breaking news
NTR district Latest News
-
వసంత నవరాత్రులు, ఉగాది ఏర్పాట్లపై సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు, ఉగాది పర్వదిన ఏర్పాట్లపై ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆలయ అర్చకులు, వేద పండితులు, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు. ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయానికి చేసే పూల అలంకరణ, పంచాంగ శ్రవణం, విశేష పూల అర్చనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉగాదిని పురస్కరించుకుని ఆదిదంపతులకు నిర్వహించే వెండి రథోత్సవానికి రథాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. చైత్ర బ్రహ్మోత్సవాల పైన చర్చ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించే చైత్ర మాస బ్రహ్మోత్సవాలపైన చర్చ జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదిదంపతులకు నిర్వహించే వాహన సేవలు, వెండి రథోత్సవంతో పాటు ఉత్సవాల చివరి రోజున జరిగే హంస వాహన సేవ ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వి.శ్రీధర్శర్మ, ఏసీ రంగారావు, ఏఈవోలు బి.వి.రెడ్డి, పి.చంద్రశేఖర్, కె.గంగాధర్, ఈఈ ఎల్.రమ పాల్గొన్నారు. -
కావూరి అంత్యక్రియల్లో పేర్ని నాని
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లపూడికి చెందిన కన్నెగంటి సాంబశివరావు మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
ప్రత్యేక షెడ్డులో భద్రపరిచిన నూతన రథం
మోపిదేవి: ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆర్థిక సహకారం కోటి రూపాయలతో తయారుచేసిన కొయ్య రథాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో గురువారం భద్రపరిచారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి స్వామివారి బ్రహ్మోత్సవాలకు గాను బహూకరించిన ఈ రథాన్ని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సినీ నిర్మాత నారాయణరావుతో వేదపండితులు ఉదయం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డులో రథాన్ని భద్రపరిచినట్లు ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు వెల్లడించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, ఆలయ అఽధికారులు బర్మా ప్రసాద్ పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు ఈ నెలలో వచ్చే రెండో శనివారం పాఠశాలలు పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. భారీ వర్షాలు, మోంథా తుపాను కారణంగా గతంలో ప్రకటించిన సెలవులకు మార్చి 14 తేదీ పరిహార పనిదినంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వేసవి విద్యుత్ వినియోగం పెరిగిందని, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఎస్ఈ, ఈఈ, డీఈలు, రెవెన్యూ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన ఇవ్వాలని ఆదేశించారు. ఫీడర్లు బ్రేక్ డౌన్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని అందరికీ అందేట్లు చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సర్వీస్లకు ఉచితంగా ఇచ్చే సోలార్ సర్వీస్ల ప్రోగ్రెస్ను ఆరా తీశారు. సమీక్ష సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్టు టీవీఎస్ఎన్ మూర్తి, డైరెక్టర్ ఫైనాన్స్ వెంకటేశ్వర్లు, సీజీఎం జైకిషోర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా ఎస్ఈ హనుమయ్య పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ప్రపంచ కిడ్నీ డేను పురస్కరించుకుని ఏపీ నెఫ్రాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం వాక్థాన్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద వాక్థాన్ను సీపీ ఎస్వీ రాజశేఖరబాబు జెండా ఊపి ప్రారంభించగా, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మధుమేహం, రక్తపోటు ఉన్న వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, నెఫ్రాలజిస్ట్స్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.అమ్మన్న, సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎంవీ సాయికృష్ణ, విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ చైర్మన్ టి.అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పొంగిన ఆవిర్భావోత్సాహం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేసింది. పార్టీ శ్రేణుల్లో నవోత్సాహం పెల్లుబికింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా... అభిమానుల్లో ఏమాత్రం తరగని ఉత్సాహం... అదే పార్టీకి ప్రాణవాయువు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయి లో సైతం పార్టీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో జరుపుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారీ కేక్లు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. పేదలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. విజయవాడ పోలీసు కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్సార్ పార్క్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైఎస్ జగన్ను మరోసారి సీఎంను చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో... విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గుణదలలోని నియో జకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పార్టీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గలతో పాటు మండల పార్టీ అధ్యక్షులు ప్రభుదాస్, గద్దె కళ్యాణ్ రామ్, సన్నీ, తుళ్లూరు ఉదయ్, సాయి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో... నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ముత్యాలంపాడులో నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో... విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 43వ డివిజన్ ఊర్మిళానగర్ వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి తో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. అనంతరం పేదలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, బండి పుణ్యశీల, కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, నాయకులు గౌస్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పోలీసు కంట్రోల్ రూం వద్ద గల వైఎస్సార్ పార్క్లో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత మహానేత విగ్రహానికి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్, వెస్ట్ నియోజకవర్గాల సమన్వయ కర్తలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ, పూనూరు గౌతంరెడ్డి, పోతిన మహేష్, గౌస్ మొహిద్దీన్, దొడ్డా అంజిరెడ్డి, బండి పుణ్యశీల, తంగిరాల రామిరెడ్డి, పోలి మెట్ల శరత్, సర్నాల చలపతిరావు, ఆళ్ల చెన్నారావు, అవుతు శ్రీనివాసరెడ్డి, కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హ్యాండ్బాల్ టోర్నీ విజేత కేబీఎన్ కాలేజీ
విజయవాడరూరల్: నున్న విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ)లో రెండు రోజులపాటు నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్బాల్ టోర్నీ బుధ వారం ముగిసింది. విజయవాడకు చెందిన కేబీఎన్ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు ద్వితీయస్థానాన్ని దక్కించుకుంది. మైలవరానికి చెందిన డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మూడో స్థానంలో, విజయవాడకు చెందిన పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. నాకౌట్–కమ్–లీగ్ విధా నంలో జరిగిన ఈ పోటీల్లో కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అనేక కళాశాలల జట్లు పాల్గొన్నాయి. టోర్నీ ముగింపు కార్యక్రమంలో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ కరస్పాం డెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణా యూనివర్సిటీ పురుషుల హ్యాండ్బాల్ జట్టును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఉదయ్ కుమార్, సెలెక్షన్ కమిటీ సభ్యులు మేజర్ మన్నే స్వామి, డి.హేమచంద్రరావు, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పింఛన్.. ఇంకెప్పుడు?
పటమట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడలో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని వైఎస్సార్ సీపీ సభ్యులు మండిపడ్డారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం వీఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రశ్నోత్తరాల్లో వచ్చిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా.. కూటమి సభ్యులు అడ్డుపడ్డారు. చివరి కౌన్సిల్లో టీడీపీ తీరు మార్చుకో కుండా అదే ధోరణిలో సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. దీన్ని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు దీటుగా ఎదుర్కొన్నారు. అరుపులు, కేకలు.. 2019 నుంచి 2024 వరకు, 2024 మే నుంచి ఇప్పటి వరకు నగరంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు కొత్తగా మంజూరు చేసిన పెన్షన్ వివరాలను సభ్యులు అడిగారు. అధికారులు సమాధానం ఇస్తుండగా టీడీపీ సభ్యులు లేచి అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కూడా లేచి గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లు, ఈ ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల జాబితాను వివరించారు. ఈ ప్రభుత్వ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. దీంతో సభలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. మేయర్ భాగ్యలక్ష్మి కల్పించుకొని అధికారులతో సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేసినా టీడీపీ సభ్యులు సభను సాగనివ్వలేదు. దీంతో మేయర్ ప్రశ్నోత్తరాల్లో తర్వాత అంశాన్ని చర్చించాల్సిందిగా ఆదేశించారు. సభను పక్కదారి పట్టిస్తున్నారు.. వేసవి ప్రారంభమైందని, వైఎస్సార్ సీపీ పాల కపక్షం ఏర్పడి ఐదేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా నగరంలో తాగునీటి కష్టాలను నిరోధించేందుకు సర్కిళ్ల వారీగా ఎన్ని రిజర్వాయర్లు మంజూరయ్యాయి.. వీటిలో ఎన్ని పూర్తయ్యాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వారీగా వివరాలు తెలపాలని సభ్యులు ప్రశ్నించగా.. అధికారులు ఇచ్చిన సమాధానాలతో సభ్యులు సంతృప్తి చెందలేదు. పాలకపక్షం కౌన్సిల్ సాక్షిగా చేసిన తీర్మానాలను కూడా అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని, ఇంజినీరింగ్ విభాగం కేవలం అధికారులు పనులు చేయటంలో ఆలస్యం చేస్తున్నారని, 7 తాగునీటి రిజర్వాయర్లకు శంకుస్థాపనలు చేయగా కేవలం రెండు మాత్రమే నిర్మించటంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. సర్కిల్–2లోని లోటస్ల్యాండ్మార్క్లో వీఎంసీ పలు అభివృద్ధి పనులు చేపట్టిందని, రోడ్లు, డ్రెయినేజీలు, పార్కులకు రూ.18 కోట్లు వెచ్చించినా అవి స్థానికులకు అందుబాటులోకి రాకుండా లోటస్ యాజమాన్యం అడ్డుకుందని, చివరికి శానిటరీ సిబ్బంది వెళ్లేదారి లేకుండా గేట్లకు తాళాలు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని సభ్యులు ప్రస్తావించారు. అది గేటెడ్ కమ్యూనిటీ అయితే 50శాతం భాగస్వామ్యం లోటస్ యాజమాన్యంతో చెల్లింపులు చేసిన తర్వాతే శానిటేషన్ చేయాలని, అక్కడి పార్కుల్లో వీఎంసీ బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్కు సూచించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లు, రీడింగ్ రూంల నిర్వహణను వీఎంసీతో పాటు స్థానికులను కూడా భాగస్వాములు చేయాలని, ఎస్సీ, ఎస్సీ, బీసీ, తదితర కమ్యూనిటీల ఆధ్వర్యంలోనే వాటి నిర్వహణ జరగాలని వచ్చిన ప్రతిపాదను సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. 122 అంశాలకు ఆమోదం.. వీఎంసీ చివరి సమావేశపు అజెండాలో మొత్తం 144 అంశాలు ప్రతిపాదించగా అందులో 122 అంశాలు ఆమోదించారు. ఆఫీస్ రిమార్కులకు 14 అంశాలు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాలుగు అంశాలను, వీఎంసీ చర్యలు తీసుకోవాలని మరో రెండు అంశాలు సిఫార్సు చేశారు. మరో అంశాన్ని ధ్రువీకరించగా, ఇంకో అంశాన్ని రికార్డు చేశారు. సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ పుణ్యశీల (ఇన్సెట్) కౌన్సిల్ నిర్వహిస్తున్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి -
అక్రమాల ప్లానింగ్పై కొరడా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్లో జరుగుతున్న అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఏసీబీ సోదాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల సోదాలు రెండో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ విభాగం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీకి సైతం ఆరు నెలలుగా భారీగా ఫిర్యాదులు అందాయి. నేపథ్యంలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు కీలక పత్రాలను పరిశీలించారు. కళ్లముందే అక్రమ కట్టడాలు బుధవారం కూడా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగాయి. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు నగరంలో పలు ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో భవనాలను తనిఖీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద దరఖాస్తులు చాలా తక్కువ సంఖ్యలో రావడం అనుమానాలకు దారితీసింది. కళ్లముందే అక్రమ కట్టడాలు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధానంగా అజిత్సింగ్ నగర్లోని ఆంధ్రప్రభ కాలనీ, అయోధ్యనగర్లో ఏసీబీ అధికారులు మూడు అక్రమ కట్టడాలను గుర్తించారు. బుధవారం సాయంత్రానికి రెండు భవనాలను క్షుణంగా తనిఖీ చేశారు. మూడో కట్టడాన్ని పరిశీలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా భవన నిర్మాణాల్లో డీవియేషన్లు, సెట్బ్యాక్స్, తీసుకున్న అనుమ తులు, ప్లానింగ్ ప్రకారం భవన నిర్మాణం చేపట్టారా లేదా వంటి అంశాలను తనిఖీచేశారు. అక్రమ నిర్మాణాలపై లావాదేవీలు జరిగాయనే అనుమానం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద డాక్యుమెంట్లను సేకరించారు. నగరంలోని మూడు సర్కిళ్లలో దాదాపు ఏడు భవనాలకు సంబంధించి తమ పరిశీలనలో డీవియేషన్లు ఉన్నట్లు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో ప్రాథమికంగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ప్రధానంగా సర్కిల్ –2 పరిధిలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని సమాచారం. సర్కిల్–1 పరిధిలో ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వన్టౌన్లో టౌన్ ప్లానింగ్ విభాగంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ ఒక భవనాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించారు. ముఖ్యంగా ప్లాన్లో చూపించిన వాటికన్నా, అదనంగా అంతస్తుల నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున డీవియేషన్లు ఉన్నట్లు గుర్తించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారుల అవినీతికి సంబంఽధించి వచ్చిన ఆరోపణలపైనా ఆరా తీస్తున్నారు. సర్కిల్–3 ప్రాంతంలో మూడు భవనాలను పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో తవ్విన కొద్దీ అవకతవకలు బయటపడుతున్నాయి. ప్లాన్లో చూపించిన వాటి కంటే అనధికారికంగా అదనపు అంతస్తుల నిర్మాణం యథేచ్ఛగా జరిగింది. కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను మంజూరు చేశారు. ఇలాంటివి పెద్ద ఎత్తున విజయవాడ సెంట్రల్, వన్టౌన్ ప్రాంతంలో జరిగాయి. ఈ విషయంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖాళీ స్థలానికి చెల్లించాల్సిన రుసుం తగ్గించి, కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టినట్లు గుర్తించారు. కొన్ని భవనాల యజమానుల నుంచి గ్రీన్ ట్యాక్స్ వసూలు చేయలేదు. లేబర్ సెస్ విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఈ క్షేత్ర స్థాయి తనిఖీలు, రికార్డులను పరిశీలించి, జరిగిన అవకతవలకపై ఏసీబీ అధికారులు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు. -
‘మధ్యాహ్న భోజనం’లో లోపాలు గుర్తించాం
జి.కొండూరు: మైలవరం తారకరామానగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోవడం లేదంటూ విద్యార్థులు మంగళవారం తమ ప్లేట్లలో భోజనాన్ని బకెట్లో పడవేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మీడియాలో కథనాలు రావడంతో డీఈఓ చంద్రకళ, తహసీల్దార్ అబ్దుల్దరియా, ఏంఈఓ ఎల్.బాలు, బండి రాజుతో కలిసి పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడిన అనంతరం డీఈఓ మీడియాతో మాట్లాడారు. డీఈఓ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం వివాదంపై ఇటీవల స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ తనిఖీలు జరిపినప్పుడు కొన్ని లోపాలను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఈ వివాదం కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ తన దృష్టికి రాలేదని డీఈఓ అన్నారు. బుధవారం జరిపిన విచారణలో వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, పాఠశాల హెచ్ఎం మధ్య విభేదాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇరువైపులా లోపాలు ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ క్రమంలో వంట ఏజెన్సీని రద్దు చేసేందుకు తీర్మానించినట్లు చెప్పారు. అదేవిధంగా పాఠశాల హెచ్ఎం మీద కూడా శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. పేద మహిళ ఉపాధిపై కొడతారా? వంట ఏజెన్సీ నిర్వాహకురాలిగా ఎటువంటి ఆరోపణలు లేకుండా 21 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళను కాదని వేరే వాళ్లకి ఎలా అప్పగిస్తారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చాట్ల సుధాకర్ డీఈఓని ప్రశ్నించారు. ప్రస్తుత హెచ్ఎం వచ్చాకనే ఈ వివాదమంతా ప్రారంభమైందన్నారు. ఇంత రాద్ధాంతానికి కారణమైన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి పేద మహిళ ఉపాధి మీద ఎలా దెబ్బకొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
దుర్గమ్మకు రూ.3.35 కోట్ల హుండీ ఆదాయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.35 కోట్ల కానుకలు సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించారు. 18 రోజులకు రూ.3,35, 86,637 నగదు, 302 గ్రాముల బంగారం, 3.010 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. 1,337 యూఎస్ఏ డాలర్లు, 55 ఇంగ్లాండ్ డాలర్లు, 132 సింగపూర్ డాలర్లు, 335 యూఏఈ దిర్హమ్స్, 55 ఆస్ట్రేలియా డాలర్లు, 60 కువైట్ దినార్లు, 220 ఖతర్ రియాల్స్, 20 హాంగ్కాంగ్ డాలర్లు, 200 మాల్దీవ్స్ రూపీ, 240 కెనడా డాలర్లు లభించనట్లు వివరించారు. కానుకల లెక్కింపులో సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొనగా, వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు. దుర్గమ్మకు రూ.4.50 లక్షల విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు బుధవారం రూ.4.50 లక్షల విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన కోటిరావు, అంజుకుమారి అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈఓ శీనానాయక్ను కలిసి అంజుకుమారి, తనీషిరావు పేరిట నిత్య ఉచిత ప్రసాద వితరణకు రూ.2.25 లక్షలు, గో సంరక్షణ పథకానికి రూ.2.25 లక్షల చొప్పున విరాళాలు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షగన్నవరం రూరల్: మండలం సూరంపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మూడో విడత విడుదల చేసే కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం ఏర్పాట్లపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎంత మంది రైతులు వస్తారు, వారికి ఏ విధంగా సదుపాయాలు కల్పించాలి, వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలి తదితర అంశాలపై చర్చించారు. అంకితభావంతో విధులు నిర్వర్తించాలిచిలకలపూడి(మచిలీపట్నం): అంకితభావంతో విధులు నిర్వర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక సూచించారు. జెడ్పీ సమావేశపు హాలులో బుధవారం సాయంత్రం పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తమ హయాంలో ఇప్పటికి 150 మంది వరకు కారుణ్య నియామకపత్రాలు అందజేశామని పేర్కొన్నారు. 100 మందికి పైగా ఉద్యోగోన్నతులు పొందారని వివరించారు. ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యు లను జాగ్రత్తగా చూసుకుని అందరి మన్ననలు పొందాలని సూచించారు. రికార్డు అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రెరీ అసిస్టెంట్లు ఏడుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. జూనియర్ అసిస్టెంట్లుగా 19 మందికి, టైపిస్టులుగా 19 మందికి, ఆఫీస్ సబార్డినేట్లుగా ముగ్గురికి కారుణ్య నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనంద్కుమార్, ఏఓ ఎం. తేజస్వీ తదితరులు పాల్గొన్నారు. -
మేట వేసిన నిర్లక్ష్యం
కంకిపాడు సెక్షన్ వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలు గుర్రపుడెక్కతో నిండిన పునాదిపాడు చానెల్ కోమటిగుంట రెగ్యులేటర్ వద్ద తూడుతో నిండిన కాలువలు చలివేంద్ర పాలెం వద్ద పుల్లేరు కాలువలో గుర్రపుడెక్కపంట కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయాయి. ఎగువ నుంచి వచ్చే కొద్దిపాటి సాగునీరు కూడా దిగువకు వెళ్లే ఆస్కారం లేదు. కంకిపాడు సెక్షన్, కోమటి గుంట రెగ్యులేటర్ల పరిధిలోని పలు ప్రధాన కాలువలు, అనుబంధ కాలువలు అన్నిట్లోనూ గుర్రపుడెక్క, తూడు మేట వేసుకున్నాయి. అధికారులు ఏమాత్రం దృష్టి సారించటం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. –కంకిపాడు -
16 నుంచి గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు 8వ విడత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా నిర్వహించే గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్లో పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమం ద్వారా జిల్లాలోని 1,93,050 పశువులకు టీకాలు వేయాలనే లక్ష్యంతో 34 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఒక్కో బృందంలో ఒక పశువైద్యుడు, ఒక పారా వెటర్నరీ సిబ్బంది, ఒక పశుసంవర్ధక సహాయకుడు ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి లక్షణాలు, వ్యాధి వల్ల కలిగే నష్టాలు, వ్యాధి నిరోధక టీకాల వల్ల కలిగే లాభాలను వివరించాలని సూచించారు. నాలుగు నెలల వయసు దాటిన ప్రతి ఆవు లేదా గేదె జాతి పశువులకు తప్పనిసరిగా టీకా వేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, అధికారులు పాల్గొన్నారు. ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీశ -
దుర్గమ్మకు రూ.3 లక్షల విలువైన బంగారు హారం
విజయవాడరూరల్: కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్బాల్ టోర్నమెంట్ మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాంగణంలో విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీడ్) లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నమెంట్ను నాకౌట్–కమ్–లీగ్ విధానంలో నిర్వహిస్తున్నారు. కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న వివిధ కళాశాలల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి టోర్నమెంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో విజయా బీపీడ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఉదయ్కుమార్, కృష్ణా యూనివర్సిటీ సెలెక్షన్ కమిటీ సభ్యులు మేజర్ మన్నె స్వామి, డి.హేమచంద్ర రావు, వికాస్ బీపీడ్ కళాశాల ప్రిన్సిపాల్ సరేష్, లెక్చరర్లు డి.రత్నబాబు, జి.విజయ్ పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): కాకినాడ లో బుధవారం నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఎస్సీ నాయకులు విడుదల చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా గల అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ మెంబర్ కాలే పుల్లారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, కార్యదర్శి గుడిశె శ్యాంబాబు, ఉమ్మడి కృష్ణాజిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు పోలిమెట్ల శరత్ బాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కామెళ్ల కోటేశ్వరరావు(జోజి), సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు గజ్జల నాగ సురేంద్ర, గొర్రుముచ్చు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుందని తెలిపారు. వైఎస్ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు రూపొందించనున్న కార్యాచరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇంటర్ పరీక్షలకు 805 మంది గైర్హాజరు వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు మంగళవారం 805 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాపితంగా 98 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగాయి. అందులో భాగంగా ఆయా కేంద్రాల్లో 33,003 మందిని కేటాయించారు. అందులో 32,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. మిగిలిన 805 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. -
ప్రచార ముసుగులో దోపిడీ పర్వం!
