breaking news
NTR district Latest News
-
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసం!
ఎన్టీఆర్ జిల్లా: సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్తో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురి వద్ద భారీగా నగదు వసూలు చేసిన ఘరానా మోసగాడి ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. ఉద్యోగాలు అయినా ఇప్పించండి, నగదు అయినా ఇవ్వండి అని బాధితులు మోసగాడిని నిలదీయడంతో వారిపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించడంతో బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.... యూ ట్యూబర్ కావడి కృష్ణ గతంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నాడు. ప్రస్తుతం అమరావతి సచివాలయం ప్రాంతంలో నివశిస్తున్నాడు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, పలువురు మంత్రులు, పోలీస్ అధికారులతో దిగిన ఫొటోలు, బొకేలు అందించే ఫొటోలు చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని 9 మందిని మాయలో పడేశాడు. వారి వద్ద సుమారు రూ.40 లక్షలు వరకు వసూలు చేశాడు. స్టేషన్కు వచ్చిన ఐదుగురి బాధితులు రూ.10.50 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నగదు అడుగుతుంటే నా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని బెదిరిస్తున్నట్లు వారు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడిగా మనోహర్నాయుడు
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడిగా టి.మనోహర్నాయుడు(విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్) ఎన్నికయ్యారు. సొసైటీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సొసైటీ ఉపాధ్యక్షుడిగా జక్కంపూడి ప్రసాద్(జేపీ పబ్లికేషన్స్), కార్యదర్శిగా కె.లక్ష్మయ్య (ప్రజాశక్తి బుక్హౌస్), సహాయ కార్యదర్శిగా ఎ.బి.ఎస్.సాయిరామ్(సహస్ర బుక్స్), కోశాధికారిగా కొండపల్లి రవి (నవసాహితి బుక్ హౌస్).. సభ్యులుగా జి.లక్ష్మి, గోళ్ల నారాయణరావు, విశ్వేశ్వరరావు, శిరం రామారావు (వీజీఎస్), బి.రవికుమార్, బి.వి.బసవరాజు, కె.శ్రీనివాస్, వి.శ్రీనివాసరావు, ఎన్.ఎస్.నాగిరెడ్డి, పి.సుబ్రహ్మణ్యం, వల్లూరి శివప్రసాద్, కె.సత్యరంజన్, చలపాక ప్రకాష్ ఎన్నికయ్యారు. పల్లవి పబ్లికేషన్స్ అధినేత ఎస్.వెంకటనారాయణ, ఏపీ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. -
కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
మూలపాడు(ఇబ్రహీంపట్నం):అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రమైన గాయాలయ్యాయి. మండలంలోని మూలపాడు గ్రామం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఈప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు... కంచికచర్లకు చెందిన ఐలపోగు కాటయ్య, తిరుపతిరావు కలసి నున్న గ్రామంలో పాలాలకు సరిహద్దు రాళ్లు పాతే పనులకు వెళ్లారు. పనులు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో మూలపాడు వద్దకు చేరుకునే సమయానికి విజయవాడ వైపు నుంచి దూసుకొచ్చిన కారు వెనుక వైపు నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఐలపోగు కాటయ్యకు తలకు గాయమవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. 108 వాహన సిబ్బంది బాధితులను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషయంగా మారడంతో సమీపంలోని ఓప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. సంఘటనా స్థలానికి చేరిన ఎస్ఐ రాజు బాధితులు, కారు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు నిర్వహిస్తున్న సీఐటీయూ 12వ జిల్లా మహాసభలు కొండపల్లి ఎన్టీటీపీఎస్ బి కాలనీ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు జరగనున్న మహాసభల్లో తొలిరోజు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి నరసింహారావు పతాక ఆవిష్కరణ చేశారు. డేవిడ్ చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై చర్చించారు. భవిష్యత్తులో కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మామిడి శీతారామారావు, కార్యదర్శి యం.మహేష్, కోశాధికారి వాసుదేవన్, జేవీవీ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ళ మురళీమోహన్, ఉపాధ్యక్షుడు కాశీనాథ్, ఎన్సీహెచ్ సుప్రజ, మైలవరం కార్యదర్శి సుధాకర్, ఇర్ల కొండలరావు పాల్గొన్నారు. సీఐటీయూ 12వ జిల్లా మహాసభలు ప్రారంభం -
వైద్యుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వం వెంటనే వైద్యుల సమస్యలు పరిష్కరించి ప్రజలకు సకాలంలో వైద్యం అందించాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ముత్యాలంపాడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు చేపట్టిన సమ్మెను పరిష్కరించటంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. దీనివల్ల ప్రతి రోజు లక్షలాది మంది రోగులకు సకాలంలో వైద్యసేవలు అందటం లేదని చెప్పారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు వైద్యసేవల కోసం ఎక్కువగా తీవ్ర అవస్థలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. కల్తీ మద్యంవల్ల అనేక మంది అనారోగ్యంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కారయదర్శి డాక్టర్ ఎం.ప్రభుదాస్ మాట్లాడుతూ ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి వైద్యుల సమ్మె పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ -
సుబ్బారాయుడికి రూ. 8.26లక్షల ఆదాయం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి ఒకరోజు ఆదాయం రూ.8,26,626 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. శాశ్వత అన్నదాన కార్యక్రమం నిమిత్తం రూ.50,239, నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.50,712, కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 24,680, లడ్డూ, పులిహోర ద్వారా రూ. 1,12,225, దర్శన రుసుం ద్వారా రూ.63,100, సేవా టికెట్ల ద్వారా రూ. 5,18,380తో పాటు ఇతర సేవా టికెట్లతో కలిపి మొత్తం రూ.8,20,626 దేవస్థానానికి ఆదాయం వచ్చినట్లు వివరించారు. కిక్కిరిసిన ఆలయం.. తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఆదివారం కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో పలు పారామెడికల్ పోస్టుల కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని శ్రీనివాసరావు తెలిపారు. డెంటల్ మెకానిక్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20 సాయంత్రం 5 గంటల్లోపు కళాశాలలో అందజేయాలని సూచించారు. ఎంపికలు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలు, దరఖాస్తుకోసం http://gdchvja.inను సంప్రదించవచ్చునని సూచించారు. పర్యాటకులతో సాగరతీరం కళకళ కోడూరు: హంసలదీవి సాగరతీరంలో పర్యాటకులతో కళకళలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులు ప్రత్యేక వాహనాల్లో తీరానికి తరలివచ్చారు. సముద్ర అలల మధ్య కేరింతలు కొడుతూ సరదాగా గడిపారు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, విజయవాడ, గుడివాడకు చెందిన పర్యాటకులు తీరంలో కనిపించారు. పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు ఏవిధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ చేపట్టారు. తిరుపతమ్మకు బంగారు కాసులపేరు పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారికి ఆదివారం బాపట్ల జిల్లా, రేపల్లె మండలం, నల్లూరిపాలెం గ్రామానికి చెందిన నలకుర్తి రాజేష్బాబు, లక్ష్మీతిరుపతమ్మ దంపతులు రూ.2లక్షలు విలువైన బంగారు కాసులపేరు ను ఆలయ ఇన్స్పెక్టర్ బద్దుల కృష్ణమోహన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘కె–ర్యాంప్’ లబ్బీపేట(విజయవాడతూర్పు): కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం కె–ర్యాంప్ అని ఆ చిత్ర హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. దీపావళి కానుకగా ఈ నెల 18న విడుదల కానుండగా, చిత్ర పమోషన్లో భాగంగా కె–ర్యాంప్ యూనిట్ సభ్యులు ఆదివారం విజయవాడ విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. సినిమా మొత్తం ఆసక్తికరంగా ఉంటుందని, ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు. ఆదరించాలని కోరారు. -
బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయం
తెనాలి: ఆంధ్రాప్యారిస్ తెనాలిలో నిర్వహిస్తున్న బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ అన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళాసదనంలో ఆదివారం 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయవేదిక జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశానికి సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. ఐదు రాష్ట్రాల్నుంచి 750 కుటుంబాలవారు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి కామేశ్వరప్రసాద్ వివాహవేదిక సమాచార పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. శాఖ భేదాన్ని చూడకుండా వివాహాలు జరుపుకోవాలని హితవు పలికారు. రాష్ట్రస్థాయిలో 15 పర్యాయాలు పరిచయ వేదికను తెనాలిలో నిర్వహించటం గొప్పగా ఉందన్నారు. సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి మాట్లాడుతూ వైష్ణవి కేటరర్స్ హైదరాబాద్, బ్రాహ్మణ పరిషత్, వివిధ బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాల సహకారంతో నిర్వహించినట్టు తెలిపారు. వివిధ విభాగాల ద్వారా బ్రాహ్మణులకు, బ్రాహ్మణ సంఘాలకు సేవలు అందిస్తున్న ప్రముఖులను సత్కరించారు. హరిప్రసాద్, ఉమాదేవి, జయలక్ష్మి, విశ్వనాథం తదితరులున్నారు.ఐదు రాష్టాల్నుంచి 750 కుటుంబాలు హాజరుకావటం విశేషం! 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ -
దుర్గగుడిలో బాలుడి కిడ్నాప్ కలకలం!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తప్పిపోయిన బాలుడిని ఎవరో గుర్తుతెలియని యువకులు కిడ్నాప్ చేశారంటూ దుర్గగుడిలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే చివరకు బాలుడిని ఎవరు కిడ్నాప్ చేయలేదని, తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ ఘటన ఇంద్రకీలాద్రిపై ఆదివారం చోటు చేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన లావణ్య తన కుమారుడైన శశి వజ్ర ఆరూష్, మరి కొంత మంది బంధువులతో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. మహా నివేదనకు ముందు బాలుడు తప్పిపోగా, తల్లి కుటుంబ సభ్యులు మైక్ ద్వారా ప్రచారం చేయించారు. అయితే మహా మండపం లిప్టు వద్ద ఆ బాలుడిని ఇద్దరు యువకులు బలవంతంగా తీసుకెళుతుండగా ఫైర్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ ఆర్వీ.సత్యనారాయణ గుర్తించి ప్రశ్నించారు. దీంతో ఆ ఇద్దరు బాలుడిని వదిలి పారిపోయారు. దీంతో ఆ బాలుడిని తీసుకుని సత్యనారాయణ నేరుగా ఈవో చాంబర్కు వెళ్లి శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు విషయం తెలియజేశారు. అయితే దర్శనానికి వచ్చిన బాలుడిని కిడ్నాప్ చేశారంటూ ఆలయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అందరూ ఒక సారిగా ఉలిక్కిపడ్డారు. క్యూలైన్లో ఉన్న భక్తులు తమ బిడ్డలు పక్కనే ఉన్నారో లేదో పరిశీలించుకున్నారు. కొంత సమయం తర్వాత బాలుడిని ఎవరు కిడ్నాప్ చేయలేదని, తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించామంటూ ఆలయ అధికారులు ప్రకటించారు. దీంతో భక్తుందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నేపాల్ దేశానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో వున్న ఓ బార్లో సుమారు సంవత్సరం నుంచి నేపాల్కు చెందిన మనోజ్ బిస్తా (26), రాకేష్ (34) పనిచేస్తున్నారు. భ్రమరాంబపురం కాలనీలో ఓ రూమ్ తీసుకుని ఇద్దరూ అద్దెకు ఉంటూ ప్రతిరోజూ విధులకు వెళ్లివస్తుంటారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు విధులను ముగించుకుని యజమాని దగ్గర నుంచి స్కూటీ తీసుకుని వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 సమయంలో జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళుతుండగా మంగళగిరి వద్ద వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు రోడ్డుమధ్యలో పడిపోయారు. అదేసమయంలో వెనుక నుంచి ఓ బస్సు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలో వున్న ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్ మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కు తరలించి మృతుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మనోజ్ బిస్తా (26) యువకుడికి తల్లిదండ్రులు లేరని, 10 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో వివిధ బార్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నేపాల్లోని సౌరన ప్రస్తకీర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకుల్లో రాకేష్ (34)కు తండ్రి లేడని, అమ్మ, చెల్లి మాత్రమే ఉన్నారని, ఇతను గత సంవత్సర కాలం నుంచి బార్లో పనిచేస్తున్నాడని ఇద్దరూ రూమ్లో అద్దెకు ఉంటూ పెదకాకాని గోల్డెన్ బార్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాకేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు నేపాల్ యువకులు మృతి -
డిసెంబర్లో యోగా చాంపియన్షిప్ పోటీలు
మొగల్రాజపురం/పటమట:(విజయవాడ తూర్పు): డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో అనంతపురం జిల్లాలో 6వ యోగాసన చాంపియన్ షిప్ 2025–26 (సబ్ జూనియర్స్) రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. స్థానిక టీచర్స్ కాలనీలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి ఎంపికై న 10 నుంచి 14 సంవత్సరాల లోపు బాల బాలికలు హాజరవుతారని చెప్పారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు జనవరి 5, 6, 7, 8 తేదీల్లో మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీలకు వెళతారని తెలిపారు. గత నెల 28, 29, 30 అక్టోబర్ 1 తేదీల్లో విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో జరిగిన 6వ జాతీయ యోగాసనా చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను సత్కరించారు. హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాల్లో మహిళా విభాగంలో నెల్లూరుకు చెందిన పి.ప్రసూనకు స్వర్ణం, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎ.సుజాతకు రజిత పతకం దక్కిందని చెప్పారు. 2032లో జరిగే కామన్వెల్త్ గేమ్స్, 2036లో జరిగే ఒలింపింక్ గేమ్స్లో ఏపీ నుంచి క్రీడాకారులను పంపి స్వర్ణ పతకాలు సాధించడమే లక్ష్యంగా తమ అసోసియేషన్ పనిచేస్తుందని వెల్లడించారు. ఏపీ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.రాధిక, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.దుర్గారావు, మేనేజర్ బెనర్జీ పాల్గొన్నారు. నేటి నుంచి యోగా పోటీలు... ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు పోలీస్ నేషనల్ యోగాసన పోటీలు– 2025–26 అమరావతిలో విట్ యూనివర్శిటీలో జరుగుతాని వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ గేమ్స్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇందులో యోగాసనా భారత్ , యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున న్యాయనిర్ణేతలు, టెక్నికల్ ఆఫీషియల్స్ను పంపించి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వెంకట రామకృష్ణ ప్రసాద్ -
అద్వితీయ ఉపాధ్యాయుల కార్ఖానా అవనిగడ్డ
అవనిగడ్డ:అద్వితీయ ఉపాధ్యాయులను తయారుచేసే కార్ఖానాగా అవనిగడ్డ ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డీఎస్సీ శిక్షణ ద్వారా విద్యారంగ చరిత్రలో అవనిగడ్డ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుందని తెలిపారు. ఆదివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నియోజకవర్గ మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు 275 మందికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్ది దేశానికి ఉత్తమ పౌరులను అందించాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని తీర్చిదిద్దే మహోన్నత వృత్తిలో అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 1208 మంది ఉద్యోగాలు సాధిస్తే అవనిగడ్డ నియోజకవర్గంలోనే 275 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించటం గర్వకారణం అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు మాట్లాడతూ డీఎస్సీ ఉపాధ్యాయులకు దీపావళి ముందే వచ్చిందన్నారు. ఎన్నొ నిద్రలేని రాత్రులు గడిపి ఏళ్ళ తరబడి శ్రమించి టీచర్ పోస్టులు సాధించిన వారు అదృష్టవంతులు అన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్, ప్రగతి డీఎస్సీ కోచింగ్ సెంటర్ చైర్మన్ పూర్ణచంద్రరావు, విద్యానికేతన్ డీఎస్సీ కోచింగ్ సెంటర్ చైర్మన్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, ఎంఈఓలు, జీఎన్బీ గోపాల్, టీవీఎం రామదాసు, శివశంకర్, నాంచారయ్య, శ్రీకాంత్, అన్నపరెడ్డి పిచ్చయ్య, పి.వెంకటేశ్వరరావు, ఏవీ రమణ, మోమిన్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకారావు, డీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ పెరుమాళ్ళు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, పీఆర్టీయూ జిల్లా నాయకులు వి.వి.ఎస్.ఆర్.వర్మ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ చరిత్రను ప్రపంచానికి తెలియజేద్దాం
హెరిటేజ్ వాక్ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడ చరిత్రను ఇక్కడి యువత తెలుసుకోవడంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రపంచానికి తెలిసేలా చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్టాచ్) ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ నగరంలో ఆదివారం జరిగింది. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియం వద్ద కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ఈ వాక్ను ప్రారంభించారు. అనంతరం మొగల్రాజపురం సిద్ధార్థ జంక్షన్లో ఉన్న గుహలను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారం ఇలాంటి వాక్లను నిర్వహించి యువతను ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాల్లో భాగం చేయాలన్నారు. ‘సిటీ ఆఫ్ కేవ్స్ అండ్ కెనాల్స్’ నినాదంతో.. చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ మొగల్ చక్రవర్తులు మచిలీపట్నం వెళ్తూ ఇక్కడ గుహలను నిర్మించారన్నారు. ఇన్టాచ్ సంస్థ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రపంచంలోని అతి పెద్ద వారసత్వ పరిరక్షక సంస్థల్లో ఒకటిగా ఉందన్నారు. ఇన్టాచ్ విజయవాడ కన్వీనర్ సాయి పాపినేని మాట్లాడుతూ ‘ది సిటీ ఆఫ్ కేవ్స్ అండ్ కెనాల్స్’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సిద్ధార్థ ఆడిటోరియం వద్ద మొదలైన వాక్ మధుచౌక్ దగ్గర ఉన్న నటరాజ స్వామి గుహల వరకు సాగింది. అక్కడ నుంచి వాహనాల్లో నగరంలోని గాంధీ హిల్, అక్కన్న మాదన్న గుహలు, ఉండవల్లిలోని గుహలతో పాటుగా ప్రకాశం బ్యారేజ్, బందరు, ఏలూరు కాలువలను సంస్థ సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
ఇబ్రహీంపట్నం: వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలోని కాచవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పరిసర గ్రామాల్లో యాచక వృత్తి చేసుకునే వ్యక్తి కాచవరం కరుణా హెల్త్ సెంటర్ సమీపంలో 65 నెంబర్ హైవే దాటుతున్న సమయంలో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటాయి. ఎత్తు 5.5 అడుగులు, నలుపు రంగు ఫుల్హ్యాండ్ టీషర్ట్, నలుపురంగు ప్యాంటు ధరించి ఉన్నాడు.. వీఆర్వో జయదుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు స్టేషన్ సీఐ చంద్రశేఖర్, 9440627084, ఎస్ఐ రాజు 98661 14556 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. లారీ ఢీకొని ముఠా కార్మికుడు.... గన్నవరం: లారీ ఢీకొని ముఠా కార్మికుడు దుర్మరణం చెందిన ఘటన కొత్తపేట వద్ద చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని కొండపావులూరు శివారు ముదిరాజుపాలెం గ్రామానికి చెందిన గోనేపల్లి రాధాకృష్ణ (47) గన్నవరంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముఠా పని నిమిత్తం వెళ్లేందుకు సైకిల్పై కొత్తపేట వద్ద జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి ఏలూరు వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనుక టైర్లు కిందపడి రాధాకృష్ణ తల భాగం నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమారై ఉన్నారు. తూములో ఇరుక్కొని దివ్యాంగుడు... తిరువూరు: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి చెరువు తూము లాకులు ఎత్తుతుండగా నీటి ఉద్ధృతికి దివ్యాంగ రైతు ఆదివారం మృతి చెందిన సంఘటన ఏకొండూరు మండలం కొండూరు తండాలో జరిగింది. తండాకు చెందిన గిరిజన దివ్యాంగ రైతు భూక్యా గోపయ్య (43) పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తూము గేటు లాకులు సరిగా లేకపోవడంతో తూములో ఇరుక్కుపోయాడు. ఊపిరాడక తూములోనే గోపయ్య మృతిచెందాడని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏకొండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుక్క అడ్డురావడంతో... షేర్మహ్మద్పేట(జగ్గయ్యపేట): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. పట్టణానికి చెందిన షేక్ ఇర్ఫాన్ (35) పట్టణం నుంచి ద్విచక్ర వాహనంపై షేర్మహ్మద్పేటకు వెళ్తుండగా మార్గమధ్యంలో కుక్క అడ్డురావటంతో అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలవటంతో గమనించిన స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తూర్పు కాపులందరికీ ఓబీసీ వర్తింపజేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మినహా అన్ని జిల్లాల్లో నివసిస్తున్న తూర్పు కాపులందరికీ ఓబీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆలిండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రాంతం మారినంత మాత్రాన కులం మారదని, తూర్పు కాపులందరికీ ఓబీసీ రిజర్వేషన్ అమలయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో తూర్పు కాపులకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. అనంతరం ఆలిండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు జాయింట్ యాక్షన్ కమిటీలకు నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రమోహన్, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆకుల అప్పల సూరినాయుడు, జేఏసీ రాష్ట్ర చైర్మన్గా గిరడా అప్పలస్వామి ఎన్నికయ్యారు. 17 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను, రాష్ట్ర మహిళా విభాగాన్ని, యువజన విభాగాలను ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన మహంతి వాసుదేవరావును ఎన్నుకున్నారు. జాతీయ గౌరవాధ్యక్షుడు పి.గిరీశ్వరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆనెపు రామకృష్ణ, చంద్రరావు, ఉమామహేశ్వరరావు, బలగ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటుకు వినతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విజయవాడ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగశయనం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దేవాంగ సామాజిక వర్గం ఎంతగానో కృషి చేసిందన్నారు. అటువంటి సామాజిక వర్గానికి వీలైనంత త్వరగా కార్పొరేషన్ ప్రకటించాలని కోరారు. చేనేతలకు పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. చేనేతలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం ప్రకటించిన ప్రభుత్వం తక్షణమే అమల్లోకి తేవాలన్నారు. దేవాంగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ మాట్లాడుతూ.. దేవాంగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్నారు. సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నక్కిన విజయ లక్ష్మి, జాతీయ దేవాంగ ఫెడరేషన్ ఏపీ మీడియా ఇన్చార్జి గుత్తి త్యాగరాజు, రాష్ట్ర కోశాధికారి ఉప్పు కనకరాజు, ఉపాధ్యక్షుడు మన్నెముద్దు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సౌత్జోన్ ఖోఖో పోటీలకు జట్లు ఎంపిక
గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో శనివారం ఖోఖో సౌత్ జోన్ పోటీల్లో పాల్గొనే పురుషులు, మహిళల రాష్ట్ర జట్ల ఎంపికలు నిర్వహించారు. ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెలక్షన్స్కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 120మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన పురుషులు, మహిళల జట్లకు 15మంది చొప్పున క్రీడాకారులను, స్టాండ్ బైగా మరో తొమ్మిది మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు శిక్షణ అనంతరం కర్ణాటక రాష్ట్రం దావణగిరిలో ఈ 24 నుండి 26వతేదీ వరకు జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారని ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు టిఎస్ఆర్కె. ప్రసాద్ తెలిపారు. ఈ పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించి పతకాలతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ క్రీడాకారులను జాతికి అందించే దిశగా తమ అసోసియేషన్ కృషి చేస్తుందని చైర్మన్ గరటయ్య తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మడక ప్రసాద్, సత్యప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీఆర్. కిషోర్, సెలక్షన్ కమిటీ సభ్యులు ఖాసీ, రవిబాబు, గిరిప్రసాద్, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్ల వివరాలు.. పురుషుల జట్టు: ఆర్.సునీల్నాయుడు, కుంభా నరేష్, ఎన్ఎస్.రాజు, వై.సుధీర్కుమార్, ఎస్కె.మహమ్మద్, ఐ.ఎలియా(ప్రకాశం), ఎస్కె.మహబుబ్(కర్నూల్), కోడూరి కొండలరావు(కృష్ణా), బి. కిరణ్(వైజాగ్), జి.సంతోష్(అనంతపురం), వి.భానుప్రకాష్(విజయనగరం), కె.శివశంకర్(తూర్పుగోదావరి), కె.ప్రవీణ్(శ్రీకాకుళం), పి.వరుణ్(చిత్తూరు), వై.అశిష్(నెల్లూరు). మహిళల జట్టు: పి. చంద్రఅనూష, జి.పావని (పశ్చిమ గోదావరి), పి.హేమ, బి.శిరీష(విశాఖపట్నం), ఎస్.పావని, వి. శశికళ, ఆర్.యశోద, ఎం.సఖీయా, వి.నాగమల్లేశ్వరి(ప్రకాశం), కె. కుమారి, కె.ఉర్ధవ(కృష్ణా), బీ. గుణవతి, పి.అమృత(శ్రీకాకుళం), జె.శ్రావణి(విజయనగరం), కె.కీర్తన(చిత్తూరు). -
ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే
పామర్రు: పేదలకు మెరుగైన వైద్యసేవలను అందించే విషయంలో సీఎం చంద్రబాబుకు అడుగుముందుకు పడటం లేదనే విషయాన్ని ప్రజలంతా గ్రహిస్తున్నారని మాజీఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమం వాల్ పోస్టర్ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీఎమ్మెల్యే అనిల్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో తనపార్టీ శ్రేణులకు లాభం చేకూర్చాలన్నదే చంద్రబాబు ఆలోచన అని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం చేపట్టి సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి అందులో ఐదు కళాశాలలు పూర్తి చేశారని గుర్తుచేశారు. మరో మూడు కళాశాలల పనులు తుదిదశకు చేరుకున్నాయని వివరించారు. ఈ మెడికల్ కాలేజీల పనులను పూర్తి చేస్తే వైఎస్సార్ సీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని భయపడిన సీఎం చంద్రబాబుకు ఆపనులను పూర్తి చేయడానికి మనస్సు రావడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఆ మూడు మెడికల్ కాలేజీల్లో అన్ని సదుపాయాలు సమకూర్చినా తుదిదశ పనులు చేసి ప్రారంభించేందుకు చంద్రబాబు భయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ఇష్టం లేకనే వాటిని పార్టీశ్రేణులకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం అందాలంటే కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం పునారాలోచించి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈనెల 25న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబరు 12న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు నిర్వహిస్తామని అనిల్కుమార్ తెలిపారు. ఆయా ర్యాలీల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, ప్రజాసంఘాలతోపాటు ప్రజలంతా పాల్గొని కూటమి ప్రభుత్వ అనుమాష చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆరేపల్లి శ్రీనివాసరావు, తాడిశెట్టి శ్రీనివాసరావు, రాజులపాటి రాఘవరావు, కళ్లం వెంకటేశ్వరరెడ్డి, నడకుదురు రాజేంద్ర, కూసం పెద వెంకటరెడ్డి, గవాస్కరరాజు, నవుడు సింహాచలం, సజ్జా సుబ్రమణ్యం, నత్తా రవి, అజీజ్, తిరుమలశెట్టి వాసు, దిట్టకవి తదితరులు పాల్గొన్నారు. కై లే అనిల్కుమార్ డిమాండ్ -
రైతుల కష్టం నీటిపాలు
కంకిపాడు: ఖరీఫ్ సాగుచేపట్టిన రైతులను కష్టాలు వీడటం లేదు. వరుసగా వస్తున్న వరదలకు రైతులు కుదేలవుతున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. సకాలంలో స్పందించాల్సింది పోయి మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల కృష్ణానదికి సంభవించిన వరుస వరదలతో ఏటిపాయ వెంబడి సాగులో ఉన్న పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలకు వాటిల్లిన నష్టాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే కూడా చేపట్టలేదు. దీంతో పరిహారం అందుతుందా? లేదా? అన్న సందేహాలు రైతుల కంటి మీద కునుకు కరువయ్యేలా చేస్తున్నాయి. కృష్ణానది ఏటిపాయ వెంబడి ప్రధానంగా ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. ముఖ్యంగా పసుపు, అరటి, కంద, పూలతోటలు, కూరగాయల తోటలు, తమలపాలకు ఇతర పంటలు సాగవుతున్నాయి. లక్షలాదిరూపాయలు పెట్టుబడులు పెట్టి పంటను సంరక్షించుకుంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదికి వరద ముంచుకొచ్చింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. రైతులు దెబ్బతిన్న పంటలను తొలగించి తిరిగి సాగుకు ఉపక్రమించారు. ఈ ఏడాది మేలో అకాల వర్షాలకు ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. కృష్ణాజిల్లాలో 64.3 హెక్టార్లలో అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయల తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదించారు. తాజాగా కృష్ణానదికి మరోమారు వరద వచ్చి పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏటిపాయ వెంబడి సాగులో ఉన్న వివిధ రకాల ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. ఈ దఫా రోజుల తరబడి పంట పొలాల్లో వరదనీరు నిలిచిపోవటంతో మొక్క దశలో ఉన్న పసుపు, కంద, కూరగాయలు, పూల తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. లక్షల రూపాయలు పంటపై పెట్టిన పెట్టుబడులు కోల్పోవాల్సి వచ్చిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాథమిక అంచనాలు సిద్ధం! వరదలతో ఏర్పడిన పంట నష్టంపై ఉద్యానశాఖ ప్రాథమిక అంచనాలను రూపొందించింది. జిల్లాలోని పెనమలూరు, కంకిపాడు, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల, తోట్లవల్లూరు, పమిడిముక్కల, కోడూరు మండలాల్లో పంటలకు అపారనష్టం వాటిల్లినట్లు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయలు, కంద, పూలతోటలు ప్రధానంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 2,863 మంది రైతులకు చెందిన 2244.63 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదికలో పొందుపరిచారు. దీన్ని బట్టి వరదలకు జిల్లాలో ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కృష్ణానదికి వరదలు, అధిక వర్షాలు వచ్చి పంటలు దెబ్బతిన్నా, ఈదురుగాలులకు పంటలు నేలవాలినా కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఒక్క రూపాయి పరిహారం కూడా రైతులకు అందించలేదు. తాజాగా కృష్ణానదికి వచ్చిన వరదతో రైతులకు మునుపెన్నడూ లేని విధంగా భారీగా నష్టం జరిగింది. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమిక నష్టం అంచనాలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాగానే పంట నష్టం సర్వే పూర్తి చేసి నివేదికను పంపుతాం. క్షేత్రస్థాయిలో సిబ్బందికి కూడా సూచనలు అందించాం. మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నాం. – జె.జ్యోతి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, కృష్ణాజిల్లా ఏటిపాయకు వచ్చిన వరదతో పంటలు దెబ్బతిన్నాయి. కుళ్లిపోయిన పంటలతో పెట్టుబడులు కోల్పోతున్నాం. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి ప్రతి ఎకరం నమోదు చేయాలి. రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలి. రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవహరించాలి. – వడుగు శ్రీనివాసరావు, రైతు, మద్దూరు ప్రస్తుతం ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా పంట నష్టం సర్వే ప్రక్రియను చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారులకు ఇంకా శాఖాపరమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో పంట నష్టం సర్వే ప్రక్రియ ప్రారంభానికి నోచలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వంలో ఎప్పుడూ అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ సంక్షేమాన్ని విస్మరిస్తోందన్న వాదనలకు తాజా చర్యలు బలం చేకూరుస్తున్నాయి. ముంపునకు గురైన ప్రతి ఎకరాన్ని నమోదు చేయాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి వరకూ సర్వే ప్రారంభం కాకపోవటంతో ఎప్పటికి సర్వే జరుగుతుందో అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
బైక్ దగ్ధం– నలుగురికి గాయాలు
తిరువూరు: తిరువూరు సమీపంలోని లక్ష్మీపురం వద్ద జాతీయరహదారిపై శనివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఓ బైక్ దగ్ధం కాగా, నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఆంజనేయపురంనకు చెందిన కల్యాణ్ ద్విచక్రవాహనంపై మరో ఇద్దరితో కలిసి తిరువూరు నుంచి ఇంటికి వెళ్తుండగా, కాకర్లకు చెందిన నరసింహ అనే వ్యక్తికి చెందిన బైక్ అదుపు తప్పి ఢీకొంది. ఈక్రమంలో నరసింహాకు చెందిన బైక్ నుంచి పెట్రోలు లీకై వాహనం పూర్తిగా దగ్ధమెంది. ఈ ఘటనలో నరసింహా, కల్యాణ్లతోపాటు బైక్పై ప్రయాణిస్తున్న ఆంజనేయపురంనకు చెందిన మరో ఇద్దరికి కూడా తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన యువకులు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
20న రాష్ట్రవ్యాప్త నిరసనలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడుతున్నట్లు రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో శనివారం వారు మాట్లాడుతూ ట్రంప్ విఽధించిన సుంకాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రంప్ సుంకాల టెర్రరిజాన్ని ప్రపంచదేశాలపై రుద్దుతున్నాడన్నారు. ప్రత్యేకించి భారత దేశంపై కక్షతో సుంకాలను ఇతర దేశాలతో పోలిస్తే మరింత ఎక్కువగా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వారంగంపై పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు 19.2శాతం, ఈక్విడార్పై 13శాతం సుంకాలు విధించిన అమెరికా మనదేశంపై సుమారు 60శాతం సుంకాన్ని విధించిందని మండిపడ్డారు. ట్రంప్ హుంకరింపులతో ప్రధాని మోడీ 11శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేసి పత్తి రైతులను దివాలా తీయిస్తున్నారని ఆరోపించారు. పౌల్ట్రీ రంగాన్ని నాశనం చేసేలా అమెరికాకు సహకరిస్తున్నారని విమర్శించారు. ట్రంప్ సుంకాల మోత కారణంగా ఎగుమతులపై సుమారు రూ.2.6లక్షల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ట్రంప్ సుంకాలు, అమెరికా సామ్రాజ్యవాద చర్యలను మోడీ ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్యవాద ట్రంప్ సుంకాల యుద్ధానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమంలో రైతులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం నాయకుడు వై.కేశవరావు, ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు. -
మద్యం షాపుల నుంచి శాంపిల్స్ సేకరణ
కోనేరుసెంటర్: మచిలీపట్నంలోని మద్యం షాపుల్లో ఎకై ్సజ్ పోలీసులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, పరీక్షల నిమిత్తం శాంపిల్స్ను సేకరించారు. ములకలచెరువు నకిలీ మద్యం ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గడిచిన నాలుగురోజులుగా ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నంలో 21షాపులు, ఏడు బార్లు ఉండగా ఎకై ్సజ్ ఇన్చార్జ్ సీఐ, ఎస్సైలు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. మద్యం అమ్మకాలను పరిశీలించారు. యాప్ ద్వారా మద్యం బాటిళ్లను స్కాన్ చేసి ఏ డిస్టలరీ నుంచి సరఫరా అయినదీ తనిఖీ చేశారు. కిట్ ద్వారా మద్యం నాణ్యతను పరిశీలించారు. షాపుల నిర్వహణ సమయపాలనపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఎకై ్సజ్ సీఐ లక్ష్మణ్ మాట్లాడుతూ 21 మద్యం షాపులకు సంబంధించి 15మద్యం శాంపిల్స్, బార్ల నుంచి ఏడు శాంపిల్స్ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. ఎకై ్సజ్ నిబంధనల మేరకే వ్యాపారులు మద్యం అమ్మకాలు సాగించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం
