breaking news
NTR district Latest News
-
అధికారిక అడ్డా
పేకాటరాయుళ్లకు సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేకాట జోరుగా నడుస్తోంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ శిబిరాలు నడు స్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మొక్కుబడి దాడులతో సరిపెడుతు న్నారు. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వాట్సాప్ స్టేటస్లో పెట్టిన పోస్టు పేకాట జోరుకు నిదర్శనంగా నిలిచింది. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్. పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్’ అంటూ వాట్సాప్ స్టేటస్గా పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఇది నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్న తీరును, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. విస్సన్నపేట మండలంలోని కొండపర్వ గట్టుపై నిత్యం పేకాట క్లబ్బు నడుపుతున్నారని ఆ మండల ముఖ్య నాయకుడిని ఉద్దేశించి ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్లో చేసిన కామెంట్లు మరోసారి టీడీపీ నాయకులు, పోలీసులను ఇరకాటంలో పడేశాయి. ఇక్కడ ప్రజాప్రతినిధుల మధ్య వివాదం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పార్లమెంటు ప్రజాప్రతినిధి క్యాంపు కార్యాలయాల పేరుతో మండల కేంద్రాల్లో పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేశారు. తిరువూరు, విస్సన్నపేటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాల్లోకి ఎమ్మెల్యేకు, ఆయన అనుచరులకు ప్రవేశం లేకుండా అడ్డుకట్ట వేశారు. గతంలో పలుమార్లు పార్టీ నాయకులపైనే ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే ఈ సారి విస్సన్నపేటలో ఓ నాయకుడిని పరోక్షంగా ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో తిరువూరులో గంజాయి అమ్మకాలపై కూడా పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గీయులను టార్గెట్ చేస్తూ పోలీసుస్టేషనులో ఎమ్మెల్యే హల్చల్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో.. తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, మల్లేల, చిట్టేల, తోకపల్లి, కొండపర్వ, పెను గొ లను, ఊటుకూరు, రేపూడి, పుట్రేల, నాయకుల గూడెం, వేమిరెడ్డిపల్లి, తునికిపాడు, కొండూరు, గోపాలపురం గ్రామాల్లో జూదాలు జరుగుతున్నాయి. పోలీసుల కనుసన్నల్లోనే ఈ జూదాలు జరుగుతున్నాయని ఆయా గ్రామాల్లో స్థానికులు చెబుతున్నారు. నందిగామ నియోజకవర్గంలో.. నందిగామ నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. కంచికచర్ల రిక్రియేషన్ క్లబ్తో పాటు మండలంలోని గొట్టుముక్కల గ్రామంలోని మామిడి తోటలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడే పేకాట ఆడిస్తున్నాడు. ఇతనే కంచికచర్ల ఓసీ క్లబ్లోఆరు టేబుళ్లు ఏర్పాటు చేసి పేకాట ఆడిస్తున్నట్టు సమాచారం. గొట్టుముక్కలలో లోన – బయట, కోతముక్క ఆడిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. నందిగామలోని కాకాని వెంకటరత్నం కళాశాల ఎదురుగా ఉన్న సందుల్లో రెండు భవనాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయని సమాచారం. జగ్గయ్యపేటలో.. జగ్గయ్యపేట నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంటుంది. జగ్గయ్యపేట మండలంలోని చిలకల్లు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకుడు అటవీ ప్రాంత గ్రామాలైన గండ్రాయి, మల్కాపురం ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడిస్తున్నాడు. అతనికి పోలీసుల అండదండలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. సంక్రాంతి కోసం అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. జగ్గయ్యపేట ప్రధాన సెంటర్లో ఓ హోటల్లో రాత్రి వేళల్లో పేకాట నిర్వహిస్తు న్నారు. ఇటీవల పోలీసులు దాడి చేయగా పేకాట రాయుడు పరారయ్యారు. ఆ హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా పేకాట శిబిరాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే శిబిరాల నిర్వహణ తిరువూరు ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్లో సంచలన వ్యాఖ్యలు మైలవరం నియోజకవర్గంలో.. మైలవరం మండలంలో మైలవరం, బొర్రా గూడెం, మొర్సుమల్లి, వెల్వడం, పోరాటనగర్, రెడ్డిగూడెం మండల పరిధిలోని రెడ్డిగూడెం, మొద్దులపర్వ, అన్నేరావుపేట, దాసుళ్లపాలెం, జి.కొండూరు మండల పరిధిలో వెల్లటూరు, వెంకటాపురం, జి.కొండూరు, గంగినేని, మునగపాడు, వెలగలేరు, కందులపాడు, ఇబ్రహీం పట్నం మండల పరిధిలోని కొండపల్లి ఖిల్లా, మూలపాడు, జూపూడి లంక గ్రామాలు, విజయవాడ రూరల్ ప్రాంతాల్లోని మామిడి తోటలు, అటవీ ప్రాంతాలే అడ్డాలుగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. వీటికి స్థానిక టీడీపీ నాయకుల అండదండలు ఉండడంతో పోలీసులు సైతం అప్పుడప్పుడు దాడులు చేసి వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నవంబర్ ఒకటో తేదీన వత్సవాయి శివారులో పేకాడుతున్న ఏడుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.24 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ ఏడో తేదీన మైలవరం మండల పరిధి పోరాటనగర్ గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 9 మంది పేకాట రాయుళ్లు చిక్కగా మరి కొందరు పరారయ్యారు. నిందితుల నుంచి రూ.1,15,600 నగదు, 49 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ ఏడో తేదీన రెడ్డిగూడెం మండలం నాగులూరు శివారు మామిడి తోటలో పేకాడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రూ.3.25 లక్షల నగదు, నాలుగు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 9వ తేదీన తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, నాయకులగూడెం, జి.కొండూరు మండలం వెల్లటూరు, కొత్తూరు, గంపలగూడెం మండలంలోని తునికిపాడులో పేకాడుతున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ.73,380 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
నవ్విపోయిన నాణ్యత!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సర్కార్ పాఠశాలల విద్యార్థులకు అందించిన బ్యాగులు ఇతర సామగ్రి మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. వాటి నాణ్యత దారుణంగా ఉండటంతో విద్యార్థులు నానాతంటాలు పడుతున్నారు. అంత చేస్తాం.. ఇంత ఇస్తామంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ విద్యార్థి సంఘ నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన సామగ్రి మూడునాలుగు మాసాలకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 942 ప్రభుత్వ విద్యాసంస్థలు ఎన్టీఆర్ జిల్లాలోని 20మండలాల్లో సుమారుగా 942 ప్రభుత్వ యాజమాన్య పరిధిల్లో కొనసాగే విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్, మునిసిపల్ తదితర యాజమాన్యాల పేర్లతో అవి కొనసాగుతున్నాయి. ఆయా విద్యా సంస్థల్లో సుమారుగా లక్ష మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారికి 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటుగా బ్యాగ్, షూస్, యూనిఫామ్ తదితర వస్తువులతో కూడిన కిట్లను అందించారు. సాధారణంగా పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన వస్తువులను దాదాపుగా నెల రోజుల తేడాతో వాటిని విద్యార్థులకు అందించారు. ఇచ్చిన నెలకే చిరిగిపోయాయి.. ప్రభుత్వం అందించిన బ్యాగులు, షూస్ విద్యార్థులకు అందిన నెల రోజులకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానంగా నాణ్యత లేని బ్యాగులు అందించటంతో చిరిగిపోయిన వాటిని కొంతమంది వాటిని కుట్టే వారికి అందించి డబ్బులిచ్చి కుట్టించుకున్నామని చెబుతున్నారు. మరికొంతమంది వారే సూదితో కుట్టుకొని అవస్థలు పడుతూ వినియోగిస్తున్నారు. కొంతమంది తమ బ్యాగులు ఎక్కడికక్కడ పీసులుగా ఊడిపోయి కుట్టడానికి సైతం కుదరకపోవటంతో వాటిని బయట పడేసి ఇతర బ్యాగులతో పాఠశాలలకు వస్తున్నారు. షూస్ పరిస్థితి సైతం అదే విధంగా ఉందని విద్యార్థులతో పాటుగా కొంతమంది ఉపాధ్యాయులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. తల్లిదండ్రుల ఆగ్రహం.. చంద్రబాబు ప్రభుత్వం పాలనలో తమ పిల్లలకు బ్యాగులు, షూస్ ఇచ్చామనే పేరే తప్ప వాటిలో నాణ్యత లేదని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అందించే వస్తువులు నాణ్యత లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు అందులోనూ చిన్నపిల్లలు వాడే వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరిగిపోయిన బ్యాగుల్లో పుస్తకాలు తీసుకువెళ్లటానికి చిన్నారులు నానా తంటాలు పడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా కూతురు జూపూడి ఎంపీపీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ప్రభుత్వం అందించిన స్కూలు బ్యాగు ఇచ్చిన రెండు నెలలకే చిరిగిపోయింది. పాఠశాలలో బ్యాగులు చిరిగిపోయిన ఒకరిద్దరికి రిట్నర్ తీసుకొని కొత్తవి ఇచ్చారు. కొందరికి అసలు ఇవ్వలేదు. ప్రభుత్వం నాణ్యమైన బ్యాగులు ఇస్తే మాకు సమస్య ఉండదు. పిల్లలు పుస్తకాలు తీసుకెళ్లాలంటే బ్యాగు మంచిగా ఉంటేనే సక్రమంగా పాఠశాలకు వెళ్లగలుగుతారు. ప్రభుత్వం ఈ సారి సీజన్కై నా మంచి బ్యాగులు ఇవ్వాలి. – బాణావతు జగన్నాఽథం నాయక్, జూపూడి గ్రామం, ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. విద్యార్థులకు అందించే వస్తువుల విషయంలోనూ నాణ్యత లోపించటంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. బ్యాగులు, షూస్ చిరిగిపోయి ఇబ్బందులెదుర్కొంటున్నారు. నాణ్యత విషయంలో రాజీపడటం సరికాదు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో గత ప్రభుత్వం హయాంలో జరిగిన నాడు–నేడు పనులు చివరి దశలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను చూడాలి. అప్పుడే విద్యార్థుల భవిత ఉజ్వలంగా ఉంటుంది. – వానపల్లి రవీంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘ నేత -
అంగన్వాడీ.. వేడి!
సాక్షి, అమరావతి: గతంలో తాము చేపట్టిన సమ్మె సమయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం వీరు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన ధర్నాలో ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ కార్యదర్శి ఎంసీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై అధిక పనిభారం పెడుతోందని, సమాన పనికి సమాన వేతనం నిబంధన ప్రకారం రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని కోరారు. గతంలో 42 రోజులపాటు అంగన్వాడీలు ధర్నా చేపట్టినప్పుడు కుప్పంలో జరిగిన ఆందోళనకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబునాయుడు మద్దతు ఇచ్చి.. తాను సీఎం కాగానే డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కానీ, అధికారం చేపట్టి ఇప్పటికి 18 నెలలు కావొస్తున్నా తమ గురించి కానీ, తమకు ఇచ్చిన హామీల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో ఇదే టీడీపీ నేతలంతా అంగన్వాడీలకు మద్దతు పలికి.. ఇప్పుడు అధికారం చేపట్టగానే పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. పింఛన్ డ్యూటీ నుంచి మినహాయించాలి.. అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ.. పింఛన్ డ్యూటీ నుంచి తమను మినహాయించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలన్నారు. అలాగే ఆరోగ్య కార్యకర్తలు చేయాల్సిన పనులను కూడా అంగన్వాడీలతోనే చేయిస్తున్నారని, గతంలో ఇచ్చిన ఫోన్లు పనిచేయడంలేదని, కొత్తవి ఇవ్వడంతో పాటు అన్ని యాప్లను ఒకే యాప్గా చేయాలని, తమకు ఎఫ్ఆర్ఎస్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.దుర్గారావు, ఎన్టీఆర్ జిల్లా అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు టి. గజలక్ష్మి, సీఐటీయూ నగర కార్యదర్శి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ పాలనలో నాణ్యతతో కూడిన కిట్లు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో ఏటా విద్యార్థులకు పుస్తకాలతో పాటుగా అత్యంత నాణ్యతతో కూడిన బ్యాగులు, షూస్ అందించారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులకు వాటిని అందజేశారు. గత ప్రభుత్వ పాలనలో చక్కగా యూనిఫామ్ ధరించి బ్యాగులు తీసుకొని షూస్ వేసుకొని హుందాగా పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యే వారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు లక్ష మంది విద్యార్థులకు అందించిన బ్యాగులు, షూస్లో సగం వరకూ చిరిగిపోయి ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. -
ఫలితాల సాధనలో హెచ్ఎంల పాత్ర కీలకం
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంపు, విద్యార్థుల ఫలితాల సాధనలో ప్రధానోపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. డీఈఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డెప్యూటీ ఈవో అధ్యక్షత శుక్రవారం మచిలీపట్నం డివిజన్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశం జరిగింది. డీఈఓ మాట్లాడుతూ పాఠశాల స్థాయి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల విద్యారంగ పురోగతి, విద్యార్థుల హాజరు, బోధనా కార్యక్రమాల అమలు, పరీక్షల నిర్వహణ, స్వచ్ఛత, మౌలిక వసతుల మెరుగుదల తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. 10వ తరగతి కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, హామీ ఇచ్చిన ప్రాథమిక–పునాది విద్య, విద్యాశక్తి కార్యక్రమం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా బోధనా వీడియోల వినియోగం వంటి ముఖ్య కార్యక్రమాల అమలుకు సూచనలు చేశారు. మచిలీపట్నం డివిజన్ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంలు పాల్గొన్నారు. పబ్లో అగ్నిమాపకశాఖ తనిఖీలు పటమట(విజయవాడతూర్పు): గోవాలోని నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది మరణించిన నేపథ్యంలో ప్రజల భద్రతలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నైట్ పబ్లలో అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వీఎంసీ ఫైర్ అధికారి మాల్యాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీ శుక్రవారం మొగల్రాజపురం ఐరన్ హిల్ పబ్లో జరిగింది. ఈ మేరకు అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అగ్ని నిరోధక పరికరాలను ఉపయోగించే విధానం, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది మంటలను ఎలా ఆర్పాలి, వస్తువులను ఎలా వినియోగించాలి, అగ్ని ప్రమాదం జరగకుండా కాంప్లెక్స్ చుట్టూ ఫైర్ సేఫ్టీ చర్యలు ఏమేం తీసుకోవాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె. నరేష్, సిబ్బంది పాల్గొన్నారు. లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): రవాణా శాఖ లో ఉన్న అనేక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని లారీ యజమానుల సంఘ నేతలు శుక్రవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఎం. రాంప్రసాద్రెడ్డిని కలిసి విన్నవించారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన నేతలు ఫిట్నెస్ ఫీజుల పెంపు, ఆంధ్రా–తెలంగాణ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల అంశం, కర్ణాటక రిజిస్ట్రేషన్ ట్రైలర్లపై విధిస్తున్న అధిక పెనాల్టీలు, వంటి ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఈశ్వరరావు తెలిపారు. కృష్ణాజిల్లా లారీ యజమానుల సంఘ అధ్యక్షుడు ఎన్. రాజా, ప్రధాన కార్యదర్శి ఏవీవీ సత్యనారాయణ, కార్యదర్శి రావి శరత్, కోశాధికారి ఎన్. కృష్ణ, ట్రైలర్స్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సూరపనేని సురేష్ పాల్గొన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ శనివారం ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లయిమ్లు, అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు తమ న్యాయవాదులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కై కలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ కోర్టుల్లో ఈ లోక్అదాలత్ నిర్వహిస్తారన్నారు. -
రేపు మధుమేహంపై జాతీయ సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ (ఏపీడీఎఫ్కాన్–2025), ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14న విజయవాడలో సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీడీఎఫ్కాన్ ప్రెసిడెంట్ డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యారావుపేటలోని తమ ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ సదాశివరావు మాట్లాడుతూ.. లబ్బీపేటలో హోటల్ జీఆర్టీ గ్రాండ్లో నిర్వహించే ఈ సదస్సులో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 500 మంది నిపుణులు పాల్గొంటారని, 20 మంది జాతీయ వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు. మధుమేహంతో శరీరంలోని గుండె, కిడ్నీ వంటి అవయవాలపై ప్రభావం చూపుతాయని, కొత్తగా వచ్చే మందులు ఆ అవయవా లను కాపాడతాయని పేర్కొన్నారు. కొత్త మందులు, ఒబెసిటీతో ప్రభావం వంటి అనేక కీలక అంశా లను చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదస్సు జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యలమంచి ఐశ్వర్య, డాక్టర్ హిమన, డాక్టర్ అమూల్య తదితరులు పాల్గొన్నారు. -
భక్తి ప్రకాశం.. అరుణోదయం
విద్యుత్ ధగధగలు.. దీక్ష విరమణల సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దుర్గమ్మ ఆలయంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘చల్లంగా చూడు దుర్గమ్మ తల్లి.. మళ్లీ ఏడాది దీక్షతో పిల్లా పాపలను తీసుకుని నీ కొండకు వస్తాం’ అని భవానీలు అమ్మవారిని వేడుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకోగా.. శుక్రవారం సుమారు 80 వేల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 1.15 గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీ దర్శనానికి అనుమతించారు. గురువారం రాత్రి నగరానికి చేరుకున్న భవానీలు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని, క్యూలైన్లోనే వేచి ఉండటం కనిపించింది. వేకువజామునే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భవానీలు, కొండ దిగువకు చేరుకుని ఇరుముడులను సమర్పించారు. అనంతరం ఇరుముడిలోని నేతి కొబ్బరి కాయను హోమగుండానికి అర్పించి దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. దీక్ష విరమించిన భవా నీలు లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 11 గంటల వరకు భవానీలకు అమ్మవారి దర్శనం కల్పించారు. నేడు, రేపు కీలకం.. భవానీ దీక్ష విరమణలలో శనివారం, ఆదివారం అత్యంత కీలకమని ఆలయ అధికారులు భావిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారాల నేపథ్యంలో భవానీలు భారీగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆలయ అధికారులు కీలకమైన కేశఖండనశాల, లడ్డూ తయారీలను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం, రాత్రికి ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భవానీలకు తోడు నగరానికి చెందిన భక్తులు సైతం గిరి ప్రదక్షిణ చేయనుండటంతో ఆయా మార్గాల్లో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. లిఫ్టు కోసం భారీ క్యూ.. సామాన్య భక్తులు లిఫ్టుపై కొండపైకి చేరుకునేందుకు వివిధ మార్గాల ద్వారా మహామండపం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో లిఫ్టు వద్ద భక్తులు బారులు తీరి కనిపిస్తున్నారు. అసలు కనకదుర్గనగర్ వైపు నుంచి పోలీసులు భక్తులెవరికి అనుమతించమని చెబుతున్నారు. అయితే వీరు ఏ విధంగా మహా మండపం వద్దకు చేరుకుంటున్నారోనని సెక్యూరిటీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. భవానీలతో పాటు సాధారణ భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. రెండో రోజు ఆదాయం రూ.58.10లక్షలు భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని రెండో రోజైన శుక్రవారం దేవస్థానానికి రూ. 58.10 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. సింగిల్ లడ్డూ విక్రయం ద్వారా రూ. 1.09లక్షలు, ఆరు ప్రత్యేక ప్యాక్ లడ్డూల విక్రయం ద్వారా రూ.52.20 లక్షలు, కేశఖండన ద్వారా రూ. 4.75లక్షలు, ఇతర ఆదాయం ద్వారా రూ. 5,466 లభించినట్లు పేర్కొన్నారు. భవానీలు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. కుమ్మరిపాలెం మొదలు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్ వరకు పలు ప్రధాన కూడళ్లు, అపార్టుమెంట్లు, భవన సముదాయాల వద్ద పలు భక్త బృందాలు, సేవా బృందాలు అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు అల్పాహారం, పాలు, పండ్లు, ఫలాలను అందిస్తూ సేవలు చేస్తున్నారు. దుర్గగుడి ఈవో శీనానాయక్ గిరిప్రదక్షిణ మార్గంలో బైక్పై తిరుగుతూ భవానీలతో మాట్లాడారు. ఇబ్బందులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. -
రేషన్ పక్కదారి పడితే కఠిన చర్యలు
ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అమలుకు సంబంధించి విస్తృత తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్ పక్కదారి పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం జేసీ ఇలక్కియ ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వను అరికట్టే విషయాలపై జిల్లా పౌర సరఫరా శాఖ సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు బోర్డర్ చెక్ పోస్ట్కు వచ్చే వాహనాలు, కోళ్ల ఫారాలు, చేపల చెరువులను విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. వీటిలో రేషన్ బియ్యాన్ని వినియోగిస్తే 6–ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అందరు ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి గ్యాస్ పంపిణీ తీరుపై సమీక్షించారు. గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన డెలివరీ బాయ్స్ వినియోగదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడటం ముఖ్యమన్నారు. గ్యాస్ ధర కంటే ఎక్కువ మొత్తం వసూలు చేసినట్లు తేలితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తప్పవని జేసీ ఇలక్కియ స్పష్టం చేశారు. 6–ఏ కేసుల్లో పలువురికి జరిమానా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ శుక్రవారం పౌర సరఫరాల శాఖకు సంబంధించిన 6–ఏ కేసుల కోర్టు నిర్వహించారు. ఈ కోర్టులో కేసులు నమోదు అయిన వ్యక్తులను, నమోదు చేసిన అధికారులను విచారించారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరానికి ఉపయోగించిన వారికి రూ.11 వేల జరిమానా విధించారు. 133 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ప్రభుత్వ పరం చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు వినియోగించిన ఒక వాహన యజమానికి రూ.5 వేలు, పీడీఎస్ బియ్యంతో అక్రమంగా వ్యాపారం చేసిన వారికి రూ.58 వేల జరిమానా విధించారు. -
21న యూటీఎఫ్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశాలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశంలో ఈ నెల 21వ తేదీన తిరువూరులో జరుగుతుందని సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య తెలిపారు. ఈ సమావేశాల కరపత్రాలను యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసరావు, సుందరయ్య మాట్లాడుతూ.. తిరువూరులో జరిగే సమావేశాలకు మాజీ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎనస్.ప్రసాద్ తదితరులు హాజరవుతారని తెలిపారు. సంఘం కార్యకలాపాల నివేదికలను ప్రవేశపెట్టి ఆమోదించి, నూతన కమిటీ ఎన్నిక జరుపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎ.ఎన్.కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్, నాయకులు ఎం.హనుమంతరావు, మచ్చా శ్రీనివాస్, పి.లీల, పి.నాగేశ్వరరావు, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఓబీసీల సమస్యలపై 15న ఢిల్లీలో ధర్నా
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశ వ్యాప్తంగా ఓబీసీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. అందుకు సంబంధించిన హలో బీసీ.. చలో ఢిల్లీ పోస్టర్ను శుక్రవారం విజయవాడలోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగబద్ధంగా, సామాజిక న్యాయమందించేలా రిజర్వేషన్లు ఇవ్వడానికి, నేటి ఆదిపత్య–పెత్తందారీ రాజకీయ వ్యవస్థకున్న అభ్యంతరాలను స్పష్టం చేయాలని వారు నిలదీశారు. అనేక దశాబ్దాలుగా రాజకీయంగా చట్టసభలు, స్థానిక సంస్థల్లోనూ బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కేటాయించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమ రూపాలలో పోరాడుతూనే ఉన్నామన్నారు. తరాలు మారుతున్నాయే గాని, బీసీల సామాజిక–ఆర్థిక–రాజకీయ అంతరాల నిర్మూలనకు మాత్రం ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. ఓబీసీల సమస్యల పరిష్కారానికి పోరాట మార్గమే శరణ్యమని భావిస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆ సంఘ ఉపాధ్యక్షుడు కనకారావు, ఉద్యోగ సంఘాల కార్యనిర్వాహక అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరవు, బీసీ నాయకులు మేకా వెంకటేశ్వరరావు, వాక వెంకటేశ్వరరావు, రాంప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ సీపీలో తిరుపతిరావుకు అదనపు బాధ్యతలు జి.కొండూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గం జి.కొండూరుకు చెందిన వేములకొండ తిరుపతిరావును పంచాయతీ రాజ్ విభాగం జోన్–3 కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు అదనంగా ఈ బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తిరుపతిరావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కూచిపూడి(మొవ్వ): మూడు రోజుల పాటు నిర్వహించే కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు కూచిపూడిలోని ఓ ఫంక్షన్ హాలులో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేకాట శిబిరాలు జోరుగా నడుస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ శిబిరాలు నడుస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Iఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 100 క్యూసెక్కులొచ్చి చేరుతుండగా, దిగువకు 3,400 క్యూసెక్కులు వదులు తున్నారు. నిల్వ 42.4733 టీఎంసీలు. -
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియా తిరువూరు: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగుతోందని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. విస్సన్నపేట, గంపలగూడెం, పెదకొమెర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. తిరువూరు రెవెన్యూ డివిజన్లో 53, నందిగామ డివిజన్లో 46, విజయవాడ డివిజన్లో 37 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 23లక్షల 21వేల 400 గోనెసంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంతవరకు 70,156 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.146 కోట్ల నగదు జమ చేశామన్నారు. రైతులకు ధాన్యం విక్రయంలో ఇబ్బందులను ఇలక్కియా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పరిష్కరించాలని స్థానిక అధికారుల్ని ఆదేశించారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): తెలుగు భాష ఔన్నత్యం, సాంస్కృతిక వైభవాన్ని తెలియచేసేలా అధికార భాషా సంఘం పని చేస్తుందని మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం నూతన చైర్మన్గా నియమితులైన పి.త్రివిక్రమరావు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో గురువారం భవానీపురంలోని హరిత బెరంపార్క్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యఅతిధిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ త్రివిక్రమరావుతో ప్రమాణం చేయించారు. అనంతరం త్రివిక్రమరావు మాట్లాడుతూ అందరి సలహాలు, సూచనలతో ముందుకు వెళతానని తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, కాపు కార్పొరేషన్, ఏపీ నాటక అకాడమి, ఉర్దూ అకాడమీ చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు, గుమ్మడి గోపాలకృష్ణ, ఫారేఖ్ షుబ్లీ, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎల్.చంద్రకళ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసిన ఆమె తాజా బదిలీలలో ఎన్టీఆర్ జిల్లాకు వచ్చారు. గురువారం ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆమెకు సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆమె ఉద్యోగులతో మాట్లాడారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థులకు చేర్చటం, పర్యవేక్షణ బలోపేతం చేస్తానన్నారు. పారదర్శక సేవలను అందిస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రధానోపాధ్యాయులు బోధనా సిబ్బంది సమష్టిగా పనిచేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సహకరించాలని సూచించారు. యూటీఎఫ్ నాయకుల శుభాకాంక్షలు డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన చంద్రకళకు యూటీఎఫ్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆమెను కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి మనోహర్కుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య నాయకులు పి.లీల, జె.రామకృష్ణ, ఎం.లలిత, ఎ.భరత్, ఎస్పీహెచ్ఆర్ దేవ్ తదితరులు ఉన్నారు. -
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
మైలవరం: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ, ఏసీపీ వై. ప్రసాదరావు తెలిపారు. మైలవరం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాల్లో ఉన్న ఆలయాలను టార్గెట్ చేసుకుని మైలవరం సర్కిల్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు వారి నుంచి రూ.27,50, 050 విలువ గల వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు నెలల నుంచి మైలవరం సబ్ డివిజన్, సర్కిల్ పరిధిలోని దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతుండటంతో జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఏసీపీ వై. ప్రసాదరావు మైలవరం సర్కిల్ సీఐ దాడి చంద్రశేఖర్ పర్యవేక్షణలో మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మైలవరం ప్రభుత్వాసుపత్రి వద్ద గురువారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఆరుమళ్ళ పురుషోత్తం, (ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల జిల్లా, తెలంగాణరాష్ట్రం)తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో పురుషోత్తంతో పాటు మరో నలుగురు చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరవల్లి మండలం తేలుప్రోలుకు చెందిన పొట్లూరి పద్మతో పురుషోత్తం సహజీవనం చేస్తూ ఏలూరు జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నిర్మానుష్యంగా ఉన్న పరిసర ప్రాంతాల్లో దేవాలయాలను దొంగతనాలకు వీరు ఎన్నుకుంటున్నారు. అందుకోసం వీరితో పాటు మైలవరం మండలం తోలుకోడు, వెల్వడం రోడ్లో ఉంటున్న ఏకుల రవికుమార్, ఏకశిరి అభిలాష్ , ఏకశిరి చిట్టెమ్మ కలిసి ఒక బృందంగా ఏర్పడి ఏడాది నుంచి ఆలయాల్లో దొంగతనాలుకు పాల్పడుతున్నారు. మైలవరం పోలీస్ స్టేషన్లో 3, జి.కొండూరు 2, రెడ్డిగూడెం 1, ఆగిరిపల్లి 1, ద్వారకా తిరుమల 1, తాడేపల్లిగూడెం 1, విజయవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కేసులు నమోదయ్యాయి. దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్న విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దీనితో ఆరుమల్ల పురుషోత్తంలో పాటు అతని టీమ్ను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న సొమ్మును రికవరీ చేశారు. వీరిపై మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. దేవాలయాల్లో చోరీ కేసులు ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన మైలవరం ఎస్ఐ సుధాకర్, రెడ్డిగూడెం ఎస్ఐ, జికొండూరు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్ను పోలీస్ అధికారులు అభినందించారు. -
నేటి నుంచి కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రమైన కూచిపూడిలోని శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్లో ఈనెల 12 నుంచి 14 వ వరకు మూడు రోజులు పాటు నాట్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠం విశ్రాంత ప్రధాన ఆచార్యులు, కళారత్న డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గురువారం తెలిపారు. నాట్యాచార్యులు చక్రవర్తులు పవన్ కుమార్, నిహారిక చౌదరిల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వాగ్గేయకారులు (కేరళ) సంగీత సామ్రాజ్య సంచారిణి అంశం పై శిక్షణ, కూచిపూడి నాట్య చరిత్ర, పరిక్రమణ సిద్ధాంతం పై అవగాహన తరగతులు ఉంటాయని చెప్పారు. డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానితో సంగీతం, తాళాలుపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 50 మంది పైగా విద్యార్థులు హాజరవుతారన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి నుంచి వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–మంగుళూరు జంక్షన్ (07267) ప్రత్యేక రైలు ఈ నెల 24న బుధవారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, శుక్రవారం ఉదయం 6.55 గంటలకు మంగళూరు జంక్షన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07268) ఈ నెల 26న శుక్రవారం మంగళూరు జంక్షన్లో బయలుదేరి, శనివారం సాయంత్రం 5 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. చర్లపల్లి–మంగళూరు సెంట్రల్ (07269) ఈ నెల 28న ఆదివారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మంగళవారం ఉదయం 6.55 గంటలకు మంగళూరు సెంట్రల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07270) ఈ నెల 30న మంగళవారం ఉదయం 9.55 గంటలకు బయలుదేరి, బుధవారం సాయంత్రం 5 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. చైన్నె–విజయవాడ వందేభారత్ నర్సాపూర్ వరకు పొడిగింపు డాక్టర్ ఏంజీఆర్ చైన్నె సెంట్రల్ నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ (20677/20678) రైళ్లను ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్ వరకు పొడిగిస్తూ రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు స్టేషన్లలో మాత్రమే హాల్టింగ్ ఉన్న ఈ రైలుకు ఈ నెల 15 నుంచి జనవరి 11 వరకు నర్సాపూర్ వరకు పొడిగించడంతో అదనంగా గుడివాడ, భీమవరం టౌన్లలో హాల్టింగ్ ఇచ్చారు. ఉదయం 5.30 గం.లకు డాక్టర్ ఏంజీఆర్ చైన్నె సెంట్రల్లో బయలుదేరుతుంది. రేణిగుంటకు 7.05 గంటలకు వచ్చి 7.10కి బయలుదేరుతుంది. నెల్లూరుకు 8.39కి వచ్చి 4.40కి బయలుదేరుతుంది. తెనాలికి 11.21కి వచ్చి 11.22కి బయలుదేరుతుంది. విజయవాడకు 11.45కి వచ్చి 11.50కి బయలుదేరుతుంది. గుడివాడకు 12.28కి వచ్చి 12.30కి బయలుదేరుతుంది. భీమవరం 1.15కి వచ్చి 1.17కి బయలుదేరి 2.10కి నర్సాపూర్ చేరుకుంటుంది. నర్సాపూర్లో 2.50కి బయలుదేరుతుంది. భీమవరం టౌన్కు 3.19కి వచ్చి 3.20కి బయలుదేరుతుంది. గుడివాడకు సాయంత్రం 4.04కి వచ్చి 4.05కి బయలుదేరుతుంది. విజయవాడకు 4.50కి వచ్చి 4.55కి బయలుదేరుతుంది. -
రవాణా శాఖలోనూ ప్రైవేటు బాదుడు
వాహనాలు ఫిట్నెస్కు తీసుకెళ్లారంటే యజమా నుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అధికారికంగా ఫీజును చలానా రూపంలో చెల్లించినా, ఫిట్నెస్ టెస్టింగ్ వద్ద అనధికారిక దోపిడీ పెరిగిపోయింది. దీంతో అక్కడ చేయి తడిపితేనే ఫిట్నెస్, లేదంటే ఏదో ఒక లోపం చూపించడంతో ఇవ్వక తప్పడం లేదు. ఇలా ఫిట్నెస్కే కాదు, లైసెన్స్ జారీ లోనూ సెన్సార్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో దోపిడీ మరింత పెరిగినట్లు చెపుతున్నారు. ఒకప్పుడు రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమయంలోనే బాగుండేదని, ఇప్పుడు ప్రైవేటుకు అప్పగించిన నాటి నుంచి దోపిడీ పెరిగిపోయిందని వాహనదారులు వాపోతున్నారు. ఆన్లైన్ చిక్కులు... డబ్బులు ఇస్తేనే ఫిట్నెస్ ఽధ్రువీకరణ ఏదైనా లోపం ఉంటే అదనంగా చెల్లించుకోవాల్సిందే లైసెన్స్ల జారీలోనూ ఇదే పద్ధతి సెన్సార్లు ప్రైవేటుకు అప్పగించాక మరింత పెరిగిన దోపిడీ –ఎ.మోహన్, జేటీసీ, విజయవాడ -
విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం
విస్సన్నపేట: విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక వెలుగు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఎంపీపీగా 6వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు గద్దల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కె.మాధురి, అబ్జర్వర్గా జేసీ ఎస్.ఇలక్కియా వ్యవహరించారు. ఏకగ్రీవంగా ఎన్నికై న ఎంపీపీతో ఆర్డీవో ప్రమాణస్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. తహసీల్దార్ కె.లక్ష్మీకళ్యాణి, ఎంపీడీఓ చేకు చిన్నరాట్నాలు, ఎస్ఐ రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యుడు పాల్గొన్నారు. మల్లయ్యకు అభినందనలు గద్దల మల్లయ్యను వైఎస్సార్ సీపీ నాయకులు మండలంలోని పుట్రేల గ్రామంలో పార్టీ రాష్ట్ర నాయకుడు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి నివాసం వద్ద గురువారం అభినందనలు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు, నియోజకవర్గ అబ్జర్వర్ తంగిరాల రామిరెడ్డి,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఓలేటి దుర్గారావు, పట్టణ అధ్యక్షుడు నెక్కళపు కుటుంబరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాu8లో 7వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా విజయవాడ నగరానికి చెందిన ఎంఎస్ బేగ్ నియమితులయ్యారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బేగ్కు పార్టీ శ్రేణులు, ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. విస్సన్నపేట ఎంపీపీగా గద్దల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఆర్డీఓ కె.మాధురి, అబ్జర్వర్గా జేసీ ఇలక్కియా వ్యవహరించారు. మచిలీపట్నంఅర్బన్: కృష్ణాజిల్లా నూతన డీఈవో యు.వి.సుబ్బారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్, సీఓఈ నియామకాలపై నిర్ణయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫైనాన్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు గురువారం జరిగాయి. ఆయా సమావేశాల్లో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, ఆయుష్ కమిషనర్ కె.దినేష్కుమార్లతో పాటు, వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిటీ సమావేశంలో 11 అంశాలపై చర్చించి ఆమోదించగా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లో 14 అంశాలు ఆమోదించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రస్తుత రిజిస్ట్రార్ పదవీ కాలం జనవరి 26తో ముగియనుండడంతో కొత్త రిజిస్ట్రార్ నియామకంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కర్నూలుకు చెందిన ఫోరెన్సిక్ ప్రొఫెసర్ను రిజిస్ట్రార్గా నియమించేందుకు తీర్మానం చేశారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా తిరుపతి స్విమ్స్లోని అనాటమీ ప్రొఫెసర్ను నియమించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. వీరిద్దరి నియామకాలపై గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఫ్యాకల్టీ, స్టూడెంట్స్కు రీసెర్చ్ ఫండ్ విడుదల, క్రీడల నిర్వహణకు అవసరమైన వ్యయం విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. వైద్య విద్యార్థులు వత్తిడికి గురికాకుండా ప్రతి 20 మందికి ఒక కౌన్సిలర్స్ కౌన్సెలింగ్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.సమావేశంలో యూనివర్సిటీ పాలకవర్గ సభ్యులు, ఫైనాన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సృజనాత్మకత వెలికితీయడానికే బాలోత్సవం
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుమొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మతకను వెలికితీయడానికి బాలోత్సవం దోహదం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న అమరావతి బాలోత్సవం గురువారం సాయంత్రంతో ముగిసింది. ముగింపు సభకు లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు మార్కులు, గ్రేడ్లు, ర్యాంకులు, నీట్, ఐఐటీల పైనే శ్రద్ధ చూపుతున్నాయని తెలిపారు. పిల్లల మానసిక వికాసానికి అటు విద్యాసంస్థలు, ఇటు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించడానికి ఏటా అమరావతి బాలోత్సవం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అమరావతి బాలోత్సవం స్ఫూర్తిగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ విధమైన బాలోత్సవాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. బాలోత్సవం వ్యవస్థాపకుడు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక వికాసానికి, వారిలో సృజనాత్మకతను పెంపొందించడానికి బాలోత్సవ్ ఉపయోగపడుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు మాట్లాడుతూ గత ఏడు ఏళ్లుగా నిర్వహించిన దానికన్నా ఈ ఏడాది ఎంతో భిన్నంగా బాలోత్సవ్లో కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ ఏడాది అత్యధికంగా 16,500 మంది విద్యార్థులు వివిధ అంశాలో ్ల పాల్గొని ప్రతిభను చూపారన్నారు. సభ అనంతరం పోటిల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందచేశారు. బాలోత్సవ్ గౌరవాధ్యక్షుడు చలువాది మల్లికార్జునరావు, అధ్యక్షుడు ఎస్పి.రామరాజు, మంగళగిరి, తాడేపల్లి బాలోత్సవ్ అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు, నిర్వహణ కమిటీ సభ్యులు పి.మురళీకృష్ణ, విద్యాకన్నా, రావి శారద తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోటిల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జానపద నృత్యాల పోటీల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
దీక్షల విరమణ బందోబస్తుపై దిశానిర్దేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంద్రకీలాద్రిపై ఐదు రోజుల పాటు జరగనున్న భవానీ దీక్షల విరమణకు బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు దిశా నిర్దేశం చేశారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బందోబస్తు సిబ్బందితో సీపీ బుధవారం సమావేశం నిర్వహించారు. సిబ్బంది రెండు షిఫ్టుల్లో విధులకు హాజరు కావాలని సూచించారు. గిరిప్రదక్షిణ మార్గం, హోల్డింగ్ ఏరియాలు, స్నానఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలను డ్రోన్ కెమెరా వీడియోల రూపంలో చూపించి తగు సూచనలు, సలహాలు అందించారు. భవానీలతో మర్యాదగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని సిబ్బంది సమర్థంగా విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. టాఫిక్ అవాంతరాలు కలుగకుండా చూడాలన్నారు. అంతరాలయం పరిసరాలు, కొండ దిగువన, క్యూలైన్లు, ఇరుముడి విరమణ ప్రదేశాలు, హోమ గుండాలు, ప్రసాదం కౌంటర్లు, కనకదుర్గానగర్, రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వంటి ముఖ్య ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జేబు దొంగతనాలు, గొలుసు చోరీలు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, బి.లక్ష్మీనారాయణ, షిరీన్బేగం, ఎస్.వి.డి.ప్రసాద్, జి.ఆనంద్బాబు, ఏడీసీపీ జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దుర్గగుడి పరిసరాలను సీపీ రాజశేఖరబాబు క్షేత్రస్థాయిలో సందర్శించారు. -
వక్ఫ్ ఆస్తుల నమోదుకు మరింత సమయం కోరండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వక్ఫ్ ఆస్తుల నమోదుకు మరింత సమయం కోసం ట్రిబ్యూనల్ను ఆశ్రయించాలని కోరుతూ ముస్లిం జేఏసీ నాయకులు బుధవారం వక్ఫ్బోర్డు సీఈఓ మహమ్మద్ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు ట్రిబ్యూనల్ను ఆశ్రయించా యని పేర్కొన్నారు. ముస్లిం జేఏసీ కన్వీ నర్ మునీర్ అహ్మద్ షేక్ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు వక్ఫ్బోర్డు సీఈఓను కలిసి సమస్యను వివరించారు. వక్ఫ్ చట్టం తీసుకొచ్చిన సమయంలో ఆరు నెలల్లో ఉమిద్ పోర్టల్లో ఆస్తులు నమోదు చేయాలని కేంద్రం సూచించిందన్నారు. ఈ నెల ఆరో తేదీతో ఆ గడువు ముగిసినా చాలా ఆస్తులను ఉమిత్ పోర్టల్లో నమోదు చేయలేదని వివరించారు. ట్రిబ్యూనల్ కర్నూలులో ఉందని, శాశ్వత జడ్జి లేనందున రోజు వారీ విచారణ జరగటం లేదని పేర్కొ న్నారు. వక్ఫ్ సీఈఓను కలిసిన వారిలో ముస్లిం అడ్వికేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ మతీన్, మజ్లీసుల్ ఉలేమా అధ్యక్షుడు ముఫ్తీ యూసఫ్ అలీ, నసీర్ ఉమ్రీ, ముఖ్తార్ అలీ తదితరులు ఉన్నారు. -
భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్లు కొలువైన ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకు సిద్ధమైంది. మాల విరమణకు తరలివచ్చే భవానీలకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షల విరమణ 15వ తేదీ ఉదయం మహాపూర్ణాహుతితో ముగుస్తుంది. తొలి రోజు తెల్లవారుజామున 6.30 గంటలకు మహా మండపం దిగువన హోమగుండాల్లో అగ్నిప్రతిష్టాపనతో దీక్షల విరమణ ప్రారంభమవుతుంది. ఐదు రోజులు కొనసాగే ఉత్సవాలకు ఆరు లక్షల మంది భవానీలు దీక్షల విరమణ చేస్తారని పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రోజూ 20 గంటల పాటు అమ్మ దర్శనం దీక్షల విరమణలో తొలి రోజు మినహా మిగిలిన నాలుగు రోజుల్లో రోజూ 20 గంటలకు పైగా అమ్మ వారి దర్శనం ఉంటుంది. గురువారం తెల్లవారుజామున ఆరు గంటలకు అమ్మవారికి పూజా కార్యక్రమాల అనంతరం దర్శనం ప్రారంభమవుతుంది. శుక్రవారం నుంచి తెల్లవారుజాము మూడు నుంచి రాత్రి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమయంలో అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేస్తారు. ఇక సాయంత్రం అంతరాలయంలో పంచహారతుల సేవ జరుగుతుండగా, బయట అన్ని క్యూలైన్లు యథావిధిగా నడిచేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో పంచహారతుల సమయంలోనూ అమ్మవారిని భక్తులు దర్శించుకునే వీలు కలుగుతుంది. రద్దీ మరింత అధికమయితే చివరి మూడు, నాలుగు రోజుల్లో దర్శన సమయాన్ని మరింత పెంచే అవకాశాన్ని వైదిక కమిటీ పరిశీలిస్తోందని ఆలయ అధికారులు తెలిపారు. అల్పాహారం పంపిణీకి ఏర్పాట్లు భవానీలు, భక్తులకు దేవస్థానం అన్న ప్రసాదంతో పాటు అల్పాహారం పంపిణీ చేయనుంది. తెల్లవారుజాము ఆరు నుంచి పది గంటల వరకు పులిహోర, దద్యోజనం, కట్టెపొంగలి, ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటలకు వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం అక్కన్న, మాదన్న గుహల ఎదుట వెలివేటెడ్ క్యూలైన్ల కింద ఐదు నుంచి ఏడు గంటల వరకు కదంబం, ఏడు నుంచి 11 గంటల వరకు ఉప్మా పంపిణీచేస్తారు. రోజుకు 32 వేల మందికి అన్న దానం, అల్పాహారం పంపిణీచేసేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. లడ్డూ ప్రసాదాలను కొరినన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు 30 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం సిద్ధం చేస్తోంది. బుధవారం సాయంత్రం నాటికి ఆరు లక్షల లడ్డూలను సిద్ధం చేసింది. ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీ మాలధారులు నేటి ఉదయం 6.30 గంటలకు అగ్ని ప్రతిష్టాపన ఐదు రోజులు కొనసాగనున్న ఉత్సవాలు -
16 నుంచి ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ ఉర్దూ అకాడమీ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 16 నుంచి వారోత్సవాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ అన్నారు. ఉర్దూ అకాడమీ ఏపీ ఉద్యోగుల సమీక్ష సమావేశం విజయవాడ పాతబస్తీలోని ముసాఫిర్కానా ప్రాంగణంలో బుధవారం సాయంత్రం జరిగింది. ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ శుబ్లీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భాషకు మతంతో సంబంధం లేదన్నారు. ఉర్దూ అకాడమీ ఉద్యోగుల్లో పని చేసిన వారికి గుర్తింపు, చెయ్యని వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. సమీక్ష సమావేశానికి గైర్హాజరైన వారికి తక్షణమే మెమో జారీ చెయ్యాలని చైర్మన్ శుబ్లీ ఆదేశించారు. మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీహెచ్ శ్రీధర్, ఉర్దూ అకాడమీ సెక్రటరీ గౌస్పీర్ పాల్గొన్నారు. ఆర్ఎంపీలకు అవగాహన మచిలీపట్నం అర్బన్: జిల్లాలో ప్రథమ చికిత్స కేంద్రాలను నిబంధనలకు లోబడి నిర్వహించేలా ఆర్ఎంపీలకు అవగాహన కల్పించే సమావేశాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం డీఎంహెచ్ఓ డాక్టర్ పి. యుగంధర్ నిర్వహించారు. ఇటీవల జిల్లాలోని పలు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డాక్టర్ యుగంధర్ పలు సెంటర్లను తక్షణమే మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. తనిఖీల అనంతరం జరిగిన ఈ సమావేశంలో ఆర్ఎంపీలకు ప్రథమ చికిత్స కేంద్రాల్లో అనుమతి పొందన సేవలు, చేయకూడని వైద్య ప్రక్రియలు, అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన ప్రొటోకాల్ వంటి అంశాలపై వివరంగా మాట్లాడారు. ఇటీవల జిల్లాలో వెలుగుచూస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి పై ఆర్ఎంపీలకు అవగాహన కల్పించారు. -
‘భోజనం తినలేక పోతున్నాం’
పులిగడ్డ(అవనిగడ్డ): గురుకుల పాఠశాలలో పెడుతున్న భోజనం తినలేక పోతున్నామని, ఏదీ సరిగా వండరని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కె. కృష్ణకిరణ్కు విద్యార్థులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పులిగడ్డ గురుకుల పాఠశాల, అవనిగడ్డలో జెడ్పీ హైస్కూల్, పలు అంగన్వాడీ కేంద్రాలను కృష్ణకిరణ్ బుధవారం తనిఖీ చేశారు. తొలుత పులిగడ్డ గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 90 శాతం మంది విద్యార్థులు సరైన ఆహారం పెట్టడం లేదని లిఖితపూర్వకంగా చెప్పారు. అనంతరం అవనిగడ్డలోని పలు అంగన్వాడీ కేంద్రాలు, జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. ఐసీడీఎస్ సీడీపీవో ప్రసన్న విశ్వనాథ, తూనికలు, కొలతలు అధికారి ఈశ్వరరావు, ఉప విధ్యాధికారి శేఖర్ సింగ్ పాల్గొన్నారు. -
భలే భలే.. బాలోత్సవం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఎనిమిదో అమరావతి బాలోత్సవం బుధవారం చిన్నారుల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగింది. రెండో రోజైన బుధవారం జరిగిన సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిద్ధార్థ ఆడిటోరియంతో పాటుగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు వేదికలపై ఈ పోటీలు జరిగాయి. చిత్రలేఖనం, తెలుగు డిక్టేషన్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, షార్ట్ ఫిల్మ్ విశ్లేషణ, డిబేట్, కోలాటం, దేశభక్తి గీతాలాపన, క్లాసికల్ డాన్స్, జానపద గీతాలాపన, తెలుగు పద్యాలు, ఇంగ్లిష్ రైమ్స్, పద్యం–భావం అంశాల్లో పోటీలు జరిగాయి. విజయవాడ నగరంతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నాం 3.30 గంటలకు బాలోత్సవం ముగింపు సభ, విజేతలకు బహుమతులు ప్రదానం జరుగుతా యని బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు తెలిపారు. -
అంగన్వాడీ వర్కర్లకు 5జీ సెల్ ఫోన్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవలు అందించేందుకు అంగన్వాడీ వర్కర్లకు 5జీ మొబైల్ ఫోన్లను అందిస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అంగన్వాడీ వర్కర్లకు సెల్ ఫోన్లు అందించే కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. 58,204 మంది వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్లతో 5జీ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇటీవల వివిధ శాఖల ర్యాంకులు ప్రకటించగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో 98 శాతం సేవలతో ఏ++ కేటగిరీతో నాలుగో స్థానంలో నిలవటం అభినందనీయమన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ సెంటర్లలో పిల్లలను అందంగా అలంకరించటానికి ముస్తాబు కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి మంచి ఫలితాలు సాధించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో కొత్త యూనిఫాం, అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.లక్ష చొప్పున అందిస్తామన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం కార్యదర్శి ఎ.సూర్యకుమారి, సంచాలకుడు ఎం.వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కె.ప్రవీణ, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు. -
ఎన్ఆర్సీని తనిఖీచేసిన ఎన్టీఆర్ డీఎంహెచ్ఓ
లబ్బీపేట(విజయవాడతూర్పు): పోషకాహారలోపం ఉన్న చిన్నారుల పునరావాస కేంద్రాన్ని (ఎన్ఆర్సీ) బుధవారం ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తనిఖీచేశారు. పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఎన్ఆర్సీ సెంటర్కి వెళ్లి, అక్కడ ఉన్న 14 మంది చిన్నారులను పరిశీలించారు. పోషకాహార లోపం కారణంగా వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేక పోవడంతో వారికి ఈ కేంద్రానికి తీసుకొచ్చినట్లు సిబ్బంది తెలిపారు. వారంతా జక్కంపూ డికాలనీ, వాంబేకాలనీ, రాజరాజేశ్వరిపేట, చిట్టినగర్ ప్రాంతాల వారని వివరించారు. విజయవాడతో పాటుజిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలను డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని బుధవారం పరిశీలించారు. రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కదులుతున్న రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. బుధవారం తెల్లవారు జామున రాయనపాడు రైల్వే స్టేషన్కు రెండు కిలోమీటర్ల దూరంలోని డౌన్లైన్లో పురుషుడు గాయాలతో మృతిచెంది పడివున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది విజయవాడ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థాలానికి వెళ్లి వివ రాలు సేకరించారు. మృతుని ఎత్తు 5.9 అడు గులు, వయస్సు సుమారు 46–48 సంవత్సరాల మధ్య ఉంటుందని, వంటిపై నీలం టీషర్ట్, నీలం లోయర్ ఉన్నాయని, ఇతర ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో లేదా 88971 56153, 94406 27544 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు. బస్సు నుంచి పడి వృద్ధుడి దుర్మరణం పెనమలూరు: మండలంలోని వణుకూరులో వృద్ధుడు సిటీ బస్సు నుంచి ప్రమాదవశాత్తు కొందపడి మృతి చెందాడు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. వణుకూరుకు చెందిన ఉప్పులూరి కోటేశ్వరరావు (70) సరుకుల కోసం మంగళవారం పటమట వెళ్లారు. సరుకులు తీసుకున్నాక సిటీ బస్సులో వణుకూరు బయలుదేరారు. గ్రామానికి వస్సు వచ్చాక దిగటా నికి ఫుట్పాత్పై నిలబడిన సమయంలో కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయమవటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడు కోటేశ్వరరావు భార్య శివనాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వీఎంసీ కౌన్సిల్లో ‘మంటలు’!
టీడీపీ తీరుతో రసాభాసగా సమావేశం పటమట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలపై సవతి ప్రేమ చూపుతోందని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వీఎంసీ కౌన్సిల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తట్టుకోలేని టీడీపీ సభ్యులు కౌన్సిల్ సాక్షిగా డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి నుంచి మైకు లాక్కొని, దాడికి పాల్పడ్డారు. సభ ఆద్యంతం టీడీపీ కార్పొరేటర్ల తీరుతో రసాభాసాగా మారింది. విజయవాడ నగర పాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. బాధితులకు న్యాయం చేయాలి.. పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో 42 ఇళ్లను రాష్ట్రప్రభుత్వం తొలగించి ఆ కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. వారికి న్యాయం చేయాలని 179వ అంశంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. టీడీపీ కార్పొరేటర్లు యథాప్రకారం సభ జరగకుండా నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. ఓ క్రమంలో కౌన్సిల్ కంట్రోల్ రూంలో మైక్లను ఆపేయాలని గట్టిగా కేకలు వేస్తూ సిబ్బందిని, సభ సాక్షిగా బెదిరింపులకు గురి చేశారు. అక్కడ ఇళ్లు నిర్మించిన వారందరూ వీఎంసీ నుంచి ఇంటి నిర్మాణ ప్లాన్ను పొందారని, వారికి వీఎంసీ రెవెన్యూ విభాగం నుంచి పన్నులు కూడా వేశారని, తాగునీరు, డ్రెయినేజీ సదుపాయాలు కూడా కల్పించి ఇప్పుడు అర్ధాంతరంగా ఇళ్లను కూల్చివేసి తమకేమీ తెలీదని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ సభ్యులు విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నెల 31వ వరకు గడువు విధించినప్పటికీ అంత తొందరగా ఇళ్లను తొలగించటం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పభుత్వం బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు. కమిషనర్కు నోటీసు.. 27వ డివిజన్లో వీఎంసీ సాధారణ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలుకు స్వాతంత్య్ర సమరయోధురాలు చిట్యాల(చాకలి) ఐలమ్మ పేరు పెడుతూ గతంలో కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే ఆ పేరు తొలగించారు. దీంతో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి మళ్లీ అదే పేరు పెడుతూ బోర్డు పెట్టాలని ప్రతిపాదించగా.. టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీనిపై కమిషనర్ను వివరణ కోరగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఎంసీనే బోర్డు తొలగించిందని అన్నారు. కౌన్సిల్ను, కౌన్సిల్ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవమానిస్తోందని, దీనిపై కమిషనర్కు సభా ఉల్లంఘనల కింద వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు డీసెంట్ నోట్ ఇచ్చారు. ఆ సమయంలో కూడా టీడీపీ కార్పొరేటర్లు లేచి సభలో పెద్దపెద్దగా నినాదాలు చేస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. చంద్రబాబు ప్రభుత్వానికి బీసీలన్నా, పేదలన్నా, మధ్య తరగతన్నా గిట్టదని, ఈ క్రమంలోనే నగరాభివృద్ధిని, వీఎంసీ కౌన్సిల్ మర్యాదను ఖాతరు చేయటంలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. స్పందించిన కమిషనర్ శుక్రవారం ఉదయం నాటికి కమ్యునిటీ హాలుకు చిట్యాల(చాకలి) ఐలమ్మ బోర్డు పెడతామని ప్రకటించారు. -
వడ్డమానులో మంత్రి నారాయణ పర్యటన
తాడికొండ: రెండో విడత భూసమీకరణలో భాగంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తుళ్లూరు మండలం వడ్డమానులో బుధవారం పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎ.భార్గవ్తేజతో కలిసి రైతులతో సమావేశం నిర్వహించి అభిప్రా యాలు సేకరించారు. రైతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. తాము భూములిస్తే ఎన్ని రోజుల్లో అభివృద్ధి చేసి రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తారని ప్రశ్నించారు. మూడేళ్లలో అభివృద్ధి చేసి ఇస్తానని మంత్రి తెలుపగా సమయానికి ఇవ్వకపోతే ఏడాదికి రూ.5 లక్షలు రైతులకు చెల్లించేలా బాండ్ ఇవ్వాలని కోరారు. -
మైనర్ల అక్రమ రవాణాను అడ్డుకున్న ఆర్పీఎఫ్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): మైనర్ల అక్రమ రవాణాను విజయవాడ డివిజన్ ఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. ఆపరేషన్ యాక్షన్, ఆపరేషన్ యాత్రి సురక్ష, ఆపరేషన్ నాన్హే ఫారిస్టే సేవల్లో భాగంగా ఈ నెల 8, 9 తేదీల్లో పలు కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. ఆపరేషన్ యాక్షన్లో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీన నెల్లూరు, ఒంగోలు ఆర్పీఎఫ్, విజయవాడ సీఐబీ, బచపన్ బచావ్ ఆందోళన్ రాష్ట్ర సమన్వయకర్తలు, ఏపీఓల సంయూక్త బృందాలు ఒంగోలు– నెల్లూరు మధ్య టాటానగర్–యర్నాకులం ఎక్స్ప్రెస్ (18189) రైలులో తనిఖీలు చేపట్టారు. ముగ్గురు బాలురిని గుర్తించి విచారించగా, ఇద్దరు ఏజెంట్టు వారిని పనుల కోసం ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు తేలింది. తదుపరి దర్యాప్తు కోసం ఏజెంట్లను నెల్లూరు జీఆర్పీ పోలీసులకు అప్పగించి, మైనర్లను సీడబ్ల్యూసీ సమక్షంలో పునరావాస కేంద్రానికి తరలించారు. ఆపరేషన్ యాత్రి సురక్షలో భాగంగా గుంటూరు–రాయగడ (17243) ఎక్స్ప్రెస్లో ప్రయాణికుడి బ్యాగులోని నగదు, సెల్ఫోన్ చోరీ కేసుపై ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీ సులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి తుని రైల్వేస్టేషన్లో నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.54 వేల నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఆపరేషన్ నాన్హే ఫారిస్టేలో భాగంగా ఈ నెల తొమ్మిదో తేదీన ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 13 ఏళ్ల బాలుడిని విజయవాడ రైల్వేస్టేషన్లోని ఆరో నంబర్ ప్లాట్ఫాంపై గుర్తించారు. బాలుడిని సంరక్షణ నిమిత్తం చైల్డ్ హెల్ప్ డెస్క్కు అప్పగించారు. అక్కడ బాలుడికి కౌన్సిలింగ్ చేసి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. అపరేషన్ అమానత్లో భాగంగా ఒంగోలు, అనకాపల్లి స్టేషన్లలో ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగులను స్వాధీనం చేసు కుని యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ డీఎస్సీ (డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్) షణుగ్మ వడివేల్ ఆర్పీఎఫ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
సంతకాలతో సమరశంఖం
జిల్లాలో కోటి సంతకాల సేకరణ విజయవంతం లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలలు ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పూర్తయ్యింది. నందిగామ నియోజకవర్గంలో మాత్రం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఆ ఆరు నియోజకవర్గాల్లో 4.16లక్షల సంతకాలు సేకరించారు. కాగా ఆయా నియోజకవర్గాల నుంచి సంతకాలు సేకరించిన పత్రాలను అట్టహాసంగా ర్యాలీలు నిర్వహించి బుధవారం విజయవాడలోని జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చారు. ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
పురుగు మందు డబ్బాతో రోడ్డెక్కిన రైతు
అయ్యంకి(మొవ్వ): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనడం లేదని, ఇక తమకు ఆత్మ హత్యే శరణ్యమని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పురుగు మందు డబ్బా పట్టుకుని కుటుంబ సభ్యులతో రోడ్డెక్కాడు. ఈ ఘటన మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ధాన్యం రోడ్ల పైనే ఎండపెట్టి తేమ శాతం 16 వచ్చినా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనలేదు. ఇదే అదనుగా దళారులు రూ.1,200కు ఇస్తావా అని అడుగుతుండడంతో రైతులు దిక్కు దోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయ్యంకి గ్రామానికి చెందిన రాజులపాటి మోహనకృష్ణ పదెకరాలు కౌలుకు తీసు కుని వ్యవసాయం చేస్తున్నాడు. యంత్రాల ద్వారా ధాన్యం నూర్చి బుధవారం నాటికి 16 రోజులుగా ఎండపెట్టాడు. తేమ శాతం 16 వచ్చింది. రోజుకు రూ.3,200 కూలి ఖర్చవుతున్నా గత్యంతరం లేక ధాన్యం పాడవకుండా అరపెడుతున్నాడు. అయితే ధాన్యం అమ్ముడుపోక పోవటం, వేలకు వేలు అదనపు ఖర్చవటంతో ఆ రైతు పడుతున్న ఆవేదన వర్ణనా తీతంగా మారింది. దీంతో పురుగుమందు డబ్బా పట్టుకొని రోడ్డెక్కిన రైతు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ధాన్యాన్ని న్యాయమైన ధరకు కొనుగోలు చేసి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాడు. -
సేవల్లో గుడివాడ ఆర్ఆర్ఐ ముందంజ
హోమియో సహాయ సంచాలకులు డాక్టర్ కిషన్ బానోత్ గుడివాడరూరల్: రాష్ట్రంలో సీసీఆర్హెచ్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు పరిశోధన, వైద్య సేవలు, ప్రజా అవగాహన కార్యక్రమాల్లో గుడివాడ ఆర్ఆర్ఐ(హెచ్) దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని హోమియో సహాయ సంచాలకులు డాక్టర్ కిషన్ బానోత్ పేర్కొన్నారు. స్థానిక హోమియో వైద్యశాలలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడివాడ హోమియో వైద్యశాలకు సగటును రోజుకు 300మందికి పైగా రోగులకు అవుట్పేషంట్ విభాగం ద్వారా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. 25పడకల ఇన్పేషెంట్ విభాగం(ఐపీడీ) కూడా ఉందని, రోగులకు అవసరమైన సమయంలో అన్ని సేవలు అందించి ప్రత్యేక చికిత్స అందిస్తామన్నారు. సమగ్ర నిర్ధారణ కోసం సక్రమంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాల సదుపాయాలు, లేబొరేటరీ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. గుడివాడ పరిసర ప్రాంతాల వారు హోమియో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఢిల్లీలో ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే 2వ డబ్ల్యూహెచ్వో గ్లోబల్ సంప్రదాయ వైద్య సదస్సు గురించి ఆయన వివరించారు. ఈ సదస్సుకు ఆరోగ్యం, సంతోషం కోసం శాసీ్త్రయ ఆచరణ అనే థీమ్ను నిర్ణయించినట్లు తెలిపారు. 100కు పైగా దేశాల నుంచి మంత్రులు, అధికారులు, ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. -
టెట్ నుంచి మినహాయింపు కోరుతూ ధర్నా
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీనివాసరావు, ఎ. సుందరయ్య డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని డివిజన్ కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ డీఈవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని ఆ సంఘ నేతలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ సుందరయ్య మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టం సవరణ, ఎన్సీటీఈ నిబంధనలు సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం జరపకపోవడం దారుణం.. గత ఏడాది ఎస్ఎస్సీ విద్యార్థుల కోసం వంద రోజుల కార్యాచరణ కార్యక్రమంలో సెలవు దినాలలో పని చేసిన వారికి 10 రోజులు సీసీఎల్ లీప్ యాప్ నందు నమోదు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా గాని ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరపక పోవడాన్ని ఖండించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో బదిలీ అనంతరం ముగ్గురు ఉపాధ్యాయులు కొంతమంది జీతభత్యాలు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. జిల్లా సహాధ్యక్షురాలు పి. లీల, జిల్లా కార్యదర్శి డి. హరి ప్రసాద్, బి. రెడ్స్టార్, సిటీ నాయకులు సీహెచ్ వెంకట రమణ, డి. పూర్ణ చంద్రరావు, ఎ. భరత్, ఎస్పీ దేవ్, ఎండీ హాసన్ తదితరులు పాల్గొన్నారు.. -
లక్ష్యానికి మించి సంతకాల సేకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన సంతకాల సేకరణకు ఎన్టీఆర్ జిల్లాలో విశేష స్పందన లభించింది. నూతన వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయోద్దంటూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించింది. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ విద్యావంతులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో లక్ష్యానికి మించి సంతకాల సేకరణ జరిగింది. ఏడు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 60 వేల చొప్పున సేకరించాలని లక్ష్యంగా కాగా, ప్రస్తుతం 4.60 లక్షలు సంతకాలు సేకరించారు. ఇంకా మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో కార్యక్రమం కొనసాగుతోంది. ఐదు నియోజకవర్గాల్లో పూర్తి..విజయవాడతూర్పులో 97వేలు, విజయవాడ వెస్ట్లో 65వేలు, సెంట్రల్లో మంగళవారం సేకరించిన 4వేల సంతకాలతో 60వేలకు చేరింది. తిరువూరులో 75వేలు, జగ్గయ్యపేటలో 60,500 సంతకాలు సేకరించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ● మైలవరం నియోజకవర్గంలో మంగళవారం జి.కొండూరు మండలంలో 3,950, మైలవరం మండలంలో 11,600 సంతకాలు సేకరించారు. దీంతో నియోజకవర్గంలో మొత్తం ఇప్పటి వరకూ 50వేల సంతకాలు సేకరించినట్లయింది. ● తిరువూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మంగళవారం పదివేల సంతకాలు సేకరించి నియోజకవర్గ కార్యాలయంలో అప్పగించారు. ● నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో మంగళవారం దాదాపు వెయ్యికిపైగా సంతకాలు సేకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకూ 4.60లక్షల సంతకాలు -
ప్రజారోగ్యం.. గాల్లో దీపం!
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. ఆహార తనిఖీలు చేయాల్సిన ప్రజారోగ్య సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. దీంతో మాంసం దుకాణాల్లో నిల్వ మాంసం విక్రయాలు యథేచ్ఛగా జరుగుతుండగా, నాణ్యాతా ప్రమాణాలు పాటించని ఆర్ఓ ప్లాంట్ల నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. తరచూ ప్రజలు అంటువ్యాధులు బారిన పడుతున్నా అధికారులు కళ్లు తెరవడం లేదు. ప్రజారోగ్యశాఖ అంటే కేవలం నగరంలో శానిటేషన్ పనులకే పరిమితమైనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు అనారోగ్యాలు తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. తనిఖీలు చేయరా.. నగరంలో నిల్వ మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అంతేకాదు మటన్షాపుల్లో మాంసం కల్తీ కూడా జరుగుతున్నట్లు ఆరోపణ లున్నాయి. కానీ మటన్ దుకాణాల్లో తనిఖీలు చేసిన సందర్భాలు చాలా అరుదు. కేవలం కబేళాలో ముద్ర వేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. మాంసం దుకాణాలు తనిఖీ చేసేందుకు నగర పాలక సంస్థలో పశు వైద్యుడితో పాటు ప్రతి డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు నగరంలో ఆర్ఓ ప్లాంట్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. వాటిలో సగానికి పైగా నాణ్యత లేనివే ఉన్నాయి. అందుకు న్యూ రాజరాజేశ్వరీపేటలో నిర్వహించిన తనిఖీల్లో వచ్చిన రిపోర్టులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి నీళ్లు తాగి ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. నగరంలోని ఫుడ్స్టాల్స్లో తనిఖీలు చేసే అధికారం కూడా ప్రజారోగ్య సిబ్బందికి ఉంటుంది. కానీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మామూళ్లే కావాలి.. నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాళ్లు డబ్బులు లేనిదే ఏ పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను పక్కన పెట్టి, షాపులకు ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ వంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. జనన, మరణాల నమోదులో సైతం చేతివాటం చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మాంసం దుకాణాలు, హోటళ్ల నుంచి కూడా మామూళ్లు దండుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇలా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేస్తూ అసలు ప్రజారోగ్యాన్ని పక్కన పెడుతుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. తరచూ సాంక్రమిక వ్యాధులు.. నగర ప్రజలు తరచూ డయేరియా బారిన పడుతున్నారు. ఈ ఏడాది న్యూ రాజరాజేశ్వరీపేటలో దాదాపు 400 మంది డయేరియా బారిన పడ్డారు. ఇటీవల పాత రాజరాజేశ్వరిపేటలో మరో 10 మంది వరకూ డయేరియా బారిన పడిన విషయం తెలిసిందే. కలుషిత ఆహారం, నీరు కారణంగా తరచూ ప్రజలు డయేరియా బారిన పడుతూ ఆస్పత్రుల దారి పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నాణ్యత లేని ఆహారంపై ఫుడ్ కంట్రోలర్తో పాటు, కార్పొరేషన్ ప్రజారోగ్య సిబ్బంది తనిఖీ చేసే అధికారం ఉన్నప్పటికీ, వాళ్లు తనిఖీల జోలికి వెళ్లడం లేదు. దీంతో విచ్చలవిడిగా నాణ్యత లేని ఆహార విక్రయాలు జరగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలోని దుకాణాల్లో నిల్వ మాంసం విక్రయాలపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ఓ ప్లాంట్లను కూడా తనిఖీ చేస్తున్నాం. నాణ్యతను పరిశీలిస్తున్నాం. – డాక్టర్ అర్జునరావు, సీఎంఓహెచ్, వీఎంసీ -
చంద్రబాబు పాలనపై వ్యతిరేకతకు నిదర్శనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు పాలనపై వ్యతిరేకతను ప్రజలు తమ సంతకంతో తెలియజేశారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. నూతన వైద్య కళాశాలలు పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడంపై తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడ తూర్పులోని ప్రతి డివిజన్లో సంతకాల సేకరణ చేపట్టామని, చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తమ పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారన్నారు. దీంతో 97వేల మంది ప్రజలు తమ వ్యతిరేకతని తెలియజేస్తూ సంతకాలు చేశారన్నారు. కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలి.. ఇప్పటికై నా కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలని దేవినేని అవినాష్ హితవు పలికారు. ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి 60 వేలకు పైనే సంతకాలు చేశారన్నారు. నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల పేపర్లు జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తాయని, ఈ నెల 15న జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపుతామన్నారు. 17న రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సంతకాలను గవర్నర్కి అందజేస్తామని తెలిపారు. వైద్య కళాశాలలు పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు. డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి
పేపర్ కంపెనీలపై ప్రభుత్వానికి ఏమాత్రం అజమాయిషీ లేదు. ఫలితంగా పేపర్ కంపెనీల నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు వ్యవ హరిస్తున్నారు. సుబాబుల్ కర్ర లేనప్పుడు ధర పెంచటం, కర్ర రాగానే ధర తగ్గించటం చేస్తున్నారు. గతంలో ఏఎంసీల ద్వారా కర్ర కొనుగోళ్లు సక్రమంగా జరిగేవి. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – కనగాల రమేష్, రైతు నాయకుడు, మక్కపేట, వత్సవాయి మండలం -
అప్పులు ఎలా తీర్చాలి?