సాక్షి నెట్వర్క్: నగరంలో అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డగోలు దోపిడీకి తెగబడుతున్నారు. ప్రభుత్వం పరిశీలించి ఇవ్వాల్సిన అనుమతులను అధికార పార్టీకి చెందిన నేతలు ముడుపులు పుచ్చుకుని ఏ అనుమతి అయినా ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు నగరంలో బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికార కూటమి నేతలు నదురు బెదురు లేకుండా మాకేమిటిలే అన్నట్టుగా ముడుపుల కోసం తెగబడుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఒక సంస్థ ప్రత్యేకంగా స్క్రీన్లను ఏర్పాటు చేసి వాణిజ్య ప్రచారాలను అందిస్తోంది. వాటిపై తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల మద్దతుతో అనధికార వ్యాపారాలను నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మా ఆర్ట్స్ పేరుతో స్క్రీన్లు నగరానికి చెందిన మా ఆర్ట్స్ అనే సంస్థ నగరంలో వాణిజ్య ప్రకటనల కోసం పలు స్క్రీన్లను ఏర్పాటు చేసింది. వివిధ వాణిజ్య సంస్థల నుంచి డబ్బులు తీసుకుని ఆ సంస్థలకు చెందిన వీడియోలను అందులో ప్రచారం చేస్తోంది. ఈ తరహా స్క్రీన్లు నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద రెండు బందరు రోడ్డులోని మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేయటానికి నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అలాగే వీటికి సంబంధించి నగర పాలకసంస్థకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి అనుమతి లేకుండా అనధికారికంగా వాటిని ఏర్పాటు చేసి వ్యాపార సంస్థల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై నగరంలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులకు భారీ ముడుపులు? నగరంలోని మూడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులను చెల్లించి అనధికారికంగా స్క్రీన్లను ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువలనే అంత బహిరంగంగా వాటిని ఏర్పాటు చేసి వ్యాపారాలను నిర్వహిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తోడు వాటిపై అధికార పార్టీకి చెందిన నేతలెవరూ నోరు మెదపకపోవటం సైతం అదే కారణమని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అనుమతులు లేకుండా స్క్రీన్లు ఏర్పాటు చేసి వాణిజ్య ప్రచారాలు నగరంలో పలు చోట్ల అనధికార స్క్రీన్లు వీఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు లేవంటున్న అధికారులు ఎటువంటి పన్నులు చెల్లించకుండా వాణిజ్య ప్రచారాలపై పలువురు ఆగ్రహం పేదలు తోపుడు బండి పెడితేనే తీసేసే వీఎంసీ ఇప్పుడు ఎందుకు మీనమేషాలు ? అధికార పార్టీకి చెందిన నేతలకు భారీ ముడుపులు చెల్లించినట్లు ప్రచారం పేదలు రోడ్లపై పెట్టే తోపుడు బండిని సైతం తీసివేసే నగరపాలకసంస్థ అధికారులు ఇంత పెద్ద స్థాయిలో స్క్రీన్లను ఏర్పాటు చేస్తే వాటిని తీయటానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నగరంలో ఇటువంటి స్క్రీన్లు ఏర్పాటు చేయటం లేదా ఇతర వ్యాపార ప్రకటనల నిమిత్తం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒక సీనియర్ అధికారి చెబుతున్నారు. ఆ సంస్థ నుంచి వచ్చే ప్రతిపాదనను కౌన్సిల్కు పంపించటం, అక్కడ ఆమోదం తెలిపిన తరువాత నిర్ణీత రుసుం నగరపాలకసంస్థకు చెల్లించిన తరువాత వాటికి అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. అయితే నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా కొంతమంది అధికారులు సైతం ముడుపులు తీసుకొని వాటి వైపు చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. -
రెచ్చిపోతున్న
● పచ్చనేతల డైరెక్షన్లో వ్యవస్థీకృతంగా దోపిడీ ● పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు ● ఫలానా వ్యక్తికే బియ్యం ఇవ్వాలంటూ రేషన్ డీలర్లకు హుకుం ● ప్రతి నియోజక వర్గం నుంచి 500 టన్నుల బియ్యం మాఫియా చేతికి ● కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి ● రేషన్ మాఫియా డాన్ వైపు కన్నెత్తిచూడని అఽధికారులు దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టు జిల్లాలో పచ్చనేతలు రేషన్ బియ్యాన్ని సైతం వదలడం లేదు. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని పందికొక్కుల్లా మెక్కేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ డాన్ పార్లమెంటు ముఖ్య నేతకు సన్నిహితంగా మెలుగుతూ విశృంఖలంగా రేషన్ బియ్యం దందా నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. పార్ల మెంటు ముఖ్యనేత కనుసన్నల్లో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ రేషన్ బియ్యం మాఫియా వ్యవహారాన్ని సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు బహి రంగంగా ప్రకటనలు చేసినా అధికారుల్లో మాత్రం చలనం లేదు. బియ్యం మాఫియాకు అడ్డుకట్ట పడలేదు. ఏకంగా జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల బియ్యాన్ని ఏకీకృతంగా ఒక వ్యక్తే సేకరించి, కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించి కోట్లు దండుకుంటున్నారు. ఈ దందా వ్యవహారంలో సింహభాగం పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లోనే సాగుతోంది. పౌరసరఫరాల అధికారులు, విజిలెన్స్ అధికారులను పావులుగా మార్చుకున్నారు. పార్లమెంటు ముఖ్యనేత డైరెక్షన్ మేరకు తాము చెప్పిన వ్యక్తికే, బియ్యం ఇచ్చేయాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. దాంతో ప్రతి నెలా మొదటి రెండు మూడు రోజుల్లోనే రేషన్ దుకాణాల్లో బియ్యం మాయమైపోతున్నాయి. దందాకు సహకరించని డీలర్లపై రేషన్ షాపులు తనిఖీ చేసి, షాపులు సీజ్ చేస్తున్నారు. పోలీసులు సైతం మామూళ్లు తీసుకుని ఈ దందాకు సహకరిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 500 టన్నులకు పైగా రేషన్ బియ్యం మాఫియా చేతుల్లోకి పోతున్నాయి. రైస్ మిల్లుల్లో ఈ బియ్యాన్ని పాలిష్ చేసి, నేరుగా కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. బియ్యం మాఫియా నుంచి పార్లమెంటు ముఖ్యనేతకు కోటి రూపాయలు, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు రూ.25 లక్షల చొప్పున అందుతున్నట్టు సమా చారం. ఇటీవల వీరులపాడులో 295 బస్తాల బియ్యం పట్టుకుని కేసులు నమోదు చేశారు. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణపై పీడీ యాక్టు అమలు చేశారు. ఇతనిపైన 41 కేసులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి పట్ల కఠినంగా వ్యవహరించడం మంచిదే. అయితే ప్రస్తుతం రేషన్ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్న రామచంద్రరావుపైన ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అతనిపైన పీడీ యాక్టు అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు నివేదించారు. అయినా ఇంకా అతనిపై పీడీ యాక్టు అమలు కాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతను పార్లమెంటు ముఖ్యనేత, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో పాటు, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెపుతుండటంతోనే అతడిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, దీంతో అతని ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని విమర్శలు వినవస్తున్నాయి. వాటాల్లో తేడాలు వచ్చి కొంత మంది మాఫియా సభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం ద్వారా ఇటీవల నామమాత్రంగా రేషన్ బియ్యం పట్టుకుంటున్నారు కాని, గతంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నా పౌరసరపరాల శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపించడంలేదు. ఇదంతా వారికి తెలిసే జరుగుతుందని, నామమాత్రపు దాడులతో మమ అనిపిస్తున్నారని పలువురు పెదవి విరుస్తున్నారు. రేషన్ మాఫియాకు, పచ్చనేతలకు లింకు ఉండటం వల్లే అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రేషన్ మాఫియా బరితెగించి పోలీసులపై సైతం దాడికి తెగబడుతున్నారు. గతంలో ఇటువంటి సంఘటన మైలవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. -
ఎంఎంసీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీని నియమిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 86 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ఈనెల 17వ తేదీతో ముగుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 284 జీవోను బుధవారం విడుదల చేసింది. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీని నియమించారు. ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేష్కుమార్ జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ఈనెల 18వ తేదీ నుంచి నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ వ్యవహరించనున్నారు. -
పన్ను పాట్లు!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ‘ఉమ్మడి కృష్ణాజిల్లాలో వ్యాపారుల నుంచి బకాయిలు వేగంగా వసూలు చేయండి’ అంటూ వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు గడిచిన 15ఏళ్లుగా ఉన్న బకాయిలు మొత్తం వసూలు చేసి తీరాలంటూ అధికారులకు కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావటంతో వారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిల్ కార్యాలయాల్లో అధికారులు ఈ బకాయిల వసూళ్లపైనే దృష్టి సారించాలని ఆదేశించటంతో ప్రస్తుతం ఉన్న పనులన్నీ నిలిపివేసి అధికారులందరూ దీనిపైనే పని చేస్తున్నారని ఆ శాఖ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రూ.700 కోట్ల బకాయిలు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ–1 డివిజన్, విజయవాడ–2 డివిజన్, విజయవాడ–3 డివిజన్ పేర్లతో మూడు ప్రధాన కార్యాలయాలు పని చేస్తున్నాయి. వాటి పరిధిలో సుమారుగా రెండు జిల్లాల్లో 17 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిన్నింటి నుంచి ప్రభుత్వానికి సుమారుగా రూ.700 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిసింది. దాంతో కమిషనర్ కార్యాలయం నుంచి ఏరోజుకారోజు నివేదికలు అడుగుతూ అధికారులపై ఒత్తిడి పెడుతున్నారని నాయకులు వివరిస్తున్నారు. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆయా సంస్థలను పట్టుకునే పనిలో బిజీబిజీగా పని చేస్తున్నారని నాయకులు చెబుతున్నారు. ఆదాయం లేకనే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. అటు పరిశ్రమల నుంచి ఉత్పత్తి సైతం దిగజారింది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి వచ్చే ఆదాయం సైతం కానరావటంలేదు. వివిధ వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల నుంచి ఆదాయ పన్నుల శాఖకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోవటంతో దానిని ఏదో విధంగా భర్తీ చేసేందుకు బకాయిలపై పడినట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో వాణిజ్య శాఖ నుంచి భారీ ఆదాయం వస్తోందంటూ ఊదరకొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన ఆదాయానికి సైతం గతి లేకుండా పోయిందని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు. దీంతో కమిషనర్ కార్యాలయం నుంచి బకాయిలు వసూలు చేసి పడిపోయిన ఆదాయాన్ని దీని ద్వారా భర్తీ చేయాలంటూ రాష్ట్ర స్థాయి అధికారులు పదేపదే ఒత్తిడి పెడుతున్నారని ఆ శాఖలో వినిపిస్తున్నాయి. మరింత ఒత్తిడి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగుస్తోంది. ఈ 20 రోజుల్లో ఇచ్చిన లక్ష్యాల మేరకు ఆదాయం చూపించాలంటూ రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో జీఎస్టీ నిబంధనల్లో లేని అడ్వాన్స్ పన్నులు వసూలు చేసి కొంత ఆదాయం చూపించారు. కానీ ఈ ఏడాది మాత్రం ఏదో విధంగా ఆదాయాన్ని చూపించేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తాపత్రయపడుతోంది. ఆ క్రమంలో 20 రోజుల్లో అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలని, బకాయిల గురించి ఒత్తిడి తీసుకురావటంతో అధికారులు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులు పదేపదే కాన్ఫరెన్స్ల పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఆ శాఖలో పని చేస్తున్న అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కొక్కస్థాయి అధికారి వేరువేరుగా కాన్ఫరెన్స్లు పెట్టడంతో బకాయిల వసూళ్లకు ఎక్కడ అవకాశముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలతో వ్యాపారాలు జరగక ఆదాయం పడిపోతే తమపై ఒత్తిడి పెట్టడం ఏమిటంటూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తోడు ఈ కాన్ఫరెన్స్లతో ఉన్న పుణ్యకాలమంతా అయిపోతుందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో బకాయిల పేరుతో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినవి సైతం బయటకు తీసి వసూలు చేయాలంటూ కమిషనర్ కార్యాలయం ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా జీఎస్టీకి ముందు కొనసాగిన వ్యాట్ విధానంలో ఉన్న బకాయిలు చాలా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దానికి తోడు చాలా వ్యాపార సంస్థలు ఇచ్చిన చిరునామాల్లో లేవు. అలాగే బకాయిలు ఉన్న అనేక సంస్థలు దివాలా తీశాయి. కొన్ని సంస్థల వ్యక్తులు చనిపోయిన వారి పేర్లతో వ్యాపారాలు చేసి మోసగించినవి అందులో కనిపిస్తున్నాయి. వాటికి తోడు చాలా వరకూ న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇటువంటి అన్ని కలిపి భారీగా బకాయిలు ఉన్నాయంటూ కమిషనర్ కార్యాలయం చెప్పటంతో స్థానిక డివిజన్, సర్కిల్ కార్యాలయాల్లోని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో ఆస్తి వివాదాల ఫిర్యాదులే అధికం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో ప్రజల నుంచి 90 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు, నడవలేని వికలాంగుల వద్దకు ఆమె స్వయంగా వెళ్లి ఫిర్యాదులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్య అడిగి తెలుసుకుని, దానిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత ఎస్హెచ్ఓలకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికంగా భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 57 ఫిర్యాదులు అందాయి. ఇతర ఫిర్యాదుల్లో కుటుంబ తగాదాలపై 2, వివిధ మోసాలపై 4, మహిళా సంబంధిత నేరాలపై 6, దొంగతనాలపై 3, ఇతర వివిధ సమస్యలపై 18 ఫిర్యాదులు అందాయి. ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చల్లపల్లి: స్నానానికని వెళ్ళి చున్నీతో ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కృష్ణాజిల్లా చల్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి నారాయణరావునగర్కు చెందిన కె.వెంకటకృష్ణయ్య, దేవిప్రియల కుమార్తె కీర్తి (13) స్థానిక హైస్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఉదయం స్కూలుకు వెళ్ళిన కీర్తి మార్గంమధ్యలో తనకు నెలసరి రావటంతో ఇంటికి తిరిగి వచ్చింది. పంచాయతీలో స్వీపరుగా పనిచేస్తున్న తల్లి దేవిప్రియ పని ముగించుకుని ఇంటికి వచ్చింది. స్కూలుకు ఎందుకు వెళ్ళలేదని అడగటంతో తనకు కడుపు నొప్పిగా ఉందని కీర్తి చెప్పింది. స్నానం చేసి వస్తే ఆసుపత్రికి వెళదామని తల్లి కూతురుని స్నానానికి పంపింది. కీర్తి ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో తలుపులు తెరచి చూడగా కీర్తి చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. అది చూసి కంగుతిన్న దేవిప్రియ కేకలకు స్థానికులు వచ్చి కీర్తిని హుఠాహుటిన చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక కీర్తి మృతి చెందినట్లు చెప్పారు. ఎస్ఐ డి.దుర్గాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కీర్తి క్రమశిక్షణతో, టీచర్లతో ఎంతో వినయంతో నడచుకునేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని పాఠశాల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. -
టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణపై అవగాహన సదస్సు
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): త్వరలో నిర్వహించనున్న టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ అధికారులకు సోమవారం కొండపల్లి డీఏవీ పాఠశాలలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమవ్వాలని, పరీక్షలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష హాలులో తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్, వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవకతవకలు జరగకుండా పేపర్ కోడ్ ఆధారంగా ఏరోజు ప్రశ్నపత్రం ఆ రోజే అందేలా చూడాలన్నారు. వివిధ డివిజన్ల డీవైఈవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు. బంటుమిల్లి: భర్త, అత్త వేధింపులు భరించేని వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని అర్తమూరు గ్రామంలో విషాదం నింపింది. పోలీసు కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాకాల రాజగోపాల్ కుమార్తె లిఖిత(26)ను ఆగిరిపల్లి మండలం, కొత్తఈదర గ్రామానికి చెందిన బెక్కం కిరణ్కు ఇచ్చి 2024 నవంబరు 16వ తేదీన వివాహం చేశారు. వివాహం తర్వాత భార్యభర్తలు ఉద్యోగం నిమిత్తం యునైటెడ్ కింగ్డమ్ (యుకే) వెళ్ళారు. అక్కడ కిరణ్ జాబ్ సక్రమంగా లేదని భావించిన పోలీసులు భార్యభర్తలను ఇండియాకు పంపారు. అత్తారింటికి చేరిన లిఖితకు అత్త, భర్తల సూటిపోటీ మాటలతో వేధింపులు మొదలయ్యాయి. యుకేలో కిరణ్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశాడు. అత్తారింట్లో ఎదురైన వేధింపులను తోబుట్టువులకు ఫోన్ల్ చేసి చెప్పుకుంది. ఈ స్థితిలో కట్నంగా ఇచ్చిన పొలం అమ్ముకుని డబ్బులు తీసుకురమ్మని కిరణ్ లిఖితను బెదిరించడంతో నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న లిఖిత సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయములో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అన్న మాకాల సాయిసూర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ గణేష్కుమార్ కేసు నమోదు చేశారు. -
బూత్ స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని రాజకీయ పార్టీల తరఫున బూత్స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్కు వేసిన తాళం, సీల్ను పరిశీలించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు సజావుగా ఉన్నదీ, లేనిదీ విచారించారు. అనంతరం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 1,769 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాలకు బూత్స్థాయి ఏజెంట్లను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నియమించుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు వారికి సంబంధించిన నియోజకవర్గాల వారీగా బూత్స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, మార్కెటింగ్ ఏడీ ఎల్. నిత్యానందం, రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్దాదా, పంతం గజేంద్ర, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ‘పది’ విద్యార్థులకు ఉచిత ప్రయాణం మచిలీపట్నంటౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి కె. వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ఉన్న రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నట్లు తెలిపారు. బస్ పాస్తో సంబంధం లేకుండా ఏ రూట్లో వెళ్లే బస్సుకై నా ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు. విద్యార్థి హాల్ టికెట్ చూపిస్తే అల్ట్రా పల్లెవెలుగు, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. అన్ని ఆర్టీసీ డిపోల్లోని సిబ్బందికి అవగాహన కల్పించేందుకు గేట్ మీటింగ్స్ నిర్వహించి, నోటీసు బోర్డులో సమాచారం ఉంచినట్టు తెలిపారు. గోసంరక్షణ పథకానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన డి. వెంకటరావు, చిన్నమ్మ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు సోమవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి గోసంరక్షణ పథకానికి రూ. 1.45లక్షల విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఏఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాల్సిందే కృత్తివెన్ను: అనుమతులు లేకుండా బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహించినా, అనుమతులు పొంది తయారీలో నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం ఆయన కృత్తివెన్ను మండలంలోని పలు బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు చేశారు. మండలంలోని పడతడిక, చినగొల్లపాలెం, నిడమర్రు గ్రామాలలో బాణసంచా తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తయారీ కేంద్రాలలో సరైన లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, నిల్వ పరిమితులు ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. శిక్షణ పొందిన వ్యక్తులే పని చేస్తున్నారా, బాలకార్మికులు ఉన్నారా తదితర వివరాలను ఆరా తీశారు. ఆయనతో పాటు బందరు ఆర్డీవో కె. సాంబశివరావు, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఏసురత్నం, తహసీల్దార్ శశి కుమార్ తదితరులు ఉన్నారు. -
ప్రారంభ దశలో గుర్తిస్తే కుష్ఠు వ్యాధి పూర్తిగా నయం
మచిలీపట్నంఅర్బన్: కుష్ఠు వ్యాధి ఒక సంక్రమణ వ్యాధి కాగా, ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని రాష్ట్ర లెప్రసి విభాగం (ఎస్.ఎల్.డి) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవసాగర్ తెలిపారు. సోమ వారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జాతీయ లెప్రసీ నిర్మూలనలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్పై డీఎంహెచ్ఓ డాక్టర్ పి.యుగంధర్ ఆధ్వర్యంలో ఓరియెంటేషన్ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవసాగర్ మాట్లాడుతూ లేప్రోసి వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణ వ్యాధని చెప్పారు. ఇది ప్రధానంగా చర్మం, నరాలు, కళ్లను ప్రభావితం చేస్తుందని తెలిపారు. సమ యానికి చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయం అవుతుందని, త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే వికలాంగత్వాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. జిల్లా లెప్రసి వ్యాధి నియంత్రణాధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు మాట్లాడుతూ వ్యా ధి నివారణ, గుర్తింపు, చికిత్సలో వైద్య సిబ్బంది సమన్వయం ఎంతో ముఖ్యమని చెప్పారు. జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ లెప్రసి వ్యాధి ఉన్నవారిని సమాజం దూరం పెట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచితంగా మందులు అందించి చికిత్స కల్పిస్తోందన్నారు. వ్యాధిని తొందరగా గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ, మెడికల్ అధికారులు, ఫార్మసీ అధికారులు, పిహెచ్సి నోడల్ అధికారులు పాల్గొన్నారు. వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 531 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో 97 కేంద్రాల్లో 30,820 మంది విద్యార్ధులను కేటాయించారు. అందులో 30,289 మంది హాజరయ్యారు. 531 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం గణితం–2బీ పరీక్షలను నిర్వహించారు. ఓపెన్ ఇంటర్ పరీక్షకు.. ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల్లో భాగంగా జిల్లాలో సోమవారం నిర్వహించిన నాలుగో రోజు పరీక్షకు 241 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం 11 కేంద్రాల్లో భౌతికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, పౌరశాస్త్రం కలిపి 1414 మందికి గాను 1173 మంది హాజరయ్యారు. మిగిలిన 241 మంది గైర్హాజరయ్యారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు 11 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు.82.39 శాతం హజరు శాతంగా అధికారులు ప్రకటించారు. రాష్ట్ర లెప్రసీ విభాగం జేడీ డాక్టర్ దేవసాగర్ -
నిర్దేశిత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న అర్జీలను నిర్ధేశిత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జేసీ ఇలక్కియ డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహంతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు. మొత్తం 131 అర్జీలు.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మొత్తం 131 అర్జీలు అందాయని జేసీ తెలిపారు. వీటిలో ఎంఏయూడీకి 37, రెవెన్యూ 28, పంచాయతీరాజ్ 19, పోలీస్ 16, హౌసింగ్ 4, వ్యవసాయం 3, విభిన్న ప్రతిభావంతులు 3, డీఆర్డీఏ 3, విద్య 3, ఏపీసీపీడీసీఎల్ 2, పౌర సరఫరాలు 2, మైన్స్ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, గ్రామీణ నీటిసరఫరా 2 అర్జీలు రాగా వైద్య ఆరోగ్యం, మార్కెటింగ్, దేవదాయ, ఇరిగేషన్, రవాణా శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ స్వీకరించినట్లు జేసీ తెలిపారు. హెచ్పీవీ వ్యాక్సిన్ పోస్టర్ల ఆవిష్కరణ.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్ఎస్ హాల్లో జేసీ ఇలక్కియ.. డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వివిధ శాఖల అధికారులతో కలిసి హెచ్పీవీ వ్యాక్సిన్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ ను 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా వేస్తున్నారన్నారు. ఈ జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు పాల్గొన్నారు. -
దళితులపై అక్రమ కేసులు ఎత్తివేయండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ముంజేరు దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బాధితుల న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడ ధర్నా చౌక్లో సోమవారం కమిటీ ఆధ్వర్యలో ఆత్మగౌరవ దీక్ష నిర్వహించారు. కేసులు ఎత్తివేయాలని, ఎమ్మెల్యే లోకం మాధవి దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. కనీసం స్పందించడం లేదు.. బాధితుల న్యాయ పోరాట కమిటీ అధ్యక్షుడు బోనెల జోగేంద్ర సిద్ధార్థ మాట్లాడుతూ ముంజేరు దళిత కాలనీ సిద్ధార్థ నగర్కు మురుగు నీరు కాల్వను మళ్లించి దళితులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయమై అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. 94 రోజులుగా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా జిల్లా అధికారులు స్పందించడం లేదన్నారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి దళితులకు న్యాయం చేయకపోగా, వారికి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ దళితవాడ గుండా మురుగు కాలువ తవ్వించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మగౌరవ దీక్షలో ముంజేరు బాధితుల న్యాయ పోరాట కమిటీ -
కునుకే బంగారమాయెనే!