గన్నవరం: మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురం వద్ద చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు పామర్రుకు చెందిన బాలిరెడ్డి మాణిక్యమ్మ(65) మరో ముగ్గురితో కలిసి వంట పనులు చేసేందుకు దుర్గాపురంలోని శివాలయం వద్దకు వచ్చారు. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతున్న మాణిక్యమ్మను విజయవాడ నుంచి ఏలూరు వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్సనిమిత్తం అదే కారులో గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
15 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
ఇబ్రహీంపట్నం: విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి సమ్మె నిర్వహిస్తామని యూనియన్ నాయకులు ప్రకటించారు. ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్ 129 కార్యాలయం వద్ద శనివారం సమావేశం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోదుగు మోహనరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను సంస్థలో విలీనం చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి, పీస్ రేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్స్ పరిష్కరించని పక్షంలోణీ నెల 14వ తేదీన వర్కు రూల్ పాటించి 15 నుంచి సమ్మె బాట పడతామని చెప్పారు. సమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షులు పచ్చిగోళ్ల సుబ్బారావు, వి. రమేష్, కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షంషేర్వలి, తన్వికుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ డీఆర్వో లక్ష్మీనరసింహం
బాలికా సాధికారతకు సమష్టిగా కృషి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వివక్షకు తావులేకుండా బాలికలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందని ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం అన్నారు. బాలికల విద్య, హక్కుల పరిరక్షణకు సమష్టిగా కృషిచేయా ల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శనివారం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ రైట్స్ అడ్వొకసీ ఫౌండేషన్ (సీఆర్ఏఎఫ్) ఆధ్వర్యంలో భాగ స్వామ్య పక్షాలకు ప్రత్యేక వర్క్షాప్ జరిగింది. ముఖ్య అతిథి, డీఆర్వో లక్ష్మీనరసింహం మాట్లాడుతూ.. బాలికల విద్య, ఆరోగ్యం, హక్కుల పరిరక్షణ, సామాజిక వివక్షను రూపు మాపడం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. గ్రామ స్థాయిలో బాలల సంక్షేమం, భద్రతా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. బాలికల హక్కులతో పాటు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లపై విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు వివిధ రకాల పోటీలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ పి.భానుమతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాధాకుమారి, డీసీపీఓ ఎం.రాజేశ్వరరావు, సీఆర్ఏఎఫ్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబి, సమగ్రశిక్ష అధికారి శిరీష రాణి, ఎంఈఓ పుష్పలత, చిన్నారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. -
దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. రాజగోపురం ఎదుట కళావేదికపై జరిగిన ఈ కర్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బొర్రా రాధాకృష్ణ(గాంధీ), 15 మంది సభ్యులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్అఫీ షియో సభ్యుడితో ఆలయ ఈఓ శీనానాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యురాలు పద్మా వతి ఠాకూర్ వ్యక్తిగత కారణాలతో హాజరుకావడంలేదని దేవస్థానానికి సమాచారమిచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం మహా మండపంలోని చైర్మన్ చాంబర్లో ట్రస్ట్బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. చైర్మన్ దంపతులతో పాటు పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరే.. ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవ్వారు శ్రీనివాసరావు (బుల్లబ్బాయ్), బడేటి ధర్మారావు, గూడపాటి వెంకట సరోజినీదేవి, జి.వి.నాగేశ్వరరావు, జి.హరి కృష్ణ, జింకా లక్ష్మీదేవి, మన్నె కళావతి, పనబాక భూలక్ష్మి, మోరు శ్రావణి, పెనుమత్స రాఘవరాజు, ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యకుమార్, సుకాశి సరిత, తంబ ళ్లపల్లి రమాదేవి, తోటకూర వెంకట రమణారావు, తరిగొప్పల పార్వతి, ప్రత్యేక ఆహ్వానితులుగా వెలగపూడి శంకరబాబు, మార్తి రామబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానార్చకుడు ఎల్.దుర్గాప్రసాద్ ఉన్నారు. కోడలి హత్య కేసులో నిందితురాలు తరిగొప్పల పార్వతితో బోర్డు సభ్యురాలిగా ప్రమాణం చేయడం, వేద ఆశీర్వచనం అందించడంపై విమర్శలు వచ్చాయి. తొలి రోజే వివాదాలు ప్రమాణ స్వీకారం అనంతరం మహామండపం ఆరో అంతస్తులో చైర్మన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఈఓ శీనానాయక్ అక్కడికి వచ్చారు. మీడిమా సమావేశం ఉందని ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై ఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే సుజనా చౌదరి అక్కడి నుంచి వెనుతిరగడంతో ఆయనను పంపేందుకు ఈఓ వెళ్లారు. ఈఓ అసంతృప్తిని ఆలయ సిబ్బంది చైర్మన్ గాంధీకి చెప్పడంతో ఆయన రాక కోసం పది నిమిషాలు ఎదురు చూశారు. ఈఓ వచ్చాక సమావేశాన్ని మొక్కుబడిగా ముగించారు. ఈఓ, చైర్మన్ వెనుక చైర్మన్ కుమారుడు కుర్చీ వేసుకుని కూర్చో వడం వివాదాస్పదమైంది. ప్రమాణస్వీకారానికి వచ్చిన చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యుల బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు అమ్మవారి దర్శనానికి వెళ్లడంతో వీఐీపీ, రూ.500, రూ.300 టికెట్ల క్యూ లైన్లు గంట పాటు నిలిచాయి. ప్రమాణ స్వీకారం నేప థ్యంలో అంతరాలయ దర్శనాన్ని దేవస్థానం రద్దు చేసింది. రూ.500 టికెట్ల విక్రయాలు నిలిపి, వీఐపీలు, ట్రస్ట్బోర్డు కుటుంబ సభ్యులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. అంతరాలయ దర్శనం కల్పించకపోవడంపై హైదరాబాద్, బెంగళూరు వంటి దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సామాజిక భద్రతే ఈఎస్ఐ లక్ష్యం
గన్నవరం రూరల్: ప్రజలకు సామాజిక భద్రత కల్పించటం ఈఎస్ఐ లక్ష్యమని విజయవాడ ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రణవ్కుమార్ తెలిపారు. చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కళాశాలలో ఈఎస్ఐ ఆధ్వర్యంలో స్ప్రీ–2025 అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ఉద్యోగులందరినీ నమోదు చేయటం లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. గతానికి భిన్నంగా స్వీయ నమోదు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 31 వరకూ కొనసాగుతుందని పేర్కొన్నారు. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో నడిచే కర్మాగారాలు, సంస్థలు, హోటళ్లు, ఆస్పత్రులన్నీ ఈఎస్ఐ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన మొదటి రోజు నుంచే ఈఎస్ఐ చట్టం ద్వారా లభించే ప్రయోజనాలు పొందుతారని ఆటోనగర్ ఈఎస్ఐ బ్యాంక్ మేనేజర్ కె.హేమశ్రీ వివరించారు. వైద్య సంరక్షణ ఆయా కుటుంబాలకు రక్షణగా నిలుస్తుందన్నారు. పిన్నమనేని సిద్ధార్ధ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి భీమేశ్వర్ ఈఎస్ఐ పథకంపై చూపిన చొరవ అభినందనీయమని అధికారులు కొనియాడారు. జాయింట్ డైరెక్టర్ ప్రణవ్కుమార్ -
ఎన్టీటీపీఎస్ నీటి కాలుష్యం పరిశీలించిన ఆర్డీవో
ఇబ్రహీంపట్నం:ఎన్టీటీపీఎస్ బూడిద నీటి కాలుష్యంపై అధికారుల్లో చలనం వచ్చింది. ‘జలం.. గరళం’ శీర్శికతో సాక్షిలో శుక్రవారం కథనం వెలువడింది. ఈనేపథ్యంలో ఆర్డీఓ కావూరి చైతన్య ఇతర అధికార యంత్రాంగం కదిలింది. ఎన్టీటీపీఎస్ నుంచి విడుదల అవుతున్న బూడిద నీరు బుడమేరు, చన్నీటి కాలువ, ఆర్డబ్ల్యూఎస్ ప్లాంటులో కలిసే ప్రాంతాలను ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ శివ రామాంజనేయులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ముందుగా ఆరడబ్ల్యూఎస్ ట్రీట్మెంట్ ప్లాంటు సమీపంలో చన్నీటి కాలువ నుంచి నీటిశుద్ధి ప్లాంటుకు నీరువచ్చే ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో మారిన నీటి రంగును గుర్తించారు. అనంతరం ఏకాలనీ వద్ద ఎన్టీటీపీఎస్ ప్లాంటు నుంచి బూడిద చెరువుకు నీటిని చేరవేసే పైపులు పరిశీలించారు. ఆ ప్రాంతంలో నిత్యం బూడిద మాఫియా నేతలు పైపులు పగలగొట్టి లీకేజీలు సృష్టిస్తారని, కారిన బూడిద లారీలకు అక్రమ లోడింగ్ చేస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు గుంజా శ్రీనివాస్, మేడపాటి నాగిరెడ్డి ఆర్డీఓకు వివరించారు. ప్లాంటులో మిగులు వ్యర్థాలు కాలువ ద్వారా సెక్యూరిటీ కాలనీ సమీపంలో బుడమేరు కాలువలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో నీరంతా బూడిద మయంగా మారడాన్ని గుర్తించారు. ఎన్టీటీపీఎస్ ప్లాంటులోని సైలో ప్రాంతంలో పొడి బూడిద లారీలకు లోడింగ్ చేసే విధానం, అక్కడ కలుషిత నీరు లీకేజీ పరిశీలించారు. ఆ ప్రాంతం నుంచే ఎక్కువ బూడిద నీరు తాగునీటితో కలిసే అవకాశం ఉందని గుర్తించారు. ఎన్టీటీపీఎస్ అధికారులపై ఆగ్రహం... సంస్థలో బూడిద నీటి నిర్వహణ తీరును ప్రశ్నించారు. తాగునీటిలో బూడిద నీరు కలవడంతో ఎన్టీటీపీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైప్లైన్ల లీకేజీలతోనే బూడిద తాగునీటిలో కలుస్తుందని అధికారులు సర్థిచెప్పుకునే ప్రయత్నం చేశారు. అధికారులకు ధీటుగా సమాధానం చెప్పాలని చూసిన టీడీపీ నాయకులపై మండిపడ్డారు. బూడిద నీటి కాలుష్యంపై ఆర్డీఓ చైతన్య స్పందిస్తూ బూడిద నీటిని తరలించే పైపులు లీకేజీ వలన తాగునీరు కలుషితం అవుతుందన్నారు. ఎక్కువగా వర్షం వచ్చిన సమయాల్లో నీటి కాలుష్యం జరుగుతుందని తెలిపారు. వాటర్ పైప్లైన్లు, లీకేజీలు, చన్నీరు, వేడినీటి కాలువల్లో బూడిద నీరు కలిసే ప్రాంతాలు పరిశీలించామన్నారు. మైలవరం నియోజకవర్గం గ్రామాలకు తాగునీటి సరఫరాకు ఇక్కడి నుంచే కావడం వలన సమస్య ఏర్పడిందన్నారు. దీని నివారణలో భాగంగా సుమారు 9 కిలో మీటర్ల పొడవైన పైప్లైన్ రీప్లేస్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. దీనికి తోడు ఫిల్టర్ పాయింట్కు వెళ్లే పైప్లైన్ కూడా 15 మీటర్లు దూరం ముందుకు తీసుకువెళ్లే బూడిద నీటితో సంబంధం ఉందని గుర్తించారన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రాంతాల్లో సీసీ టీవీ వ్యవస్థను ఏర్పాటు చేసి సెంట్రలైజ్ పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. వాటర్ పంపింగ్ సిస్టమ్కు రూ.1.50 కోట్లు అవసరమవుతుందన్నారు. ఎన్టీటీపీఎస్ బూడిద నీటి కాలుష్యం వ్యవహారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ నేతృత్వంలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ సీహెచ్ చిట్టిబాబు, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన, వైస్ చైర్మన్ సీహెచ్ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ ప్లోర్ లీడర్ గుంజా శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోరంకి శ్రీనివాస్రాజు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తిరువూరు: పట్టణ శివారు పీటీకొత్తూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. చౌటపల్లి పాలసేకరణ కేంద్ర వేతన కార్యదర్శిగా పనిచేస్తున్న తేలె వెంకటేశ్వరరావు (60) తన స్వగ్రామమైన చిట్టేల నుంచి తిరువూరు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అపస్మారక స్థితికి చేరిన వెంకటేశ్వరరావుకు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందడంతో తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి తిరువూరు క్లస్టర్ పాలశీతల కేంద్ర సిబ్బంది సంతాపం తెలిపారు. దీర్ఘకాలం పాలసేకరణ కేంద్రంలో పనిచేస్తూ రైతులతో సత్సంబంధాలు కలిగిన వెంకటేశ్వరరావు మృతితో చిట్టేల, చౌటపల్లి గ్రామాల్లో విషాదం నెలకొంది. -
నిర్లక్ష్యం నీడలో ఎత్తిపోతల పథకాలు!
జి.కొండూరు: కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. నీటి లభ్యత ఉండి కూడా ఎత్తిపోయలేని స్థితిలో ఎత్తిపోతల పథకాలు ఉండడంతో రైతులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతానికి చెరువుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఎత్తిపోతల పథకాలు సంవత్సరాల తరబడి నిరుపయోగంగా పడి ఉండడంతో నీటి ఎద్దడి సమయంలో సమస్య తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఎత్తిపోతల పథకాలను వాడుకలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. వెలగలేరు వద్ద పోలవరం కుడి కాల్వపై ఒకే ప్రదేశంలో నిర్మించిన వెల్లటూరు, కందులపాడు ఎత్తిపోతల పథకాలు నిర్వహణా లోపంతో ఏడాదిన్నరగా మూలనపడ్డాయి. వెల్లటూరు ఎత్తిపోతల పథకాన్ని రూ.109.10 లక్షలతో ఆ గ్రామ శివారులో ఉన్న బంధు చెరువుకు నీటి సరఫరా చేసేలా నిర్మించారు. ఈ చెరువు విస్తీర్ణం 125.32ఎకరాలు కాగా ఈ చెరువు కింద గ్రామానికి చెందిన 312.92 ఎకరాలు ఆయకట్టుగా ఉంది. ఈ చెరువుకు సాగర్ జలాలు వస్తే తప్ప వర్షాధారం లేదా ఈ ఎత్తిపోతల పథకమే ఆధారంగా ఉంది. ఈ ఎత్తిపోతల పథకంలో రెండు మోటార్లను నీటిలో ఉండి పని చేసే విధంగా అమర్చారు. అయితే ఈ రెండు మోటార్లు ఏడాదిన్నరగా పనిచేయడంలేదని రైతులు చెబుతున్నారు. అదేవిధంగా కందులపాడు ఎత్తిపోతల పథకాన్ని రూ.40.57లక్షలతో శివారు గ్రామం చేగిరెడ్డిపాడు వీరయ్య చెరువుకు నీటిని సరఫరా చేసేలా నిర్మించారు. ఈ చెరువు విస్తీర్ణం 67.53 ఎకరాలు కాగా గ్రామానికి చెందిన 138.95 ఎకరాలు ఆయకట్టు సాగుభూమిగా ఉంది. అయితే ఈ రెండు ఎత్తిపోతల పథకాలు కూడా గత ఏడాదిన్నరకుపైగా నిరుపయోగంగా ఉండడంతో ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వరి నారుమళ్లకు నీరందక రైతులు నరకయాతన పడ్డారు. కొన్ని చోట్ల నారుమళ్లు ఎండిపోవడంతో రైతులు చేసేది లేక వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేపట్టారు. అధ్వానంగా పరికరాలు.. ఈ రెండు ఎత్తిపోతల పథకాలు ఏడాదిన్నరగా నిర్వహణా లోపంతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఖరీదైన మోటార్లు, ఎలక్ట్రికల్ బోర్డులు నిరుపయోగంగా ఉన్నాయి. వీటి కోసం నిర్మించిన షెడ్ల వద్ద భారీగా ముళ్ల కంప పెరిగి కనీసం దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ షెడ్లకు ఉన్న డోర్లకు తాళాలు కూడా లేకపోవడంతో ఎలక్ట్రికల్ బోర్డులు, మోటార్ల భద్రత కూడా ప్రశ్నార్ధకంగా మారింది. నీళ్లున్నా ఎత్తిపోయలేని పరిస్థితి... ఈ రెండు ఎత్తిపోతల పథకాలను వెలగలేరు గ్రామ శివారులో పోలవరం కుడి కాల్వపై నిర్మించారు. అయితే ఈ ఎత్తిపోతల పథకాలను నిర్మించిన ప్రదేశంలో పోలవరం కాల్వపై రెగ్యులేటర్ కూడా ఉండడంతో ఇక్కడ నిత్యం నీటి లభ్యత ఉంటుంది. ఒక్కసారి ఈ కాల్వలో పట్టిసీమ నీళ్లు ప్రవాహం కొనసాగితే ప్రవాహం అపినప్పుడు రెగ్యులేటర్ లాకులు దించుతారు కాబట్టి ఆరు నెలలపాటు నీటి లభ్యత ఉంటుంది. ఈ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ పథకాలు రెండు కూడా నిరుపయోగంగా ఉండడంతో రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరడంలేదు. అదే ఈ రెండు ఎత్తిపోతల పథకాలు వాడుకలో ఉంటే ఈ రెండు చెరువుల కింద ఖరీఫ్తో పాటు రబీలో ఆరుతడి పంటలను కూడా సాగు చేసుకోవచ్చని రైతులు చెబుతున్నారు. -
యువకుడి మోసంపై యువతి ఆందోళన
మక్కపేట(వత్సవాయి): ఓ యువకుడు మాయమాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి మోసం చేశాడని యువతితో పాటు కుటుంబసభ్యులు ఆందోళన చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాధితురాలు యండ్రాతి అరుణ్య, నూతక్కి సందీప్ రెండేళ్లగా ప్రేమించుకున్నారు. అయితే గతేడాది అరుణ్య గర్భవతి కావడంతో కుటుంబసభ్యులు గమనించి వివరాలు తెలుసుకుని గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువకుడు సందీప్ తనకు వివాహం చేసుకోవడానికి ఏడాదిన్నర సమయం కావాలని అంతేకాకుండా గర్భం కూడా తీసేసుకుంటేనే వివాహం చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకుని కాగితాలు రాసుకున్నారు. తరువాత యువతి గర్భం తొలగించుకుంది. ఇప్పుడు ఏడాదిన్నర సమయం రావడంతో యువతి కుటుంబసభ్యులు పెద్దల దగ్గరకు వెళ్లారు. దీంతో వాళ్లు యువకుడిని పిలిచి అడగ్గా పెళ్లి తనకు ఇష్టం లేదని తనని వివాహం చేసుకోలేనని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంభసభ్యులు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని పోలీసులు చెప్పడంతో యువతితో పాటు కుటుంబసభ్యులు మక్కపేట గాంధీ సెంటర్లో ఆందోళన చేశారు. వైఎస్సార్ సీపీ భవనానికి ఓసీ జారీపై తీర్పు రిజర్వ్ సాక్షి, అమరావతి: మచిలీపట్నంలో వైఎస్సార్ సీపీ భవనానికి అక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసీ) జారీ చేసేలా పురపాలక శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ‘అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే భవన నిర్మాణం జరిగింది. తగిన ఫీజులనూ చెల్లించాం. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికీ సమాధానం ఇచ్చాం. అయినా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కేవలం రాజకీయ కారణాలతోనే ఇలా చేస్తున్నారు. భవన నిర్మాణంలో పలు లోపాలు ఉన్నాయని మునిసిపల్ కార్పొరేషన్ చేస్తున్న వాదనల్లో ఎటువంటి వాస్తవం లేదు’ అని నాగిరెడ్డి వాదనలు వినిపించారు. -
అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు స్వాధీనం
కంకిపాడు: అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి టపాసులను కంకిపాడు పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ జె.మురళీకృష్ణ తెలిపిన కథనం మేరకు...మండలంలోని ఉప్పలూరు గ్రామంలో గురువారం రాత్రి అదనపు ఎస్ఐ తాతాచార్యులు, పీఎస్ఐ సత్యం సురేష్ నేతృత్వంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంలోని మెయిన్రోడ్డు పరిసరాల్లో ఉంటున్న నీలం దుర్గారావు ఇంటిని సోదా చేయగా రూ.74,700 విలువైన దీపావళి టపాసులను స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి వంగర రాధాకృష్ణమూర్తిని తనిఖీ చేయగా రూ.2,68,318 విలువైన దీపావళి టపాసులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేయటంపై నీలం దుర్గారావు, వంగర రాధాకృష్ణమూర్తిపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న టపాసులను పోలీసుస్టేషన్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ, అదనపు ఎస్ఐ తాతాచార్యులు తెలిపారు. -
త్వరలో రోయింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణానదిలో వరదలు తగ్గిన తర్వాత త్వరలో రోయింగ్ రాష్ట్ర స్థాయి పోటలు, ట్రయల్స్ నిర్వహించనున్నట్లు శాప్ ఎండీ భరణికి ఖేలో ఇండియా సభ్యుడు, ఏపీ స్కల్లింగ్ –రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని తెలియచేశారు. ఆయన శుక్రవారం శాప్ ఎండీతో సమావేశమై 2025–26 సంవత్సరానికి గాను ఏపీ స్కల్లింగ్– రోయింగ్ అసోసియేషన్ వార్షిక గుర్తింపు సర్టిఫికెట్ను అందుకున్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడానికి గిరిజన యువతను రోయింగ్కు సిద్ధం చేయవచ్చని తెలిపారు. భారత సైన్యం టాప్ 5 క్రీడల్లో కూడా రోయింగ్కు ప్రాధన్యం ఇచ్చిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. -
యువతకు హెచ్ఐవీపై అవగాహన అవసరం
ఏపీశాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నీలకంఠరెడ్డి మధురానగర్(విజయవాడసెంట్రల్): యువత హెచ్ఐవీ ఎయిడ్స్పై అవగాహన పెంపొందించుకోవటంతో పాటు హెచ్ఐవీ సోకిన వారిని ఆదరించాలని ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నీలకంఠరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి 5కే మారథాన్ కార్యక్రమం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి 5కే మారథాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవీ సోకిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఏఆర్టీ చికిత్సతో వారి జీవన ప్రమాణం పెంచుకోవచ్చని అన్నారు. హెచ్ఐవీ వ్యాధి సోకిన వారిపై వివక్ష నివారణ గురించి అవగాహన కల్పించడానికి ఐఈసీ క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. బహుమతుల ప్రదానం.. 5కే మారథాన్ మహిళలు, పురుషులు, ట్రాన్స్జెండర్ విభాగాలవారీగా పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ఇక్కడ రాష్ట్రస్థాయి మారథాన్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ పోటీలలో గెలిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపించటంతో పాటు వరుసగా రూ. 35వేలు, రూ.25వేలు, రూ.10వేలు నగదు బహుమతి అందింస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏపీడీ డాక్టర్ కె. సుచిత్ర, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అంకినీడు ప్రసాద్, డాక్టర్ టి. మంజుల, ఎన్టీఆర్ జిల్లా ఎయిడ్స్, టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ బి. భాను నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కేడీీసీసీ బ్యాంక్తో ఆర్థిక వ్యవస్థ బలోపేతం
జగ్గయ్యపేట అర్బన్: కేడీసీసీ బ్యాంక్తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ అన్నారు. కేడీసీసీ బ్యాంక్ జగ్గయ్యపేట బ్రాంచ్ పరిధిలోని సొసైటీలు, బ్యాంకు సిబ్బంది, ఇన్చార్జ్లతో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ సమీక్ష సమావేశం నిర్వహించి, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం బ్యాంక్ బ్రాంచ్ టార్గెట్ రూ 361 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.310 కోట్లు సాధించామని చెప్పారు. అనంతరం ఆయన గోపాలకృష్ణ లార్జ్ సైజ్ కోపరేటివ్ సొసైటీ, కృష్ణాఫార్మర్స్ సొసైటీలను సందర్శించి అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు. కృష్ణా ఫార్మర్స్ సొసైటీ పరిధిలో నడుస్తున్న జన ఔషది మెడికల్ స్టాల్స్ను సందర్శించారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), గౌరవరం సొసైటీ అధ్యక్షుడు కట్టా నరసింహారావు, గోపాలకృష్ణ, కృష్ణా ఫార్మర్స్ సొసైటీల అధ్యక్షులు పాల్గొన్నారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురామ్ -
విద్యార్థులను చితకబాదిన టీచర్
కిలేశపురం(ఇబ్రహీంపట్నం):విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు విద్యార్థులను విచక్షణా రహితంగా చితకబాదింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కిలేశపురం (కొత్తజూపూడి)లో గురువారం చోటుచేసుకుంది. సాయంత్రం ఇంటికెళ్లిన విద్యార్థులు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు శుక్రవారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను నిలదీసి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చెప్పిన విషయాల మేరకు.. కిలేశపురంలోని ఎంపీపీ పాఠశాలలో 17 మంది విద్యార్థులు నాలుగో తరగతి చదువుతున్నారు. ఒకరిద్దరు పిల్లలు అల్లరి చేస్తున్నారని ఆగ్రహించిన టీచర్ రజని అందరికీ భయం ఉండాలని భావించి తరగతిలోని మిగిలిన విద్యార్థులందరినీ చితకబాదినట్లు చెప్పారు. ఓ బాలికకు చేతి శరీరంపై ఎర్రగా కందిపోయింది. మరో బాలిక అరచేతిని టేబుల్పై పెట్టి వేళ్లపై కర్రతో కొట్టడంతో నొప్పిని భరించలేక పోయి ఏడ్చానని స్వయంగా చెప్పింది. హెచ్ఎం బేబీరాణి గాయపడిన బాలికను ఓదార్చారు. ఓబాలిక తండ్రి బాణావత్ జగన్నాథ్నాయక్ ఈఘటనపై ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఇక చదివించమని, డబ్బులు ఖర్చు అయినా ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తామని టీసీ ఇవ్వాలని కోరారు. పిల్లలను చితకబాదిన టీచర్పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగిస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడమేనా సుపరిపాలన అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేసే కుటిల రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న కోటి సంతకాల సేకరణ పోస్టర్ను శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఉద్యమంలా చేపడదాం.. అనంతరం అవినాష్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 45 రోజుల పాటు ప్రజా ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. పీపీపీ పేరుతో తమ నాయకులకు మెడికల్ కాలేజీలను కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంటే తమ పార్టీ నాయకుల వృద్ధి అని కొత్త నిర్వచనానికి చంద్రబాబు నాంది పలికారన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తుంటే వైఎస్సార్ సీపీ నేతలు చూస్తూ ఊరుకోరన్నారు. విద్య, వైద్యం రెండు కళ్లుగా.. రాష్ట్రంలో గత ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన విద్య, వైద్యం రెండు కళ్లుగా సాగిందన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు 50 సీట్లకు అనుమతి వస్తే, వద్దన్న నీచ చరిత్ర చంద్రబాబుది అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి డబ్బులు దండుకోవాలనే చంద్రబాబు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మొత్తం పది కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తి అయ్యేవన్నారు. కోటి సంతకాలను సేకరించి గవర్నర్కు అందజేస్తామని, కూటమి నాయకులు చేసే కుటిల రాజకీయాలకు ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు, కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు. కూటమి కుటిల రాజకీయాలు ప్రజల్లోకి తీసుకెళ్దాం ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ -
ఆరోగ్యశ్రీ ఆగిపోయింది!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి నిధులు విడుదల చేయకుండా సేవలు అందించలేమంటూ ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం నుంచి ఆ పథకంలో వైద్య చికిత్సలను నిలిపివేశాయి. ప్రభుత్వం నుంచి తమకు బకాయిగా ఉన్న రూ.2,700 కోట్లను విడుదల చేస్తేనే ఆస్పత్రుల మనుగడ సాధ్యమవుతుందంటూ తేల్చి చెప్పాయి. విజయవాడలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల ఎదుట యాజమాన్యాలు బోర్డులు సైతం ఏర్పాటు చేశాయి. కొత్త కేసుల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేసి.. కేవలం ఫాలోఅప్ కేసులకు మాత్రమే వైద్య సేవలు అందించాయి. బోర్డులు ఏర్పాటు.. ఆరోగ్యశ్రీలో తాము ఎందుకు సేవలు నిలిపివేశామో తెలియజేస్తూ ఆస్పత్రుల ఎదుట బోర్డులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రూ.2,700 కోట్లు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని, ప్రతినెలా బిల్లు రూ.380కోట్ల నుంచి రూ.420 కోట్లు అవుతోందని, వాటిని ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు చెల్లించాలని, సర్జరీ ప్యాకేజీల్లో పెరుగుదల లేకపోవడం, నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటంతో వాటిని పెంచాలని కోరుతూ బ్యానర్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తమ బకాయిలు విడుదల చేసే వరకూ సేవలు కొనసాగించలేమని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. జిల్లాలో 60 నెట్వర్క్ ఆస్పత్రులు.. ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు 60 ఉన్నాయి. వాటికి సంబంధించి దాదాపు రూ.300 కోట్ల వరకూ ప్రభుత్వం బకాయి ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయా ఆస్పత్రుల నిర్వహణ ఇప్పటికే కష్టంగా మారి, ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించలేని స్థితికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం బకాయి చెల్లించేందుకు అంగీకరించకపోవడంతో బతుకు భారంగా మారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లులు, బయోమెడికల్, ఇతర పన్నులు సైతం చెల్లించలేని దుస్థితికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు చేరుకున్నట్లు వారు చెబుతున్నారు. మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులలో ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద వైద్యసేవలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ వైద్యసేవల కోఆర్డినేటర్ ఎస్.బి. సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో మొత్తం 28 నెట్వర్క్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్యసేవ కింద పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో 9 ప్రభుత్వ, 19 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయని చెప్పారు. మచిలీపట్నంలోని ఆంధ్రా ఆస్పతి, గుడివాడలోని అన్నపూర్ణ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను మినహాయించి, మిగతా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు సతీష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిలిచిన సేవలు నిధులివ్వకుండా సేవలు అందించలేమంటున్న ఆస్పత్రులు బోర్డులు ఏర్పాటు చేసి మరీ రోగులకు చెబుతున్న వైనం -
రూ.8.15 కోట్లకు దుర్గమ్మ చీరల టెండర్
● బహిరంగ వేలంలో దక్కించుకున్న పావనీ కలెక్షన్స్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సమర్పించే చీరల సేకరణ కాంట్రాక్టు రికార్డు ధర పలికింది. ఏడాదికి రూ.8.15కోట్లు చెల్లించేందుకు విజయవాడకు చెందిన పావనీ కలెక్షన్స్ ముందుకొచ్చింది. ఇంద్రకీలాద్రిపై మహామండపం ఆరో అంతస్తులో శుక్రవారం చీరలకు బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఈ–టెండర్లను దేవస్థానం ఆహ్వానించింది. రూ.50 లక్షల ప్రథమ ధరావత్తును చెల్లించిన ఏబీఐ ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్, ఆదిత్య ఎంటర్ప్రైజర్, పావనీ కలెక్షన్స్ పేరిట ముగ్గురు కాంట్రాక్టర్లు బహిరంగ వేలంలో పాల్గొన్నారు. దేవస్థాన పాటను రూ.10 కోట్లుగా నిర్ణయించి వేలం ప్రక్రియను ప్రారంభించారు. అక్టోబర్ 20తో ముగిసే ఈ ఏడాది పాట రూ.5.50కోట్లు కాగా, భక్తులు సమర్పించే చీరలు, ముక్క చీరలు, ఆషాఢ సారె మొత్తం కాంట్రాక్టరే సేకరించుకునేలా దేవస్థానం షరతులలో మార్పులు చేసింది. అయినప్పటికీ దేవస్థానం నిర్ణయించిన ధర అధిక మొత్తంలో ఉందని కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆలయ వేలాన్ని రూ.8.05 కోట్ల నుంచి ప్రారంభించారు. గతంలో కంటే భక్తుల సంఖ్య పెరిగిందని, అమ్మవారికి మొక్కుబడులు చెల్లించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని ఆలయ ఈవో శీనానాయక్ వివరించారు. చివరకు పావనీ కలెక్షన్స్ రూ.8.15 కోట్లకు బహిరంగ వేలంలో కాంట్రాక్టు దక్కించుకుంది. సీల్డ్ టెండర్, ఈ–టెండర్కు కాంట్రాక్టర్లు ఎవరూ దాఖలు చేయలేదని దేవస్థాన అధికారులు ప్రకటించారు. టెండర్ ప్రక్రియను ఏసీ రంగారావు, సుజన్, ఏఈవో సుధారాణి, సూపరింటెండెంట్ హేమదుర్గాంబ, రాజు పర్యవేక్షించారు. -
హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని, వారు విద్యార్థుల సంక్షేమ, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ, గురుకుల వసతి గృహాల నిర్వహణపై జిల్లా సంక్షేమ అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులతో కలెక్టర్ గురువారం రైతు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 34 సాంఘిక సంక్షేమ, 26 వెనుకబడిన తరగతులు, మూడు గిరిజన సంక్షేమ, రెండు మైనార్టీ సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వసతి గృహ విద్యార్థుల భవిష్యత్ సంక్షేమ అధికారులపై ఉందన్నారు. చిన్నతనంలో తాను కూడా హాస్టల్లో ఉండి చదువుకుని ఈ స్థాయికి వచ్చానన్నారు. ప్రత్యేక అధికారులు వారానికి ఒక రోజు హాస్టళ్లను సందర్శించా లని, నిర్వహణలో ఏవైనా లోపాలను గుర్తిస్తే సరిచేసేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కాచి చల్లార్చిన నీటిని తాగేలా చూడా లని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రతి ఒక్కరికీ కేర్ షీట్ నిర్వహించాలని స్పష్టంచేశారు. హాస్టళ్లకు సరఫరా చేసే మినరల్ వాటర్ ప్లాంట్లను, నీటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు హాస్టళ్లలో ఆహారాన్ని తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక అధికారులు విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి వసతి గృహంలో ఏటీఎం కిచెన్ గార్డెన్ నిర్వహించాలన్నారు. ఈ సమా వేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనర సింహం, జిల్లా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ అధికారి ఎం.రమాదేవి, మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, గురుకుల విద్యాలయ సంక్షేమ అధికారి ఎ.మురళీకృష్ణ, వెనకబడిన సంక్షేమ అధికారి కె.లక్ష్మీదేవి, సహాయ సంక్షేమ అధికా రులు వి.గణేష్, టి.గాయత్రి, ఎం.ఇజ్రాయిల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
రోడ్డు ప్రమాదాలను నివారించండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం రహదారి భద్రతా ఏర్పాట్లపై అధికారు లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువగా జాతీయ రహదారుల్లో జరిగే ప్రమాదాల్లోనే ప్రజలు మృత్యువాత పడుతున్నారన్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా ప్రయాణించే వారికి ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ వివరాలు తెలిసేలా చూస్తే వారు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. చెన్నయ్ ఐఐటీ సీనియర్ ఇంజినీర్ రాగుల్ రోడ్డు ప్రమాదాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐ రాడ్ అందించిన వివరాలను అనుసరించి ప్రమాదాలు అధికంగా జరిగే వంద జిల్లాలో కృష్ణా జిల్లా 75వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 23 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని, 2023 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 2,068 ప్రమాదాలు జరిగాయని, 734 మంది చనిపోగా 1887 మంది గాయపడ్డారని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతోనే ప్రమాదా లను నివారించొచ్చని సూచించారు. ప్రమాదాల నివారణకు సంజయ్ యాప్, ఫీల్డ్ పర్సెప్షన్ సర్వే యాప్, ట్రామా కేర్ ప్రిపేర్డ్నెస్ లెవల్ యాప్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా సాంకేతికత సాయంతో తెలుసుకోవచ్చన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన జరగనున్న జిల్లా రహదారి భద్రత సమావేశంతో పాటు భవిష్యత్లో నిర్వహించే సమావేశాలకు చెన్నయ్ విద్యార్థులు తప్పనిసరిగా వచ్చి సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో చెన్నయ్కు చెందిన సీనియర్ ఇంజినీర్ నవీన్కుమార్, రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, రహదారులు, భవనాలశాఖ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా సాగు వైపు దృష్టిసారించేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ బాలాజీ సూచించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆక్వా సాగుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతికతను అవలంబించి వినూత్న పద్ధతుల్లో ఆక్వా సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయన్నారు. ఇలా సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద నందివాడ మండలాన్ని ఓ క్లస్టర్గా తీసుకుని, ఆరు గ్రామాల పరిధిలోని 300 మంది రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో చేసే సాగుపై అవగాహన కలిగించాలన్నారు. ఆక్వా ఎక్సేంజ్ లిమిటెడ్ సహాయ వ్యవస్థాపకుడు కిరణ్కుమార్.. ఆక్వా సాగును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