పెసర, పత్తి, మొక్క జొన్న, మినుము సాగుచేశా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పంటనూ కొనలేదు. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం పంటలు కొనకపోవటంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించా. ఇతరుల నుంచి అప్పులు తెచ్చి పంటలు సాగుచేశా. ఆ పంటలు చేతికిరాగానే అప్పుల వాళ్లు ఇంటికి వస్తున్నారు. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావటంలేదు. – ఉయ్యూరు మల్లారెడ్డి రైతు, వేములపల్లి, కంచికచర్ల మండలం ● -
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు
కంచికచర్ల: మానవ జీవనానికి ఆధారమైన వ్యవసాయం, రైతులపై చంద్రబాబు ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు విమర్శించారు. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావుకు రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ.. రైతు సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన అధికార పార్టీ నేతలు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా, రైతులను ఆదుకోవాలని కోరేందుకు వస్తున్న తమను పోలీసులతో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థూల ఉత్పత్తి ఎలా పెరుగుతుంది? స్థూల ఉత్పత్తి పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, వ్యవసాయాధారిత రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూలిపోయి, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయకుండా అది ఎలా సాధ్యమని జగన్మోహనరావు ప్రశ్నించారు. కంచికచర్ల మార్కెట్ యార్డుకు ఆగస్టులో తీసుకొచ్చిన అపరాల పంట నేటికీ అలానే దర్శనమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పంటలు సాగు చేసిన రైతులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. వ్యవసాయం చేయాలంటేనే భయపడేలా రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనలేకపోవటం సిగ్గుచేటు అధికార పార్టీ నేతలకు సిగ్గుంటే రైతులు పండించిన ప్రతి ఒక్క పంటను ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయాలని జగన్మోహనరావు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ లేకపోవటం సిగ్గుచేటన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వకపోవటం, 18 నెలల పాలనలో ఈ పంటలు ఇంత కొన్నాం రైతులకు మేలు చేశామని చెప్పలేకపోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బండి మల్లికార్జునరావు, వేమా సురేష్బాబు, ఆవల రమేష్, కాలవ పెదబాబు, నువ్వుల విశ్వనాథం, కాలవ వాసుదేవరావు, దేవరకొండ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 109 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 43.3532 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి: భవానీ దీక్షల విరమణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మంగళవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వచ్చిన హోం మంత్రి వంగలపూడి అనిత దుర్గమ్మను దర్శించుకున్నారు. పాయకాపురం (విజయవాడ రూరల్): ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో రెండో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందని ఆయుర్వేద పరిశోధన అధికారి డాక్టర్ కె.మిథున్ మోహన్ తెలిపారు. విజయవాడ పాయకాపురంలోని న్యూ రాజీవ్నగర్లో ఉన్న ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కె. మిథున్ మోహన్ మాట్లాడుతూ.. ఆయుష్ వ్యవస్థల ప్రత్యేక ప్రదర్శన, దేశ జ్ఞాన వారసత్వం, ప్రజారోగ్య సమన్వయం, పరిశో ధన – సాంకేతికత, అనుభవాత్మక వెల్నెస్ వంటి రంగాలను ప్రతిబింబించే ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సుమారు వంద దేశాల నుంచి ఐదు వేల మంది ప్రతినిధులు వర్చువల్గా పాల్గొంటారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో 700 మంది ప్రత్యక్షంగా హాజరు కానున్నారని, వందకు పైగా దేశాల నుంచి 79 అధికారిక ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. సమ్మిట్ ముగింపు రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అఽధానోంగేబ్రియేసస్, పలు దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటా రని వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశోధన అధికారులు డాక్టర్ సుజాత, పి.ధోకే తదితరులు పాల్గొన్నారు.పెనుగంచిప్రోలు: పేపర్ కంపెనీలు కొన్ని సిండికేట్ అయ్యాయి. సుబాబుల్ రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నాయి. ఇష్టారాజ్యంగా ధరలను నిర్ణయిస్తూ నష్టాలపాలు చేస్తున్నాయి. పేపర్ కంపెనీలు ఏకపక్షంగా ధరలను భారీగా తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్య పేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో సుబాబుల్ సాగు ఎక్కువగా జరుగు తోంది. జిల్లాలో మొత్తం మీద సుమారుగా 70 వేల ఎకరాల్లో సుబాబుల్ సాగవుతోంది. పత్తి, మిర్చి సాగు చేసిన రైతులు ఆ పంటల్లో దిగుబడి లేక, గిట్టుబాటు ధర దక్కక సుబాబుల్ సాగు చేపట్టారు. అయితే పేపర్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు తగ్గించడంతో సుబాబుల్ సాగులోనూ నష్టాలు తప్పడంలేదని వాపోతున్నారు. ఇటీవల వరకు టన్ను సుబాబుల్ ధర రూ.6,500 వరకు పలికింది. నెల రోజుల్లో ఆ ధర కాస్తా రూ.5,600కు పడి పోయింది. అంటే నెల రోజుల్లోనే రైతులు టన్నుకు రూ.900 చొప్పున నష్టపోతున్నారు. అజమాయిషీ లేదు సుబాబుల్ మార్కెట్పై ఎటువంటి అజమాయిషీ లేక పోవటంతో కంపెనీల ఇష్టారాజ్యంగా తయారైంది. గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా సుబాబుల్ కర్ర కొనుగోళ్లు జరిగేవి. కర్ర ఎంత ఉత్పత్తి జరుగుతోంది, ఎంత కొనుగోళ్లు జరిగాయి వంటి వివరాలు మొత్తం ఏఎంసీల వద్ద ఉండేవి. ఏఎంసీల ద్వారానే కంపెనీలు రైతులకు డబ్బులు చెల్లించేవి. అయితే అమ్మకం పన్ను చెల్లించాల్సి రావటంతో కొన్నేళ్ల నుంచి ఏఎంసీల ద్వారా కర్ర కొనుగోళ్లు తీసేశారు. ప్రస్తుతం పేపర్ కంపెనీలు, వ్యాపారుల ద్వారానే కర్ర విక్రయాలు జరుగుతున్నాయి. వారు చెప్పిందే ధర అన్నట్లుగా తయారైంది. ఇటీవల మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, ఏఎంసీల కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ధర తగ్గకూడదని చెప్పినా వాస్తవంలో అది జరగటం లేదని రైతులు అంటున్నారు. ఆందోళనలో రైతులు వర్షాలు తగ్గుముఖం పట్టటంతో కర్ర కోత బాగా పెరిగింది. ధర ఆశాజనకంగా ఉంటుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. సుబాబుల్ దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో పేపర్ కంపెనీలు ధర తగ్గించాయని రైతులు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత తగ్గుతుందేమే అని ఆందోళన చెందుతున్నారు. పేపర్ కంపెనీలకు అవసరమైనప్పుడు ధర పెంచటం లేనప్పుడు తగ్గించటం చేస్తున్నాయని, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. భవానీ దీక్షల విరమణకు వేళాయె7పత్తి, మిర్చి సాగులో ఏటా నష్టాల పాలవుతున్న రైతులు సుబాబుల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. సుబాబుల్ ధర బాగుండటంతో పాటు సాగు నీరు అంతగా అవసరం లేక పోవటం వంటి కారణాలతో రైతులు ఎక్కువగా ఈ పంట సాగుకు మొగ్గు చూపారు. మొక్క నాటిన రెండు నుంచి మూడేళ్లకు కర్ర కోతకు వస్తుంది. ఎకరానికి సగటున 30 నుంచి 35 టన్నుల దిగుబడి చేతికొస్తుంది. కర్ర దిగుబడి పెరగటంతో పేపర్ కంపెనీలు మళ్లీ తమను దోపిడీకి గురి చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే టన్ను ధర రూ.900 చొప్పున తగ్గించాయని వాపోతున్నారు. ముఖ్యంగా ఐటీసీ భద్రాచలం, ఏపీపీ రాజమండ్రి, బలార్షా, సిర్పూర్ కాగజ్నగర్, జేకే కంపెనీలు రైతుల వద్ద నుంచి సుబాబుల్ కర్ర కొనుగోలు చేస్తాయి. కొన్ని కంపెనీలు సిండికేట్గా మారి ధరను తగ్గిస్తున్నాయి. -
● ఉత్సాహంగా.. ఉల్లాసంగా బాలోత్సవం
విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఎనిమిదో అమరావతి బాలోత్సవం మంగళవారం ప్రారంభమైంది. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 60 అంశాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజయవాడ నగరంలోని పాఠశాలలతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బుధ, గురువారాల్లో కూడా పోటీలు కొనసాగుతాయని బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కొండలరావు తెలిపారు. సభ అనంతరం సిద్ధార్థ ఆడిటోరియం, కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు వేదికలపై జరిగిన సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. – మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) -
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు కొత్త డీఈఓల నియామకం
మచిలీపట్నంఅర్బన్/వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాకు నూతన డీఈఓలు నియమితులయ్యారు. కృష్ణా జిల్లాకు యు.వి.సుబ్బారావును విద్యాశాఖ నియమించింది. ఆయన ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆయన బందరు ఉప విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ఇప్పటి వరకు డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించిన పి.వి.జె.రామారావు పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విద్యా శాఖాధికారిగా ఎల్.చంద్రకళ నియమితులయ్యారు. ఆమె పల్నాడు జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. చంద్రకళ గతంలో ఉపవిద్యాశాఖాధికారిగా పని చేశారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా లోని 16 బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. బాలల సంరక్షణ కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియ మంగళ వారం జువైనెల్ జస్టిస్ రూల్స్ ప్రకారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి తనిఖీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 16,17 తేదీల్లో అన్ని బాలల సంరక్షణ కేంద్రాల్లో తనిఖీలు, వైద్య శిబిరాల నిర్వహణ, ఆధార్ లేని బాలలకు ఆధార్ కల్పించటం, బాలలను స్కూల్లో చేర్పించడం వంటి తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ కేంద్రాలకు తుది రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సమావేశంలో డీసీపీఓ ఎం.రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు జ్యోతి, డాక్టర్లు మాధవి, రాఘవరావు, ఫ్రాన్సిస్ తంబీ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీసీపీయూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరంలో వేంచేసిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. మచిలీపట్నం భోగిరెడ్డిపల్లి గ్రూప్ కార్యనిర్వహణాధికారి అరుణ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహన్రావు, ధర్మకర్తల మండలి సభ్యులు తూము రాజ్యలక్ష్మి, ముంగం ఆంజనేయులు, నూతలపాటి లక్ష్మీపావని, ఈఓ ఆకుల కొండల రావు, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీల కానుకలను లెక్కించారు. 45 రోజులకు రూ.16,58,075 నగదు, 920 మిల్లీ గ్రాముల బంగారం, 125 గ్రాములు వెండి వచ్చిందని ఈఓ కొండలరావు తెలిపారు. దేవస్థాన సిబ్బంది, మచిలీపట్నం, ఉయ్యూరు సేవా సమితి బాధ్యులు, వేమవరం గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈ నెల 21వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించి విజయవంతం చేద్దామని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని వైద్య సిబ్బందికి సూచించారు. నగరంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సూపర్వైజర్లకు మంగళవారం పల్స్పోలియోపై శిక్షణ ఇచ్చారు. డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. ఈ నెల 21న బూత్ యాక్టివిటీలో ఐదేళ్ల వయస్సుగల పిల్లలందరికీ రెండు చుక్కల పోలియో చుక్కలు వేయాలన్నారు. 22, 23 తేదీల్లో ఇంటింటికీ తిరిగి మిగిలిన చిన్నారులకు చుక్కల మందు వేయాలన్నారు. హైరిస్క్ ఏరియాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శరత్బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. -
స్క్యూబ్రిడ్జి వద్ద భవానీల ఆందోళన
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ స్క్యూబ్రిడ్జి వద్ద స్వల్ప విషయమై భవానీ మాలధారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో భవానీలు సుమారు గంటపాటు బైఠాయించి ఆందోళన చేశారు. ఏసీపీలు దామోదర్, పావన్కుమార్ అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది వారిని కృష్ణలంక పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. అసలేం జరిగిందంటే... కంకిపాడుకు చెందిన సుమారు 25 మంది భవానీ మాలధారులు రెండు ఆటోల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం మధ్యాహ్నం సద్దికి బయలు దేరారు. ఆటో వెనుక డోర్పై కూడా కూర్చుని ప్రయాణిస్తున్న భవానీ మాలధారులను కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల వద్ద కానిస్టేబుల్ చూసి వారిని ఆపారు. సురక్షితం కాని ఇలాంటి ప్రయాణం చేయవద్దని మందలించారు. దీంతో భవానీ మాలధారులకు, కానిస్టేబుల్కు మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ తరుణంలో ఫొటోలు తీస్తున్న కానిస్టేబుల్ ఫోన్ లాక్కుని భవానీ మాలధారుల్లో ఒకరు పగలకొట్టినట్లు తెలిసింది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. దీంతో ఆ కానిస్టేబుల్ విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెంజిసర్కిల్ వద్ద ఆపిన పోలీసులు ఆటోల్లో వస్తున్న భవానీ మాలధారులను బెంజిసర్కిల్ వద్ద పోలీసులు ఆపారు. ఎందుకు ఆపారని భవానీ మాలధారులు గొడవ పడుతుంటే , ట్రాఫిక్ ప్రాంతం కావడంతో వదిలేశారు. అనంతరం స్క్యూబ్రిడ్జి వద్ద రెండు ఆటోలను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన ట్రాఫిక్ పోలీసులు తమ ఆటోలను ఆపడంతో భవానీ మాలధారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గంటపాటు ఆందోళన సాగడంతో ఏసీపీలు దామోదర్, పావన్కుమార్ అక్కడకు చేరుకుని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా తొలుత వినలేదు. అనంతరం వారందరినీ కృష్ణలంక పోలీస్స్టేషన్కు రమ్మని తీసుకెళ్లారు. అయితే వారు ఫిర్యాదు చేయకుండానే స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. గంటపాటు చేసిన ఆందోళనతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కృష్ణలంక, పటమట, ట్రాఫిక్ సీఐలు నాగరాజు, పవన్కిషోర్, రామారావు, బాలమురళీకృష్ణ చర్యలు తీసుకున్నారు. -
కృష్ణలంక హైవేపై బైక్ దగ్ధం
కృష్ణలంక(విజయవాడతూర్పు): సాంకేతిక లోపాలు తలెత్తి మంటలు చెలరేగడంతో ద్విచక్ర వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యనమలకుదురు, అవనిగడ్డ కరకట్ట రోడ్డులోని హోసన్నా మందిర్ సమీపంలో నివాసం ఉంటున్న పి.కిషోర్ కంచికచర్లలోని మిక్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతను తన యూనికార్న్ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరాడు. కృష్ణలంక, ఫైర్స్టేషన్ సెంటర్లో హైవే మీదకు చేరుకోగానే ద్విచక్ర వాహనం ఇంజిన్లో లోపాలు తలెత్తి మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన కిషోర్ వాహనాన్ని వదిలేసి పరుగులు పెట్టాడు. అప్పటికే యువకుని కాళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుదాఘాతానికి గురై ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతి పామర్రు: విద్యుత్ షాక్కు గురై ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన పామర్రులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పామర్రు పంచాయతీ పరిధిలోని చెన్నువానిపురానికి చెందిన చిన్నం విజయ్బాబు(51) ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయం బలిపర్రులో ఓ ఇంటి కరెంట్ వైరింగ్ పనులు చేస్తూ విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కగా, విద్యుత్ వైర్లు తగిలి షాక్కు గురై కిందకు పడిపోయాడు. చెవుల నుంచి రక్తం కారుతుండగా అక్కడే గిలగిలా కొట్టుకుని మృతి చెందాడు. విజయ్ మృతితో స్వగ్రామమైన చెన్నువానిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం విజయ్బాబు భౌతిక కాయాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. చెల్లని చెక్కు కేసులో వ్యక్తికి ఏడాది జైలుశిక్ష గన్నవరం: చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ గన్నవరం స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. మండలంలోని కేసరపల్లికి చెందిన బొర్రా నాగరాజు వద్ద వ్యాపార అవసరాల నిమిత్తం ఘంటసాల మహంకాళరావు అలియాస్ మాణిక్యాలరావు 2024లో రూ.8 లక్షల రుణం తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబర్లో తీసుకున్న రుణం చెల్లింపు నిమిత్తం బ్యాంక్ చెక్ను మహంకాళరావు ఇచ్చారు. అయితే సదరు చెక్ బౌన్స్ కావడంతో నాగరాజు స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మహంకాళరావుకు ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. టీడీపీ, బీజేపీ ఢీ అంటే ఢీ మచిలీపట్నంటౌన్: కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీల మధ్య ముసలం వచ్చింది. విగ్రహాల ఏర్పాటు విషయంలో రేగిన వివాదం ఇరు పార్టీల నాయకులు తోపులాటలు, నల్లజెండాలతో నిరసనలు, నినాదాలు, బైఠాయింపుల వరకు వెళ్లింది. ఈ ఘటన సోమవారం నగరంలో నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని బైపాస్ రోడ్లో ఉన్న హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వద్ద మాజీ ప్రధాని అతుల్ బిహారీ వాజ్పేయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నాయకులు సోమవారం ఉదయం టెంకాయలు కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. సర్కిల్లో టీడీపీ నాయకులు నిలబడి బీజేపీ నాయకులు శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు సర్కిల్ బయట రోడ్డుపై టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఒకరినొకరు తోసుకుంటూ వాగ్వాదానికి దిగారు. బీజేపీ నాయకులకు పోటీగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించే ప్రయత్నం చేయగా చిలకలపూడి సీఐ నబీ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు నల్ల జెండాలను పట్టుకుని జై ఎన్టీఆర్.. జోహార్ ఎన్టీఆర్... అంటూ నినాదాలు చేయగా, బీజేపీ నాయకులు జోహార్ వాజ్పేయ్ అంటూ పోటీగా నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి 2014లోనే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశామని, ఈ సర్కిల్కు ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం కూడా చేశామని చెప్పారు. ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించివేయడంతో సమస్య సద్దుమణిగింది. -
నిలువెత్తు నిర్లక్ష్యం
జి.కొండూరు: కవులూరు పెద్ద చెరువుకు నీటి సరఫరా కోసం తారకరామా ఎడమ కాల్వపై సబ్లిఫ్ట్ నిర్మాణం చేసి దశాబ్దకాలం పూర్తయింది. పథకం నిర్మించి ప్రారంభించగానే పైపులు పగిలిపోయాయి. మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారు. ఈ లోపు పట్టిసీమ నీళ్లు రాకతో చెరువుకు నీటి సమస్య తీరింది. సబ్లిఫ్ట్ మరుగున పడింది. రూ.కోట్లు వెచ్చించి కట్టిన సబ్లిఫ్ట్ దశాబ్దకాలం పైబడి నిరుపయోగంగా మారి తుప్పు పడుతోంది. సరైన భద్రత లేకపోవడంతో మోటార్లు, విలువైన విద్యుత్ పరికరాలు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి మోటార్లు, విద్యుత్ పరికరాలను అవసరమైన చోట వినియోగించడం లేదా, భద్రపరచడం చేయాలని రైతులు కోరుతున్నారు. రూ.2కోట్ల వరకు వెచ్చించి... తారకరామా ఎడమ కాల్వపై కవులూరు గ్రామ శివారులో 2.8 కిలోమీటరు వద్ద రూ.2 కోట్లకుపైగా నిధులను వెచ్చించి 2009–14 మధ్య కాలంలో సబ్లిఫ్ట్ను నిర్మించారు. ఈ సబ్లిఫ్ట్ నిర్మాణంలో భాగంగా 9 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల పొడవుతో పంపుహౌస్ను నిర్మించారు. ఈ పంపుహౌస్లో 30 హెచ్పీ సామర్ధ్యం గల మూడు మోటార్లను అమర్చారు. ఈ పంపుహౌస్ను నడిపేందుకు 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ను సైతం ఏర్పాటు చేశారు. సబ్లిఫ్ట్ నుంచి కవులూరు పెద్ద చెరువు వరకు 1.5 కిలోమీటర్లు పైపులైన్ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఈ సబ్లిఫ్ట్ను ప్రారంభించగానే పైపులైను పగిలిపోవడంతో నిలిపివేశారు. పట్టిసీమ నీళ్ల రాకతో... తారకరామా ఎడమ కాల్వపై సబ్లిఫ్ట్ నిర్మాణం ద్వారా కవులూరు గ్రామాన్ని ఆనుకుని ఉన్న పెద్ద చెరువుకు నీటిని సరఫరా చేయడం లక్ష్యం. ఈ చెరువు 212.15 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఆయకట్టు సాగు భూమి 638.41ఎకరాలు ఉంది. చెరువులో నీటి నిల్వ సామర్ధ్యం 41.757 మిలియన్ క్యూబిక్ అడుగులుగా ఉంది. అయితే ఈ చెరువు బుడమేరు డైవర్షన్ కెనాల్ను ఆనుకుని ఉండి కెనాల్ నుంచి నీరు చెరువులోకి వచ్చేందుకు తూము సైతం ఉంది. ఈ క్రమంలో గతంలో బుడమేరుకు వరదలు వచ్చిన సమయంలో మాత్రమే డైవర్షన్ కెనాల్లో నీటి ప్రవాహం కొనసాగితే ఈ చెరువుకు నీటి సరఫరా అయ్యేది. దీని వలన రైతుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని తారకరామా ఎడమ కాల్వపై సబ్లిఫ్ట్ను నిర్మించారు. అయితే 2014–19 మధ్య కాలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ అనంతరం పోలవరం రైట్మెయిన్ కెనాల్ ద్వారా నీటిని బుడమేరు డైవర్షన్ కెనాల్లో కలిపి కృష్ణానదిలో కలిసేలా చేశారు. అప్పటి నుంచి పట్టిసీమ నీటిని విడుదల చేసినప్పుడల్లా బుడమేరు డైవర్షన్ కెనాల్ నుంచి ఈ చెరువుకు తూము ద్వారా నీటి సరఫరా అవుతోంది. దీంతో ఈ సబ్లిఫ్ట్ అవసరం లేకుండా పోయింది. దీంతో దాని మరమ్మతులను అధికారులు వదిలేశారు. అప్పటి నుంచి సబ్లిఫ్ట్ నిరుపయోగంగా మారి మోటార్లు, విద్యుత్ పరికరాలు తుప్పు పట్టిపోవడంతోపాటు వాటి భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. పంపుహౌస్ ప్రాంగణంలో తుప్పుపట్టి నిరుపయోగంగా మారిన ట్రాన్స్ఫార్మర్ పంపుహౌస్లో నిరుపయోగంగా ఉన్న మోటార్లు తుప్పుపడుతున్న ప్రజాధనం -
కొమ్మా కోటేశ్వరరావుకు 15 వరకు రిమాండ్
రామవరప్పాడు(విజయవాడ రూరల్): కృష్ణాజిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ టీడీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో కొమ్మా కోటేశ్వరరావు(కొమ్మా కోట్లు)కు ఈ నెల 15 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు విజయవాడ పటమట పోలీస్స్టేషన్లో ఆయన స్వచ్ఛందంగా లొంగిపోగా పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి పి.భాస్కరరావు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ఈ నెల 15 వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు. -
వైద్యశాఖలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించండి
ప్రభుత్వానికి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యశాఖలోని ప్రైమరీ, సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.గిరిబాబు అన్నారు. ఆస్పత్రుల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని జీఓ ఉన్నా, ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పీహెచ్సీలు 24/7 ఆస్పత్రులుగా ఉన్నందున, వాటిలో అదనంగా మరో స్టాఫ్నర్సును నియమించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ముగ్గురు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని, వీక్లీ ఆఫ్, సెలవుల్లో సర్దుబాటు కావడం లేదని తెలిపారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు లాస్ట్ గ్రేడ్ వర్కర్లు ఉండేలా చూడాలని కోరారు. సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియాలజీ సర్వీసు సిబ్బందికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసి, అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టాలని సూచించారు. కాల్ డ్యూటీ పేరుతో ఉన్న వారినే 24 గంటలు డ్యూటీ చేయమనడం సరికాదన్నారు. సెకండరీ హెల్త్ విభాగంలో ఉద్యోగుల సెలవులు మంజూరుకు పెట్టిన ఐదు శాతం నిబంధన తీసివేయాలని డిమాండ్ చేశారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టు పోస్టులు భర్తీ చేయాలని, శాఖాపరమైన సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలన్నారు. పెరిగిన ఆస్పత్రులకు అనుగుణంగా వైద్యులు, పారామెడికల్, నర్సింగ్, క్లాస్ఫోర్ సిబ్బంది నియామకాలు చేపడితేనే పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుతాయని వివరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ ఫైలింగ్లో కాలపరిమితి పెట్టాలని గిరిబాబు డిమాండ్ చేశారు. ప్రాణాలు కాపాడిన పోలీసులు పటమట(విజయవాడతూర్పు): జాతీయ రహదారి 16పై రామవరప్పాడు నుంచి బెంజిసర్కిల్ మీదగా స్క్యూబ్రిడి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వివరాల మేరకు సోమవారం రాత్రి బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ దిగే సమయంలో రామవరప్పాడు వైపు నుంచి స్క్యూబ్రిడ్జికి వెళ్లే మార్గంలో జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు లారీ కింద చిక్కుకున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే 5వ ట్రాఫిక్ సీఐ రవికుమార్కు వైర్లెస్ సెట్లో సమాచారం ఇవ్వగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడు కారు వెనుక లారీకింద చిక్కుకున్నాడు. వెంటనే క్షతగాత్రుడిని బయటకు తీసి సీపీఆర్ చేసి అంబులెన్స్ వచ్చేందుకు ఆలస్యమవుతుందని క్షతగాత్రుడిని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 82 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్కు ప్రజల నుంచి 82 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎస్వీడీ ప్రసాద్, ఏడీసీపీ ఎం.రాజారావు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు, నడవలేని వారి వద్దకే వెళ్లి ఫిర్యాదులు అందుకుని, సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత ఎస్హెచ్ఓలతో పాటు, సత్వర పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా భూ వివాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించి 46, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 2, కొట్లాటకు సంబంధించి 2, వివిధ మోసాలపై 7, మహిళ సంబంధిత నేరాలపై 5, దొంగతనాలకు సంబంధించి 2, రోడ్డు ప్రమాదాలపై 1, ఇతర చిన్న వివాదాలపై 17 ఇలా మొత్తం 82 ఫిర్యాదులు ప్రజల నుంచి స్వీకరించారు. అంబేడ్కర్ జీవితం ఆదర్శనీయం డీఆర్ఎం మోహిత్ సోనాకియా రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దార్శనికత, జ్ఞానం, విద్య, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా కొనియాడారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం డీఆర్ఎం కార్యాలయ ప్రాంగణంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో రాజ్యాంగ విలువలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, పలు బ్రాంచ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మడకా ప్రసాద్ గుడివాడరూరల్: ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గుడివాడకు చెందిన మడకా ప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన ఏలూరులో జరిగిన రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఎన్నికల్లో తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు. ఈ సందర్భంగా మడకా ప్రసాద్ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ రంగప్రసాద్, గౌతమ్ స్కూల్ డైరెక్టర్ కె.అవినాష్, ఖోఖో సంఘం జిల్లా సెక్రటరీ మద్దినేని సత్యప్రసాద్ అభినందించారు. -
ఉన్నత చదువులకు ఆటంకం
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ నిత్యాన్నదానానికి విశాఖపట్నంకు చెందిన కె.వరప్రసాద్ కుటుంబ సభ్యులు రూ. 1,00,023 విరాళంగా అందజేశారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు సర్కార్ విద్యావ్యవస్థలో వెనకడుగేస్తోంది. పాలకుల తీరుతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. సాధారణంగా విద్యా సంవత్సరం జూన్లో మొదలై దాదాపుగా ఏప్రిల్ మాసంలో పూర్తవుతుంది. ప్రస్తుత ప్రభుత్వంలో విద్యాశాఖ విధానాలతో వివిధ కోర్సులకు సంబంధించిన విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారిందంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 150 డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సుమారు 40 వేల మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో చేరతారు. ఇంకా పూర్తికాని అడ్మిషన్లు ఎప్పుడూ జూన్లో చేపట్టాల్సిన సాధారణ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఆయా విభాగాలు చాలా ఆలస్యంగా చేపడుతున్నాయి. ప్రధానంగా డిగ్రీ కోర్సులకు అక్టోబర్లో ప్రారంభించి డిసెంబర్ మొదటి వారం వరకూ కొనసాగించారు. దీంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఆయా డిగ్రీ కళాశాలల్లో ఈ నెల మొదటి వారం వరకూ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా కళాశాలలు డిగ్రీలో చేరిన విద్యార్థుల వివరాలను పూర్తిస్థాయిలో తయారు చేసి ఆయా విభాగాలకు పంపుతున్నారు. ప్రస్తుత నిర్ణయాలతో ఈ విద్యాసంవత్సరంలో రెండు సెమిస్టర్లు పూర్తి చేయడానికి ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకూ కొనసాగే అవకాశముంది. ప్రస్తుతం కొనసాగుతున్న పీజీ స్పాట్ అడ్మిషన్లు ప్రస్తుతం పీజీ స్పాట్ అడ్మిషన్ ప్రక్రియకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఐసెట్ ఆధారంగా ఎంబీఏ, ఎంసీఏ వంటి పీజీ కోర్సుల అడ్మిషన్లు పూర్తి చేసినా ఎంఏ, ఎంఎస్సీ వంటి సాధారణ కోర్సుల స్పాట్ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని ఆయా పీజీ కళాశాలలు స్పాట్ అడ్మిషన్లకు సమయత్తమవుతున్నాయి. అవకాశాలు కోల్పోవచ్చు విద్యాసంవత్సరం ముగింపు సకాలంలో జరగకపోతే వివిధ ప్రాంతాల్లో ఉన్నత విద్యకు పలు రకాల ఆటంకాలు ఏర్పడతాయని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా డిగ్రీ కోర్సులు సకాలం పూర్తి కాకపోతే ఇతర రాష్ట్రాలు లేదా వివిధ ప్రాంతాల్లో పీజీ కోర్సుల అడ్మిషన్లను కోల్పోయే ప్రమాదముంది. ప్రధానంగా చాలా రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడంతో పాటు జూన్, జూలై మాసాల్లో అడ్మిషన్లు నిర్వహిస్తాయి. దీంతో ఆలస్యంగా బయటకు వచ్చే డిగ్రీ విద్యార్థులు అక్కడ పీజీ అడ్మిషన్లు కోల్పోతారు. పీజీ విద్యార్థులు సైతం ఇతర కోర్సుల్లో చేరడానికి ఆ విద్యాసంవత్సరంలో అవకాశాలను కోల్పోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఉన్నత విద్యామండలి గందరగోళ నిర్ణయాలు, ఆలస్యంగా నిర్వహించే అడ్మిషన్ల కారణం విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కళాశాలలు ముందుగానే తరగతులు ప్రారంభించడంతో అధికారికంగా అడ్మిషన్లు పూర్తయ్యే సమయంలో చేరే విద్యార్థులకు సరైన తరగతులు, బోధన ఉండవని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉన్నత విద్యామండలిలో అనుభవం కలిగిన విద్యావేత్తలు ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకోవడంతో ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటున్నారని సీనియర్ అధ్యాపకులు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు మేలు జరిగేలా, విద్యారంగానికి ఇబ్బందులు లేని నిర్ణయాలు తీసుకోవాలిగానీ విద్యాసంవత్సరాన్ని అస్తవ్యస్తం చేసే విధానాలు తీసుకోవడం సరికాదంటూ పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. విద్యాసంవత్సరంలో కోర్సులు చక్కగా పూర్తి చేయడానికి ఉన్నత విద్యామండలి ప్రణాళికలను సిద్ధం చేసి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ, పీజీ కోర్సులకు కృష్ణా విశ్వవిద్యాలయం ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ అనధికారికంగా సాంకేతిక విద్యా కోర్సులకు, సాధారణ డిగ్రీ కోర్సులకు ముడిపెట్టి ఒకదాని తర్వాత ఒకటిగా ఉన్నత విద్యామండలి అడ్మిషన్ల నోటిఫికేషన్లు ఇవ్వడం తలనొప్పిగా మారిందని పలువురు విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణంగా మొత్తం విద్యాసంవత్సరం ప్రభావితమవుతుందంటూ పలువుఉ అధ్యాపకులు సైతం విమర్శిస్తున్నారు. -
కూరగాయల కొరత లేకుండా చూడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో కూరగాయల కొరత లేకుండా చూడాలని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా ధరల నియంత్రణ కమిటీ సభ్యులతో ఇలక్కియ సమావేశం నిర్వహించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను సమీక్షించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. దిగుమతులు ఎక్కువగా ఉండటంతో కూరగాయలకు కొరత ఉండబోదన్నారు. సమావేశంలో డీఎస్ఓ ఎ.పాపారావు, మార్కెటింగ్ ఏడీ, అగ్రికల్చర్ ఏడీ, రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, దాల్స్, ఆయిల్స్ హోల్సేల్, రిటైలర్స్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విశాఖపట్నంలోని గీతమ్స్ డీమ్డ్ టూబీ యూని వర్సిటీలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ (మహిళలు) టోర్నమెంట్లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించే జట్టును ఎంపిక చేశామని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ ఇ.త్రిమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పుత్తూరులోని కేకేసీ హోమియోపతిక్ కళాశాలకు చెందిన ఎం.సుభాషిణి, చిన కాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎన్.యామిని, ఎ.ఖ్యాతి, రాజమండ్రిలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన టి.సాత్విక, విజయనగరంలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ సైన్స్కు చెందిన జి.కల్యాణిని జట్టులో సభ్యులుగా ఎంపిక చేశామని తెలియజేశారు. జట్టుకు ఎంపికై న సభ్యులను యూనివర్శిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ వి.రాధికారెడ్డి అభినందించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నెల 9,10,11 తేదీల్లో 8వ అమరావతి బాలోత్సవం జరగనుంది. విజయ వాడలోని పాఠశాలలతో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పరిధిలోని సుమారు 200 పైగా స్కూళ్ల నుంచి 12 వేల మంది విద్యార్థులు బాలోత్సవంలో పాల్గొననున్నారు. సాంస్కృతిక, అకడమిక్ ఈవెంట్లలో ప్రతిభను ప్రదర్శించనున్నారు. 47 అకడమిక్, 17 కల్చరల్ అంశాల్లో సబ్జూనియర్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. సిద్ధార్థ ఆడిటోరియం, కళాశాల ఆవరణలోని పలు ప్రాంతాల్లో వేదికలను ఏర్పాటు చేసి పోటీలను నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ బాలోత్సవాన్ని ప్రారంభిస్తారని అమరావతి బాలోత్సవ్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు చెప్పారు. మంచి గాలి కోసం.. మంచి జీవితం కోసం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఈ ఏడాది బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలకు సంబంధించి బీ ఫార్మసీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. పరీక్షకు 120 విద్యార్థులు హాజరవ్వగా 83.89 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈనెల 18లోపు ఆన్లైన్లో రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు www.kru.ac.in లో చూసుకోవాలన్నారు. -
ఆరు గ్రామ పంచాయతీలకు ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాలు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించిన ఆరు గ్రామ పంచాయతీలకు ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కలెక్టరేట్లోని సమావేశం హాలులో పంచాయతీల ఈఓలకు అందజేశారు. ఆత్కూరు గ్రామ పంచాయతీకి సంబంధించి సుపరిపాలన అందించడంలో, కేసరపల్లి గ్రామ కాఫీ షాప్ ద్వారా సొంతంగా రెవెన్యూ సాధించడంలో, బాపులపాడు పంచాయతీ స్వచ్ఛరథం నిర్వ హణలో, పునాదిపాడు పంచాయతీ సంపద తయారీలో, చల్లపల్లి స్వచ్ఛ సుందరంగా, నాగాయలంక ప్లాస్టిక్ వ్యర్థాల యాజమాన్య యూనిట్ నిర్వహణలో ఆదర్శంగా నిలిచారన్నారు. ఐఎస్వో ధ్రువీకరణ పత్రాలు పొందడంలో విశేష కృషి చేసిన డీపీవో జె.అరుణ, పంచాయతీ ఈవోలను కలెక్టర్ అభినందించి మరింత సుపరిపాలన అందించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, డీపీవో కార్యాలయ ఏవో సీతారామయ్య, డీఎల్పీవో రజావుల్లా తదితరులు పాల్గొన్నారు. -
దీక్ష విరమణలకు పటిష్ట ఏర్పాట్లు
ఆర్డీవో చైతన్య ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య చెప్పారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. తొలుత కనక దుర్గనగర్లో ఆర్డీవో చైతన్య, ఈవో శీనా నాయక్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. కెనాల్రోడ్డులో క్యూ పనులు, కనకదుర్గనగర్లో లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్లు, స్నానఘాట్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలను పరిశీలించగా, దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులు పనులు జరుగుతున్న విధానాన్ని వివరించారు. మహామండపం వద్ద హోమగుండాలు, అన్నదానం, ఇరుముడులను సమర్పించే కౌంటర్లు, లడ్డూ తయారీ కేంద్రాలను పరిశీలించారు. కార్పొరేషన్, పోలీసు, రెవెన్యూ విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని చైతన్య పేర్కొన్నారు. ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ దుర్గగుడి ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నూతన లడ్డూ పోటులో పూజా కార్యక్రమాలు దీక్ష విరమణలను పురస్కరించుకుని మహా మండపం వద్ద మూడో లడ్డూ పోటుకు ఆలయ అధికారులు సోమవారం పూజలు చేశారు. మహా మండపం, గోశాల మధ్య దేవస్థానం నూతన భవనాన్ని నిర్మించింది. ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటానికి పూజలు చేసి అనంతరం పొయ్యిల వద్ద కొబ్బరికాయ కొట్టి లడ్డూ తయారీని ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీ నాటికి 5 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. -
విస్తృతంగా కోటి సంతకాల సేకరణ
ఎన్టీఆర్ జిల్లాలో 4.31 లక్షలకు చేరిన సంతకాలు లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడంపై వైఎస్సార్ సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో 60 వేలు సంతకాలు సేకరించాలని భావించగా, ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో లక్ష్యానికి మించి సంతకాలు సేకరణ జరిగాయి. ఇంకా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. వైద్య కళాశాలలపై చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారు. భావి తరాల భవిష్యత్కు వైద్య కళాశాలలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలంటున్నారు. ఆదివారం నాటికి 4.15 లక్షల సంతకాలు సేకరించగా, సోమవారం మరో 15,775 సంతకాలు సేకరించారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకూ 4,31,595 సంతకాలు సేకరించినట్లయిది. నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్చార్జిల నేతృత్వంలో కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. సేకరణ ఇలా.. -
అర్జీల సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలి
ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్) ద్వారా ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. అర్జీదారుకు సత్వర, సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో 162 అర్జీలు జిల్లా స్థాయిలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో మొత్తం 162 అర్జీలు అందినట్టు ఇలక్కియ చెప్పారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 65 అర్జీలు అందాయన్నారు. పోలీసు శాఖ 20, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ 26, పంచాయతీరాజ్కు 10 ఫిర్యాదులు వచ్చాయన్నారు. విద్యాశాఖ 6 , పౌరసరఫరాల శాఖకు 5, వైద్య ఆరోగ్య శాఖకు 4, సర్వే, ఏపీ సీపీడీసీఎల్, జలవనరుల శాఖలకు 3చొప్పున, ప్రజా రవాణా శాఖ (ఏపీఎస్ఆర్టీసీ), డీఆర్డీఏ, కార్మిక, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం శాఖలకు రెండు చొప్పున, గృహ నిర్మాణం, పశుసంవర్ధక శాఖ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, సహకార శాఖ, అటవీ, దేవదాయ, ఐసీడీఎస్, బీసీ సంక్షేమం, అగ్నిమాపక శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎం.లక్ష్మీ నరసింహం, జెడ్పీ సీఈవో కన్నమ నాయుడు, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జ్యోతి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీఐహెచ్ తోడ్పాటుతో పరిశ్రమల ఏర్పాటు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) తోడ్పాటుతో పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఇగ్నైట్ సెల్ను ఆమె సందర్శించారు. దీనిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్–విజయవాడ స్పోక్ ఆధ్వర్యంలో యువత వివిధ సమస్యలకు చూపిన సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్ల కంటే 60 శాతం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ప్రోస్తెటిక్ చేతిని విష్ణు అసిస్టివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రదర్శించింది. ఎస్ఆర్ఎం వర్సిటీ–టీమ్ స్కైవర్క్స్ బృందం స్వయం నియంత్రిత డ్రోన్ లాస్ట్–మైల్ డెలివరీ వ్యవస్థను ప్రదర్శించింది. మారీస్ స్టెల్లా కళాశాల విద్యార్థులు సామాజిక ప్రభావం కలిగించే పలు సాంకేతికతలను ప్రదర్శించారు. ప్రోగ్రామ్ అసోసియేట్స్ జి.సుజాత, సౌమ్య మనోజ్, ఆర్టీఐహెచ్ సీఈవో జి.కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
లోపభూయిష్టంగా ప్రభుత్వ విధానాలు
చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉన్నత విద్యామండలి నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉంటున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియకు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు విధానాలు గందరగోళ పరుస్తున్నాయి. వాటితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. కొంతమంది విద్యాసంవత్సరాలను సైతం కోల్పోతున్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి నిర్ణయాలు ఉండటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. –సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
చలనం లేదు.. చర్యలు లేవు!