● విజయవాడ గాంధీనగర్కు చెందిన 40 ఏళ్ల రాజుకు ఓ కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది. ఏడాది క్రితం ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. నిద్ర పట్టక పోవడం, ఆలోచనలు ఎక్కువ కావడంతో తలనొప్పి, ఇతర రుగ్మతలు చుట్టుముట్టాయి. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా.. ఎటువంటి జబ్బూ లేదని, ఒత్తిడి కారణమని తేల్చారు. ఇలా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు అన్ని వర్గాలకు చెందిన వారు శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక యుగంలో రాణించాలంటే ఉరుకులు పరుగుల జీవనం తప్పదు. ఈ క్రమంలో కంటినిండా నిద్ర ఉండదు. ఫలితంగా ఎంతో మంది ఒత్తిడికి లోనై వ్యాధుల బారిన పడుతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే వారిలో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, హార్మోన్ల సమతుల్యత లోపించడం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు అదుపు తప్పు తున్నాయి. కొరవడిన మానసికోల్లాసం.. ప్రస్తుతం కుటుంబాల్లో మానసిక ఉల్లాసం లోపించిందనే చెప్పాలి. ఆధునిక యుగంలో రాణించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. విధులు ముగించుకుని ఇంటికి వచ్చాక, ఎవరి ఫోన్తో వారు కాలక్షేపం చేస్తుంటారు. కొందరు కనీసం పిల్లల గురించి పట్టించుకోవడం లేదు. కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు లేవు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం అంతకంటే లేదు. దీంతో మానసిక ఉల్లాసం కొరవడుతోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. సాయంత్రం వేళ పిల్లలతో కాసేపు సమీపంలోని పార్కుకు వెళ్లి గడపడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుందంటున్నారు. కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆటలపై దృష్టి పెట్టడం వంటి చేయాలి. మధుమేహుల్లో ఒత్తిడి ప్రభావం ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వారిపై సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోంది. యువత వాటికి బానిసలుగా మారడంతో ఇతర అంశాలపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టిపెట్ట లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు, ఇలా అనేక రంగాల వారు ఈ సమస్యలతో కౌన్సెలింగ్ కోసం మా వద్దకు వస్తున్నారు. దేనినైనా అవసరం మేరకు వినియోగించాలి. మానసిక ఉల్లాసం కోసం కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆటలు వంటి వాటిపై దృష్టి సారించాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్టు మధుమేహం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి మధ్య సంబంధం ద్విముఖమైనది. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో కార్టిసోల్, ఇతర స్ట్రెస్ హార్మోన్లను పెంచి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికమవుతాయి. ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించి టైప్–2 డయాబెటిస్కు మార్పు వేగవంతం కావచ్చు. నిద్రలేమి, అనియంత్రిత ఆహారం, శారీరక చురుకుదనం తగ్గడం వంటి అంశాలు ఈ ప్రక్రియను మరింత తీవ్రతరం చేస్తాయి. మధుమేహ చికిత్సలో చక్కెర నియంత్రణతో పాటు, భావోద్వేగ ఆరోగ్యాన్ని సమానంగా పరిగణించే వైద్య విధానం అనుసరించాలి. – డాక్టర్ ఎం.శ్రీకాంత్, మధుమేహ వ్యాధి నిపుణుడు -
పవర్ లిఫ్టర్ చంద్రికకు ఆర్థిక సాయం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన బొల్లినేని చంద్రిక త్వరగా కోలుకొని మళ్లీ క్రీడా మైదానంలో అడుగు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ ఏ.రవినాయుడు ఆకాంక్షించారు. ఆనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందుతున్న చంద్రికను సోమవారం ఆయన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవర్ లిప్టింగ్లో చంద్రిక సాధించిన విజయాలు యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వైద్య చికిత్స కోసం లక్ష రూపాయలను అందచేశారు. కార్యక్రమంలో శాప్ డైరెక్టర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఘాట్రోడ్డుపై నో పార్కింగ్ జోన్ !
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్రోడ్డులో వాహనాల పార్కింగ్ నియంత్రణకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్ ఇతర ఇంజినీరింగ్ అధికారులు సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఘాట్రోడ్డును నో పార్కింగ్ జోన్గా ప్రకటించే అవకాశాలున్నట్లు అధికారుల పర్యటనలో తేటతెల్లమైంది. దుర్గగుడిపై నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవానికి హోంమంత్రి అనిత హాజరైన రోజున ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద మంత్రి కాన్వాయ్ సుమారు పది నిమిషాల పాటు నిలిచిపోయింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సైతం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు పరిశీలన.. ఈ నేపథ్యంలో సోమవారం సీపీ రాజశేఖరబాబు, ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావులతో పాటు ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ఓం టర్నింగ్ నుంచి ఆలయ ప్రాంగణంలోని సమాచార కేంద్రం వరకు ఉన్న వాహనాల పార్కింగ్ను పరిశీలించారు. దేవస్థాన భద్రతా, ఘాట్రోడ్డుపై వాహనాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలయ అధికారులతో చర్చించారు. ఘాట్రోడ్డుపైకి ఎవరి వాహనాలు పడితే వారివి అనుమతించకుండా ప్రోటోకాల్ ఉన్న వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతించాలని నిర్ణయించారు. అంతకు ముందు సీపీ రాజశేఖరబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. -
వసంత నవరాత్రోత్సవాలకు సన్నాహాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 19వ తేదీ ఉగాది వేడుకలు, వసంత నవ రాత్రోత్సవాలు, 27వ తేదీ శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 19వ తేదీ గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అమ్మ వారికి స్నపనాభిషేకం, అనంతరం అలంకరణ, అర్చన పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. 9.15 గంటలకు వసంత నవ రాత్రోత్సవాలకు కలశ స్ధాపన, ప్రత్యేక పుష్పార్చనలు ప్రారంభమవుతాయి. సాయంత్రం నాలుగు గంటలకు మండప పూజ, అగ్నిప్రతిష్టాపన జరుగుతుంది. వెండి రథోత్సవం.. ఉగాదిని పురస్కరించుకుని 19వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథోత్సవం జరుగుతుంది. ఆది దంపతులు వెండి రథంపై నగర పుర వీధుల్లో విహరిస్తారు. అమ్మవారికి 9 రోజుల పాటు వివిధ పుష్పాలతో విశేష అర్చన జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూజా మండపంలో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ అర్చన ప్రారంభమవుతుంది. అర్చనలో పాల్గొనే ఉభయదాతలు రూ. 2500 టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పూజలో పాల్గొనే వారికి శేషవస్త్రం, రవిక, అమ్మవారి శ్రీచక్ర పీఠం, పెద్ద లడ్డూతో పాటు ఇద్దరికి అంతరాలయ దర్శనం కల్పిస్తారు. పూర్ణాహుతితో పరిసమాప్తం.. 26న ఇంద్రకీలాద్రి క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, నాగవల్లీ దళార్చన (తమలపాకులు)తో అర్చన జరుగుతుంది. 27వ తేదీ శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఘాట్ రోడ్డులోని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 28వ తేదీ ఉదయంం 9 గంటలకు దేవస్థాన యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో వసంత నవ రాత్రోత్సవాలు పరి సమాప్తమవుతాయి. -
స్వామివారి కానుకలపై చోరుల కన్ను
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో కొండ పై వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం నిధులు స్వాహా చేయటం గుడి చరిత్రలో ఎప్పుడు జరగలేదు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలపై కన్నేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి, ఇద్దరు అర్చకులు, గుడిలో పని చేసే కార్మికుడు స్వాహా చేయటం భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంతో శక్తివంతమైన శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయంలో సిబ్బంది దొంగతనానికి పాల్పడటం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఎంతో నమ్మకంతో స్వామి వారికి సమర్పించిన కానుకలను అధికారులు భద్రపర్చాల్సి ఉండగా చేతివాటం చూపటంతో భక్తులు తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురయ్యారు. శివశివా అపచారం జరిగిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం అభివృద్ధే లక్ష్యంగా... స్వయం భూగా వెలిసిన శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయాన్ని అభివృద్ధే లక్ష్యంగా దాత సంగా నరసింహారావు ఇప్పటి వరకు రూ.50 కోట్లు నిధులు పైగా వెచ్చించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. భక్తులు కూడా తమ వంతు సాయంగా ఆలయ అభివృద్ధికి దోహదపడ్డారు. ప్రభుత్వం నుంచి నిధులు సమకూరక పోయినా దాతఉ ముందుకు వచ్చి భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆదాయం తగ్గటంతో అనుమానం... కాగా శ్రీ రామలింగేశ్వరస్వామివారికి కార్తీక మాసం, మహాశివరాత్రితో పాటు ఇతర పండుగలకు భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. ఏడాదికి మూడుసార్లు హుండీలో కానుకలు లెక్కిస్తారు. రెండేళ్లుగా భక్తులు పెరుగుతున్నా స్వామివారి హుండీ ఆదాయం తగ్గింది. దీంతో అనుమానం వచ్చి నిఘా ఉంచారు. సీసీ కెమేరాలు కూడా గోప్యంగా ఏర్పాటు చేశారని సమాచారం. దీంతో స్వామివారి హుండీలలో సొమ్ము స్వాహా చేసిన దొంగలు చిక్కారని తెలిసింది. స్వాహా చేసి సొమ్ము ఈవో వేరే ఖాతాకు బదిలీ చేసినట్లు ఆధారాలు పోలీసులకు దొరికాయని సమాచారం. సొమ్ము చోరీలో ముగ్గురు అరెస్ట్.. ఆలయం సొమ్ము స్వాహా చేసిన కేసులో పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు సాగర్, అర్చకుడు పూర్ణ, గుడిలో పని చేసే కార్మికుడు రోశయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారన్నారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.భవానిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ఆమెను కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. దేవస్థానంలో భారీ అవినీతి బయటపడినా దేవదాయ శాఖ అధికారులు జాడ లేదు. ఆలయ రికార్డులు స్వాధీనం చేసుకోలేదు. నకిలీ తాళాలతో హుండీ తెరిచారన్న ఆరోపణలు వచ్చిన వెంటనే అధికారులు ఆలయానికి వచ్చి తాళాలు తనిఖీ చేయలేదు. తాళాలు మార్చలేదు. ఆలయ సొమ్ము చోరీపై ఉన్నతాధికారులు సైతం స్పందించినట్లు కనబడ లేదు. ఈ విషయమై ఏసీ సాంబశివరావును వివరణ కోరగా హుండీలు తనిఖీ చేస్తానని, ఆ తరువాత రికార్డులు పరిశీలిస్తామన్నారు. -
కూటమిలో కొట్లాట!
అవనిగడ్డలో జనసేన వర్సెస్ టీడీపీ కోడూరు: అవనిగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీరును ఎండగడుతూ కోడూరు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇంతటితో ఆగకుండా బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేసిన రహదారికి టీడీపీ నేతలు కూడా మరోసారి శంకుస్థాపన చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఏం జరిగిందంటే.. కోడూరులోని తొమ్మిదో వార్డు ఎస్సీకాలనీలో ఎన్ ఆర్ఈజీఎస్ కింద రూ.22లక్షల నిధులతో బీటీ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులను బుద్ధప్రసాద్ సోమవారం ఉదయం జనసేన పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. ఇది జరిగిన అరగంటకే మండల టీడీపీ నేతలు మళ్లీ అదే రహదారికి శంకుస్థాపన చేశారు. ఎస్సీ కాలనీలోని గ్రామస్తులతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. ఒంటెద్దు పోకడలకు నిరసనగానే.. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా బుద్ధప్రసాద్ పెట్టుకున్నారని ఆ పార్టీ మండలాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ బండే శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి పొత్తు ధర్మాన్ని బుద్ధప్రసాద్ విస్మరిస్తూ ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలోని నేతలను కూడా జనసేనలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో తమ ఇష్టమొచ్చినవారికే పనులను అప్పగిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్చంద్రబోస్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఆదేశాల మేరకే బుద్ధ ప్రసాద్ శంకుస్థాపన చేసిన రహదారి తాము కూడా శంకుస్థాపన చేసినట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జనసేన కౌంటర్గా.. రహదారికి టీడీపీ నేతలు కూడా శంకుస్థాపన చేయడంతో మండల జనసేన నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో వారు కౌంటర్కు దిగారు. సోమవారం సాయంత్రం మరోసారి రహదారి నిర్మాణ ప్రాంతానికి వెళ్లి బుద్ధప్రసాద్ను పొగడ్తలతో ముంచెత్తారు. రహదారి నిర్మాణాన్ని టీడీపీ నేతలు కావాలనే అడ్డుకుంటున్నారని, నియోజకవర్గంలో మద్యం, రేషన్, బుసక, ఇసుక దందా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుందంటూ జనసేన పార్టీ మండలాధ్యక్షుడు మర్రే గంగయ్య విమర్శించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 20267గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం తెలిపారు. మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.8.56లక్షలు వచ్చినట్లు డెప్యూటీ కమిషనర్ శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. -
రజకులకు చట్టసభల్లో ప్రాతినిధ్యమే లేదు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): జనాభాలో మూడు శాతం ఉన్న రజక సామాజిక వర్గంలో ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె.పూర్ణచంద్రరావు అన్నారు. రజకులకు సామాజిక న్యాయం జరగాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ హనుమాన్పేటలో రజక సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎీస్టీ, మైనారిటీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగితే రాజకీయ సమీకరణాలు మారుతాయన్నారు. బీసీలు, ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో సమగ్ర కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు పానుగుపాటి శ్రీనివాస్, దాచేపల్లి మోహన్రావు, పేట శ్రీనివాస్, బైరవరపు శ్రీనివాస్, నమ్మి అప్పారావు పాల్గొన్నారు. -
బాబు పాలనపై గురువుల రణభేరి3.0
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు పాలనపై ఉపాధ్యాయులు గర్జిస్తున్నారు. సమస్యల పరిష్కారంపై శీత కన్నేసిన సర్కారు దురహంకార పూరిత విధానాలపై ధ్వజమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 24 నుంచి రణభేరి3.0 పేరుతో దశలవారీ పోరాటం చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్కుమర్ ప్రకటించారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం విజయవాడలోని ఆ సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగింది. మనోహర్కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో రణభేరి 2.0 పేరుతో ఫిబ్రవరి 17న భారీ స్థాయిలో ధర్నా చేసినా, ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నెల 24 నుంచి దశల వారీ పోరాటానికి సిద్ధపడుతున్నట్టు స్పష్టం చేశారు. మార్చి 24న నియోజక వర్గ కేంద్రాలలో, ఏప్రిల్ రెండు, మూడు తేదీల్లో జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర స్థాయిలో 15 నుంచి 19 వరకు ఐదు ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని పేర్కొన్నారు. ఏప్రిల్ 28న చలో సెక్రటేరియేట్ నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య, జిల్లా కోశాధికారి కె.గంగ రాజు తదితరులు ప్రసంగించారు. -
గాల్లో దీపంలా మహిళా రక్షణ
● రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి ● సంక్షేమ పథకాలు ఇస్తానని మోసం చేశారు ● ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షురాలు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ● జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం సాధికారత ఏది? -
ముగిసిన తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల
పెనమలూరు: ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నామని ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్ తెలిపారు. ఈ మేరకు కానూరు అశోక్ జిమ్లో ఆదివారం సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ పోస్టర్ ఆవిష్కరించారు. మనోహర్, అశోక్ వివరాలు తెలుపుతూ ఈ పోటీలు విజయవాడలో మార్చి 29వ తేదీన జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో చాంపియన్ ఆఫ్ ది చాంపియన్ 2026 అవార్డుతో పాటు, వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. కె.ఈశ్వరరావు, సీహెచ్ రాజు, ఈదా రాజేష్, అల్లూరిరెడ్డి, ఎస్కే ఖాదర్ పలువురు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 8686771358, 9705663252లో సంప్రదించాలని సూచించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): అధికారులను సైతం బెదిరింపులకు గురిచేస్తూ, రేషన్ మాఫియాకు డాన్లా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణపై పీడీ యాక్ట్ను అమలు చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. కాజా సత్యనారాయణ(50) నందిగామ, మైలవరం సబ్ డివిజన్ పరిధిలోని లబ్ధిదారుల వద్ద నుంచి, కొంతమంది డీలర్స్ వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకుని వాటిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటాడని తెలిపారు. సత్యనారాయణ తొలిసారిగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ 2011లో పట్టుబడ్డాడని, అప్పటి నుంచి ఇప్పటి వరకు 41 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 2న డెప్యూటీ తహసీల్దార్కు వచ్చిన పక్కా సమాచారం మేరకు వీరులపాడు మండలం జయంతి గ్రామంలోని ఒక షెడ్ను తనిఖీ చేసి 147.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకుని వీరులపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసి రాజమండ్రి జైలుకు తరలించినట్లు తెలిపారు. కంకిపాడు: లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు పూర్తి చేయాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ అన్నా రు. మండలంలోని ఉప్పలూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో ఆదివారం ఆమె విస్తృతంగా పర్యటించారు. పలు కాలనీల్లో ఇంటి పన్నులకు సంబంధించిన డిమాండ్ నోటీసులను యజ మానులకు అందించారు. పన్ను వసూళ్లు, పెండింగ్ పన్నులపై సమీక్ష చేశారు. ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన అధిగమించాలన్నారు. బకాయిలపై దృష్టి సారించాలని ఆదేశించారు. పరిశీలనలో ఈఓ బి.వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
కుంభాభిషేకం..