నిత్యాన్నదానానికి రూ.7.91 లక్షల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు రూ.7.91 లక్షల విరాళాలు సమర్పించారు. విజయవాడ అయ్యప్పనగర్కు చెందిన టి.ఈశ్వరదుర్గానాగేంద్ర కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చి రూ.5,89,055 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. లంబాడీ పేటకు చెందిన డి.రంగారావు కుటుంబ సభ్యులు ఈఓ శీనానాయక్ను కలిసి రూ.2,02,116 విరాళం అందజేశారు. దాతలకు ఆలయ మర్యా దలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. పెడన: సహజ సిద్ధ కలంకారీకి పేరు గాంచిన పెడనకు గురువారం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులు శ్రీనివాస కోరమండల్ కలంకారీ పరిశ్రమను సందర్శించారు. వస్త్రాల తయారీని పరిశీలించారు. మహారాష్ట్ర, రాజ స్థాన్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల ఐటీ, హెచ్ఆర్ ఉద్యోగులు రాగా వారికి టూరిస్ట్ గైడ్లు నవల్దీప్, ఆశ్విత కలంకారీపై వివరాలు తెలిపారు. ప్రింటింగ్ వేయడం, రంగులు ఎలా వస్తున్నాయి తదితర విషయాలను పరిశ్రమ యజమాని పిచ్చుక వరుణ్ వివరించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): పాఠశాల్లో ఈ నెల పదో తేదీ నుంచి బోధనేతర విధులను బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ ఎ.సుంద రయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీనరసింహం, డీఈఓ యు.వి.సుబ్బా రావును ఫ్యాప్టో నేతలు గురువారం వేరువే రుగా కలిసి బోధనేతర పనులను చేయబోమని మెమొరాండం సమర్పించారు. అనంతరం సుందరయ్య మాట్లాడుతూ.. ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా బోధనేతర విధులను బహిష్క రిస్తున్నామని తెలిపారు. బోధనకే పరిమితమై మరింత నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని నిర్ణయించామన్నారు. ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ డాక్టర్ ఇంటి రాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను తగ్గించాలని డిమాండ్ చేశారు. కో చైర్మన్ జి.రామారావు, డెప్యూటీ సెక్రటరీ జనరల్ వేముల భిక్షమయ్య, నాయకులు సయ్యద్ ఖాసీం, కుక్కడపు శ్రీనివాసరావు, జి.అనుగ్రహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): దీపావళి పండు గను పురస్కరించుకుని బాణసంచా తయారీదారులు, వ్యాపారులు పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఆదేశించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినా, హెచ్చరికలను పెడచెవినపెట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిసూత గురువారం ప్రకటన విడుదల చేశారు. లైసెన్స్ లేకుండా బాణ సంచా తయారీ, విక్రయాలు నేరమని స్పష్టంచేశారు. బాణసంచాను భద్రపరిచే గోదాములకు కూడా లైసెన్స్ ఉండాలని పేర్కొన్నారు. లైసెన్స్ తీసుకునే ప్రతి వ్యాపారి తమ షాపులో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ చేయించా లని, నిబంధనలనను కచ్చితంగా పాటించా లని ఆదేశించారు. ఇళ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులకు దూరంగా బాణసంచా తయారీ కేంద్రాలు, స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమా చారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా బాణసంచా విక్రయిస్తున్నట్లు, తయారు చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. -
బాణసంచా నిల్వలు, విక్రయాలపై నిఘా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాణసంచా అక్రమ నిల్వలు, అమ్మకాలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిల్వలు, అమ్మకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా నిల్వలు, అమ్మకాల పర్యవేక్షణపై గురువారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, మునిసిపల్, వైద్య ఆరోగ్యం, పౌర సరఫరాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమగ్ర తనిఖీల అనంతరం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలిక బాణసంచా విక్రయ దుకాణాలకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీస్, మునిసిపల్, అగ్నిమాపక, పౌర సరఫరాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పరిధిలో.. విజయవాడలో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అవసరమైన మైదానాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అధికారుల నివేదికలకు అనుగుణంగా ప్రాంతాలను గుర్తించాలన్నారు. బాణసంచా విక్రయించేందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి ముందుగానే దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో బాణసంచా విక్రయాలు జరిగిన జింఖానా మైదానంలో భద్రతాపరమైన లోపాల వల్ల అగ్నిప్రమాదం సంభవించి, ఇద్దరు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ సిఫార్సులను కచ్చితంగా పాటించాలి ఏకసభ్య విచారణ కమిటీ చేసిన 23 సిఫార్సులను కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. ఒక్కో దుకాణానికి మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలన్నారు. దుకాణాలు ఎదురెదురుగా ఉండకుండా చూడాలన్నారు. రెసిడెన్షియల్ ఏరియాకు కనీసం 50 మీటర్ల దూరంలో దుకాణాలకు అనుమతివ్వాలని స్పష్టం చేశారు. ఒక క్లస్టర్లో 50కి మించి దుకాణాలకు అనుమతివ్వకూడదన్నారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆర్ఓ ఎం. లక్ష్మి నరసింహం, డీసీపీ కేజీవీ సరిత, అగ్నిమాపక అధికారి శంకర్రావు, వీఎంసీ అగ్నిమాపక అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
బోధనేతర పనిభారం తగ్గించాలి
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ నాయకుల వినతి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉపాధ్యాయులపై బోధనేతర పనిభారం తగ్గించాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు సచివాలయంలో కలిసి గురువారం వినతిపత్రం అందజేశామని ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ,ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ సత్యనారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులకు బోధనేతర పని భారం తగ్గించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ విడుదల చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని, డీఏతో పాటుగా పీఆర్సీ, ఐఆర్ కూడా ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కూడా ఉండాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలని, పీఎఫ్ లోన్స్ను వెంటనే జమ చేయాలనే అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి అన్ను వెంకటరావుతో పాటుగా సభ్యులు లోకేష్ను కలిసిన వారిలో ఉన్నారు. గంజాయితో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ నాలుగు కేజీల గంజాయి స్వాధీనం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి రమణ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన పాండియా రాజ్, విష్ణు ముత్తు కుమార్ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి దానిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి తిరుపూర్ కళాశాల ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే వారు ఈ నెల 8న బరంపూర్లోని న్యూ బస్స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక్కొక్కరు రూ.10వేలకు రెండు కేజీల గంజాయి కొనుగోలు చేసుకున్నారు. అక్కడ నుంచి బిలాస్పూర్–తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి ఈ నెల 9న మధ్యాహ్నం విజయవాడ రైల్వేస్టేషన్లో దిగారు. వీరిపై వచ్చిన ముందస్తు సమాచారం మేరకు జీఆర్పీ సిబ్బంది నాలుగో నంబర్ ప్లాట్ఫాంపై ఉన్న వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బ్యాగులను సోదా చేయగా ఒక్కో బ్యాగులో రెండు కేజీల చొప్పున మొత్తం నాలుగు కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తూర్పు, గాజుల కాపు సంక్షేమానికి కృషి చిలకలపూడి(మచిలీపట్నం): తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్కు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు బడ్జెట్ కేటాయించిందని ఆ కార్పొరేషన్ చైర్ పర్సన్ పాలవలస యశస్వీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం ఉమ్మడి కృష్ణాజిల్లా తూర్పు, గాజుల కాపు కులస్తులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వీరికి ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం పొందటంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కార దిశగా చర్యలు చేపడతామన్నారు. ఐఏఎస్, గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా ప్రతిపాదించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు బీసీ కులస్తులందరూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ కె. రాజేంద్రబాబు, సంఘ నాయకులు పాల్గొన్నారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి బంగారు హారం బహూకరణ మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దిగువ సన్నిధిలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి బంగారు హారాన్ని బహూకరించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ తెలిపారు. అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు రూ. 3.50 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని మంగళగిరి పట్టణానికి చెందిన నీలి నాగమల్లేశ్వరరావు, రత్నకుమారి దంపతులు గురువారం ఆలయ అధికారులు, అర్చకులకు అందజేశారు. -
సీజేఐపై దాడి రాజ్యాంగానికి మాయని మచ్చ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్పై దాడి రాజ్యాంగానికి మాయని మచ్చ అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీజేఐ తన ధర్మాసనంలో కూర్చుని ఉండగా, ఒక అడ్వకేట్ చెప్పు తీసి విసిరేశాడని ఇది అత్యంత అమానుషమని అన్నారు. ఎన్డీఏ పాలనలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసరడం నేటి పరిస్థితులకు తార్కాణమన్నారు. ప్రధాన న్యాయమూర్తి పరిస్థితే ఇలా ఉంటే, గ్రామాల్లో దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలన అతి భయంకరంగా ఉందన్నారు. దళితులు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడూ రోడ్లపైకి రాని దళితులు నేడు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితులను కూటమి ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. ఏపీకి చెందిన ఒక డీజీపీ స్థాయి పోలీస్ ఆఫీసర్ హరియాణాలో తన రివాల్వర్తో కాల్చుకుని చనిపోయారని, ఆయన తొమ్మిది పేజీల నోట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం గురించి రాశా రని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో దళిత ఆఫీసర్లు, దళిత ఉద్యోగస్తులు పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఏపీలో రైతులు చాలా ఆందోళనతో ఉన్నారని, చివరికి పండించిన ధాన్యాన్ని విక్రయించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. మిల్లర్లు లాభ పడ్డారని, రైతులు అప్పుల్లో, కష్టాల్లో కూరుకుపోయారని వివరించారు. బీజేపీ తన ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ హామీలు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ -
23న దుర్గమ్మకు గాజుల ఉత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఈ నెల 23వ తేదీన గాజుల ఉత్సవం నిర్వహించనున్నారు. కార్తిక శుద్ధ విదియ, భగిని హస్త భోజనం, యమ ద్వితీయను పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్, మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో అందంగా ముస్తాబు చేయనున్నారు. ఈ మేరకు ఆలయ వైదిక కమిటీ ఉత్సవానికి సంబంధించిన అంశాలపై గురువారం సమావేశమైంది. తెల్లవారుజామున అమ్మవారికి గాజు లతో విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారి ఆలయ అలంకరణకు అవసరమైన గాజులను భక్తులు, దాతల నుంచి సేకరించాలని దేవస్థానం నిర్ణయించింది. అమ్మవారికి వివిధ వర్ణాల గాజులను అలంకరణ నిమిత్తం వినియోగిస్తున్నారు. గాజులను దాతలు ఆలయ ప్రాంగణంలోని డోనేషన్ కౌంటర్లో సమర్పించొచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఉత్సవం అనంతరం అమ్మవారికి, ఆలయాన్ని అలంక రించిన గాజులను క్యూ లైన్లలో భక్తులకు పంపిణీ చేస్తారు. 20న దీపాలంకరణ ఈ నెల 20వ తేదీన దీపావళి పర్వదినం సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో పంచహారతుల సేవ అనంతరం ధనలక్ష్మీ పూజ, దీపాలంకరణ జరుగుతాయి. అంతరాలయంలోని అమ్మవారి ప్రధాన మూర్తి వద్ద ఆలయ అర్చకులు ధనలక్ష్మి పూజ నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగ ణంలో బాణసంచా వెలిగిస్తారు. అనంతరం ఏడు గంటలకు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాలతో పాటు ఇతర ఉపాలయాలకు కవాట బంధనం జరుగుతుంది. -
రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దుర్గగుడిలో జరిగిన దసరా మహోత్సవాల్లో రెడ్ క్రాస్ సంస్థ అందించిన సేవలు ప్రశంసనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ వలంటీర్ల అభినందన సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో వృద్ధులు, దివ్యాంగులకు రెడ్ క్రాస్ వలంటీర్లు మంచి సేవలు అందించారని అభినందించారు. ఉత్సవాల విజయవంతంలో రెడ్ క్రాస్ పాత్ర కూడా ఉందన్నారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు కలెక్టర్ అభినందన పత్రాలు అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరం మాట్లాడుతూ.. కేబీఎన్, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల, సిద్ధార్థ ఫార్మసీ కళాశాలల యూత్ రెడ్ క్రాస్ విభాగాల విద్యార్థులు ఒక షిఫ్ట్కు 20 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో రోజుకు 60 మంది అమ్మవారి భక్తులకు సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి, జిల్లా కార్యదర్శి ఇ.చిట్టిబాబు, సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, కేబీఎన్ కళాశాల, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలల రెడ్ క్రాస్ యూత్ వింగ్ వలంటీర్లు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
పాపం.. పసుపు రైతు!
చల్లపల్లి: ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా కరకట్ట దిగువున ఉన్న మెట్ట పొలాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా పుసుపు పంటపై వరద తీవ్ర ప్రభావం చూపింది. వరద తాకిడికి గురైన పసుపు పొలాలు క్రమంగా ఎండిపోతున్నాయి. చల్లపల్లి మండల పరిధిలోని నడకుదురు పంచాయతీ పరిధిలోని 194 ఎకరాలు, నిమ్మగడ్డలో, వెలివోలు ప్రాంతాల్లో మరో 80 ఎకరాలు మొత్తం 274 ఎకరాల వరకూ పసుపు సాగు చేపట్టినట్లు రైతులు చెబుతున్నారు. భారీగా ఖర్చులు.. ఇప్పటివరకూ ఎకరా పసుపు సాగుచేసేందుకు విత్తనానికి రూ.37,500, ఎరువులకు రూ.30వేలు(మూడు కోటాలు), కూలీ ఖర్చులకు రూ.20వేలు మొత్తం ఎకరాకు రూ.90వేల నుంచి రూ.1లక్ష వరకూ పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు కౌలు చెల్లించాల్సి ఉన్నట్లు పేర్కొంటున్నారు. వరదల వల్ల 150 ఎకరాలకు పైగా పసుపు నీట మునిగిందని అంచనా. అయితే వరదలో మునిగిన పంటలకు బీమా వర్తించదని అధికారులు చెబుతుండటంతో వారు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకొంటున్నారు. చల్లపల్లి మండలంలో ఇప్పటి వరకూ ఈ–క్రాప్ చేయించుకున్న దాని ప్రకారం 207 ఎకరాల్లో పసుపు పంట రైతులు సాగు చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఒకటి, రెండు రోజుల్లో పంట నష్టం అంచనాలు నమోదు చేస్తాం. వరదల వల్ల మునిగి, పాడైపోయిన పంటలకు బీమా వర్తించదు. – జె.కీర్తి, ఏఓ, హార్టికల్చర్ -
12న మట్టి పాత్రల తయారీపై వర్క్ షాప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మట్టి పాత్రల తయారీపై వర్క్షాప్ను ఈ నెల 12వ తేదీ ఆదివారం తమ సెంటర్లో నిర్వహిస్తున్నామని ఆర్టీజో సెంటర్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చెప్పారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న సెంటర్ ఆవరణలో వర్క్షాప్నకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గురువారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మట్టితో బొమ్మలను తయారు చేసే ప్రాచీన కళకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) డిగ్రీ పూర్తి చేసిన ప్రముఖ పోటరీ ఆర్టిస్ట్ సురేష్ ఈ వర్క్షాప్నకు ముఖ్య అతిథిగా హాజరై మట్టితో వివిధ రకాల పాత్రలు తయారుచేయడం, వాటికి అందంగా రంగులు అద్దడంపై శిక్షణ ఇస్తారన్నారు. 8 నుంచి 60 సంవత్సరాల వయస్సు లోపు వారు ఎవరైనా హాజరు కావచ్చని చెప్పారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. వివరాలకు 99499 99222లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. -
తపాలాలో దుర్గమ్మ ప్రసాదాలు పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలలో ప్రత్యేక్ష, పరోక్ష పూజలు జరిపించుకున్న ఉభయదాతలకు దేవస్థానం ప్రసాదాలను పోస్టల్ విధానం ద్వారా పంపిణీని ప్రారంభించింది. దసరా ఉత్సవాలలో 11 రోజుల పాటు అమ్మవారికి విశేష కుంకుమార్చన, విశేష శ్రీచక్రనవార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక ఛండీహోమాలను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు పరోక్షంగా తమ పేరిట పూజలను జరిపించుకునేందుకు ఆన్లైన్ ద్వారా దేవస్థానానికి డబ్బులు చెల్లించారు. పరోక్ష సేవలతో పాటు ప్రత్యేక్ష పూజలకు హాజరు కాని భక్తుల వివరాల ప్రకారం అమ్మవారి ప్రసాదాలను దేవస్థానం పంపుతుంది. చీర, పంచె, అమ్మవారి చిత్రపటంతో పాటు అమ్మవారి డాలర్, కంకణాలను పోస్టర్ ద్వారా పంపిణీ చేస్తుంది. పరోక్ష పూజలు జరిపించుకున్న ఉభయదాతలకు శేషవస్త్రం, రవిక, అమ్మవారి ప్రసాదాలను పంపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ముంబైలలో నివాసం ఉంటున్న భక్తులకు ప్రసాదాలను పోస్టల్ ద్వారా అందజేస్తున్నారు. తిరుమల దర్శనం పేరుతో రూ.12లక్షలు టోకరా ఉయ్యూరు: తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తామని మాయ చేసి రూ. 12లక్షలు టోకరా వేసిన సంఘటన ఉయ్యూరులో వెలుగుచూసింది. ఈ ఘటనపై ఉయ్యూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఉయ్యూరు సీఐ టీవీవీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన గుడివాడ దామోదర్రావు అలియాస్ దాము అతని కుమారుడు కల్యాణ్ తిరుమల దర్శనం పేరుతో ఓ వ్యక్తికి టోకరా వేశారు. పట్టణంలో ట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న ఆ వ్యక్తి కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలో గుడివాడ దాముకు సంబంధించిన విజయదుర్గ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ షాపు వద్దకు వెళ్లి నిర్మాణ సామగ్రి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో పరిచయం పెంచుకున్న దాము అతని కుమారుడు కల్యాణ్ తిరుమలలో ప్రత్యేక దర్శనం, వసతి ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. అతని వద్ద నుంచి పలు దఫాలుగా రూ.12లక్షలు వసూలు చేశారు. దర్శనం చేయించకుండా, కనిపించకుండా పోవటంతో బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు దామును అరెస్టు చేసి ఉయ్యూరు కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. మరో నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీ రూ. 22లక్షల విలువైన బంగారం మాయం కోనేరుసెంటర్: మచిలీపట్నంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి దాదాపు 216 గ్రాముల బంగారాన్ని అపహరించారు. జరిగిన సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నంలోని నరసింహనగర్కు చెందిన విష్ణు కృష్ణా కో–ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. బుధవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు లోపలికి ప్రవేశించారు. చాకచక్యంగా బీరువా తలుపులు తెరిచి అందులోని 216గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు. గురువారం ఉదయం నిద్రలేచిన విష్ణు బీరువా తలుపులు తెరిచి ఉండటాన్ని చూశాడు. అనుమానంతో బీరువా తనిఖీ చేయగా అందులోని బంగారు వస్తువులు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించి చిలకలపూడి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి క్లూస్ టీం.. విషయం తెలుసుకున్న చిలకలపూడి సీఐ నభీ ఇతర సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ. 22లక్షల వరకు ఉంటుందని బాధితుడు విష్ణు పోలీసులకు చెప్పాడు. దీంతో క్లూస్ టీం రంగంలోకి దిగి నిందితుల వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ పామర్రు: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. కూటమి ప్రభుత్వం తయారు చేసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి.. ప్రజలను ఇబ్బందులు పాలు జేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్ కుమార్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచ్లను, ప్రజా ప్రతినిధులను బెదిరించి పంచాయతీల పాలన సజావుగా సాగనీయడం లేదన్నారు. సర్పంచ్ల విధులకు అడ్డు పడుతూ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే చెక్ పవర్ రద్దు చేస్తామంటూ సర్పంచ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రైతులకు నష్టపరిహారం ఎక్కడ? ఇటీవల వచ్చిన వరదలకు తోట్లవల్లూరు మండలంలో ముంపునకు గురైన వాణిజ్య పంటలకు వెంటనే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని కై లే డిమాండ్ చేశారు. వరదలు తగ్గి నెల రోజులు కావొస్తున్నా ఇంత వరకు జరిగిన నష్టాన్ని అంచనా కూడా సక్రమంగా వేయకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శమన్నారు. వాణిజ్య పంటలు ఒక్కొక్క ఎకరానికి రూ.లక్ష చొప్పన పెట్టుబడులు పెట్టిన రైతులు నష్ట పరిహారం అందక విలవిల్లాడుతున్నారన్నారు. మండలంలో 5,200 ఎకరాలలో పసుపు, కంద, అరటి, బొప్పాయి, కూరగాయలు, చెరకు తదితరాలను హార్టికల్చర్ వ్యవసాయం చేస్తున్నారని దీనిలో సుమారు 2వేల ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లిందని అన్నారు. మినుము పంట పూర్తిగా నీట మునిగి నష్టం ఏర్పడితే ఇంత వరకు జిల్లా స్థాయి అధికారులు పరిశీలన చేసిన దాఖలాలు లేవని అన్నారు. పసుపు పంట సాగుకు ఫసల్బీమా పథకంలో ఎకరానికి రూ.1100 చెల్లించి బీమా చేసినట్లు వివరించారు. కనీసం ఆ బీమా క్లయిమ్లను కూడా ప్రభుత్వం ఇప్పించలేక పోవడం దారుణమని అన్నారు. దోచుకోవడం.. దాచుకోవడమే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుంచి ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడమే పనిగా ఉంది తప్ప ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదని కై లే అనిల్ విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి దీటుగా తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ యాప్ను ప్రారంభించారని దీని ద్వారా కూటమి నేతలు, అధికారులు తమ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే వారి పేర్లను యాప్లో నమోదు చేస్తామన్నారు. ఎంపీపీ దాసరి అశోక్కుమార్, ఐదు మండల అధ్యక్షులు కళ్లవ వెంటేశ్వరరెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, రాజుల పాటి రాఘవరావు, యలమంచిలి గణేష్, గోగం సురేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం సాయంత్రం జిల్లా విజిలెన్స్, మోనిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల విషయంల ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. బందరు డివిజన్లో 14, గుడివాడలో 6, గన్నవరం 10, అవనిగడ్డ 5 మొత్తం 35 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 31 మంది బాధితులకు రూ. 66.23లక్షల పరిహారం ప్రభుత్వం ద్వారా అందించామన్నారు. సమావేశంలో పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్రాజా, డీఆర్వో కె. చంద్రశేఖరరావు, ఏఎస్పీ బీవీ నాయుడు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డీఎస్పీలు సీహెచ్ రాజా, పి. విజయశ్రీ, ధీరజ్ వినీల్, సీహెచ్ శ్రీనివాసరావు, ఆర్డీవో కె. స్వాతి, గిరిజన సంక్షేమాధికారి ఫణిధూర్జటి తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో వసతి గృహాల్లోని విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం తదితర సదుపాయాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 90 ప్రభుత్వ వసతి గృహాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్లను నెలకోసారి పరిశుభ్రం చేయాలన్నారు. ఇందుకోసం ఒక రిజిష్టర్ను నిర్వహించి స్థానికుల సంతకాలు సేకరించాలన్నారు. వసతిగృహాల్లోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి వసతి గృహంలో క్లోరినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు ప్రతి నెల మూడో గురువారం వసతి గృహాన్ని సందర్శించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ షేక్ షాహెద్బాబు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, బీసీ సంక్షేమాధికారి జి. రమేష్, గిరిజన సంక్షేమాధికారి ఎం. ఫణిదూర్జటి, డీఎండ్హెచ్వో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువకుడి వీరంగం
మధురానగర్(విజయవాడసెంట్రల్): మద్యం మత్తులో పశ్చిమ బెంగాల్కు చెందిన యువకుడు మధురానగర్లో వీరంగం సృష్టించాడు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన రాజేష్ శ్యామ్(22) బెంగళూరు నుంచి తన సొంత నివాస ప్రాంతానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో విజయవాడలో ట్రైన్ దిగిన రాజేష్ పూటుగా మద్యం తాగాడు. మద్యం మత్తులో స్పృహ తెలియక దారితప్పి బీఆర్టీఎస్ రోడ్డు మధురానగర్ చిన్న వంతెన వద్దకు చేరుకున్నాడు. మద్యం మత్తులో తూలుతూ వంతెన వద్ద ప్రమాదకరంగా నడుస్తుండటంతో స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వీలు పడలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి మద్యం మత్తులో ఉన్న రాజేష్ చెప్పిన మాట వినకుండా తూలుతూ రైవస్ కాలువలో పడిపోయాడు. దీంతో పోలీసులు హుటాహుటిన తాడు వేసి రైవస్ కాలువలోకి దూకి రాజేష్ను బయటకు తీసుకువచ్చారు. అనంతరం ప్రథమ చికిత్స చేసి 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు -
13నుంచి విజయవాడలో షాపింగ్ ఫెస్టివల్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 13నుంచి 19వ తేదీ వరకు విజయవాడలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జేసీ ఇలక్కియ.. జాయింట్ కమిషనర్(జీఎస్టీ) ఎస్.ప్రశాంత్ కుమార్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు చేకూరే ప్రయోజనాలపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జీఎస్టీ తగ్గుదల ప్రభావమున్న వస్తువుల స్టాళ్లతో షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామన్నారు. డీఆర్డీఏ, యూసీడీ ద్వారా కూడా కొన్ని స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఈవో యూవీ సుబ్బారావు, జిల్లా పరిశ్రమల అధికారి పి.వెంకటరావు, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ -
టపాసుల గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు
పెదపూడి(మొవ్వ): దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో మొవ్వ మండలం పెదపూడిలోని బాణ సంచా షాపులు, గోడౌన్లపై బందరు స్పెషల్ బ్రాంచ్ బృందం స్థానిక పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలిసి గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రామంలోని పెడసనగల్లు రోడ్డులోని ఓ షాపులో అనుమతులు లేకుండా, భద్రతా ప్రమాణాలు లేకుండా నిల్వ ఉంచిన టపాసుల ఉంచినట్లు గుర్తించారు. ఆ టపాసులను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు కూచిపూడి ఎస్ఐ కెఎస్ విశ్వనాథ్ తెలిపారు. కాగా నిల్వ ఉన్న టపాసుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, దీనిపై గ్రామ వీఆర్వో రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ వెల్లడించారు. ఇసుక తరలిస్తున్న లారీలు సీజ్ చిల్లకల్లు(జగ్గయ్యపేట): ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ గురువారం పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం తెల్లవారుజామున మండలంలోని అన్నవరం చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ లారీని తనిఖీ చేసి ఇసుక ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే విధంగా రాజమండ్రిలో బియ్యం దిగుమతి చేసి, అక్కడి నుంచి ఇసుక తీసుకువస్తున్న రెండు లారీలను మండలంలోని గండ్రాయి చెక్పోస్టు వద్ద తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మూడు లారీల డ్రైవర్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వల్కి వెంకన్నం, వర్థం సురేష్, వంగర శ్రీశైలంను అదుపులోకి తీసుకుని వోల్టా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అదే విధంగా మండలంలోని మల్కాపురం మునేటి నుంచి రెండు ఇసుక ట్రాక్టర్లు తెలంగాణకు ఇసుక తరలిస్తుండగా చెక్పోస్టు సిబ్బంది పట్టుకున్నట్లు చెప్పారు. కేసు నమో దు చేసి, లారీలు సీజ్ చేశామని తెలిపారు. -
నేటి నుంచి ఈఎన్టీ వైద్యుల సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): అసోసియేషన్ ఆఫ్ ఓటోలారింగో లాజిస్ట్స్ ఇండియా (ఏఓఐ) దక్షిణ భారత, రాష్ట్ర సదస్సు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ కార్యదర్శి డాక్టర్ ఎంఏ రెహమాన్ తెలిపారు. అసోసియేషన్ దక్షిణ భారత, రాష్ట్రశాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని హోటల్ నోవోటెల్లో ఈ సదస్సు జరుగుతుందని ఆయన తెలిపారు. గురువారం సదస్సు నిర్వహించనున్న హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సదస్సు దక్షిణ భారత దేశంలోని 750 మందికి పైగా ఈఎన్టీ వైద్యులు పాల్గొననున్నట్లు తెలిపారు. దేశ విదేశాల నుంచి ప్రఖ్యాతిగాంచిన ఈఎన్టీ విభాగ ప్రొఫెసర్లు ఫ్యాకల్టీగా రానున్నారన్నారు. ఈ నెల 11న జరిగే ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొంటారని, నిర్వహణ అధ్యక్షుడిగా డాక్టర్ కేవీఎస్ చౌదరి, డైరెక్టర్గా డాక్టర్ పీఎస్ఎన్ మూర్తి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కాగా డాక్టర్ అక్కినేని శివరామ్తో పాటు, నగరంలోని పలువురు వైద్యులు పర్యవేక్షిస్తారని రెహమాన్ వివరించారు. -
మహిళల నిరసనాగ్రహం
నకిలీ మద్యంపై ఎకై ్సజ్ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్లు పగలకొట్టి ఆందోళన మధురానగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నకిలీ మద్యాన్ని అరికట్టి, ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. మహిళలతో కలిసి బుధవారం మారుతీనగర్ ఎకై ్సజ్ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్లను పగలకొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నాణ్యమైన మద్యం అందిస్తామని.. ప్రజల ప్రాణాలను రక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఇష్టారాజ్యంగా కల్తీమద్యాన్ని విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని మీడియా ఏకరువు పెడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవటం ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం సూత్రధారి అని చెబుతున్న టీడీపీ నాయకుడు విదేశాలకు పారిపోయి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పటంలో ఎవరి పాత్ర ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు. ఎకై ్సజ్ శాఖ మంత్రి ఎక్కడ? రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతున్నా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర ఏమై పోయారని మహిళా నేతలు ప్రశ్నించారు. సీ్త్రశక్తి అంటూ సీ్త్రలకు ప్రాధాన్యం అంటూ చెప్పే చంద్రబాబు సీ్త్రల తాళిబొట్లు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
చంద్రబాబు చేసింది శూన్యం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ప్రజలకు చేసింది శూన్యం. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏమి చేశారో చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మేయటానికి చంద్రబాబు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో నారా వారి సారా తయారీ కేంద్రాలు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. చిరంజీవిని బాలకృష్ణ తిడితే పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? వైఎస్ జగన్ గొప్పతనాన్ని చిరంజీవి కొనియాడిన విషయాన్ని మరచిపోకూడదు. – జోగి రమేష్, మాజీ మంత్రి, -
ముఖ ఆధారిత హాజరుతో పారదర్శకత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను మరింత పెంచేందుకు, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు వేతనదారులకు ముఖ ఆధారిత హాజరు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఇందుకు గాను ఆధార్ డేటా, ఈ–కేవైసీతో ఫేస్ అథంటికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ ఎంపీడీవోలు, డ్వామా అధికారులు, సిబ్బందితో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరుతెన్నులను సమీక్షించడంతో పాటు పథకం అమల్లో పురోగతిపై దిశానిర్దేశం చేశారు. ప్రణాళికపై దృష్టి.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఉపాధి శ్రామికుల ముఖ గుర్తింపు హాజరు నమోదుకు సంబంధించిన ఫేస్ – ఆర్డీ అండ్ ఎన్ఎంఎంఎస్ యాప్ను ఫీల్డ్ అసిస్టెంట్లు డౌన్లోడ్ చేసుకునేలా ఎంపీడీవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులను గ్రామసభల ద్వారా గుర్తించేందుకు అవసరమైన ప్రణాళికపై దృష్టిసారించాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చూస్తే సగటు వేతనం విషయంలో గంపలగూడెం, కంచికచర్ల జగ్గయ్యపేట మండలాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయని.. ప్రతి మండలం ఈ విషయంలో ప్రగతి చూపేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో 2025–26లో 4వేల ఎకరాల ఉద్యానపంటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 3,745 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా మునగ సాగుకు 880 ఎకరాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగుతో కలిగే ప్రయోజనాలను రైతులకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది వివరించాలన్నారు. డ్వామా పీడీ ఎ.రాము తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల పక్షాన పోరుబాట..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సూచించారు. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడాల్సిన పనిలేదని, ధైర్యంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం విజయవాడలోని ఓ హాలులో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏడు నియోజకవర్గాలకు చెందిన ఇన్చార్జులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ప్రజల పక్షాన పోరుబాట..ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కష్టాలు తీర్చేందుకు రైతుల పక్షాన పోరాడామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తమ దృష్టిలో ఉన్నట్లు తెలిపారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. డయేరియా బాధితులను ప్రభుత్వం వదిలేసిందన్నారు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా మీడియాను అడ్డుపెట్టుకొని వాస్తవాలు కప్పి పెడుతున్నట్లు విమర్శించారు. వైఎస్ జగన్ దూర దృష్టితో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుడితే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం పేదలకు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ పాలన సాగించారని గుర్తుచేశారు.ప్రతిపక్షంపై అభాండాలు..కల్తీ మద్యం తయారు చేసింది కూటమి ప్రభుత్వమని.. కానీ నిందలు వేసేది మాత్రం వైఎస్సార్ సీపీ మీద అని సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రతి జిల్లాకు కల్తీ మద్యం ఫ్యాక్టరీ పెట్టేశారన్నారు. పార్టీకి సంబంధించి గ్రామ మండల స్థాయి కమిటీలు అన్ని పూర్తి చేస్తామన్నారు. పార్టీ అధినేత జగన్ ఆదేశం ప్రకారం 29 అనుబంధ విభాగాల నియామకం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ చేసి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మొండితోక అరుణకుమార్, రూహుల్లా, పార్టీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, పార్టీ జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్సార్ టీ యూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, నాయకులు షేక్ ఆసిఫ్, పోతిన మహేష్, సర్నాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సకాలంలో చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ధాన్యం కొనుగోలు, సంబంధిత అంశాలపై జేసీ టెలీకాన్ఫ్రెన్స్ నిర్వహించారు. సమావేశంలో జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఏఎస్వోలు, సీఎస్ డీటీలు, ఏడీఏలు, ఎంఏవోలు, వీఏఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 3,03,154టన్నుల ధాన్యం సాగు చేసినట్లు పేర్కొన్నారు. అందులో 2లక్షల టన్నుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రాథమికంగా ఈనెల 20వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలానే ఆర్ఎస్కేలలో గోనె సంచుల ఏర్పాట్లు, మిల్లుల నుంచి బ్యాంక్ గ్యారంటీ సేకరణ వంటి అంశాలపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ–క్రాప్ నమోదు పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాలలో జీపీఎస్ వ్యవస్థాపనను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ -
అనుమానాలున్నాయ్..