రోడ్డున పడిన 42 కుటుంబాలను కన్నెత్తి చూడని టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం పేద కుటుంబాలపై కనికరం చూపకుండా నిర్థాక్షిణ్యంగా వ్యవహరించింది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి బలవంతంగా విజయవాడ భవానీపురం జోజినగర్లోని 42 ఇళ్లను నేల మట్టం చేసింది. పైసా, పైసా కూడబెట్టుకొని స్థలాలు కొనుగోలు చేసి, ఇళ్లు కట్టుకొన్న పేద, మధ్య తరగతి కుటుంబాలను కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి విసిరేసింది. బాధితులను పరామర్శించి, న్యాయం జరిగేంత వరకు అండగా ఉండాల్సిన అధికార టీడీపీ నాయకులు మాత్రం ఇప్పటికీ నోరు మెదప లేదు. ఆ ప్రాంతానికి వెళ్లి నష్టపోయిన ప్రజలను సమీకరించి ధైర్యం చెప్పి, పునర్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయవలసిన గురుతర బాధ్యత వారిపై ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వారి జాడ కనిపించలేదు. దీంతో బాధితులు టీడీపీ నాయకుల తీరుపై మండిపడుతున్నారు. సర్వం కోల్పోయాం.. ఏ చిన్న కార్యక్రమం జరిగినా హడావుడి చేసే ప్రజా ప్రతినిధులు కన్నెత్తి చూడక పోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇంట్లో సామానులు తీసుకోలేదని.. చిన్న పిల్లలకు పాలు ఇస్తున్నామని, కొంత సమయం ఇవ్వండయ్యా అంటూ, కాళ్లా వేళ్లా పడినా కనికరించకుండా, వారి గుండెల్లో గునపం గుచ్చడంతో తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడ తలదాచుకోవాలో దిక్కు తెలియక విలవిల్లాడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి బాధితులతో సమావేశం అయినప్పటికీ ఆయన నుంచి కూడా భరోసా లభించలేదనే భావన వ్యక్తమవుతోంది. అన్ని అనుమతులతో నిర్మించినా.. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు అన్నీ ప్రభుత్వ శాఖల అనుమతులతోనే జరిగాయి. ప్లాట్ రిజిస్ట్రేషన్, ఇంటి నిర్మాణానికి కావలసిన అనుమతులు, ఇంటికి అవసరమైన నీటి కుళాయి, విద్యుత్ కనెక్షన్, నిర్మాణం అనంతరం అంచనా వేసి, ఇంటి పన్ను నిర్ధారించడం ఇవన్నీ ప్రభుత్వ శాఖలు చేసే పనులే. ఇన్ని అనుమతులు తీసుకొని, 20 ఏళ్లకు పైగా అనుభవిస్తున్న ఇంటి యజమానుల ఇళ్లపై దాడిచేసి, ఏకకాలంలో 15 బుల్డోజర్లతో, 200 మందికి పైగా పోలీసులను మోహరించి 42 ఇళ్లను కూల్చివేయటంపై అన్ని వర్గాల ప్రజలు భగ్గుమంటున్నారు. విజయవాడలో వందల సంఖ్యలో అనధికారిక భవనాలు ఉన్నాయి. కోర్టులు సైతం భవనాలను కూల్చివేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని పట్టించుకోని ప్రభుత్వ శాఖలు, ఒక ప్రైవేటు ఆస్తి విషయంలో ఇంత పెద్ద ఎత్తున జోక్యం చేసుకొ కూల్చివేతలకు పాల్పడటంపై సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. నా భర్త కోటేశ్వరరావు ఆర్మీలో పని చేసేవారు. ఆయన రిటైర్డ్ అయిన డబ్బులతో 1996లో స్థలం కొనుకున్నాం. ఎగుడు దిగుడుగా ఉన్న స్థలాన్ని చదును చేసుకొని, రేకుల షేడ్ నిర్మించుకున్నాం. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నాం. మాకు అది తప్ప ఇంకే ఆదరువు లేదు. దేశ రక్షణకోసం కష్టపడిన, మా గూటికే రక్షణ లేకుండా పోయింది. షెడ్డు కూల్చి వేయడంతో రోడ్డున పడ్డాం. కనీసం అధికార పార్టీ నాయకులు వచ్చి పలకరించిన పాపాన పోలేదు. – చానం కనకదుర్గా, జోజినగర్ బాధితురాలు -
ప్రభుత్వం పట్టించుకోలేదు..
రూపాయి, రూపాయి కూడబెట్టి 2007లో ఇక్కడ స్థలం కొనుగోలు చేశా. నాకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె పెళ్లికి ఈ స్థలం ఉపయోగపడుతుందనే ఆలోచనతో కష్టపడి కొనుక్కున్నాను. కానీ ఇప్పుడెమో ఈ స్థలం మాది కాదంటూ మమ్మల్ని బయటకు తోసేశారు. 20 ఏళ్ల తరువాత ఇప్పుడొచ్చి మా స్థలాలు లాక్కుంటే మా పరిస్థితి ఏమిటి? కూతురు పెళ్లికి ఉపయోగపడుతుందనుకున్న స్థలం పోయింది. నేను ఏమి చేయాలి? మేం అన్యాయంగా ఆక్రమించుకోలేదు. చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. పరిస్థితి ఏమీ అర్థం కావటం లేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం బాధిస్తోంది. – వి. ఆనందరావు, జోజినగర్ బాధితుడు -
బాధితులకు న్యాయం చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): జోజినగర్లో నివాసాలు కోల్పోయిన 42 కుటుంబాలను విజయవాడ ఎం సీపీఐ నగర కమిటీ ఆదివారం పరామర్శించింది. కమిటీ కార్యదర్శి కాసాని గణేష్ బాబు మాట్లాడుతూ స్థలం కొనుగోలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అన్నీ పక్కాగానే ఉన్నా నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయడం కిరాతక చర్య అన్నారు. ఇంత అమానుషం జరిగినా.. అధికార పార్టీ నాయకులు బాధి తులకు ధైర్యం చెప్పకపోవడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి ఇళ్లు కోల్పోయిన బాధితులను సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పరామర్శించారు. వారు మాట్లాడుతూ ఇళ్ల కూల్చివేత వెనుక అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. నాయకులు పోలారి, గంగా భవానీ(అడ్వకేట్), కె. నాగమణి, కె. కనకదుర్గ, సీహెచ్ పెద్దిరాజు తదితరులు ఉన్నారు. -
వారికి ప్రమోషన్ లేనట్టే!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఉద్యోగోన్నతులకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ఎంతో కాలం నుంచి ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. అయితే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉద్యోగోన్నతులు అనుమానమేనని ఆ శాఖ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఖాళీలు ఇలా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ–1, విజయవాడ–2, విజయవాడ–3 డివిజన్లుగా వాణిజ్య పన్నుల శాఖ పరిధి విస్తరించి ఉంది. ఈ మూడు డివిజన్లలో 17 సర్కిల్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. వీటికి సంబంధించి 20 జీఎస్టీఓ పోస్టులు, ఎనిమిది సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 15 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగోన్నతులు ఇవ్వాల్సి ఉంది. జీఎస్టీఓలకు సంబంధించి 20 పోస్టుల్లో తొమ్మిది రెగ్యులర్ ప్రమోషన్లు, 11 డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకపోవటంతో ఆ ఖాళీలను సైతం తమకు కేటాయించి భర్తీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. శాఖపరమైన ఇబ్బందులు.. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు పలువురు శాఖపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆ శాఖ రాష్ట్రస్థాయి అధికారిని ఆయన కార్యాలయంలో ఘెరావ్ చేయటంతో సుమారు వంద మందికి పైగా మూడు జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులపై ఆ శాఖ విచారణకు ఆదేశించింది. అందులో కొంతమందిని దోషులుగా తేల్చింది. ఆ విచారణ నివేదికపై చర్యలు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉమ్మడి జిల్లాకు చెందిన చాలా మంది ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వారికి నిబంధనల ప్రకారం ఉద్యోగోన్నతి లభించే అవకాశం లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. లాబీయింగ్ షురూ.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 17 సర్కిల్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రమోషన్ల విషయంలో అడ్డంకిగా ఉన్న పలు ఆరోపణలను పూర్తిగా రద్దు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు లాబీయింగ్ మొదలు పెట్టినట్లు తెలిసింది. ఉద్యోగోన్నతులకు ఎటువంటి అవరోధం లేకుండా చూస్తామని, దానికి చాలా నిధులు అవసరమని ఉద్యోగ సంఘాల నేతలు ఒకరిద్దరు ఉద్యోగులకు వివరిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. లాబీయింగ్ ప్రక్రియకు సంబంధించి కొంతమంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించి తమతమ స్థాయిల్లో మామూళ్లు సమర్పించుకుంటున్నారన్న పుకార్లు ఆయా డివిజన్ కార్యాలయాల్లో షికారు చేస్తున్నాయి. త్వరితగతిన పూర్తి.. ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేస్తామని ఉమ్మడి జిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు వాటికి సంబంధించిన విషయాలపై చర్చించి, నివృత్తి చేసేందుకు డ్రైవ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే ఇంత వేగంగా ఆ ప్రక్రియను పూర్తి చేస్తే చాలా మందికి ఉద్యోగోన్నతులు రాకుండా పోతాయని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ
ఎన్టీఆర్ జిల్లాలో 4.15 లక్షలకు చేరిన సంతకాలు లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడంపై ఎన్టీఆర్ జిల్లాలో నిరసన సంతకాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో లక్ష్యానికి మించి సంతకాలు సేకరణ జరగ్గా, ఇంకా ప్రజల నుంచి లభిస్తున్న స్పందనతో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వైద్య కళాశాలలపై చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారు. భావి తరాల భవిష్యత్ కోసం వైద్య కళాశాలలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలంటున్నారు. కాగా శనివారం నాటికి 4.11 లక్షల సంతకాలు సేకరించగా, ఆదివారం సెలవు దినం అయినప్పటికీ మరో 4,820 సంతకాలు సేకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకూ 4,15,820 సంతకాలు సేకరించినట్లయిది. ఆయా నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్చార్జిల నేతృత్వంలో కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. సేకరణ ఇలా.. -
సాయుధ దళాల సేవలు అజరామరం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ రక్షణకు ప్రాణాలను అర్పించిన సైనికుల సేవలు వెలకట్టలేనివని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. సాయుధ దళాల నిధికి తోచిన సహాయం అందించి మాజీ సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకుని ఇన్చార్జ్ కలెక్టర్ ఇలక్కియ పతాక నిధికి విరాళం అందించారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి నుంచి పతాకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సైనికులు, మాజీ సైని కులు, వారి కుటుంబ సబ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణకై పోరాడి, అసువులుబాసిన సైనికులకు నివాళులు అర్పించారు. వీర మరణం పొందిన సైనికుల తల్లిదండ్రులు, భార్యా పిల్లలకు మనకు తోచిన రీతిలో స్పందించి.. జిల్లా ప్రజలు వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు విద్యా సంస్థలు విరివిగా విరాళాలు అందించాలని ఇలక్కియ పిలుపునిచ్చారు. పన్ను రాయితీ.. జిల్లా సైనిక సంక్షేమ అధికారి సర్జస్ లెఫ్టినెంట్ కమాండర్ కె. కల్యాణ వీణ మాట్లాడుతూ పతాక నిధికి అందించే విరాళాలకు ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందన్నారు. స్వచ్ఛందంగా విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చేవారు జిల్లా సైనిక సంక్షేమ అధికారి, ఎన్టీఆర్ జిల్లా పేరున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా 62067742138 నంబర్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0020899 ద్వారా నేరుగా తమ విరాళాలు అందించవచ్చని ఆమె తెలిపారు. విశ్రాంత ప్రిన్సిపాల్ కాళీ ప్రసాద్ పతాక నిధికి రూ. 25వేలు విరాళం ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఇలక్కియ -
న్యాయ విద్యార్థులు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్రావు పెనమలూరు: న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు నిరంతరం నైపుణ్యం పెంచుకునేందుకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్రావు సూచించారు. కృష్ణాజిల్లా, పెనమలూరు మండలం కానూరులోని సిద్ధార్థ లా కాలేజీ ఆధ్వర్యంలో చల్లా కొండయ్య మెమోరియల్ సిద్ధార్థ 4వ జాతీయ లీగల్ ఫెస్ట్–2025 ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ రఘునందన్రావు మాట్లాడుతూ.. నిరంతర కృషితో విద్యార్థులు వృత్తిలో రాణించగలుగుతారన్నారు. విద్యార్థులు పోటీ పడాలి.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.ఎల్.ఎన్.చక్రవర్తి మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు నైపుణ్యం పెంచుకునేందుకు మూట్ కోర్టు మంచి వేదికన్నారు. జాతీయ స్థాయిలో అనేక కాలేజీలకు చెందిన విద్యార్థులు పోటీ పడటం వల్ల నైపుణ్యం పెరుగుతుందని, వృత్తిపై అవగాహన ఏర్పడుతుందన్నారు. మూట్ కోర్టులో ప్రథమ బహుమతి మంగుళూరు ఎస్డీఎం లా కాలేజీ, ద్వితీయ బహుమతి కేరళ కోజికోడ్ ప్రభుత్వ లా కాలేజీ గెలుచుకుంది. లీగల్ క్విజ్లో ప్రథమ బహుమతి సిద్ధార్థ లా కాలేజీ, అమరావతి స్కూల్ ఆఫ్ లా కాలేజీ గెలవగా, ద్వితీయ బహుమతి కేఎల్ యూనివర్సిటీ గెలుచుకుంది. బెస్ట్ మూటర్ ఇన్ మూట్ కోర్టు బహుమతి కోయంబత్తూర్ ప్రభుత్వ లా కాలేజీ, బెస్ట్ మెమోరియల్ ఇన్ మూట్ కోర్టు చైన్నెకి చెందిన స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ లా, డాక్టర్ అంబేడ్కర్ లా యూనివర్సిటీ గెలిచాయి. ఈ మేరకు గెలుపొందిన కాలేజీలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు, కాంటినెంటల్ కాఫీ కంపెనీ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కిక్కిరిసిన కార్తికేయుని సన్నిధి
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తజనంతో పోటెత్తింది. ఆదివారం ఉదయం తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారికి ఒక రోజు వివిధ సేవా టికెట్లు ద్వారా రూ. 9,97,952 ఆదాయం వచ్చినట్లు ఆలయ డీసీ శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. స్వామివారికి సేవా టికెట్లు ద్వారా రూ. 4,25,194, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 1,89,695, నిత్య అన్నదాన నిమిత్తం రూ. 1,20,085, శ్రీవారి దర్శనం ద్వారా రూ. 74,500, శాశ్వత అన్నదానం కార్యక్రమ నిమిత్తం రూ. 50,256, కళ్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 22,360కలిపి మొత్తం రూ. 9,97,952లు ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణల నిమిత్తం చేపట్టిన పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడితే ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని ఈవో శీనానాయక్ హెచ్చరించారు. దీక్ష విరమణలను పురస్కరించుకుని చేపట్టిన పనులను ఆదివారం ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు పరిశీలించారు. క్యూలైన్లు, స్నానఘాట్లు, ప్రసాదం కౌంటర్లు, లడ్డూ పోటు, హోమగుండాలు, ఇరుముడి సమర్పించే కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావాలన్నారు. ఈవో వెంట ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు(బుల్లబ్బాయ్), రాఘవరాజు, దుర్గగుడి ఈఈ రాంబాబు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్ష విరమణలకు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ త్రినాథరావు నియమితులయ్యారు. దీక్ష విరమణకు విచ్చేసే భవానీలకు మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లను త్రినాథరావు పర్యవేక్షిస్తారు. గతంలో దుర్గగుడి ఇన్చార్జి ఈవోగా 15 నెలల పాటు బాధ్యతలు నిర్వహించిన అనుభవం త్రినాథరావుకు ఉంది. ఆ సమయంలో రెండు భవానీ దీక్ష విరమణలు, ఒక దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. తిరువూరు: భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం తిరువూరులో జరిగింది. 53వ మహాసభల సందర్భంగా జరిగిన కార్యవర్గ ఎన్నికలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా టి. కుమారస్వామి, సీహెచ్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా కుమార్ నాయక్, ప్రణీత, ప్రణయ్, జిల్లా సంయుక్త కార్యదర్శులుగా ఖాజా, మాధవ్, ఉష, యశస్విని, మరో 11 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ తొలి సమావేశంలో తిరువూరు పట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలని, సంక్షేమ వసతిగృహాలకు భవనాలు నిర్మించాలని, పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలి వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాలని తీర్మానించారు. -
వైద్య రంగం ప్రైవేటీకరణతో సమాజానికి చేటు
ప్రజా ఆరోగ్య వేదిక ఆరోగ్య సెమినార్లో వక్తలుకృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేలా వైద్య వ్యవస్థ ఉండాలని, ఐక్యూతో ఎమోషనల్ మేనేజ్మెంట్ కూడా ఉన్నప్పుడే కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయని ప్రజా ఆరోగ్య వేదిక ఆరోగ్య సెమినార్లో పలువురు వక్తలు పేర్కొన్నారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో జన్ స్వాస్థ్య అభియాన్ వ్యవస్థాపకుడు డాక్టర్ అమిత్ సేన్ గుప్తా వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా గౌరవాధ్యక్షుడు, సీనియర్ వైద్యుడు డాక్టర్ సూరపనేని సుధాకర్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్లో ‘వైద్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు–పరిష్కారాలు, పెరుగుతున్న మానసిక సమస్యలు–పరిష్కార మార్గాలు’ అనే అంశాలపై ఆరోగ్య సెమినార్ నిర్వహించారు. ఎమోషనల్ మేనేజ్మెంట్ అవసరం.. ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు మానసిక సమస్యలు పెరుగుతున్నాయని, మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని, ఇది ప్రమాదకరమైన సూచన అన్నారు. ఒకప్పుడు మద్యపానం, ధూమపానం ప్రధాన వ్యసనాలుగా ఉండేవని, ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ కూడా విపరీతంగా పెరిగాయని, వాటి వల్ల యువత పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఎమోషనల్ మేనేజ్మెంట్ ద్వారానే వీటన్నింటినీ అధిగమించడం సాధ్యమన్నారు. -
ఐఎంఏ అధ్యక్షుడిగా వరప్రసాద్ బాధ్యతల స్వీకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడశాఖ 2025–26 నూతన కార్యవర్గం ఆదివారం బాధ్యతలు స్వీకరించింది. గవర్నర్పేటలోని ఐఎంఏ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ బోడేపూడి హనుమయ్య నుంచి నూతన అధ్యక్షుడిగా డాక్టర్ వీఎన్ వరప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎస్బీఎన్ చౌదరి, డాక్టర్ ఉప్పులేటి తారకప్రసాద్, కార్యదర్శిగా డాక్టర్ అనూప్ తోట, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ ఏ సూర్యనారాయణరావు, డాక్టర్ ఎం. పూజిత, కోశాధికారిగా డాక్టర్ కె. వంశీకృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. మరో 20 మంది కార్యవర్గ సభ్యులుగా నూతన కమిటీలో ఉన్నారు. డాక్టర్ వీఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ ఐఎంఏ విజయవాడ శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయడంతో పాటు, కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. -
ఇవే నిదర్శనం
● గాంధీనగర్కు చెందిన యువతి(19) నగరంలోని ఓ కళాశాలలో బీబీఏ చదువుతోంది. ఎంత చదివినా గుర్తు ఉండటం లేదు. అంతేకాదు తరగతి గదిలో నిద్రపోతోంది. సమస్య ఏదైనా ఉందా అని వైద్యుడిని సంప్రదిస్తే నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ● లబ్బీపేటకు చెందిన వ్యాపారి అర్ధరాత్రి వరకూ బయటే గడుపుతాడు. తర్వాత వెళ్లి రోజుకు మూడు, నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారు. దీంతో ఇటీవల బైక్ నడుపుతుంటే అదుపు తప్పడం, కోపం చిరాకు పెరిగింది. అందుకు నిద్రలేమి కారణం అని వైద్యులు తేల్చారు. -
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో అన్వర్కు గోల్డ్ మెడల్
భవానీపురం(విజయవాడపశ్చిమ): నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్ – 2025 పోటీల్లో కటా విభాగంలో బ్లూ బెల్ట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయవాది డాక్టర్ షేక్ అన్వర్ బంగారు పతకాన్ని సాధించారు. వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిట్రోరియోకాయ్ ఇంటర్నేషనల్ కరాటే డో అకాడమీ ఇండియా ఆదివారం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో 23వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొన్న షేక్ అన్వర్ కటా విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ సురేష్(బ్లాక్ బెల్ట్ నైన్త్ డాన్ ఇండియా జె.హరినాథ్ (జేకే గోజురియో కరాటే అకాడమీ), జక్కుల దినేష్, మధు, మహేష్ అన్వర్ను సత్కరించి బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. అనంతరం గోల్డ్ మెడల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ షేక్ అన్వర్ మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా కరాటే విద్యలో శిక్షణ తీసుకుంటున్నానని తెలిపారు. కరాటేను సెల్ఫ్ డిఫెన్స్గా మాత్రమే పరిగణించాలని, జీవితంలో ఎదగడానికి, ధృడ నిర్ణయాలు తీసుకోవడానికి కరాటే ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కరాటేను ఒలంపిక్స్లో ప్రవేశపెట్టడం తమలాంటివారికి శుభపరిణామమని పేర్కొన్నారు. -
టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా తనుబుద్ధి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ భవానీపురానికి చెందిన తనుబుద్ధి చంద్రశేఖర్రెడ్డి టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి టీఏసీ సభ్యుడిగా తనుబుద్ధి చంద్రశేఖరరెడ్డిని సిఫార్సు చేశారు. ఆయన సిఫార్సు మేరకు నియామకం జరిగింది. చంద్రశేఖరరెడ్డి గతంలో ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. టీఏసీ సభ్యునిగా తనను సిఫార్సు చేసి ఎంపికకు సహకరించిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి చంద్రశేఖర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీఏసీ సభ్యుడిగా నియమితులైన తనుబుద్ధి చంద్రశేఖర్రెడ్డిని వైఎస్సార్సీపీ నేతలు అభినందించారు. తండ్రికి తలకొరివి పెట్టిన తనయ పెడన: తండ్రికి కుమారులు ఎవరూ లేకపోవడంతో కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన కృష్ణాజిల్లా పెడన మండలంలో ఆదివారం జరిగింది. పెడన మండలం పెనుమల్లి దళితవాడకు చెందిన వల్లభు ఏడుకొండలు(56) అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు కొడుకులు లేరు. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రికి తాను తలకొరివి పెడతానంటూ ఆఖరి కుమార్తె కల్యాణి ముందుకొచ్చింది. పెద్దల సహాయంతో తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో పెడన జెడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకట నగేష్ పాల్గొన్నారు. -
వెరీ డేంజర్
మిడ్నైట్ కల్చర్శరీరానికి ఎనర్జీ కోసం ఆహారం ఎంత అవసరమో మెదడుకు నిద్ర కూడా అంతే అవసరం. మెదడు సక్రమంగా పనిచేయాలంటే ప్రతిరోజూ 6 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరి. ప్రస్తుతం చాలామంది నిద్రలేమి కారణంగా అనేక శారీరక, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. స్మార్ట్ఫోన్తో పాటు ఇటీవల నగరంలో పెరిగిన మిడ్నైట్ కల్చర్ ఇందుకు ప్రధాన కారణం. మంచి నిద్రపోవాలంటే... ● మనిషి శరీర తత్వాన్ని బట్టి రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర అవసరం అవుతుంది. ● ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకేసమయానికి నిద్రలేవడం చేయాలి. ● ఒకేసారి ఏకకాలంలో నిద్రపోవాలి. 4 గంటలు ఒకసారి, రెండు గంటలు మరోసారి కాదు. ● మంచి నిద్రకోసం బెడ్రూమ్ను చీకటిగా ఉంచుకోవడంతో పాటు, శబ్దాలు లేకుండా చూసుకోవాలి. ● నిద్రలోనే మెదడులోని వ్యర్ధాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ● విద్యార్థులకు సరిగా నిద్రలేకపోతే, రాత్రి చదివినవి ఉదయానికి గుర్తుండవు. నిద్రలేమి సమస్య గుర్తించిన సమస్యలివే... ● రాత్రివేళల్లో స్మార్ట్ఫోన్లు ఎక్కువ సేపు చూసే వారిలో కంటిలోని మెలకొనిన్ అనే పదార్ధం కరిగిపోతుంది. అలాంటి వారికి నిద్రపట్టదు. క్రమేణా నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. ● నిద్రలేమితో కోపం, చిరాకు పెరిగిపోతుంటాయి. నిస్సత్తువ ఆవహించి, తెల్లారి లేచిన తర్వాత పనిపై దృష్టి పెట్టలేరు. వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతారు. ● పగలు చదివిన అంశాలు బ్రెయిన్లో స్టోర్ అవ్వాలంటే సరైన నిద్ర అవసరం. నిద్రలేమి సమస్య ఉన్న వారిలో చదివిన అంశాలు గుర్తుండని పరిస్థితి నెలకొంటుంది. ● ఒబెసిటీ ఉన్న వారు గురకతో రాత్రి వేళల్లో తరచూ తుళ్లిపడి లేస్తుంటారు. శ్వాసనాళాలు మూసుకుపోవడంతో గురకతో పాటు, ఒక్కోసారి గుండెపోటు, మెదడుపోటుకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి వారి ఆరోగ్య పరిస్థితిని స్లీప్ ల్యాబ్లో అధ్యయనం చేస్తారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలో మిడ్నైట్ కల్చర్ పెరిగింది. అర్ధరాత్రి వరకూ రోడ్లపై గడుపుతున్నారు. రాత్రి 10 గంటల తర్వాత కూడా కుటుంబ సమేతంగా ఫుడ్స్టాల్స్కు వస్తున్నారు. ఇక యువత ఇంట్లో ఉన్నా స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ అర్ధరాత్రుళ్ల వరకు మెలకువగా ఉండడం మామూలైపోయింది. కళాశాలలు కూడా అసైన్మెంట్స్ ఫోన్లోనే ఇస్తుండడంతో ప్రతి విద్యార్థికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయింది. కొద్దిసేపు అసైన్మెంట్స్ చేసిన తర్వాత ఫోన్లలో రీల్స్ చూస్తూ సమయం అంతా వృథా చేస్తున్నారు. దీంతో నిద్రలేమి సమస్య వెంటాడుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. నిద్రలేమికి అనేక కారణాలు నిద్రలేమికి అనేక కారణాలున్నాయి. వాటిలో రోజూ ఒకే సమయానికి పడుకోకపోవడం, సాయంత్రం 6 తర్వాత ఎక్కువగా టీవీలు, స్మార్ట్ఫోన్లు చూడటం, ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో పడుకోవడం, నిద్రలో గురక రావడం, నైట్షిప్ డిజార్డర్, రక్తహీనతలు ఉన్నాయి. నిద్రలేమి ఉన్న వారికి స్లీప్ ల్యాబ్లో స్టడీ చేస్తాం. ఆక్సిజన్ శాచురేషన్, బ్రెయిన్ యాక్టివిటీ, బాడీ యాక్టివిటీ, ఏ సైకిల్లో ఉన్నారో తెలుసుకుంటాం. అలా నిద్రలేమికి అంచనా వేసి అవసరమైన వైద్యం చేయడం, సూచనలు ఇవ్వడమో చేస్తుంటాం. వైద్యుల సూచన లేకుండా నిద్రమాత్రలు వాడటం సరికాదు. – డి.అనిల్కుమార్, న్యూరాలజిస్ట్ ● -
22 నుంచి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు యోనెక్స్–సన్రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ను నిర్వహిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు తెలిపారు. నగరంలోని హోటల్లో బ్యాడ్మింటన్ పోటీలకు సంబంధించిన లోగో, పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ యువతలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మరింత ఉత్సాహం.. ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ ఇలాంటి చాంపియన్షిప్లు క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ అంటే తెలుగువారే గుర్తుకు వస్తారన్నారు. 2029లో నేషనల్ గేమ్స్ను రాష్ట్రంలో నిర్వహించేలా ప్రయత్నిస్తున్నామని, అందుకు తగినట్లుగా మైదానాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
మంచి నడవడికతో మెలగండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): నేర ప్రవృత్తిని వీడి మంచి నడవడికతో మెలగాలని ఎన్టీఆర్ జిల్లాలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్లకు ఆదివారం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు రూరల్ పరిధిలో డీసీపీ బి.లక్ష్మీనారాయణ, సిటీలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ కౌన్సెలింగ్ ఇచ్చారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లు టాస్క్ఫోర్స్ కార్యాలయాల్లో ఆయా పోలీసు అధికారులు సిబ్బందితో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిల్లకల్లు జిల్లా పరిషత్ స్కూల్లో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్లో డీసీపీ లక్ష్మీనారాయణ రౌడీషీటర్ల ప్రవర్తన మార్పుకోవాలని ఆదేశించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్ధాల వినియోగం, అక్రమ రవాణా చేయకుండా మంచి మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలను దూరం చేసుకుని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై పోలీస్ వారి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. -
కొనసాగుతున్న కూల్చివేతల పర్వం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): బెజవాడలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఇటీవల జోజినగర్లోని 42 ఇళ్లను కూల్చివేయగా, ఆదివారం అధికారులు మరో కూల్చివేతను చేపట్టారు. భారతదేశ ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిన శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణాన్ని సైతం కూల్చివేశారు. ఈ ఘటన యావత్ నగర వాసులను విస్మయానికి గురి చేసింది. వీఎంసీ కార్యాలయం ఎదుట శివాజీ విగ్రహం నిర్మాణం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట కృష్ణా మెయిన్ కెనాల్ ఒడ్డున పార్క్ ఉంది. అందులో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పాతబస్తీలోని మరాఠీ, ఉత్తర భారతీయ సంఘాలు స్థానిక కార్పొరేటర్ మండేపూడి చటర్జీకి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. వేలాదిగా ఉన్న ఆయా ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చటర్జీ కౌన్సిల్లో తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని క్రీడలు అండ్ ట్రాఫిక్ ప్రత్యేక కమిటీకి పంపగా ఆ కమిటీ చర్చించి ఆమోదం తెలిపింది. కౌన్సిల్ కూడా దాన్ని అంగీకరించింది. దీంతో ఉత్తర భారతీయ సంఘాలు, మరాఠీ సంఘ ప్రతినిధులు శివాజీ మహారాజ్ విగ్రహం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పీఠాన్ని నిర్మించారు. అయితే ఆదివారం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ నిర్మాణాన్ని ఽనగర పాలక సంస్థ సిబ్బంది ధ్వంసం చేశారు. కౌన్సిల్ ఆమోదం తెలిపిన నిర్మాణాన్ని ఽకూల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై మరాఠీ సంఘ ప్రతినిధులు, ఉత్తర భారతీయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ధ్వంసం చేయడం దారుణం శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి కౌన్సిల్ అనుమతి ఉంది. జరుగుతున్న నిర్మాణాన్ని కూల్చివేయడం దారుణం. అభ్యంతరం ఉంటే దానిని కౌన్సిల్లో చర్చించి వ్యతిరేకించాలి. అంతేకానీ ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. – మండేపూడి చటర్జీ, కార్పొరేటర్, 37వ డివిజన్ -
రేపటి నుంచి సిద్ధార్థలో అమరావతి బాలోత్సవం
200 స్కూల్స్ నుంచి హాజరు కానున్న 12 వేల మంది విద్యార్థులు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో 8వ అమరా వతి బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అమరా వతి బాలోత్సవం అధ్యక్షుడు ఎస్పీ రామరాజు చెప్పారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో బాలోత్సవం పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు మాట్లాడుతూ నగరంలోని పాఠశాలలతో పాటుగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పరిధిలోని సుమారు 200కు పైగా పాఠశాలల నుంచి దాదాపు 12 వేల మంది విద్యార్థులు ఈ బాలోత్సవంలో పాల్గొననున్నారని చెప్పారు. మంచి గాలి కోసం,మంచి జీవితం కోసంపర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఈ ఏడాది బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 47 అకడమిక్, 17 కల్చరల్ అంశాల్లో సబ్జూనియర్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో సిద్ధార్థ ఆడిటోరియంతో పాటుగా సిద్ధార్థ కళాశాల ఆవరణలో 15 వేదికలను ఏర్పాటు చేసి వాటిపై పోటీలను నిర్వహిస్తామని కొండలరావు వివరించారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ బాలోత్సవాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. బాలోత్సవం కమిటీ సభ్యులు మురళీ కృష్ణ, సాంబిరెడ్డి, వై.సుబ్బారావు, నాగళ్ళ విద్యాఖన్నా, రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
సంగీతం సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం
కేంద్ర పర్యాటక శాఖ ఏడీజీ వెంకటరామన్ హెగ్డే భవానీపురం(విజమవాడపశ్చిమ): పర్యాటక రంగం పురోభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊతమివ్వడం ద్వారా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పొందే వీలు ఉంటుందని కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంకటరామన్ హెగ్డే అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి ఆదివారం ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట రామన్ హెగ్డే మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో ఎంతో మంది ప్రముఖ సంగీత విద్వాంసులు ఇచ్చిన ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా అలరించాయనన్నారు. సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజల మధ్య సంబంధాలు పెరుగుతాయన్నారు. కేంద్ర పర్యాటక శాఖ సంచాలకుడు (సౌత్) ఆర్.వెంకటేశన్ మాట్లాడుతూ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో టూరిజం శాఖ నిబద్ధతతో వ్యవహరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ప్రముఖ సంగీత విద్వాంసుడు మల్లాది రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత గవర్నర్ నజీర్ కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను సందర్శించారు. -
హోంగార్డుల సేవలు అనిర్వచనీయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): శాంతిభద్రతల పరిరక్షణ, ఇతర విధుల్లో హోంగార్డులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. పోలీసు శాఖకు వెన్నెముకలా నిలిచి ఉత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. 63వ హోంగార్డ్స్ దినోత్సవం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్లో శని వారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీ రాజశేఖరబాబుకు హోంగార్డులు పరేడ్ నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. 1963 , డిసెంబర్ ఆరో తేదీన రాష్ట్రంలో హోంగార్డు వ్యవస్థ ప్రారంభమైందన్నారు. నాటి నుంచి ప్రజలకు హోంగార్డులు విశేష సేవలు అందిస్తున్నారని, పోలీస్ కమిషనరేట్లో వెయ్యి మంది ఉన్నారని వివరించారు. విధులు నిర్వహిస్తూ మృతి చెందిన హోంగార్డులకు సంబంధించి వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నాలుగు కుటుంబాలకు ఎక్స్గేషియా చెల్లించి, ఆ కుటుంబాల్లో అర్హత ఉన్న వారికి హోంగార్డు ఉద్యోగం ఇచ్చామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఉద్యోగ విరమణ చేసిన 13 మందికి రూ.5 లక్షల చొప్పున చెల్లించామన్నారు. హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్ షిప్లుకూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. సేవలకు గుర్తింపు హోంగార్డుల సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వ ఇచ్చే ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట పతకాలు ఇప్పటి వరకూ 55 మందికి సీనియారిటీ ప్రాతిపదికన ఇచ్చినట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణప్రసన్న, ఎస్.వి.డి.ప్రసాద్, హోంగార్డ్స్ కమాండెంట్ టి.ఆనందబాబు, క్రైమ్ ఏడీసీపీ రాజారావు, ఏఆర్ ఏడీసీపీ కె.కోటేశ్వరరావు, పలువురు ఏసీపీలు, సీఐలు, హోంగార్డ్స్’ ఆర్ఐ సుధాకర్రెడ్డి, 200 మంది హోంగార్డులు పాల్గొన్నారు. -
కొత్త స్టాళ్ల ఏర్పాటు ప్రతిపాదనలు వాయిదా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ప్రాంగణంలో ప్రస్తుతం ఉన్న స్టాళ్లనే తొలగిస్తుండగా, కొత్తగా రెండు స్టాళ్ల ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలను ట్రస్ట్ బోర్డు వాయిదా వేసింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు శనివారం సమావేశమైంది. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో ఉన్న బోర్డు సమావేశ మందిరంలో చైర్మన్, సభ్యులు, ఆలయ అధికారులు సమావేశమయ్యారు. చైర్మన్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దుర్గగుడి ఈఓ శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ఏఈఓలు, సూపరింటెండెంట్లు హాజరయ్యారు. మొత్తం 16 అంశాలు చర్చకు రాగా రెండు అంశాలను వాయిదా వేశారు. భవానీ దీక్ష విరమణ పనులకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగం చేసిన ప్రతిపాదనలకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. చర్చకు వచ్చిన అంశాల్లో 12 అంశాలు ఆమోదం పొందాయి. దుర్గాఘాట్లో టాయిలెట్లు, సి.వి.రెడ్డి చారిటీస్లో మెటీరియల్ స్టోరేజీ పాయింట్ ఏర్పాటు అంశాలను రివైజ్ చేయాలని తీర్మానించింది. కొండపై నుంచి రాళ్లు జారిపడకుండా చైనేజ్ మెస్ ఏర్పాటుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదన చేయగా, సభ్యులు సీఈడీ నివేదికకు పంపాలని నిర్ణయించారు. అనంతరం చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ మీడియాతో మాట్లాడారు. సుచీ ఫుడ్ ప్రొడక్స్, అరకు వ్యాలీ కాఫీ స్టాల్కు ప్రతిపాదన దుర్గగుడి పరిసరాల్లో ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్కు సంబంధించిన సుచీ ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాళ్లు, గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్కు చెందిన అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలను ట్రస్ట్ బోర్డు సభ్యులు వాయిదా వేశారు. ఏడాదికి రూ.29 లక్షలు అద్దె చెల్లించే ప్రాతిపదికన వాటర్ బాటిళ్లు విక్రయించే కౌంటర్కే దేవదాయ శాఖ కమిషనర్ ఆమోదం తెలపకపోవడంతో ఆ స్టాల్ను దేవస్థానం తొలగించింది. ఇప్పుడు కొత్తగా స్టాళ్ల ఏర్పాటు తెరపైకి రావడంతో కొంతమంది ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. 35 లక్షల లడ్డూల తయారీకి ఏర్పాట్లు భవానీ దీక్ష విరమణలకు ఈ ఏడాది ఆరు లక్షల మంది విచ్చేస్తారని అంచనా వేస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి ఈఓ శీనానాయక్ తెలిపారు. భక్తులు కోరినన్ని లడ్డూలు ఇవ్వాలనే భావనతో 35 లక్షల లడ్డూల తయారీకి అంచనాలు రూపొందించామన్నారు. మూడు హోమగుండాలు, 106 ఇరుముడి సమర్పణ కౌంటర్లలో గురు భవానీలు మాలల విరమణలు చేస్తారని వివరించారు. భవానీలను అన్ని క్యూలైన్లలో ఉచితంగా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. గురు భవానీలు తప్పనిసరిగా దేవస్థానం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం శని వారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ రూపకల్పనకు విశేష కృషిచేసిన అంబేడ్కర్ వంటి మహనీయుల బాటలో యువత నడవాలని సూచించారు. దేశ ప్రజలకు అనుక్షణం తోడుగా, నీడగా నిలిచిన రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. సమున్నత భారత రాజ్యాంగం చూపిన బాటలో నడిచి స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.రమాదేవి, ఏఎస్డబ్ల్యూ గణేష్, కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025u8లో అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1109 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 3400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 43.9865 టీఎంసీలు. మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. పుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించారు. రామవరప్పాడు: అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెషనల్స్ 14వ వార్షిక సమావేశం శనివారం జరిగింది. ఎనికేపాడులోని విజయ ఫార్మసీ కళాశాల ఇందుకు వేదికై ంది. 7 -
వైభవంగా పైడమ్మ జాతర