అభిషేకానికి పవిత్ర జలాలను బంగారు గోపురం వద్దకు తీసుకెళ్తున్న అర్చకులుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవంగా సాగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా క్రతువు జరిగింది. కుంభాభిషేకం వేళ తులసీవనం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ప్రాంగణం, ప్రసాదాల విక్రయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసే మార్గంలోని బంగారు గోపురం వీక్షించే ప్రాంతం, క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి కుంభాభిషేకాన్ని వీక్షించారు. కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో, మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అందంగా అలంకరించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మంటప పూజలు, మూలమంత్ర హవనం నిర్వహించారు. అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 9గంట లకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, సీపీ రాజశేఖరబాబు, చైర్మన్ రాధాకృష్ణ, దుర్గగుడి ఆలయ ప్రధాన అర్చకులు ఎల్. దుర్గాప్రసాద్, అర్చకులు, వేద పండితులు అమ్మవారి బంగారు కలశం వద్దకు చేరుకున్నారు. బంగారు కలశానికి విజయేంద్ర సరస్వతి స్వామి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సుముహూర్తమైన 9.34 గంటలకు పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించిన అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన స్వామిజీ నేరుగా ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్దకు చేరుకుని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆలయాల్లో జరిగే విశేష పూజల వల్ల ఫలితాలు, భగవంతుడికి, భక్తుడికి మాధ్యమంగా ఉండేవి ఆలయాలేనని, యువ త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు. వారంలో రెండు రోజుల పాటు యువతకు, కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక దర్శన సమయం ఇవ్వాలని స్వామిజీ ఆకాంక్షించారు. అనంతరం ఈవో, చైర్మన్, ట్రస్ట్బోర్డు సభ్యులతో పాటు అధికారు లు, సిబ్బందికి స్వామిజీ ప్రసాదాలను అందించారు. పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా అభిషేకం దుర్గమ్మవారికి స్వామిజీ ప్రత్యేక పూజలు ఆలయ ప్రాంగణంలో అనుగ్రహ భాషణం భక్తజనంతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి -
మహిళా సాధికారతే సమగ్ర ప్రగతికి పునాది
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మహిళలు సాధికారత సాధించినప్పుడే సమగ్ర ప్రగతికి పునాది అవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘రైజ్’ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో మహిళా దినోత్సవంలో 20సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నైపుణ్యాలు అందిస్తూ స్వావలంబన దిశగా ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్: 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడారు. అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మహిళలను సత్కరించారు. చెక్కులు అందజేత.. డీఆర్డీఏ ద్వారా 4,646 మంది స్వయం సహాయక సంఘ మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.83.78 కోట్లు, 6,146 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.829.55 కోట్లు, సీ్త్రనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కింద 18,550 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ.138.41 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఆంధ్రకేసరి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (వర్సున్నపేట)కు ట్రాక్టర్ అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దే అనురాధ, మున్సిపల్ చైర్మన్ సీహెచ్ చిట్టిబాబు, ఎంపీపీ పి.జోత్స్న అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
బ్లేడ్ బ్యాచ్ దాడిలో ఒకరికి గాయాలు
పెనుగంచిప్రోలు: బ్లేడ్ బ్యాచ్ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన స్థానిక మునేరు అవతల మామిడి తోటలో శుక్రవారం అర్ధరాత్రి తరువాత చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, వడ్లమూడి గ్రామానికి చెందిన పాల పోలురాజు తన బంధువులతో కలిసి శ్రీతిరుపతమ్మ వారి చిన్న తిరునాళ్లకు వచ్చారు. అందరూ మునేరు అవతల మామిడి తోటలో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి 12–30 గంటల నుంచి ఒంటిగంట సమయంలో భార్యతో ఫోన్ మాట్లాడేందుకు బయటకు వచ్చిన అతనిని గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నెట్టటంతో కింద పడిపోయాడు. ఈ క్రమంలో తన చేతికి ఉన్న బ్రాస్లెట్, బంగారు గొలుసు ఇవ్వమన్నాడు. ఇవ్వకపోవటంతో బ్లేడ్తో గొంతు కింద, తలపై దాడి చేసి గాయపరిచాడని పోలు రాజు తెలిపాడు. దాడి చేసిన వ్యక్తిని బలవంతంగా నెట్టటంతో పారిపోయాడన్నారు. తరువాత తన వారికి చెప్పటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వ్యక్తికి తొలుత 108 వాహనంలో తిరునాళ్ల వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరం వద్ద, అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. పోలురాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అర్జున్ తెలిపారు. -
12న దండి యాత్ర 2.0
●100 నియోజకవర్గాల్లో 10 లక్షల మంది భాగస్వామ్యం ● వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కలాం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాపూజీ దండి సత్యాగ్రహం స్ఫూర్తితో ‘వైబ్రెంట్స్ ఆఫ్ కలాం‘ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం దండియాత్ర 2.0 నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కలాం చెప్పారు. శనివారం సంస్థ కార్యాలయంలో దండియాత్ర 2.0 వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1930 మార్చి 12వ తేదీన మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహం ప్రారంభించి 240 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం తమ సంస్థ దండియాత్ర 2.0 నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 10 లక్షల మంది యువత పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఇందులో భాగంగా విజయవాడ నగరంతో సహా రాష్ట్రంలోని వంద నియోజకవర్గాలలో 100 అడుగుల జాతీయ పతాకాన్ని యువతీయువకులు ప్రదర్శిస్తారన్నారు. దండి సత్యాగ్రహంలో మహాత్మా గాంధీతో కలిసి నడిచిన 78 మంది స్వాతంత్య్ర సమరయోధులను పోలిన నాయకుల ఆహార్యాలతో నగరంలో సీఎం చంద్రబాబుతో కలిసి నడుస్తారని తెలిపారు. పాదయాత్ర అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, యువత తిరోగమనానికి కారణమైన మాదకద్రవ్యాలను రాష్ట్రంలో నిర్మూలించడమే లక్ష్యంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం ఇచ్చారన్నారు. సమావేశంలో కార్యక్రమ జాతీయ సమన్వయకర్త వి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్ రవిరాజు, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ వి.శ్రీలలిత, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ రంజిత్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి జహీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
అమ్మవారి దర్శనానికి బయలుదేరిన వైఎస్సార్ సీపీ ప్రభలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చినతిరునాళ్లలో నాల్గవ రోజు శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచే భక్తులు మునేరులో స్నానాలు చేసి పాలు, పొంగళ్లతో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ క్యూలైన్లతో పాటు పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడుతో పాటు మండలంలోని ముచ్చింతాల, వెంకటాపురం, గుమ్మడిదుర్రు, శివాపురం గ్రామాల నుంచి ఎడ్లబండ్లతో పాటు చిన్న దూడలు, గొర్రెలతో బండ్లు కట్టి వాటిలోను, సైకిళ్లకు, ఆటోలకు, ట్రాక్టర్లకు పార్టీ జెండాలు, ప్రభలు కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మునేరులో పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. భక్తులు రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలో సేద తీరారు. ఎగ్జిబిషన్ వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. భక్తులకు వేద సీడ్స్ వారు మజ్జిగ పంపిణీ చేయగా రామ్కో సిమెంట్స్ వారు పులిహోర పంపిణీ చేశారు. – పెనుగంచిప్రోలు -
మద్యంపై పెల్లుబికిన మహిళాగ్రహం
పాయకాపురం(విజయవాడరూరల్): పేదల బతుకులను బండపాలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నిందంటూ మహిళలు కదం తొక్కి ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్లో టెంట్ను కూల్చివేసిన ఘటన శనివారం రాజీవ్నగర్ ఎదురు అంబాపురం గ్రామ సరిహద్దులో చోటుచేసుకుంది. విజయవాడ నగర శివారు రాజీవ్నగర్ వడ్డెర కాలనీలో కాయకష్టం చేసుకుని బతుకుతున్న కుటుంబాలకు సమీపంలో వెన్నెల బార్ అండ్ రెస్టారెంట్ను ప్రారంభించడానికి సిద్ధమై మద్యం అమ్మేందుకు టెంట్ వేసి కుర్చీలను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రికి రాత్రి బార్ను నెలకొల్పేందుకు అధికార పార్టీకి చెందిన నాయకుల మద్దతుతో మద్యం అమ్మకాలకు కౌంటర్ను, బాటిల్స్ను సిద్ధం చేశారు. ఈ విషయం గమనిస్తున్న స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఆగ్రహంతో బార్ అండ్ రెస్టారెంట్లో వేసిన టెంట్లను కూల్చివేశారు. కుర్చీలను గాల్లోకి విసిరారు. తమకు తాగటానికి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం మద్యాన్ని మాత్రం ఇళ్ల ముంగిటకు తీసుకొచ్చి అమ్ముతోందని మహిళలు రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. తమ బతుకులను నాశనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆడపిల్లలు కాలేజీలకు, స్కూల్స్కు వెళ్లే మార్గం మధ్యలో బార్ను ఏర్పాటు చేయడం ఏమిటని, ఈ ప్రభుత్వం మంట కలిసిపోవాలంటూ శాపనార్ధాలు పెట్టారు. పగలంతా మట్టి పని చేసి ఇంట్లో ఆదమర్చి నిద్రపోయే తమకు మద్యం మత్తులో ఉండేవారి నుంచి రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. వృద్ధులకు, భర్త చనిపోయిన వారికి కొత్త పింఛన్లు ఇవ్వలేని ఈ ప్రభుత్వం తమ జీవితాలను బుగ్గిపాలు చేసేందుకు ఇళ్ల మధ్యన బార్ను ఏర్పాటు చేస్తోందని దుయ్యబట్టారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ పోలీసుస్టేషన్ సీఐ కొండలరావు, నున్న పోలీసు స్టేషన్ సీఐ కృష్ణమోహన్ తమ సిబ్బందితో వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితులు చక్కబడిన పిమ్మట వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
మహిళల సాధికారతతో సమాజాభివృద్ధి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళా సాధికారతతోనే సామాజిభివృద్ధి సాధ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎ.సూర్యకుమారి అన్నారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగ ణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం మహిళా విభాగం చైర్ పర్సన్ పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి సారథ్యంలో జరిగింది. తొలుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధి, కుటుంబ పురోగతి, దేశ ప్రగతిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ సేవల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం శుభపరిణామమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ.. మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారత కోసం అన్ని స్థాయిల్లో కృషి కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ జేఏసీ కృషి చేస్తోందన్నారు. పంచా యతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కె.విజయకుమారి, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ జేడీ బి. అనుపమ చేతుల మీదుగా మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి స్టేట్ అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.కిషోర్ కుమార్, కో చైర్మన్ సంసాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లేశ్వరరావు, వి.ఆర్లయ్య, సిటీ యూనిట్ చైర్మన్ రవి ప్రసాద్, జనరల్ సెక్రెటరీ మందపాటి శంకర రావు, బత్తిన రామకృష్ణ, వై.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు. -
ఓర్పు.. నేర్పులో
● జిల్లా అధికారులుగా రాణిస్తున్న మహిళలు ● ప్రజలకు సేవలు అందించాలని తాపత్రయం ● తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్న వైనం వన్టౌన్/గాంధీనగర్/లబ్బీపేట: కొవ్వొత్తిలా కరుగుతూ కుటుంబానికి వెలుగునిస్తోంది మహిళ. ఇల్లాలి చదువు ఇంటికే కాదు.. సమాజానికే వెలుగు అని చాటిచెబుతోంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల్లోనే కాదు అధికారిగానూ తనదైన ముద్రతో విజయ కేతనం ఎగురువేస్తోంది. గృహిణిగా ఇంటిని చక్క దిద్దుతున్న ఆమె అధికారిగా ఓర్పు, నేర్పుతో విధులు నిర్వర్తిస్తూ తాను అవనితో సమానమని నిరూపిస్తోంది. మహిళలు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే సాధించలేనిది లేదు అనేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారులే నిదర్శనం. మహిళల చదువుకు ప్రాధాన్యత లేని రోజుల్లో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత చదువులు చదివి నేడు జిల్లా ఉన్నతాధికారులుగా రాణిస్తున్నారు. మరి కొందరు ప్రజాప్రతినిధులు గానూ మన్ననలు అందుకుంటున్నారు. మహిళా లోకానికి వీరి కృషి, పట్టుదల స్ఫూర్తిదాయకం. పలు ముఖ్య శాఖలను తమ ప్రతిభతో ప్రగతి పథాన నడుపుతున్నారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అధికారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే... -
ప్రజల సంతృప్తే గీటురాయి
గాంధీగనర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ల ద్వారా అందే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజల సంతృప్తి స్థాయే అధికారుల పనితీరుకు గీటురాయని స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రీసర్వే డెప్యూటీ తహసీల్దార్లు తదితరులలో శనివారం సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ మండలాల వారీగా రెవెన్యూ సేవల పంపిణీ, సమస్యల పరిష్కారంలో పురోగతి తదితరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ప్రజలతో నేరుగా ముడిపడి ఉన్న ముఖ్యమైన శాఖ అని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి తమ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయా లను ఆశ్రయిస్తారని, అందువల్ల ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల ద్వారా అందే ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు. అసైన్మెంట్స్, 22(ఏ) నుంచి తొలగింపు, రీసర్వే గ్రీవెన్సులు వంటివాటిపై వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. కేవలం సమస్యను ముగించడం కోసం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని, సర్వేలు సమయానికి పూర్తిచేసి ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించా లని తెలిపారు. ఆర్డీఓల స్థాయిలో డిజిటల్ అసిస్టెంట్ల సేవలపై నిరంతర పర్యవేక్షణ ముఖ్యమని పేర్కొన్నారు. సేవలు అందించడంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సహజ వనరుల పరిరక్షణపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ స్పష్టంచేశారు. చెరువులు, కాలువలు, వాగులు, కుంటలు వంటి జల వనరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని ఆదేశించారు. జల వనరులు ప్రజలకు అత్యంత విలువైన సంపద అని, భవిష్యత్ తరాలకు వాటిని పరిరక్షించడం మన బాధ్యత అని, భూగర్భ జలాల పరిరక్షణకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఈ సమావేశంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ కె.పోసిబాబు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారుల సదస్సులో కలెక్టర్ లక్ష్మీశ -
దుర్గామల్లేశ్వరులకు ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థా నంలో కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన శనివారం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ ఆలయానికి విచ్చేసి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్కు సుమారు గంట పాటు స్వామిజీ పూజాధి కార్యక్రమాలు జరిపించారు. అనంతరం రావిచెట్టు వద్ద ఇంద్ర కీలాద్రి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. యాగశాలకు చేరుకున్న స్వామిజీ కుంభాభిషేక క్రతువును పర్యవేక్షించారు. మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామిజీ విశేష అభిషేకాలు నిర్వహించారు. మల్లేశ్వరాలయం వద్ద విజయేంద్ర సరస్వతి స్వామిజీ శ్రీమద్భగద్గీత పుస్తకాన్ని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలుత శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఆయన శిష్యులు దుర్గాఘాట్ సమీపంలో కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించారు. యాగశాలలో పూజలు కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా శని వారం ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితులు పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థ్థాపన, పీఠ పూజలు నిర్వహించారు. సాయంత్రం మూలమంత్ర హవనం, ప్రదోష కాల పీఠ పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. యాగశాలలో నిర్వహించిన పూజా కార్యక్రమాలను విజయేంద్ర సరస్వతి స్వామిజీ పర్యవేక్షించగా, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. కుంభాభిషేకం వేళ దుర్గమ్మను ఎంపీ కేశినేని చిన్న, మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు దర్శించుకున్నారు. నేడు కుంభాభిషేకం ఆదివారం ఉదయం 9.34 గంటలకు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ చేతుల మీదగా అమ్మవారి ఆలయ శిఖరానికి కుంభాభిషేకం జరుగుతుంది. పూర్ణాహుతి అనంతరం యాగశాల నుంచి విజయేంద్ర సరస్వతి స్వామిజీతో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు నదీ జలాలను తీసుకుని ఆలయ శిఖరంపైకి వేడుకను జరిపిస్తారు. -
కనుల పండువగా పసుపు–కుంకుమ ఉత్సవం
అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్నతిరునాళ్ల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు – కుంకుమ బండ్లు తీసుకొచ్చే కార్యక్రమం శనివారం రాత్రి కనుల పండువగా జరిగింది. అమ్మవారి వంశీ కుడు కొల్లా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆలయ వేద పండితులు, అర్చకుల ప్రత్యేక పూజలు అనంతరం రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు, పూలతో అలంకరించిన బండిపై పసుపు – కుంకుమ ఉంచి ఘనంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారి పుట్టినింటికి చేరుకొని ఆనంద పరవశులయ్యారు. గ్రామంలో రోడ్ల వెంట భక్తులు బారులు తీరి బండ్లను వీక్షించటంతో పాటు వార్లు పోసి పూజలు నిర్వహించారు. కోలాట నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈఓ బి. మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్బాబు, ఈఈ కె.వి.రాజు, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ తిలక్, తహసీల్దార్ ఎ శాంతిలక్ష్మి, ఏఈ రాజు, ఉత్సవ కమిటీసభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి బండి వద్ద ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం అమ్మవారిని దర్శించుకున్నారు. -
దివ్య ప్రభోత్సవం
కమనీయం.. ● 90 అడుగుల ప్రభ ● విద్యుత్ దీపాల వెలుగులుపెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లలో మూడవ రోజు శుక్రవారం రాత్రి 90 అడుగుల దివ్య ప్రభోత్సవం కమనీయంగా జరిగింది. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తెన ప్రభగా గుర్తింపు పొందిన ఈదివ్య ప్రభోత్సవం 1928 నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముందుగా అమ్మవారికి రజకులు, శాలివాహనులు కుంభం పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈవో బి.మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్బాబు ఆధ్వర్యంలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అలంకరించిన ఇనుప ప్రభపై ఉత్సవ విగ్రహాలను ఉంచారు. దేవస్థానం వారు గ్రామానికి చెందిన రైతుల ఎడ్లను కట్టి రథాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ప్రభ ముందు డప్పు, కొమ్ము వాయిద్యాలు, నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎస్ఐ అర్జున్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, ఏఈ రాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేడు అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు కార్యక్రమం శ్రీతిరుపతమ్మవారి చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టం అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు–కుంకుమ బండ్లు వచ్చే కార్యక్రమం శనివారం రాత్రి 7.32 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఈఓ మహేశ్వరరెడ్డి తెలిపారు. -
అంగరంగ వైభవంగా..
ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సోయగం ఆలయానికి అలంకరణ కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయం, పరిసరాలను పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని అడుగడుగునా మామిడి తోరణాలు, అరటి చెట్లతో అలంకరించారు. అంతరాలయంలో అమ్మవారి మూలవిరాట్కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అంతరాలయ దర్శనం రద్దు, టికెట్ల విక్రయాలను నిలిపివేయడంతో భక్తులు అన్ని క్యూల్లో అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఘాట్రోడ్డుతో పాటు ఆలయ పరిసరాల్లో 11కు పైగా ప్రత్యేక వైద్య శిబిరాలు, భక్తులకు మంచినీటి పంపిణీ, మజ్జిగను అందజేశారు. లోబ్రిడ్జి నుంచి అమ్మవారి ఆలయానికి చేరుకునే వరకు ప్రతి వంద మీటర్లకు తాగునీటి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మోడల్ గెస్ట్ హౌస్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 11వేల మందికి అన్న ప్రసాద వితరణ దుర్గగుడిపై కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం తొలి రోజున పవిత్ర జలాలకు పూజలు ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి విశేష అలంకరణ -
కేయూ మహిళల హ్యాండ్బాల్ చాంప్ కేబీఎన్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా యూనివర్సిటీ విశ్వవిద్యాలయ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్గా కేబీఎన్ కళాశాల విజయం సాధించింది. విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల మహిళ హ్యాండ్బాల్ పోటీలు కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి జరుగుతున్న పోటీలు శుక్రవారం ముగిశాయి. కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్, టోర్నమెంట్ చైర్మన్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ తమ కళాశాల హ్యాండ్బాల్ పోటీల్లో 12సార్లు వరుస చాంపియన్షిప్లను కై వసం చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. కేబీఎన్ కళాశాల మొదటగా లీగ్ పోటీలో విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (నున్న)పై 14 –2 గోల్స్ ఆధిక్యతంతో విజయం సాధించారు. రెండో లీగ్లో స్టెల్లా కాలేజ్ (విజయవాడ)పై 18–00 గోల్స్ ఆధిక్యతతో కేబీఎన్ విజయం సాధించింది. ఫైనల్లో సిద్ధార్థ మహిళ కళాశాల జట్టుపై 14–00 ఆధిక్యంతో యూనివర్సిటీ చాంపియన్షిప్ ట్రోఫీని కై వసం చేసుంది. ద్వితీయ స్థానం విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (నున్న) సాధించగా, తృతీయ స్థానాన్ని సిద్ధార్థ మహిళ కళాశాల జట్టు సాధించింది. బహుమతి ప్రదానం ముఖ్య అతిథి ఇగ్నో రీజనల్ డైరెక్టర్ డాక్టర్ సుమలత విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఏపీ ఉత్తమ క్రీడాకారిణిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న కేబీఎన్ కళాశాల విద్యార్థిని బోయి సత్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వీరిని తయారుచేసిన క్రీడా విభాగాధిపతి డి.హేమచంద్రరావును ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీనివాస్, యూనివర్సిటీ సెలక్షన్ కమిటీ మెంబర్స్, అధ్యాపక సిబ్బంది తదితరులు విజేతలను అభినందించారు. -
బాధ్యతల స్వీకరణ
మచిలీపట్నంఅర్బన్: స్థానిక సర్వజన ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా డాక్టర్ టి. లీలా ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ టీటీకే రెడ్డి.. డాక్టర్ లీలా ప్రసాద్కు అప్పగించారు. ఈ సందర్భంగా లీలా ప్రసాద్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బడ్జెట్ అంశాలను ఉన్నతాధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. సేవలు మరింత మెరుగుపరచడానికి సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం రాత్రి విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన విజయేంద్ర సరస్వతి స్వామీజీని ఆలయ ఈవో, చైర్మన్, స్థానాచార్య, ప్రధాన అర్చకులు, వేద పండితులు పాదాభివందనం చేసి సాదరంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న స్వామీజీ తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న అనంతరం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్లను, క్రతువులను స్వామీజీ పరిశీలించారు. యాగశాలకు చేరుకున్న స్వామిజీ ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కంచి పీఠాధిపతి ఇంద్రకీలాద్రికి విచ్చేశారని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అన్నారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించారు. దీనిలో ఫీడర్ లెవల్ సోలరైజేషన్, ఎస్సీ,ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్టాప్స్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఏజీఎల్ కనెక్షన్లు, వినియోగదారులకు ఇతర సర్వీసులు అందించాలన్నారు. రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం సాధించాలన్నారు. లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫీడర్స్ బ్రేక్ డౌన్ కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్(టెక్నికల్) మురళీ కృష్ణయాదవ్, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) టీవీఎస్ఎన్ మూర్తి, డైరెక్టర్ (ఫైనాన్స్) వెంకటేశ్వర్లు, సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు. మోపిదేవి: మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు అడిషనల్ సొలిటర్ జనరల్, మాజీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం నాగ పుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించు కున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. -
పన్నుల చెల్లింపులో అధికారులకు చుక్కలు చూపిస్తున్న బడాబాబులు
మండలం గృహాలు, డిమాండ్ వసూలైంది భవనాలు చందర్లపాడు 15,408 76.13 57.09 జగ్గయ్యపేట 17,265 473.4 247.74 కంచికచర్ల 17,963 391.4 208.97 నందిగామ 11,986 157.7 119.22 పెనుగంచిప్రోలు 14,046 173.9 104.34 వత్సవాయి 14,981 119.5 71.68 వీరులపాడు 12,998 79.83 64.08 ఎ.కొండూరు 11,296 54.33 33.53 గంపలగూడెం 17,104 146.7 76.62 రెడ్డిగూడెం 8,838 68.55 27.35 తిరువూరు 10,120 50.12 32.28 విసన్నపేట 13,152 152.3 82.59 జి.కొండూరు 15,142 244.2 145.45 ఇబ్రహీంపట్నం 11,036 423.5 202.6 మైలవరం 16,122 343.8 220 55,693 2444 1475 జి.కొండూరు: గ్రామాల్లో పన్నుల చెల్లింపులో పెద్దలు వెనుకంజలో ఉండగా.. తప్పించకోవడానికి ముందంజలో ఉన్నారు. ప్రసంగాల్లో నీతులు వల్లించే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఇంటి పన్నుల చెల్లింపులో మాత్రం అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. సామాన్యులను ముక్కుపిండి వసూలు చేసే అధికారులు.. ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లించని బడాబాబులను ఏమీ చేయలేక, రాజకీయ ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఇంటి పన్నులను బడాబాబులే ఎగవేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది చివరికి వచ్చినా పన్నుల వసూళ్లు పాత బకాయిలతో కలిపి 58 శాతం మాత్రమే పూర్తవడం ఆందోళనకరంగా మారింది. గ్రామ పంచాయతీలకు ఆదాయం లేక, స్టాంపు డ్యూటీ లేక, బడాబాబుల నుంచి ఇంటి పన్నుల వసూళ్లు కాకపోవడంతో కనీస మౌలిక వసతుల కల్పన లేక, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందించలేని దుస్థితి నెలకొంటోంది . ఎన్టీఆర్ జిల్లాలోని 16మండలాల పరిధిలో 288 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి చివరిరే రూ.53.99కోట్లు ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉంది. దీనిలో పాత బకాయిలే రూ.11.97కోట్లు ఉంది. గతేడాది ఆగస్టు నుంచి ఇంటి పన్ను వసూళ్లు ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకు పాత బకాయిలు రూ.4.60కోట్లు, నూతన ఇంటి పన్ను రూ.27.08కోట్లు కలిపి మొత్తం రూ.31.68కోట్లను వసూలు చేశారు. ఇప్పటి వరకు పేద, మద్య తరగతి వారి నుంచి మాత్రమే ఈ ఇంటి పన్నును అధికారులు వసూలు చేయగలిగారు. విజయవాడ రూరల్ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పన్నుల వివరాలు రూ.లక్షల్లో నగర, గ్రామ ఆర్థిక వ్యవస్థకు పన్నులు ప్రధాన ఆధారం. అయితే ఇటీవల పన్నులు కట్టకుండా దారులు చూస్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో అధిక ఆదాయం కలిగిన పెద్దలు, సంస్థలు ఇంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం బడాబాబులు పావులు కదుపుతున్నారు. పన్ను చెల్లింపులో సామాన్యులు నియమాలు పాటిస్తుంటే.. పెద్ద ఆదాయ వర్గాలు పన్నుల నుంచి తప్పించుకోవడం ఆర్థిక సమానతకు సవాల్గా మారుతోంది. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. సామాన్యులను ముక్కు పిండి వసూలు చేస్తున్న వైనం ఎన్టీఆర్ జిల్లాలో 2025–26లో ఇంటి పన్ను డిమాండ్ మొత్తం రూ.53.99కోట్లు ఇప్పటి వరకు 58.69 శాతం మాత్రమే వసూలు ఇంకా వసూలు చేయాల్సిన పాత బకాయిలు రూ.7.37కోట్లు, నూతన పన్ను రూ.14.93కోట్లు కలిపి మొత్తం రూ.22.30కోట్లలో 20 శాతం మొండి బకాయిలు ఉండగా మరో 20 శాతం కార్పొరేట్ విద్యా సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తల నుంచి వసూలు చేయాల్సి ఉంది. వీరు రాజకీయ నేతల నుంచి ఫోన్లు చేయించడం, మాట్లాడించడం వంటి దారులతో పంచాయతీ అధికారుల చేతులు కట్టేస్తున్నారు. సంబంధిత అధికారులు వచ్చినా బడాబాబులు లెక్కచేయడం లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన ఇంటి పన్నును వసూలు చేసేందుకు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. -
స్వయం ఉపాధితో ఆర్థిక పరిస్థితి మెరుగు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కిలేశపురంలో పి.ఉమ అనే మహిళ పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం చేయూతతో ఇప్పటికే ఒక ఎద్దు గానుగ యూనిట్ను ప్రారంభించగా మరో యూనిట్ను కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ ఆర్థికంగా స్వావలంబన సాధిస్తే కుటుంబం బలపడుతుందన్నారు. స్వయం ఉపాధి మహిళలకు కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని ఇచ్చే మార్గమని పేర్కొన్నారు. మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి శిక్షణ, రుణ సదుపాయం, మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం నీతి ఆయోగ్ అధికారి రాధికా ములేతో కలిసి జూపూడిలో పర్యటించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యాన అమలవుతున్న ఆకాంక్షిత బ్లాక్, సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా రాధికా ములే జిల్లాలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలాల్లో వివిధ ప్రగతి సూచికల్లో పురోగతిని పరిశీలించారు. డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శకుంతల, తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ ప్రమాదకరం
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ లబ్బీపేట(విజయవాడతూర్పు): డ్రగ్స్తో ఆరోగ్యానికే కాక భవిష్యత్తుకూ ప్రమాదకరమని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో బుధవారం డ్రగ్స్ వద్ద బ్రో అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథి రవికృష్ణ మాట్లాడుతూ..తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చడం విద్యార్థుల బాధ్యతన్నారు. పొగాకు, మద్యం, గంజాయి, హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాలకు ఒకసారి అలవాటు అయితే బయటపడటం కష్టమని హెచ్చరించారు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, ఈగల్ సీఐ రవీంద్ర, ఆర్ఐ నాగార్జున, ఎస్ఐ వీరాంజనేయులు, పలువురు అధ్యాపకులు, సుమారు 500 మంది మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి తెప్పోత్సవం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఏసీ సంధ్య తెలిపారు. ఉదయం సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటలకు రథోత్సవం జరిగింది. అనంతరం వసంతోత్సవం, పూర్ణహుతి, చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు స్వామి వారిని పల్లకిలో తిరువీధుల్లో ఘనంగా ఊరేగించారు. రాత్రి ఏడు గంటలకు వేణు గోపాలస్వామి తెప్పోత్సవం జరిగింది. -
ఫిట్గా ఉంటేనే అన్నింటా ఫస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శారీరక, మానసికంగా ఫిట్గా ఉంటేనే అన్నింటా ఉత్తమ ఫలి తాలు సాధించగలమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో క్రీడా పోటీలను శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ నిర్మలకుమారి, కన్వీనర్ పి.మాధవి తదితరులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం సమర్థవంతమైన పాలనకు కీలకమన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ... క్రీడలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా నాయకత్వ లక్షణాలు, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి గుణాలను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎజ్జీఓ మహిళా విభాగం ప్రతినిధులు కె.శివలీల, వి.శాంతిశ్రీ, బి.జానకి, ఎం.సరస్వతి, బి.విజయశ్రీ, సీహెచ్.నాగమల్లేశ్వరి, ఎస్.దివ్య, వి.సురేఖ, పి.తులసీరత్నం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
సమాజంలో మహిళల సేవలు అమూల్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో మహిళలు అందిస్తున్న సేవలు అమూల్యమని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా అధికారులు, ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమను వీసీ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో మహిళలు అద్భుతమైన విజయాలు సాధి స్తున్నారన్నారు. అకడమిక్, పరిశోధన, నాయకత్వం వంటి అంశాల్లోనూ సత్తాచాటుతున్నారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ మాట్లాడుతూ.. లింగ సమానత్వం అనేది ఒక లక్ష్యం కాదని, అది ఉమ్మడి బాధ్యతని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేసిన వర్సిటీ మహిళా ఉద్యోగులు ఎన్.బి.లక్ష్మి, వి.ఝాన్సీతో పాటు, ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఎంఆర్యూ పరిశోధనల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన తిరుపతి శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రవిప్రభు, పిడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.ఎస్.కిరిటీ, పీఆర్ఓ వీరకిరణ్ను సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.లక్ష్మీసూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధ, సీఓఈ డాక్టర్ చక్కా శ్రీకాంత్, ఫైనాన్స్ ఆఫీసర్ టి.కృష్ణ, కె.ఎల్.ఆర్.కె.ప్రసాద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ -
తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ప్రారంభం
ఇబ్రహీంపట్నం: స్థానిక ఎన్టీటీపీఎస్లో బుధవారం జాతీయ భద్రత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్చార్జిచీఫ్ ఇంజినీర్ పి.అనురాధ ఈ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భద్రతంటే ఒక రోజు పాటించే నియమం కాదన్నారు. దైనందిన జీవితంలో భద్రత ఒక భాగం కావాలని సూచించారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వంటి కీలక విభాగాల్లో పనిచేసేటప్పుడు అప్రమత్తత కీలకమన్నారు. ప్రతి ఉద్యోగీ తనతో పాటు తోటి ఉద్యోగుల రక్షణను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రక్షణ పరికరాలు ధరించడంలో నిర్లక్ష్యం తగదని హితవుపలికారు. భద్రతా కమిటీ సభ్యులు, సిబ్బంది కలిసి భద్రతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ ఇంజినీర్లు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న గోసంరక్షణ కేంద్రానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. మొగల్రాజపురం శాంతినగర్కు చెందిన కె.లీలాకుమారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యుడు రామబ్రహ్మంనకు దాతలు ఈ విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండి తుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
నాలుగేళ్లపాటు ఉపాధి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు 2021, జనవరి 21వ తేదీన ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఉపాధి కల్పించడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఒక్కొక్కరికి సుమారుగా రూ.6 లక్షల విలువైన వాహనాన్ని అందజేశారు. ఈ వాహనం ఖరీదులో పది శాతం మాత్రమే లబ్ధిదారులు ముందుగా చెల్లించారు. బ్యాంకు రుణాలను తీర్చేందుకు ఆయా కార్పొరేషన్ల నుంచి ఒక్కొక్క వాహనానికి నెల వాయిదా పద్ధతిలో రూ.6 వేలు, ఆపరేటర్ల వేతనం నుంచి రూ.3 వేలు చెల్లించేవారు. ఈ విధంగా ఆపరేటర్లకు నెలవారీ వాయిదా, సహాయకుడి వేతనం, డీజిల్ ఖర్చు కలిపి ప్రభుత్వం నుంచి నెలకు రూ.21 వేలు చెల్లించారు. ఈ విధంగా ఆపరేటర్లు రేషన్ పంపిణీని 15రోజుల్లో పూర్తి చేసి నెలలో మిగిలిన 15 రోజులు ఇతర పనులు చేసుకొని ఉపాధి పొందేవారు. నాలుగేళ్ల పాటు ఉపాధి పొందిన ఆపరేటర్లుకు చంద్రబాబు ప్రభుత్వం షాకిచ్చింది. వాహనాలతో రేషన్ మాఫియా సాగుతోందని అసత్యాలు వల్లెవేస్తూ వాటిని తొలగించింది. ఇప్పుడు ఉపాధి పోయి ఆ వాహనాలకు తమ పేరుకు మారక, వాటిని విక్రయించే వీలు లేక, ఇన్సూరెన్స్ చెల్లించలేక ఆపరేటర్లు నరకయాతన పడుతున్నారు. -
ఎండీయూ వాహనం..