నాణ్యమైన మద్యం అందిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు కల్తీ మద్యంతో వ్యాపారం సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కనీసం ఎకై ్సజ్ మంత్రి కొల్లు రవీంధ్ర నోరు మెదకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలి. తక్షణమే కల్తీ మద్యం సూత్రధారులను శిక్షించాలి. – ఇందుపల్లి సుభాషిణి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు -
12న సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఈ నెల 12వ తేదీ సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ, కురుమ, కురవ సంఘం పదో వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు సంఘం గౌరవాధ్యక్షుడు తట్టి అర్జునరావు, అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ, కురుమ, కురవ సంఘం ఆధ్వర్యాన సంఘం పదో వార్షికోత్సవం, సౌత్ఇండియా ఓబీసీ సెమినార్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెమినార్కు రాజకీయాలకు అతీతంగా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు హాజరుకానున్నట్లు చెప్పారు. షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నార్త్ నుంచి 6 రాష్ట్రాలు, సౌత్ నుంచి 6 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం తట్టి అర్జునరావు ఎన్నికల అధికారిగా ఆయన పర్యవేక్షణలో నూతన కార్యవర్గం ఎంపిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బందరు మల్లయ్య స్వీట్స్ అధినేత గౌరా వెంకటేశ్వరరావు, దుర్గారావు, అంజయ్య, బి.నాగభూషణం , ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కురుబ, కురుమ, కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు. వివాహితను వేధిస్తున్న బాలుడిపై కేసు నమోదు అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): వివాహిత మహిళ స్నానం చేస్తుండగా చూడడమే కాకుండా.. ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన బాలుడు (16)పై అజిత్సింగ్నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. న్యూరాజరాజేశ్వరీపేట కేర్ అండ్ షేర్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకొంటుండగా అదే ప్రాంతానికి చెందిన బాలుడు ఆమెను గమనిస్తూ నువ్వంటే ఇష్టం అంటూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు పెట్టడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫెన్సింగ్ ఓవరాల్ చాంపియన్ వైవీఎస్ఆర్
మైలవరం: లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కృష్ణా యూనివర్శిటీ మెన్ అండ్ ఉమెన్ ఫెన్సింగ్ పోటీల్లో బాలికల చాంపియన్షిప్ను కై కలూరు వైవీఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కై వసం చేసుకోగా బాలుర ఫెన్సింగ్ చాంపియన్షిప్ను డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ కళాశాల పొందింది. అదే విధంగా నాలుగు గోల్డ్, మూడు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ను సాధించి కృష్ణా యూనివర్శిటీ ఓవరాల్ చాంపియన్షిప్ సాధించిందని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేజర్ మన్నే స్వామి బుధవారం తెలిపారు. మెరుగైన క్రీడాకారులను ఎంపిక చేసి కృష్ణా యూనివర్శిటీ జట్టు తయారు చేస్తామని చెప్పారు. కృష్ణా యూనివర్శిటీ జట్టు పంజాబ్లోని గురునానక్ దేవ్ యూనివర్శిటీలో నిర్వహించే అంతర్ విశ్వ విద్యాలయాల పోటీలకు పంపిస్తామని యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ నవీన లావణ్య లతా తెలిపారు. కళాశాలలో చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రాధాన్యత ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ళా రవి తెలిపారు. మూడు గోల్డ్ మెడల్స్తో ఉమన్ చాంపియన్షిప్ వైవీఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కాకినాడ సాదించింది. 2గోల్స్, 2సిల్వర్, ఒక బ్రాంజ్తో మెన్ చాంపియన్షిప్ ఎల్హెచ్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అదే విధంగా ఉమన్ 2సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్తో కలిపి మైలవరం లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఒవరాల్ చాంపియన్షిప్ సాధించింది. విద్యార్థికి అభినందనలు కోనేరుసెంటర్: ఫెన్సింగ్ క్రీడలో బంగారు పతకం సాధించిన అలోషియాస్ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ అభినందించారు. మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల ఫెన్సింగ్ టోర్నమెంట్లో బీఫార్మసీ విద్యార్థి అలోషియాస్ బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య రాంజీ బుధవారం తన చాంబర్లో విద్యా ర్థిని అభినందించారు. నవంబర్ 6 నుంచి అమృతసర్లోని గురునానక్ విశ్వవిద్యాలయంలో జరిగే టోర్నమెంట్లో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, ఫిజికల్ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు. -
ఒక్క పింఛనూ మంజూరు చేయలేదు!
పటమట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలవుతున్నా ఇప్పటి వరకు నూతనంగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. విజయవాడ నగర పాలక సంస్థ సర్వసభ్య సాధారణ సమావేశం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం నిర్వహించారు. సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 159 అంశాలు పొందుపరచగా అందులో 124 అంశాలను సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ రెహానానాహిద్ అడిగిన ప్రశ్నకు అధికారులు, కూటమి కార్పొరేటర్లు సమాధానం చెప్పలేక చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు డెప్యూటీ మేయర్ బెల్లందుర్గ, అవుతుశైలజ, ఫ్లోర్ లీడర్ వెంకటసత్యం, పుణ్యశీల కల్పించుకుని ఇప్పటి వరకు ఒక్క సామాజిక భ్రదత పింఛను మంజూరు చేయకపోవటం కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గంలో 20 వేల పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటి వరకు విజయవాడ నగరంలో 8047 పింఛన్లు వెరిఫికేషన్ చేశారని, 5608 మందికి పింఛన్లు అందటంలేదని వెల్లడించారు. 402 మంది దివ్యాంగులకు 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని నిర్థారించారని చెప్పారు. మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ కొత్త పింఛన్ల నమోదుకు కనీసం వెబ్సైట్ కూడా ఓపెన్ చేయలేదని పేర్కొన్నారు. ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించకపోవడం కూటమి పని తీరుకు నిదర్శనమన్నారు. ప్రైవేటు వాటర్ప్లాంట్ల నుంచే డయేరియా వ్యాప్తి నగరంలో ప్రబలిన డయేరియాపై కౌన్సిల్ దద్దరిల్లింది. డయేరియా వ్యాప్తి చెందడానికి స్పష్టమైన సమాధానం అధికారులు ఇవ్వలేకపోయారు. నేటికీ అజిత్సింగ్నగర్లోని న్యూ, ఓల్డ్ ఆర్ఆర్పేటలో నీళ్లు మురికిగా, నలకలతో రంగుమారి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీఎంసీ, జిల్లా యంత్రాంగం రోజుల తరబడి నీళ్ల పరీక్షలు నిర్వహించినా సమస్యను గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందని కార్పొరేటర్ ఇసరపు రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర స్పందింస్తూ స్థానికంగా ఉన్న ఐదు ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి జరిగిన నీటి సరఫరాలో ఎకోలియా బ్యాక్టీరియా గుర్తించామని చెప్పారు. దసరా ఉత్సవాల్లో వీఎంసీ భాగస్వామ్యంపై చర్చ దుర్గామల్లేశ్వర్ల దేవస్థానంలో ఏటా నిర్వహించే దసరా ఉత్సవాల్లో వీఎంసీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని, కార్పొరేటర్ల పాస్ల వ్యవహారం, పోలీసుల అత్యుత్సాహంలో తాము అవమానాలకు గురవుతున్నామని కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. ఉత్సవాల సమయంలో పారిశుద్ధ్యం మెరుగుదల, తాగునీటి సరఫరా, క్లోక్రూం, తాత్కాలిక మరుగుదొడ్లు, కార్మికుల సరఫరా అంతా వీఎంసీ నిర్వహణలో ఉంటుందన్నారు. వాటికి అయ్యే ఖర్చంతా దుర్గామల్లేశ్వర్ల దేవస్థానం అందిస్తుందని, వీఎంసీ నుంచి నిధులు సమకూర్చటంలేదని, ప్రోటోకాల్ వ్యవహారంలో ప్రభుత్వం, జిల్లా అధికారులతో చర్చించి సభ్యుల గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ సభకు వివరించారు. బుడమేరు ముంపుపై ... గత ఏడాది వచ్చిన బుడమేరు వరదల సమయంలో ఆస్తులు, వ్యాపారాలు, ఇతరత్రా నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందలేదని కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి సభలో ప్రస్తావించారు. దీనిపై టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పటంతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు జానారెడ్డి, శర్వాణామూర్తి, డెప్యూటీ మేయర్ అవుతు శైలజరెడ్డి కల్పించకుని నేటికీ నష్టపరిహారం అందలేదని, బుడమేరు వరద ముంపు నివారణకు ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రకటించారు. వీఎంసీ నుంచి బుడమేరు ముంపు నివారణకు రూ. 56 కోట్ల నిధులు అవసరమని అంచనాలు ప్రభుత్వానికి పంపితే కేవలం రూ. 9 కోట్లు మాత్రమే మంజూరు చేశారని ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా వరద ముంపు నివారణకు వైఎస్సార్ సీపీ హయాంలో రూ.400 కోట్లతో రిటైనింగ్వాల్ నిర్మించామని చెప్పారు. ఆ ప్రాంత ముంపు బెదడను కేవలం ఏడాదిలో తీర్చామని తెలిపారు. కానీ బుడమేరు వరద ముంపు నివారణపై ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందే కానీ నెరవేర్చలేదన్నారు. -
పాత కక్షలతోనే వృద్ధురాలి హత్య
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వృద్ధురాలిని హత్య చేసి ముక్కలుగా కోసి సంచలనం సృష్టించిన కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతోనే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ ఈ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఈ నెల ఒకటో తేదీన గొల్లపూడిలోని బొమ్మసాని నగర్ వద్ద మురుగునీటిలో ఒక మహిళ మృతదేహం ఉన్నట్లుగా పోలీసులకు సమాచారమందింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అది మహిళ మృతదేహంగా గుర్తించారు. మృతదేహానికి కాళ్లు, చేతులు, తల లేకుండా మొండెం మాత్రమే ఉంది. దానిపై విచారణ చేపట్టగా ఆ మృతురాలు పొత్తూరి విజయలక్ష్మి (70)గా గుర్తించారు. ఆమె గత నెల 30వ తేదీన సాయిరాం థియేటర్ వద్ద ఉన్న వాసవీ కల్యాణమండపం వద్దకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దాంతో అక్కడ సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా వంకదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యంకు చెందిన మైనర్ కుమారుడు మృతురాలిని తన పల్సర్ వాహనంపై ఎక్కించుకొని హెచ్బీ కాలనీలోని తన నివాసానికి తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు లోపలకు వెళ్లిన ఆ మహిళ తిరిగి బయటకు రాలేదు. అయితే ఆమెను తీసుకొచ్చిన బాలుడితో పాటుగా అతని తండ్రి వంకదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యం పలుమార్లు బ్యాగులతో బయటకు వచ్చి బండిపై వెళ్లినట్లుగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులను బుధవారం దర్గా ప్లాట్స్ వద్ద అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి వృద్దురాలి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో 30వ తేదీన వృద్ధురాలిని ఇంటికి తీసుకొచ్చిన తరువాత హత్య చేసి ముక్కలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో పడవేసి నగరం నుంచి పరారయ్యామని నిందితులు తెలిపారు. పాతకక్షల కారణంగానే ఆమెను చంపినట్లుగా పోలీసుల విచారణలో అంగీకరించారు. విజయలక్ష్మి హనుమాన్జీ సుబ్రహ్మణ్యంకు వరసకు పిన్ని. నగరంలోని సీసీ కెమెరాలు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. కేసులో చురుకుగా పని చేసిన సిబందిని అధికారులు అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ దుర్గారావు, సీఐ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛతలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుదాం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్వచ్ఛ అవార్డు పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రకు బ్రాండ్ అంబాసిడర్ అని, సమష్టి కృషితో స్వచ్ఛతలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుదామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ త్వరలో పట్టణాలు, గ్రామాల్లో స్వచ్ఛ సేవక్ దళాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామాలకు త్వరలో 12 వేల ట్రైసైకిళ్లు అందిస్తామని, 1,600 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. స్వర్ణాంధ్ర సాకారానికి స్వచ్ఛాంధ్ర కీలకం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ నగరంలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు తమ శాఖ కీలక భాగస్వామ్యం అందిస్తుందని చెప్పారు. స్వచ్ఛాంధ్ర పురస్కారాలతో ఆరోగ్యకర పోటీ విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం మాట్లాడుతూ స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొల్పేందుకు స్వచ్ఛాంధ్ర పురస్కారాలు దోహదం చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీపీఓ పి.లావణ్య కుమారి, ఆర్డీఓలు కావూరి చైతన్య (విజయవాడ), కె.బాలకృష్ణ (నందిగామ), కె.మాధురి (తిరువూరు), గ్రీన్ అంబాసిడర్స్ బి.భూషణం, బి.సామ్రాజ్యం, శంకర్, పురస్కార గ్రహీతలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ -
చెట్టు పైనుంచి పడి కూలి మృతి
గుణదల(విజయవాడ తూర్పు): చెట్టు పై కొమ్మలు కొడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రీ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉయ్యూరుకు చెందిన ఆళ్ల రమణ(36) కూలి పనులు చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడ గాయత్రీనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద విద్యుత్ తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలు నరికేందుకు చెట్టు పైకి ఎక్కి కొమ్మలు నరుకుతుండగా అకస్మాత్తుగా అదుపుతప్పి కొమ్మలతో పాటే కిందికి పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయమైంది. ఇది గమనించిన స్థానికులు అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని నిర్ధారించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని భోరున విలపించారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృత దేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు.గూడు చెదిరి.. గుండె పగిలి వృద్ధుడు మృతిగుణదల(విజయవాడ తూర్పు): నాలుగు దశాబ్దాలుగా తాను నివసిస్తున్న ఇంటిని కోల్పోతున్నాననే బాధతో ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన విజయవాడ గుణదల ప్రాంతంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గుణదల పుల్లేటి కట్ట రోడ్డు ప్రాంతానికి చెందిన తోటకూర నాంచారయ్య (60) చిరువ్యాపారి. వృద్ధాప్యం కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు. గుణదల పుల్లేటి వాగు వీధిలో ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు. ఈ రోడ్డును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల స్థానికుల ఇళ్లు తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేసింది. కొన్ని ఇళ్లు తొలగించడంతో బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయం ఇవ్వకుండా తమ ఇళ్లను తొలగించడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్న నాంచారయ్య ఇళ్ల తొలగింపు విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. త్వరలోనే తన ఇల్లు తొలగిస్తారని నాంచారయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చి ఇంట్లోనే కన్ను మూశాడు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల పాలిట శాపంగా పరిణమించాయని కుటుంబసభ్యులు వాపోతున్నారు.మహిళను హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదువిజయవాడలీగల్: దొంగతనం కోసం వచ్చి మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.రాజేశ్వరి మంగళవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే యేదుపాటి పద్మావతి 2020 జనవరి 31వ తేదీ సాయంత్రం తన ఇంట్లో హత్యకు గురైంది.గుర్తు తెలియని దుండగుడు పద్మావతి గొంతు కోసి పొట్ట, ఛాతీ బాగాలలో కత్తితో పొడిచి, ఆమె ఒంటిపై ఉన్న బంగారంతో పాటు, ఇంట్లో ఉన్న బంగారం, వస్తువులు, నగదు తస్కరించాడు. హతురాలి భర్త ఫిర్యాదుమేరకు అప్పటి భవానీపురం పోలీస్స్టేషన్ సీఐ డి.కె.ఎన్.మోహన్రెడ్డి దర్యాప్తు చేసి అదే సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన పెనమలూరు మండలం చోడవరం గ్రామానికి చెందిన నిందితుడు గవిరినేని అనిల్ కుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి.రాధ, ఎం. జ్ఞానాంబ, సీఎంఎస్ సీఐ జగదీశ్వరరావు, ప్రస్తుత భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు, సీఎంఎస్ సిబ్బంది పర్యవేక్షణలో 27 మంది సాక్షులను విచారించారు. నిందితుడిపై నేరం రుజువైనందున మంగళవారం మహిళా సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి జి.రాజేశ్వరి నిందితునికి జీవిత ఖైదు, 2వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
20 వరకూ ఇగ్నో పరీక్ష గడువు పెంపు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) డిసెంబర్ –2025లో నిర్వహించే టర్మ్ ఎండ్ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా చెల్లించే పరీక్ష ఫీజు గడువు తేదీని ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుమలత తెలిపారు. ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు రూ.1100 ఆలస్య రుసుముతో ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని పేర్కొన్నారు. డిసెంబర్ సెషన్కు సమర్పించే అసైన్మెంట్ తేదీని ఈ నెల 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వారికి కేటాయించిన అధ్యయన కేంద్రాలలో సమర్పించాలని ఆమె తెలిపారు. ఇతర వివరాలకు విజయవాడ కొత్తపేటలోని హిందూ హైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా గాని లేదా 0866–2565253 ఫోన్ నంబర్ ద్వారా గాని సంప్రదించవచ్చని తెలియజేశారు. గుడివాడరూరల్: కృష్ణాజిల్లా గుడివాడ మండలంలోని రామనపూడి గ్రామంలో ఓ చిన్నారిని వీధి కుక్కలు సోమవారం రాత్రి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామానికి చెందిన గూడపాటి నాగేంద్రబాబుకు ఇద్దరు కుమార్తెలు. ఆరేళ్ల చిన్న కుమార్తె మోక్షిత ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు మీద పడి దాడి చేశాయి. చిన్నారి ఎడమ కాలి తొడ పట్టుకుని కుక్కలు వదలకపోవడంతో అక్కడే ఉన్న స్థానికులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు. వారిపై కూడా దాడి చేసేందుకు కుక్కలు ప్రయత్నించాయి. కొంత సమయానికి మరికొంతమంది అక్కడకు వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే కుటుంబ సభ్యులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు పెరిగిపోయాయని, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కృష్ణలంక(విజయవాడతూర్పు): సనాతన ధర్మం పేరిట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని అంబేడ్కర్ స్మృతివనం వద్ద గిరిజన, దళిత, మైనారిటీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన ఘటన న్యాయవ్యవస్థ పైనే కాకుండా మొత్తం జాతి మీద జరిగిన దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రజలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. -
ధాన్యం సేకరణపై ప్రణాళిక రూపొందించాలి
పెనమలూరు: ఖరీఫ్ ధాన్యం దిగుబడులపై ప్రణాళిక సిద్ధం చేసి సకాలంలో రైతుల వద్ద ధాన్యం సేకరించి మిల్లులకు పంపాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. కానూరు పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం ఏపీ పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఉయ్యూరు డివిజన్ స్థాయిలో రెవెన్యూ, ఏవోలు, రైతుసేవా కేంద్రాల సిబ్బందికి అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ ఖరీఫ్ వరి సాగు దిగుబడులు త్వరలో ప్రారంభం అవుతాయని, వరి దిగుబడుల పై అధికారులు పూర్తి అవగాహనతో ఉండి అంచనా వేయాలని సూచించారు. ఈ–క్రాప్ చేయటం వలన ఎంత దిగుబడి వస్తుందో ముందుగా అంచనా రూపొందించాలని సూచించారు. రైతులకు ఈకేవైసీ చేయటం వలన రైతుల, పంట సాగు వివరాలు ఉంటాయని, ఏఏ ప్రాంతంలో పంట దిగుబడి ముందుగా వస్తుందో గుర్తించి, రైతులకు రవాణా, గన్నీ బ్యాగ్లు అందజేయాలని సూచించారు. వరి పంట తేమ 17 శాతం ఉండే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తేమ శాతం సక్రమంగా ఉంటే గిట్టుబాటు ధర రైతులకు అందుతుందని తెలిపారు. మిల్లులకు సకాలంలో ధాన్యం తరలించాలన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వాలి ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని జాయింగ్ కలెక్టర్ నవీన్ అన్నారు. సాధారణ రకం 75 కేజీల బస్తా(కామన్) రూ.1777, ఎ గ్రేడ్ రకం 75 కేజీల బస్తా రూ.1792 ధర ఇవ్వాలన్నారు. రైతుల అవసరాలకు టోల్ ఫ్రీ నంబర్ 8247693551 అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డీవో హేలాషారోన్, సివిల్ సప్లయిస్ డీఎం టి.శివరామ్ప్రసాద్, డీఎస్వో మోహన్బాబు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, డివిజన్ పరిధిలోని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ -
కలెక్టరేట్లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహర్షి వాల్మీకి జీవితం, ఆయన సమాజానికి అందించిన రామాయణ మహా కావ్యం గొప్ప స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కొనియాడారు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు మంగళవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వాల్మీకి కవిగా, మహర్షిగా తన జీవితాన్ని మలుచుకోవడమే కాకుండా అద్భుతమైన రామాయణ మహా కావ్యాన్ని ఈ సమాజానికి అందించడం ద్వారా గొప్ప సందేశాన్ని అందించారన్నారు. మనిషి సంకల్పిస్తే ఏదైనా సాధించగలమని వాల్మీకి జీవితం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. -
ఎస్ఆర్ఆర్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎంతో ఘన చరిత్ర కలిగిన మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం డిగ్రీ ఫైనల్ విద్యార్థి కళాశాల భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయటం కలకలం రేపింది. కళాశాలలో అందరూ చూస్తుండగానే భవనంపై నుంచి విద్యార్థి దూకటంతో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇప్పటి వరకు ప్రైవేటు కళాశాలల్లో మాత్రమే ఇటువంటి సంఘటనలు జరిగేవి. విద్యార్థులలో వత్తిడి పెరిగిపోవటమే ఈ దుర్ఘటనకు కారణమని, వత్తిడి తగ్గించేందుకు కళాశాలలో తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. వివరాలలోకి వెళితే... కృష్ణలంకకు చెందిన ఎస్.వెంకట రవి డిగ్రీ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ పూర్తికానుండటంతో తాను చదివిన చదువుకు ఉద్యోగం వస్తుందో రాదోనని, తనకు మంచి మార్కులు వస్తాయో రావోనని మథన పడుతున్నాడు. ఇదే విషయంపై తనకు ఉద్యోగం వస్తుందోలేదోనంటూ ఇంట్లో సోమవారం ఆందోళన వ్యక్తం చేయగా తల్లిదండ్రులు ఉద్యోగం వస్తే వస్తుంది.. లేకపోతే వేరే పనిచేసుకోవచ్చంటూ సర్ది చెప్పారు. ఈ నేపథ్యంలో రవి మంగళవారం కళాశాలకు వచ్చిన తరువాత అధ్యాపకులు పరీక్షల జవాబు పత్రాలు ఇస్తున్న క్రమంలో ఒక్కసారిగా అందరినీ తోసుకుంటూ వెళ్లి రెండో అంతస్తు నుంచి దూకేశాడు. కిందపడిన రవి రెండు కాళ్లు విరిగిపోవటంతో కదల్లేని స్థితిలో ఉన్నాడు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు 108కు ఫోన్ చేయగా అరగంట వరకు రాలేదు. 108 వచ్చిన తరువాత చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా రెండు కాళ్లు విరిగిపోయాయని వైద్యులు తెలియజేసి, మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రవి ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కాళ్లకు మాత్రం సర్జరీ చేయాలని తెలియజేశారు. అధ్యాపకుల వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం? కళాశాలలో అధ్యాపకుల వేధింపుల వల్లే రవి ఆత్మహత్యాయత్నం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బయటకు పొక్కకుండా కళాశాల సిబ్బంది వ్యవహరిస్తున్నారని విద్యార్థులు అంటు న్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మిని వివరణ అడిగితే పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో మధ్యాహ్నం జరగాల్సిన సైన్స్ తరగతులు రద్దు చేశారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. కళాశాల రెండో అంతస్తు నుంచి కిందకు దూకిన విద్యార్థి అధ్యాపకుల వేధింపుల వల్లే అంటూ ఆరోపణలు..? ఉన్నతాధికారులు విచారణ చేయాలంటూ డిమాండ్ -
ప్రజలందరికీ బాబు వెన్నుపోటు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని, దేశంలో ఎక్కడా లేని వింత వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 16 నెలలుగా నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 85 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాల్సి ఉండగా కేవలం 40 నుంచి 50 లక్షల మందికే అందజేశారని విమర్శించారు. లైసెన్సు ఉన్న డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం అందజేస్తానన్న చంద్రబాబు కేవలం ఆటోలు తోలే డ్రైవర్లకు అది కూడా కోత విధించడం దారుణమన్నారు. పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చి మాట తప్పారన్నారు. నకిలీ మద్యం సరఫరాతో చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో బూంబూం అంటూ విమర్శలు గుప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ బ్రాండ్తో పాటు సూపర్ సిక్స్ అనే బ్రాండ్ మద్యాన్ని కూడా అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో నకిలీ మద్యం ప్లాంట్లు రెండు బయటపడడం, వీటి వెనుక టీడీపీ కీలక నేతలే ఉండడం, ఉత్తరాంధ్రలోనూ నకిలీ మద్యం ప్లాంట్లు ఉన్నాయని సమాచారం రావడంతో రాష్ట్రంలో మద్యం ప్రియుల వెన్నులో వణుకు పుడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తోందని ప్రజలకు అర్ధమైందన్నారు. నకిలీ మద్యం ఎలా తయారు చేయాలో కూటమి నాయకులకు ఆఫ్రికాలో శిక్షణ ఇచ్చి ఆ ఫార్ములా ద్వారా నకిలీ మద్యాన్ని ప్రభుత్వ పెద్దలే ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. మందు తాగొద్దు.. తస్మాత్ జాగ్రత్త ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఒక కలుగు నాయుడుగా మిగిలిపోయారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అరవటం, రెచ్చిపోవటం, ఊగిపోవటం, తూగిపోవటం, జుట్టు పీక్కోవటం లాంటి చేష్టలు చేసిన ఆయన ఇప్పుడు మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడకుండా కలుగులోనే ఉంటున్నారని విమర్శించారు. సొంత అన్నయ్యను బాలకృష్ణ అగౌరవపరిచినా బయటకు రాకపోవడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం అని వ్యాఖ్యానించిన కూటమి నాయకులు ప్రస్తుతం సీబీఎన్, పీకే, ఎల్కే బ్రాండ్లు తయారుచేసి వైన్ షాపులు, బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి మద్యం బాటిల్ను డిస్టిలరీల్లోనే తయారు చేశారని, ఇప్పుడు టీడీపీ నాయకుల ఇళ్లలోనే నకిలీ మద్యం తయారవుతోందని ధ్వజమెత్తారు. మందు బాబులు ఈ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తస్మాత్ జాగ్రత్త అని పేర్ని నాని హెచ్చరించారు. కూటమి సర్కారు పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. పవన్ ఓ కలుగు నాయుడు ఎన్ని అరాచకాలు జరుగుతున్నా బయటకు రావడం లేదు రాష్ట్రంలో 16 నెలలుగా ఏరులై పారుతున్న నకిలీ మద్యం అవన్నీ సీబీఎన్, పీకే, ఎల్కే బ్రాండ్లే వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం -
సమష్టి కృషితోనే దసరా ఉత్సవాలు విజయవంతం
భవానీపురం(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ధన్యవాదాలు తెలిపారు. దసరా శరన్నవరాత్రులు ముగిసిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడంలో కృతకృత్యులయ్యామని చెప్పారు. గత ఏడాది కంటే అధికంగా 16.5 లక్షల మంది వచ్చారని, అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశామని అన్నారు. గత ఏడాది దసరా అనుభవాలతో నగర పోలీస్ కమిషనర్ ఒక పుస్తకం రూపొందించారని, ఇప్పుడు అన్ని శాఖల అభిప్రాయాలతో ఒక పుస్తకాన్ని రూపొందిస్తామని, భవిష్యత్లో దసరా నిర్వహణకు ఈ పుస్తకం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ ఈ ఏడాది దసరా ఉత్సవాల బందోబస్తు తన 27 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్గా అభివర్ణించారు. నేరస్తులు ఎవరైనా వస్తున్నారా అనేది తెలుసుకోవడానికి 1.40 లక్షల మంది ఫొటోలతో ఎఫ్ఆర్ఎస్ కెమెరాలను ఏర్పాటు చేశామని అన్నారు. కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ పూర్తి సమన్వయం ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ఈ ఉత్సవాల నిర్వహణే నిదర్శనమన్నారు. సమావేశంలో డీసీపీ సరిత తదితరులు మాట్లాడారు. అనంతరం పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కలెక్టర్ లక్ష్మీశ, సీపీ, వీఎంసీ కమిషనర్ -