నెమలి ఆలయ హుండీ కానుకల లెక్కింపు తిరువూరు: గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేంచేసిన శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానంలో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి శనివారం వరకు ఆలయంలోని ఆరు హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.18,46,236 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ సంధ్య తెలిపారు. బంగారం 10.880 గ్రాములు, వెండి కేజీ 778 గ్రాముల 400 మిల్లీగ్రాములు, 26 యూఎస్ డాలర్లు కూడా సమకూరాయని వివరించారు. కానుకల లెక్కింపును దేవదాయ శాఖ సహాయ కమిషనర్ షన్ముగం, గన్నవరం తనిఖీ అధికారి అనురాధ, శ్రీవేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ కావూరి శశిరేఖ పర్యవేక్షించారు. ముగిసిన అంతర కళాశాలల వాలీబాల్ పోటీలుకేతనకొండ(ఇబ్రహీంపట్నం): జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన అంతర కళాశాలల మహిళల వాలీబాల్ పోటీలు శనివారం ముగిశాయి. ఈ టోర్నీలో 20 కళాశాల క్రీడాకారులు పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో సెయింట్ ఆన్స్ (చీరాల) ప్రథమ స్థానం, సెయింట్ మేరీస్ (చేబ్రోలు) ద్వితీయ స్థానంలో నిలిచాయి. శ్రీవిష్ణు (భీమ వరం), సెయింట్ మేరీస్ (బుడంపాడు) కళాశాల సంయుక్తంగా తృతీయ స్థానం దక్కించు కున్నాయి. విజేతలకు కళాశాల చైర్మన్ ఎం.ఎం. కొండయ్య, కోశాధికారి గౌరీ అమర్నాథ్ జ్ఞాపి కలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ టోర్నీలో సత్తాచాటిన క్రీడాకారులతో యూనివర్సిటీ జట్టును ఎంపిక చేశారు. ప్రిన్సిపాల్ రామ కృష్ణయ్య, జేఎన్టీయూ ఐసీటీ కార్యదర్శి జి.పి.రాజు, పీడీలు శివశంకర్, వి.వి.మురళీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు అవసరం మచిలీపట్నంఅర్బన్: ఐదేళ్ల లోపు ప్రతి చిన్నా రికీ పోలియో చుక్కలు వేయించడం అత్యంత అవసరమని కృష్ణా జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పల్స్ పోలియో శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకుండా ఉండేందుకు పల్స్ పోలియో రెండు విడతలు కీలకమని డాక్టర్ యుగంధర్ తెలిపారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమచంద్ మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, జాగ్రత్తలు, ఫీల్డ్ స్థాయి చర్యలను వివరించారు. ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు అందేలా బూత్ స్థాయిలో సిబ్బంది సమన్వయం తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు, డాక్టర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన నిరసన సంతకం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు తమ సంతకాల ద్వారా నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి పెద్ద విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి సంతకాలు చేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 60 వేల సంతకాలు సేకరించాలని వైఎస్సార్ సీపీ నాయకులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. శనివారం సాయంత్రానికి జిల్లాలో 4.11 లక్షల మంది ప్రజలు సంతకాలు చేశారు. ప్రజల స్పందనను చూస్తుంటే ఈ నెల 13వ తేదీ నాటికి లక్ష్యానికి మించేలా ఉందని ఆయా నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్చార్జులు పేర్కొంటున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులతో పాటు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు సంతకాల సేకరణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా సంతకాల సేకరణను ముమ్మరం చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో.. కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తమ సంతకాల ద్వారా వ్యతిరేకిస్తున్నారని తన్నీరు తెలిపారు. శనివారం నాటికి 60 వేలకు పైచిలుకు సంతకాలు సేకరించా మని తెలిపారు. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగ్గయ్య పేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజావ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. వత్సవాయి మండలంలోని ఆళ్లూరు పాడు గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం శనివారం జరిగింది. నందిగామ నియోజకవర్గంలో.. నందిగామ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ సారధ్యంలో సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 52 వేల సంతకాల సేకరణ జరిగింది. కంచికచర్ల నెహ్రూబొమ్మ సెంటర్లో శనివారం సంత కాల సేకరణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ.. ప్రజారోగ్య వ్యవస్థను కాపాడాల్సిన ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని దూరం చేస్తోందని విమర్శించారు. పీపీపీ విధానంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. కంచికచర్ల మండలంలోని పరిటాల ముత్త వరపు వెంకటేశ్వరరావు ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం విద్యార్థుల సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ ఎ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సారధ్యంలో రికార్డు స్థాయిలో 95 వేల సంతకాలు సేకరించారు. సంతకాల సేకరణ కార్యక్రమం ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే నవంబర్ 20వ తేదీ నాటికే లక్ష్యానికి మించి సంతకాల సేకరణ జరిగింది. అందుకు ప్రజల నుంచి లభించిన ఆదరణే నిదర్శనంగా చెప్పవచ్చు డివిజన్ల వారీగా పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. దేవినేని అవినాష్ నిరంతర పర్యవేక్షణ, ప్రజల నుంచి ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో లక్ష్యానికి మించి సంతకాలు సేకరణ సాధ్యమైంది. -
రబీకి ఎరువులు సిద్ధం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సన్నద్ధత చర్యల్లో భాగంగా రబీ సీజన్కు అవసరమైన వివిధ రకాల ఎరువులను సిద్ధంగా ఉంచుతున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి జిల్లాలో రబీకి ఎరువుల అవసరం, లభ్యత, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ లక్ష్మీశ శనివారం మీడియాతో మాట్లాడారు. రబీలో 33,765 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరు గుతుందన్న అంచనాలకు అనుగుణంగా ఎరువుల సరఫరా ప్రణాళికను అమలుచేస్తున్నా మని తెలిపారు. డిసెంబర్ నెలకు 17,812 టన్నుల ఎరువులు అవసరం ఉండగా ప్రస్తుతం 27,542 టన్నుల ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రైతులు భూసార పరీక్షల కార్డుల ఆధారంగా, అధికారుల సూచనలు మేరకు, శాసీ్త్రయ దృక్పథంతో ఎరువులను ఉపయోగించాలని పేర్కొన్నారు. ఎరువుల విషయంలో అపోహ లను నమ్మకుండా ఏ సమాచారం కావాలన్నా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్కు కాల్ చేయా లని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025u8లో డ్రగ్స్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. 7ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి గుంటూరు కృష్ణ నగర్కు చెందిన మట్ట శ్రీనివాస్, జయలక్ష్మి, పద్మావతి రూ. 1,01,116 విరాళాన్ని ఈవో శీనానాయక్కు అందజేశారు. జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14 రగ్బీ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర బాల, బాలికల జట్లను ఎస్జీఎఫ్ పరిశీలకుడు కిరణ్ శుక్రవారం ప్రకటించారు. -
ఉత్సాహంగా యువజనోత్సవం
ఆలోచింపజేసిన విద్యార్థుల ప్రదర్శనలువన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా విశ్వవిద్యాలయం కృష్ణతరంగ్–2025 పేరుతో నిర్వహిస్తున్న అంతర్ కళాశాలల యువజనత్సోవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గురువారం ప్రారంభమైన యువజనోత్సవాలు రెండో రోజు శుక్రవారం విద్యార్థులు కళాప్రదర్శనలతో సర్వత్రా ఆకట్టుకున్నాయి. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని వివిధ వేదికలపై ఈ పోటీలు కొనసాగాయి. యువజనోత్సవాల పోటీల్లో వివిధ కళాశాలల నుంచి హాజరైన విద్యార్థులు తమ ప్రతిభతో అలరించారు. ఏకాంకికలు, జానపద బృంద నాట్యాలు, క్రియేటివ్ కొరియోగ్రఫీ, లలితసంగీతం, రంగోలి తదితర పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆద్యంతం.. ఆసక్తికరం.. వివిధ సామాజికాంశాలతో రూపొందించిన కళారూపాలు అలరించటమే కాకుండా ఆలోచింపజేశాయి. ప్రధానంగా సమాజంలో మనుషులను మనుషులే చంపుతుంటే తోటివారు చోద్యం చూస్తున్నారంటూ విద్యార్థులు మానవ సమాజంలో ఉన్న రుగ్మతలను తమ ప్రదర్శనలతో ఎత్తి చూపారు. అలాగే దేశభక్తి ప్రబోధంగా సాగిన నృత్యాలు, ఇతర ప్రదర్శనలు అలరించాయి. వాటితో పాటుగా తెలుగునాట ఉన్న పలు జానపద కళారూపాలను సైతం విద్యార్థులు అత్యంత రమణీయంగా ప్రదర్శించారు. వాటితో పాటుగా లలిత సంగీతం, రంగోలి తదితర అంశాల్లోనూ విద్యార్థులు తమ అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, విద్యాసంస్థల్లో సెల్ఫోన్ల వినియోగం వంటి అంశాలపై వక్తృత్వం, డిబేట్ పోటీలను నిర్వహించారు. -
తిన్నోళ్లకు తిన్నంత
తళుకుల మాటున కల్తీమాయ ● ఆహారంలో మితిమీరి రంగులు వాడుతున్నట్లు నిర్ధారణ ● ఫుడ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు ● ల్యాబ్ పరీక్షల్లోనూ ఆ ఆహారం సురక్షితం కాదని నివేదిక ● గతంలో నిల్వ మాంసం కూడా గుర్తించిన వైనం ● అవి తింటే క్యాన్సర్కు దారితీయొచ్చంటున్న వైద్యులు లబ్బీపేట(విజయవాడతూర్ఫు): తినే ఆహారం కంటికి ఇంపుగా కనిపించేందుకు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మాంసాహార వంటకాల్లో సింథటిక్ కలర్స్(రసాయనాలు)ను మితిమీరి వాడుతున్నారు. నిల్వ ఉంచిన మాంసంలో సింథటిక్ రంగులు కలిపిన ఆహారాన్ని వ్యాపా రులు విక్రయిస్తుంటే.. ప్రజలు లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. ఇటీవల డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. తినేందుకు సురక్షితం కానీ ఆహారంగా లేబొరేటరీ ఇచ్చిన నివేదికల్లో వెల్లడైంది. ● ఫుడ్ కంట్రోల్ అధికారులు ఇటీవల పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భాగంగా నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు, ఫుట్స్టాల్స్ను తనిఖీ చేసి 40 శాంపిల్స్ను సేకరించారు. ఆ శాంపిల్స్ను పరీక్షల కోసం లేబొరేటరీకి పంపగా, 20 శాంపిళ్లలో కల్తీ జరిగినట్లు నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. వాటిలో 3 శాంపిల్స్ నాణ్యత లోపం ఉన్నట్లు తెలుపగా, మరో 17 శాంపిల్స్ సురక్షితమైన ఆహారం కాదని రిపోర్టుల్లో పేర్కొన్నారు. దీంతో వారందరిపై ఫుడ్ కంట్రోల్ అధికారులు కేసులు నమోదు చేశారు. ● పదిరోజుల కిందట బీఆర్టీఎస్ రోడ్డు, ఐజీఎం స్టేడియం రోడ్డుల్లోని ఫుడ్ కోర్టుల్లో ఫుడ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో బీఆర్టీఎస్ రోడ్డులో 50 కేజీలు, ఐజీఎం స్టేడియం రోడ్డులో 70 కేజీలు బిర్యానీల్లో మితిమీరిన సింథటిక్ రంగులు వాడినట్లు గుర్తించారు. ● అంతేకాదు గతంలో నిర్వహించిన తనిఖీల్లో హోటళ్లలో ఏకంగా వంద కేజీల నిల్వ మాంసా న్ని ఫుడ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు రంగు, రుచి కోసం సింథటిక్ కలర్స్ను మితిమీరి వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అలాంటి ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బయట కల్తీ ఆహారం తినే వారిలో పేగు పూతలు, సరిగ్గా జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రైటిస్, ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి(ఐడీబీ), వాంతులు, విరేచనాలు వంటివి రావచ్చంటున్నారు. దీర్ఘకాలంలో క్యాన్సర్కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే నగరంలోని జీర్ణకోశ వ్యాధుల నిపుణులు ఎక్కడ చూసినా బిజీగా ఉంటున్నారు. వారి వద్దకు రోగులు క్యూ కడుతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు ఆస్పత్రులకు తరచూ ఫుడ్ పాయిజన్ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అందుకు బయటి ఆహారమే కారణం అంటున్నారు. జీర్ణకోశ వ్యాధులకు ఆహారపు అలవాట్లే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో నగరంలో పెద్దపేగు వ్యాధులు కూడా పెరిగాయి. అందుకు కల్తీ ఆహారమే కారణమంటున్నారు. -
వాహన పూజకు వస్తూ... అనంత లోకాలకు
జగ్గయ్యపేట: మరికొద్ది క్షణాల్లో ఆలయానికి చేరుకునే తరుణంలో మృత్యువు కబళించిన ఘటన మండలంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై తిరుమలగిరి ఆర్చి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం కాపుగల్లుకు చెందిన బాలిబోయిన వినయ్ (30) వ్యవసాయ పనులు చేసుకుంటూ రెండు రోజుల క్రితం నూతన ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ట్రాక్టర్కు వాహన పూజ చేసేందుకు ఉదయం ఇంటి నుంచి ట్రాక్టర్ ఇంజిన్తో బయలుదేరాడు. మరికొద్ది క్షణాల్లో ఆలయం వద్దకు చేరుకునే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ట్రాక్టర్ను వెనుకగా ఢీకొట్టటంతో ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగబడింది. ఈ ఘటనలో వినయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న గోవింద నరేష్, చోడవరపు రాధాకృష్ణ, తేజ్ రామ్లకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ అక్కడకు చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. వినయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి వివాహం కాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రభుత్వ తీరుతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తం
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తిరువూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విద్యారంగం అస్తవ్యస్తంగా మారిందని శాసనమండలి మాజీ సభ్యుడు కేఎస్ లక్ష్మణరావు విమర్శించారు. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని, గత రెండేళ్లలో పాఠశాలల్లో చేపట్టిన సంస్కరణల ఫలితంగా 4 లక్షల మంది పాఠశాల విద్యకు దూరమయ్యారన్నారు. 9 రకాల పాఠశాలల వర్గీకరణ కారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బడులు దూరమై చదువు మానేసే పరిస్థితి నెలకొందని, ఈ విధానాన్ని రద్దు చేస్తేనే ప్రభుత్వ పాఠశాలలు పునరుజ్జీవమవుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, వాటి నిర్వహణకు ఎటువంటి నిధులూ కేటాయించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, విద్యార్థులకు రావలసిన ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల ర్యాలీ ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభల ప్రారంభ సందర్భంగా తిరువూరులో విద్యార్థులు ప్రదర్శన జరిపారు. ఫ్యాక్టరీ సెంటర్ నుంచి ప్రధాన రహదారిలో బోస్ సెంటర్ మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు మహాసభలకు విచ్చేశారు. శనివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు తెలిపారు. -
ట్రెజరీ ద్వారా పెన్షన్లు చెల్లించాలి
ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్ల సంఘం డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్లకు ట్రెజరీ ద్వారా (010 పద్దు కింద) పెన్షన్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోన దేవదాసు, వల్లూరు వెంకట రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ తీసుకొని గురుకుల పాఠశాలలతో పాటు స్థానిక సంస్థల పెన్షనర్లకు ట్రెజరీ ద్వారా పెన్షన్లు పొందుతుతున్నారని, గ్రంథాలయ సంస్థ పెన్షనర్లకు కూడా అదేవిధంగా వర్తింపచేయాలన్నారు. దీనివలన ప్రభుత్వానికి అదనపు భారం ఉండబోదని స్పష్టం చేశారు. విజయవాడలోని ఏపీ ఎన్జీవో హోంలో శుక్రవారం రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ పెన్షనర్ల గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలు పెంచారని, దీనిని 2018 జూలై 1కి 2020 డిసెంబర్ లోపు రిటైర్ అయిన ఉద్యోగులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత రోజే జీపీఎఫ్ నిల్వ సొమ్మును, ఎర్న్ లీవ్ వేతన సొమ్మును చెల్లించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మరణించిన సిబ్బంది వారసులకు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక సంఘం కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా కళ్లేపల్లి మధుసూదనరాజు, ప్రధాన కార్యదర్శిగా వల్లూరి వెంకట రమణ, కోశాధికారి పి.వెంకటేశ్వరరావు, కన్వీనర్గా కోన దేవదాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని పార్టీలో వివిధ హోదాలలో నియమించారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా రెడ్డి శ్రీనివాసరావు, సెక్రటరీ యాక్టివిటీగా బత్తుల సాయి కిరణ్కుమార్ రెడ్డి, జిల్లా యూత్ వింగ్ సెక్రటరీగా బొర్రా రాజా, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా జొన్నబోయిన శ్రీనివాసరావు, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా షేక్ వహీదున్నీషా నియమితులయ్యారు. ● వైఎస్సార్టీఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులుగా కేవీఎస్ శర్మ( విజయవాడ సెంట్రల్), కురగంటి విజయ్కుమార్( జగ్గయ్యపేట), బత్తుల కృష్ణ (మైలవరం) నియమితులయ్యారు. ● వైఎస్సార్ సీపీ మైలవరం మండల ప్రధాన కార్యదర్శిగా పొదిల కృష్ణ, మైలవరం మండలం అనుబంధ విభాగ కమిటీల్లో బీసీ సెల్ సెక్రటరీగా పీట్ల రాము, ఎస్సీ సెల్ సెక్రటరీగా కొత్తపల్లి రవీంద్రబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు ఏలూరు రేంజి ఐజీ అశోక్కుమార్ అవనిగడ్డ: డ్రగ్స్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ను ఐజీ అశోక్కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా దారులు, వినియోగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు మానటరింగ్ చేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం ద్వారా గతంలో కంటే డ్రగ్స్ వినియోగం తగ్గిందన్నారు. కృష్ణాజిల్లాలో గతంలో కంటే క్రైం రేటు బాగా తగ్గిందని చెప్పారు. పాత రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించామని, వీరికి ఎప్పటి కప్పుడు కౌన్సెలింగ్ ఇస్తూ సత్ ప్రవర్తనతో మెలిగేలా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం కొంతమంది శిక్షణలో ఉన్నారని వారంతా విధులకు హాజరైతే సిబ్బంది కొరత కొంతవరకూ తగ్గుతుందన్నారు. శిక్షణ పొందిన వారంతా విధుల్లో చేరిన తరువాత ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి పెడతామని ఐజీ తెలిపారు. అనంతరం క్రైం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీ విద్యశ్రీతో పాటు సిఐలులకు ఆయన దిశా నిర్ధేశం చేశారు. తొలుత ఆయన పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. ఆధార్ దుర్వినియోగంతో నకిలీ సిమ్లు అల్లిపురం: సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా విశాఖపట్నం నగర సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కస్టమర్ల ఆధార్ను, బయోమెట్రిక్ వివరాలను దుర్వినియోగం చేసి నకిలీ సిమ్ కార్డులు సృష్టిస్తున్న 10 మంది ముఠా సభ్యులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సిమ్ కార్డుల విక్రయ కేంద్రాల వద్దకు వచ్చే కస్టమర్ల నుంచి ఈ ముఠా చాకచక్యంగా వివరాలు సేకరిస్తోంది. ఐరిస్ లేదా థంబ్ స్కానర్పై సరిగా పడలేదని నమ్మించి, కస్టమర్ల నుంచి రెండోసారి బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటున్నారు. కస్టమర్లకు తెలియకుండానే వారి పేరు మీద రెండో సిమ్ను యాక్టివేట్ చేస్తున్నారు. వాటిని ఉపయోగించి, నకిలీ ఐడీలతో సోషల్ మీడియా ఖాతాలు తెరిచి ఆ ఖాతాలను అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన సైబర్ నేరాలకు పాల్పడే ముఠాలకు విక్రయిస్తున్నారు. పోలీసుల విచారణలో ఈ ముఠాలోని కీలక వ్యక్తులు పట్టుబడ్డారు. నిడదవోలుకు చెందిన ఇద్దరు వొడాఫోన్ డిస్ట్రిబ్యూటర్లు, పెడనకు చెందిన ఐదుగురు, నకిలీ జియో సిమ్ కార్డులు యాక్టివేషన్ చేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
స్క్రబ్ టైఫస్కు భయపడాల్సిన అవసరం లేదు
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్క్రబ్ టైఫస్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆ వ్యాధికి సంబంధించి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి దోమల వలన కలిగే అనర్ధాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇంటి ఆవరణతో పాటు, పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నీటి తొట్టెలు, పూల కుండీలు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు, పాత సామాన్లు, కూలర్లు వంటి వాటిలో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. పాఠశాల సందర్శన ఆమె పర్యటన సమయంలో జక్కంపూడిలోని ఎంపీపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో స్కూలులో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుండగా ఆ సమావేశంలో పాల్గొని పిల్లలకు స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కలిగించారు. ప్రతి గురువారం స్కూల్ పిల్లలకు ఇచ్చే ఐరన్ ఫోలిక్ మాత్రలపై ఆరా తీశారు. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. స్కూలు బయట అపరిశుభ్ర వాతావరణంలో ఈగలు వాలుతూ అమ్ముతున్న తినుబండారాల వ్యాపారులను అలా అమ్మవద్దని హెచ్చరించారు. ఆమె వెంట పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని -
మోతాదుకు మించి వాడేస్తున్నారు
రంగు, రుచి కోసం మాంసాహారంలో మితిమీరిన సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు మేము నిర్వహించిన తనిఖీల్లో గుర్తించాం. ఇటీవల తనిఖీల్లో 40 శాంపిల్స్ సేకరించి ల్యాబ్పరీక్షల కోసం పంపగా, 20 శాంపిల్స్లో కల్తీ జరిగినటుల నిర్ధారణ అయింది. వాటిలో 17 సురక్షితమైన ఆహారం కాదని తేల్చారు. వారందరిపై కేసులు నమోదు చేశాం. హోటల్స్లో కానీ, ఎక్కడైనా ఆహారం కల్తీ అయినట్లు గుర్తిస్తే ప్రజలు మాకు ఫిర్యాదు చేయవచ్చు. ఫుడ్ లైసెన్స్ లేకుండా హోటల్, రెస్టారెంట్లు, ఫుట్స్టాల్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – బి. శ్రీనివాసరావు, ఫుడ్ కంట్రోల్ అధికారి, విజయవాడ -
గాయని సుశీలకు పురస్కారం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ సహకారంలో రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన నగర వాసులను ఆకట్టుకుంటుంది. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనను శుక్రవారం తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల పూల మొక్కలు, వైవిధ్య భరితమైన పుష్పాలు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఢిల్లీకి చెందిన ప్రముఖ బోన్సాయ్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో బోన్సాయ్ మొక్కల ప్రదర్శన ఆకర్షిస్తోంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీపార్థసారథి భాస్కర్, వీఎంసీ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్తో పాటు, సొసైటీ కార్యదర్శి ఘంటసాల లక్ష్మి, స్వామి, పద్మ ప్రియ, సీతా మహాలక్ష్మి, అఖిల పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శివరాజ్కుమార్ దంపతులను ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను చైర్మన్ అందించారు. చైర్మన్ చాంబర్లో శివరాజ్కుమార్ మీడియాతో మాట్లాడారు. గుమ్మడి నరసయ్య బయోపిక్లో నటిస్తున్నానని, దీంతో పాటు రాంచరణ్ సినిమాలో కూడా నటిస్తున్నానన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో దర్శకుడు పరమేశ్వర్ యుగాలేతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో రెండు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిద్దరూ జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రికి రాగా, వారికి స్క్రబ్ టైఫస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. జి. కొండూరుకు చెందిన రెండున్నరేళ్ల బాబు పాత ప్రభుత్వాస్పత్రిలోని పిల్లల విభాగంలో చికిత్స పొందుతుండగా, కంచికచర్లకు చెందిన 45 ఏళ్ల మహిళ కొత్తాస్పత్రి జనరల్ మెడిసిన్ వార్డులో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ రహదారి–65పైనే ప్రమాదాలు, మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని, వీటిని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. గతేడాదితో పోలిస్తే 2025లో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా రహదారి భద్రతా కమిటీ (డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ) సమావేశం జరిగింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో కలసి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ 2024లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 1343 ఉండగా, ఈ ఏడాది 918 జరిగాయన్నారు. మరణాలు 432 నుంచి 317కి తగ్గాయన్నారు. వివిధ శాఖల సమన్వయంతో కలిసి చేపట్టిన చర్యల వల్ల ఈ పురోగతి సాధ్యమైందన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో మూడోవంతు ప్రమాదాలు, మరణాలు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని చెప్పారు. జాతీయ రహదారి ఎన్హెచ్ 65 లో 58 శాతం ప్రమాదాలు, 41 శాతం మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. రహదారులపై వేగ పరిమితులను (స్పీడ్ లిమిట్స్) తెలిపే సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహనాలను నియంత్రించాలని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్షించిన వారికి ఇబ్బందులేమీ ఉండవు రోడ్డు ప్రమాదాలలో బాధితులను రక్షించిన వారిపై (గుడ్ సమారిటన్) ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయరని, పోలీసు విచారణ పేరిట ఇబ్బందులు ఉండవని చెప్పారు. అలాంటి ప్రాణదాతలను సత్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రహదారి ప్రమాదాల నివారణలో ఎన్జీవోలు భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ భవానీపురం, ఇబ్రహీంపట్నం, పటమట, కంచికచర్ల, కృష్ణలంక పోలీస్ స్టేషన్ల పరిధిలో అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. బస్టాండ్, బెంజ్ సర్కిల్, రామవరప్పాడు మొదలైన ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలన్నారు. తరచూ ప్రమాదాలు సంభవించే బ్లాక్ స్పాట్స్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. పౌరులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి కొత్త యాప్ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులలో శిక్షల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. వచ్చే ఏడాది ప్రమాదాల సంఖ్య మరింత తగ్గించాలన్నారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, డీసీపీ (ట్రాఫిక్) షేక్ షెరీన్ బేగం, డీఆర్ఎస్సీ సభ్య కార్యదర్శి, ఆర్ అండ్ బీ ఎస్ఈ జీవీ భాస్కరరావు, డీపీఓ లావణ్య, డీఈవో సుబ్బారావు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్ తదతరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చిల్లకల్లు(జగ్గయ్యపేట): తల్లిదండ్రులు పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీచర్స్ పేరంట్స్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు. పాఠశాలల్లో మంచి ఫలితాలు రావాలంటే నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యాభివృద్ధికి కృషి.. 20 అంశాల కార్యక్రమ అమలు, వికసిత ఏపీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ పల్లపు సీతమ్మ, ఇన్చార్జ్ తహసీల్దార్ మనోహర్, ఎంపీడీవో నితిన్, ఎంఈవో చిట్టిబాబు, హెచ్ఎం రమణ పాల్గొన్నారు. -
జీర్ణకోశ వ్యాధులు..
మా వద్దకు తరచూ బయటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్కు గురైన వారు వస్తుంటారు. అంతేకాదు ఇటీవల కాలంలో అన్ని వయస్సుల వారు జీర్ణకోశ వ్యాధులకు గురవుతున్నారు. అందుకు ఆహార నియమాలు పాటించక పోవడం, బయటి ఆహారం తినడమే కారణం. సురక్షితం కానీ ఆహారం తినడం మానుకోవాలి. సింథటిక్ రంగులు కలిసిన ఆహారం తినడం వల్ల జీర్ణకోశ వ్యాధులు ప్రబలి, అవి దీర్ఘకాలంలో క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాలి. – డాక్టర్ చింతా వీర అభినవ్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, విజయవాడ -
బీరు సీసాతో పొడిచి యువకుడి హత్య
చిల్లకల్లు (జగ్గయ్యపేట): పాతకక్షలు, గంజాయి వివాదం నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలో గురువారం రాత్రి ఒక యువకుడి హత్య జరిగింది. అలవాల నవీన్రెడ్డి (29)ని అతడి స్నేహితుడు పిల్లా సాయి హత్య చేశాడు. వీరిద్దరూ విజయవాడకు చెందినవారు. స్థానికులు తెలిపిన మేరకు... విజయవాడ భవానీపురం ప్రాంతానికి చెందిన నవీన్రెడ్డి అలియాస్ మూడ్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు చెప్పి నాలుగు నెలల కిందట చిల్లకల్లు మసీదు కాంప్లెక్స్లో గది అద్దెకు తీసుకున్నాడు. అతడిపై సస్పెక్ట్ షీట్ ఉంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన అతడి స్నేహితుడు, రౌడీషీటర్ పిల్లా సాయి రెండునెలల కిందట ఇదే కాంప్లెక్స్లో మరో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. చిల్లకల్లు బీసీ కాలనీకి చెందిన తాళ్లూరి గోపి, ఉప్పుతోళ్ల రాజు, అగన్యా వీరిద్దరికీ స్నేహితులయ్యారు. రోజూ రాత్రిళ్లు వీరు పార్టీలు చేసుకునేవారు. గురువారం పిల్లా సాయి పుట్టినరోజు కావడంతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ద్విచక్ర వాహనాలపై ఐదుగురు స్నేహితులు ధర్మవరప్పాడుతండా గ్రామంలోని రామ్కో సిమెంట్స్ కర్మాగారం వెనుక పంట పొలాల్లో చప్టా వద్ద పార్టీ చేసుకున్నారు. అక్కడ నవీన్రెడ్డి, పిల్లా సాయి మధ్య పాతకక్షలకు సంబంధించిన వివాదం తలెత్తింది. మద్యం మత్తులో పరస్పరం దాడి చేసుకున్నారు. సాయి బీరు సీసాను పగలగొట్టి నవీన్రెడ్డిని తీవ్రంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో నవీన్రెడ్డి కుప్పకూలాడు. వెంటనే సాయి, అగన్యా బైక్పై నవీన్రెడ్డిని ఎక్కించుకుని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రి వద్దకు తీసుకొచ్చి ఆస్పత్రి వరండాలో పడేసి పరారయ్యారు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించటంతో సీఐ వెంకటేశ్వర్లు, చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్యశ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నవీన్రెడ్డి మృతి చెందాడు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. వీరి స్నేహితులు తాళ్లూరి గోపి, ఉప్పుతోళ్ల రాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోతముక్క ఆడుతున్న 8 మంది అరెస్టు పెనమలూరు: మండలంలోని కానూరులో కోతముక్క ఆడుతున్న 8 మంది వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పెనమలూరు ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం కానూరు మహదేవపురం కాలనీ వద్ద కోతముక్క ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా కోతముక్క ఆడుతున్న 8 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద రూ.2.26 లక్షలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
రాజకీయ వేదికగా మారిన మెగా పీటీఎం3.0
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పీటీఎం 3.0 పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తుతూమంత్రంగానే కొనసాగాయి. ఎన్టీఆర్ జిల్లాలోని 914, కృష్ణా జిల్లాలో 1,317 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమావేశాలను నిర్వహించారు. దాదాపుగా అన్ని పాఠశాల్లోనూ ఈ సమావేశాలు నిర్వహించినా వాటిల్లో ఎక్కడా పూర్తి స్థాయిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కానరాలేదు. అలాగే జరిగిన సమావేశాల్లో స్థానికంగా ఉన్న సమస్యలపై ఎవరూ ఏమీ స్పందించకపోవటం తల్లిదండ్రులను విస్మయానికి గురి చేశాయి. ‘నాడు–నేడు’ గురించి ప్రస్తావన లేదు.. ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 500 పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. దాదాపుగా నిధులు సైతం అందజేసింది. అరకొరగా ఉన్న పనులను పూర్తి చేయటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలు దాటినా ఇప్పటి వరకూ వాటి ప్రస్తావన లేదు. తాజాగా తల్లిదండ్రుల సమావేశాల్లో వాటి గురించి ప్రస్తావన ఉంటుందని హాజరైన వారంతా ఆశించారు. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడకపోవటంతో నిరాశగా వెనుదిరిగారు. తల్లిదండ్రుల అనాసక్తి.. మెగా పేరంట్స్ సమావేశాల్లో ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా తల్లిదండ్రుల హాజరు 20 నుంచి 30 శాతం సైతం దాటలేదు. సమావేశాలకు పూర్తి స్థాయిలో తల్లిదండ్రుల హాజరు కాకపోవటంతో ఉపాధ్యాయులు వచ్చిన వారితోనే మాట్లాడి ఫొటోను అప్లోడ్ చేశారు. ప్రధానంగా స్థానిక ప్రజాప్రతినిధులు హాజరైన సమావేశాలకు సైతం తల్లిదండ్రులు హాజరు పూర్తి స్థాయిలో కనపడలేదు. విజయవాడ పాతబస్తీలో స్థానిక శాసనసభ్యుడు హాజరుకాలేదు. ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు గాంధీజీ మునిసిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 67వేల మంది తల్లిదండ్రులు, 73,889 మంది విద్యార్థులు హాజరైనట్లుగా హడావుడిగా ప్రకటించింది. రాజకీయ ఉపన్యాసాలకే పరిమితం.. చాలాచోట్ల సమావేశాలకు కూటమి నాయకులు ఎటువంటి హోదా లేకపోయినా హాజరై హడావుడి చేశారు. వచ్చిన నాయకులు కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే ఎక్కడా నాడు–నేడు కింద ఆగిపోయిన పనులు, ఉపాధ్యాయుల కొరత వంటి అంశాలపై ప్రస్తావించిన దాఖలాలు లేవు. దాదాపుగా నాయకులందరూ చంద్రబాబు, పవన్కల్యాణ్, నారా లోకేష్లను పొగుడుతూ ప్రసంగాలు చేస్తూ హడావుడి చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాల్లో తప్పనిసరిగా వచ్చిన వారికి మధ్యాహ్న భోజనం పథకంలోని భోజనాలను వడ్డించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అరకొర నిధులే కేటాయించింది. దాంతో ఎక్కడా పాఠశాలల్లో భోజనం చేసిన దాఖలాలు కనపడలేదు. ఎన్టీఆర్ జిల్లాలో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి రెండు పాఠశాలల్లో మినహా ఎక్కడా తల్లిదండ్రులు భోజనాలు చేయలేదు. అలాగే తల్లిదండ్రులకు వేరువేరుగా వివిధ పోటీలను నిర్వహించాల్సి ఉంది. అవి కూడా ఎక్కడా పూర్తి స్థాయిలో జరగలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ సమావేశాలు ఆసక్తి చూపని తల్లిదండ్రులు విద్యార్థులు, స్థానిక రాజకీయ నాయకులతో కొనసాగింపు చాలా చోట్ల భోజనాలు లేవు ‘నాడు–నేడు’, ఇతర వసతులపై ప్రస్తావనే లేదు -
అండర్–14 రగ్బీ రాష్ట్ర జట్ల ఎంపిక
గన్నవరం: జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14 రగ్బీ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర బాల, బాలికల జట్లను ఎస్జీఎఫ్ పరిశీలకుడు కిరణ్ శుక్రవారం ప్రకటించారు. గన్నవరంలో రెండు రోజుల పాటు జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాల, బాలికలను రాష్ట్ర జట్లకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. భువనేశ్వర్లో ఈ నెల రెండవ వారంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని తెలిపారు. బాలుర జట్టు.... ఎ.అరుణ్, టి. నరసింహులు, కె.మధు (కర్నూలు), టి.ప్రభుకిరణ్, బి. అమరకుమార్ (కృష్ణా), షేక్ అబిబుల్ రెహమాన్, యు.విశ్వమిత్ర (కడప), కె.సంతోష్ (నెల్లూరు), వి.హేమంత్(తూర్పు గోదావరి), బి.పవన్ (పశ్చిమ గోదావరి), ఎం.సుబ్రహ్మణ్యం(చిత్తూరు), ఎం.హర్షవర్ధనరాజు (గుంటూరు), మరో ఐదుగురు స్టాండ్బై. బాలికల జట్టు.... పల్లూరి జ్యోతిప్రియ, షేక్ హుస్సేన్బీ, గొల్ల వర్షిత (కర్నూలు), దుక్కా వర్షిణి, భీమశెట్టి పుణ్యవతి (విశాఖపట్నం), రావిపాటి దివ్య (గుంటూరు), కొణతం శ్రీదుర్గా మహాలక్ష్మి (తూర్పు గోదావరి), కెల్లా తనూష, బూసిరాజు భావన(కృష్ణా), వరదరాజు వర్షిత (పశ్చిమ గోదావరి), కోన లోహిత (శ్రీకాకుళం), మరో ఐదుగురిని స్టాండ్బైగా ఎంపిక చేశారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ ముత్యాలంపాడుకు చెందిన పాములపాటి నరేంద్ర, శ్వేత అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116ల విరాళాన్ని సమర్పించారు. ఎస్ఎంసీని సందర్శించిన డబ్ల్యూహెచ్ఓ బృందం లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలను జెనీవా నుంచి వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), వరల్డ్ డయాబెటీస్ ఫౌండేషన్(డబ్ల్యూడీఎఫ్) బృందాలు గురువారం సందర్శించాయి. ఈ సందర్భంగా కళాశాలలోని ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అనుసరిస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, వివిధ ప్రొటోకాల్స్పై విస్తృతంగా చర్చ జరిగింది. ఆయా విభాగాల పనితీరును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు వారికి వివరించారు. ఇక్కడ అనుసరిస్తున్న వ్యవస్థీకృత విధానంపై ప్రపంచ బృందాలు ప్రశంసలు వ్యక్తం చేశాయి. ఇక్కడి యూనిట్లో అనుసరిస్తున్న ప్రొటోకాల్ను జెనీవాలో జరగనున్న సమావేశంలో ఉత్తమ మోడల్గా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆశా పర్వీన్ సమన్వయంతో విజయవంతం చేశారు. 18 నుంచి రాష్ట్ర యువజనోత్సవాలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా యువజన మహోత్సవం యువ –2025 నిర్వహిస్తున్నట్లు యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్.భరణి తెలిపారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో గురువారం రాష్ట్ర యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర యువజన మహోత్సవం యువ– 2025 నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ ఈ నెల 18, 19, 20 తేదీలలో వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి యువజన మహోత్సవాలను ‘యూత్ ఫర్ స్వర్ణాంధ్ర‘ థీమ్తో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ థీమ్ యువత ఆలోచనలు, ప్రతిభ, సృజనాత్మకత రాష్ట్ర అభివృద్ధికి ఎంత ముఖ్యమో తెలియజేస్తుందన్నారు. ప్రతి యేటా జిల్లా, రాష్ట్ర యువజన ఉత్సవాలను నిర్వహించి తద్వారా రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించిన విజేతలను ఢిల్లీలో నిర్వహించే జాతీయ యువ జన ఉత్సవాలకు పంపుతామన్నారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల యువతకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన ప్రథమ బహుమతి విజేతలు రాష్ట్ర స్థాయిలో జరిగే ఈవెంట్లలో పాల్గొంటారన్నారు. అన్ని జిల్లాల నుంచి దాదాపు 700 మంది యువత పోటీల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. జానపద నృత్య బృందం, జానపద పాటల బృందం, పెయింటింగ్, ప్రకటన, కవితా రచన, కథా రచన, ఆవిష్కరణ (సైన్స్ మేళా ప్రదర్శన) ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు సర్టిఫికెట్, జ్ఞాపిక అందజేస్తామన్నారు. అనంతరం యువజన మహోత్సవం యువ –2025 ఈవెంట్ కర్టెన్ రైజర్ను ఆవిష్కరించారు. సమావేశంలో ఏపీ యూత్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల సీఈవో యు.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
బెజవాడలో వారాహి శిల్క్స్ షోరూమ్ ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద వస్త్ర నందనం వారాహి శిల్క్స్ ఐదవ షోరూమ్ విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ఏర్పాటైంది. ఈ షోరూమ్ను గురువారం సినీ హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వారాహి సిల్క్స్ మేనేజింగ్ డైరెక్టర్లు మణిదీప్ యేచూరి, డాక్టర్ స్పందన మద్దుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ వస్త్ర ప్రపంచంలోకి అడుగు పెట్టడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, వివాహాది వేడుకలకు కావాల్సిన అన్ని రకాల సంప్రదాయ, ఆధునికత మేళవించిన విస్తృత శ్రేణి, విభిన్నమైన ఆకర్షణీయ వస్త్రాలు లభిస్తాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి రూ.10 వేలు కొనుగోలుపై బంగారు నాణెం, రూ.15 వేలు కొనుగోలుపై బంగారు, వెండి ఉచితంగా అందిస్తామన్నారు. అంతేకాక రూ.1500 ఓచర్ ఇస్తామని, ఈ అవకాశం ఈ నెల 4 నుంచి 14 వరకు ఉంటుందన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా లక్కీడ్రా నిర్వహించి విజేతలకు ఐఫోన్ బహుకరించారు. ద్వితీయ బహుమతిగా 500 గ్రాముల వెండి అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
త్వరలో మరో ఏడు కొత్త ఇసుక రీచ్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో కొత్తగా ఏడు ఇసుక రీచ్లు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఆరవ జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం వర్చువల్గా జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక, పట్టా భూముల్లో ఇసుక తొలగింపు, కొత్త రీచ్లకు సంబంధించి అనుమతుల ప్రక్రియ, తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా కాకుండా తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం తొమ్మిది రీచ్ల పరిధిలో 7.27 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. కృష్ణా, మున్నేరు పరిధిలో జగ్గయ్యపేట మండలంలో రెండు, చందర్లపాడు మండలంలో రెండు, కంచికచర్ల మండలంలో 3 కొత్త రీచ్లకు సంబంధించిన ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. పట్టా భూముల్లో మేట వేసిన ఇసుక తొలగింపునకు 34 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 26 దరఖాస్తులను కమిటీ ఆమోదించినట్లు తెలిపారు. రెండు దరఖాస్తులకు ఇప్పటికే పర్యావరణ అనుమతులు వచ్చాయని, త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అక్రమ రవాణాకు సంబంధించి 248 కేసుల నమోదుతో పాటు 440 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు కమిటీకి వివరించారు. సమావేశంలో జిల్లా జేసీ ఎస్.ఇలక్కియ, మైనింగ్ డీడీ శ్రీనివాసరావు, సమన్వయ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మమ..అనిపించారు!