● ఎండీయూ వాహనాలను నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ● ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న వాహనాల ఆపరేటర్లు ● వాహనాల ఆపరేటర్లకు భారంగా మారిన రుణాల చెల్లింపు జి.కొండూరు: పేదల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులను చేరవేసే ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ వాహనాల వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపణలు చేసింది. ఈ వాహనాలను నిలిపివేసిన ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీని తిరిగి డీలర్లకు అప్పగించింది. వాహనాలను రద్దు చేసినప్పుడు వాటి రుణాల బకాయిలను వెంటనే క్లియర్ చేసి వాహనాల ఆపరే టర్లకు క్లియరెన్స్ లెటర్లు ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చింది. రుణాలు తీరిపోతే వాహనం ఆపరేటర్ల సొంతమై వారు ఇతర వ్యాపారాలకు వినియోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు గొప్పల డప్పుకొట్టింది. అయితే వాహనాలను తొలగించి తొమ్మిది నెలలు గడిచినా రుణాల క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో వాహనాలను వినియోగించని ఆపరేటర్లు, వాటిని విక్రయించే వీలు లేక లబోదిబోమంటున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ గడువు కూడా ముగియడంతో రెన్యూవల్ చేయించలేక సతమతం అవుతున్నారు. వాహనాలను తొలగించే ముందు రెండు విడతలు ఐసీడీఎస్, ఏఎండీలకు రేషన్ సరఫరా చేసిన కమీషన్కు సైతం రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. వాహనాలను తొలగించాకే రేషన్ మాఫియాకు రెక్కలొచ్చాయని ఎండీయూ ఆపరేటర్ల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ పంపిణీ వాహనాలను గత ఏడాది మే నెలలో తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వాహనంపై అప్పటి వరకు మిగిలి ఉన్న బ్యాంకు రుణం బకాయి రూ.1.5 లక్షలను ప్రభుత్వం ఒక్కసారిగా చెల్లించి ఉంటే బ్యాంకుల నుంచి క్లియరెన్స్ వచ్చి వాహనం ఆపరేటర్ల సొంతమయ్యేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా నెలవారీ వాయిదాలు చెల్లిస్తుండడంతో బ్యాంకుల నుంచి క్లియరెన్స్ రాలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ వాయిదాలు చెల్లించాల్సి ఉండటంతో వాహనా లకు క్లియరెన్స్ రావాలంటే ఆపరేటర్లు మరో ఏడాది పాటు వేచి ఉండక తప్పదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలకు వాహన మిత్ర పథకంలో వచ్చే సొమ్ముతో ఏటా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీతో ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఇన్సూరెన్స్ను రెన్యూవల్ చేసేందుకు రూ.11,500 చెల్లించాల్సి రావడం ఆపరేటర్లకు భారంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు చెల్లించాల్సిన ఐసీడీఎస్, ఏఎండీలకు రేషన్ సరఫరా చేసిన కమీషన్ రెండు విడతలుగా చెల్లించలేదు. ఈ రెండు విడ తలు కమీషన్ కలిపి ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.14 లక్షల వరకు ఆపరేటర్లకు రావాల్సి ఉంది. -
దసరా ఉత్సవాల తరహాలో కుంభాభిషేకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఈ నెల ఆరో తేదీ నుంచి జరిగే కుంభాభిషేకానికి దసరా ఉత్సవాల తరహాలో ఏర్పాట్లు చేస్తున్నామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ బుధవారం పరిశీలించారు. తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవ దాయ శాఖ అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ బంగారు శిఖరం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. కుంభాభి షేకం గురించి ఆలయ ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. అనంతరం రాజగోపురం ఎదుట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభాభిషేకానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్సవాలలో తొలి రెండు రోజులు సుమారు 1.40 లక్షల మంది, మూడో రోజు లక్ష మంది భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం కుంభాభిషేక ఏర్పాట్లపై ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్, సీపీ పరిశీలన కుంభాభిషేక ఏర్పాట్లను బుధవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, విజయవాడ ముని సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డీసీపీ గుణ్ణం రామకృష్ణ పరిశీలించారు. తొలుత వినాయకుడి గుడి నుంచి ఏర్పాట్లను పరిశీలిస్తూ ఆలయానికి చేరుకున్న అధికారులు ఆలయ ఇంజినీరింగ్ విభాగానికి పలు సూచనలు ఇచ్చారు. క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, యాగశాల ప్రాంతాలను పరిశీలించారు. వినాయకుడి గుడి నుంచి సింగిల్ క్యూ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మహా మండపం దిగువన గోశాల వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక క్యూలైన్లను పరిశీలించారు. -
దాడులు చేయించేందుకా దశాబ్దాల అనుభవం?
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిఇబ్రహీంపట్నం: సీఎం చంద్రబాబు దశాబ్దాల అనుభవం ప్రతిపక్ష నేతలు, ప్రజలపై దాడులను ప్రోత్సహించేందుకేనా అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోందన్నారు. ప్రభుత్వమే నేర వ్యవస్థను సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. జోగి రమేష్ ఇంటి పై ఘటన వీడియోలను చూస్తే ప్రభుత్వం, పోలీసులు కనుసన్నల్లో ఆ దుశ్చర్య జరిగి తీరు అర్థమవుతోందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైనా ఇటువంటి దాడే జరిగిందన్నారు. దాడుల్లో మహిళలు కూడా పాల్గొని కొత్త చరిత్రకు నాంది పలికారని పేర్కొ న్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టడం చూస్తుంటే పోలీస్ వ్యవస్థ ఎటుపోతుందనే అను మానం కలుగుతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి, అవసరమైన సాక్ష్యాన్ని సృష్టంచే సంస్కృతి తీసుకొచ్చారని విమర్శించారు. ఈ సంస్కృతి భవిష్యత్లో కొనసాగితే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వింటే టీడీపీ ప్రభుత్వ తీరు తెలిసిపోతుందన్నారు. బడ్జెట్ మొత్తం అసత్యాలేనని ఎద్దేవాచేశారు. ఎన్నికల ముందు ‘నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అన్నారు కదా, రూ.15 వేలు, రూ.18 వేలు, రూ.20 వేలు ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నారని, ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని గుర్తుచేశారు. టీటీడీ లడ్డూపై మండలిలో చర్చ జరగకుండా అడ్డుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వమేనని విమర్శించారు. లడ్డూ విషయంలో వాళ్లే స్క్రిప్ట్ రాశారు, వాళ్లే దర్శకత్వం, వాళ్లే ప్రొడక్షన్, వాళ్లే హీరో, వాళ్లే విలన్, వాళ్లే జోకర్ అన్నీ వాళ్లే కదా అని రాజేంద్రనాథ్రెడ్డి ఎద్దేవాచేశారు. -
ఘనంగా నెమలి వేణుగోపాలుని కల్యాణం
గంపలగూడెం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం నయనానందకరంగా జరిగింది. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలుడి కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రాజగోపాలాచార్యులు, పరాశరం విఖనసాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. 250 మంది దంపతులు పీటలపై కూర్చున్నారు. కల్యాణ వేడుకలు తిలకించేందుకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తిరువూరు, మధిర ఆర్టీసీ డిపోలు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపాయి. ఆలయ సహాయ కమిషనర్ సంధ్య, దేవాలయ పాలకమండలి చైర్మన్ కావూరి శశిరేఖ, కమిటీ సభ్యులు కొండపల్లి కొండలరావు, గరిడేపల్లి వెంకటరమణ, మోదుగు సుహాసిని పర్యవేక్షించారు. ఏసీపీ ప్రసాదరావు, తిరువూరు సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయ అధికారులు పదివేల మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మధురానగర్(విజయవాడసెంట్రల్): దేవాలయాల్లో రాజకీయాలు తగవని, సనాతన ధర్మాన్ని చంద్రబాబు ప్రభుత్వం మంటకలు పుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య సోమవారం జరిగిన వివాదం హిందు వుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య జరుగుతున్న రాజకీయ గొడవలకు నెమలి వేణుగోపాల స్వామి కల్యాణం వేదికవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆలయాల్లో రాజకీయపరమైన ఘర్షణలు తలెత్తడం సర్వసాధార ణంగా మారిందని విమర్శించారు. భగవంతునికి భక్తితో సమర్పించే పట్టువస్త్రాల విషయంలో పదివేల మంది భక్తులు, అర్చక స్వాముల మధ్య ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఘర్షణ జరగటం దారుణమన్నారు. భక్తి భావంతో ఉండాల్సిన వేడుకలో తోపులాటలు, ఘర్షణలకు దేవస్థానం వేదికగా మారటం ఏమిటని ప్రశ్నించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మంగళవారం తెలిపారు. వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జరిపిన దాడుల్లో 15 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణకు చెందిన గోదాంలో సుమారు 15 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ బియ్యాన్ని తదుపరి చర్యలు నిమిత్తం కంచికచర్ల ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించినట్లు చెప్పారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న ఎనిమిది వాహనాలను వీరులపాడు పోలీస్ స్టేషన్కు అప్పగించామని వివరించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని, నివేదికల ప్రకారం సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిరంతర తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ నిల్వలపై జరిపిన దాడిలో డీఎస్వో పి.వాణి, ఏఎస్ఓ వి.శ్రీనివాస్, డెప్యూటీ తహసీల్దార్లు బి.రామకృష్ణ, సీహెచ్. సుమతి, ఆర్ఐ కె.కిషోర్, స్థానిక వీఆర్వోలు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరిపై అక్రమ కేసు నమోదు లబ్బీపేట(విజయవాడతూర్పు): మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్స్టేషన్లో అక్రమ కేసు నమోదైంది. ఏపీ మద్యం రవాణా కాంట్రాక్ట్పై సిట్ నమోదు చేసిన కేసు నుంచి తమను తప్పించాలని సిట్ విచారణాధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. -
విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా
నందిగామ రూరల్: ఈత సరదా ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మండలంలోని కొండూరు గ్రామ సమీపంలోని కూచి వాగు వద్ద మంగళవారం జరిగింది. కొండూరు గ్రామానికి చెందిన బెల్లంకొండ లక్ష్మణరావు, అనూష దంపతులు వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దినకరన్ (15) మాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి, రెండో కుమారుడు దినేష్ ఏడో తరగతి చదువుతున్నారు. హోలీ పండుగ సందర్భంగా మంగళవారం పాఠశాలకు సెలవు కావటంతో ప్రభు కిషోర్, బంశీ, చరణ్, కుమార్తో పాటు మరో నలుగురు స్నేహితులతో కలిసి దినకరన్ కొండూరు–మాగల్లు గ్రామాల మధ్య ఉన్న కూచి వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో దినకరన్ వాగులోని గుంతలో మునుగుతుండటాన్ని స్నేహితులు గమనించి కేకలు వేశారు. చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకుని దినకరన్ను బయటకు తీసి నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దినకరన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దినకరన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదించారు. పట్టణంలోని మార్చురీ వద్దకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
మద్యం మత్తులో కానిస్టేబుల్పై యువకుల దాడి
కోడూరు: మద్యం మత్తులో కానిస్టేబుల్పై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ చాణిక్య మంగళవారం తెలిపిన కథనం మేరకు.. మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ జాతరలో పోలీసు కానిస్టేబుల్ పి.వేణుస్వామి విధులు నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా సోమవారం రాత్రి పిట్టల్లంక గ్రామానికి యువత డీజే ఏర్పాటు చేశారు. అయితే విశ్వనాథపల్లి గ్రామంలోకి వచ్చిన తరువాత డీజేకు సంబంధించిన సౌండ్ను తగ్గించాలని కానిస్టేబుల్ వేణుస్వామి నిర్వాహకులకు సూచించారు. మద్యం మత్తులో ఉన్న పిట్టల్లంక గ్రామానికి చెందిన యువకులు కోట మహేష్, కోట నరేష్ ‘మా డీజే సౌండ్ తగ్గించమంటావా’ అంటూ కానిస్టేబుల్ మెడ పట్టుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ వేణుస్వామిని తోటి పోలీసులు హుటాహుటినా అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇద్దరి యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు. గుడివాడరూరల్: ప్రమాదవశాత్తూ గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన మండలంలోని మోటూరు గ్రామంలో మంగళవారం జరిగింది. సుమారు 40 సంవత్సరాల వయస్సు గల మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి మోటూరు గ్రామంలోని పంచా యతీ చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న గుడివాడ తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు తాలూకా పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెనమలూరు: మండలంలోని పోరంకిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. పోరంకికి చెందిన జాస్తి శ్రీదేవి (48), దుర్గాప్రసాద్ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. దుర్గాప్రసాద్ నాలుగేళ్ల క్రితం మృతి చెందటంతో శ్రీదేవి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బెంగళూరులో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లిన శ్రీదేవి ఈ నెల ఒకటో తేదీన బయలుదేరి పోరంకికి వచ్చింది. సోమవారం ఇంట్లో బెడ్రూమ్లో శ్రీదేవి సీలింగ్ ప్యాన్కు ఉరివేసుకుని మృతి చెందింది. అదే ఇంట్లో ఉంటున్న అత్త జాస్తి ఝాన్సీ ఉరికి వేలాడుతున్న శ్రీదేవిని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మృతురాలి కుమార్తె మేఘనసాయి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చల్లపలి: హైవేపై వెళ్తున్న కారు టైరు పైలడంతో ఒక్కసారిగా పక్కనున్న పంట బోదెల్లోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటు వంటి గాయాలు కాలేదు. మంగళవారం సాయంత్రం మచిలీపట్నం నుంచి మోపిదేవి వైపు వస్తున్న కారు చల్లపల్లి మండలం లక్ష్మీపురం దాటగానే ప్రమాదానికి గురైంది. చీకటి పడే వరకు బోదెలోకి వెళ్లిన కారును బయటకు లాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వమే కల్తీ మయం
మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఇబ్రహీంపట్నం: చంద్రబాబు ప్రభుత్వమే కల్తీలకు నిలయంగా మారిందని రాయచోటి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన్ను మంగళవారం శ్రీకాంత్రెడ్డి పరామర్శించారు. దాడి జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ను గద్దె దింపినప్పటి నుంచి ప్రజాబలం లేని చంద్ర బాబు మేనేజ్డ్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. జోగి రమేష్, అంబటి రాంబాబు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఇళ్లపై పోలీసులే దగ్గరుండి దాడులు, హింసను ప్రోత్సహించడం ఏమి సంస్కృతి అని ప్రశ్నించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక దాడులు చేసిన వారిని విడిచిపెట్టబోమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీచర్లకు 27 శాతం ఐఆర్ ఇచ్చారని, ఇంత వరకు ఐఆర్, పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సచివాలయ వ్యవస్థ జగన్మోహన్రెడ్డి మానస పుత్రిక కాబట్టే నిర్వీర్యం చేయాలని చర్యలు చేపట్టారని దుయ్యబట్టారు. గతంలో తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం కూల్చేసిన చంద్రబాబే లడ్డూ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం అంటూ ఊగిపోయారని ఎద్దేవాచేశారు. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ లడ్డూలో జంతు కొవ్వు లేదని తేల్చిందన్నారు. -
నేటి నుంచి తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల
పెనుగంచిప్రోలు: భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల ఉత్సవాలు బుధవారం నుంచి ఎనిమిదో తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. తిరునాళ్ల ఉత్సవాలకు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, నల్గొండ జిల్లాల నుంచే కాక ఉభయగోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్బాబు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బుధవారం ఉదయం 6.19 గంటలకు అఖండ జ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవుతాయి. ఐదో తేదీ రాత్రి 7.02 గంటలకు ఉత్సవమూర్తుల రథోత్సవం, ఆరో తేదీ రాత్రి 10.02 గంటలకు 90 అడుగుల దివ్య ప్రభోత్సవం, ఏడో తేదీ రాత్రి 7.32 గంటలకు తిరునాళ్లల్లో ప్రధాన ఘట్టమైన శ్రీతిరుపతమ్మ అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు– కుంకుమల బండ్లు పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటాయి. మార్చి ఎనిమిదో తేదీ ఉదయం 5.30 గంటలకు భక్తుల బోనాల సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయి. వేసవి తీవ్రత దృష్ట్యా చిన్నతిరునాళ్లలో తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఇన్చార్జీ ఈఈ భాస్కర్ తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయం చుట్టూ నాలుగు ఆర్ఓ ప్లాంట్లు నిత్యం భక్తులకు శుద్ధజలాన్ని అందిస్తాయన్నారు. వాటర్ ప్యాకెట్ల పంపిణీతోపాటు, ఆలయం చుట్టూ చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పుణ్య స్నానాల కోసం మునేరులో 300 షవర్లు ఏర్పాటు చేశామని, తాత్కాలికంగా మరుగుదొడ్లను సిద్ధం చేశామని వివరించారు. -
డ్రగ్స్, గంజాయి మాఫియాను అరికడదాం
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో రోజురోజుకు చెలరేగుతున్న డ్రగ్స్, గంజాయి మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, ప్రజానీకం కృషి చేయాలని, యువత భవిష్యత్తును కాపాడాలని రౌండ్టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ‘గంజాయి వద్దు – ఆరోగ్యం ముద్దు’ నినాదంతో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా, పీఎన్ఎం, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న అధ్యక్షతన ప్రజా సంఘాల రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.లక్ష్మణరావు, ఐద్వా జాతీయ నాయకులు డి.రమాదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందన్నారు. వాటి ప్రభావంతో యువతలో నేర ప్రవృత్తి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ ఇలా ఎక్కడ పడితే అక్కడే విచ్చలవిడిగా చాక్లెట్, బిస్కెట్, టాబ్లెట్ల రూపంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈగల్ నివేదిక ప్రకారం ఒక్క సంవత్సరంలోనే 836 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్, ఎంబీవిజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. డ్రగ్స్ మాఫియాను నిర్మూలించేందుకు నిష్పక్షపాతంగా కఠిన చట్టాలు అమలు చేయాలని, విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్కుమార్, సామాజిక న్యాయ సంక్షేమ సంఘం చైర్మన్ బాలకోటయ్య, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు గోళ్ల నారాయణరావు, డాక్టర్ ఎం.సూర్యనారాయణ, శ్రీనివాస్, లంక గోవిందరాజు, ఆండ్ర మల్యాద్రి, విజయ్ ప్రకాష్, ఎ.సూర్యారావు పాల్గొన్నారు. ప్రజాసంఘాల రౌండ్టేబుల్ సమావేశం పిలుపు -
ఆత్మగౌరవం కోసం పట్టుదల
గంపలగూడెం/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఘోర అవమానం జరిగింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాల స్వామి కల్యాణం సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించకుండా అధికార పార్టీకే చెందిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన వర్గీయులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే తన ఆత్మగౌరవాన్ని వదులుకోనంటూ ఎంపీ చేతుల్లో నుంచి ఎమ్మెల్యే కొలికపూడి పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని స్వామివారికి సమర్పించారు. ఎమ్మెల్యే చేతుల్లో నుంచి పట్టువస్త్రాలను తిరిగి లాక్కునేందుకు ఎంపీ వర్గీయులు ప్రయత్నించడం విమర్శలకు దారితీసింది. ఏమి జరిగిందంటే.. గంపలగూడెం మండలంలోని నెమలి గ్రామంలో వేంచేసిన శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం జరి గింది. కల్యాణం సందర్భంలో స్థానిక శాసనసభ్యుడు స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించటం ఆనవాయితీ. ఈ సంప్రదాయం ఏటా కొనసాగుతోంది. గత ఏడాది ఎంపీ శివనాథ్ అతిథిగా హాజరవగా, పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే సమర్పించారు. సోమవారం రాత్రి కూడా ఎంపీ శివనాథ్ కల్యాణోత్సవానికి హాజరయ్యారు. అయితే పట్టువస్త్రాలను ఆలయ అధికారులు ఎంపీకి ఇచ్చి, తనకు ముత్యాల తలంబ్రాలు ఇవ్వడంపై ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారు. తానే పట్టు వస్త్రాలు సమర్పించాలని పట్టుబట్టారు. దీంతో ఆలయ అధికా రులు మరో జత వస్త్రాలను సిద్ధం చేసే తరుణంలో ఎంపీ తలపై ఉన్న పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే లాక్కుని తన తలపై పెట్టుకున్నారు. ఎంపీ అనుచరులు ఎమ్మెల్యే కొలికపూడిని అడ్డుకునేందుకు యత్నించారు. ఎమ్మెల్యే తలపై ఉన్న పట్టువస్త్రాలను టీడీపీ గంపలగూడెం మండల అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ లాక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొందరు నాయకులు ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. మానికొండ రామ కృష్ణ ఎంపీ సమక్షంలోనే ఎమ్మెల్యేను దుర్భాషలాడుతూ ఘర్షణ వాతావరణం సృష్టించారు. తన నియోజకవర్గంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో తననే అవమానించారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం జరుగుతుండగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించగా, ఎమ్మెల్యే కొలికపూడికి ఆయన గన్మన్ రక్షణగా నిలిచారు. దళితులకు తరచూ అవమానాలు దళిత ఎమ్మెల్యే కాబట్టే కొలికపూడిని ఎంపీ శివనాథ్ తరచుగా అవమానిస్తున్నారంటూ పలువురు దళిత నేతలు విమర్శించారు. విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కేవలం తిరువూరులోనే ఈ తరహా వివాదాలకు ఎంపీ ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు మండి పడుతున్నారు. జగ్గయ్యపేట, మైలవరం, ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రొటోకాల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోని ఎంపీ కేవలం తిరువూరులో తరచూ వివాదం చేయటం ఏమి టని ప్రశ్నిస్తున్నారు. దళితులపై చిన్నచూపు కారణంగానే అణిచివేతకు పాల్పడుతున్నారని కొలికపూడి అనుచరులు ఎంపీ తీరుపై మండిపడుతున్నారు. సంచలనం సృష్టించిన కొలికపూడి వాట్సాప్ స్టేటస్ కల్యాణోత్సవంలో గొడవపై కొలికపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ సంచలనం సృష్టించింది. టీడీపీలో ఒక దళిత ఎమ్మెల్యే పరిస్థితి ఇది అనే కాప్షన్తో ‘మీరెన్ని అబద్ధాలు చెప్పినా, తప్పుడు ప్రచారం చేసినా, మద్యం మత్తులో మీరు చేసిన అఘాయిత్యం వీడియోలో స్పష్టంగా ఉంది’ అంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రంగా భావించే పట్టు వస్త్రాల సమర్పణను టీడీపీ రాజకీయాలకు వేదికగా వాడుకోవడం, తమ గ్రూపు తగాదాలతో భక్తులను గందరగోళానికి గురిచేయడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వేణుగోపాలుడి కల్యాణోత్సవంలో వివాదం చేసే ఉద్దేశంతోనే ఎంపీ శివనాథ్ తన అనుచరులతో వచ్చారని కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎంపీతో వచ్చిన వారంతా మద్యం మత్తులోనే ఉన్నారని, అందువల్లే దేవుడి సన్నిధి అని చూడకుండా గందరగోళం చేశారని దుయ్యబట్టారు. ఎంపీ శివనాథ్ సాగి స్తున్న పేకాట, ఇసుక, మద్యం దందాలపై తాను ప్రశ్నించటం వల్లే ఆయన తనపై ఈ విధమైన అవమానాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించటం ఎమ్మెల్యేగా తనకున్న హక్కు అని, దానిని ఎలా తీసుకుంటారని కొలికపూడి ప్రశ్నించారు. గత ఏడాదీ తానే స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించానని, అప్పుడు ఎంపీ అతిథిగా వచ్చి వెళ్లా రని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తన హక్కును లాక్కుంటే ఒప్పుకోబోనని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని ఎంపీ చిన్నిపై కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఓపెన్ డీల్!