దుర్గమ్మ దసరా హుండీ ఆదాయం రూ.10.30కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో భక్తులు హుండీల ద్వారా రూ.10.30కోట్లను సమర్పించారు. ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించిన కానుకల లెక్కింపు మంగళవారంతో పూర్తయింది. తొలిరోజున రూ.3,57,92,708నగదు, 122 గ్రాముల బంగారం, 9.7కిలోల వెండి లభ్యమవగా.. రెండో రోజు రూ.6,73,02,813నగదు, 265 గ్రాముల బంగారం, 9.750కిలోల వెండి లభ్యమైంది. దసరా ఉత్సవాల్లో హుండీల ద్వారా 480 సంచులతో దుర్గమ్మకు కానుకలు వచ్చాయి. వీటిని లెక్కించగా రూ.10,30,95,521నగదు, 387గ్రాముల బంగారం, 19.450 కిలోల వెండి లభ్యమైంది. గతేడాది కంటే దాదాపు కోటి రూపాయలు హుండీల ద్వారా అదనంగా లభించింది. -
సొమ్మొకరిది.. షోకొకరిది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఉత్సవ్ పేరుతో టూరిజం నిధులకు ఎసరు పెట్టారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడకు ‘ఏపీ ప్రభుత్వ సహకారంతో’ అనే ట్యాగ్ తగిలించి.. రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజయవాడ ఉత్సవ్ కమిటీ టూరిజం శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి టెండరు పిలువకుండా, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి టూరిజం అధికారులు సైతం ఫైల్ను ఆగమేఘాల మీద సిద్ధం చేశారు. దీని వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందని తెలుస్తోంది. అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఎలాగైనా నిధులు మంజూరు చేయించుకోవాలని టీడీపీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ నిధులు రేపోమాపో విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నిధులన్నీ స్వాహా చేసేందుకేనని, టీడీపీ వర్గాల్లోనూ ప్రస్తుతం చర్చ సాగుతోంది. కనకదుర్గమ్మ ఉత్సవాలకు పైసా విదల్చని ప్రభుత్వం, ప్రైవేటు కార్యక్రమానికి నిధులు మంజూరు చేయడం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా ఫ్లాప్ షో.. పున్నమీ ఘాట్లో ఉత్సవాల ప్రారంభం రోజున జనాలు లేక వెలవెలబోయింది. ప్రారంభం చేసేందుకు వచ్చిన నేతలు సైతం అప్పట్లో పెదవి విరిచినట్లు అంతా చెప్పుకున్నారు. ఉపరాష్ట్రపతి హాజరైన సమయంలో కూడా జనాలు రాకపోవడంతో పరువు పోతుందని, హడావుడిగా డ్వాక్రా మహిళలను తరలించినట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. దుర్గమ దర్శనం ఉచితంగా కల్పిస్తే.. అక్కడ జరిగే కార్యక్రమాలకు ‘మీషో’ ద్వారా టికెట్ల అమ్మకాలు చేసి సొమ్ము చేసుకున్నారు. రెండు గంటల షోలకు భారీగా టికెట్టు ధర పెట్టి దండుకున్నారు. ఇంతలా ప్రజల నుంచి దోచుకున్న ఆ ప్రైవేటు కార్యక్రమానికి ఇప్పుడు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం ఏంటనే ప్రశ్న పలువురి నుంచి వ్యక్తం అవుతోంది. విజయవాడ ఉత్సవ్ పేరుతో జరిగిన ప్రతి కార్యక్రమం వ్యాపార కోణంలోనే జరిగిందనే భావన విజయవాడ వాసుల్లో సైతం ఉంది. అమ్మవారి ఉత్సవాల ప్రాశస్త్యం తగ్గించేలా, విజయవాడ ఉత్సవ్కు చేసిన భారీ ప్రచారంపైనా పలువురు పెదవి విరుస్తున్నారు. -
గురువుల గర్జన
బెజవాడలో కదంతొక్కిన ఉపాధ్యాయులు బోధనేతర పనులు బహిష్కరణ వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యా, ఉపా ధ్యాయ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది గురువులు బెజవాడలో కదంతొక్కారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యారంగంలో చోటు చేసుకున్న సమస్యలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రంలోని 26జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చారు. ధర్నాచౌక్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు సైతం తరలివచ్చి మద్దతు ప్రకటించారు. గాంధీనగర్లోని అలంకార్ సెంటర్, సాంబమూర్తిరోడ్డుతో పాటుగా ఆపరిసర ప్రాంతాలన్నీ ఉపాధ్యాయులతో కిక్కిరిసి కనిపించాయి. పాఠాలు చెప్పనివ్వండి మహాప్రభో.. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నేతలు ‘మమ్మల్ని విద్యార్థులకు పాఠాలు చెప్పనివ్వండి మహాప్రభో’ అంటూ ప్రభుత్వానికి విన్నవించారు. బోధనేతర పనులతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్ల పేరుతో ఉపాధ్యాయులకు ఎక్కడా తీరిక లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా యోగాంధ్ర, మెగా పీటీఎం వంటి పనులతో ఉపాధ్యాయులను రోడ్లపైకి తీసుకురావటం వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించవద్దంటూ వారంతా పెద్దపెట్టున విజయవాడ ధర్నాచౌక్లో నినదించారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు నగరంలోని చలో విజయవాడ కార్యక్రమానికి హాజరై తమ సంఘీభావం తెలిపారు. సుమారు 900 మంది కారుణ్య నియమకాల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అలాగే తాము ఆర్థిక ఇబ్బందులతో ఇక్కట్లు పడుతున్నామంటూ వాపోయారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కలిసి తమ సమస్యను వివరించామని, కానీ ఆయన ఆదేశించినా ఇప్పటి వరకూ పరిష్కారం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహించే అన్ని బోధనేతర పనులను బహిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు తీర్మానించి పిలుపునిచ్చారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం మినహా మిగిలిన పనులేమి ఉపాధ్యాయులు చేయరని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారులకు మెమోరాండాలు ఇవ్వనున్నారు. -
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో బుధవారం ఎన్టీఆర్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. రామవరప్పాడు రింగ్ సమీపంలోని కరెన్సీనగర్ ఎం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్లమెంటు పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి పాల్గొని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు హాజరు కావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కోరారు. -
శోభాయమానంగా గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ మంగళవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము 5.55 గంటలకు ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రథంపై శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లు అధిష్టించగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దుర్గగుడి ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్జేసీ భ్రమరాంబ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తజన కోలాహలం.. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యా ల నడుమ.. నగరంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనులు ఆది దంపతుల వెంట ముందుకు సాగారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ కోర్కెలు నెరవేసి, సుఖ సంతోషాలతో ఉంటా రని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆదిదంపతులకు పూజలు నిర్వహించారు. స్వర్ణకవచాలంకృతా పాహిమాం.. పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ స్వర్ణకవచం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, స్వర్ణకవచం అలంకరణ, అనంతరం అంతరాలయంలో ఖడ్గమాలార్చన నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చనకు 26 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఇక ఆలయంలో నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సుప్రభాతవ సేవలో 9 మంది, ఛండీహోమంలో 110 మంది ఉభయదాతలు, లక్ష కుంకుమార్చనలో 11 మంది, శ్రీచక్రనవార్చనలో 37 మందితో పాటు పరోక్ష సేవలోనూ ఉభయదాతలు విశేషంగా తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. అమ్మవారికి స్వర్ణకవచంలో దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ నెల 2వ తేదీతో దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ ఆదివారం వరకు భవానీల రద్దీ కొనసాగింది. 11న ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం.. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం 11వ తేదీన జరగనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఆ రోజు కార్యక్రమాన్నీ ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట గానీ, మహామండపం ఆరో అంతస్తులో గానీ నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
గ్రీన్ క్లైమేట్ ఫండ్తో మత్స్యకారులకు ఉపాధి
కృష్ణా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో చేపట్టే కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ. 85 లక్షలు గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులు జిల్లాకు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. జిల్లాలో 1420 ఎకరాలను మడ అడవులుగా రూపొందించేందుకు గుర్తించామన్నారు. ఏం చేయాలాంటే.. ఈ సంవత్సరం వినూత్నంగా గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో పీతలు, అలంకార చేపలు, సముద్రనాచు పెంపకం ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలన్నారు. ఇందులో భాగంగా 40 పీతల పెంపకం యూనిట్లు, 23 అలంకార చేపల పెంపకం యూనిట్లు, 25 సముద్ర నాచు పెంపకం యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టు మేనేజర్ ఉష, డీఎఫ్వో సునీత, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, ఆర్డీవో స్వాతి, మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నల్ల జెండాలతో నిరసన తెలుపుదాం
రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల పిలుపుకృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న దోపిడీ చర్యలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్ధించడం దారుణమని, భూమి, అడవులు, జీవనాధారాన్ని కాపాడుకునేందుకు పోరాటం ఉద్ధృతం చేయాలని రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ అధ్యక్షతన మంగళవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆదివాసీ, అటవీ హక్కులు, చట్టాలను ధిక్కరించి ఆదివాసీలను జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం అదాని, నవయుగ, మెగా, షిర్డీ సాయి కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆదివాసీలు నల్ల జెండాలతో ఆదివాసీ గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని తీర్మానించారు. దుర్మార్గమైన చర్య.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జీవోలు 2,13,51 రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగించాలన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆమోదం లేకుండా చట్టాలు ధిక్కరించి ప్రాజెక్టు నిర్మాణం చేయడం దుర్మార్గమన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పల నర్స, మైదానం గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దిసర ప్రభాకర్, గిరిజన ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్ బాలాజీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛతకు పురస్కారాల పట్టం
భవానీపురం(విజయవాడపశ్చిమ): పారిశుద్ధ్యం నిర్వహణ, పరిశుభ్రతలో ఉత్తమ ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర పురస్కారాలు–2025లో ఎన్టీఆర్ జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజేతలకు పురస్కారాలను అందజేశారు. మొత్తం 69 రాష్ట్ర స్థాయి పురస్కారాలలో ఎనిమిది జిల్లాకు వచ్చాయి. ప్రత్యేక కేటగిరీ అవార్డ్ (స్వచ్ఛ సర్వేక్షణ్)లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు దక్కగా, స్వచ్ఛ కాలనీల విభాగంలో విజయవాడ లోని కేపీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్కు లభించింది. స్వచ్ఛ ఆస్పత్రుల విభాగంలో విజయవాడ భవానీపురంలోని హెచ్బీకాలనీలోగల యూపీహెచ్సీ, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు అవార్డులు లభించాయి. స్వచ్ఛ అంగన్వాడీల విభాగంలో కేదారేశ్వరపేట–3 అంగన్వాడీ కేంద్రం, స్వచ్ఛ బస్ స్టేషన్ల విభాగంలో విజయవాడ బస్ స్టేషన్, స్వచ్ఛ పాఠశాలల కేటగిరీలో విజయవాడ కృష్ణ లంకలోని వీఎంఆర్ఆర్ (జీ) మునిసిపల్ కార్పొ రేషన్ హైస్కూల్, స్వచ్చతా ఎన్జీఓల కేటగిరీలో రైజ్ సంస్థ అవార్డులు సాధించగా ఆయా సంస్థలు, పాలనా యూనిట్ల ప్రతినిధులు సీఎం చంద్రబాబు చేతులమీదుగా అందుకున్నారు. కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ముంద డుగు వేస్తూ స్వచ్ఛాంధ్ర పురస్కారాల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపినందుకు అధికారులు, సిబ్బందికి కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారాల స్ఫూర్తితో జిల్లాను మరింత స్వచ్ఛత దిశగా నడిపించాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రులు పి.నారాయణ, కె.పార్థసారథి, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) వచ్చిన అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీదారులతో సంబంధిత అధికారి మర్యాదగా ప్రవర్తించాలని, ఎండార్స్మెంట్ తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. వ్యవహార శైలి, పరిష్కార విధానం సరిగా లేవన్న అభిప్రాయం అర్జీదారుల నుంచి ఎట్టి పరిస్థితిలోనూ రాకూడదని స్పష్టం చేశారు. రీ ఓపెన్ చేసిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీల పరిష్కారంలో సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 182 అర్జీలు: జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 182 అర్జీలు అందాయి. వీటిలో రెవెన్యూ విభాగంలో అత్యధికంగా 53, పోలీస్ 36, పురపాలక, పట్టణాభివృద్ధి 24, పంచాయతీరాజ్ 14, రవాణా 10, డీఆర్డీఏ 9, ఆరోగ్యశాఖ 6, పౌరసరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, దేవదాయ, విద్యాశాఖ, బ్యాంకు లకు సంబంధించిన అర్జీలు మూడు చొప్పున, ఎకై ్సజ్, మార్కెటింగ్, సర్వే శాఖలకు సంబంధించిన అర్జీలు రెండు చొప్పున, గనులు, భూగర్భ శాఖ, నీటిపారుదల, గృహ నిర్మాణం, గ్రామీణ నీటిసరఫరా, కార్మిక, ఉపాధి కల్పన, రిజిస్ట్రేషన్ – స్టాంపులు, నైపుణ్యాభివృద్ధి, డ్వామా శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ అందాయి. ఈ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ప్రధాన అర్జీలు... ●రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగించాలని ఇంగ్లిష్ మీడియం విద్యా పరిరక్షణ వేదిక రాష్ట్ర సమన్వయకర్త ఏడుకొండలు షెపర్డ్ కలెక్టర్ను కలిసి అర్జీ సమర్పించారు. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్ కోర్సులను ప్రభుత్వ విద్యాలయాల్లో నెలకొల్పాలన్నారు. వేదిక సభ్యులు మహమ్మద్ నూరు, ఈదర గోపీచంద్ తదితరులు ఉన్నారు. ●డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, జీవనం దుర్భరంగా ఉందని, తమకు జీతాలు ఇప్పించాలని కాంట్రాక్ట్ కార్మికులు అర్జీ సమర్పించారు. -
కృష్ణా మిల్క్ యూనియన్కు స్వచ్ఛ ఇండస్ట్రీ అవార్డు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో భాగంగా కృష్ణా మిల్క్ యూనియన్కు బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీ అవార్డు లభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం సోమవారం జరిగింది. సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరగగా, బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీ– మెగా, భారీ పరిశ్రమల కేటగిరీలో మొదటి ర్యాంకును కృష్ణా మిల్క్ యూనియన్ వీరవల్లిలోని కామధేను ప్లాంట్ను వరించింది. ఈ అవార్డును సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అందుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు పాల్గొన్నారు. ●లక్షల మంది తాగేనీటిలో బూడిద అవశేషాలు ●బూడిద కాలుష్యంపై సీఎం, డెప్యూటీ సీఎంలు స్పందించాలి ●మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్ ఇబ్రహీంపట్నం: కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రాంతమైన పవిత్ర సంగమాన్ని కూటమి నేతలు, ఎన్టీటీపీఎస్ అధికారులు బూడిద నీటితో అపవిత్రం చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఎన్టీటీపీఎస్ అధికారులు బూడిద నీటిని బుడమేరు కాలువ ద్వారా కృష్ణానదిలో కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర సంగమ ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. కృష్ణానది ఒడ్డున ఉన్న సీఎం చంద్రబాబు బూడిద నీటి కాలుష్యాన్ని పరిశీలించాలన్నారు. అమరావతి, విజయవాడ, దివిసీమ, కై కలూరు డెల్టా ప్రాంత వాసులు కొన్ని లక్షల మందితో పాటు సీఎం చంద్రబాబు ఇంట్లో సైతం వాడేది కృష్ణాజలాలే అన్నారు. కాలుష్య నివారణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దీనిపై దృష్టి సారించాలన్నారు. కాలుష్యంతో ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారని, ప్రజల ప్రాణాలతో చంద్రబాబు, పవన్కల్యాణ్ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు పార్టీలకు అతీతంగా మరో పోరాటం చేద్దామని పిలుపు నిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, అతని బావమరిది బూడిద దోపిడీపై కోట్లు సంపాదిస్తున్నారన్నారు. తనను అరెస్టు చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి, జి.కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, మేడపాటి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోదాములో అగ్ని కీలలు
● ఎలక్ట్రానిక్స్ పరికరాలు భద్రపరిచే గోదాము దగ్ధం ●విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లేప్రమాదమని అనుమానం ● సుమారు రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా రామవరప్పాడు(గన్నవరం): విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని ఓ ఎలక్ట్రానిక్స్ పరికరాలు భద్రపరిచే గోదాములో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాములో నిల్వ ఉంచిన ఎలక్ట్రానిక్స్ పరికారాలైన ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, మైక్రో ఓవెన్లు, వాషింగ్ మిషన్లు వంటి విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.5కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏం జరిగిందంటే.. ఎనికేపాడు గ్రామంలోని డెకథ్లాన్ వెనుక ప్రాంతంలో సీఅండ్ ఎఫ్ఏ–శ్రీ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ప్యానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గోదాము ఉంది. మాగంటి అంజనీకి చెందిన ఐదు ఏకరాల స్థలంలో 16 వేల అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గోదాములో ఎలక్ట్రానిక్స్ పరికరాలు భద్రపరుస్తారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల డీలర్లకు సరఫరా చేస్తుంటారు. ఉదయం 7.40 గంటల సమయంలో దట్టమైన పొగతో కూడిన మంటలు గోదాము నుంచి ఎగసి పడ్డాయి. తొలుత గోదాముకు ఒక వైపు మంటలు అంటుకోవడంతో అవి క్రమేణా వ్యాపించాయి. అగ్నికీలల ధాటికి గోదాములోని ఆఫీసు రూమ్తో పాటు ఎలక్ట్రానిక్స్ పరికాలకు మంటలు అంటుకున్నాయి. అట్ట పెట్టెల్లో పార్సిల్ చేసి ఉన్న పరికరాలకు మంటలు అంటుకున్నాయి. అసలే మండే స్వభావం ఉంచే థర్మాకోల్తో పార్సిల్ చేసి ఉండటంతో మంటలు మరింతగా ఎగసి పడ్డాయి. పెద్ద పెద్ద శబ్దాలతో ఎలక్ట్రానిక్స్ వస్తువులు పేలడంతో పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న గోదాము మేనేజర్ షాజహన్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు గంటలకు పైగా శ్రమించి.. భారీ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఆటోనగర్, కొత్తపేట తదితర ప్రాంతాల నుంచి ఏడు ఫైర్ ఇంజిన్లతో ప్రమాద స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు కష్టపడ్డారు. గోదాములోకి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో జేసీబీ సహాయంతో గోడను ధ్వంసం చేసి సహాయక చర్యలు మొదలు పెట్టారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన సహాయక చర్యలు 11గంటలు దాటే వరకూ కొనసాగాయి. ఎగసి పడుతున్న మంటలకు గోదాము మొత్తం వ్యాపించక ముందే అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే గోదాములోని ఆఫీసు రూమ్లో భద్రపరచిన రికార్డులు, మూడు వంతులకు పైగా గోదాము అగ్నికి ఆహుతి అయ్యింది. ఎగసిపడిన మంటల ధాటికి గోదాము పైకప్పు రేకులు కూడా ఊడిపడ్డాయి. అగ్ని జ్వాలల వేడిమికి గోదాముకు మరో వైపు ఉన్న ఏసీల ఇండోర్ యూనిట్లు కరిగిపోయాయి. ఎలక్ట్రానిక్స్ గోదాములో జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై విచారణ చేపడతాం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా లేక అదృశ్య శక్తుల ప్రమేయం ఉందా అన్నది క్లూస్, ఫోరెన్సిక్ టీమ్, ఎలక్ట్రికల్, ఫైర్ డిపార్టుమెంట్ల సహయంతో విచారణ చేస్తాం. రికార్డులు కాలిపోవడంతో స్టాక్ వివరాలు పూర్తి స్థాయిలో గుర్తించలేకపోయాం. ఎలక్ట్రానిక్స్ పరికాలు కాలిపోయిన ఫ్రేమ్ల బట్టి ఏయే వస్తువులు ఎన్ని కాలిపోయాయో అంచనాకు వస్తాం. – దామోదర్, సెంట్రల్ ఏసీపీ -
రేపు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వరి రైతులు తరచూ ఎదుర్కొంటున్న ఎలుకల సమస్యను నివారించి, పంటను కాపాడటానికి సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి సాగు చేసే ప్రాంతాలలో ఈనెల 8వ తేదీ బుధవారం ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎలుకల వల్ల తీవ్ర పంట నష్టం సంభవిస్తోందని, దీనిని నివారించడానికి సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల నుంచి బ్రోమోడయోలోన్ ఎలుకల మందును కలిపిన ఎరను ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ఎలుకలు ఉన్న బొరియలను గుర్తించి వాటిని మట్టితో కప్పి ఉంచాలని, మరుసటి రోజు తెరుచుకుని ఉన్న బొరియలలో బ్రోమోడయోలోన్ ఎలుకల మందు కలిపిన ఎరను ఉంచి మూసివేయాలని తెలిపారు. రైతులంతా సామూహికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, తద్వారా వరి పంటను ఎలుకల బారి నుంచి కాపాడుకోవచ్చని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి, డీఆర్ఓ లక్ష్మీ నరసింహం, డెప్యూటీ కలెక్టర్ కె.పోశి బాబు, వ్యవసాయ శాఖ ఏడీ అనిత భాను పాల్గొన్నారు. -
అక్రమార్కులకు గేట్ వే
ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మల్కాపురం ఉచిత ఇసుక పథకం పేరుతో అక్రమార్కులు తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తూ జేబులు నింపు కొంటున్నారు. రాత్రింబవళ్లూ తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. వాహనాల రణగొణ ధ్వనులతో గ్రామంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ట్రాక్టర్ల శబ్దాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జగ్గయ్యపేట మండలం మల్కాపురం తెలంగాణ రాష్ట్రానికి సరి హద్దులో ఉండటంతో అక్రమార్కులకు గేట్ వే గా మారింది. మల్కాపురం(జగ్గయ్యపేట): జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామంలోని మునేరులో మూడు చోట్ల ఇసుక ర్యాంపులు ఉన్నాయి. అందులో మొలకవాగు, గొల్లగుండు, శ్మశానవాటికకు వెళ్లే రహదారిలోని ఇసుక రేవులు ఉన్నాయి. అక్రమార్కులు తెలంగాణకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మొలకవాగు, గొల్లగుండు ర్యాంపులను ఎంచుకుని ఇసుక అక్రమ రవాణాకు బాటలు వేశారు. ర్యాంపునకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో ఇటీవల రోడ్డును గ్రావెల్తో అభివృద్ధి చేయడంతో పాటు మూడు చోట్ల కాలువలు ఉండే ప్రాంతాలలో తూములు ఏర్పాటు చేసి మరీ రోడ్డు నిర్మించారు. దీంతో మునేరు నుంచి గ్రామంలోని ప్రధాన రోడ్డు వరకు ఎక్కడా ఏ గొయ్యి లేకుండా ట్రాక్టర్ క్షణాల్లో బయటకు వచ్చేస్తోంది. ఈ ర్యాంపుల్లో ఇసుక 25 మీటర్ల మేర వెయ్యి ఎకరాల్లో ఉంటుంది. మార్కెట్లో ఈ ఇసుక విలువ రూ.300 కోట్లుగా ఉంటుంది. వ్యవసాయ పనులు మానేసి ఇసుక లోడింగ్కు... మునేరు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రేయింబవళ్లూ తెలంగాణకు తరలిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 100కు పైగా ట్రాక్టర్లు ఉన్నాయంటే ఏ మేరకు ఇసుక అక్రమ రవాణా అవుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో వ్యవసాయ పనులు కూడా మానేసి కూలీలు ముఠాలుగా ఏర్పడి ఇసుక లోడింగ్కు వెళుతున్నారు. ఒక్కో ముఠాలో నాలుగు నుంచి ఎనిమిది మంది ఉంటారు. ముఠా ట్రాక్టర్ ఇసుక లోడింగ్ చేసినందుకు రూ.800 నుంచి రూ.1100 వరకు అక్రమార్కులు చెల్లిస్తున్నారు. రోజుకు ఒక్కో ముఠా 30 నుంచి 50 ట్రాక్టర్ల వరకు లోడింగ్ చేస్తుండటంతో ఒక్కో కూలీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆదాయం వస్తోంది. దీంతో కూలీలు కూడా పూర్తిగా వ్యవసాయ పనులు మానేసి ఇసుక లోడింగ్కు వెళుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇసుకకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గ్రామానికి కూతవేటు దూరంలో ఉండే తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద మండవ ఇసుక రేవు ఉన్నప్పటికీ అక్కడి ఇసుకకు నాణ్యత లేకపోవడంతో మల్కాపురం మునేరు ఇసుకకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఒక్కో ట్రక్కు ట్రాక్టర్ ఇసుక ధర రూ. 8 వేల నుంచి రూ.11 వేల వరకు పలుకుతోంది. ట్రాక్టర్ల యజమానులకు వ్వవసాయం కూడా ఆశాజనకంగా లేకపోవడంతో అక్రమార్కులకు ట్రాక్టర్లను అద్దెకు ఇస్తున్నారు. రోజుకు రూ.2 వేల వరకు అద్దె లభిస్తుండటంతో అదే బాటలో మిగతా వారు అద్దెకు ఇస్తున్నారు. రుణాలు తీసుకొని ట్రాక్టర్లు కొనుగోలు గ్రామంలో ఇసుక వ్యాపారం ఆశాజనకంగా ఉండటంతో గతంలో 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉండగా ఈ ఏడాదిన్నర కాలంలోనే ఆ సంఖ్య 100కు చేరింది. బ్యాంకు రుణాలు తీసుకుని మరీ ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేసే యువత ఉంటే వారికి రోజుకు రూ.800 వరకు ఇస్తున్నారు. కొంతమందికి పూర్తి స్థాయిలో డ్రైవింగ్ రాకపోగా ఇష్టానుసారంగా నడుపుతుండటంతో ఇటీవల గ్రామంలో మూగ జీవాలపై దూసుకెళ్లి మృత్యువాత పడ్డాయి. 18 గ్రామాలకు తరలిపోతున్న ఇసుక తెలంగాణ రాష్ట్రంలోని వల్లభి, నేలకొండపల్లి, చెరువు మాధవరం, ముజ్జుగూడెం, గోండ్రాల, తమ్మర, బుద్దారం, రాయిగూడెం, రాజేష్పురం, చిమ్మిరాల, కోదాడ, బాణాపురం, పెదమండవ తండా, చిన్నమండవ, మంగాపురం తండా, కృష్ణాపురం, కమలాపురం గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ గృహాలకు ఇసుక తరలిస్తున్నారు. తరలింపు కూడా ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ముఖ్యంగా మునేరు నుంచి ఇసుక ట్రాక్టర్లు బయలుదేరి రెండు కిలోమీటర్ల దూరంలో గల పెద్ద మండవ సరిహద్దు ప్రాంతానికి వెళ్తాయి. అక్కడ ఆ ప్రాంతానికి చెందిన అక్రమార్కులు ఏపీ నుంచి తీసుకువచ్చిన ఇసుక లోడ్ ట్రక్కును అక్కడ పార్క్ చేసి, అక్కడి నుంచి వేరే ట్రక్కును తీసుకొచ్చి, మళ్లీ ఇసుక లోడు చేసిన తరువాత అక్కడికి తీసుకెళ్తారు. తెలంగాణ రిజి స్ట్రేషన్ ట్రక్కులతో ఇసుక రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
పెనమలూరు సర్పంచ్గా భాస్కరరావు కొనసాగింపు
పెనమలూరు: పెనమ లూరు సర్పంచిగా లింగా ల భాస్కరరావును కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. పెనమలూరు సర్పంచి లింగాల భాస్కరరావు గ్రామంలోని పల్లిపేట కాలువ కట్టపై సిమెంట్ రోడ్డు నిర్మించారు. అయితే దీనిపై కలెక్టర్కు ఫిర్యాదులు అందటంతో జిల్లా పంచాయతీ అధికారి విచారించారు. ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండా రోడ్డు వేశారని అభియెగాలు చూపు తూ డీపీవో నివేదిక ఇచ్చారు. దీంలో కలెక్టర్ గత మే నెలలో సర్పంచి భాస్కర రావును 3 నెలలు సస్పెండ్ చేసి చెక్పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై భాస్కరరావు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్కు అప్పీల్కు వెళ్లారు. అయితే అప్పీల్ పెండింగ్లో ఉంచి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో సర్పంచి హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేశారు. కోర్టు ఈ ఘటనపై పూర్తి విచారణ చేసింది. సర్పంచి సస్పెన్షన్ చేసి మూడు నెలలు గడిచినా ఎటువంటి విచారణ చేయకుండా సస్పెన్షన్ కొనసాగించటం సరైన చర్యకాదని కోర్టు భావించింది. సర్పంచిగా లింగాల భాస్కరరావును కొనసాగించి, అఽధికారాలు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సర్పంచిగా భాస్కరరావు బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు ఉత్తర్వులు జారీ -
షార్ట్ సర్క్యూటే కారణమా?