రైతన్నా..మీకోసం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మరో డ్రామాకు తెరతీసింది. వైఎస్సార్ సీపీ పాలనలో పండగ లాంటి వ్యవసాయాన్ని ఈ ఏడాదిన్నర పాలనలో దండగలా మార్చి చంద్రబాబు తన మార్కు పాలన మళ్లీ రైతులకు చవిచూపించాడు. వరి, మిర్చి, పత్తి, వేరుశనగ, అరటి, టమోటా ఇలా ఏ రైతును కదిపినా కన్నీటి సంద్రమే. ఆర్బీకే వ్యవస్థను నీరుగార్చి, పంటల బీమాకు ఎసరు పెట్టి, ప్రకృతి వైపరీత్యాలకు పరిహారం ఊసే మరిచిన బాబు ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని రైతన్నా..మీకోసం అంటూ వస్తుందని రైతులు తూర్పారపడుతున్నారు. రైతుల ఎదుట పడే ధైర్యం లేక అధికారులు, ప్రజాప్రతినిధులు ఏదో మొక్కుబడిగా కార్యక్రమం కానిచ్చి చేతులు దులుపుకొన్నారు. నష్టపోయిన రైతులకు మేలు చేయడం చేతకాదు కానీ రైతన్నా మీ కోసం అంటూ గొప్పులు చెప్పుకోవడానికి బయలుదేరారు. నేను గత ప్రభుత్వంలో కౌలు రైతుగా రైతు భరోసా అందుకున్నాను. పత్తి పంట నష్టపోతే రెండు విడతలుగా రూ.80వేలు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుగా రైతు భరోసా లేదు. ఈ ఏడాది నాలుగున్నర ఎకరాలు పత్తి సాగు చేసి నష్టపోయాను. –రమావతు శ్రీను, రైతు, మునగపాడు సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొక్కుబడిగా సాగింది. ఏడాదిన్నర పాలనలో రైతులకు చేసింది ఏమీ లేదు. పైగా విపత్తుల వేళ ఆదుకోకుండా గాలికి వదిలి వేశారు. దీంతో ఎక్కడ నిలదీస్తారోననే భయంతో రైతుల ముందుకు వెళ్లే ధైర్యం లేక మంత్రి, ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని భావించిన ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని తమతమ నియోజకవర్గాల్లో తూతూ మంత్రంగా నిర్వహించి మమ అనిపించారు. సాక్షాత్తూ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఘంటశాలలో రైతన్నా...మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నా, రైతులతో కలిసి నేరుగా మమేకం కాకుండా, వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి వెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, ప్లకార్డులు, కరపత్రాలు పట్టుకుని ఫొటోకు ఫోజులు ఇచ్చి తంతు ముగించారు. గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల వద్దకు తమ సానుభూతిపరులను పిలిపించుకుని ఫొటోలు దిగి మమ అనిపించారు. ఏపీఏఐఎంఎస్ (ఏపీ వ్యవసాయ, సమాచార, నిర్వహణ వ్యవస్థ )యాప్ను రైతుల ఫోన్లో ఇన్స్టాల్ చేసే బాధ్యతను ఆర్ఎస్కే సిబ్బందికి అప్పగించారు. తొలిరోజు హడావిడి చేసినా... మరునాటి నుంచి ప్రజా ప్రతినిధులు పత్తా లేకుండా పోయారు. సిబ్బంది తమకున్న పరిచయాలతో కొంతమంది రైతులకు యాప్ ఇన్స్టాల్ చేసి మమ అనిపించారు. పంచసూత్రాల్లేవ్... ‘‘నేను మీ రైతు బిడ్డనే రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం తెలుసు, మీతో కలిసి నడవడానికి, మీసమస్యలు పరిష్కరించడానికి, మీకు పూర్తిగా అండగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతం అయిందని గొప్పలు చెప్పుకోవడం తప్ప, క్షేత్ర స్థాయిలో ఆ కార్యక్రమం పూర్తిగా ఫెయిల్ అయిందనే భావన టీడీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. అధ్వానంగా పంట కాలువలు పంట కాలువల్లో కనీసం తూటికాడ, పూడికతీత, మరమ్మతులు చేపట్టక పోవడంతో నీరు పుష్కలంగా ఉన్నా చివరి ఆయకట్టు రైతులు నీరందక ఇబ్బందులు పడ్డారు. పెడన, అవనిగడ్డ ప్రాంతంలో ఇంజిన్ల ద్వారా పంట పొలాలను తడుపుకొనే దుస్థితి నెలకొంది. పంటలకు కనీస మద్దతు ధర లబించటం లేదు. సబ్సిడీ విత్తనాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వద్దకు వెళితే ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ప్రజా ప్రతినిధులు ముఖం చాటేశారు. మైలవరంలో మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు నామమాత్రంగా నిర్వహించారు. కేవలం రైతు భరోసా కేంద్రాల వద్ద ప్లకార్డులు ప్రదర్శించి, ఫొటోలకు ఫోజులిచ్చి మీడియాలో కథనాలను రాయించుకున్నారు తప్ప రైతుల వద్దకు వెళ్లనేలేదు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ సైతం రైతుల వద్దకు వెళ్లకుండా మైలవరంలో ప్లకార్డులను ప్రదర్శించి వదిలేశారు. తిరువూరులో తిరువూరు నియోజకవర్గంలో రైతన్నా మీకోసం కార్యక్రమం మొక్కుబడి తంతుగా సాగింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఐదు గ్రామాల్లో పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ అనుకూలంగా ఉండే రైతుల వద్దకు మాత్రమే ఎమ్మెల్యే వెళ్లారు. తమకు రైతు భరోసా సొమ్ము రాలేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అందరికీ ఈ పథకం కింద లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. జగ్గయ్యపేటలో నియోజకవర్గంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. రైతుల వద్దకు వెళ్లి తాము చేసిన మంచిని వివరించే ధైర్యం లేక తమకు అనుకూలంగా ఉన్న రైతుల వద్దకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఎక్కడా పాల్గొనక పోవడం గమనార్హం. రైతుల కష్టాలను తీర్చలేని ప్రభుత్వం పబ్లిసిటీ కోసమే చేపట్టిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందిగామలో రైతన్నా మీకోసం కార్యక్రమం నియోజకవర్గంలో మొక్కుబడిగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామలో మినహా నియోజకవర్గంలో ఎక్కడా రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొనలేదు. కేవలం వ్యవసాయ శాఖ అధికారులు మాత్రమే పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొనకుండా కేవలం నేతల అనుయాయులు, టీడీపీకి చెందిన కొంతమంది మాత్రమే పాల్గొని ఆ కార్యక్రమాన్ని మమా.. అనిపించారు. రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉంటే ఆదుకోకుండా రైతన్నా మీ కోసం అంటూ తామేదో గొప్పగా చేసినట్లు ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులు పడే కష్టాలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలి. –గొర్రెపాటి బుల్లియ్య, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. సంచులు, వాహనాల కొరత పట్టి పీడిస్తోంది. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో, రోడ్లపైనే ఉండిపోయింది. దీనికితోడు దిత్వా తుపాను తోడవడంతో, వారం పదిరోజులుగా ధాన్యపు రాసులు అలానే ఉండిపోయాయి. ధాన్యం ఆరబెట్టే అవకాశం లేక పలు చోట్ల ధాన్యం బూజు పట్టి రంగు మారడంతో పాటు, కొన్ని చోట్ల మొలకలు సైతం వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో, రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద 1,56,827 మంది రైతులకు లబ్ధి కలగ్గా, ప్రస్తుత ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం కింద 1.33 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఎన్టీఆర్ జిల్లాలో గత ప్రభుత్వంలో 1.28 లక్షల మందికి లబ్ది కలుగగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అన్నదాత సుఖీభవ పథకం కింద 1.08 మందికి మాత్రమే మేలు చేకూరింది. అన్నదాత సుఖీభవ పథకంలో కూడ కోత విధించింది. -
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా రాజ్యమేలుతోంది
●పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ●రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా రాజ్యమేలుతోందని, గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన పెంచలయ్య హత్య పట్ల ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు అని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు. గంజాయి మాఫియా గూండాల చేతిలో హత్య గావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, డ్రగ్స్, గంజాయిని పూర్తిగా రూపుమాపాలని డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో డీవైఎఫ్ఐ, పీఎన్ఎం, ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి.రామన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్, గంజాయి మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. వారం రోజుల క్రితం నెల్లూరులో డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా యువతను ఏకం చేసి పోరాడిన యువజన నాయకుడు, ప్రజా కళాకారుడు పెంచలయ్యను పట్టపగలు నడి రోడ్డు మీద గంజాయి గ్యాంగ్ అతి కిరాతకంగా నరికి చంపారని చెప్పారు. నిందితులను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపైనే దాడి చేయడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి.. 100 రోజుల్లో డ్రగ్స్ను నిర్ములిస్తాం అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని రామన్న అన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, రౌడీ ముఠాలు ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నాయని చెప్పారు. యువత డ్రగ్స్, గంజాయి వైపు కాకుండా ఆటలు, చదువులు, ఉద్యోగాల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్కుమార్ మాట్లాడుతూ పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారి ఇద్దరి పిల్లలు చదువుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, పెంచలయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువత మంచి సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. తక్షణమే నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చంద్రనాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పొలారి, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఎస్ఎఫ్ఐ నాయకుడు ప్రభాత్, పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బస్సులో నగలు చోరీ చేసిన నిందితురాలి అరెస్ట్
జగ్గయ్యపేటఅర్బన్: ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగ్ను, దానిలో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ.7 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిల్లకల్లు ఎస్ఐ టి.సూర్యశ్రీనివాస్తో కలిసి సీఐ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 2న విజయవాడ నుంచి కంచికచర్ల వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో ఫిర్యాదుదారు శొంఠి అమలేశ్వరి హ్యాండ్ బ్యాగ్ను, అందులో ఉన్న బంగారు ఆభరణాలతో సహా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ ఐపీఎస్ పర్యవేక్షణలో, నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో తాను సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సిబ్బందికి అభినందనలు.. ఫిర్యాదుదారు ప్రయాణించిన బస్సు ఆగిన అన్ని స్టాపుల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా, కంచికచర్ల బస్ స్టాప్ ఇన్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో హ్యాండ్ బ్యాగ్ను పట్టుకొని బస్సు దిగుతున్న మహిళలను గుర్తించినట్లు తెలిపారు. లోకల్ పోలీసుల సహాయంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. బాధితురాలు బస్సులో నిద్రపోతుండగా హ్యాండ్ బ్యాగ్ను తీసుకొని కంచికచర్లలో దిగినట్లు చెప్పిందన్నారు. అనంతరం ఆమె నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు ఆభరణాలను, 8 తులాల వెండి పట్టీలు స్వాధీనం చేసుకొని నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితురాలు కంచికచర్ల మండలం, ఎస్.అమరవరం గ్రామానికి చెందిన పాలపర్తి విశాలాక్షి అని గుర్తించామన్నారు. తక్కువ సమయంలో నిందితురాలిని అరెస్ట్ చేయడంతో పాటు పూర్తి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తనను, చిల్లకల్లు ఎస్ఐలు టి.సూర్యశ్రీనివాస్, ఎస్ఎన్ఎస్.మణికంఠ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అభినందించారని చెప్పారు. -
రోగి మెలకువగా ఉండగానే గుండెకు బైపాస్ సర్జరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): మయాస్థీనియా గ్రేవిస్ అనే వ్యాధితో బాధపడుతున్న 76 ఏళ్ల వ్యక్తి మెలకువగా ఉండగానే గుండెకు బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు విజయవాడలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రమేష్బాబు తెలిపారు. దేశంలోనే ఇలాంటి సర్జరీని తొలిసారిగా తమ ఆస్పత్రిలో విజయవంతంగా చేశామన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రమేష్బాబు మాట్లాడుతూ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న 76 ఏళ్ల వయసు గల విజయవాడకు చెందిన రోగి గుండెకు రక్తం సరఫరా చేసే మూడు ప్రధాన ధమనుల్లో తీవ్రమైన పూడికలు ఉండటంతో పాటు శ్వాసకోశ కండరాలను బలహీనపరిచే మయాస్థీనియా గ్రేవిస్ వ్యాధి కూడా ఉందని చెప్పారు. ఇలాంటి రోగులకు జనరల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. వెంటిలేటర్ అవసరం లేకుండా శస్త్రచికిత్స.. దీంతో అవేక్ బైపాస్ టెక్నీక్ను తమ వైద్యులు ఎంపిక చేసుకుని ఈ నెల ఒకటో తేదీన రోగి మెలకువగా ఉన్నప్పుడే బైపాస్ సర్జరీ చేశారని తెలిపారు. ఈ పద్ధతిలో శస్త్రచికిత్స జరుగుతున్నంతసేపు రోగి స్పృహలోనే ఉన్నారని, స్వయంగా శ్వాస తీసుకున్నారని వివరించారు. థొరాసిక్ ఎపిడ్యూరల్ అనస్థీషియా ద్వారా ఛాతీ భాగానికి మాత్రమే మత్తు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వెంటిలేటర్ అవసరం లేకుండా శస్త్రచికిత్స సజావుగా నిర్వహించినట్లు తెలిపారు. తమ అత్యుత్తమ కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్స్, అనస్థీషియా వైద్యుల బృందం సమన్వయంతో ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందని డాక్టర్ రమేష్బాబు చెప్పారు. -
ఏపీ నాగవంశం కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు బాధ్యతల స్వీకరణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ఎరుబోతు రమణారావు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్లో గురువారం జరిగింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వారితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ రమణారావు మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. విజయవాడలో కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు వివిధ ప్రాంతాలలో కల్యాణమండపాల నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న రమణారావు, డైరెక్టర్లు -
పటిష్ట వ్యవస్థలతోనే అభివృద్ధి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ నందిగామరూరల్: వ్యవస్థలు పటిష్టంగా ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మండలంలోని ఐతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావులతో కలిసి గురువారం ఆయన ప్రారంభించి డీడీఓ జ్యోతికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కీలక ప్రగతి సూచికల్లో అభివృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదలకు అన్ని శాఖల అధికారులు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి అన్ని అంశాల్లో పురోగతికి ప్రజా ప్రతినిధులతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ప్రభుత్వ విప్ సౌమ్య మాట్లాడుతూ.. డీడీఓ కార్యాలయాలు గ్రామాల అభివృద్ధికి ఊతమిస్తాయన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, డీపీవో లావణ్యకుమారి, డీఆర్డీఏ పీడీ నాంచారరావు, డ్వామా పీడీ రాము, పంచాయతీ రాజ్ ఎస్ఈ బాపిరెడ్డి, డీఈ రమేష్, డ్వామా ఏపీడీ లక్ష్మీకుమారి, ఎంపీడీఓలు, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
బందరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పర్యటన
కోనేరుసెంటర్: బందరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు బుధవారం పర్యటించారు. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అక్కడ గ్రామీణ ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. తొలుత చిన్నాపురం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పరిధిలోని రుద్రవరం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్తో పాటు ఆర్. గొల్లపాలెంలోని 104 సర్వీస్లను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నాపురం పీహెచ్సీలో వైద్యసేవల కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు డాక్టర్ అభిషేక్, డాక్టర్ రాధా, డాక్టర్ బోస్భా, డాక్టర్ శ్రావణి, డాక్టర్ అబ్దుల్ వాసే, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ సురేష్ ఉన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయం తరఫున ప్రోగ్రాం అధికారి డాక్టర్ హిమబిందు, ఆయా పీహెచ్సీల వైద్యులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 8 వరకు నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఫల, పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ అధ్యక్షురాలు సూరపనేని ఉషారాణి తెలిపారు. ఆ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ బుధవారం నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సొసైటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం 8వ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రకాలైన పండ్ల మొక్కలు కూడా ఉంటాయన్నారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ బోన్సాయ్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో బోన్సాయ్ మొక్కల ప్రదర్శనతో పాటు బోన్సాయ్ మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తారని చెప్పారు. సొసైటీ కార్యదర్శి ఘంటసాల లక్ష్మి, స్వామి, పద్మ ప్రియ, సీతా మహాలక్ష్మి, అఖిల తదితరు పాల్గొన్నారు. గన్నవరం: జిల్లాలో స్వామిత్వ సర్వేను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం స్వామిత్వ సర్వే పురోగతిపై జిల్లాలోని సర్వేయర్లు, ఆర్ఎస్ డెప్యూటీ తహసీల్దార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వామిత్వ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఎటువంటి పొరపాట్లుకు తావివ్వకుండా జాగ్రత్తగా చేపట్టాలన్నారు. నిబంధనల ప్రకారం గ్రామంలోని ప్రతి ఇంటితో పాటు ఖాళీ స్థలాలకు కూడా పర్సన్ ప్రాపర్టీ నంబర్(పీపీఎన్) కేటాయించాల్సిందేనని సూచించారు. అంతిమంగా పీపీఎన్ల విస్తీర్ణం గ్రామ కంఠం మొత్తం విస్తీర్ణంతో లెక్క సరిపోవాలని చెప్పారు. ఆక్రమణలతో సంబంధం లేకుండా అంతర్గత రహదారులు వంకరలు లేకుండా తిన్నగానే మార్కింగ్ వేసి రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. తహసీల్దారు కె. వెంకటశివయ్య, ఎంపీడీఓ టి. స్వర్ణలత, సర్వేయర్లు పాల్గొన్నారు. తాడికొండ: సీఆర్డీఏ అధికారులు మంగళవారం ఎన్టీఆర్ జిల్లాలోని అక్రమ లే అవుట్లను ధ్వంసం చేశారు. విజయవాడ రూరల్ మండలం పాతపాడులోని సర్వే నంబర్ 114లో 5.50 ఎకరాల భూమిలో అనధికారిక లే అవుట్, సర్వే నెంబర్ 145లోని 1.20 ఎకరాల భూమిలో అనధికారిక లే అవుట్లను ధ్వంసం చేశారు. సీఆర్డీఏ పరిధిలో అనధికారిక లే అవుట్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు. -
మెగా పీటీఎంతో ఇబ్బందులు..
ఈ నెల ఐదో తేదీన ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెగా పీటీఎంను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన నిధులు ఈ సమావేశాలకు ఏమాత్రం సరిపోవు. ప్రధానంగా ఏకోపాధ్యాయ పాఠశాలలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ విద్యాసంస్థలో పని చేసే ఉపాధ్యాయునికి అన్ని రకాలుగా సమస్యలు ఎదురవుతున్నాయి. దానికి తోడు ఈ సమావేశం తేదీని హడావుడిగా ప్రకటించారు. అలాగే ఆరో తేదీ నుంచి పదో తరగతి విద్యార్థుల వంద రోజుల షెడ్యూల్ను ప్రకటించారు. ఇవన్నీ ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. – ఎంవీ మహాంకాళీశ్వరరావు, అధ్యక్షుడు, వైఎస్సార్ టీఏ, కృష్ణాజిల్లా -
చోరీలకు చౌరస్తా!
నిఘా లేని గంగినేని..బ్రిటీష్ కాలం నుంచి దొంగలకు ఇది రాచబాట ● రాష్ట్ర సరిహద్దులోని గ్రామం కేంద్రంగా వరుస దారి దోపిడీలు ● బ్రిటీషు కాలంలో ఈ గ్రామంలోనే ప్రత్యేక పోలీసుస్టేషన్ నిర్వహణ ● చోరీల కోసం నాటి వ్యూహాలనే నేటికీ అనుసరిస్తున్న దొంగలు ● దగ్గరలోని రైల్వే స్టేషన్లను వాడుకుంటున్న వైనం ● గంజాయి సరఫరాకు అనుకూలంగా మార్చుకున్న స్మగ్లర్లు జి.కొండూరు: దట్టమైన అటవీ ప్రాంతం.. పక్కనే చిన్న చిన్న రైల్వే స్టేషన్లు.. రహదారి కూడా సక్రమంగా లేని లోయ గ్రామాలు.. మండల కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరం.. రాత్రయితే నిఘా అంతంతమాత్రం.. దారి కాయడం.. దోపిడీకి పాల్పడటం.. ఏళ్లుగా ఇదే తంతు.. జి. కొండూరు మండలంలోని రాష్ట్ర సరిహద్దు గ్రామమైన గంగినేని వద్ద రాష్ట్ర రహదారిని దొంగలు తమ అడ్డాగా మార్చేసుకున్నారు. బ్రిటీష్ కాలం నుంచి నేటికీ ఈ రాష్ట్ర రహదారి దొంగలకు రాజమార్గంగానే ఉంది. గత ప్రభుత్వంలో ఇసుక, మద్యం, కలప, మట్టి వంటివి ఏవీ కూడా అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు గంగినేని వద్ద స్టేట్ బార్డర్ చెక్పోస్టును ఏర్పాటు చేసి పకడ్బందీగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో అక్రమాలు, చోరీలకు అడ్డుకట్టపడింది. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం చెక్పోస్టులను పూర్తిగా ఎత్తివేయడంతో నిఘా లోపం ఏర్పడి చోరీలకు, అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. రైల్వేస్టేషన్లే అడ్డాలుగా.. ● గంగినేని గ్రామానికి దగ్గరగా ఉన్న తెలంగాణలోని ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ను దొంగలు అడ్డాగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, విజయవాడ ప్రాంతాల నుంచి చోరీ చేసే ముఠాలు సాయంత్రానికి ఎర్రుపాలెం రైల్వేస్టేషన్కు చేరుకొని అర్ధరాత్రి వరకు ఆ పరిసర ప్రాంతాలలో వేచి ఉంటారు. ఆ తర్వాత చోరీ చేయాలనుకునే ప్రాంతాలలో స్థానిక దొంగలతో కమ్యూనికేట్ చేసుకొని, చోరీ చేసిన తర్వాత గంగినేని రహదారి గుండా మరలా ఎర్రుపాలెం రైల్వేస్టేషన్కు చేరుకొని తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ● పక్కపక్కనే ఉన్న చెర్వుమాధవరం, గంగినేని రైల్వే స్టేషన్లను అడ్డాలుగా వాడుకొని ఖమ్మం వైపు నుంచి వచ్చిన మహిళలు పత్తి, మిరపకాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులను చోరీ చేయడం ఇక్కడ పరిపాటి. ఖమ్మం వైపు నుంచి వచ్చిన మహిళలు పాసింజర్ ట్రైన్లో చెర్వుమాధవరం రైల్వేస్టేషన్లో దిగి ట్రాకు పక్కనే ఉన్న పత్తి చేలల్లో పత్తి తీసుకొని మరలా పాసింజర్ ట్రైన్ ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా 2022లో స్థానిక రైతులు పట్టుకొని జి.కొండూరు పోలీసులకు అప్పగించారు. ఈ విధంగా ఒకసారి 15మంది మహిళలు, రెండోసారి 20మంది మహిళలు పోలీసులకు చిక్కారు. ఇప్పటికీ ఇదే తంతు కొనసాగుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ● గంగినేని, చెర్వుమాధవరం రైల్వేస్టేషన్లలో రైళ్లు క్రాసింగ్ పెట్టినప్పుడు ఆయిల్ ట్యాంకర్లతో వెళ్లే రైళ్లు, వివిధ రకాల సరుకులను తీసుకెళ్లే రైళ్లు నిలిపి ఉంచినప్పుడు దొంగల ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైల్వే గార్డులతో మాట్లాడుకొని స్థానికులు కొందరు ట్యాంకర్లలో ఆయిల్ను చోరీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. సహకరించిన గార్డులకు డబ్బు, బంగారపు ఉంగరాలను సైతం చేయిస్తున్నారని తెలుస్తోంది. గంజాయి సరఫరా ఇక్కడి నుంచే.. విశాఖపట్నం నుంచి గంజాయిని ప్యాసింజర్ రైళ్లలో ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు తీసుకొచ్చి గంగినేని, చెర్వుమాధవరం రైల్వేస్టేషన్లో దిగి పక్కనే ఉన్న మామిడి తోటల్లో పెట్టి స్థానికంగా సరఫరా చేసే వ్యక్తులకు సమాచారం అందించడం ద్వారా గంజాయి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తోందని సమాచారం. ఈ రెండు రైల్వేస్టేషన్లనే గంజాయి సరఫరాకి కేంద్ర బింధువులుగా నిందితులు వాడుకుంటున్నారని సమాచారం. మూతబడిన గంగినేని స్టేట్ బోర్డర్ చెక్పోస్టు ఈ నెల 27వ తేదీన చెవుటూరు గ్రామంలోని ఓ ఇంట్లో, బడ్డీ కొట్టులో చోరీ జరిగింది. ఈ ఘటనలో డబ్బు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సెప్టెంబర్ 17వ తేదీన రాత్రి జి.కొండూరు మండల పరిధి మునగపాడు గ్రామంలో దక్షిణముఖ ఆంజనేయస్వామి దేవాలయం, సెప్టెంబర్ 24వ తేదీన రాత్రి జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. జి.కొండూరు మండల పరిధి సున్నంపాడు గ్రామంలో గతేడాది సెప్టెంబరు 6వ తేదీన షేక్ ఖాసీం ఇంట్లో చోరీ జరిగింది. నిందితుడు తెలంగాణ, మంచిర్యాల జిల్లా, ఖాసీపేట మండలం, సోమగూడెం గ్రామానికి చెందిన బండా సంపత్గా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో మునగపాడు, సున్నంపాడు, చెర్వుమాధవరం గ్రామాలలో విద్యుత్ మోటార్లు, కేబుళ్లు వరుస చోరీలు జరగడంతో రైతులు ఆందోళన చెందారు. ఇప్పటికీ ఈ చోరీలు జరుగుతూనే ఉన్నాయి. మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో ఇటీవల వరుస చోరీలు జరగడం, నిందితులు తప్పించుకోవడానికి ఈ గంగినేని రాష్ట్ర రహదారే అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. జి.కొండూరు నుంచి గంగినేని శివారు రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వరకు పదిహేను కిలోమీటర్ల మేర రహదారికి ఆనుకొని ఆరు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిసరాలు మొత్తం వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ఈ గ్రామాలకు పశ్చిమ వైపుగా సికింద్రాబాద్, విజయవాడ రైల్వేలైన్ ఉంది. ఈ రైల్వేలైన్లో చెర్వుమాధవరం, గంగినేని, తెలంగాణలోని ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లు పక్కపక్కనే ఉన్నాయి. దొంగలు వీటిని అనుకూలంగా మార్చుకున్నారు. అలాగే ఇటు మైలవరం, అటు నందిగామ నియోజకవర్గాల్లో చోరీలు చేసిన దొంగలు వెంటనే తప్పించుకునేందుకు తెలంగాణలోకి ప్రవేశించడానికి నిఘాలేని ఈ గంగినేని వద్ద ప్రాంతం సులువుగా మారింది. -
కష్టం ‘గురూ’!