ఇంటర్ ఓపెన్ పరీక్షల్లో కొన్ని స్టడీ సెంటర్ల నిర్వాహకులు దందాకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సెంటర్ల నిర్వాహకులు పరీక్షలు పాస్ చేయిస్తామంటూ ‘డీల్’ కుదుర్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి బదులు మరొకరిని పరీక్షలు రాయించడానికి పంపుతున్నారు. దీనికి నిదర్శనం పరీక్షల మొదటి రోజే అధికారులు ముగ్గురిని పట్టుకోవడం. అక్రమార్కుల దందా బట్టబయలైనా సంబంధిత శాఖ అధికారుల్లో స్పందన కానరావడం లేదు. దీనిలో ఉన్నతాధికారులకూ భాగముందనే ఆరోపణలు వస్తున్నాయి. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్ ఓపెన్ పరీక్షల్లో పలు స్టడీ సెంటర్ల నిర్వాహకులు ‘డీల్’ కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు పలు స్టడీ సెంటర్లు ‘ఓపెన్’గా దందాకు పాల్పడుతున్నాయి. లక్షలాది రూపాయలను దండుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మాస్ కాపీయింగ్, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసేందుకు నిర్వాహకులు ఒప్పందాలు కుదర్చుకొని లక్షలాది రూపాయాలు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి దందాలకు సంబంధించి పలు స్టడీసెంటర్ల నిర్వాహకులు బహిరంగంగానే వీటిపై డీల్స్ మాట్లాడుకొని వసూళ్లకు తెగిస్తున్నారని పలువురు విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకూ జరుగుతాయి. జిల్లాలో పరీక్ష రాస్తున్న 1,288 మంది.. ఇంటర్ ఓపెన్ కోర్సులకు ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది సుమారుగా 1,288 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీటికి సంబంధించి జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా జిల్లాలో సుమారుగా 30కు పైగా వివిధ స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలకు హాజరుకావాలని భావించే విద్యార్థులు అధిక శాతం మంది ఆయా స్టడీ సెంటర్లను ఆశ్రయించి డబ్బులు చెల్లిస్తుంటారు. వాటి నిర్వాహకులు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి అడ్మిషన్లు కడుతుంటారు. స్టడీసెంటర్లు తప్పనిసరిగా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడా పూర్తి స్థాయిలో తరగతులు జరిగిన దాఖలాలు లేవు. పాస్ గ్యారెంటీ పేరుతో దందా.. ఇంటర్మీడియెట్ పాస్ గ్యారెంటీ పేరుతో ఆయా స్టడీ సెంటర్ల నిర్వాహకులు కొందరు.. అధికారులతో కుమ్మకై దందాలకు పాల్పడుతున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల్లో అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని సబ్జెక్ట్లు రాయకుండా పాస్ చేయిస్తామని, మీకు బదులు వేరే వ్యక్తులతో పరీక్ష రాయిస్తామంటూ డీల్ కుదుర్చుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. వీరు కొన్ని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొని అక్రమాలకు పాల్పడుతుంటారని ప్రచారం జరుగుతోంది. నగరానికి చెందిన ఒకరిద్దరు ప్రముఖ స్టడీ సెంటర్ల నిర్వాహకులు, చక్రం తిప్పుతుంటారని, లక్షలాది రూపాయాలు వసూళ్లకు పాల్పడటంతో పాటు అధికారులను సైతం ప్రభావితం చేస్తుంటారని వినవస్తోంది. ఇలాంటి దందాలకు కొన్ని ప్రత్యేక కేంద్రాలు ఈ పరీక్షల దందాకు ప్రత్యేకంగా కొన్ని కేంద్రాలను అక్రమార్కులు ఎంచుకుంటున్నారు. విజయవాడ నుంచి 50, 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆ కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయిస్తుంటారు. విజయవాడకు చెందిన పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నందిగామ, జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసే కేంద్రాలకు హాజరవుతుంటారు. వీటిలో అక్రమాలు జరుగుతాయనే ప్రచారం ఉంది. దీన్ని తొలి రోజు జరిగిన పరీక్ష నిజం చేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడాది ఓపెన్ స్కూల్ పరీక్షలను నాటి డీఈవో చాలా వరకూ నిలువరించారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో ఉన్న కేంద్రాల్లో ఏదో ఒక బృందం తనిఖీ చేసే విధంగా చూడటంతో పరీక్షలు సజావుగా జరిగాయి. దాదాపు పరీక్ష ఫలితాలు పది శాతం కన్నా తక్కువ వచ్చాయంటే ఎగ్జామ్స్ చక్కగా జరిగినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఈ ఏడాది అధికారులు మారడంతో అక్రమార్కులు తమ దందాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా తొలి రోజు ముగ్గురు బయట వ్యక్తులు లోపలకు వచ్చి పరీక్ష రాస్తున్నారంటే ఆ శాఖలోని అధికారుల హస్తాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తొలి రోజు నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు సంబంధించి అక్రమార్కులు చేపట్టిన దందా బట్టబయలైంది. పరీక్ష రాయాల్సిన ముగ్గురు అభ్యర్థుల కోసం వేరే వ్యక్తులు హాజరు కావడం జిల్లాలో సంచలనం సృష్టించింది. నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం రూమ్ నంబర్ నాలుగులో పరీక్ష రాస్తున్న విద్యార్థిని గమనించిన ఇన్విజిలేటర్ అనుమానంతో ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడే వెళ్లిన ఫ్లయింగ్ స్క్వాడ్ అతనిని పరిశీలిచి అసలైన అభ్యర్థి కాదని నిర్ధారించింది. అతనిపై నందిగామ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. అలాగే నందిగామలో శ్రీ విద్య ఉన్నత పాఠశాలలో ఇద్దరు అభ్యర్థుల బదులు వేరే వ్యక్తులు పరీక్ష రాయడానికి రావడంతో పరీక్ష గదిలో ముందుగానే పసిగట్టి వారిని నిలువరించారు. -
అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించండి
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): సమాజంలో పెరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కవి, రచయిత, సామాజిక విశ్లేషకులు జి. లక్ష్మీ నరసయ్య పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రథమ జాతీయ మహాసభలు మంగళవారం విజయవాడ సింగ్నగర్ గుజ్జల సరళ దేవి ఫంక్షన్ హాల్లో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పీడీఎస్యూ జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ రామకృష్ణ పీడీఎస్యూ బిగి పిడికిలి జెండాను ఆవిష్కరించారు. ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు పి.టాన్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ ఘాయల్, పరిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ కోశాధికారి ఎల్ .భాను సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ జాతి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఇ .విజయ్ కన్నా, యు. గనిరాజు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు కానుకగా బంగారు బిస్కెట్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయ వాడకు చెందిన భక్తుడు మంగళవారం సుమారు వంద గ్రాముల బంగారు బిస్కెట్ను కానుకగా సమర్పించారు. నగరంలోని చెరువు సెంటర్కు చెందిన దొడ్ల నారాయణరావు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్ర కీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు రూ.16.87 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు బిస్కెట్ను అమ్మ వారికి కానుకగా సమర్పించారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి దాతకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. పెనుగంచిప్రోలు: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 7.30 గంటలకు పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ ఆలయ తలుపులను కవాట బంధనం చేసి మూసి వేశారు. తిరిగి బుధవారం ఉదయం 5.30 గంటలకు గోపూజ, ఆలయ పరిసరాలు ఽశుద్ధి చేసి సంప్రోక్షణ అనంతర భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు గోపీబాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నందిగామ టౌన్: చాలీచాలని వేతనాలతో అవస్థ పడుతున్నామని కనీస వేతనాలు అందించాలని అడిగినందుకు అక్రమ అరెస్ట్లు చేయటమేంటని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కల్యాణ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కటారపు గోపాల్ పేర్కొన్నారు. విజయవాడలో శాంతియుత నిరసన చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కార్యకర్తలు మంగళవారం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన తెలిపారు. తొలుత గాంధీ సెంటర్ నుంచి రైతుపేట వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. సమస్యలు పరిష్కరించి ఆదుకోవడంతో పాటు కనీస వేతనాలు అందించాలని అడిగిన అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని.. మొండిగా వ్యవహరిస్తే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోపీనాయక్, సయ్యద్ ఖాసిం, అంగనవాడీ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు సరళ, వెంకట్రావమ్మ, సుజాత, వేణు, పుల్లమ్మ, మహాలక్ష్మీ, పిచ్చమ్మ, అపర్ణ, లక్ష్మీ, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
పట్టు కోల్పోయారు!
చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వెలివోలు గ్రామానికి చెందిన చీడేపూడి లంకలో సొసైటీ కింద దళితులు పొలాలు సాగుచేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం 80 మంది రైతులు 92 ఎకరాల్లో పట్టు పురుగుల పెంపకాన్ని చేసేవారు. రూ.15వేల నుంచి రూ.20వేల పెట్టుబడితో కేవలం రెండు నెలల వ్యవధిలో ఎకరాకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకూ లాభాలు పొందేవారు. రెండేళ్లుగా సంబంధిత శాఖ అధికారులు ప్రయివేటు వ్యక్తుల నుంచి పట్టు గుడ్లను కొని సరఫరా చేయడంతో నాణ్యత లోపించి పట్టు గూళ్లు తయారు కాకముందే పురుగులు చనిపోతున్నాయని ఈ ప్రాంత రైతులు వాపోతున్నారు. మార్కెట్లో వీటిని ఎవరూ కొనకపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు చెబుతున్నారు. తగ్గుతున్న సాగు ఈసారైనా లాభాలు రాకపోతాయా అని రైతులు ఆశపడటం, ఎన్నిసార్లు చెప్పినా అధికారులు అవే నకిలీ గుడ్లను పంపించడంతో రెండేళ్లలో ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయామని రైతులు వాపోతున్నారు. క్రమంగా పట్టుసాగుచేసేవారి సంఖ్య రెండేళ్లలో 80 నుంచి 12 మంది రైతులకు చేరింది. పట్టు సాగుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమ పూర్తిగా అంతరించిపోయినట్లేనని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ స్పందన లేక, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పట్టుపరిశ్రమ ఈ దుస్థితికి చేరిందని ఆరోపిస్తున్నారు. లాభాలతో కళకళలాడుతుండే పట్టు పరిశ్రమ రెండేళ్లుగా వెలవెలబోతోంది. అధికారులు నాణ్యతలేని పట్టు గుడ్లును సరఫరా చేయడం, గూళ్లు తయారయ్యే దశలో పురుగులు చనిపోవడంతో ‘చల్లపల్లి’ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు తరచూ.. అవే గుడ్లను సరఫరా చేయడంతో రైతులు క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చివరికి పట్టు పురుగుల పెంపకంపై రైతులకు ఆసక్తి తగ్గుతోంది. నాణ్యతలేని పట్టు గుడ్లు ఇస్తున్నామనేది రైతుల అపోహ మాత్రమే. ఆరోగ్యకరమైన ఆహారం అందించకపోవడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో పట్టు పురుగులు చనిపోతున్నాయి. –ఐ.శ్రీనివాసరావు, ఉమ్మడి కృష్ణాజిల్లా సెరికల్చర్ అధికారి -
అన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు మంగళవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. నగరంలో ఏలూరు రోడ్డులోని ఆదిత్య డెంటర్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ బి.రాజీవ్, ప్రశాంతి లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈవారంలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్ టికెట్లు కేవలం అధికారిక వెబ్సైట్ల్లోనే అందుబాటులో ఉంటాయని, ఇతర అనధికారిక వెబ్సైట్లను నమ్మవద్దని హెచ్చరించారు. హాల్ టికెట్లను www. bre.ap.gov.in వెబ్సైట్, వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర 95523 00009 లేదా లీప్ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేసి, హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
అద్భుతంగా నిర్వహిద్దాం
కుంభాభిషేకాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు జరగనున్న కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా, అద్భుతంగా నిర్వహిద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కుంభాభిషేకం మహోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఆలయ ఈవో వీకే శీనానాయక్ తదితరులు సమావేశంలో కుంభాభిషేక కార్యక్రమాలపై చర్చించారు. సామాన్యు భక్తులకు పెద్ద పీట కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కుంభాభిషేకానికి మొదటి రెండు రోజులు లక్ష మంది చొప్పున, మూడో రోజున 1.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్నారు. క్యూతో పాటు అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన పాయింట్లలో తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, శానిటేషన్ ఏర్పాట్లు ఉండాలన్నారు. క్యూలైన్లలో తాగునీరు, మజ్జిగతో పాటు పులిహోర వంటివి అందించాలని ఆదేశించారు. జల్లు స్నానాల ఏర్పాట్లతో పాటు సెక్టార్ల వారీగా అధికారులు, సిబ్బంది బృందాలను నియమించాలని సూచించారు. వైద్య సేవల శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సమన్వయ శాఖల అధికారులు, సిబ్బందితో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థను క్రియాశీలకం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ భక్తుల భద్రతకు భరోసా కల్పిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈవో వీకే శీనానాయక్.. కుంభాభిషేక విశిష్టత, మూడు రోజుల ప్రత్యేక కార్య క్రమాలు, భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. మార్చి 6న యాగశాలలో ఉదయం 8 గంటలకు జరిగే యాగశాల ప్రవేశం దగ్గర నుంచి 8వ తేదీన ఉదయం 9:34 గంటలకు ప్రధాన ఆలయ ప్రాంగణంలో జరిగే కుంభాభిషేకం క్రతువు వరకు కార్యక్రమాలను వివరించారు. పవిత్ర కార్యక్రమం కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి కరకమలములతో జరుగుతుందన్నారు. మూడు రోజులు ఉచిత దర్శనాలు ఉంటాయని, అంతరాలయం దర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేస్తామని ఈవో వీకే శీనానాయక్ వివరించారు. సమావేశంలో విజయవాడ ఆర్డీఓ టి.వి.సతీష్, ఆలయ ఈఈలు ఎల్.రమ, కోటేశ్వరరావు, అడిషనల్ డీసీపీ జి.రామకృష్ణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘గణన’ను సజావుగా చేయాలి
కోనేరుసెంటర్: జిల్లాలో మే 1వ తేదీ నుంచి ఇళ్ల జాబితా, గణన కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సెన్సస్ చార్జ్ అధికారులను ఆదేశించారు. కృష్ణా విశ్వ విద్యాలయంలో సోమవారం మొదటి దశ ఇళ్ల జాబితా, గణన కార్యక్రమానికి సంబంధించి జిల్లా చార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో గణన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాల్సి ఉందన్నారు. అందులో భాగంగా మొదటి దశలో మే 1 నుంచి ఇళ్ల జాబితాను సేకరించి బ్లాకులుగా విభజించాలన్నారు. రెండవ దశలో ఆ ఇంటిలో ఉన్న వారి వివరాలను సాధారణంగా కాకుండా జాగ్రత్తగా పూర్తి సమాచారంతో వాస్తవాలు ప్రతిబింబించే విధంగా తప్పులు దొర్లకుండా నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చే వివరాలతో ప్రజలకుగానీ ప్రభుత్వానికిగానీ ఎలాంటి నష్టం రాకూడదన్నారు. ఏ ఒక్క నిర్మాణం తప్పిపోకూడదన్నారు. సరిహద్దులు నిర్ణయించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గణన సులభం అవుతుందన్నారు. ఏ ఒక్క ఇంటిలోనూ రెండు పరిపాలన యూనిట్లు అంటే మునిసిపాలిటీగానీ, పంచాయతీగానీ కలిసి ఉండకూడదని చెప్పారు. బడ్జెట్ మేరకు ఎన్యూమరేటర్లను నియమించుకుని అందరికీ సమానంగా పని అప్పగించాలన్నారు. ఈ సందర్భంగా సెన్సెస్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ బృందం శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణలో విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ, డీఆర్వో చంద్రశేఖరరావు, రిజిస్ట్రార్ ఉష, కేఆర్ఆర్సీఎస్డీసీ శ్రీదేవి, మచిలీపట్నం, గుడివాడ ఆర్డీఓలు సాంబశివరావు, బాలసుబ్రహ్మణ్యం, జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడు, డీపీఓ అరుణ, సెన్సస్ చార్జ్ అధికారులు, తహసీల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ -
12 ఏళ్ల తర్వాత మళ్లీ..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేకానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 12 ఏళ్లకు ఒక సారి నిర్వహించే మహా కుంభాభిషేకం వీక్షించే భాగ్యం కోసం భక్తులు భారీగా తరలిరానున్నారు. 2014 ఫిబ్రవరిలో దుర్గగుడిపై మహా కుంభా భిషేకం జరిగింది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే కార్యక్రమానికి నాలుగు లక్షల మంది విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో అవసరమైన క్యూలైన్లు, చలువ పందిళ్లు, కూల్ పెయింట్లు వేస్తున్నారు. కుంభాభిషేకానికి జరుగుతున్న ఏర్పాట్లపై ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఉత్సవ ఏర్పాట్లపై ఇప్పటికే పరిశీలన చేసి ఆలయ అధి కారులకు పలు సూచనలను ఇచ్చారు. ఆలయ కలశం ముఖ భాగంలో విష్ణువు, కంఠ భాగంలో శివుడు, మూలభాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో మాతృదేవతలు కొలువై ఉంటారని ప్రసిద్ధి. కలశం లోపల సప్త సముద్రాలు, సప్తదీపాలతో కూడిన భూమండలం, నాలుగు వేదాలు వాటి అంగాలతో సహా పవిత్ర జలంలో నిక్షిప్తమై ఉన్నాయి. కుంభాభిషేకంలో ప్రధానంగా దేశ ఆధ్యాత్మిక శక్తికి చిహ్నాలుగా భావించే పవిత్ర నదులు, తీర్థాలు, సముద్ర జలాలను వినియోగిస్తారు. ఈ పవిత్ర జలాలను కలశాలలో ఉంచి, యాగశాలలో మంత్రయుక్తంగా పూజించిన తర్వాతే కుంభాభిషేకానికి వినియోగిస్తారు. ఆగమ శాస్త్రాలను అనుసరించి 12 ఏళ్లకు ఒక సారి ఆలయంలో దైవికశక్తిని మరింత ఇనుమడింపజేయడానికి ఈ క్రతువును నిర్వహిస్తారు. వేద మంత్రాల పఠనం, ప్రతిష్ఠించిన యంత్రాల శక్తిని పెంచడం(యంత్రం), ఆగమ విహిత క్రియలు(తంత్రం) అన్నీ కలిపి కుంభాభిషేకం ద్వారా ఆలయానికి విశేష శక్తిగా మారుస్తాయి. మూడు రోజులు.. 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షధారణ, పంచగవ్య ప్రాశనం, అఖండ దీపారాధన జరుగుతాయి. సాయంత్రం 4 నుంచి అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, మూలమంత్ర హవనం, హారతి, రాత్రి 7 గంటలకు మంత్ర పుష్పం జరుగుతుంది. 12 ఏళ్లకు ఒక సారి జరిగే మహా కుంభాభిషేక మహోత్సవానికి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ నుంచి ఆలయానికి 5 వరుసల ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ మూడు రోజులు అన్ని దర్శనాలకు ఉచితంగా అనుమతించనున్నారు. -
ఉత్తి పోతలు!