గోదాములో సంభవించిన ఈ అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. గోదాములోని ఆఫీసు రూమ్ వద్ద విద్యుత్ బాక్స్ల నుంచి నిప్పు రవ్వలు రాలి పడటంతో మంటలు అంటుకుని ఉంటాయని భావిస్తున్నారు. మరో పక్క ఈ ప్రమాదానికి ఉద్దేశపూర్వకంగా అదృశ్య శక్తులు మరెవరైనా కారణమై ఉంటారన్న అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ఆఫీస్ కార్యాలయంలోని రికార్డులు, స్టాక్ వివరాలు అగ్నికి ఆహుతవ్వడంతో ఎంత నష్టం జరిగి ఉంటుందని పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోతున్నారు. సమాచారం అందుకున్న విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోదాము మేనేజర్, యజమానితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ ఘటన పై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇబ్రహీంపట్నం గోడౌన్లో భారీగా పట్టుబడిన కల్తీ మద్యం
జి.కొండూరు/ఇబ్రహీంపట్నం: ములకలచెరువులో కల్తీ మద్యం రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నంకు చెందిన టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్రావు వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో ఆయన ఏ1 నిందితుడు కావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఇబ్రహీంపట్నంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో జనార్దన్రావుకు చెందిన ఏఎన్ఆర్ బార్ని ఆదివారం రాత్రి సీజ్ చేసిన పోలీసులు సోమవారం ఉదయం సోదాలు చేపట్టారు. జనార్దన్రావు పరారీలో ఉండడంతో ఆయన తమ్ముడు జగన్మోహన్ రావును, గుమస్తా కట్టా రాజుని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్కు సమీపంలో ఉన్న ఏఎన్ఆర్ బార్కి ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లోని ఓ గోడౌన్లో భారీగా కల్తీ మద్యం, బాటిలింగ్ చేసే యంత్రం, ఖాళీ క్వార్టర్ బాటిళ్లు, కల్తీ మద్యం నింపిన బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు జనార్దన్రావు గతంలో బార్ నిర్వహించిన పాత భవనంలో కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించారు. ఇక్కడ కల్తీ మద్యం మిక్సింగ్ చేసే యంత్రాలు, స్టీలు డ్రమ్ములు, గతంలో మద్యం నింపిన ఖాళీ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు.ఇబ్రహీంపట్నంలో పట్టుబడిన మద్యంభారీగా పట్టుబడిన కల్తీ మద్యంను గొల్లపూడిలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయానికి తరలించినట్టు అధికారులు మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన కల్తీ మద్యంలో ఓల్డ్ అడ్మినరల్ పేరుతో ఉన్న 129.6లీటర్ల 720 బాటిళ్లు, క్లాసిక్ బ్లూ పేరుతో ఉన్న 25.92 లీటర్ల 144 బాటిళ్లు, కేరళ మాల్ట్ పేరుతో ఉన్న 69.12 లీటర్ల 384 బాటిళ్లు, మంజీరా బ్లూ పేరుతో ఉన్న 4.32 లీటర్ల 24 బాటిళ్లు, లేబుళ్లు అతికించని 1175.04 లీటర్ల 6528 బాటిళ్ల మద్యం, 95 క్యాన్లలో ఉన్న మిక్సింగ్ స్పిరిట్ 3325 లీటర్లు, ఓల్డ్ అడ్మినరల్ పేరుతో ఉన్న 6500 లేబుళ్లు, 2200 ఖాళీ బాటిళ్లు, క్యాన్లు 4, పైపులు రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. పాత ఏఎన్ఆర్ బార్ భవనంలో తయారీ కేంద్రంలో లభ్యమైన కల్తీ మద్యం తయారీ యంత్రాలు, స్టీలు డ్రమ్ములు, ప్లాస్టిక్ క్యాన్లు అదనంగా దొరికాయి.పేద మందుబాబులే టార్గెట్పేద, మధ్య తరగతికి చెందిన మందుబాబులే టార్గెట్గా కల్తీ మద్యం రాకెట్ నడిచింది. బెల్టు షాపులు, బార్లలో అధికంగా విక్రయాలు జరిగే బ్రాండ్ల పేరుతోనే నకిలీ లేబుళ్లను తయారు చేసి కల్తీ మద్యం నింపి విక్రయించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చిన నాటి నుంచి ఈ దందాను కొనసాగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో బెల్టు షాపులను ఎంపిక చేసుకుని మరీ సరఫరా చేశారని సమాచారం. రూ.కోట్లల్లో ఈ దందా కొనసాగింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్రావు టీడీపీ నేత కావడంతో పాటు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో కూడా సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ కల్తీ మద్యం రాకెట్లో ఎవరి పాత్ర ఏమిటో తేలాల్సి ఉంది.కల్తీ మద్యం తయారీ ఇలా...వేల లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ని క్యాన్లలో తీసుకొచ్చి దానికి క్యారెమెల్, వాటర్ కలిపి స్పూరియస్ లిక్కర్(కల్తీ మద్యం) తయారు చేస్తారు. ఈ విధంగా ఒక లీటరు స్పిరిట్కు 180 ఎంఎల్ కల్తీ మద్యం బాటిళ్లను 135 వరకు తయారు చేస్తారు. ఈ విధంగా తయారైన కల్తీ మద్యంను మార్కెట్లో ఉన్న మద్యం బాటిళ్ల లేబుళ్లు మాదిరిగా డూప్లికేట్ లేబుళ్లను తయారు చేసి ప్లాస్టిక్ బాటిళ్లలో నింపి బెల్టు షాపులు, బార్లకు విక్రయిస్తారు. ఈ కల్తీ మద్యంను ఒక్కొక్క బాటిల్పై ఎంఆర్పీను బట్టి రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గించి హోల్సేల్ ధరలకు బెల్టు షాపులు, బార్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్రావుకు చెందిన ఏఎన్ఆర్ బార్తో పాటు అతని భాగస్వామ్యంతో నడుస్తున్న భవానీపురం శ్రీనివాస వైన్స్, కంచికచర్లలోని ఓ వైన్షాపుతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కల్తీ మద్యం తయారీకి స్థానికంగా ఉండే కార్మికులైతే గుట్టు రట్టయ్యే అవకాశం ఉండడంతో జనార్దన్రావు గుమస్తా కట్టా రాజు పర్యవేక్షణలో ఒడిశా, కేరళకు చెందిన కార్మికులతో కల్తీ మద్యం తయారు చేయిస్తున్నారని తెలుస్తోంది. ములకలచెరువులో కల్తీ మద్యం గుట్టురట్టు కావడంతో కార్మికులను వెంటనే ఇబ్రహీంపట్నంలో ఉన్న తయారీ కేంద్రం నుంచి వారివారి ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.తీగ లాగితే డొంక కదిలినట్టు ములకల చెరువులో కల్తీ మద్యం రాకెట్ వెనుక ఇబ్రహీంపట్నం టీడీపీ నేత హస్తం బట్టబయలైంది. స్థానికంగా ఆయనకు చెందిన ఒక గోడౌన్లో ఇతర రాష్ట్రాల కార్మికులతో కల్తీ మద్యం తయారు చేయించి, ఆ బాటిళ్లపై ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు వేసి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో బెల్టు షాపులకు, బార్లకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం వెల్లడవడంతో ఈ ప్రాంత మందుబాబులు ఉలిక్కిపడుతున్నారు. -
సైన్స్ అండ్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాట క, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్లో సోమవారం ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా నియమితులైన మందలపు రవికుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీని వినియోగించుకుని అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్. రోషన్కుమార్, బడేటి రాధాకృష్ణ, ఎం.వెంకటరాజు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొని రవికుమార్ను అభినందించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రత్యేక రైలులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల యాత్రను నవంబర్లో ప్రారంభించనున్నామని భారతీయ రైల్వేస్ భారత్ గౌరవ ట్రైన్, సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పర్యాటక రైలులో తమిళనాడు, కేరళలో ఉన్న దేవాలయాలు, పంచ ద్వారక, మహదేవ్, జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చని తెలిపారు. నవంబర్ 16వ తేదీన మొదటి విడత యాత్ర, 26న రెండో విడత యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇండియన్ రైల్వే, మొదటి భారత్ గౌరవ్ రైలు, సౌత్ స్టార్ రైల్, అతిపెద్ద టూరిస్ట్ రైలు ఆపరేటర్ టూర్ టైమ్స్ ఈ యాత్ర చేపట్టిందన్నారు. ఈ ప్రత్యేక పర్యాటక రైలు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో లేదన్నారు. రిజర్వేషన్ల కోసం టూర్ టైమ్స్ను నేరుగా 93550 21516 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చన్నారు. అందుకోసం www.tourtimes.in సందర్శించాలన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో 85 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 85 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు, నడవలేని వికలాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు అందుకున్నారు. గ్రీవెన్స్లో భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 36, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 11, కొట్లాటకు సంబంధించి 03, వివిధ మోసాలపై 06, మహిళా సంబంధిత నేరాలపై 09, దొంగతనాలకు సంబంధించి 03, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 17, ఇలా మొత్తం 85 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారమే ధ్యేయం కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్నాయుడు పేర్కొన్కారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ కోసంలో మొత్తం 42 అర్జీలు ప్రజల నుంచి అందినట్లు తెలిపారు. -
కోర్టు కేసులున్నా.. లెక్కలేనితనం!
కౌలు రైతుల భూముల్లో అక్రమంగా సరుగుడు పంట దోపిడి కృత్తివెన్ను: కోర్టులో కేసు నడుస్తున్న భూముల్లో కౌలురైతులు పెంచుకున్న పంటను నిర్భయంగా, దౌర్జన్యంగా కొట్టుకుపోతున్నా సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై స్థానిక రైతులతో పాటు, కిసాన్సంఘ్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం దీవిలో కొన్నేళ్లుగా సరుగుడు తోటల వ్యవహారంలో వివాదం నెలకొంది. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన పెద్ద వివాదం చెలరేగింది. జిల్లాకు చెందిన ఒక మంత్రి అండతో కొందరు వ్యక్తులు అక్రమంగా తమ తోటల్లోకి ప్రవేశించి రైతులను బెదిరించి పంటను కోసుకుపోవడంతో పెద్ద రచ్చ జరిగింది. దీంతో అక్రమార్కులు కొంత నెమ్మదించారు. అయితే గత వారం రోజులుగా ఇదే భూముల్లో తిరిగి అక్రమంగా సరుగుడు తోటలను కొట్టేసి దౌర్జన్యంగా తరలించుకుపోతున్నారంటూ సమాచారం అందుకున్న కిసాన్సంఘ్ రాష్ట్ర కోశాధికారి వల్లభనేని ఆశాకిరణ్ ఆధ్వర్యంలో సభ్యులు సోమవారం గొల్లపాలెం చేరుకుని ట్రాక్టర్లు, లారీలో తీసుకువెళుతున్న కర్రల లోడును అడ్డుకుని కిందికి దించేశారు. విషయం ఏమిటంటే.. చినగొల్లపాలెంలో ఆర్ఎస్ నంబర్ 213, 217, 572/1లో దాదాపు 40 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిపై వివాదం ఉండటంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ భూముల్లో ఉన్న పంటను కోర్టుతీర్పు వచ్చే వరకు ఎవ్వరూ కొట్టరాదని స్థానిక రైతులు చెబుతున్నారు. అయినా సరే కొందరు వ్యక్తులు అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి అండతో కోర్టు కేసులో ఉన్న భూముల్లో దాదాపు 20ఎకరాల్లోని పంటను నరికేసి తీసుకుపోయినట్లు వాపోతున్నారు. ఈ భూములన్నీ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కౌలుకు చేస్తున్నారని వాటిలో పంటను తరలించుకుపోతున్నట్లు వారు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి దౌర్జన్యాలను అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు. చినగొల్లపాలెంలో కోర్టుకేసుల్లో ఉన్న భూముల్లో నరికేసిన సరుగుడు కర్రలు లారీలో తరలించడానికి సిద్ధంగా ఉన్న కర్రలను కిందికి దించేస్తున్న రైతులు అధికారులు పట్టించుకోరా? ఇక్కడ భూముల్లో కొన్నేళ్ల క్రితం కొందరు స్థానికులు కౌలుకు భూములు తీసుకుని సరుగుడు పంటను వేసుకున్నారు. ప్రస్తుతం ఆ భూముల వ్యవహారం కోర్టులో ఉంది. న్యాయస్థానాన్ని గౌరవించకుండా కేవలం అధికార అహంకారంతో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా తోటలను కొట్టేస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసు యంత్రాంగాలు వారికి వత్తాసు పలుకుతూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయి. – వల్లభనేని ఆశాకిరణ్, కిసాన్సంఘ్ రాష్ట్ర కోశాధికారి ఈ భూముల వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోంది. తీర్పు వచ్చేవరకు ఎవ్వరూ కూడా భూముల్లో ప్రవేశించకూడదు. కానీ కొందరు వ్యక్తులు కోర్టును సైతం ధిక్కరించి దాదాపు 20 ఎకరాల భూముల్లోని పంటను నరికేసి తీసుకుపోయారు. ఇది చాలా దారుణమైన విషయం. నాతో పాటు ఇక్కడి కౌలురైతులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నారు. రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. – ఎండూరి రవీంద్రమూర్తి, రైతు -
హైస్కూల్ ప్రహరీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్ రహదారికి అవతల వైపు ఉన్న హైస్కూల్ ప్రహరీ గోడను ఢీకొట్టి లోపలకు దూసుకు వెళ్లింది. అదృష్టవశాత్తు అవతల రోడ్లో ఎటువంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సేకరించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి సుమారు 10.30 గంటలకు న్యూగో ఎలక్ట్రికల్ ప్రైవేట్ బస్ విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ దాటిన తరువాత రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గర బస్ నిలిపి డ్రైవర్ టీ తాగారు. అనంతరం బస్ స్టార్ట్ చేసి ఒక వాహనం అడ్డుగా ఉండటంతో దాన్ని తప్పిస్తూ స్టీరింగ్ను కుడి వైపునకు తిప్పి మళ్లీ ఎడమ వైపునకు తిప్పుదామనుకునే లోపు అదుపు తప్పి అదే వైపునకు వెళ్లి సెంట్రల్ డివైడర్ పైకి ఎక్కి రోడ్డుకు అవతల ఉన్న శ్రీపోసాని నరసింహారావు చౌదరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను ఢీకొంది. ఆ వేగానికి పాఠశాల లోపలకు కొంత మేర దూసుకుపోయింది. ఆ సమయంలో బస్లో ముగ్గురు ప్రయాణికులే ఉండటంతో వారికి గానీ, డ్రైవర్కు గానీ ఏమీ కాలేదు. జాతీయ రహదారి కావడంతో వాస్తవానికి ఆ సమయంలో గొల్లపూడి వైపు నుంచి వాహనాలు వస్తుంటాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ మార్గంలో ఎటువంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఒక్క రోజులో బెజవాడ రైల్వే డివిజన్కు రూ.5 కోట్ల ఆదాయం
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ఒకేరోజు అత్యధిక మంది ప్రయాణికుల నిర్వహణ, ఆదాయంలో విజయవాడ డివిజన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈనెల 4న విజయవాడ డివిజన్ నుంచి ఇతర ప్రాంతాలకు 2.8 లక్షల మంది ప్రయాణికుల రవాణా ద్వారా రూ.5 కోట్ల ఆదాయం సాధించింది. ఇది కేవలం ఒక్కరోజులో డివిజన్ సాధించిన సరికొత్త మైలురాయిగా నిలిచింది. దీంతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ డివిజన్కు వచ్చే ప్రయాణికులతో కలుపుకొని మొత్తం 5.5 లక్షల మంది ఒక్క రోజు ప్రయాణం చేశారు. అందులో విజయవాడ స్టేషన్ నుంచి 82 లక్షల మంది ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం ద్వారా రూ.2 కోట్లు ఆదాయం వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ స్టేషన్లో దిగిన వారితో కలుపుకొని 1.7 లక్షల మంది ప్రయాణికులుగా నమోదైంది. ప్రయాణికుల రద్దీ పెరుగుదలను సమర్థంగా నిర్వహించడానికి డివిజన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డివిజన్లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో అదనంగా 25 బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లను ప్రారంభించారు. 72 ఏటీవీఎం (ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు) ఏర్పాటు, ప్రయాణికులకు సహాయం చేసేందుకు 110 ఏటీవీఎం ఫెసిలిటేటర్లను 24 గంటలు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా అరుదైన రికార్డు సాధించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
ఉత్సాహంగా కరాటే పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శారీరక దారుఢ్యంతో పాటుగా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కరాటే ఎంతగానో దోహదం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వాడో–ఆర్వైయూ చీఫ్ ఇన్స్ట్రక్టర్ జేఎం దాస్ చెప్పారు. స్థానిక సీతారామపురంలోని ఐకాన్ స్కూల్ ఆవరణలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు ఆదివారం జరిగాయి. పోటీల ప్రారంభ సందర్భంగా జేఎం దాస్ మాట్లాడుతూ విద్యార్థులు కరాటేలో శిక్షణ తీసుకోవడం ద్వారా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి చదువులో కూడా రాణిస్తారన్నారు. ఐకాన్ స్కూల్ డైరెక్టర్ పార్థసారఽథి మాట్లాడుతూ కరాటే పోటీలకు తమ పాఠశాల ఆవరణ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరై పలు అంశాల్లో ప్రతిభ చూపారు. ఆదిల్ పాషా బ్లాక్ బెల్ట్ సాధించగా.. 22 మంది ఎల్లో బెల్ట్, 10మంది ఆరెంజ్ బెల్ట్, 12 మంది గ్రీన్ బెల్ట్,10మంది పర్పుల్ బెల్ట్, 25 మంది బ్రౌన్బెల్ట్ సాధించారు. వీరికి జేఎం దాస్, పార్థసారథి సర్టిఫికెట్లను అందజేశారు. మహిళలు ఫిట్నెస్పై దృష్టి పెట్టాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు ఫిట్నెస్పై దృష్టి సారించాలని, అప్పుడే ఆరోగ్యకర జీవనం సాధ్యమవుతుందని రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమశాఖ కార్యదర్శి ఎ. సూర్యకుమారి అన్నారు. మొగల్రాజపురంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన హర్ హెల్త్ ఉమెన్ సెంటర్ను ఆదివారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ ఇలాంటి సెంటర్ వల్ల మహిళలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సెంటర్ సీనియర్ ఫిజియోథెరపిస్టు డాక్టర్ ఆర్. అర్చన మాట్లాడుతూ ఇక్కడ గర్భవతులకు చైల్డ్ బర్త్ క్లాసులు, బ్రెస్ట్ ఫీడింగ్ కన్సల్టేషన్, ప్రసవానికి ముందు, తర్వాత యోగా తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో గైనకాలజిస్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ ఎం. త్రిపురసుందరీదేవి తదితరులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక మచిలీపట్నంఅర్బన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) కృష్ణా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం ఏపీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీని వాసరావు, పరిశీలకులుగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. అనిత వ్యవహరించారు. కృష్ణా జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షుడిగా అంబటిపూడి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా వి. సాంబశివరావు, కార్యదర్శులుగా పి. శివాజీ, గణేష్, సీహెచ్ నాగప్రసాద్, వై. శ్రీనివాసరావు, ఎన్. శివలక్ష్మి, వైవీ కృష్ణకాంత్, ఉపాధ్యక్షులుగా పి. సత్యనారాయణ, జేకే కిరణ్ కుమార్, డి. సాంబశివరావు, నాగరాజు, కల్యాణి, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఏ. రాంగోపాల్, జి. వెంకటేశ్వరరావు, సీహెచ్ నారాయణ మూర్తి, ఎస్. పద్మావతి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. రామారావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్, జిల్లా పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, టి. కోటేశ్వరరావు పాల్గొన్నారు. బయ్యవరం(క్రోసూరు): మండలంలోని బయ్యవరం గ్రామంలో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆరు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు, ఆదివారం నాలుగు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు పోటీలో నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎడ్లపోటీలు తిలకించేందుకు హాజరయ్యారు. -
సూర్యలంక తీరంలో ఇద్దరు గల్లంతు : కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది
బాపట్ల టౌన్: సూర్యలంక సముద్రతీరంలో స్నానాలు చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా టేకుమిట్ల గ్రామానికి చెందిన బొద్దు శ్రీను, నల్గొండ జిల్లాకు చెందిన కత్తుల వినేష్లు తమ కుటుంబ సభ్యులతో ఆదివారం మధ్యాహ్నం సూర్యలంక తీరానికి చేరుకున్నారు. సముద్రంలో స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి ఇరువురు నీటిలో మునిగారు. గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో అప్రమత్తమైన కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లారు. కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లను ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. తీరానికి వచ్చే పర్యాటకులు పోలీస్ సిబ్బంది ఆదేశాలను పాటించి, సముద్రస్నానాలు చేయాలని ఆయన సూచించారు. -
పత్తి రైతు చిత్తు
●అధిక వర్షాలతో రంగు మారుతున్న పత్తి పైరు ● పూత రాలిపోయి కాపు లేక వెలవెలబోతున్న వైనం ● క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో తీవ్రంగా నష్టం ● పెట్టుబడులు కూడా రాని వైనం ఈ ఏడాది పత్తి పంట ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడులు కూడా రావు. వర్షాలకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవు. పెరిగిన పెట్టుబడులు, కౌలుతో పత్తి రైతుకు నష్టం తప్పదు. – ఎన్.లక్ష్మీనారాయణ, మక్కపేట, వత్సవాయి మండలం వ్యవసాయాధికారులు గ్రామాలలో పర్యటించి నష్టపోయిన పత్తి పంటను నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించాలి. వ్యవసాయశాఖ నివేదిక మేరకు నష్టపరిహారం చెల్లించి రైతును ఆదుకోవాలి. – కనగాల రమేష్, వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వత్సవాయి/జి.కొండూరు: ఈ ఏడాది పత్తి పంట రైతులను చిత్తు చేసింది. అధిక వర్షాలకు గిడసబారి పత్తి కాయ పగిలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. పత్తి తీతకు వచ్చే దశలో వర్షాలు పడుతుండడంతో పూత రాలిపోయి, కాయలు మచ్చలు వచ్చి రాలిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. నష్టాల్లో ఆదుకునే క్రాప్ ఇన్సూరెన్స్ సైతం ప్రభుత్వం తొలగించడంతో నష్టాలను పూడ్చుకునే మార్గం కనిపించక పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. భారీగా పెరిగిన పెట్టుబడులు... గతంలో కంటే పత్తి పంటకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చులు అవుతున్నాయి. ఎకరం భూమి కౌలు ధర రూ.20 వేల వరకు ఉండగా, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.25 వేలు అవుతుంది. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.7 వేలు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. లేనిపక్షంలో నష్టాలు తప్పవు. మొక్కజొన్న సాగుపై ఆశ... పత్తి పంట దెబ్బతినడంతో రెండవ పంటగా రైతులు మొక్కజొన్నపై ఆశలు పెట్టుకుంటున్నారు. తీతకు వచ్చిన పత్తిని తీసుకుని వెంటనే పత్తిని తొలగించి దాని స్థానంలో మొక్కజొన్న పంట వేసేందుకు రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది కూడా పత్తి పంట నష్టం రావడంతో రెండవ పంటగా మొక్కజొన్న సాగుచేశారు. ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి క్వింటా రూ.2 వేల పైనే పలకడంతో రైతులకు కొంత ఊరట లభించింది. ఈ సీజన్ కూడా రైతులు మొక్కజొన్నపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. -
ఎయిర్పోర్ట్కు విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే
గన్నవరం: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు. ఆమరావతి పర్యటన నిమిత్తం ఆయన తిరుపతి నుంచి సాయంత్రం ఇక్కడికి విచ్చేశారు. విమానాశ్రయంలో అథవాలేకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ జె.రంగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా ఉప సంచాలకులు ఎం.రమాదేవి తదితరులు స్వాగతం పలికారు. ● నవంబర్ 8,9 తేదీల్లో నరసరావుపేటలో నిర్వహణ ● వెల్లడించిన పల్నాడు జిల్లా బాలోత్సవ్ కమిటీ సభ్యులు నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావు పేటలోని శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆవరణలో నవంబరు 8,9 తేదీల్లో ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా బాలోత్సవ్ కమిటీ అధ్యక్షుడు, ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు పేర్కొన్నారు. కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పల్నాడు బాలోత్సవం పిల్లల పండుగలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించిందని, అదేస్ఫూర్తితో ఈ ఏడాది పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. గౌరవ సలహాదారుడు, శ్రీకృష్ణ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కొల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు పోటీల్లో పాల్గొని విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పోటీల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.అంజిరెడ్డి, గౌస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనేలా రూపకల్పన చేసి తమ కళలను ఆవిష్కరింప చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. పోటీలో పాల్గొనదలచిన ఉపాధ్యాయులు ఈనెల 26వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 98665 62260, 99498 09821 నంబర్లలో లేదా palnadubalotsavam @gmail. com మెయిల్ ఐడీలో సంప్రదించాలని సూచించారు. -
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వం
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ(ఆర్.సి.పి.ఐ) రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ కుమార్ అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకు వెళుతోందని, కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికుల శ్రమను యాజమాన్యాలకు దోచిపెట్టే విధంగా ముందుకు సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుచేసి యువతను ప్రోత్సహిస్తామని చెప్తున్నప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకుడు దేవర నాగన్న మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రారంభించాలని, రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, శివకోటి రాజు, వి.మంగ, సుగుణమ్మ, రియాజ్, అరుణ్ పాల్గొన్నారు. భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ కుమార్ -
బందరు కాలువలో పడి యువకుడు గల్లంతు
పెనమలూరు: యనమలకుదురులో ఓ యువకుడు ప్రమాదవశాత్తు బందరు కాలువలో పడి గల్లంతైన ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు ఇందిరానగర్కు చెందిన ఉద్దగిరి లక్ష్మి తన ఇద్దరు కుమారులతో కలసి ఉంటోంది. పెద్ద కుమారుడు వెంకటేష్ (20) తాపీ పనులు చేస్తాడు. అతను శనివారం పనికి వెళ్లి సాయంత్రం వచ్చి బందరు కాలువ వంతెన వద్ద కూర్చున్నాడు. తల్లి లక్ష్మి కుమారుడు వెంకటేష్ను ఇంటికి రమ్మని చెప్పగా, వెంకటేష్ తల్లిని ఇంటికి వెళ్లమని తాను వెంటనే వస్తానన్నాడు. అయితే వంతెనపై కూర్చున్న వెంకటేష్ రాత్రి 9 గంటలకు ప్రమాదవశాత్తు వంతెన పైనుంచి బందరు కాలువలో పడి గల్లంతయ్యాడు. ఇది చూసిన స్థానికులు వెంకటేష్ తల్లి లక్ష్మికి సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు వచ్చి కాలువలో గాలించినా వెంకటేష్ ఆచూకీ తెలియలేదు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అధికారులు రంగంలోకి దించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బందరు కాలువలో వెంకటేష్ కోసం గాలిస్తున్నారు. ఇంకా ఆచూకీ తెలియలేదు. -
బుడమేరులోకి ఎన్టీటీపీఎస్ బూడిద నీరు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడే బూడిద నీటిని సమీపంలోని వేడినీటి కాలువ (బుడమేరు)లోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ పరిణామాలతో బుడమేరు కాలువలో నీరు మొత్తం బూడిద రంగులోకి మారింది. నెలరోజులకు పైగా జూపూడి సమీపంలోని బూడిద చెరువులో లారీలకు బూడిద లోడింగ్ నిలిచిపోయింది. దీంతో చెరువు మొత్తం బూడిద నిల్వలతో నిండిపోయింది. ప్రత్యామ్నాయ మార్గంగా ఆర్డబ్ల్యూఎస్ పంపింగ్ స్కీమ్ సమీపంలో బుడమేరులోకి బూడిద నీరు విడుదల చేస్తున్నారు. కృష్ణానదిలో చేరిన బూడిదతో నదీ పరీవాహక గ్రామాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ఫిల్టరైజేషన్ లేని గ్రామాల్లో నేరుగా తాగునీటిని సరఫరా చేస్తే బూడిద నీటినే పంపిణీ చేయాల్సి వస్తుంది. ఈ పరిణామాలతో బూడిద నీటిని తాగిన ప్రజలు అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని స్థానికులు భయపడుతున్నారు. నదిలోకి బూడిద నీటిని వదలడం నిలిపివేయాలని కోరుతున్నారు. -
తీరు మారలేదే!
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. తిరువూరు మండల, పట్టణ టీడీపీ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసే నిమిత్తం నెలరోజులుగా పనులు జరుగుతున్నాయి. ఆదివారం ఈ కార్యాలయ ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయం శనివారం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన సమాచారాన్ని స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసింది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు నియోజకవర్గ పరిశీలకుడు సుఖవాసి శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా పాల్గొంటారని ఎంపీ కార్యాలయం జారీ చేసిన కార్యక్రమ పత్రంలో పేర్కొంది. అయితే తన ప్రమేయం లేకుండా ఏర్పాటు చేస్తున్న పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే విముఖత చూపి వేరే కార్యక్రమాలు ఖరారు చేసుకున్నారని ఆయన వర్గీయులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఆహ్వానించడానికి వెళ్లిన నాయకులను సైతం ఎమ్మెల్యే పట్టించుకోలేదని సమాచారం. చివరికి ఎంపీ కేశినేని మాత్రమే కార్యాలయాన్ని ప్రారంభించారు. వారం రోజుల్లో తిరువూరు పట్టణంలోని వార్డుల్లో, రాజుగూడెం గ్రామంలో కూడా పార్టీలోని ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ పరిశీలకుడు సుఖవాసి శ్రీనివాసరావు ఎంపీతో కలిసి కార్యక్రమాలకు హాజరవుతుండగా, ఎమ్మెల్యే గైర్హాజరుపై పార్టీ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. తన ప్రమేయం లేకుండానే తిరువూరు నియోజక వర్గంలోని పలు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులను కేటాయించడం కూడా ఎమ్మెల్యే అలకకు కారణంగా భావిస్తున్నారు. ఎంపీ క్యాంపు కార్యాలయమేనా? తిరువూరులో ఆదివారం ప్రారంభించిన టీడీపీ కార్యాలయం విజయవాడ ఎంపీ కేశినేని క్యాంపు కార్యాలయంగా ఉంటుందని పలువురు చెబుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని, ఈ కార్యాలయాల్లో ఎంపీ సిబ్బంది నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. తారస్థాయికి ఎంపీ వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే ఫైట్ టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కొలికపూడి డుమ్మా -
క్రమం తప్పకుండా మందులు వాడాలి..
మధుమేహులు దుష్పలితాలు రాకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. చాలా మంది ఒకసారి వైద్యుడు రాసిన మందులనే నెలల పాటు వాడుతుంటారు. అది మంచిది కాదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సుగర్లెవల్స్ పరీక్ష చేయించుకోవడం ద్వారా మందులు పనితీరు తెలుసుకోవచ్చు. అవసరమైతే వైద్యులు మందులు మార్చడం, డోసు పెంచడం, తగ్గించడం చేస్తారు. సక్రమంగా మందులు వాడటం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే స్ట్రోక్ బారిన పడకుండా చూడవచ్చు. – డాక్టర్ ఎం. శ్రీకాంత్, మధుమేహ నిపుణుడు -
క్యూ కట్టిన వాహనాలు
కంచికచర్ల(నందిగామ): దసరా సందర్భంగా సొంతూరు బాట పట్టిన ప్రజలు ఆదివారం తిరుగు పయనమయ్యారు. సెలవులు పూర్తవటం, సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పని ప్రదేశాలకు వివిధ వాహనాల్లో బయలు దేరారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు బారులుదీరాయి. టోల్ప్లాజా వద్ద ఫాస్టాగ్ సిస్టం ఉన్నప్పటికీ, ప్లాజా వద్ద ఐదు లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ వాహనాలు రావటంతో ఆలస్యం అవుతోందని ప్రయాణికులు అంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 15 వేల వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లాయని టోల్ప్లాజా మేనేజర్ జయప్రకాష్ తెలిపారు. -
సుగర్ అదుపులో లేకుంటే ముప్పే..
