమెరికాలో పర్యటిస్తున్నట్లు కాలేజీ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ వైద్యులు, కాలేజీ పూర్వ విద్యార్థులతో సమావేశమవుతూ కాలేజీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చిస్తున్నారని తెలిపారు. అమెరికాలోని వివిధ మెడికల్ స్కూళ్లు, ఆసుపత్రులను సందర్శిస్తూ బోధనా సౌకర్యాల మెరుగుదల, వైద్య విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఆధునిక క్లినికల్ స్కిల్స్, రోగుల సంరక్షణ వంటి అంశాలపై వైద్య నిపుణులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలబామా రాష్ట్రంలోని హంట్స్విల్ నగరాన్ని సందర్శించి అక్కడ నివసిస్తున్న సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐ వైద్యులను కలుసుకున్నారు. సీనియర్ న్యూరోఫిజీషియన్ డాక్టర్ ఆలపాటి ఆంజనేయులు, అనస్థీషియాలజిస్ట్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి డాక్టర్ మురళి, సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ తోటకూర నాగేంద్ర తదితరులతో సమావేశమై కాలేజీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి వారి సలహాలు, సూచనలు, సహకారాన్ని కోరారన్నారు. అట్లాంటాలో సెప్టెంబర్ 4, 5, 6 తేదీల్లో జరగనున్న గుంటూరు మెడికల్ కాలేజీ, రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల రీయూనియన్లో పాల్గొని కాలేజీ అభివృద్ధిపై చర్చిస్తారని చెప్పారు. అదృశ్యమైన వృద్ధురాలి మృతదేహం లభ్యం కృష్ణలంక(విజయవాడతూర్పు): దుస్తులు ఉతకడానికి బందరు కాలువ ఒడ్డుకు వెళ్లి అదృశ్యమైన ఓ వృద్ధురాలు ఆదివారం శవమై కనిపించింది. వివరాల మేరకు బాడవపేట అంబేద్కర్ వీధిలో నివసిస్తున్న వెంగలదాసు దుర్గ (70) శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దుస్తులు ఉతకడానికి బందరు కాలువ ఒడ్డుకు వెళ్లి కనిపించ కుండా పోయిన విషయం తెలిసిందే. సాయంత్రం 5.30 గంటలకు కూడా ఇంటికి రాకపోవడంతో మేనల్లుడు శిఖా నాగేంద్రబాబు.. ఆమె బట్టలు ఉతకడానికి వెళ్లిన బందరు కాలువ వద్దకు వెళ్లి చూడగా బట్టలు, చెప్పులు అక్కడే ఉన్నాయి. ఆమె మాత్రం కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెదికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీనిపై నాగేంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు ఆదివారం బందరు కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటలకు ఆమె మునిగిన చోటే శవమై కనిపించింది. దుస్తులు ఉతుకుతూ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి మునిగి మరణించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