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3881 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 42.1600 టీఎంసీలు.వన్టౌన్(విజయవాడపశ్చిమ): అరొకర నిధులతో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పండుగలా చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం ఉపాధ్యాయులను విస్తుపోయేలా చేసింది. 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో వారి తల్లిదండ్రులను, స్థానిక ప్రజాప్రతినిధులను పిలిచి రూ.900తో భారీగా సమావేశాన్ని నిర్వహించి పండుగ జరపాలంటూ ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాలివ్వటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ విద్యాశాఖ ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం 3.0 పేరుతో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలను భారీగా నిర్వహించాలని తలపోస్తోంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నియమనిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించి, ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పాఠశాల ప్రగతిని చాటి చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రగతిని వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం ఈ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసిన నిధులు ఏమాత్రం చాలవని వారు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు రూ. 50లక్షలు..ఉమ్మడి కృష్ణాజిల్లాకు సుమారుగా రూ.50 లక్షలను కేటాయించినట్లు తెలిసింది. ఎన్టీఆర్ జిల్లాకు రూ.24లక్షలు కేటాయించారు. కృష్ణాజిల్లాకు సుమారుగా రూ.25 లక్షలు ఉన్నట్లుగా తెలిసింది. అయితే ఈ నిధులతో ఇన్ని వందలాది పాఠశాలలకు ఎలా ఖర్చులు సరిపోతాయంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమ ప్రచార ఆర్భాటాల కోసం ఈ విధమైన హడావుడి చేసి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయటంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నిధుల మంజూరు 0 – 30మంది రూ.900 31 – 100మంది రూ.2,250 101 – 250మంది రూ.4,500 251 – 1000మంది రూ.6,750 1000మందికి పైన రూ.9,000 7 ఉమ్మడి జిల్లాలోని 2,309 పాఠశాలలకు రూ. 50లక్షలు కేటాయింపు 30లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు కేవలం రూ.900 పండుగలా చేయాలంటూ ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్–టీచర్స్ మీటింగ్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 3,242 విద్యాసంస్థలు పని చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 1,451 విద్యాసంస్థలు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పని చేస్తున్నాయి. వాటిల్లో సుమారుగా 3.30 లక్షల మంది విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకూ విద్యాభ్యాసం చేస్తున్నారు. వాటిలో సుమారుగా 509 వరకూ ప్రైవేట్ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. కృష్ణాజిల్లాలో 1791 విద్యాసంస్థలు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పని చేస్తున్నాయి. అందులో సుమారుగా 2.17 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వాటిల్లో సుమారుగా 424 ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. అయితే గతంలో అన్ని విద్యాసంస్థల్లో మెగా పీటీఎం నిర్వహించగా.. ప్రస్తుతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రమే నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీలో ఆరోగ్య కేంద్రాలకు అనువైన భవనాల కోసం కృష్ణా జిల్లా వైద్యాధికారి యుగంధర్ బుధవారం పోరంకి, కానూరులో పర్యటించారు.దుర్గమ్మ సన్నిధిలో నిత్యం నిర్వహించే అన్నప్రసాద వితరణకు విజయవాడకు చెందిన పలువురు దాతలు బుధవారం విరాళాలను అందజేశారు. -
తిరుపతమ్మ హుండీ ఆదాయం రూ.81.03 లక్షలు
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో భక్తులు హుండీల ద్వారా రూ.81.03 లక్షల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. బుధవారం అమ్మవారి హుండీల్లోని కానుకలను మండపంలో లెక్కించారు. 100 రోజులకు గాను ఆలయంలో మొత్తం హుండీల్లో నగదు రూపంలో రూ.81,03,052, బంగారం 57 గ్రాములు, వెండి 3 కిలోల 200 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్ పేర్కొన్నారు. అలాగే విదేశీ నగదు యూఎస్ఏ డాలర్లు 21, కెనడా డాలర్లు 5 వచ్చాయన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. ఈఓతో పాటు చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించారు. మోపిదేవి: మండలంలోని పెదకళ్లేపల్లి పీహెచ్సీ పరిధిలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు రెండు నమోదయినట్లు పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ శ్రీరామ్ సాయి తెలిపారు. ఆయన బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామంలో జ్వరపీడితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. ఈ సర్వేలో ఇద్దరు అనుమానిత రోగులకు రక్తనమూనాలు సేకరించి, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి పంపించగా, పరీక్షల్లో వారికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా వచ్చిందని తెలిపారు. ఇది అంటువ్యాధి కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పేడపురుగును పోలిన ఒరియెంటియా సుట్సుగముషి కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుందని వివరించారు. శరీరంపై నల్ల మచ్చ కనిపించి జ్వరం వచ్చినట్టయితే స్క్రబ్ టైఫస్ వ్యాధిగా నిర్ధారించొచ్చని తెలిపారు. -
మిర్చిని నల్లిపేస్తున్న పురుగులు
అవగాహన కల్పిస్తున్నాం ● మిరప తోటలపై నల్లి దాడి తీవ్రం ●కొన్ని చోట్ల తామరపురుగు ఉధృతి ●వాడిపోతున్న మిరప మొక్కలు ●దిగుబడులపై ఆందోళనలో రైతులు పెనుగంచిప్రోలు: మిర్చి పొలాలపై నల్లి పురుగుల దాడి రైతులను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తోంది. ఈ పురుగులు ఆకులు, కొమ్మలకు వేగంగా నాశనం చేస్తూ పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పైరు ఏపుగా పెరిగి ఆశాజనకంగా ఉంద నుకుంటున్న తరుణంలో ఈ పురుగుల దాడితో రైతులు సతమతమవుతున్నారు. రైతులు ఎక్కువగా తేజ సన్న రకాలను సాగు చేశారు. ఎకరానికి ఇప్పటికే రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. ఇటీవల మొక్కలకు ఎర్రనల్లి, తెల్లనల్లి, తామర పురుగులు ఆశిస్తున్నాయి. వీటి ఉధృతి కారణంగా దిగుబడులు తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తామర పురుగు బెడద మిర్చి రైతులకు తామర పురుగు బెడద పట్టుకుంది. మిర్చి పంట బాగుండి, దిగుబడి అధికంగా వస్తుందన్న తరుణంలో కొన్ని ప్రాంతాల్లో తామర పురుగులు పైరును ఆశిస్తున్నాయి. మిర్చి పంటపై ఇటీవల వైరస్, తెగులు ప్రభావం చూపించగా తాజాగా తామర పురుగులు కూడా కనిపించటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. కంటికి రెప్పలా పెంచుకున్న పంట కళ్లెదుటే వాడిపోతుంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో.. ఎన్టీఆర్ జిల్లాలో ఈఏడాది ఇప్పటి వరకు 8,950 హెక్టార్లలో రైతులు మిర్చి సాగు చేశారు. గత ఏడాది ధర లేక పోవటంతో పాటు దిగుబడులు కూడి లేక రైతులు సగానికి సాగు తగ్గించారు. ఈ ఏడాది మిర్చి తోటలను తామర పురుగు ఆశించింది. అయితే ఇంత వరకు ఉద్యాన శాఖ అధికారులు ఒక్కసారి కూడా తమ పంట పొలాలవైపు చూడలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మిర్చిలో వ్యాపించే తెగుళ్లపై అవగాహన సదస్సులు నిర్వహించి ఏఏ మందులు వాడాలో వివరించాలని కోరుతున్నారు. పంట నాశనం తామర పురుగులను గుర్తించిన రోజుల వ్యవధిలోనే పంట నాశనం అవుతోందని రైతులు వాపోతున్నారు. తామర పురుగు గుడ్డు నుంచి పురుగుగా మారేందుకు 10–15 రోజులు పడుతుంది. ఇది తల్లి దశలో ఉన్న సమయంలో పూతలో పెరిగి పూత నుంచి కాయ రానివ్వకుండా రైతుకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఏ మందు లకూ ఈ పురుగు లొంగటం లేదని రైతులు అంటు న్నారు. దీనికి తోడు అధిక వర్షాలతో మిరప పంటలో నీరు నిల్వ ఉండటంతో వేరుకుళ్లు తెగులు రావటంతో పంట ఎండి పోతోందని ఆందోళన చెందుతున్నారు. మిర్చిపూతపై నల్లతామర పురుగు పెనుగంచిప్రోలు మండలంలోని కె.పొన్నవరం వద్ద ఎకరం రూ.25 వేలకు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాను. మొదట వైరస్ తెగులు వ్యాపించిన పొలం ఇప్పుడు తామర పురుగు పడి మొత్తం వడబడి పోతోంది. ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి అయింది. ఈ ఏడాది పత్తి కూడా వర్షాలకు బాగా దెబ్బతింది. ఇప్పుడు మిర్చి పరిస్థితి ఇలా ఉంది. ఏమి చేయాలో అర్థం కావటం లేదు. – పాపట్ల ఆదాం, రైతు, మునగచర్ల నేను ఐదెకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేశాను. గత ఏడాది ధర పూర్తిగా తగ్గింది. మొన్నటి వరకు పైరు బాగానే ఉంది. రోజుల వ్యవధిలోనే పూతపై నల్లతామర పురుగు విస్తృతంగా కనిపిస్తోంది. ఎకరానికి రూ.లక్షకు పెట్టుబడి అయింది. తెగులు వల్ల పూత ఎదగటం లేదు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండటం లేదు. అధికారులు మాకు పంటల పెరుగుదలకు సచనలివ్వాలి. –కూచి రంగారావు, రైతు, వెంకటాపురం మిర్చి పంటపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మిర్చిలో కోయినో ఫోరా కొమ్మకుళ్లు తెగులు ఎక్కువగా ఉంది. దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రామలు, స్ట్రెప్టోసైక్లిన్ గ్రాము పది లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎండు తెగులు నివార ణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్క పాదులో పోయాలి. నల్ల తామర పురుగు నివారణకు ఫ్రైడ్ 40 నుంచి 50 గ్రాములు లేదా బెనీవియా 240 గ్రాములు, రీజెంట్ 40 నుంచి 50 గ్రాములు వరకు లేదా పోలీస్ 40నుంచి 50 గ్రాముల వరకు మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. జిగురు పూసిన పసుపు, బ్లూరంగు అట్టలను ఎకరానికి 20 చొప్పున పెట్టటం వల్ల నల్లతామర పురుగును నివారించవచ్చు. – నీలిమ, ఉధ్యానశాఖ అధికారి -
జోగి కుటుంబంపై చంద్రబాబు కక్షసాధింపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటికే కల్తీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును అక్రమంగా అరెస్టు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వారి కుమారులను వేధిస్తోంది. అదే కేసులో జోగి రమేష్ కుమారులు, ఆయన సోదరుల కుమారులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. జోగి రమేష్ కుమారులు రాజీవ్, రోహిత్తో పాటు, రాము కుమారులు రాకేష్, రామ్మోహన్ బుధవారం గురునానక్ కాలనీలోని తూర్పు ఎకై ్సజ్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ కుమారులతో పాటు, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా వచ్చారు. అసలు నిందితులు టీడీపీ నేతలే.. కల్తీ మద్యం కేసులో అసలు నిందితులు టీడీపీ నేతలేనని దేవినేని అవినాష్ అన్నారు. కావాలనే జోగి రమేష్ను చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసిందని మండిపడ్డారు. కేసు రిమాండ్ రిపోర్టులో అసలు జోగి రమేష్ పేరే లేదన్నారు. జనార్దనరావుతో బలవంతంగా తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి జోగి రమేష్ పేరు చెప్పించారని విమర్శించారు. తంబళ్లపల్లి పోలీసులు పీటీ వారెంట్ వేసి, కేసులో జోగి రమేష్, రాము పేర్లు చేర్చారన్నారు. ఎన్ని కేసులు పెట్టి వేధించినా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అక్రమ కేసులు పెట్టారు ‘గతేడాది నాపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి వేధించారు. ఇప్పుడు నా తండ్రిని అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే కక్ష కట్టార’ని జోగి రమేష్ పెద్దకుమారుడు రాజీవ్ అన్నారు. తామెప్పుడూ రాజకీయంగా బయటికి వచ్చింది లేదని, అయినా తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. -
ఉద్రిక్తతల నడుమ భవనాల కూల్చివేత
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆ భవనాలు అక్రమ నిర్మాణాలు కాదు. ఆక్రమించి నిర్మించినవి అంకన్నా కాదు. చట్టబద్ధంగా ప్లాట్లను కొనుగోలుచేసి కష్టపడిన సొమ్ముతో ఇష్టపడి నిర్మించుకున్న ఆశల గూళ్లు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ భవనాలను కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దశాబ్దాలుగా నివసిస్తున్న భవనాలను ఒక్కసారిగా కూల్చివేయ డంతో వాటి యజమానులు రోడ్డున పడ్డారు. ఈ ఘటన నగరంలోని రామరాజ్యనగర్లో బుధవారం చోటుచేసుకుంది. గత ఎన్నికల సమయంలో ప్లాట్ల యజమానులకు అండగా ఉంటామని కూటమి నేతలు హామీలు గుప్పించారు. వాటిని కూల్చివేసే సమయానికి చేతులెత్తేశారు. ఉదయాన్నే భవనాలను కూల్చివేయగా, సాయంత్రం ప్లాట్ల కూల్చివేతపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం గమనార్హం. విద్యాధరపురం రామరాజ్యనగర్ పరిధిలోని జోజినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఉన్న 42 ప్లాట్లలో ఉన్న బిల్డింగ్లను బుధవారం ఉదయం కూల్చివేశారు. మూడు దశాబ్దాలుగా శ్రీలక్ష్మీరామ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ, 42 ప్లాట్ల యజమానుల మధ్య న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్నాయి. ప్లాట్ల యజమానులు ఎన్నికలకు ముందు దాదాపు మూడు నెలలకుపైగా టెంట్లు వేసి ఆందోళనలు చేశారు. ఆ సమయంలో కూటమి నాయకులు వారికి మద్దతుగా నిలిచి, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చూస్తామని హామీలు గుప్పించారు. ఈ నేప థ్యంలో విజయవాడ కోర్టు శ్రీలక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ కోర్టు కమిషన్, అమీనాలు భారీ పోలీసు బందోబస్తుతో బుధవారం ఉదయం ఏడు గంటలకే వచ్చి బిల్డింగ్లను జేసీబీలతో కూల్చివేశారు. 2.17 ఎకరాల స్థలాన్ని సొసైటీకి స్వాధీనం చేశారు. దీంతో సొసైటీ నిర్వాహకులు తమ స్థలం సరిహద్దుల మేరకు వెస్ట్ మిడోవిస్ అపార్ట్మెంట్కు వెళ్లే దారిని మూసివేస్తూ అడ్డంగా గోడ కట్టేశారు. అలాగే ప్లాట్లకు వెళ్లే మెయిన్ రోడ్డు లోపల ఉన్న మరి కొన్ని అపార్ట్మెంట్లకు వెళ్లే మార్గాన్ని కూడా మూసివేస్తూ గోడ నిర్మించారు. కన్నీటిపర్యంతమైన ప్లాట్ల యజమానులు మూడు దశాబ్దాలుగా ఇక్కడ బిల్డింగ్లు కట్టుకుని నివాసం ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేయడంపై 42 ప్లాట్ల యజమానులు కన్నీటిపర్యంతమయ్యారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్దాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి రూపాయీ రూపాయి కూడబెట్టి ఇళ్లు కట్టుకున్నామని వాపోతున్నారు. తమ అపార్ట్మెంట్లకు దారి లేకుండా గోడలు కట్టేస్తే చిన్న పిల్లలు, పెద్దవారు ఎటు వెళ్లాలని అపార్ట్మెంట్లవాసులు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ బందోబస్తుతో వచ్చిన కోర్ట్ కమిషన్, అమీనా కోర్టు ఉత్తర్వులతో 42 ప్లాట్లలో భవనాలు కూల్చివేత శ్రీలక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పరమైన 2.17 ఎకరాలు పలు అపార్ట్మెంట్లకు వెళ్లే దారులు సైతం మూసివేత దిక్కుతోచని స్థితిలో 42 ప్లాట్ల ఓనర్లు కూల్చివేతలపై సాయంత్రానికి సుప్రీం కోర్టు స్టే 42 ప్లాట్ల యజమానులు తమ గోడు వినిపించేందుకు రాత్రి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. అయితే వారిని మధ్యలోనే పోలీ సులు అడ్డుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగే ప్రజాదర్బార్కు వెళ్లి అక్కడ మంత్రి లోకేష్ను కలిసి సమస్యను అర్జీ రూపంలో అందించాలని పోలీసులు సూచించారని బాధితులు తెలిపారు. -
క్రికెటర్ ఖాజా మొహిద్దీన్కు కేడీసీఏ అభినందనలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రికెట్ జట్టులో ఎంపికైన కృష్ణా జిల్లాకు చెందిన క్రికెటర్ ఖాజా మొహిద్దీన్ను కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ)సెక్రటరీ రవీంద్ర చౌదరి అభినందించారు. నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో క్రికెట్ నెట్ ప్రాక్టీస్కు వచ్చిన ఖాజా మొహిద్దీన్ను రవీంద్ర చౌదరి బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా రవీంద్ర చౌదరి మాట్లాడుతూ.. ఈ నెల ఏడు నుంచి 19వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరిగే ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లో ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రికెట్ జట్టులో ఖాజా మొహిద్దీన్ ఆడనున్నాడని తెలిపారు. ఆలిండియా ఇంటర్ వర్సిటీ క్రికెట్ సెలక్షన్ ట్రయల్స్లో ఖాజా మొహిద్దీన్ అర్హత సాధించి ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడని పేర్కొన్నారు. -
జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
నాగాయలంక: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన బేస్బాల్ పోటీల్లో తమ విద్యార్థినులు ఇద్దరు, స్విమ్మింగ్లో మరొకరు రాష్ట్రస్థాయిలో సత్తాచాటి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్ హెచ్ఎం అలపర్తి సత్యనారాయణ, పీడీ గాజుల లక్ష్మీప్రసాద్ బుధవారం తెలిపారు. గత నెల 27, 28, 29 తేదీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం జిల్లా ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రాష్ట్రస్థాయి అండర్–17 బేస్బాల్ టోర్నీలో సత్తాచాటిన తమ్ము అనూష, పి.వల్లిశ్రీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక య్యారని పేర్కొన్నారు. వీరు జనవరిలో న్యూఢిల్లీలో జరిగే నేషనల్ బేస్బాల్ పోటీల్లో రాష్ట్రం తరఫన పాల్గొంటా రని పేర్కొన్నారు. నరస రావుపేటలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో తమ విద్యార్థిని నాగిడి అశ్వని రజత పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ందని పేర్కొన్నారు. అశ్వని ఈ నెల 14 నుంచి కోల్కతాలో జరిగే పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను పాఠశాల విద్యాకుటుంబం బుధవారం అభినందించింది. -
దుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద వితరణకు విరాళాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నిత్యం నిర్వహించే అన్నప్రసాద వితరణకు దాతలు బుధవారం విరాళాలను అందజేశారు. విజయవాడ భారతీనగర్కు చెందిన కె.సతీష్ కుమార్ కుటుంబ సభ్యులుతో కలిసి శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి వచ్చి ఆలయ కార్యనిర్వహణాధికారిని కలిసి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. మధురానగర్కు చెందిన కనపర్తి వెంకట రవిరాజా కుటుంబ సభ్యులు కనపర్తి వెంకటేశ్వరరావు, శివకుమారి తమ పేరుతో అన్నప్రసాద వితరణకు రూ.1,00,116 విరాళం సమర్పించారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వారికి వేదాశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. -
సంస్కారవంతమైన రాజకీయాలు చేయాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కంకిపాడు: సంస్కారవంతమైన రాజకీయాలు చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. కంకిపాడులోని అయానా ఫంక్షన్ హాలులో బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశం బుధవారం జరి గింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. దేశానికి సిద్ధాంతపరమైన రాజకీయాలు అవసరమన్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా జాతీయ వాదం, దేశం ఎంతో ముఖ్యమన్నారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం విఫలమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. నాయకులు ఎప్పుడూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు. బూతులు మాట్లాడటం సంస్కారం కాదని, అలాంటి నేతలకు పోలింగ్ బూతుల్లోనే సమా ధానం చెప్పాలని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అగ్ర దేశాల సరసన దేశాన్ని నిలిపిన ఘనత ప్రధాని మోదీదని పేర్కొన్నారు. 12 బహుళ జాతి కంపెనీలకు సీఈఓలుగా దేశ పౌరులు నిలవటం గర్వకారణమన్నారు. రాజకీయాల్లో వారసత్వాలు కాదని, జవసత్వం ఉండాలని స్పష్టంచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటంతో దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. దేశంలో నక్సలి జాన్ని, టెర్రరిజాన్ని రూపుమాపటానికి అహ ర్నిశలు ప్రభుత్వం కృషి చేస్త్తోందన్నారు. బిహార్లో ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ కార్య క్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. గన్నవరం: విజయవాడ కండ్రికలో ఉన్న ఏఆర్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ నెల ఏడో తేదీన జూడో జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు జరుగుతాయని జూడో సంఘ జిల్లా సంయుక్త కార్యదర్శి డి.ఎన్. రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల స్థాయిలో జట్లను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 15 ఏళ్లు నిండిన బాల, బాలికలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన బాల, బాలికలు ఆ రోజు ఉదయం పది గంటలకు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. -
అనధికార లేఅవుట్లను తొలగించండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు, ఆక్రమణలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో మునిసిపల్ కమిషనర్లతో పలు అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వ హించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో అనధికార ఆక్రమణలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తూ మార్చి వరకు గడువు ఇచ్చిందన్నారు. నిర్ణీత గడువులోగా ఆక్రమణదారులు క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. దీని కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆక్రమణదారుల జాబితాను పరిశీలించి అందరికీ నోటీసులు జారీ చేయాలని, ఎవరైనా స్పందించకపోతే జేసీబీలతో తొలగించేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. మచిలీపట్నం నగరంలోని డంపింగ్యార్డులో పాత వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మచిలీపట్నంలోని నారాయణపురం, గుడివాడలోని దనియాలపేట, బేతవోలులో త్వరితగతిన పట్టణ ఆరోగ్య కేంద్రాలను నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొన్నారు. తాడిగడపలో మంజూరైన కానూరు ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి వెంటనే స్థలం గుర్తించాలని ఆదేశించారు. చెత్త నుంచి కంపోస్ట్ తయారుచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పెడనలో మూడు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఉయ్యూరులో రెండు ట్రీట్మెంట్ ప్లాంట్ల స్థలాలను గుర్తించాలన్నారు. సమావేశంలో మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాలరావు, మనోహర్, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
స్క్రబ్ టైఫస్పై ఆందోళన వద్దు
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్క్రబ్ టైఫస్ వ్యాధి గురంచి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీని నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని పేర్కొన్నారు. ఇది కొత్త వ్యాధి ఏమీ కాదని తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న సందర్భంగా ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. స్క్రబ్ టైఫస్ కొత్తరకం జ్వరం కాదని, అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నిర్ధారణ కిట్లు, మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సుత్సుగమూషి అనే కీటకం కుట్టడం ద్వారా స్క్రబ్టైఫస్ వ్యాధి సోకుతుందని తెలి పారు. వ్యాధి సోకిన వారి శరీరంపై కీటకం కుట్టిన చోట ఎర్రటి మచ్చ ఉంటుందన్నారు. పొలాలు, తోటలు లేదా దట్టమైన వృక్షసంపద ఉన్న ప్రాంతాలను సందర్శించే వ్యక్తులను ఈ కీటకం కుట్టే ప్రమాదం ఉందన్నారు. కీటకం కుట్టకుడా పొడవు చేతుల చొక్కా, ఫ్యాంట్ ధరించాలని సూచించారు. జ్వరం వస్తే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకూ కేసులు నమోదు కాలేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టంచేశారు. -
భద్రత తడబడిన బస్సులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పిల్లలకు పాఠశాలలు, కళాశాలలకు తీసుకెళ్లే బస్సుల్లో అనేక లోపాలు ఉంటున్నాయి. ఆర్టీఏ నిబంధనలను అనుసరించి స్కూల్ బస్సులకు ఉండాల్సిన ప్రమాణాలను ఆయా యాజమాన్యాలు విస్మరిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బస్సు నుంచి బయట పడేందుకు ఉన్న అత్యవసర ద్వారాలపై కూడా పిల్లలకు అవగాహన కలిగించడం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో రెండు రోజుల పాటు ఆర్టీఏ అధికారులు జరిపిన తనిఖీల్లో స్కూల్ బస్సుల డొల్లతనం బయటపడింది. అనేక లోపాలను గుర్తించిన ఆర్టీఏ అధికారులు బస్సులపై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఆయా పాఠశా లల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటా యని హెచ్చరిస్తున్నారు. రెండు రోజులుతనిఖీలు రవాణాశాఖ అధికారులు జిల్లాలో పది ప్రత్యేక బృందాలతో స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీలు చేశారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎ. మోహన్ నేతృతంలో రెండు రోజుల పాటు 125 బస్సులను తనిఖీ చేశారు. స్కూల్ బస్సులకు ఉండా ల్సిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అనే అంశాలను నిశితంగా పరిశీలించారు. స్కూల్ బస్సు డ్రైవర్ వయస్సు, అనుభవం, లైసెన్స్, బస్సుకు అత్యవసర ఉందా, ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? ఫిట్నెస్ పరిస్థితి ఏమిటి అన్న అంశాలను తనిఖీ చేశారు. రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో స్కూలు బస్సుల డొల్లతనం బయటపడింది. అంతేకాదు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పిల్లలు అత్యవసర ద్వారా నుంచి ఎలా బయట పడాలో కూడా తెలియజేయడం లేదని గుర్తించారు. అసలు ఆ ద్వారం ఉన్నట్లు కూడా పిల్లలకు తెలియదని తనిఖీల్లో వెల్లడైంది. కొన్ని బస్సులు కనీస నిబంధనలు పాటించకుండా పిల్లల ప్రాణాలతో చెలగాటం అడుతున్నట్లు గుర్తించారు. కేసులు నమోదు రవాణా శాఖ అధికారులు తొలిరోజు 60 బస్సులు తనిఖీ చేయగా, నిబంధనలు పాటించని 16 బస్సులపై కేసులు నమోదు చేశారు. రెండో రోజు 65 బస్సులను తనిఖీ చేయగా, వాటిలో లోపాలు గుర్తించిన 12 బస్సులపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు ఆయా బస్సులు నడుపుతున్న స్కూల్ యాజమాన్యాలపై కూడా చర్యలు ఉంటాయని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ిపిల్లలను తరలించే స్కూల్ బస్సులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండాలని ఆర్టీఏ అధికారులు చెపుతున్నారు. పిల్లలకు అవగాహన రవాణా అధికారులు బస్సులను తనిఖీ చేయడమే కాకుండా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బస్సు నుంచి ఎలా బయట పడాలో కూడా పిల్లలకు అవగాహన కలిగించారు. బస్సును నిలిచి అత్యవసర ద్వారం నుంచి పిల్లలను కిందకు దించారు. తల్లిదండ్రులు సైతం పిల్లల్ని స్కూలుకు బస్సుల్లో పంపించేటప్పుడు ఆయా బస్సుల పరిస్థితిని కూడా గమనించాలంటున్నారు. ఏదైనా లోపాలు ఉంటే సంబంధిత కళాశాలకు వెంటనే ఫిర్యాదు చేయాలంటున్నారు. స్పందిచక పోతే, రవాణాశాఖకు, పోలీసులకు తెలియచేయాలని ఆర్టీఏ అధికారులు సూచించారు. స్కూల్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాలి. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే ఆయా బస్సులపై కేసులు నమోదు చేయడమే కాకుండా వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు కూడా పిల్లలను బస్సుల్లో పంపించేటప్పుడు ఆయా బస్సుల పరిస్థితిని గమనించాలి. భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. తనిఖీలు చేసేటప్పుడు అత్యవసర సమయంలో బస్సు నుంచి ఎలా బయటపడాలో కూడా పిల్లలకు అవగాహన కలిగిస్తున్నాం. – ప్రవీణ్, ఆర్టీఓ, విజయవాడ -
రామలింగేశ్వర స్వామి ఆలయానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
మచిలీపట్నంటౌన్: నగరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక మాసం సంద ర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న ఆలయ ప్రాంగ ణంలోని 35 అడుగుల ధ్యాన ముద్రలోని పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు కలిసి కోటి దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ చింతపట్ల వేంకటాచారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ దేసు నిరాజ, కార్యనిర్వహణా ధికారి సమ్మెట ఆంజనేయస్వామికి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కార్పొరేటర్ చిత్త జల్లు నాగరాము, సబ్ జైలు సూపరింటెండెంట్ పిల్లా రమేష్, రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి.ఫణికుమార్, ఆలయ మాజీ చైర్మన్ దేసు సుబ్రహ్మణ్యేశ్వరరావు, కన్యకా పరమేశ్వరి ఆలయం చైర్మన్ మామిడి మురళీకృష్ణ, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ దిలీప్, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, గుడివాడ క్రైమ్ సీఐ ఇంజరపు రమణీ తదితరులు పాల్గొన్నారు. -
బాబు సర్కారుపై యుద్ధానికి సిద్ధంకండి
మచిలీపట్నం టౌన్: రాష్ట్రంలో కొనసాగుతున్న దగాకోరు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్ధానికి కార్యకర్తలు సిద్ధం కావాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. మచిలీపట్నంలోని పెడన రోడ్డులో ఉన్న జీ కన్వెన్షన్ హాల్లో సోమవారం యువజన విభాగం జూన్–3 కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జక్కంపూడి రాజా.. మాట్లాడుతూ గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం వచ్చాక వాటిని అమలు చేయకుండా దగా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న దగాను వివరిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ పలు ఉద్యమాలు నిర్వహించేందుకు యువజన విభాగం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు.. కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ప్రత్యేక హోదాను అడగకుండా వారి స్వార్థం కోసం, వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టారని రాజా విమర్శించారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వ పెద్దలను నిలదీయాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా యువతపై ఉందన్నారు. నియామకాలు పూర్తి చేయాలి.. జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయి యువజన విభాగం సంస్థాగత కమిటీల నియామకాలను త్వరితగచ్చిన పూర్తి చేయాలని రాజా సంఘ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో ఇతర విభాగాల కన్నా యువజన విభాగం విభిన్నంగా, ఆకర్షణీయంగా కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ ఇచ్చే పిలుపులో భాగంగా పలు రూపాల్లో ఉద్యమాలు చురుగ్గా నిర్వహించేందుకు యువజన విభాగం ఉత్సాహంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను.. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు యువజన శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగాలన్నారు. తొలుత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జక్కంపూడి రాజాతో పాటు యువజన విభాగం జోన్–3 వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) పలు జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ పెడన నియోజవర్గ ఇన్చార్జ్ ఉప్పాల రాము, అవనిగడ్డ నియోజకవర్గం నాయకుడు సింహాద్రి వికాస్, యువ జన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెరుగు చెందాన్ నాగ్, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు మెరు గుమాల కాళీ, కొరివి చైతన్య, ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, కందుల శ్రీకాంత్, కొక్కిలిగడ్డ చెంచయ్య ప్రసంగించారు. కార్యకర్తలు వారి సమస్యలను వాట్సాప్, ఫోన్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని పేర్ని కిట్టు సూచించారు. -
ప్లాన్ లేని సీప్లేన్ !
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణానది ఒడ్డున పర్యాటక రంగాన్ని పరుగులు పట్టిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రకటనలన్నీ నీటిమూటలేనని మరోసారి స్పష్టమైనట్లుగా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఉన్న పున్నమీ ఘాట్ నుంచి సీప్లేన్ పేరుతో ఏడాది క్రితం తెగ హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు కిమ్మనడం లేదు. సీప్లేన్తో ఆదాయాన్ని సృష్టించి ప్రభుత్వ పథకాలను మరింత విస్తృతం చేస్తామంటూ సీప్లేన్ డెమో రోజున కూటమి నేతలు అనేక ప్రకటనలు చేసి ఊదరగొట్టారు. మరో వారం పది రోజుల్లో విజయవాడ నుంచి శ్రీశైలం, మళ్లీ అక్కడి నుంచి ఇక్కడకు సీప్లేన్లో తిరగొచ్చంటూ అప్పట్లో హడావుడి చేశారు. కానీ అవేమీ కార్యరూపం దాల్చకపోవటంతో జిల్లా ప్రజానీకం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతోంది. నీటిపై ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చంటూ.. విజయవాడ నుంచి శ్రీశైలం సీ ప్లేన్లో వెళ్లడానికి కేవలం 20 నిమిషాలే పడుతుంది. అయితే టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి మాత్రం మరో 10 నిమిషాల సమయం తీసుకుంటారు. మొత్తంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం సుమారు 30 నిమిషాలు ఉంటుంది. పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన సీప్లేన్ విజయవాడలోని పున్నమీఘాట్లోని జలాల్లో టేకాఫ్ అయి శ్రీశైలం జలాల్లో ల్యాండ్ అవుతుంది. నీటిపైన సుమారు 1500 అడుగుల్లో ఈ సీప్లేన్ ప్రయాణిస్తూ నీటి ప్రవాహాన్ని, ఇతర భూమిపైన ఉన్న సౌందర్యాన్ని తిలకిస్తూ వెళ్ల వచ్చంటూ పాలకులు ప్రకటించారు. ఈ ప్లేన్ ల్యాండింగ్, టేకాఫ్ కోసం రెండు ప్రాంతాల్లో నీటిపై ప్రత్యేకంగా జెట్టీలను సిద్ధం చేస్తామంటూ గత ఏడాది పర్యాటక శాఖ ప్రకటించింది. ఏడాదైనా.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చంద్రబాబు సీప్లేన్ను ప్రారంభించి ఈ నెలతో ఏడాది ముగిసింది. దీనిపై పర్యాటక శాఖలో ఎవరిని కదిలించినా ‘ఏమో సార్.. మాకు తెలియదు..!’ అంటూ సమాధానమివ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై పర్యాటక శాఖలో చెప్పేవారు సైతం కరువయ్యారు. హడావుడిగా ప్రజలను మభ్యపెట్టడానికి సీప్లేన్ను తీసుకొచ్చి షో చేసి మాయ చేశారంటూ విజయవాడ వాసులు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే రీతిలో ప్రతిసారి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందంటూ వారు విమర్శిస్తున్నారు. ఏడాది క్రితం ప్రారంభించి త్వరలోనే చార్జీలను నిర్ణయించి సీప్లేన్ ప్రారంభిస్తామని చెప్పిన పాలకులు.. దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ పర్యాటక శాఖ సిబ్బంది సైతం ప్రశ్నించటం గమనార్హం. పర్యాటక రంగ అభివృద్ధి అంటే ఆ శాఖ పరిధిలోని భూములను అమ్మకాలు చేయటమా? అని పలువురు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి ఒడిలో ఉన్న భవానీద్వీపంలోని స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు 99 సంవత్సరాలు అప్పగించటంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పర్యాటకాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని సృష్టిస్తాం.. ఉపాధిని పెంచుతామంటూ పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. సంపద సృష్టించడమంటే చంద్రబాబు ప్రభుత్వం దృష్టిలో భూములు అమ్మకాలు చేయటం అని అర్థమవుతోందని పర్యాటక శాఖలో పని చేస్తున్న పలువురు ఎద్దేవా చేస్తున్నారు.ఏమో.. మాకేం తెలీదు.. అంటున్న టూరిజం అధికారులు -
15 నుంచి తిరుపతమ్మ దీక్షలు
మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా వేల సంఖ్యలో అమ్మవారి దీక్షలు తీసుకుంటున్నారు. దీక్ష తీసుకునేవారు ఆలయానికి వచ్చేటప్పుడు ఎర్రని వస్త్రాలు, పసుపు కండువా ధరించి, మాలలు, టికెట్టు తీసుకొని రావాలి. అమ్మవారు భక్తులు అందరినీ చల్లగా చూస్తారు. స్వాములు దీక్షలు విరమించేందుకు 2026, ఫిబ్రవరి ఒకటో తేదీని నిర్ణయించాం. – మర్రెబోయిన గోపిబాబు, ఆలయ ప్రధానార్చకుడు పెనుగంచిప్రోలు: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి మండల దీక్షా మాలాధారణ కార్యక్రమం ఈఏడాది డిసెంబర్ 15న తెల్లవారుజామున ఆలయంలో ప్రారంభం కానుంది. ఈ దీక్షను ఆలయంలో మొదటి సారిగా 1990లో ప్రారంభించారు. శబరిమలలో కొలువై ఉన్న శ్రీ అయ్యప్పస్వామి, విజయవాడలో వేంచేసి ఉన్న శ్రీకనదుర్గమ్మవారి భవానీ మాల అనంతరం ఎక్కువ మంది భక్తులు శ్రీతిరుపతమ్మవారి మాల వేసుకుంటున్నారు. మొదట 46 మందితో దీక్ష ప్రారంభం కాగా, ఏడాదికేడాది పెరుగుతూ ప్రస్తుతం ఏటా 20వేల నుంచి 25 వేల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మాల వేసుకుంటున్నారు. మొదట అర్చకులు దివంగత మర్రెబోయిన రామదాసు గ్రామపెద్దలు, ఆలయ అధికారులు, వామకుంట్ల పీఠాధిపతి రామడుగు నరసింహాచార్యులు సమక్షంలో అమ్మవారి సన్నిధిలో మాల వేసుకున్నారు. గతంలో పెనుగంచిప్రోలు అమ్మవారి సన్నిధిలోనే స్వాములు మాల వేసుకొని దీక్షలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు గురుస్వాములు వారి గ్రామాల్లోనే మాలలు వేస్తున్నారు. అయితే దీక్ష అనంతరం తిరుముడి సమర్పణకు మాత్రం పెనుగంచిప్రోలు అమ్మవారి సన్నిధికి తప్పక వస్తారు. గతంలో మండల దీక్ష, అర్ధమండల దీక్ష మాత్రమే ఉండగా గత ఏడాది నుంచి కొత్తగా 11 రోజుల దీక్ష కూడా ఆలయ వర్గాలు ఏర్పాటు చేశాయి. -
డెమో రన్తో సరి..