ఇటీవల 30, 40 ఏళ్ల వయస్సులో బ్రెయిన్స్ట్రోక్కు గురైన వారిని చూస్తున్నాం. వారిలో మధుమేహులు కూడా ఉంటున్నారు. అదుపులో లేని మధుమేహం బ్రెయిన్ స్ట్రోక్కు దారి తీస్తోంది. రక్తనాళాలు కుచించుకుపోవడం, కొలెస్ట్రాల్, రక్తం గడ్డలు మెదడు రక్తప్రసరణపై ప్రభావం చూపుతాయి. మధు మేహాన్ని అదుపులో ఉంచుకోవడంతో పాటు, కొలెస్ట్రాల్, రక్తం పలుచబడే మందులు కూడా వైద్యుల సూచన మేరకు వాడాలి. సక్రమంగా మందులు వాడటం, ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం ద్వారా స్ట్రోక్ రాకుండా చూడవచ్చు. – డాక్టర్ డి. అనీల్కుమార్ న్యూరాలజిస్ట్ ● -
గుంటూరు రైల్వే స్టేషన్లో ఏటీబీ ప్రారంభం
లక్ష్మీపురం (గుంటూరువెస్ట్) : ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు గుంటూరు రైల్వే స్టేషన్లో ఎనీ టైమ్ బ్యాగ్ (ఏటీబీ)యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రాన్ని రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ఠ సేన్ శనివారం ప్రారంభించారు. ఈ యంత్రం ద్వారా పది రూపాయలకే క్లాత్ బ్యాగ్ను సులభంగా పొందవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ను తగ్గించి క్లాత్ బ్యాగ్ను వినియోగించే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చందోలు(కర్లపాలెం): చందోలులో ప్రసిద్ధి గాంచిన బగళాముఖి అమ్మవారిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత న్యాయమూర్తికి ఆలయ ఈవో నరసింహమూర్తి, ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మ వారికి పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం జస్టిస్ శ్రవణ్కుమార్కు వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ అమ్మవారి ఆలయ విశేషాలను న్యాయమూర్తికి వివరించారు. న్యాయమూర్తి వెంట బాపట్ల రెండవ అడిషనల్ జడ్జి పి.రాజశేఖర్, పీవీపాలెం తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఎం.వశివకుమార్, సిబ్బంది ఉన్నారు. -
ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల ఆగ్రహం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక గురుకుల (మైనార్టీ బాలికల) పాఠశాలను తరలించా లని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పాఠశాలను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర (బొద్దనపల్లి) గ్రామంలో పొలాల మధ్యలో ఉన్న పాత కాలేజీ భవనంలోకి తరలించాలని ఏపీఆర్ సూల్స్ సెక్రటరీ వి.ఎన్.మస్తానయ్య గత నెల ఐదో తేదీన ఉత్వర్వులు ఇచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి ఏపీఆర్ స్కూల్స్ ఉన్నతాధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్ గుట్టు చప్పుడు కాకుండా, విద్యార్థినుల తల్లిదండ్రులకు ముందస్తు సమా చారం ఇవ్వకుండా పాఠశాలను తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గత నెల 25వ తేదీ నుంచి స్కూల్ పేరెంట్స్ కమిటీ, పిల్లల తల్లిదండ్రులకు విషయం తెలిసి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు వెలంపల్లి శ్రీనివాసరావు గత నెల 28న పాఠశాల వద్దకు వచ్చి తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. పాఠశాలను ఇప్పటికిప్పుడు తరలించొద్దని సంబంధిత అధికారులను కోరారు. అదే రోజు సాయంత్రం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ కూడా పేరెంట్స్తో మాట్లాడి సమస్య తెలుసు కుని పరిష్కరిస్తామని, భయపడవద్దని హామీ ఇచ్చారు. అయినా పాఠశాల తరలింపుపై నేటి వరకు సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అయితే గురుకుల పాఠశాల గోడలకు పాఠశాలను బొద్దనపల్లికి మారుస్తున్నామంటూ పాఠశాల భవనం ఫొటోలను శుక్రవారం అంటించడం గమనార్హం. విద్యాసంవత్సరం మధ్యలో వద్దు గురుకుల పాఠశాల తరలింపుపై తమకు అభ్యంతరం లేదని, అయితే ఎన్టీఆర్ జిల్లాలోనే రవాణా వసతి, సౌకర్యాలు ఉన్న ప్రాంతానికి తరలించా లని విద్యార్థుల తల్లిదండ్రులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి వారు రోజూ భవానీపురంలోని పాఠశాల వద్దకు వచ్చి, విద్యా సంవత్సరం పాఠశాలను తరలించడం అన్యాయమని వాపోతున్నారు. కనీసం ఈ విద్యాసంవత్సరం ముగిశాక పాఠశాలన తరలించాలని అధికారులను వేడుకుంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడుతున్నారు. తమకు ఇష్టమైతే వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలో పిల్లలను కొనసాగిస్తామని, లేకపోతే టీసీలు తీసుకుని వేరే పాఠశాలలో చేర్పిస్తామని తెగేసి చెబుతున్నారు. ఇప్పుడున్న పాఠశాలకు కూతవేటు దూరంలో గొల్లపూడి పరిధిలోని హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్న భవనాన్ని ఇదే అద్దె ప్రాతిపదికపై తాము ప్రిన్సిపాల్కు చూపించామని, అక్కడికి తరలించేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటో తమకు అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచించి, విద్యా సంవత్సరం పూర్తయిన తరువాత మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలపై బాధ్యత ఏదీ? పాఠశాల నగరంలో ఉంది కదా అని ఆడపిల్లలను ఇక్కడ చేర్పిస్తే, ఎటువంటి రక్షణ, భద్రత లేని మారుమూల పల్లెకు తీసుకెళ్తే ఎలాగని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ విద్యార్థులకు జరగరానిదేదైనా జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణించి మహిళలు, మైనర్ బాలికలకు రక్షణ కరువైన కూటమి ప్రభుత్వ పాలనలో ఏ ధైర్యంతో తమ కుమార్తెలను పొలాల మధ్య ఉన్న భవనంలోకి పంపగలమని కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లల భద్రతపై పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లలో స్పందన లేదని వాపోతున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వ నిర్ణయమని తప్పించుకోవడంపై మండిపడుతున్నారు. బాలికల మంచి కోసమే.. గురుకుల పాఠశాల తరలింపుపై ఏపీఆర్ స్కూల్స్ ఆంధ్ర, రాయలసీమ రీజియన్ల డెప్యూటీ సెక్రటరీలు సురేష్ బాబు, ఉబేదుల్లా (ఆర్డీ సీలు)ను వివరణ కోరగా.. గురుకుల పాఠశాల అంటేనే పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. బాలికల మంచి కోసమే ఈదర గ్రామానికి పాఠశాలను తరలిస్తున్నామని, పిల్లలకు అక్కడ అలవాటయితే ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు. -
పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పెన్షనర్లకు రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించినట్లు ఎస్బీఐ దక్షిణ మధ్య రైల్వేశాఖ చీఫ్ బ్రాంచ్ మేనేజర్ పాల సుకుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో పెన్షనర్లకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శనివారం ఎస్బీఐ దక్షిణ మధ్య రైల్వేబ్రాంచ్, స్టేషన్ రోడ్డు బ్రాంచ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు లాకులు సమీపంలోని ఓ హోటల్లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ఆయుష్ హాస్పిటల్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొని పెద్ద సంఖ్యలో హాజరైన పెన్షనర్లకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఎస్బీఐ దక్షిణ మధ్య రైల్వే, స్టేషన్ రోడ్డు బ్రాంచ్ల మేనేజర్లులు సుకుమార్, కోమల్ దాసరి మాట్లాడుతూ.. పెన్షనర్ల ఆరోగ్యం, ఆర్థిక భరోసాకు ఎస్బీఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పెన్షనర్ల కోసం గతంలో లేని విధంగా 78 ఏళ్లు వరకు కూడా వారి పెన్షన్పై రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. వారికి రూ.30 లక్షల ఉచిత ప్రమాదా బీమా పథకం కూడా అందుబాటులో ఉందని వివరించారు. పెన్షనర్లు ఈ సదుపాయాలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది, పెన్షనర్ల సంఘ నాయకులు, పెన్షనర్లు, ఎస్బీఐ సిబ్బంది పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి వృద్ధుడి దుర్మరణం
అవనిగడ్డ: మండలంలోని పులిగడ్డ పల్లెపాలెం గ్రామానికి చెందిన సింగోతు నాగూర్(60) శుక్రవారం చేపల వేట నిమిత్తం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు. స్థానిక లూప్ చానల్ వద్ద నాగూర్ మృతదేహం పంట కాలువలో పైకి తేలింది. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న అవనిగడ్డ ఎస్ఐ కె.శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని సందర్శించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సింగోతు నాగూర్ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో సందర్శించి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితు కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పనులను వేగవంతం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య, ఇంజినీరింగ్ పనుల పురోగతిపై సంబంధిత మునిసిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో శనివారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, పెడన పట్టణ ప్రాంతాల్లో పది ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు మచిలీపట్నం, ఉయ్యూరు, పెడనలో ఒక్కొక్క ఆరోగ్య కేంద్రమే పూర్తయిందని కలెక్టర్ పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, గుడివాడలో టెండర్ల ప్రక్రియలోనే ఉందని వివరించారు. మచిలీపట్నం నారాయణపురంలో స్థలం త్వరితగతిన ఎంపిక చేయాలన్నారు. తాడిగడప మునిసిపాలిటీలో కానూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. అమాత్ 2.0 పథకం కింద మచిలీపట్నం, గుడివాడ, పెడన, తాడిగడప మునిసిపాలిటీల్లో రూ.181.31 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తాగునీటి పైపులతో కలవకుండా చూడాలని, లీకేజీ ఉండకుండా కాంట్రాక్టర్లు వాటిని సరిగా నిర్మిస్తున్నారో లేదో పర్యవేక్షించాలని సూచించారు. మచిలీపట్నంలో ఇంకా మిగిలిపోయిన 30 వేల టన్నుల వ్యర్థాల చెత్త బుట్టలను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెడన మునిసిపాలిటీలో పది రోజుల్లో పూర్తిగా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తను తొలగించిన ప్రదేశం ఆక్రమణకు గురికాకుండా నిఘా ఉంచి పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, మనోహరరావు, నజీర్, రామారావు, ప్రజారోగ్యశాఖ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీ -
ఆటో పల్టీ ఎనిమిది మందికి గాయాలు
హనుమాన్జంక్షన్ రూరల్: చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు భవానీమాల ధరించారు. మరో ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇద్దరు మాలధారులు దీక్ష విరమించిన అనంతరం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. బొమ్ములూరు టోల్ప్లాజా సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది రోడ్డుపై పడటంతో స్వల్పంగా గ్రాయపడ్డారు. వారిని ఎన్హెచ్ఏఐ అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మునేరులో గల్లంతయిన కీర్తన మృతి
కంచికచర్ల: మండలంలోని వేములపల్లి గ్రామం వద్ద శుక్రవారం నాయనమ్మతో కలసి దుస్తులు ఉతికేందుకు వెళ్లి మునేరులో గల్లంతైన బాలిక మృతిచెందింది. మునేరులో గల్లంతయిన ఉప్పెల్లి కీర్తన (10) ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు శనివారం ఉదయం ఆరు గంటలకు శనివారం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న సమయంలో కీర్తన మృతదేహం లభించింది. నాటు పడవ సాయంతో కీర్తన మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన తల్లి మరియమ్మ, నాయనమ్మ గుండెలవిసేలా రోదించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పెనుగంచిప్రోలు మండలం గుమ్ముడుదుర్రు గ్రామానికి చెందిన కీర్తన రెండో తరగతి చదువుతోంది. దసరా సెలవులను ఆదనందంగా గడిపేందుకు నాయనమ్మ ఇంటికి వచ్చింది. శుక్రవారం కీర్తన నాయనమ్మ రమణతో కలసి దుస్తులు ఉతికేందుకు మునేరు వద్దకు వెళ్లింది. నీటిలో దిగి గల్లంతయిన కీర్తన శవమై కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.విశ్వనాథ్ తెలిపారు. మునేరులో అక్రమ తవ్వకాలే కారణం కూటమి నాయకులు వేములపల్లి వద్ద మునేరులో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపటం వల్లే అక్కడక్కడా లోతు ఎక్కువగా ఉందని, ఇసుక తవ్విన గోతిలో పడి కీర్తన మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మునేరులో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపినా రెవెన్యూ, మైనింగ్, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మునేరులో అక్రమ తవ్వకాలు జరపకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
● సప్త వర్ణ శోభితం
ప్రకృతి రమణీయమైనది. సాయంసంధ్య వేళల్లో ప్రకృతి అందాలను చూస్తే ఎవరైనా సరే మైమరచిపోవలసిందే. నగర జీవి బిజీ బతుకుల్లో పట్టించుకోవడం లేదు కాని...కాస్త తీరిక చేసుకుని ప్రకృతి వైపు ఓసారి కన్నేసి తిలకిస్తే అలసి సొలసిన మనసుకు ఆహ్లాదంతో పాటు మానసిక ప్రశాంతత లభించడం ఖాయం. శనివారం విజయవాడ కరకట్ట శివారులో సూర్యాస్తమ సమయాన కనిపించిన ఈ సుందర దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ఇబ్రహీంపట్నం: పశ్చిమ ఇబ్రహీంపట్నంలో గ్యార్మీ షరీఫ్ వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌసే ఆజం చిహ్నమైన జెండాను ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాల నడుమ ఊరేగింపు చేశారు. పండగ సందర్భంగా ఈనెల 10వ తేదీన మసీదు వద్ద భారీ అన్నదానం నిర్వహిస్తున్నట్లు మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ ముస్తఫా తెలిపారు. కార్యక్రమంలో మసీదు కమిటీ కోశాధికారి కరీముల్లా, హసన్ అహ్మద్, షేక్ దావూద్, షేక్ గోరే, అలీఖాన్, కరిముల్లా ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో గ్యార్మీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు -
ముగిసిన ఎన్సీసీ శిక్షణ శిబిరం
ఉయ్యూరు: ఉయ్యూరు శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థల ఆఽవరణలో నిర్వహిస్తున్న ఎన్సీసీ వార్షిక శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 17వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో క్యాడెట్లకు బంకర్ బ్లాస్టింగ్, ఫీల్డ్ క్రా్ఫ్ట్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్ట్, ఫైరింగ్ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. 619 మంది క్యాడెట్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెప్ట్నెంట్ కల్నల్ జీసీ పాండే క్యాడెట్లకు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆపరేషన్ సింధూర్, జవాన్ల పాత్రపై అవగాహన కల్పించారు. -
రెడ్క్రాస్ శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మచిలీపట్నంఅర్బన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) కృష్ణా జిల్లా శాఖను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఐఆర్సీఎస్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత రెడ్క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనంట్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన కమిటీకి డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ను చైర్మన్గా, సిర్విశెట్టి భాస్కర్ను వైస్ చైర్మన్గా, దాసరి రామకృష్ణ, వి.సుందర్ రామ్, జి.మెహర్ ప్రసాద్, పి.సుకుమార్, ఎన్.లీలా బ్రహ్మేంద్ర, బి.శివ విష్ణువర్ధన్, టి.వీరేంద్రనాథ్, బి.వెంకటేశ్వరరావు, బి.శంకర్నాథ్, పి.రాంప్రసాద్ సభ్యులుగా, డాక్టర్ ఎం.సూర్యశేఖర్, డాక్టర్ ఎస్.శర్మిష్ఠ, పి.వెంకట సుబ్బారావు, జె.బాబూరావులను ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ అబ్జర్వర్ రామచంద్ర రాజు, జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు, రెడ్ క్రాస్ ప్యాట్రన్, వైస్ ప్యాట్రన్, జీవిత సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
7న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. 7వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 5:55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితార సెంటర్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదుగా గిరిప్రదక్షిణ సాగుతుందని తెలిపింది. ఆదిదంపతుల ఉత్సవ మూర్తులతో పాటు దేవస్థాన ప్రచారరథం, భక్తజనుల కోలాట నృత్యాల మధ్య సాగే గిరిప్రదక్షిణలో భక్తులందరూ పాల్గొనాలని దేవస్థాన అధికారులు కోరారు. అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): మండలంలోని అనిగండ్లపాడు ఆయుర్వేద వైద్యశాల రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్టుకు ఉత్తమ స్వచ్ఛ ఆయుష్ కేంద్రంగా ఎంపికై ంది. వైద్యశాల పరిసరాల పరిశుభ్రత, ఆవరణలో వివిధ రకాల ఔషధ మొక్కల ఏర్పాటు, టాయిలెట్, ఫ్లోరింగ్, హాండ్ వాష్, డస్ట్బిన్స్ తదితర అంశాలలో పలు రకాల తనిఖీల అనంతరం వైద్య శాలను రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపిక చేశారని వైద్యాధికారి డాక్టర్ రత్నప్రియదర్శిని తెలిపారు. సోమవారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నట్టు తెలిపారు. ఈ వైద్యశాలకు వై.రత్న ప్రియదర్శిని వైద్యాధికారిగా వచ్చినప్పటినుంచి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులలకు చికిత్స, పంచకర్మ సేవలు అందుబాటులోకి వచ్చాయని రోగులు చెపుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు హర్షం వెలిబుచ్చారు. డాక్టర్ ప్రియదర్శినికి అభినందనలు తెలియజేశారు. మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని శనివారం న్యూఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృతివెంటి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు తిరువూరు: ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు సూచించారు. తిరువూరు వాహినీ ఇంజినీరింగ్ కళాశాలలో 2025 డీఎస్సీలో ఎంపికై న నూతన ఉపాధ్యాయులకు నిర్వహించే వారం రోజుల శిక్షణా తరగతులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ విద్యాలయాలు బలోపేతానికి ఉపాధ్యాయుల కృషే కీలకమన్నారు. మారుతున్న విద్యార్థుల అభిరుచుల కనుగుణంగా బోధనల మెళకువలను పెంపొందించుకుని మంచి ఫలితాల సాధనకు తోడ్పడాలని సూచించారు. ఉపాధ్యాయుడు కూడా నిరంతర విద్యార్థేనని, బోధనలో నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే రాణిస్తారని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ విధానంలో 250 మంది నూతన ఉపాధ్యాయులకు తిరువూరులో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో తెలిపారు. -
స్థిరంగా సాగుతున్న వరద ప్రవాహం
కంకిపాడు: ఏటిపాయలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శనివారం వరద తగ్గుముఖం పట్టినా ప్రవాహం అలాగే ఉంది. ప్రస్తుతం మద్దూరు, కాసరనేనివారిపాలెం వద్ద ఏటిపాయ అంచులు తాకుతూ వరదనీరు ప్రవహిస్తోంది. ఏటిపాయలోని లంక భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రైతులు, కూలీలు పడవలను ఆశ్రయిస్తున్నారు. పడవలపై పొలాలకు వెళ్లి పొలం పనులు పూర్తి చేసుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఏటిపాయ లో కొనసాగుతున్న వరద ఉధృతికి పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. మద్దూరు, కాసరనేనివారిపాలెం పరిధిలోని ఏటిపాయ వెంబడి లంక భూముల్లోకి చేరిన వరదనీరు ఇంకా పొలాల్లోనే ఉండిపోయింది. ప్రవాహం కొనసాగుతున్న కారణంగా పొలాల్లో ఉన్న వరదనీరు ఏటిపాయకు మళ్లటం లేదు. దీంతో పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పంటపై పెట్టిన పెట్టుబడులు చేతికి అందుతాయో? లేదో? అన్న భయం రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. -
అంబాపురంలో టీడీపీ కార్యకర్తల దాడి
విజయవాడరూరల్: గ్రామాల్లో పచ్చమూకల ఆగడాలు మితిమీరుతున్నాయి. దసరా పండుగ వేళ అంబాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ముగ్గురు కలిసి ఒక వ్యక్తిపై మద్యం మత్తులో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో మేరుగ కిరణ్ అనే వ్యక్తి దవడ రెండు చోట్ల విరిగిపోయింది. ఈ సంఘటన గురువారం అంబాపురం గ్రామం తోటమూల సెంటర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న వడ్డేశ్వరపు ఆనంద్ పై టూటౌన్ పోలీసు స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. అతని అనుచరులు చోడవరపు ప్రవీణ్కుమార్, దొప్పలపూడి సుధీర్లతో కలసి ఆనంద్ తోటమూల సెంటర్లో తన స్నేహితులతో వెళుతున్న మేరుగ కిరణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. కిరణ్తో పాటు ఉన్న అతని స్నేహితులు పరారు కాగా, ఆనంద్ అతని స్నేహితులు కలిసి కిరణ్పై దాడి చేశారు. దేహమంతా అనేక గాయాలు అవడంతో తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతనిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి దవడ ఎముక రెండు చోట్ల విరిగిపోయిందని, సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. బాధితుడు మేరుగ కిరణ్ ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకుల అండదండలతో వడ్డేశ్వరపు ఆనంద్ తన అనుచరులను వెంటపెట్టుకుని మద్యం తాగుతూ గ్రామంలో దాడులకు తెగబడుతుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటువంటి అల్లరి మూకలను గ్రామ బహిష్కరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
హమ్మయ్య.. ఉత్సవం ముగిసింది!
వన్టౌన్(విజయవాడపశ్చిమ)/లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు లేకుండా ముగియటంతో జిల్లా అధికార యంత్రాంగం హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంది. గత నెల 22 నుంచి ఈ నెల రెండో తేదీ వరకూ 11 రోజుల పాటు దసరా మహోత్సవాలు కొనసాగాయి. కొనసాగుతున్న భవానీల రాక దసరా ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో చాలా మంది భక్తులు భవానీదీక్షలను స్వీకరించి, దీక్షా విరమణకు అమ్మవారి సన్నిధికి తరలివస్తారు. దాంతో గడిచిన రెండు రోజులుగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి అధికంగా భవానీ దీక్షాపరులు అమ్మవారి సన్నిధికి తరలివస్తున్నారు. భవానీల రాకతో శుక్రవారం సైతం రద్దీ కొనసాగింది. మరో రెండు రోజుల పాటు భవానీల రాక కొనసాగనుంది. కూటమి నేతల హడావుడితో ఇక్కట్ల పాలైన భక్తులు ఈ ఏడాది కూటమి నాయకులు అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంపైన తమ ప్రతాపాన్ని చూపించారు. ఎటువంటి పాసులు లేకున్నా దర్శనానికి రావటం, అధికార యంత్రాంగంతో ఘర్షణకు దిగటంతో ఆలయ ప్రాంగణంలో పలు చోట్ల సమస్యలు తలెత్తాయి. కొంతమంది మంత్రుల పీఏలు సైతం ఆలయంలో పోలీసు అధికారులను దుర్భాషలాడి ఘర్షణకు దిగిన సందర్భాలు ఉన్నాయి. జంబో ఉత్సవ కమిటీతో సమస్యలు దసరా ఉత్సవాల సందర్భంగా కూటమి ప్రభుత్వం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి జంబో ఉత్సవ కమిటీని నియమించింది. సుమారుగా 96 మందితో నియమించిన ఈ ఉత్సవ కమిటీ ఆలయ ప్రాంగణంలో అధికారులకు తలనొప్పిగా మారారని ఉన్నతాధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చివరి రోజు ట్రాఫిక్తో భక్తుల అష్టకష్టాలు దసరా పండుగ రోజు విజయవాడ నగరంలో ట్రాఫిక్ అష్టదిగ్బంధనం అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎంజీ రోడ్డులో డైవర్షన్తో పాటు, కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం రాజీవ్గాంధీ పార్కు వద్ద, గొల్లపూడి ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరాయి. బందరు రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ ఉదయం మారథాన్ నిర్వహించారు. ఉదయం 10 గంటల వరకూ రాకపోకలకు అనుమతించలేదు. దీంతో బందరు రోడ్డుకు ఇరువైపుల నివాసాలు ఉన్న వారు బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సాయంత్రం కళాకారులతో కార్నివాల్ నిర్వహించడంతో మధ్యాహ్నం 4 గంటల నుంచి ట్రాఫిక్ను నిలిపివేశారు. ట్రాఫిక్ను డైవర్డ్ చేయడంతో ఆయా రోడ్లలో వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా మదర్థెరిస్సా విగ్రహం సమీపంలో అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులు సైతం ట్రాఫిక్తో ఇబ్బంది పడ్డారు. కూటమి నేతలు ఆర్భాటంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ నగర ప్రజలకు, ఉత్సవాలకు చాలా సమస్యలు సృష్టించింది. ప్రధానంగా ఆలయానికి సమీపంలో పున్నమి ఘాట్ వద్ద ఒక ప్రధాన వేదికను ఏర్పాటు చేయటంతో అటుగా భక్తుల రాకపోకలకు తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. మంత్రులు ఇతర వీవీఐపీల రాకపోకలతో పోలీసులు గంటల తరబడి వాహనాలను మళ్లించటం వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పర్యటనలతో... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంజీరోడ్డులో నిర్వహించిన కార్నివాల్తో పాటు, గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పాల్గొన్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ను నిలిపివేయడంతో భవానీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభం వద్ద భవానీలు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. బస్టాండ్ అవుట్గేట్ వరకూ వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు చంద్రబాబు రాకతో, ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో గొల్లపూడి వద్ద ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. -
శాంతియుత ఉద్యమాల పితామహుడు గాంధీజీ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత పోరాటానికి జాతిపిత మహాత్మాగాంధీ ఆద్యులు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కొనియాడారు. మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా పాతబస్తీ గాంధీపార్కులోని గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలను సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ ఏనాడూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థను ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్ పోరాటం చేశారు తప్ప ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదన్నారు. సుమారు 4,500 మంది కమ్యూనిస్టులు నాటి పోరాటంలో రక్తతర్పణ చేశారని అన్నారు. ఈ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాల్గొందని స్వయంగా దేశ ప్రధాని పేర్కొనటం చరిత్రను వక్రీకరించటమేనని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు బుట్టిరాయప్ప, తాడి పైడియ్య, అప్పురబోతు రాము, సంగుల పేరయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యుడిగా డాక్టర్ మెహబూబ్ షేక్
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా విజయవాడకు చెందిన డాక్టర్ మెహబూబ్ షేక్ నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేసింది. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఆయన క్రియాశీలక నేతగా ఉన్నారు. మూడుసార్లు వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వైద్య విభాగం జోనల్ ఇన్చార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం వైద్య విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీకి అందించిన సేవలను గుర్తించి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించారు. మెహబూబ్ షేక్ ఉమ్మడి కృష్ణాజిల్లా వైద్య విభాగం ఆధ్యక్షుడిగా ఉన్న సమయంలో మెగా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. గ్రహణ మొర్రితో బాధపడుతున్న వారికి ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 2019 ఎన్నికల సమయంలో సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకునిగా వ్యవహరించారు. తనపై నమ్మకంతో పార్టీ ఎస్ఈసీ సభ్యుడిగా నియమించినందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్కు, ఇతర నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మెహబూబ్ షేక్కు అభినందనలు తెలిపారు. -
సెలవులకొచ్చి మునేరులో పడి గల్లంతు!
వేములపల్లి(కంచికచర్ల): దసరా సెలవుల్లో నాయనమ్మ, ఇతర బంధువులతో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ మునేటిలో పడి గల్లంతయిన ఘటన కంచికచర్ల మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు మండలంలోని వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల్లి ముసలయ్య అలియాస్ వెంకట్రావు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముసలయ్య మరణానంతరం అతని భార్య మరియమ్మ తన ఇద్దరు పిల్లలతో పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గ్రామంలో నివాసముంటోంది. పెద్ద కుమార్తె కీర్తన(10) నాల్గవ తరగతి చదువుతోంది. రెండవ కుమార్తె సుసన్న అలియాస్ ప్రియదర్శిని రెండవ తరగతి చదువుతోంది. దసరా సెలవులు రావటంతో తల్లి మరియమ్మ తన పెద్ద కుమార్తెను వేములపల్లి గ్రామంలో నాయనమ్మ ఇంటి వద్ద ఉంచి గుమ్మడిదుర్రు గ్రామానికి తిరిగి వెళ్లింది. దుస్తులు ఉతికేందుకు శుక్రవారం నాయనమ్మ రమణమ్మతో కలసి మునేరుకు వెళ్లిన కీర్తన ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయింది. రమణమ్మ పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మునేరులో వెతికారు. అయినా కీర్తన ఆచూకీ తెలియలేదు. చీకటి పడటంతో వెతుకులాట ఆపారు. రెవెన్యూ, పోలీసు అధికారులపై మండిపడ్డ గ్రామస్తులు వేములపల్లి గ్రామంలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు ఉదయం 11 గంటలకు మునేరులో గల్లంతయినా రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, లేదా ఎస్టీఆర్ఎఫ్ బృందానికి తెలియజేయకపోవటంతో వారు వెతికేందుకు గ్రామానికి రాలేదని, ఇందుకు పూర్తిగా రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. -
చెత్త ఇస్తే సరుకులు ఇస్తాం
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో పొడి చెత్తను తీసుకొచ్చిన వారికి బదులుగా నిత్యవసర సరుకులు అందిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని కోనేరు సెంటర్లో మంత్రి రవీంద్ర కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి గురువారం స్వచ్ఛ రథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ రథం వాహనాలను ప్రారంభించామన్నారు. వ్యర్థాలను సేకరించేందుకు కృష్ణాజిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏడు స్వచ్ఛ రథాలను కేటాయించామని తెలిపారు. వీటి ద్వారా ఇనుము, ప్లాస్టిక్, పేపర్లు వంటి పొడి చెత్తను సేకరిస్తారన్నారు. పొడి చెత్తను సేకరించి అందించిన వారికి స్వచ్ఛ రథం వాహనం దగ్గర దానికి సమానమైన నిత్యావసర సరుకులు అందిస్తారన్నారు. చెత్తను తరలించేందుకు ఉన్న రెండు కంపాక్టర్లకు అదనంగా మరో కంపాక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందని, వీటి ద్వారా జిల్లాలోని చెత్తను ఎప్పటికప్పుడు తరలించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో ఏడు స్వచ్ఛ రథాలను ప్రారంభించామని, వీటి ద్వారా గ్రామాల్లో గృహాల వద్ద వృథాగా పేరుకుపోయిన ఇనుము, ప్లాస్టిక్, పేపర్లు, అట్ట పెట్టెలు, గాజు సీసాలు తదితర పొడి చెత్తను సేకరించి స్వచ్ఛ రథం వద్ద అందిస్తే దానికి సమానమైన కందిపప్పు, మినప గుళ్లు, పేస్టు, షాంపూ, కొబ్బరి నూనె, సబ్బులు, పెన్నులు, ఉల్లిపాయలు తదితర నిత్యవసర వస్తువులను అందిస్తారన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందడంతో పాటు పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారి, జెడ్పీ డెప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోయ నాగమణి, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణానదిలో మునిగి గత ఈతగాడు మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి గజ ఈతగాడు మృతిచెందాడు. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణలంక, వల్లూరి వారి వీధిలో నివాసం ఉంటున్న ఒడుగు కృష్ణ(35) అనే వ్యక్తి చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి వివాహమైంది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అతను గజ ఈతగాళ్ల డ్యూటీలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు డ్యూటీకి వెళ్లాడు. డ్యూటీలో భాగంగా శనైశ్వరస్వామి గుడి వెనుక నదిలో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బట్టలు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి కనిపించలేదు. గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టినా కృష్ణ ఆచూకీ లభించలేదు. మునిగిన ప్రదేశంలోనే శుక్రవారం ఉదయం నీటిలో తేలుతూ శవమై కనిపించాడు. మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈతకు వెళ్లి యువకుడు దుర్మరణం నందిగామ రూరల్: స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పట్టణంలోని అనాసాగరానికి చెందిన కర్రి శ్రీనివాసరావు కుమారుడు నరేష్ (28) గురువారం ముగ్గురు స్నేహితులతో కలిసి మండలంలోని పల్లగిరి సమీపంలోని మున్నేరులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నరేష్తో పాటు అతని స్నేహితులు నీటిలో గల్లంతయ్యారు. అయితే ముగ్గురు స్నేహితులు సురక్షితంగా బయటకు వచ్చినప్పటికీ నరేష్ ఆచూకీ లభించకపోవటంతో మున్నేటిలో ముమ్మరంగా గాలించారు. నరేష్ను వెతికి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అభిమన్యు తెలిపారు. -
టీడీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
బూదవాడ(జగ్గయ్యపేట): పాతకక్షల నేపథ్యంలో టీడీపీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని బూదవాడ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గడ్డం ఏసుబాబు, మరో నాయకుడు శీలం లక్ష్మయ్యకు గత కొన్ని రోజులుగా పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ కావటంతో లక్ష్మయ్య వర్గానికి చెందిన పల్లపాటి తిరుపారావు, పోతుమర్తి సాయి రాత్రి సమయంలో గ్రామంలోని బ్రిడ్జిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో ఏసుబాబు వర్గానికి చెందిన గడ్డం సత్యనారాయణ, గడ్డం లక్ష్మణ ఎదురవటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పక్కనే ఉన్న మధ్యం సీసాలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పల్లపాటి తిరుపారావు, పోతుమర్తి సాయిలకు తీవ్ర గాయాలు కాగా సత్యనారాయణ, లక్ష్మణ్లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలుండటంతో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఘర్షణకు సంబంధించి ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో మరోసారి ఘర్షణలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
జాతీయ కబడ్డీ పోటీలకు కృష్ణా వర్సిటీ జట్టు
మైలవరం: జాతీయ కబడ్డీ పోటీలకు కృష్ణా విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అంతర్ కళాశాలల కబడ్డీ పోటీల ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఇళ్ళ రవి శుక్రవారం తెలిపారు. గత వారం స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ పురుషుల అంతర్ కళాశాల కబడ్డీ పోటీల నుంచి మెరుగైన క్రీడాకారులను కృష్ణా విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపిక చేశామన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయం జట్టు కర్నాటకలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీ బెల్లావిలో ఈ నెల 4 నుంచి 7 వరకు నిర్వహించే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో పాల్గొంటుందన్నారు. ఈ పోటీలను నాక్ ఔట్ కమ్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తారన్నారు. ఈ పోటీలకు కృష్ణా వర్సిటీ జట్టుకు మేనేజర్గా మైలవరం లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామిని, కోచ్గా నలంద కళాశాలకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావును, టీమ్ కెప్టెన్గా శ్యామ్ కుమార్ను నియమించినట్టు తెలిపారు. జట్టు సభ్యులుగా విజయ వ్యాయామ కళాశాల నుంచి శ్యామ్కుమార్, సాయి ప్రసన్న, వెంకటేశ్వర్లు, సిద్ధార్థ కళాశాల నుంచి మహేష్, మధు, ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి శామ్యూల్ రాజ్, కిరణ్, కేబీఎన్ కళాశాల నుంచి ఫిరోజ్, తేజ, ఎల్హెచ్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అజయ్బాబు, నలంద కళాశాల నుంచి యశ్వంత్ కుమార్, ఏజీఎస్జీఎస్ కళాశాల నుంచి గోపీచంద్, వికాస్ కళాశాల నుంచి వెంకటేశ్వరరావు, లయోలా కళాశాల నుంచి మహేష్ ఎంపికయ్యారన్నారు. -
వైభవంగా దసరా వేడుకలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్థానిక సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో బుధవారం అమ్మవారి శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గోపూజ, సూర్యనమస్కారాలు, చండీహోమం, సుహాసిని పూజ, దంపతుల పూజ జరిగాయి. మధ్యాహ్నం ఆరు వేల మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం గాయత్రీనగర్, మొగల్రాజపురం ప్రాంతాల్లో అమ్మ వారిని పల్లకీలో ఊరేగించారు. అమ్మవారు గురువారం శ్రీ విజయరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తామని నిర్వాహకుడు వైట్ల కృష్ణప్రసన్న తెలిపారు. -
వరదొచ్చినా...ముంపు భయం లేదు
కృష్ణలంక/లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణా నదికి పది లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా కృష్ణలంక కరకట్ట ప్రాంత వాసులకు వరద భయం లేదు. తట్టా బుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మూడు రోజులుగా ఏడు లక్షల పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తున్నా... దసరా పండుగను సంతోషంగా తమ ఇళ్లలోనే జరుపుకొంటున్నామని ఆ ప్రాంత ప్రజలు ఆనందంతో చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నివసించే సుమారు 70 వేల మంది ప్రజల ముంపు సమస్యను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిష్కరించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలా... ప్రస్తుతం కృష్ణానదికి 7 లక్షల క్యూసెక్యులకు పైగా వరద వస్తోంది. ఒకప్పుడు ఇంత వరద వచ్చిందంటే కృష్ణలంక ప్రాంతంలోని రణదీవె నగర్, తారకరామా నగర్, భూపేష్గుప్తా నగర్, రామలింగేశ్వర నగర్ పోలీస్కాలనీలు నీట మునిగేవి. ఆ ప్రాంత ప్రజలు తట్టాబుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాల్సి వచ్చేది. వరద ఎప్పుడు తగ్గుతుందా అంటూ ఎదురుచూసే వారు. కూలిపనులకు కూడా వెళ్లే అవకాశం ఉండేది కాదు. పిల్లలు స్కూలుకు వెళ్లేవారు కాదు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేక వ్యాధుల బారిన పడేవాళ్లు. ఆ రోజులను గుర్తు చేసుకుంటేనే ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. రిటైనింగ్ వాల్తో వరద సమస్యకు చెక్ కృష్ణలంక వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. కనకదుర్గమ్మ వారధికి ఎగువన ఒక కిలోమీటరుతో పాటు, దిగువన భూపేష్గుప్తా నగర్ వరకూ వాల్ నిర్మించారు. కృష్ణానదికి గత ఏడాది 11 లక్షల క్యూసెక్యులకు పైగా నీరు వచ్చినా వరద ముప్పులేకుండా రిటైనింగ్ వాల్ కాపాడగలిగింది. సంతోషంగా పండుగ చేసుకుంటున్నాం ఇళ్లు మునుగుతాయనే భయం లేదు నాడు పండుగలు ఉండేవి కాదు -
నేటి అలంకారం
శ్రీరాజరాజేశ్వరీదేవి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరీదేవిని దర్శించి, అర్చించడం వలన సర్వ శుభాలు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింప చేసే అపరాజితా దేవిగా, చల్లనితల్లిగా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలం కారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సకల శుభాలు, విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారానే మనకు లభిస్తాయి. -
పాపం.. భవానీద్వీపం!