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎత్తిపోతల పథకాలు ‘ఉత్తి’పోతలుగా కనిపిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం మైలవరంలోని తారకరామ ఎత్తిపోతల పథకం. వీటికి నిధులు కేటాయించకుండా.. పంప్హౌస్ల నిర్వహణను గాలికొదిలేయడమే కాకుండా నిర్మాణ పొడిగింపును ప్రస్తుత రాష్ట్ర పాలకులు తాత్సారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హడావుడి చేసిన కూటమి నేతలు ప్రస్తుతం పట్టించుకోకపోవడంతో రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. నిర్లక్ష్యం నీడలో తారకరామ ఎత్తిపోతల పథకం జి.కొండూరు: మైలవరానికి జీవనాడిగా ఉండాల్సిన తారకరామ ఎత్తిపోతల పథకాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలో వినియోగించిన నీటిని తిరిగి కృష్ణా నదిలోకి వెళ్లకుండా బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా ఈలప్రోలు వద్ద కుడి, ఎడమ కాల్వలకు మళ్లించి ఎత్తి పోతల పద్ధతిలో మైలవరం నియోజకవర్గానికి సాగుకు నీరందించడమే తారకరామ లక్ష్యంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా కుడికాల్వ పొడవు 25.74 కి.మీ., ఎడమకాల్వ పొడవు 51.27 కి.మీ.గా అప్పట్లో నిర్ధారించారు. ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, విజయవాడ రూరల్ పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 12,556 ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా 1999–2004 మధ్య మొదటి దశ పనులను పూర్తి చేసి సాగునీరు సరఫరా చేశారు. ఇదే సమయంలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, ఆగిరిపల్లి, మండలాలకు నీరందించాల్సిన కుడి కాల్వను సైతం 6.6కిలోమీటర్లు వరకు తవ్వి ఈ కాల్వపై మూడు సబ్ లిఫ్ట్లను నిర్మించి వదిలేశారు. అడుగు ముందుకు పడలేదు రెండో దశలో జి.కొండూరులోని 8 గ్రామాలకు చెందిన 4,242 ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా 2006, మే 10న పనులు ప్రారంభించి 2009కి పూర్తి చేశారు. మూడో దశ పనులు జి.కొండూరు నుంచి మైలవరం నియోజకవర్గంలోని 8,132 ఎకరాలకు నీరందించడానికి నిర్ణయించారు. ఆ తర్వాత ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పోరాటానికి రైతులు సిద్ధం ఎత్తిపోతల నిర్వహణకు రూ.5కోట్లు నిధులు మంజూరుతో పాటు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి మైలవరానికి సాగునీరందించాలని కోరుతూ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఆయకట్టు రైతులు, రైతు సంఘాల నాయకులు 17మందితో జనవరి 27న కమిటీగా ఏర్పడ్డారు. దీని ఆవశ్యకతను తెలిపేలా బుక్లెట్ను ప్రచురించి రైతులకు పంపిణీ చేశారు. గత నెల 2వ తేదీన కలెక్టర్ లక్ష్మీశను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నాలుగు పంప్హౌస్ల కింద ఆయకట్టుగా ఉన్న 4,820 ఎకరాలు వ్యవసాయ భూమికి ఏటా సక్రమంగా నీరందక సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. నీటి వసతి ఉన్నా ఎత్తిపోసేందుకు మోటార్లు లేక కుడి కాల్వ కింద ఆయకట్టు రైతులు రబీసాగును పూర్తిగా మరిచిపోయారు. తారకరామపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి నిర్వహణకు నిధులను విడుదల చేయాలి. ఎమర్జెన్సీగా రూ.5కోట్లు కేటాయించి మరమ్మతులు చేపడితే రాబోయే ఖరీఫ్కు రైతులకు పుష్కలంగా నీరందుతుంది. బంగారంలాంటి ఎత్తిపోతల పథకాన్ని మరుగున పెట్టి చింతలపూడి, పోలవరం అంటూ ప్రగల్బాలు పలకడం రైతులను మోసం చేయడమే. నూతనంగా ఏర్పడిన కమిటీతో కలిసి తారకరామ ఎత్తిపోతల సాధనకు పోరాడతాం. –పి.జమలయ్య, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ పథకం కుడి కాల్వపై ఉన్న నాలుగు పంప్హౌస్లలో మోటార్లు సరిగా పనిచేయని పరిస్థితి నెలకొంది. 9.25 కి.మీ. మేర ఉన్న తారకరామ కుడి కాల్వలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, తుమ్మ, జమ్ము, తూటు వంటి వాటితో నిండి కాల్వలో నీరు ముందుకు కదలకు పంపు హౌస్లలో ఉన్న మోటార్లకు నీరందడంలేదు. ఈ నాలుగు పంపు హౌస్లలో 14మోటార్లు ఉండగా 8మోటార్లు అసలు పూర్తిగా పని చేయడంలేదు. మిగిలిన ఆరు మోటార్లు కూడా విద్యుత్ లోఓల్టేజ్ కారణంగా, మోటార్లకు నీరందక, మరమత్తులకు నోచుకోక అంతంతమాత్రంగానే పని చేస్తున్నాయి. -
దుర్గగుడి అభివృద్ధి పనుల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఏపీఐటీసీవో లిమిటెడ్ నిపుణుల బృందం సోమవారం పరిశీలించింది. ఏపీఐటీసీవో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మెహ్రా నేతృత్వంలో బృంద సభ్యులు ఆలయానికి చేరుకున్నారు. తొలుత ఈవో శీనానాయక్, కమిటీ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పనులపై సమీక్షించారు. అనంతరం నూతన క్యూ కాంప్లెక్స్, అడ్మి నిస్ట్రేషన్ ఆఫీసు భవనానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికపై చర్చించారు. మహా మండపం ఎదుట నిర్మిస్తున్న అన్నదానం, ప్రసాదాల పోటు భవనాలను పరిశీలించారు. అన్నదానం భవనం సెల్లార్ను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఈఈ ఎల్.రమ, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. -
రామలింగేశ్వరుడికి అష్టలక్ష్మి వెండి బిందె బహూకరణ
పెనమలూరు: యనమలకుదురు శ్రీపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామికి ఓ భక్తురాలు అష్టలక్ష్మి వెండి బిందెను బహూకరించారు. ఆలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో యనమలకుదురుకు చెందిన భక్తురాలు సింహాద్రి పద్మావతి.. 620 గ్రాముల అష్టలక్ష్మి వెండి బిందెను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.భవానికి అందజేశారు. తొలుత స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అర్చకుడు సాగర్, భక్తులు పాల్గొన్నారు. ఏడాదికి 125 రోజుల పనిదినాలు కల్పిస్తాం చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల కోసం సంవత్సరానికి 125 రోజుల పనిదినాలు కల్పించడానికి నూతనంగా వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ – వీబీజీ రాంజీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం హాలులో డ్వామా ఆధ్వర్యాన రూపొందించిన వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం గ్రామీణాభివృద్ధికి దోహదపడుతుందని ఉపాధికి కొత్త హామీగా దీన్ని ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, మెప్మా పీడీ పి.సాయిబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదినిసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ఓపెన్ పరీక్షలు ప్రారంభం వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 11 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఇంగ్లిష్ పరీక్షకు 1,288 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 1,135 మంది హాజరయ్యారు. 153 మంది గైర్హాజరయ్యారు. హాజరు 88.12 శాతంగా అధికారులు ప్రకటించారు. జిల్లా స్థాయి పరిశీలకులు కృష్ణమోహన్, విజయవాడలోని రెండు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మూడు ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు పర్యటించాయి. ముగ్గురు పట్టివేత ముగ్గురు అభ్యర్థుల కోసం వేరే వ్యక్తులు పరీక్ష రాయడానికి హాజరు కావడంతో వారిని ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ బృందం తనిఖీ చేసి పట్టుకున్నాయి. నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూమ్ నంబర్ నాలుగులో పరీక్ష రాస్తున్న విద్యార్థిని గమనించిన ఇన్విజిలేటర్ అనుమానంతో ప్రశ్నిస్తున్న సమయంలో అప్పుడే వెళ్లిన ఫ్లయింగ్ స్క్వాడ్ అతనిని పరిశీలిచి అసలైన అభ్యర్థి కాదని నిర్ధారించారు. అతనిపై నందిగామ పీఎస్లో కేసు నమోదు చేశారు. నందిగామలో శ్రీ విద్య ఉన్నత పాఠశాలలో ఇద్దరు అభ్యర్థుల బదులు వేరే వ్యక్తులు పరీక్ష రాయడానికి రావడంతో వారిని అధికారులు బయటకు పంపేశారు. నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం మక్కపేట(వత్సవాయి): ‘పది’ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సూచించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న గ్రాండ్ టెస్టును తొమ్మిదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న ఎస్ఏ–2 పరీక్షలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాలకు ఈ ఏడాది కొత్తగా పబ్లిక్ పరీక్షలు రాయడానికి సెంటర్ రావడంతో గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు పీడీవీ ప్రసాదరావు, అజ్మీరు శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం ఎ. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు దుర్గారావు, డి.శ్రీనివాసరావు, స్వాతి, నాగలక్ష్మి, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా సమస్యకు పరిష్కారం
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జి.జ్యోతి, ఏసీపీ వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోసిబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ఎస్లో 174 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. మిషన్ శక్తి స్కీంతో అవగాహన చిలకలపూడి(మచిలీపట్నం): సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి స్కీం–సంకల్ప హబ్ ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇతర శాఖల సమన్వయంతో ఈ నెల 2నుంచి 20 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా మహిళా దినోత్సవం ఈ నెలలోనే రావడంతో కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, మెప్మా పీడీ సాయిబాబు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అర్చిస్మ, డీసీపీవో కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి, డ్రగ్స్లో ఏపీ టాప్
● బెజవాడలో గంజాయి మొక్కలు పెంచుతుంటే ఏం చేస్తున్నారు? ● వైఎస్సార్ సీపీ నేత పోతిన మహేష్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోనుందని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకటమహేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. రెండేళ్ల కాలంలో రెండున్నర లక్షల గంజాయి కేసులు, 2,500కు పైగా డ్రగ్ కేసులు పెట్టినట్లుగా నివేదికలు చెబుతున్నాయని చెప్పారు. వీటిని బట్టి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఎంత విచ్చలవిడిగా లభిస్తున్నాయో అర్థమవుతోందన్నారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో గంజాయి సాగు చేయడాన్ని పోలీసులు గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం ఏజెన్సీలోనే కాకుండా రాజధాని ప్రాంతంలో గంజాయి సాగు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. బెజవాడలోనూ ఒక హాస్టల్ వెనుక గంజాయి మొక్కలు పెంచుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవాలన్నారు. గంజాయి సిగరెట్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారన్నారు. సైకిల్ ర్యాలీ చేసి దండయాత్ర అంటే బాధ్యత తీరిపోయిందా, డ్రగ్స్ను నియంత్రించకుండా ప్రచార ఆర్భాటమెందుకని పోతిన మహేష్ ప్రశ్నించారు. హోంమంత్రి అనిత రాష్ట్రంలో గంజాయి కేసులే లేవని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారన్నారు. ఆటలాడుకోవడానికి, వినోదాల కోసం సమయం వెచ్చిస్తున్నారని, ఏజెన్సీ నుంచి గంజాయి వస్తుంటే ఎవరి నియోజకవర్గం దాటి వస్తుందో హోంమంత్రి సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో యువత జీవితం నిర్వీర్యమైపోతుంటే పవన్కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. గంజాయి, మాదక ద్రవ్యాలను విక్రయిస్తే ఊరుకోనని చంద్రబాబు చెబుతున్నారని, అది చేతల్లో చూపాలని డిమాండ్ చేశారు. -
మహిళాభ్యుదయంతోనే దేశ ప్రగతి
విజయవాడ కల్చరల్: మహిళాభ్యుదయంతో దేశ ప్రగతి సాధ్యమని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశ్వసాహితీ కళా వేదిక ఆధ్యర్యంలో బందరు రోడ్డులోని బాలోత్సవ్ భవన్లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ మహిళల్లోని ప్రగతిని స్వాగతించాలని సూచించారు. తమ పార్టీ అధ్యక్షుడి ప్రోత్సాహం కారణంగా తాను ఐదేళ్లు విజయవాడకు మేయర్ పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాజకీయాలకు కొత్తగా వచ్చినా పట్టుదల, కృషి, చిత్తశుద్ధితో నగరానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేశామన్నారు. గజల్ మాస్ట్రో శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. విశ్వసాహితీ కళావేదిక వ్యవస్థాపకురాలు కొల్లి రమావతి, వివిధ రంగాలకు చెందిన డాక్టర్ జీవీ పూర్ణచందు, కలిమి శ్రీ, రచయిత్రి తేళ్ల, గోళ్ల నారాయణరావు, మంచాల సుధాకర్, అంజూ ప్రసంగించారు. 125 మందికి సీ్త్రశక్తి పురస్కారాలు.. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, కవిత్వం, న్యాయవాద వృత్తి, పోలీస్ విభాగం, సేవారంగం తదితరల రంగాలలోని ప్రతిభ కలిగిన వారిని గుర్తించి సీ్త్ర శక్తి పురస్కారాలను, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను మేయర్ భాగ్యలక్ష్మి చేతుల మీదుగా అందించారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి -
ఆంగ్లం... అనుసంధాన భాష
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఆంగ్లం అనుసంధాన భాష అని.. అందులో పట్టు సాధించటం ద్వారా మరింత మెరుగైన బోధన చేయటానికి అవకాశం ఉంటుందని విల్ టూ కెన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రామేశ్వర్గౌడ్ అన్నారు. జిల్లా ఎస్సీఈ ఆర్టీ సహకారంతో విల్ టూ కెన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్లంలో 40 రోజుల ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఒక రోజు ఒరియెంటేషన్ కార్యక్రమాన్ని స్థానిక బిషప్ అజరయ్య హైస్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 250 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు. తెలుగులా ఇంగ్లిష్ మాట్లాడాలి.. ఈ సందర్భంగా నిర్వాహకులు, ట్రైనర్ రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లిష్ మాట్లాడేలా చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 33 జిల్లాల్లో 53వేల మంది ఉపాధ్యాయులకు ఈ తరగతులు పూర్తి చేశామన్నారు. ఏపీలో ఇప్పటివరకు 16 జిల్లాలో 25 వేల మంది ఉపాధ్యాయులకు ఉచితంగా శిక్షణ ఇచ్చామన్నారు. ప్రభుత్వ సహకారంతో మిగతా జిల్లాల ప్రభుత్వ ఉపాధ్యాయులకు సైతం ఈ శిక్షణ అందిస్తామన్నారు. అవకాశమిచ్చిన డీఈవో చంద్రకళకు కృతజ్ఞతలు తెలిపారు. సమగ్ర శిక్షా అకడమిక్ మోనటిరింగ్ ఆఫీసర్ ఎస్. అశోక్బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏఏఎంఓ శిరీషరాణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణలో రామేశ్వర్ గౌడ్ -
సుబ్బారాయుడి ఆదాయం రూ. 8.88లక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్ల ద్వారా ఆదివారం రూ. 8,88,745 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీ రామ వరప్రసాదరావు తెలిపారు. స్వామివారి సేవా టికెట్ల ద్వారా రూ. 4,81,422, లడ్డూ ప్రసాదం నుంచి రూ. 1,52,050, నిత్యాన్నదాన కార్యక్రమం ద్వారా రూ. 1,37,651, శాశ్వత అన్నదానం ద్వారా రూ. 5,001, స్వామివారి కల్యాణ కట్ట టికెట్ల నుంచి రూ. 20,920 కలిపి మొత్తం రూ. 8,88,745 వచ్చాయన్నారు. రేపు ఆలయం మూసివేత.. ఈనెల 3వ తేదీన చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాతసేవ, నిత్యాభిషేకం అనంతరం ఉదయం 6 గంటలకు మహానివేదన సమర్పించి తదుపరి దేవాలయాల తలుపులు మూసి వేస్తామని డీసీ తెలిపారు. మరుసటి రోజు బుధవారం ఉదయం 6 గంటలకు స్వామివార్లకు సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తామన్నారు. -
తప్పుతోంది!
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026సచివాలయ పేరు మార్చి ఏమార్చుతున్న సర్కారు● డెప్యూటేషన్లపై సిబ్బంది.. వెలవెలబోతున్న కార్యాలయాలు ● సర్వేలతో నలిగిపోతున్న వైనం ● ప్రజలకు తప్పని నిరీక్షణ 7గాంధీనగర్: కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాలు నందు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించారు. పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. -
డిజిటల్ విధానంలో జనగణన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జనగణన ఈ దఫా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. జనగణన విధులను అత్యంత నిబద్ధతతో, జవాబుదారీతనంతో నిర్వహించాలని స్పష్టం చేశారు. కచ్చితమైన డేటా సేకరణ దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాదిగా నిలుస్తోందన్నారు. జనగణనలో పాల్గొనే ప్రతి అధికారి, సిబ్బంది తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు. ఆదివారం విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో సెన్సస్ –2027కు సంబంధించిన తొలి దశ (హౌస్ లిస్టింగ్ – హౌసింగ్ సెన్సస్)పై శిక్షణ కార్యక్రమం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ (హైదరాబాద్) కార్యాలయ జాయింట్ డైరెక్టర్ జి. ప్రసన్న కుమార్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమం ద్వారా జనగణనపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించామన్నారు. ఇందులో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే అసలు విజయమని చెప్పారు. రెండు దశల్లో.. జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరుగుతుందని కలెక్టర్ వివరించారు. తొలి దశగా హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్, రెండో దశ పాపులేషన్ ఎన్యూమరేషన్ (పీఈ)లో జనాభా గణాంకాలు నమోదు చేస్తారని చెప్పారు. జనగణన ద్వారా లభించే సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు, వనరుల సమర్థ వినియోగానికి కీలకమని పేర్కొన్నారు. డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, సీపీవో వై. శ్రీలత, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఎస్వోలు, డెప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సీజేఐకు ఎన్టీఆర్ జిల్లా అధికారుల స్వాగతం
కృష్ణలంక(విజయవాడతూర్పు): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ని ఎన్టీఆర్ జిల్లా అధికారులు మర్యాదపుర్వకంగా కలిశారు. ఆదివారం జస్టిస్ సూర్యకాంత్ విజయవాడ పర్యటనలో భాగంగా పటమటకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ కలెక్టర్ జి. లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, జేసీ ఎస్. ఇలక్కియ పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 10 గంటల వరకే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మంగళవారం తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ హోమం, గణపతి హోమాలు మాత్రమే జరుగుతాయి. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే చండీహోమం, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణాలను దేవస్థానం రద్దు చేసింది. అదే విధంగా ఉదయం 10గంటల తర్వాత అమ్మవారి లడ్డూ, పులిహోర, చక్కెర పొంగలి ప్రసాదాల విక్రయాలను నిలిపివేస్తుంది. అదే విధంగా అమ్మవారి అన్న ప్రసాద వితరణ సైతం నిలిపివేయనుంది. పది గంటల తర్వాత భక్తులెవరినీ కొండపైకి అనుమతించరు. 4న ఉదయం 8 గంటలకు దర్శనం.. 4వ తేదీ తెల్లవారుజామున అమ్మవారి ఆలయం తెరిచిన తర్వాత సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం ఉదయంం 8 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయి. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చి మ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుడివాడకు చెందిన పి.పిచ్చంశెట్టి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికా, ఇజ్రాయేల్ కలసి ఇరాన్పై దాడి చేయడాన్ని 10 వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు 10 వామపక్ష పార్టీలు ఆదివారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ ప్రజలతో పాటు ఆ దేశ సుప్రీం ఖమేనీ భవనంపై దాడిచేసి, హత్యచేయడం, పాఠశాలలపై బాంబులు వేసి పిల్లల్ని చంప డం సామ్రాజ్యవాద దురహంకారానికి పరాకాష్ట అని ఆయా పార్టీల నేతలు పేర్కొన్నారు. ఈ దాడులు ఇరాన్ దేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని, అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను దారుణంగా ఉల్లంఘించడమేనన్నారు. ఈ దాడులను ఖండించాలని ప్రజాతంత్రవాదులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ దాడిని ఖండిస్తూ భారత ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటన విడుదల చేసిన వారిలో సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సీపీఐ (ఎంఎల్) ఎన్డీ పి. ప్రసాద్, బి.బంగార్రావు (లిబరేషన్), కాటం నాగభూషణం(ఎంసీపీఐ(యూ), జాస్తి కిషోర్బాబు(సీపీఐ,ఎంఎల్) తదితరులు ఉన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లా లోని అన్ని కేడర్ల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన సాధారణ సీనియారిటీ జాబితాలను ప్రభుత్వ వెబ్సైట్లో ఒకసారి సరి చూసుకోవాలని కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు ఆదివారం తెలిపారు. సాధారణ సీనియారిటీ జాబితాల ప్రచురణకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జాబితాను జిల్లా వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉన్న వారు సంబంధిత ఆధారాలతో ఈ నెల రెండు నుంచి నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు సమర్పించాలని తెలిపారు. నిర్ణీత సమ యం తరువాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబడవని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం మండల, ఉప విద్యాశాఖాధికారులను సంప్రదించాలని సూచించారు. -
ముగిసిన ‘డ్రగ్స్పై దండయాత్ర’
లబ్బీపేట(విజయవాడతూర్పు): రడగ్స్పై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు డ్రగ్స్పై దండయాత్ర పేరుతో జిల్లాలో 35 రోజుల పాటు నిర్వహించిన సైకిల్ యాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చినట్లు పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ఒక ఉమెన్ ఎస్ఐ, ఐదుగురు మహిళా పోలీసులతో ఎన్టీఆర్ జిల్లాలో 35 రోజుల పాటు, 510 కి.మీలు సాగిన సైకిల్ యాత్ర ఆదివారం నగరంలో ముగిసింది. ఈ సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమంలో సీపీ రాజశేఖరబాబుతో పాటు, డీసీపీ కృష్ణకాంత్పటేల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇది ఆరంభం మాత్రమే.. ఈ సందర్భంగా ఏఆర్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో సైకిల్ యాత్రలో పాల్గొన్న ఐదుగురిని సీపీ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే, ఇది ప్రజల ఆకాంక్ష నుంచి పుట్టిన యాత్ర, ఒక తల్లి కడుపుకోత నుంచి వచ్చిన యాత్ర అన్నారు. యాత్రలో భాగంగా 2,513 మంది డ్రగ్స్కు బానిసైన వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలో కౌన్సెలింగ్ చేసిన అనంతరం అవసరమైన వారికి చికిత్స చేయించినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 149 హాట్ స్పాట్లను గుర్తించి అధికారులు నిరంతరం పర్యవేక్షించే విధంగా సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ, అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, ట్రాఫిక్ డీసీపీ షిరీన్బేగం తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా కరాటే పోటీలు
మచిలీపట్నంఅర్బన్: స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కరాటే క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర హాకీ అసోసియేషన్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, జిల్లా సీనియర్ హాకీ అసోసియేషన్ నాయకులు ఆర్. నాగభూషణం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు దేహ దారుఢ్యంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు. హాకీ కృష్ణా అసోసియేషన్ అధ్యక్షుడు నాగ సాయి శ్రీనివాస్, కార్యదర్శి హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యగాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో బ్రాహ్మణులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య నాయకులు ద్రోణంరాజు రవికుమార్, సత్యవాడ దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్లోని హోటల్ ఐలావురంలో వారు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల రాజకీయ పరిస్థితిపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 36 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య సున్నాకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నలుగురు ప్రాతినిధ్యం వహించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణులకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఒక స్థానాన్ని తమ సామాజిక వర్గానికి కేటాయించాలన్నారు. సముచిత పదవులు ఇచ్చి రాష్ట్రంలో ఒకరికి క్యాబినెట్ హోదా కల్పించాలన్నారు. ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ చట్టం తరహాలోనే బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ 2026–2029 కాలానికి దేశవ్యాప్తంగా నూతన కమిటీని ప్రకటించిందని ప్రతినిధులు తెలిపారు. ఈ కమిటీలో చీఫ్ అడ్వైజర్ (ప్రధాన సలహాదారు)గా పెద్దిబట్ల లక్ష్మీనారాయణ, సెక్రటరీ జనరల్ అడ్మిన్గా ద్రోణంరాజు రవికుమార్కు ప్రాతినిధ్యం దక్కిందన్నారు. తొలుత దేవదాయ శాఖలో అనేక సంస్కరణల కోసం కృషి చేసి, ఇటీవల మరణించిన సౌందరరాజన్కు సమాఖ్య నివాళులర్పించింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడులు చేతికి అందేనా..?