గత ఏడాది నవంబర్ తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ఇతర మంత్రులు అధికారులు విజయవాడ పున్నమీ ఘాట్ నుంచి సీ ప్లేన్ ప్రారంభించి అందులో ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలానికి చేరుకున్న తర్వాత అక్కడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామిని సందర్శించి తిరిగి అదే ప్లేన్లో విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా రెండు ప్రాంతాల్లో సభలను ఏర్పాటు చేయటంతో పాటుగా మీడియాతో దీని గురించి నాయకులందరూ తెగ ఊదరగొట్టారు. త్వరలోనే దీని ఖర్చులు ఇతర వ్యయాలను చర్చించి ప్రయాణపు చార్జీలను ప్రకటిస్తామని, ఇదే రీతిలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ సీప్లేన్ ఏర్పాట్లు చేస్తామంటూ చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనలు గుప్పించారు. -
పర్యాటక అభివృద్ధికి ‘హోమ్ స్టే’ సువర్ణావకాశం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పర్యాటక రంగ సుస్థిర అభివృద్ధికి హోమ్స్టేలు, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ (బీఅండ్బీ) విధానాలు సువర్ణావకాశాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు ప్రత్యక్షంగా ఆర్థిక ఫలాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఔత్సాహికులు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ హోమ్స్టేస్/బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య హాల్లో రాష్ట్ర పర్యాటక విధానం – హోమ్స్టేలు, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంపై సమన్వయ శాఖల అధికారులకు వర్క్షాప్ నిర్వహించారు. అవగాహన కల్పించండి.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పర్యాటకులు స్థానిక ఇళ్లలో ఆతిథ్యం, సంస్కృతీ సంప్రదాయాల ఔన్నత్యాన్ని తెలుసుకోవడం, స్థానిక ప్రత్యేక రుచులను ఆస్వాదించడం వంటివి ఈ హోమ్స్టే, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానాలతో వీలవుతుందన్నారు. రాష్ట్ర పర్యాటక పాలసీ(2024–29) ద్వారా ఈ రెండు విధానాలను అమలుచేయొచ్చని.. 2029 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా రిజిస్టర్డ్ హోమ్స్టేలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. గ్రామీణ హోమ్స్టేలు, గిరిజన హోమ్స్టేలు, పట్టణ హోమ్స్టేలు, వారసత్వ హోమ్స్టేలు తదితరాల ఏర్పాటు ద్వారా ఆయా యజమానులకు చేకూరనున్న విద్యుత్, నీటి సరఫరా, ఆస్తి పన్ను తదితరాల్లో రాయితీ ప్రయోజనాలు, రెండు దశల పరిశీలన ప్రక్రియ (పోలీస్ వెరిఫికేషన్, డీటీవో/పంచాయతీ కార్యదర్శి వెరిఫికేషన్), రిజిస్ట్రేషన్కు అవసరమైన పత్రాలు తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో పర్యాటక శాఖ ఆర్డీ వైవీ ప్రసన్నలక్ష్మి, టూరిజం మేనేజర్ రాజ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, డీఆర్డీఏ, మెప్మా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అర్జీల సత్వర పరిష్కారానికి కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని డీఆర్వో లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఆర్వో లక్ష్మీనరసింహం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 149 అర్జీలు అందా యని చెప్పారు. వీటిలో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 58 అర్జీలు అందాయని చెప్పారు. పోలీసు శాఖకు 19, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 17 ఫిర్యాదులు వచ్చాయన్నారు. పంచాయతీరాజ్, వక్ఫ్ బోర్డులకు ఏడు చొప్పున, విద్యాశాఖకు ఆరు, సర్వే, ఆరోగ్యం, మత్స్య శాఖలకు నాలుగు చొప్పున, డీఆర్డీఏ, నైపుణ్య అభివృద్ధి, రిజిస్ట్రేషన్ –స్టాంపులు, జలవనరులు, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలకు రెండు చొప్పున, అటవీ, గిరిజన సంక్షేమం, దేవదాయ, సాంఘిక సంక్షేమం, ఐసీడీఎస్, బీసీ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు తెలిపారు. వీటి సత్వర పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జ్యోతి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. నేడు మైలవరంలో పీజీఆర్ఎస్.. మైలవరం నియోజకవర్గస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ఈ నెల 2వ తేదీ మంగళవారం జరగనుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా హాజరయ్యే ఈ కార్యక్రమం మైలవరంలోని ఎస్వీ కల్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంట ల నుంచి 5గంటల వరకు జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డీఆర్వో లక్ష్మీనరసింహం -
ఎయిడ్స్ రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదాం
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రాన్ని 2030 నాటికి ఎయిడ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యాధి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల గతంలో ఉన్న 2.34 శాతం పాజిటివిటీ రేటు 10 ఏళ్లలో 0.58 శాతానికి తగ్గిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో హెచ్ఐవీ పరీక్షలు చేసేందుకు కేంద్రప్రభుత్వ సహకారంతో 15 మొబైల్ ఐసీటీసీలను రాష్ట్రానికి తీసుకురాగలిగామని చెప్పారు. అయినా దేశంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉండటం దురుదృష్టకరమన్నారు. అవగాహన ఉంటేనే.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపట్ల పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ హెచ్ఐవీపై సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు ఏటా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేబీఎన్ చక్రధర్బాబు, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, డాక్టర్ సమరం, డాక్టర్ మంజుల పాల్గొన్నారు. కళాక్షేత్రం ప్రాంగణంలో ఏపీ శాక్స్ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ను మంత్రి తిలకించారు. అనంతరం ఆయన ఎయి డ్స్ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. స్నేహ, వాసవ్య మహిళా మండలి, శాంతి కల్చరల్ అసొసియేషన్ సభ్యులు ప్రదర్శించిన కళాజాతాలు ఆహూతులను అలరించాయి. -
పోలీస్ గ్రీవెన్స్కు 79 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో 79 ఫిర్యాదులు అందాయి. పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎస్వీడి ప్రసాద్, ఏడీసీపీ ఎం.రాజారావు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నడవలేని వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు తీసుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత స్టేషన్ల ఎస్హెచ్ఓలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులో భూమి, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 38, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, కొట్లాటకు సంబంధించి 1, వివిధ మోసాలపై 16, మహిళా సంబంధిత నేరాలపై 5, దొంగతనాలపై 3, ఇతర చిన్న వివాదాలు, సమస్యలపై 11 ఇలా మొత్తం 79 ఫిర్యాదులు అందాయి. -
ఎన్టీఆర్ భరోసాతో పేదల జీవితాలకు చేయూత
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా పింఛన్లు అందిస్తోందని, ఎన్టీఆర్ భరోసా పథకంతో పేదల జీవితాలకు చేయూత లభిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద సోమవారం విజయవాడ గులాబీతోటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పెన్షన్ల పంపిణీ తీరుతెన్నులను పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ జిల్లాలో 2,28,968 మంది పెన్షనర్లకు రూ.98.91 కోట్ల మేర పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ -
జోగి రమేష్ పై కొనసాగుతున్న వేధింపుల పర్వం
ఇబ్రహీంపట్నం (మైలవరం): చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జోగి రమేష్పై వేధింపులు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం కేసులో ఇప్పటికే జోగి రమేష్, ఆయన సోద రుడు జోగి రాముఅను అక్రమంగా అరెస్టు చేయగా, తాజాగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఎకై ్సజ్ శాఖ పోలీసులు విచారణకు హాజరు కావాలని సోమవారం రాత్రి నోటీసులు అందజేశారు. ఈ నెల 3వ తేదీన భవానీపురం ఎకై ్సజ్ శాఖ పోలీస్ స్టేషన్లో విచారణ నిమిత్తం హాజరు కావాలని జోగి రమేష్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్కుమార్, జోగి రాము కుమారులు జోగి రాకేష్, జోగి రామ్మోహన్కు నోటీసులు అందజేశారు. రమేష్, రాము కుమారులకు నోటీసులు -
కారు ఢీకొని సెక్యూరిటీ గార్డ్ దుర్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): గుర్తు తెలియని కారు ఢీకొని ఓ సెక్యూరిటీ గార్డ్ దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాణిగారితోట, 18వ డివిజన్లోని తమ్మిన పోతురాజు వీధిలో ఓర్సు వెంకటస్వామి(56) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అతను బందరు రోడ్డులోని ఒక జ్యూయలరీ షాపులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం స్నేహితుని పని మీద రాత్రి 9గంటలకు బందరురోడ్డు వైపు వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళుతూ నేతాజీ వంతెన వద్ద సాయిబాబా గుడి వైపు నుంచి రాణిగారితోట వైపునకు జాతీయ రహదారి దాటుతున్న సమయంలో బెంజిసర్కిల్ వైపు నుంచి వారధి వైపు అతి వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని కారు అతనిని బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమా చారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వైద్య విద్య ఉన్నతమైనది
పీసిమ్స్ ఫ్రెషర్స్ డే వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ గన్నవరం రూరల్: వైద్య విద్య ఉన్నతమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల 2025 ఫ్రెషర్స్డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు టెలి మెడిసిన్ హాల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంబీబీఎస్ విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోట్ సెర్మనీలో తెల్ల కోట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంబీబీఎస్ చదివే అదృష్టం కొందరికే దక్కుతుందన్నారు. సేవా భావం, నైతిక విలువలు, చదువు, వృత్తి పట్ల అంకిత భావం ఉన్నత స్థానానికి తీసుకువెళతాయని విద్యార్థులకు సూచించారు. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైద్య విద్య చదివేందుకు చేరిన విద్యార్థులు ఉత్తమ లక్ష్యంతో ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్కుమార్ పాల్గొన్నారు. -
వీఐపీలకు ఒకలా.. టికెట్లపై మరోలా...
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దేవస్థాన అధికారులు తీసుకుంటున్న పలు నిర్ణయాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు, వీఐపీలు, నూతన వధూవరులు వేద ఆశీర్వచనం అందుకోవాలని భావిస్తారు. ఇందులో నూతన వధూవరులకు దేవస్థానం ఉచితంగా వేద ఆశీర్వచనం అందజేస్తుండగా, వీఐపీలకు, ప్రముఖులకు దేవస్థానం వేద ఆశీర్వచనం అందజేస్తుంది. అమ్మవారి దర్శనం అనంతరం వెలుపలకు వచ్చే మార్గంలో మండపంలో ఆశీర్వచనం అందజేస్తారు. అదే సామాన్య భక్తులు అయితే రూ.500 టికెట్ కొనుగోలు చేయడం ద్వారా వేద పండితుల ఆశీర్వచనం పొందే అవకాశం కలుగుతుంది. అయితే సోమవారం నుంచి మండపం నుంచి ఆశీర్వచనాన్ని ఆలయం బయట రాజగోపురం పక్కనే లక్ష కుంకుమార్చన వేదిక వద్దకు తరలించారు. టికెటు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రమే ఇక్కడ వేద ఆశీర్వచనం అందచేస్తున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. వీఐపీలు, చైర్మన్ సిఫార్సులపై వచ్చే వారికి మాత్రం అంతరాలయంలో వేద ఆశీర్వచనం అందజేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై భక్తుల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. చైర్మన్, బోర్డు సభ్యులకు వేరు వేరుగా చాంబర్లు దుర్గగుడికి ఎప్పుడు చైర్మన్ నియామకం జరిగినా బోర్డు సభ్యులు ఆ కార్యాలయంలోనే ఉండేవారు. అయితే ప్రస్తుత చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాత్రం బోర్డు సభ్యులు తన చాంబర్లో ఉండేందుకు అంగీకరించలేదు. దీంతో దేవస్థాన అధికారులు బోర్డు సభ్యులకు పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద ప్రత్యేకంగా చాంబర్ను ఏర్పాటు చేశారు. బోర్డు సభ్యుల కోసం వచ్చే వారిని చాంబర్ బయట కూర్చునేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. చైర్మన్ తీరుపై బోర్డు సభ్యులు కినుక వహించి దేవస్థానానికి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తులాభారానికి సైతం స్థానచలనం దేవస్థాన స్ట్రాంగ్రూమ్ వద్ద ఉన్న తులాభారాన్ని అధికారులు ఇటీవల బోర్డు సభ్యుల చాంబర్ వద్దకు తరలించారు. గతంలో ఉన్న ప్రదేశంలో భక్తులకు అవసరమైన సమాచారాన్ని దేవస్థాన మైక్ రూమ్ సిబ్బంది తెలిపేవారు. భక్తులు తులాభారంగా సమర్పించే బియ్యం, చిల్లర నాణేలు, పసుపు, కుంకుమ, పటికబెల్లం, బెల్లం ఇతర సరుకులను జాగ్రత్తగా దేవస్థాన స్టోర్కు అప్పగించే వారు. తాజాగా మార్పు చేసిన తులాభారం వద్ద దేవస్థాన సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడం, అక్కడ భక్తులు సమర్పించిన సరుకులు దారి మళ్లుతున్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విమర్శలకు దారితీస్తున్న మార్పులు -
అమృతలింగేశ్వరుని సన్నిధిలో తనికెళ్ల భరణి
ముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామంలోని కోటి లింగ హరిహర మహా క్షేత్రంలోని కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామి వారిని సోమవారం సినీ నటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. సాధారణ భక్తుడిలా ఆలయంలోకి వచ్చి పూజలు చేశారు. విషయం తెలుసుకున్న అర్చకులు, అధికారులు మరలా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. కోటిలింగాల క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని భరణి అన్నారు. ఆలయ ఈవో హరిదుర్గా నాగేశ్వరరావు, అర్చకులు మణికంఠ, హర్ష పూజల అనంతరం ప్రసాదాలు అందజేశారు. టోల్గేట్ కాంట్రాక్టర్కు రూ.50 వేలు జరిమానా బకాయి చెల్లింపునకు 72 గంటలు గడువు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి టోల్గేట్ కాంట్రాక్టర్ వీఎల్డీ ఏజెన్సీకి దుర్గగుడి అధికారులు రూ.50 వేలు జరిమానా విధించారు. దుర్గగుడి దిగువన అక్రమంగా పార్కింగ్ డబ్బులు వసూలు, భక్తుల బెదిరింపులపై దేవస్థానానికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్ పలుమార్లు కాంట్రాక్టర్కు నోటీసులు సైతం జారీ చేశారు. అయినా కాంట్రాక్టర్ తీరు మారకపోవడంతో సోమవారం రూ.50 వేలు జరిమానా విధించారు. జరిమానాను 3 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానానికి బకాయి ఉన్న రూ.1,11,98,199ను 72 గంటల్లో చెల్లించాలని ఆదేశించారు. 72 గంటల్లో బకాయి మొత్తం చెల్లించని పక్షంలో టెండర్ షరతుల మేరకు దేవస్థానం రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఒకే నెలలో 10.70 కిలోమీటర్ల మేర స్లీపర్లను పునరుద్ధరించి రికా ర్డు నెలకొల్పినట్లు డీఆర్ఎం మోహిత్ సోనాకియా చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే కారిడార్లలో ఒకటైన విజయవాడ–విశాఖపట్నం ట్రంక్ రూట్లో ఎటువంటి రైళ్ల రద్దుగాని, దారి మళ్లింపు లేకుండా ఈ పనులు చేపట్టినట్లు వివరించారు. ఇంజినీరింగ్, ఆపరేటింగ్, ఎస్అండ్టీ, టీడీఆర్ విభాగాల సమష్టి కృషితో విజయవాడ డివిజన్ ఈ అరుదైన ఘనత సాధించినట్లు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో 28 ట్రాఫిక్ బ్లాక్లను ఏర్పాటు చేశామని, అందులో రెండుసార్లు ఒకే రోజులో రెండు బ్లాక్లను ఏర్పాటు చేయడం దక్షిణ మధ్య రైల్వేలోనే మొదటిసారి కావటం విశేషమన్నారు. దీని కోసం ప్రత్యేకమైన టీఆర్టీ యంత్రాన్ని ఉపయోగించి 352 కేజీల బరువుతో ఉండే స్లీపర్లను తొలగించినట్లు వెల్లడించారు. -
ముగిసిన యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పరీక్ష
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/ వన్టౌన్(విజయవాడ పశ్చిమ): ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన ఈపీఎఫ్ఓ పరీక్ష– 2025 ముగిసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి నగరంలోని 15 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరిగింది. 5,860 మంది అభ్యర్థులకు 2,183 మంది (37.25 శాతం) హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని సీవీఆర్ ఉన్నత పాఠశాల, చిట్టూరి హైస్కూల్, ప్రభాస్ పీజీ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయడానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇబ్బంది లేకుండా పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన లైజనింగ్ అధికారులు, వెన్యూ సూపర్వైజర్లు, సమన్వయ శాఖల అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు తెలిపారు. చిట్టూరి హైస్కూల్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ లక్ష్మీశ, ఇతర అధికారులు -
గిరిజనులపై సర్కార్ నిర్లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): మైదాన ప్రాంత గిరిజనులపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో గిరిజన హక్కుల సాధనకు ఉద్యమించాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ పేర్కొన్నారు. మచిలీపట్నం ఎన్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం గిరిజన ప్రజా సమాఖ్య, విద్యార్థి సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం కేటాయించే నిధులు సద్వినియోగం కావాలంటే చట్టసభల్లో గిరిజనులకు సరైన ప్రాతినిథ్యం ఉండాలన్నారు. 1967లో జిల్లా యూనిట్ స్థానంలో రాష్ట్ర యూనిట్ విధానాన్ని అమలు చేయడంతో గిరిజనులకు నష్టం వాటిల్లిందన్నారు. ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనలను గిరిజన సంఘాలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానించారు. సమావేశంలో వివిధ గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరి జన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, కార్పొరేటర్ యాకసిరి వెంకటేశ్వరరావు, సుగాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, రవి నాయక్, పద్మరాజు, నాగరాజు, పాండు రంగారావు, కిరణ్, హనుమంతు నాయక్, సత్యనారాయణ, వెంకటరత్నం పాల్గొన్నారు. -
కార్తికేయుని సన్నిధిలో భక్తజన సందడి
మోపిదేవి: మండల కేంద్రమైన మోపిదేవిలో వేంచేసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా కనిపించింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆన్లైన్ ఆర్జిత సేవల బుకింగ్ ప్రారంభం సుబ్రహ్మణ్యస్వామి ఆర్జితసేవల పూజలను భక్తులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిసర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సర్పదోష నివారణ, రాహుకేతు పూజలు, శాంతి కళ్యాణం, సుప్రభాతం, అష్టోత్తరపూజ, సహస్ర నామార్చన, అభిషేకం వంటి ఏడు రకాల పూజలకు ఆన్లైన్లో రిజస్టర్ అయి లాగిన్ ద్వారా తేదీ, టైం, స్లాట్ను ముందుగా బుక్ చేసుకోవచ్చని వివరించారు. ● స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఒక్క రోజు వివిధ సేవా టికెట్ల రూపంలో ఆదాయం రూ. 9,82,581 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు -
వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమలగిరి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరగనున్న స్వామి వారి పవిత్రోత్సవాలు ఘనంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత వాస్తుపూజ, వాస్తు హోమం, రక్షా బంధనం, అంకురారోహణ వంటి కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు తిరునగరి రామ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద అంకురారోహణ నిర్వహించి పవిత్రోత్సవాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సాంబశివరావు, చైర్మన్ భరద్వాజ్, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: జాతీయ తైక్వాండో పోటీల్లో మండలంలోని జూపూడి గ్రామానికి చెందిన కలతోటి దామిని అత్యుత్తమ ప్రతిభ చాటి ఐదు పతకాలు సాధించింది. ఉత్తరప్రదేశ్లో నవంబర్ 21 నుంచి 23 వరకు జరిగిన తైక్వాండో పోటీలో వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో తలపడి రెండు బంగారు, రెండు రజత, ఒక కాంస్య పతకాన్ని గెలుసుకుంది. 55–59 కిలోల విభాగంలో ఆమె పాల్గొంది. ఉమ్మడి కృష్ణా జిల్లా కోచ్ అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన దామిని గతంలో కూడా వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పతకాలు సాధించింది. దామిని ప్రతిభకు పలువురు అభినందనలు తెలిపారు. గుణదల డాన్ బోస్కో పాఠశాలలో బాలిక 9వ తరగతి చదువుతోంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025రైతుల్లో ఆందోళన 7గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.భవానీపురం(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ అన్నప్రసాద వితరణకు ఆదివారం తెలంగాణలోని మేడ్చర్ల వాస్తవ్యులు ఎంవీ రామ్శెట్టి దుర్గాప్రసాద్ రూ.1,00,000 విరాళంగా అందజేశారు.నందిగామ రూరల్: నందిగామలో హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయ ఆవరణలో అయ్యప్ప మహా పడిపూజను కనులపండువగా నిర్వహించారు.కంకిపాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దిత్వా తుపానుగా మారడంతో రైతన్న దిగులు పడుతున్నాడు. తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. బందరు, గుడివాడ, పామర్రు, పెనమలూరు, పెడన నియోజకవర్గాల్లో ఆదివారం ఉదయం నుంచే మోస్తరు వర్షం కురుస్తోంది. సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారుతుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోత కోసి మార్కెట్కు తరలించేందుకు సిద్ధం చేసిన పంట వర్షం పాలు కాకుండా ఉండటానికి రైతులు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. 3.83 లక్షల ఎకరాల్లో సాగు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.54 లక్షల హెక్టార్లలో (3.83 లక్షల ఎకరాలు) వరి సాగు చేపట్టారు. ప్రధానంగా ఎంటీయూ, బీపీటీ, స్థానిక వరి వంగడాలను రైతులు ఎంపిక చేసుకుని సాగు చేశారు. పదిహేను రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు ఆరంభమయ్యాయి. ఇప్పటి వరకూ 287 పీపీసీ క్లస్టర్ల పరిధిలో ధాన్యం సేకరణ జరుగుతోంది. 1.50 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. రోడ్లపైనే ధాన్యం రాశులు జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఎక్కడ చూసినా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రోడ్డు మార్జిన్లు, రియల్ వెంచర్లలో ధాన్యం కుప్పలుగా పోసి ఉంచారు. మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్నా గోనె సంచులు, రవాణా వాహనాల లభ్యత సజావుగా సాగక పోవడంతో ధాన్యం ఎక్కడిదక్కడే నిలిచిపోతోంది. ఈ నెల మూడో వారంలోనే తుపాను హెచ్చరికలు ఉన్నా వాతావరణ పరిస్థితులు సహకరించడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈసారి మాత్రం వాతావరణం ప్రతికూలంగా మారింది. గోరుచుట్టుపై రోకలి పోటు చందం పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించే క్రమంలో దిత్వా తుపాను గోరుచుట్టుపై రోకలి పోటు చందంగా మారిందని రైతులు వాపోతున్నారు. చిరుపొట్ట, కంకులు గట్టిపడే దశలో మోంథా తుపాను విరుచుకుపడింది. జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సుమారు 40 వేల హెక్టార్లలో (1.10 లక్షల ఎకరాలు) వరి పంట నేలవాలింది. నేలవాలిన పంట వర్షం నీటిలో నాని కంకులు దెబ్బతిన్నాయి. అక్కడక్కడా ధాన్యం కంకులు మొలకెత్తడం, మడమతాలు, మానుగాయ ఏర్పడటంతో రైతులు ఆర్థికంగా నష్టాన్ని చవిచూశారు. ఎకరాకు రూ 35 వేలు పెట్టుబడులు పెట్టగా, కౌలు చెల్లింపులు, పెట్టుబడులు అన్నా చేతికి దక్కితే చాలని భావించారు. ఆఖరికి దిగుబడులు సైతం ఎకరాకు 28 బస్తాలకు (బస్తా 75 కిలోలు) మించి వచ్చిన దాఖలాలు లేవు. మరోసారి ప్రకృతి కన్నెర్ర అందిన కాడికి పంటను మద్దతు ధరకు అమ్ముకుందామని ఆశించిన తరుణంలో దిత్వా తుపాను రూపంలో మరోమారు ప్రకృతి కన్నెర్ర చేయడం తో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే తేమ శాతం ఎక్కువగా ఉందని సాకుగా చూపి బస్తాకు రూ.1,500 మించి ధర దక్కక రైతులు అల్లాడుతున్నారు. ఈ సమయంలో ధాన్యం నిమ్ముకోవడం, తేమశాతం పెరగడంతో తమ పరిస్థితి అధ్వానంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. తుపాను బారిన పంట పడకుండా కాపాడుకునే చర్యల్లో అన్నదాతలు నిమగ్నమవుతున్నారు. -
డిప్రెషన్లో నవతరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశాభివృద్ధిలో భాగస్వాములైన నవతరం ప్రస్తుతం డిప్రెషన్తో సతమతమవుతోంది. అయితే దీనికి భయపడొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మన ఆలోచనలు.. ఆచరణలు అన్నీ మెదడుపై ఆధారపడి ఉంటాయి. కర్తవ్యాలను నెరవేరుస్తూ లక్ష్యాలను చేరి ఆనందంగా ఉండటానికి, ఇతర అవయవాలతో పాటు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండేలా చూడాలి. అయితే నేటి యువత డిప్రెషన్తో తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే నిదర్శనం ● లబ్బీపేటకు చెందిన వెంకటేష్ (పేరు మార్చాం) ఇంజినీరింగ్ సెకండియర్ విద్యార్థి. ఇటీవల తీవ్ర మానసిక ఒత్తిళ్ల కారణంగా మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అతనికి కౌన్సి లింగ్ ఇవ్వగా, సోషల్ మీడియా ప్రభావంతో డిప్రెషన్కు గురైనట్లు తెలిపారు. ● విద్యాధరపురానికి చెందిన నరేష్(పేరు మార్చాం) ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. ఇటీవల చదువుపై దృష్టి పెట్టకపోవడం, ఆహారం సరిగా తీసుకోక పోవడంతో మానసిక నిపుణులను ఆశ్రయించారు. అక్కడ కౌన్సిలింగ్ చేయగా, ‘ఎంత చదివినా మార్కులు రావడం లేదు. తనకంటే స్నేహితులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయని’ డిప్రెషన్కు గురవుతున్నట్లు తెలిసింది. ఇలా నేటి యువత అనేక కారణాలతో మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. నగరంలోని మానసిక నిపుణులను సంప్రదిస్తున్న వారిలో యువతే అధికంగా ఉంటున్నారు. ఒక్కో మానసిక నిపుణుడి వద్దకు నెలకు 15 నుంచి 20 మంది వరకూ డిప్రెషన్కు గురవుతున్న వారు వస్తున్నట్లు చెబుతున్నారు. యువతలో పెరుగుతున్న డిప్రెషన్ ప్రస్తుతం 14 నుంచి 25 ఏళ్ల మధ్య వారు ఎక్కువగా డిప్రెషన్కు గురవుతున్నట్లు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చిన్న చిన్న కారణాలకే డిప్రెషన్కు లోనై ఆహారం సరిగా తీసుకోక పోవడం, దిగులుగా ఉండటం, చదువుపై దృష్టి పెట్టలేక పోతున్నట్లు చెబుతున్నారు. ఫిజికల్ ఎక్సర్సైజు లేక పోవడం యువతపై ప్రభావం చూపుతోందంటున్నారు. ప్రధానంగా పరీక్షల విషయంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు వైద్య నిపుణులు అంటున్నారు. నేటి యువత ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్కు గురవుతున్నారు. నిజంగా సీరియస్గా ఏమి తీసుకోవాలి, లైట్గా ఏమి తీసుకోవాలో తెలియడం లేదు. దేనికి ఎంత వాల్యూ ఇవ్వాలో కూడా విచక్షణ ఉండటం లేదు. ఇంటర్మీడియెట్, పాఠశాల స్థాయిలో కేవలం సిలబస్ పూర్తి చేయడం, మార్కులు, ర్యాంకులు, బట్టీ చదువులపైనే దృష్టి పెడుతున్నారు. విలువలు, జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడం ఎలా అనే అంశాలను తెలియచేయడం లేదు. డిప్రెషన్కు సోషల్ మీడియా కూడా కారణమే. – డాక్టర్ యు.రాఘవరావు, మానసిక వైద్య విభాగాధిపతి, ప్రభుత్వాస్పత్రి -
పూత ఎండమామిడి
జి.కొండూరు: మామిడి తోటల్లో చెట్లకు పూత కనిపించడంలేదు. ఈ పాటికి పూతతో కళకళలాడాల్సిన చెట్లు వెలవెలబోతున్నాయి. అకాల వర్షాలు, పురుగులు, తెగుళ్ల దాడితో గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. సాధారణంగా నవంబరు నెల నుంచి పూత ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటి వరకు 80 శాతానికి పైగా మామిడి తోటల్లో అసలు పూతే కనిపించడంలేదు. ఒకవేళ ఆలస్యంగా పూత వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు, తెగుళ్లను తట్టుకొని నిలబడడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది దిగుబడి 50 శాతానికి పడిపోగా ఈ ఏడాది 30 శాతం దిగుబడి రావడం కూడా కష్టమేనని రైతులు అంచనా వేస్తున్నారు. గతేడాది అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం కూడా అందించకపోవడంతో అప్పులపాలై లబోదిబోమంటున్నారు. మామిడి సాగుతో నష్టాలు వస్తుండడంతో ఏటా పదిశాతం తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు. పూత రావడం కష్టమే.. గతేడాది ప్రారంభంలో మామిడి ధర ఊరించినప్పటికీ పురుగులు, తెగుళ్లు, ఆకాల వర్షాలతో కాయ నాణ్యత పడిపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధర పతనమైంది. దీనితో కోత కూలి కూడా వచ్చే అవకాశం లేక రైతులు ఆఖరి కోతలను ఆపేశారు. కాయలు చెట్లపైనే పండిపోయి రాలిపోయాయి. దీని వల్ల చెట్ల కొమ్మల్లో ఉండే బలం మొత్తం తగ్గిపోయి ఈ ఏడాది పూత రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఆలస్యంగానైనా పూత వచ్చే అవకాశం ఉండదని మరో ఏడాది గడిస్తే కానీ పూత వచ్చే అవకాశం ఉంటుందని రైతులు చెబతున్నారు. దీని వల్ల ఈ ఏడాది కూడా రైతులు మామిడిపై ఆశలు వదిలేసుకున్నారు. ఏటా నష్టాలే.. ఈ ఏడాది పూత పరిస్థితిని బట్టి 30 శాతం కూడా మామిడి దిగుబడి వచ్చేలా లేదని రైతులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెడ్డిగూడెం, విస్సన్నపేట, విజయవాడ రూరల్ మండలాల్లో అక్కడిక్కడా కొద్దిపాటు మామిడి తోటల్లో పూత వచ్చి పిందెలు కాస్తున్న క్రమంలో తుపానులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలో 2023–24 సంవత్సరంలో 1.76 లక్షల టన్నుల మామిడి దిగుబడి వచ్చింది. గతేడాది 85 వేల టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. మామిడి కోతల ప్రారంభంలో రెడ్డిగూడెం మండల పరిధి మిట్టగూడెం మ్యాంగో మార్కెట్లో బంగినపల్లి టన్ను రూ.1.20 లక్షలు, తోతాపురి టన్ను రూ.70 వేలు, రసాలు టన్ను రూ.40 వేలకు అమ్ముడుపోగా ఆఖరికి టన్ను బంగినపల్లి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, తోతాపురి, రసాలు టన్ను రూ.2 వేల నుంచి రూ.5వేలకు ధర పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో మామిడి సాగు ఇలా.. ఎన్టీఆర్ జిల్లాలో పదహారు మండలాల్లో పదహారు వేల మంది రైతులు 22,896 హెక్టార్లలో మామిడిని సాగు చేస్తున్నారు. మండలాల వారీగా వత్సవాయి మండల పరిధిలో 165 హెక్టార్లు, జగ్గయ్యపేట 295 హెక్టార్లు, పెనుగంచిప్రోలు 244 హెక్టార్లు, నందిగామ 251 హెక్టార్లు, వీరులపాడు 113 హెక్టార్లు, మైలవరం 3,353 హెక్టార్లు, గంపలగూడెం 616 హెక్టార్లు, తిరువూరు 817 హెక్టార్లు, ఎ.కొండూరు 2,336 హెక్టార్లు, రెడ్డిగూడెం 4,450 హెక్టార్లు, విస్సన్నపేట 5,817హెక్టార్లు, జి.కొండూరు 2,324 హెక్టార్లు, కంచికచర్ల 125 హెక్టార్లు, చందర్లపాడు 20 హెక్టార్లు, ఇబ్రహీంపట్నం 18 హెక్టార్లు, విజయవాడ రూరల్ 1,952 హెక్టార్లలో మామిడి తోటలు సాగువుతున్నాయి. గతేడాది పురుగులు, తెగుళ్లతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోగా ఏప్రిల్లో వచ్చిన అకాల వర్షాలు, పెనుగాలులకు జిల్లాలో 15,300 హెక్టార్లలో 50 శాతానికిపైగా కాయలు నేలరాలి తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపినప్పటికీ రైతులకు చిల్లిగవ్వ కూడా పరిహారంగా ఇవ్వలేదు. జిల్లాలో 279 మంది రైతులు మాత్రమే 246 ఎకరాలకు బీమా ప్రీమియం చెల్లించారు. బీమా ప్రీమియం చెల్లించి పంట నష్టపోయిన రైతులకు సైతం ఇంతవరకు బీమా సొమ్ము అందలేదు. -
భజే భవాని
కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో..భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్పలు, భవానీలు, సాధారణ భక్తులు రావడంతో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరగడంతో ఈఓ శీనా నాయక్ సిబ్బందికి సూచనలు చేశారు. ఘాట్ రోడ్డు ద్వారా ఇంద్రకీలాద్రిపైకి వచ్చే వాహనాలను ఓం మలుపు వద్ద క్రమబద్ధీకరించారు. ఘాట్ రోడ్డు వైపు ఇటు మహామండపం వైపు నుంచి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులను బ్యాటరీ వాహనాల్లో తరలించే ఏర్పాటు చేశారు. రూ.500 దర్శనం క్యూతోపాటు అన్ని లైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. లగేజీని క్లోక్ రూమ్లో పెట్టేలా చర్యలు ఇంద్రకీలాద్రిపై భద్రతా చర్యల్లో భాగంగా కాలేజీ బ్యాగులు, లగేజీతో ఆలయ క్యూల్లో ప్రవేశించిన భక్తులను చూసిన ఈఓ శీనానాయక్ వారిని వెనక్కి పంపి లగేజీని క్లోక్ రూమ్లో పెట్టుకుని రావాలని ఆదేశించారు. ఆర్జిత సేవలైన సూర్యోపాసన, చండీ హోమం, లక్ష కుంకుమార్చన తదితర సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రద్దీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు కుమ్మరిపాలెం సెంటర్ నుంచి టోల్గేట్ వరకు వాహనాలను రోడ్డు పక్కన పార్కింగ్ చేయించారు. ఇంద్రకీలాద్రిపై క్యూలో భక్తజనం -
అల్లకల్లోలంగా హంసలదీవి సాగర తీరం
కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను కారణంగా హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. రెండు రోజులుగా సాగరతీరంలో అలలు ఉధృతి ఎక్కువగానే ఉంది. అయితే ఆదివారం ఆ తీవ్రత మరింత పెరిగింది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు కూడా ముందుకు చొచ్చుకొచ్చి డాల్ఫిన్ భవనం చుట్టూ చేరాయి. తీరంలోని ఇసుకతిన్నెలు సైతం భారీగా కోతకు గురయ్యాయి. సముద్ర పరిస్థితులు భిన్నంగా ఉండడంతో అటవీ, మైరెన్ పోలీసులు బీచ్లోకి పర్యాట కుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. మరో రెండు రోజుల పాటు బీచ్ గేట్లు మూసే ఉంటాయని అటవీ అధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ పామర్రు: రాష్ట్రంలో నష్టపోయిన ధాన్యం రైతులకు తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి ఆదు కోవాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు తమది రైతుల ప్రభుత్వమని రైతులకు అన్నీ బాగా చేస్తున్నామని, గత ప్రభుత్వంలోనే రైతులకు అన్యాయం జరిగిందనే చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఒక్కసారి టీడీపీ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతుల పరిస్థితిని చూడాలని సూచించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి గిట్టు బాటు ధర కల్పించిందని గుర్తుచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరైతు కూడా సాగులో పరుగు మందులు, ఎరువులు, యారియా దొరకలేదని రోడ్లు ఎక్కిన పరిస్థితి లేదని, టీడీపీ ప్రభుత్వంలో యూరియా దొరక్క రోడ్లెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి చూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్సు పాలసీలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
దీక్షల విరమణ ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు)/ భవానీపురం(విజయవాడ పశ్చిమ): భవానీ దీక్షల విరమణ బందోబస్తు ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర అధికారులతో కలిసి ఆదివారం పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ నెల 11 నుంచి 15 వరకూ దీక్షల విరమణలు జరగనున్నాయి. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ పరిసరాలతో పాటు, గిరి ప్రదక్షిణ ప్రాంతాలను సందర్శించారు. పెద్ద సంఖ్యలో పలు ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి మాలధారణ చేసి దీక్ష విరమణకు నగరానికి రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఇతర పోలీస్ అధికారులతో కలిసి టెంపుల్ పరిసర ప్రాంతాలను, స్నాన ఘాట్లను, హోమగుండాలు, ఇరుముడుల స్టాండ్ల ఏర్పాటు, ప్రదేశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు గిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేసి, దర్శన సమయంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యూ, దర్శనం అనంతరం భక్తులు వెళ్లే మార్గాలను పరిశీలించి పటిష్ట భద్రతకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. భవానీల సౌకర్యార్థం రెండు ఫుట్బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్పాటిల్, ట్రాఫిక్ డీసీపీ షిరీన్బేగం, ఏసీపీలు డి.పవన్కుమార్, రామచంద్రరావు, సీఐలు పాల్గొన్నారు. -
విద్యుత్ వైర్లు చోరీ చేసే ముఠాకు చెక్
కంకిపాడు: ఖాళీగా ఉన్న వెంచర్లలో విద్యుత్ స్తంభాలకు ఉన్న అల్యూమినియం వైర్లను చోరీ చేసే ముఠాకు కంకి పాడు పోలీసులు చెక్ పెట్టారు. చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ జె.మురళీకృష్ణ కథనం మేరకు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన గరికే చందు ఇళ్ల వెంబడి ఉల్లిపాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ మద్యం, పేకాటకు బానిసయ్యాడు. తన గ్రామానికే చెందిన గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, మంగళగిరి మండలం యర్రబాలెంనకు చెందిన పాత ఇనుప కొట్టు నిర్వాహకుడు కుంటిగుర్ల నరసింహరాజుతో కలిసి జల్సాలు తీర్చుకోవటానికి, డబ్బుకోసం విద్యుత్ వైర్లు చోరీని మార్గంగా ఎంచుకున్నారు. కంకిపాడు, జగన్నాధపురం, కొణతనపాడు, ప్రొద్దుటూరు, దావులూరు గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లలో స్తంభాలకు ఉన్న విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్నారన్నారు. గరికే చందుపై గతంలో నాలుగు వైరు చోరీ కేసులు ఉన్నాయి. విద్యుత్ వైర్లు చోరీపై నమోదైన కేసులో భాగంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రొద్దుటూరు గాయత్రీ విహార్ వద్ద గరికే చందు, గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, కుంటిగుర్ల నరసింహరాజు అల్యూమినియం రేకులు ఏరుతూ సంచుల్లో మూట గట్టడాన్ని పోలీసులు గుర్తించారు. గరికే చందు, కుంటిగుర్ల నరసింహరాజు పోలీసులకు చిక్కగా, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. కంకిపాడు పరిసర గ్రామాల్లో అల్యూమినయం వైర్లు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైరును స్వాధీనం చేసుకు న్నారు. కేసు నమోదు చేసి నిందితులు చందు, నరసింహరాజును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని సీఐ మురళీకృష్ణ తెలిపారు. కేసు విచారణలో ముఖ్యభూమిక వహించిన ఎస్ఐ డి.సందీప్, పీఎస్ఐ ఎస్.సురేష్, హెచ్సీ కె.చంద్రబాబు, పీసీలు పి.ఎస్.ఎన్.మూర్తి, సయ్యద్ బాజీబాబును ప్రత్యేకంగా అభినందించారు. -
12 నుంచి రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అనంతపురంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ యోగా చాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి రామ కృష్ణప్రసాద్ తెలిపారు. నగరంలోని యోగాసన స్పోర్ట్స్ అసోసయేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సబ్జూనియర్స్ యోగాసన చాంపియన్షిప్లో భాగంగా ఇప్పటికే జిల్లా స్థాయి పోటీలు నిర్వహించామని, విజేతలు అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 28వ తేదీన మహారాష్ట్రలోని సంఘామూర్లో జరిగే జాతీయ స్థాయి యోగాసన పోటీలకు ఎంపికవుతారన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సంద ర్భంగా ఈ నెల 21వ తేదిన రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెడిటేషన్ క్లాసులను నిర్వహిస్తున్నా మని గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ ఆంజనేయులు మాట్లాడుతూ.. మెడిటేషన్ క్లాసులకు తమ సంస్థ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. డాక్టర్ పావని ప్రియాంక, అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి దారా కరుణశ్రీ,, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు రాధిక, సెక్రటరీ ప్రేమ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి, సెక్రటరీ రాజేశ్వరి, ఆర్.చరణ్, శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసన పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ‘నిరసన’ సంతకం
లబ్బీపేట (విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వ తీరుపై నిరసన సంతకాలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వద్దంటూ ప్రజలంతా సంతకాలతో చంద్రబాబు ప్రభుత్వానికి తేల్చిచెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ శిబిరాల వద్దకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. ఈ విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామంటూ అన్ని వర్గాల ప్రజలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన సభల్లో ఏకంగా 95 వేల మందికి పైగా సంతకాలు చేశారు. ఇందులో టీడీపీ మద్దతుదారులు కూడా పాల్గొనడం బాబు ప్రభుత్వ దుర్మార్గ విధానాలపై ప్రజల వ్యతిరేకతకు అద్దం పడుతోంది. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యాక్రమాల ద్వారా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సంతకాల సేకరణ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాం. ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైందని తమ సంతకం ద్వారా ప్రజలు తేల్చిచెబుతున్నారు. – దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, విజయవాడ తూర్పు నియోజకవర్గం