● భవానీ ద్వీపానికి దెబ్బ మీద దెబ్బ ● ద్వీపంలోకి ప్రవేశించిన వరద నీరు ● వృథాగా మారిన పునరుద్ధరణ పనులుభవానీపురం(విజయవాడపశ్చిమ): నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన భవానీ ద్వీపంపై ప్రకృతి పగబట్టిందా అంటే.. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గత ఏడాది ఆగస్ట్లో సంభవించిన వరద సందర్భంగా తీవ్రంగా (దాదాపు రూ.10 కోట్ల మేర అధికారుల అంచనా) నష్ట పోయిన భవానీ ద్వీపంలో పునరుద్ధరణ పనులు చేపట్టటంతో ఇప్పుడిప్పుడే పర్యాటకులు తిరిగి వస్తున్నారు. రిసార్ట్స్ బుకింగ్, రెస్టారెంట్, అడ్వంచర్ గేమ్స్, మిర్రర్ ఇమేజ్ వంటి కార్యకలాపాలు మళ్లీ మొదలవుతున్నాయి. ఈ తరుణంలో మళ్లీ వరద ఉధృతి పెరిగి సుమారు ఆరు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజికి చేరింది. దీంతో భవానీ ద్వీపానికి మళ్లీ వరద తాకిడి తగిలింది. సోమవారం నాటికే వరద నీరు ద్వీపంలోకి చేరి అతలాకుతలం చేసింది. పునరుద్ధరణ పనులు వృథాయేనా! గత ఏడాది వరద కారణంగా ధ్వంసమైన ద్వీపానికి దెబ్బమీద దెబ్బ తగలటంతో చేసిన పునరుద్ధరణ పనులన్నీ వృథాయేనా అని పర్యాటక శాఖ అధికా రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో ఆధునికీకరించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, మళ్లీ వచ్చిన వరద పోటుతో ఈనగాచి నక్కల పాలైన విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు, వరదలు వెంటాడుతుంటే ఎప్పటికి కోలుకుంటాం..పర్యాటకులను ఆకర్షించే విధంగా ఎప్పటికి సిద్ధం చేయగలమని మథనపడుతున్నారు. హరిత బెరం పార్క్ (పున్నమి హోటల్) పరిస్థితి అలానే ఉండటం గమనార్హం. దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల ప్రజలు ఇక్కడికి వస్తారని, తద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చని ఎదురు చూసిన పర్యాటక శాఖ వారికి నిరాశే ఎదురయింది. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
ప్యాకేజీల కోసమే ● పేద విద్యార్థుల కలలను కల్లలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ● ప్రైవేటీకరణను విరమించి ప్రభుత్వమే కాలేజీలను నడపాలి ● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణపై నిరసన గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్యాకేజీల కోసమే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తోందని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. విజయవాడ అజిత్సింగ్నగర్లోని సెయింట్ ఆన్స్ హాస్పిటల్ ఎదుట ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన కార్యక్రమం జరిగింది. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొలిమెట్ల శరత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యకుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, మొండితోక జగన్మోహనరావు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి, విద్య, వైద్యం ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలని కోరుతూ తొలుత నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రసంగించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు వైద్య విద్య అభ్యసించాలనే తలంపుతో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయి, తరగతులు నడుస్తున్నాయని, మరో రెండు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ వైద్య కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా వాటిని ప్రైవేటీకరించేందుకు పూనుకుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ప్యాకేజీల కోసం పీపీపీ విధానంలో తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్ని స్తున్నారని విమర్శించారు. డాక్టర్ కావాలన్న లక్షల మంది పేద విద్యార్థుల కలలను కూటమి ప్రభుత్వం కల్లలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం దాచుకో.. దోచుకో విధానాన్ని అవలంబిస్తోందని ఎమ్మెల్సీ రుహుల్లా విమర్శించారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్లకు అప్పగించి దోచుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. వైద్య విద్యను, వైద్యాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శీరంశెట్టి పూర్ణచంద్రరావు, బూదాల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు వేల్పుల రమేష్, కన్నెగంటి జీవరత్నం, కోట దాసు, కొమ్ము చంటి, పొదిలి చంటి, జాన్ కెనడీ, కాలే పుల్లారావు, గుండె సుందర్పాల్, శామ్యూల్, తాడంకి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి అవుతు శ్రీనివాసరెడ్డి, ఆళ్ల చల్లారావు, స్టూడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, తంగిరాల రామిరెడ్డి, జానారెడ్డి, తోలేటి శ్రీకాంత్, బందెల కిరణ్రాజ్, దుర్గారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
పీహెచ్సీ వైద్యుల సమ్మె ఉధృతం
మచిలీపట్నం అర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యుల సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.దీప్తి తెలిపారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా కుదింపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం జిల్లాలోని పీహెచ్సీలలో వైద్య సేవలను వైద్యులు బహిష్కరించారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దీప్తి మాట్లాడుతూ గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగుతామన్నారు. వైద్యులు 20 శాతం పీజీ ఇన్ సర్వీస్ కోటా అన్ని క్లినికల్ స్పెషాలిటీలకూ వర్తించాలని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నందుకు ప్రత్యేక అలవెన్స్, ఉద్యోగోన్నతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పలువురు పీహెచ్సీ వైద్యులు మాట్లాడుతూ గతంలో క్లినికల్ విభాగంలో 30 శాతం, నాన్ క్లినికల్లో 50 శాతం ఇన్ సర్వీస్ కోటా ఉండేదని, అయితే కూటమి ప్రభుత్వం గత ఏడాది క్లినికల్ కోర్సుల్లో 15 శాతం, నాన్ క్లినికల్లో 30 శాతానికి తగ్గించిందని తెలిపారు. గతేడాది వైద్యుల ఆందోళనల తర్వాత క్లినికల్ కోర్సుల్లో 20 శాతం వరకు పెంచి, ఈ విద్యా సంవత్సరానికి మళ్లీ కోటాను 15 శాతానికి తగ్గించడంతో సమ్మె చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమానికి ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. సమ్మెను జటిలం చేయకుండా ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.బాలాజీ (కపిలేశ్వరపురం పీహెచ్సీ), డాక్టర్ స్ఫూర్తి (రామాపురం పీహెచ్సీ), డాక్టర్ రాజా (పెనమలూరు పీహెచ్సీ), డాక్టర్ చంద్రిక (ఉప్పులూరు పీహెచ్సీ), డాక్టర్ పర్వేజ్ (పెడన పీహెచ్సీ), డాక్టర్ తేజ( మోటూరు పీహెచ్సీ), డీఎంహెచ్ఓ కార్యాలయం డాక్టర్లు అరుణ్ కుమార్, నిరీక్షణ, అవనిగడ్డ పి.పి యూనిట్ డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.దీప్తి గ్రామీణ వైద్య సేవలకు బ్రేక్ -
బాలల భవిష్యత్ మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక తరం భవితవ్యాన్ని మార్చగలడన్నారు. లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాలులో ఎస్ఎస్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో డీఎస్సీలో టీచర్ పోస్టులు పొందిన వారికి మంగళవారం అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పార్థసారథి మాట్లాడుతూ డీఎస్సీలో ఉద్యోగం సాధించిన వారు ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ప్రభుత్వ స్కూల్స్కు వచ్చే పేద పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులు తమ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా, సేవగా భావించి అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎస్ఎస్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాకం శేషావలి మాట్లాడుతూ తమ వద్ద శిక్షణ పొందిన అనేక మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు పొందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన శేషాద్రి నాయుడు, విత్తనాల వంశీకృష్ణ లకు రూ.50,000 చెక్ లను మంత్రి పార్థసారథి చేతుల మీదగా అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, కె.శ్రీనివాస్, సైకాలజిస్ట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చదివేది పేద పిల్లలే రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కేపీ సారథి -
టీటీలో నగర క్రీడాకారులకు పతకాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీలోని వైవీ రావు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సెప్టెంబర్ 29న జరిగిన యూటీటీ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో దామూస్ టీటీ అకాడమీ క్రీడాకారులు పలు పతకాలు సాధించినట్లు అకాడమీ కోచ్ వై.దామోదర్ రెడ్డి తెలిపారు. బాలుర అండర్ 15 విభాగంలో జి.లోహిత్ స్వర్ణ పతకం, బాలికల అండర్ 11 విభాగంలో జి.మహి మన్విక స్వర్ణ పతకం, జి.మిషిక కాంస్య పతకం కై వసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరందరూ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య నగర పాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను కృష్ణాజిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈ.రామిరెడ్డి, వి.భార్గవి, కోశాధికారి ఎ.రామచంద్రరావు, వీఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ ఎ.శ్రీధర్, శిక్షకులు స్వపన్ గంగోపాధ్యాయ అభినందనలు తెలిపారు. రెండు స్వర్ణ, ఒక కాంస్యం కై వసం -
నడిరోడ్డుపై టీడీపీ నేతల బాహాబాహీ
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు టీడీపీలో ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. రెండు రోజుల క్రితం టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ మంగళవారం వెలుగుచూసింది. ఓ రహదారి మరమ్మతుల అంశంపై సర్పంచ్ సర్నాల గంగారత్నం భర్త, వార్డు సభ్యుడు సర్నాల బాలాజీ, గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసయ్య వారి వారి అనుచరులతో ఘర్షణకు దిగిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈనెల 28న గూడవల్లి నరసయ్య గ్రామంలోని బీఎంపీఎస్ రోడ్డులో మనుషులను పురమాయించి రహదారిపై గోతులను పూడ్పించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ భర్త, వార్డు సభ్యుడు సర్నాల బాలాజీ ఘటనా స్థలానికి వెళ్లి మీరెవరు పనులు చేయించడానికని ప్రశ్నించాడు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులతో పంచాయతీ రోడ్డులో పనులు ఎలా చేయిస్తారని నిలదీశాడు. సుమారు రూ.82లక్షలతో ఈ రహదారి అభివృద్ధికి అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించామన్నారు. రహదారిపై గోతులు పడి అధ్వానంగా మారినా పంచాయతీ పట్టించుకోనందునే తాము పనులు చేయిస్తున్నామని గూడవల్లి నరసయ్య బదులిచ్చారు. మాటా మాటా పెరిగి బాలాజీ, నరసయ్య మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. నువ్వు ఎంతంటే నువ్వు ఎంతంటూ దూషించుకున్నారు. గొడవ కాస్తా పెద్దదవడంతో ఇరు వర్గాల అనుచరులు ఒకరినొకరు తోసుకుంటూ నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశారు. దీంతో స్థానికులు కలుగజేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఒకే పార్టీలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవ కాస్తా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి వెళ్లడంతో పార్టీ పరువు బజారు కీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సర్పంచ్, ఏఎంసీ చైర్మన్ వర్గీయుల మధ్య తోపులాట -
వేద మంత్రోచ్చరణతో మారుమోగిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం వేదసభ నిర్వహించారు. ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 450 మంది వేద పండితులు హాజరయ్యారు. మహామండపం ఆరో అంత స్తులో నిర్వహించిన సభ ప్రారంభానికి ముందు వేద పండితుల వేద మంత్రోచ్చరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుడు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దుర్గగుడి ఈఓ శీనానాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన వేద పండితులను ఘనంగా సత్కరించి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. -
ఎక్స్పోలో ‘నాలా చెఫ్–వింగ్మాన్’ ఆవిష్కరణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఏర్పాటు చేసిన విజయవాడ ఎక్స్పో(ఎగ్జిబిషన్)లో ఆటోమేటెడ్ రోబోటిక్ నాలా చెఫ్–వింగ్మాన్ ఆవిష్కృతమైంది. ఈ స్టాల్ను ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో తయారీ, ఆవిష్కరణలు ప్రపంచ స్థాయికి చేరుకుంటున్నాయని, నాలా చెఫ్ ఇందుకు నిదర్శనమన్నారు. ఇది టెక్నాలజీ ఆధారిత కొత్త వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందన్నారు. ‘నాలా చెఫ్–వింగ్మాన్’ రూపొందించిన పారిశ్రామికవేత్త అనిల్ సుంకర మాట్లాడుతూ నాలా చెఫ్ ఒక ఉత్పత్తి మాత్రమే కాదని, ఇది భవిష్యత్ వంటకాల సాంకేతికతకు నిదర్శనమని చెప్పారు. విజయవాడ నుంచే ఈ భారతీయ ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసి గ్లోబల్ కిచెన్స్కు కొత్త నిర్వచనం ఇవ్వటమే తమ లక్ష్యం అన్నారు. -
శాఖల సమన్వయం... పటిష్టమైన బందోబస్తు
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని అన్ని శాఖల సమన్వయం, పటిష్టమైన పోలీసు బందో బస్తుతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకోగలుగుతున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో కలిసి సీపీ రాజశేఖరబాబు మంగళవారం క్యూలైన్లను పరిశీలించారు. అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా మరో 1400 మంది పోలీసు సిబ్బందితో 200 రోప్ పార్టీలను ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడా తొక్కిసలాట జరగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం అయ్యే విధంగా బందోబస్తును ముందు రోజు అర్ధరాత్రి నుంచి స్వయంగా పర్యవేక్షించామన్నారు. భవానీలకు ఏర్పాట్ల పరిశీలన భవానీలు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం నిమిత్తం వస్తారన్న అంచనాతో సీపీ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో కలిసి బస్ స్టాండ్, మున్సిపల్ కార్యాలయం, సీతమ్మ వారి పాదాలు, వినాయక టెంపుల్ పరిసర ప్రాంతాలలోని హోల్డింగ్ ఏరియాలను, క్యూలైన్లను నడుచు కుంటూ వెళ్లి పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నందున భక్తులు ఎవరూ నదిలోనికి వెళ్లకుండా కేవలం జల్లు స్నానాలు వినియోగించే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కేశఖండన శాల పరిసర ప్రాంతాలలో రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు పంపించే విధంగా సిబ్బంది తగు సూచనలు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. హోల్డింగ్ ఏరియాలలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్ని వసతులు అందుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనే విషయాన్ని గమనించి వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్చంద్ డీసీపీలు కె.తిరుమలేశ్వరరెడ్డి, ఎస్.వి.డి.ప్రసాద్ , ఏడీసీపీ జి.రామకృష్ణ, సౌత్ ఏసీపీ పావన్ కుమార్, రామచంద్ర రావు, ఇతర శాఖల అధికారులు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం సీపీ ఎస్వీ రాజశేఖరబాబు భవానీల రాక సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన -
9వ రోజు ఆదాయం రూ.40.12 లక్షలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుంటూరు జిల్లా తురకపాలెంలో సంభవించిన మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు పిచ్చుక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు 40 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తురకపాలెంలో మరణించిన వారంతా గ్రామంలో కంకర క్వారీల్లో పనిచేసేవారని తెలిపారు. అక్కడి ప్రజలు తాగే నీటిని చైన్నె ల్యాబ్కు పంపించగా నీటి కాలుష్యాన్ని ధ్రువీకరించిందన్నారు. ప్రభుత్వం స్పందించి మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుల వితంతు మహిళలకు ఉద్యోగ భరోసా కల్పించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సభ్యులు అన్సారీ, వెంకట్, సతీష్, వెల్ఫేర్ పార్టీ అధ్యక్షుడు కె.ఎం.సుభాన్, లక్ష్మణరావు, బాషా, సలాం తదితరులు పాల్గొన్నారు. గుడివాడ టౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 15 జట్లు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించగా మొదటి స్థానం చిత్తూరు జిల్లా జట్టు దక్కించుకుందని న్యూ గుడివాడ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నమనేని పూర్ణ వీరయ్య(బాబ్జి) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రా పురం జట్టు రెండో స్థానం, ఎస్ఆర్ఎంఏపీ అమరావతి జట్టు మూడో స్థానంలో నిలిచా యని వివరించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కె.రంగప్రసాద్, జీవితకాల సభ్యులు, కోచ్లు పాల్గొన్నారు. గన్నవరం రూరల్: ఓ వ్యక్తి అవయవదానంతో నలుగురికి పునర్జన్మ లభించింది. గన్నవరం మండలం చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని మెడికల్ కళా శాల బోధనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు పెనమలూరు మండలం చోడవరానికి చెందిన మొవ్వ ప్రదీప్కుమార్(46) గత నెల 25వ తేదీన వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న అతనికి 29వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అవయవ దానం చేసేందుకు ప్రదీప్కుమార్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. హాస్పిటల్లోని జీవన్ధాన్ ప్రక్రియ ద్వారా లివర్, కిడ్నీలు రెండు, లంగ్స్ను రాష్ట్రంతో పాటు తెలంగాణ పంపినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రదీప్ కుమార్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
సోషల్ మీడియా పోస్టుల నెపంతో 9 మందిపై కేసు
కంచికచర్ల: సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పోస్టులు పెట్టా రంటూ పోలీసులు కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన 9 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు రైతులు కాగా, ఒకరు జేసీబీ ఆపరేటర్, మరో ఇద్దరు యువకులు చైన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మరో ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ సీపీలో చురుకై న కార్యకర్తలు. అక్రమ అరెస్ట్ల విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ బండి మల్లికార్జునరావు, జెడ్పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్రశాంతి, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మార్త శ్రీనివాసరావు, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల రమేష్, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు మంగలపూడి కోటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా రైతు నాయకులు రాయల నరసింహారావు, ఎస్సీ సెల్ నాయకులు ముప్పాళ్ల శివాజీ, మాజీ సొసైటీ అధ్యక్షుడు వేమవరపు పురుషోత్తం తదితరులు కంచికచర్ల పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం తెల్ల వారుజామున ఆందోళన చేశారు. ఆందోళన విషయం కంచికచర్ల, చందర్లపాడు ఎస్ఐలు విశ్వనాఽథ్, ధర్మరాజు రూరల్ సీఐ చవాన్కు సమాచారం అందించగా ఆయన హుటాహుటిన పోలీస్ స్టేషన్కు వచ్చారు. నాయకులను స్టేషన్లోకి పిలిచి ఆందోళన విరమించాలని కోరారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, తమకు సహకరించాలని సీఐ కోరారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆందోళన విరమించారు. పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురిని నందిగామ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 9 మందిపై అక్రమంగా కేసు నమోదు... మండలంలోని మోగులూరు గ్రామానికి చెందిన 9 మందిని సోషల్ మీడియాలో అధికార పార్టీ నాయకులను కించపర్చారనే ఫిర్యాదు మేరకు అన్యాయంగా అక్రమంగా కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో బండి ఽశ్రీనివాసరావు, కాశిబోయిన భిక్షాలయ్య, బండి రామారావు, బండి నాగశివరావు, రాయల త్రిశాంక్, యర్రగుంట వెంకటేశ్వరరావు, షేక్ మహ్మద్ ఆరీఫ్, షేక్ జాన్సైదా, బండి మురళీ చౌదరి ఉన్నారు. కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు -
7 లక్షల క్యూసెక్కులు వస్తున్న వరద నీరు
కంచికచర్ల: ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి కృష్ణానదికి మంగళవారం 7లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని అధికారులు అంటున్నారు. కంచికచర్ల మండలం కొత్తపేట, గనిఆత్కూరు, మున్నలూరు, కునికెనపాడు, చెవిటికల్లు గ్రామాల్లోని పంట పొలాల్లోకి కృష్ణానది వరదనీరు చేరుతోంది. రాత్రికి ఇంకా వరద నీరు పెరిగే అవకాశాలు ఉన్నాయని డెప్యూటీ తహసీల్దార్ వి.మానస తెలిపారు. ఇప్పటికే నదీతీర ప్రాంత ప్రజలు కృష్ణానదిలోకి దిగకుండా అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ సిబ్బందిని నదీతీర గ్రామాల వద్ద కాపలా ఉంచామని చెప్పారు. కృష్ణానది తీర గ్రామాల సమీపంలో రైతులు సాగుచేసిన మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలన్నీ నీట మునిగాయి. సుమారు 100 ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లంక భూముల్లో ఉన్న రైతులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని డీటీ తెలిపారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి అన్నారు. నగరంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో జరుగుతున్న ఆరవ జాతీయ జూనియర్, సీనియర్–సీ యోగాసన చాంపియన్ షిప్–2025–26 పోటీలను మంగళవారం ఆమె పరిశీలించారు. మెప్మా డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ మాట్లాడుతూ నగరంలో ఓ వైపు దసరా ఉత్సవాలు, మరో వైపు జాతీయ స్థాయి యోగాసన పోటీలు జరుగుతుండడంతో నగరానికి రెట్టింపు కళ వచ్చిందన్నారు. సత్యసాయి ధ్యానమండలి వ్యవస్థాపకుడు బిక్షమయ్య గురూజీ మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్కుమార్, ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు కొంగర సాయి తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం విజేతలకు అతిథులు పతకాలు అందజేసి అభినందించారు. విజేతల వివరాలు.. సీనియర్ పురుషులు బాడీ ట్విస్టింగ్ వ్యక్తిగత విభాగలో ఇంద్రజిత్ (ఏఐపీఎస్సీబీ)ప్రథమ, రాజేష్కుమార్ సోని (మధ్యప్రదేశ్) ద్వితీయ, దిలీప్కుమార్ (బీహార్) తృతీయ బహుమతులు పొందారు. జూనియర్ పురుషుల హ్యాండ్ బ్యాలెన్స్ వ్యక్తిగత విభాగంలో ఆయుష్ భౌమిక్ (పశ్చిమ బెంగాల్), రితిక్ బిష్ణోయ్ (రాజస్థాన్), బి.మనోజ్ (తమిళనాడు), బ్యాక్ బెండ్ వ్యక్తిగత విభాగంలో రాజ్ రాజోల్ (మధ్యప్రదేశ్), సౌనవ హజ్రా (సీఎస్ఎసీసీఈ), చందన్ శర్మ (బీహార్), జూనియర్ మహిళల బ్యాక్ బెండ్ వ్యక్తిగత విభాగంలో అనిక రాణా (ఉత్తరప్రదేశ్), ఎస్.హేమమాలిని (తమిళనాడు), అమృత సర్గులె (మహారాష్ట్ర), ఆర్టిస్టిక్ వ్యక్తిగత విభాగంలో రుద్రాక్షి భావె, రియా (మహారాష్ట్ర), రీత్ శ్రీవత్సవ్ (ఢిల్లీ) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచి పతకాలు గెలుపొందారు.శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణి -
సమ్మెలోకి పీహెచ్సీ వైద్యులు
మచిలీపట్నంఅర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలో ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేస్తూ, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్ (ఏపీపీహెచ్సీడీఏ) ప్రకటించింది. ఈ నెల 26 వ తేదీ నుంచి పీహెచ్సీ డాక్టర్లు దశలవారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే కలెక్టరు బాలాజీ, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.వెంకట్రావులకు సంఘం తరఫున జిల్లా నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులు సమ్మె చేపట్టారు. పీజీ కోటా తగ్గింపుపై ఆగ్రహం సర్వీస్ వైద్యుల పీజీ కోటాను తగ్గించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంపై డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ సీట్లు ఉండగా, వాటిని 15 శాతానికి తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీహెచ్సీల్లో పనిచేసే వైద్యులకు తక్కువ కాలంలోనే ప్రమోషన్లు లభిస్తుంటే, 20 ఏళ్లుగా పీహెచ్సీల్లో పని చేస్తున్న డాక్టర్లు ఇంకా సీనియర్ మెడికల్ ఆఫీసర్లుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 49 పీహెచ్సీలు, 14 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో దాదాపు 110 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న సమయంలో సమ్మె ప్రారంభం కావడంతో పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వైద్యుల డిమాండ్లు వైద్యుల ప్రధాన డిమాండ్లలో పీజీ కోటాను పునరుద్ధరించడం, టైం బౌండ్ ప్రమోషన్లు కల్పించడం, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్పై 50 శాతం అలవెన్స్ ఇవ్వడం, చంద్రన్న సంచార చికిత్స పథకానికి ప్రత్యేక భృతి కేటాయించడం ఉన్నాయి. అదనంగా అర్బన్, నేటివిటీ కౌన్సెలింగ్ గడువును ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించాలని కోరుతున్నారు. సేవలను గుర్తించని కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన సర్వేలు, పల్స్ పోలియో కార్యక్రమాలు, వరదలు, విపత్తుల సమయంలోనూ క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఉద్యోగోన్నతులు అందకపోవడం వైద్యులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. జాయిన్ అయినప్పుడు ఉన్న అదే కేడర్లో ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తమ సేవలకు సరైన గుర్తింపు లభించడం లేదని పీహెచ్సీ వైద్యులు ఆరోపిస్తున్నారు. -
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యోగ సాధనను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో జరుగుతున్న 6వ జాతీయ జూనియర్, సీనియర్–సీ యోగాసన చాంపియన్షిప్–2025–26లో పతకాలు పొందిన పలు విభాగాల క్రీడాకారులకు మంత్రి రవీంద్ర సోమవారం పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను ఒలింపిక్స్లో ప్రవేశపెడితే భారత్కు తప్పకుండా పతకాలు వస్తాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా పోటీలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకష్ణ ప్రసాద్ ,ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్కుమార్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు. విజేతల వివరాలు... హ్యాండ్ బ్యాలెన్స్ మహిళల వ్యక్తిగత విభాగంలో పి.ప్రసూన (ఆంధ్రప్రదేశ్) ప్రథమ, ఆష్మా దాస్ (పశ్చిమ బెంగాల్) ద్వితీయ, పంపం దేవి (గోవా)తృతీయ స్థానంలో నిలిచారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో ఇంద్రజిత్ (ఏఐపీఎస్ సీబీ), వినాయక్ ఎం.కొంగి (కర్ణాటక), తన్మే అధికారి (ఉత్తరాఖండ్), బ్యాక్ బెండింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అర్చన కవాటేకర్ (మహారాష్ట్ర), బిన్నీ కుమారి బాల (బీహార్), శీతల బైస్య (అసొం), పురుషుల వ్యక్తిగత విభాగంలో అయ్యంపిళ్ళై (తమిళనాడు), బీరేంద్రకుమార్ యాదవ్ (హరియాణ), రాహుల్ శాండోర్ (మహారాష్ట్ర) ఒక్కో విభాగంలో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారి పడి ఒకరు మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని షాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి షాబాద్ గ్రామానికి చెందిన పేరం పాండురంగారావు గ్రామానికి సమీపంలోని టిడ్కో ఇళ్లకు వాచ్మెన్గా పని చేస్తుంటాడు. ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో పాండురంగారావు టిడ్కో ఇళ్ల చుట్టూ పరిశీలించేందుకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై పాండురంగారావు భార్య వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం కొండపై ఎవరో మనిషి ఉన్నాడని తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లారు. పాండురంగారావును కిందకు తీసుకువచ్చే క్రమంలో కాలు జారి కింద పడి తలకు గాయాలయ్యాయి. వెంకటేశ్వరమ్మ అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా, వారు వచ్చే సమయానికి పాండురంగారావు చనిపోయాడు. వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర -
పంట పొలాల్లోకి వరద నీరు
పెనమలూరు: కృష్ణానదిలో సోమవారం దాదాపు 6.5 లక్షల క్యూసెక్కులు వరద నీరు రావటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మండలంలోని యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం గ్రామాల్లో వరద నీరు పంట పొలాల్లోకి వచ్చాయి. ప్రస్తుతానికి పంటలకు ఇబ్బంది లేకపోయినా వరద నీరు ఇంకా పెరిగితే పంటలు నీట మునిగే పరిస్థితి ఉందని రైతులు తెలిపారు. పసుపు, కంద, వరి, కూరగాయల పంటలకు ప్రమాదం పొంచి ఉంది. పల్లపు ప్రాంతాల్లో వరద నీరు ఇప్పటికే ఇళ్ల వద్దకు చేరుకుంది. వరద ఉధృతి పెరిగితే వరద నీరు నేరుగా ఇళ్లను ముంచెత్తే ప్రమాదం ఉంది. పెదపులిపాక, యనమలకుదురు ప్రాంతాల్లో కరకట్ట దిగువన ఉన్న నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. వరద నీరు పెరుగుతుండటంతో పంట పొలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. -
విమానాశ్రయంలో కెఫే స్టాల్ ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. స్థానిక విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉడాన్ యాత్రి కెఫే స్టాల్ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయ ఆవరణలో ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయాల్లో సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటు ధరల్లో టీ, కాఫీ, స్నాక్స్ విక్రయించేందుకు ఉడాన్ యాత్రి కెఫేను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణికుల వృద్ధి రేటు 15 శాతం పెరిగిందన్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త విమాన సర్వీస్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కు మరో నెలలో విమాన సర్వీస్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశీయంగా అహ్మదాబాద్, వారణాసి, కొచ్చి, పుణేకు సర్వీస్లు నడపనున్నట్లు చెప్పారు. ఏడాదికి 35 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో నూతన టెర్మినల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఉడాన్ యాత్రి కెఫే స్టాల్ మెనూ కార్డును ఆయన ఆవిష్కరించారు. ఏఏఐ బోర్డు సభ్యులు డాక్టర్ హెచ్.శ్రీనివాస్, డాక్టర్ శరద్కుమార్, విమానాశ్రయ సలహా కమిటీ సభ్యుడు పొట్లూరి బపసరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రామాచారి, ఎయిర్పోర్ట్ డెరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, పలువురు ఎయిర్పోర్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పొంగి పొర్లుతున్న చంద్రమ్మ కయ్య
జగ్గయ్యపేట: ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం మండలంలోని ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు నుంచి 5.69 లక్షల క్యూసెక్కుల వరద నీటిని 16 గేట్ల ద్వారా విడుదల చేస్తుండటంతో మండలంలోని కృష్ణానది పరివాహక గ్రామాలైన ముక్త్యాల, వేదాద్రి, రావిరాల గ్రామాలలో కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ముక్త్యాల–జగ్గయ్యపేట రహదారిలోని చంద్రమ్మ కయ్య పొంగి పొర్లుతుండటంతో రెండవ రోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కేసీపీ కర్మాగారంలో నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. రావిరాల బీసీ కాలనీ ప్రజలు రెండవ రోజు కూడా పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్నారు. ముక్త్యాల, రావిరాల, కె.అగ్రహారం గ్రామాలలోని పత్తి, మిర్చి పంటలు వరద నీటిలో మునిగాయి. మరో మూడు రోజుల పాటు వరద ఉధృతి ఉంటుందని అధికారులు చెబుతుండటంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు సూచనలు చేస్తున్నారు. -
తక్కువ ధరలకు సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవల పన్ను జీఎస్టీ –2.0తో తక్కువ ధరలకు సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు లభిస్తున్నాయని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ రత్నాచార్యులు ముద్రించిన వాల్పోస్టర్లను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం పద్ధతిలో సాగు చేపట్టే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు తక్కువ ధరకే లభిస్తాయని, ఆ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గిందని. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 2.5 శాతం తగ్గింపుతో పరికరాలను అందిస్తోందన్నారు. జేసీ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీవో కె.స్వాతి, ఉద్యానశాఖ అధికారి జె.జ్యోతి పాల్గొన్నారు. రవాణాశాఖ అవగాహన ర్యాలీ ధరల తగ్గింపుపై రవాణాశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించారు. జీఎస్టీ –2.0 ద్వారా వాహనాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయని, వీటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, జిల్లా రవాణాధికారి యూ ఎన్ఎస్ శ్రీనివాసరావు, కమర్షియల్ డెప్యూటీ కమిషనర్ రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ కన్నెర్ర
ఏటిపాయకు భారీగా వచ్చిన వరద లంక గ్రామాలను చుట్టుముట్టింది. పెనమలూరు మండలంలో కరకట్ట వెంబడి గ్రామాల్లో నివాసం ఉంటున్న వేలాది నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా గ్రామాల్లోని నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు శివారు తోడేళ్లదిబ్బ లంక, వల్లూరుపాలెం శివారు రావిచెట్టు లంక, పాములలంక, తుమ్మలపచ్చిక లంక, చాగంటిపాడు శివారు పిల్లివానిలంక, దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంక, ఐలూరు శివారు కనిగిరిలంక, ములకల లంక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి. కాసరనేనివారిపాలెం వద్ద నీట మునిగిన శివాలయం గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/కంకిపాడు: ప్రకాశం బ్యారేజ్కు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణమ్మ పోటెత్తింది. రెండు రోజులుగా బ్యారేజ్కు వరద ఉద్ధృతి అంత కంతకూ పెరుగుతోంది. దీంతో బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయానికి 6,54,876 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఇందులో 6,39,737 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలివేశారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి 6,74,971 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సాయంత్రానికి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.9 అడుగుల నీటి మట్టం ఉంది. వరద కారణంగా నది పరీవాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి.. ఏడిపిస్తున్న ఏటిపాయ.. పెనమలూరు, పామర్రు, దివిసీమ ప్రాంతాల్లో ఏటిపాయ వెంబడి ఉన్న ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరదనీరు కరకట్ట అంచులు తాకుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు, పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు, కంకిపాడు మండలాల్లో కరకట్ట వెంబడి సాగులో ఉన్న పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. ప్రధానంగా అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు నీట మునిగాయి. గతేడాది సెప్టెంబర్ ఏటిపాయకు వరద భారీగా రావటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరలా ఈ ఏడాది సెప్టెంబర్లోనే వరద ముంచుకురావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ రోజులు వరదనీరు పంట పొలంలో నిలిచిపోతే పంటలు కుళ్లిపోయే ఆస్కారం ఉందని వాపోతున్నారు. అయ్యో ఎడ్లంక.. దివిసీమ పరిధిలోని ఎడ్లంక గ్రామంలోకి వరదచొచ్చుకొచ్చింది. దీంతో రహదారి మార్గం మూసుకుపోవటంతో రాకపోకలకు నిలిచిపోయాయి. ఇక్కడి పలు నివాసాల్లోకి సైతం నీరు చేరటంతో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. దీంతో నివాసితులు సామాన్లను తరలించి భద్రపర్చుకుంటున్నారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో లంక గ్రామాలు, కరకట్ట వెంబడి ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అవనిగడ్డ మండలంలోని పలు ప్రాంతాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం విస్తృతంగా పర్యటించారు. పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు. పులిగడ్డ, పల్లెపాలెం ప్రాంతాల్లో వరదను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.