ఎకరాకు రూ.35 వేల వరకూ కౌలు ఒప్పందాలు చేసుకుని కౌలు రైతులు పసుపు సాగు చేశారు. విత్తనానికి, యాజమాన్య చర్యలకు రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడులు అయ్యాయి. రైతులకు మాత్రం కౌలు సొమ్ము మినహాయింపు అవుతుంది. పంట దున్ని, వంట పూర్తి చేసి ఎండబెట్టి మార్కెట్కు తరలించే నాటికి మరో రూ.30 వేల వరకూ పెట్టుబడులు అయ్యాయని రైతులు అంటున్నారు. గతేడాది అక్టోబర్లో సంభవించిన మోంథా తుపాను కారణంగా పంటకు దుంప కుళ్లు తెగులు సోకింది. తెగుళ్ల ప్రభా వంతో ఈ దఫా కొన్ని చోట్ల దిగుబడులు తగ్గుతా యని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో మార్కెట్లో ధర తగ్గుముఖం పట్టడం మరింత కలవరపెడుతోంది. కూలీల ఖర్చు, పెట్టుబడులు అన్నా చేతికి అందుతాయో? లేదో? అన్న ఆందోళన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. -
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
మహిళా ఉత్సవ్ ప్రారంభ సభలో అతిథులుమొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్వయం ఉపాధి కోర్సులు నేర్చుకున్న మహిళలు పరిశ్రమలు స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఎన్టీఆర్ డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.ఎన్.వి.నాంచారరావు సూచించారు. మధుచౌక్లోని మొగల్ ఎగ్జిబిషన్ హాలులో జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం మహిళా ఉత్సవ్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఈ ఉత్సవ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాంచారరావు మాట్లాడుతూ.. యువతకు స్వయం ఉపాధి కోర్సులు నేర్పించి వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి జనశిక్షణ సంస్థాన్ కృషి చేస్తోందన్నారు. జనశిక్షణ సంస్థాన్ అందిస్తున్న అవకాశాలను మహిళలు, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వృత్తి విద్యా కోర్సులు నేర్చుకున్న వారు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేయాలన్నారు. జనశిక్షణ సంస్థాన్ వైస్చైర్ పర్సన్ జి.వాణి మాట్లాడుతూ.. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్కు ఈ మహిళా ఉత్సవ్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఎ.పూర్ణిమ మాట్లాడుతూ.. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు రోజూ మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఉత్సవ్ జరుగుతుందన్నారు. మొత్తం 40 స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. జనశిక్షణ సంస్థాన్ సిబ్బందితో పాటుగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రదర్శనను తిలకించారు. -
యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుఆత్కూరు(గన్నవరం): యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాజీ ఉప రాష్ట్ర పతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో వివిధ నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం శనివారం ప్రత్యేక యువ చైతన్య వేదిక నిర్వహించారు. ముఖ్య అతి థిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. యువత ఇష్టమైన పనిని కష్టపడి చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులో శిక్షణ పొందడానికి వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకో వా లని సూచించారు. తద్వారా జీవి తంలో సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి జయ ప్రకాష్నారాయణ్ మాట్లాడుతూ.. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగమే అనే ఆలోచన నుంచి యువత బయటకు రావాలని సూచించారు. ప్రైవేట్ రంగంలో ఉన్న మెరుగైన ఉద్యోగ అవకాశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. ఏదైనా రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకో వడం ద్వారా ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో జీవించొచ్చని పేర్కొన్నారు. సమాజ హితం కోరి ఎంతో ఔన్నత్యంతో స్వర్ణభారత్ ట్రస్ట్లో యువతకు ఉపయోగపడే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. పలువురు ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘సైన్స్ సమగ్ర మహోత్సవ్’కు అరుదైన గుర్తింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2కే26 కార్యక్రమం ఇండియా, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. శుక్రవారం విజయవాడ గాంధీ నగర్లోని చిట్టూరి పబ్లిక్ స్కూల్ నందు ‘సైన్స్ సమగ్ర మహోత్సవ్ – 2కే26’ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 23న 2గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,118 పాఠశాలల నుంచి 30 వేల మంది విద్యార్థులు పాల్గొని ప్రాజెక్టులను రూపొందించారన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 4 దశల్లో నిపుణుల జ్యూరీ కమిటీ ఆధ్వర్యంలో స్క్రూట్నీ జరిగిందన్నారు. ప్రాజెక్టులు ఆవిష్కరణ, శాసీ్త్రయ స్పష్టత, ఆచరణ, సమష్టి కృషి – పర్యావరణహిత దృక్పథం వంటి ప్రమాణాల ఆధారంగా ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని చిట్టూరిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రవీణ్ ఆదిత్య, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
ఇబ్రహీంపట్నం: ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో తండ్రీ కొడుకులు రాక్షస పాలన సాగిస్తున్నారని, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే, తెలుగు అకాడమీ మాజీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. జోగి రమేష్ ఇంటిని చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్, సతీమణి జోగి శకుంతలమ్మ, కుటుంబ సభ్యులను శుక్రవారం లక్ష్మీపార్వతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంటిపై జరిగిన దాడిని జోగి రమేష్ ఆమెకు వివరించారు. ప్రజా స్వామ్యమా.. రాక్షస రాజ్యమా? అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమా, లేక రాక్షస రాజ్యమా అని ప్రశ్నించారు. నిరంకుశ పాలనకు కూటమి ప్రభుత్వం ఒక నిదర్శనం అన్నారు. మాస్ లీడర్లు అయిన జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. వీరిని భయపెట్టి బయటకు రాకుండా చేయాలన్నది చంద్రబాబు, లోకేష్ లక్ష్యం అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక ప్రత్యేక రాజ్యాంగం కొనసాగిస్తున్న మంత్రి నారా లోకేష్ భవిష్యత్ గురించి కూడా ఒకసారి ఆలోచన చేయాలని హితవు పలికారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నానని చెప్పుకుంటున్న లోకేష్కు ఏబీసీడీలు కూడా క్రమ పద్ధతిలో రాయడం రాదని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో రౌడీయిజం, గృహ దహనాలు వంటివి ముఖ్యమైన కార్యక్రమాలా అని ప్రశ్నించారు. కులం మతం రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అన్నీ అక్రమ కేసులే.. జోగి రమేష్పై పెట్టిన కేసులు ప్రతి ఒక్కటి అక్రమమే అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో అక్రమాలకు కొదవలేదన్నారు. నాయకుల ఇళ్లపై పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడి చేయడం వంటివి గతంలో ఎన్నడు చూడలేదని స్పష్టం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని మండి పడ్డారు. ప్రజాసొమ్ము దోపిడీ చేసి విదేశాల్లో దాచుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి, పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుగు అకాడమీ మాజీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి -
సీఎస్ఎస్ఆర్ పోటీలో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృంద ప్రతిభ
భవానీపురం(విజయవాడపశ్చిమ): దక్షిణ ప్రాంతంలోని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలకు టెన్త్ బెటాలియన్ నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి కృష్ణాజిల్లా కొండపావులూరులో నిర్వహించిన ప్రాంతీయ స్థాయి కొలాప్స్డ్ స్ట్రక్చర్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్ఎస్ఆర్) పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈ పోటీలో మొత్తం ఏడు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ) నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీ ఎస్డీఆర్ఎఫ్) బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీలలో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందం ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుని ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో ఎయిత్ బెటాలియన్ నిర్వహించనున్న జాతీయ స్థాయి సీఎస్ఎస్ఆర్ పోటీలకు ఎంపికయ్యింది. ముగింపు కార్యక్రమానికి ఏపీఎస్పీ బెటాలియన్స్ అండ్ ఏపీ ఎస్డీఆర్ఎఫ్ ఐజీపీ బి.రాజకుమారి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలను అభినందించారు. అలాగే డీఐజీ (ట్రైనింగ్ అండ్ ఎస్ అండ్ ఎస్సీజడ్) డాక్టర్ హరిఓం గాంఽధీ, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్డీఆర్ఎఫ్ బృందాల ప్రతిభను అభినందించి విజేత, రన్నరప్ బృందాలకు పతకాలు, ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ విజయం ఏపీ ఎస్డీఆర్ఎఫ్ నిబద్దత, కృషి, అత్యుత్తమ శిక్షణకు నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు. -
చలో విజయవాడకు సిద్ధం
మచిలీపట్నంఅర్బన్: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించని పక్షంలో మార్చి 2న చలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి రాజీ పడబోమని, ప్రభుత్వానికి సత్తా చూపిస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి హెచ్చరించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనే డిమాండ్తో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి. రైతు సంఘం నాయకులు శీలం నారాయణరావు, సీఐటీయూ నాయకులు చంద్రపాల్, బూర సుబ్రహ్మణ్యం, కరీముల్లా, గంగాధర్, జయరావు, సీహెచ్ శ్రీహరి తదితరులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీల సేవలు చేస్తూ కనీస వేతనం మాత్రమే కోరుతున్నామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ అనవసర ఖర్చులు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాల పెంపునకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వానికి సాష్టాంగ దండాలు పెట్టారు. దీక్షలో పార్వతి, గోపిలక్ష్మి, కృష్ణవేణి, రాణి, కస్తూరి, గీత, దేవకన్య తదితరులు పాల్గొన్నారు. -
సీజేఐ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
గన్నవరం: రాష్ట్ర పర్యటనలో భాగంగా మార్చి 1న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గన్నవరం విమానాశ్రయానికి విచ్చేస్తున్న సందర్భంగా అధికారులు శుక్రవారం ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి శ్యామలరావు విమానాశ్రయంలో విశ్రాంత భవనంలోని రిజర్వ్ లాంజ్, సెక్యూరిటీ చెక్, నిర్గమన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడుతో కలిసి శ్యామలరావు భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజేఐ తిరుపతి నుంచి విమానంలో ఆదివారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఇక్కడికి చేరుకుంటారని తెలిపారు. అమరావతి, విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీజేఐ తిరిగి ఎయిర్పోర్ట్కు చేరుకుని సాయంత్రం 6.30కు న్యూఢిల్లీ వెళ్తారని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి పర్యటనలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆయన ఆదేశించారు. వైద్య సహాయం కోసం అంబులెన్స్, సమీపంలోని ఆస్పత్రులను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎంఎల్కే రెడ్డి, టర్మినల్ ఇన్చార్జ్ అంకిత్ జైస్వాల్, ప్రొటోకాల్ డైరెక్టర్ మోహన్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రహ్మణ్యం పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సేవలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏసీ రంగారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని, సంక్షేమం, అభివృద్ధిలో ముందుండాలని కోరుకున్నానని పేర్కొన్నారు. డయాలసిస్ రోగులకు ఆరోగ్యశ్రీ సేవలను అందించండి పామర్రు: డయాలసిస్ రోగులకు ఎన్టీఆర్ వెద్య సేవ అందేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీని సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం సీఈవో డాక్టర్ కూచిభట్ల ఆనంద్ కోరారు. కలెక్టర్ కూచిపూడిలోని సంజీవని వైద్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యాలయంలోని అత్యవసర విభాగం, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే, ప్రసూతి విభాగం, క్యాంటీన్ తదితర విభాగాలను పరిశీలించి ప్రజాభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాలయం సీఈవో డాక్టర్ కూచిభట్ల ఆనంద్ మాట్లాడుతూ 2018లో దాతల సహకారంతో ఈ వైద్యాలయాన్ని నిర్మించామని రోజుకు 450 మంది వరకు వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. కలెక్టర్ స్పందిస్తూ డయాలసిస్ రోగులకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందేలా ప్రతిపాదనలు పంపించాలని సీఈవోకు సూచించారు. అనంతరం కలెక్టర్ బాలాజీని సత్కరించారు. కార్యక్రమంలో మొవ్వ తహసీల్దార్ మస్తాన్, ఎంపీడీవో సుహాసిని, సర్పంచ్ కొండవీటి వెంకట విజయలక్ష్మి వైద్యాలయం ఏవో హనుమకుమారు, మేనేజర్ సత్యప్రకాష్ పాల్గొన్నారు. శ్రీకొండలమ్మకు రూ.12.58 లక్షల ఆదాయం గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మ దేవస్థానంలోని హుండీల్లో భక్తులు వేసిన కానుకలను శుక్రవారం లెక్కించారు. 31రోజులకు నోట్ల ద్వారా రూ.11,20,055, చిల్లర ద్వారా రూ.1,38,754 మొత్తం రూ.12,58,809 లెక్కింపులో వచ్చింది. మచిలీపట్నం భోగిరెడ్డిపల్లి గ్రూప్ సూపర్వైజర్ అరుణ పర్యవేక్షణలో దేవస్థాన చైర్మన్ ఈడే మోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్లేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్ర బాబు, తూము రాజ్యలక్ష్మి, ముంగం ఆంజనేయులు, మన్నెం వీర నాగేంద్రరావు, ఈఓ ఆకుల కొండలరావు, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, గుడ్లవల్లేరు పోలీస్ సిబ్బంది హుండీలను తెరిచి కానుకలు లెక్కించారు. ముగిసిన ఖోఖో శిక్షణ గుడివాడటౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఆలిండియా పోలీస్ ఖోఖో టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారుల శిక్షణ శుక్రవారం ముగిసింది. స్టేడియం కమిటీ సభ్యులు క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్చి 7 నుంచి 12వ తేదీ వరకు జమ్మూ కశ్మీర్లో టోర్నమెంట్స్ జరుగుతాయన్నారు. ఏపీ తరఫున పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎన్టీఆర్ స్టేడియం గత నెల రోజులుగా అతిథ్యం ఇచ్చి శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. పూర్తి స్థాయిలో తర్ఫీదు పొందిన ఈ జట్టు జాతీయ స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ కె. రంగప్రసాద్, సైబర్ సీఐ గణేష్, ఏపీ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు మడకా ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
వేదాద్రి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్ర పటం అందజేశారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు, ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్, విశ్వభారతి కళాశాల చైర్మన్ కొమరగిరి పద్మావతి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షకు 252 మంది గైర్హాజరు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం జిల్లాలో 41 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. శుక్రవారం మొదటి ఏడాది రెగ్యులర్ విద్యార్థులకు హిస్టరీ పరీక్ష జరిగింది. బ్యాక్లాగ్ పరీక్షల్లో హిస్టరీ, బోటనీ పేపర్లకు సంబంధించి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 41 కేంద్రాల్లో 2,298 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 2,046 మంది హాజరయ్యారు. 252 మంది గైర్హాజరయ్యారు. -
అందెల రవళులతో పులకించిన ‘సిద్ధేంద్రయోగి’
పామర్రు: మొవ్వ మండలంలోని కూచిపూడి శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయ కల్యాణోత్సవాల సందర్భంగా రెండో రోజు శుక్రవారం ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలతో ‘సిద్ధేంద్ర యోగి’ పులకించారు. కళాకారులు దేవాలయం సమీపంలోని శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళావేదికపై ప్రదర్శించిన అంశాలు అలరించాయి. కళా నృత్యనికేతన్ (స్కూల్ ఆఫ్ కూచిపూడి) ప్రదర్శనలు, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం నృత్య దర్శకత్వంలో రూపొందించిన కృష్ణశబ్దం, ఆనంద తాండవం అంశాలను ప్రదర్శించారు. మధుసూదన్, శ్రీనిధి కదిరి నృసింహుడు, శివరంజని థిల్లానాలను ప్రదర్శించారు. శ్రీ సిద్ధ డ్యాన్స్ అకాడమీ ( వరంగల్) కళాకారులు పలు అంశాలను ప్రదర్శించారు. ఉమా నృత్యనికేతన్ నిర్వాహకురాలు రెడ్డి ఉమారాణి(రాజమండ్రి) బ్రహ్మాంజలి కామాక్షి అంశాలను ప్రదర్శించారు. కళాకారులను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పాలకమండలి సభ్యులు కళారత్న రాధేశ్యామ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. -
నకిలీ గుప్పు.. గుప్పు
పొగ తాగడమంటేనే ఆరోగ్యానికి హాని కరం. ఇక నకిలీ సిగరెట్లు తాగితే శరీరంలో అవయవాలకు దెబ్బే. ఉమ్మడి జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా జోరుగా సాగు తోంది. సిగరెట్ తాగేవాళ్లు బ్రాండా.. నకిలీదా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీన్ని అరికట్టాల్సిన ఫుడ్సేఫ్టీ కంట్రోల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వన్టౌన్(విజయవాడపశ్చిమ): మార్కెట్లో నకిలీ సిగరెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతోంది. ఒకవైపు ప్రజల ఆరోగ్యానికి మరింతగా తూట్లు పొడుస్తుంటే మరోవైపు విదేశీ సిగరెట్లతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సైతం భారీగా గండి పడుతోంది. ఈ వ్యాపార లావాదేవీలు కొంతమంది అధికారులకు మంచి ఆదాయ వనరులుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విచ్చలవిడిగా.. నకిలీ సిగరెట్ల వ్యాపారానికి బెజవాడ అడ్డాగా మారుతోంది. విజయవాడ కేంద్రంగా చుట్టుపక్కల జిల్లాలకు సైతం సరఫరా అవుతున్నట్లు ఒకరిద్దరు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది విజయవాడ వన్టౌన్, భవానీపురం పోలీస్స్టేషన్ల పరిధుల్లో ఉన్న గొల్లపూడి, భవానీపురం, పాతబస్తీలోని పలు ట్రాన్స్పోర్టు గోడౌన్లలో రూ.2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటనలు తెలిసిందే. విదేశీ సిగరెట్లకు సంబంధించి రాయనపాడులోని ఒక గోడౌన్లో భారీగా సరుకును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. వీటితో పాటుగా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ నకిలీ, విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అధికారికంగా దాడులు చేసి స్వాధీనం చేసుకున్న ఘటనలు మాత్రమే. వారం తర్వాత మళ్లీ మామూలే నగరంలో ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగినప్పుడు నకిలీ సిగరెట్ల వ్యాపారులు వారం పాటు లావాదేవీలను నిలిపివేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ మాములుగానే ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లుగా స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఈ దందా కొందరు అధికారులకు తెలిసే జరుగుతున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. భవానీపురం, పాతబస్తీలో ఈ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతున్నట్లు, పది మంది నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. బ్రాండ్ల కంటే తక్కువ ధర నకిలీ సిగరెట్లు, విదేశీ బ్రాండ్లు నగరంలో విచ్చలవిడిగా విక్రయాలు జరగడానికి కారణం అవి మాములు బ్రాండ్ల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండటమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఏమీ చెల్లించకపోవడం, అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా దందా చేస్తుండటంతో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. నకిలీ సిగరెట్ల దందాకు సంబంధించి అదుపు చేయాల్సిన బాధ్యత పుడ్ సేఫ్టీ కంట్రోల్ శాఖకు ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల న్యాయస్థానంలో ఓ కేసు విచారణలో ఇలాంటి ఆదేశాలు వచ్చాయని అధికారులు తెలుపుతున్నారు. నకిలీ సిగరెట్లను అదుపు చేయాల్సిన పుడ్ సేఫ్టీ అధికారులు సైతం ముడుపుల మత్తులో ఉన్నరానే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ దిశగా ఇప్పటి వరకూ దాడి చేసిన సంఘటన ఒకటి లేదు. దీంతో నకిలీ సిగరెట్ల వ్యాపారం జోరుగా జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో నకిలీ సిగరెట్ల వ్యాపారులపై కొంతమంది అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నా.. చట్టంలో లొసుగులతో తప్పించుకుంటున్నారని కొంతమంది అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా పోలీసు శాఖ ఆయా అక్రమార్కులపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు సరైన వాదన లేకపోవడం, సెక్షన్లలో లొసుగులతో వారు తప్పించుకుంటున్నారు. దీనికి తోడు సరుకును సైతం యథావిధిగా బయటకు తెచ్చుకుంటున్నారని తెలుస్తోంది. నకిలీ సిగరెట్లతో పాటుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సిగరెట్ల దందాతో ప్రభుత్వ శాఖలకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. సరైన నిఘా లేక అక్రమార్కులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా సిగరెట్ల దందాపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు స్పష్టమైన సమాచారం ఉన్నా ఆ దిశగా కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. ముఖ్యంగా అధికారులకు వివిధ స్థాయిల్లో ముడుపులు వెళ్లడంతో ఈ దందా విచ్చలవిడిగా జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
కళాకారులను ప్రోత్సహించాలి
విజయవాడ కల్చరల్: కళాకారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి అన్నారు. సమతా సేవా సమితి, ఏపీ సృజనాత్మక సమితి ఆధ్వర్యాన జీవీఆర్ సంగీత కళాశాలలో చింతా కృష్ణమూర్తి 42వ వర్ధంతి, సమతాసేవా సమితి 15వ వార్షిక వేడుకలు, వివిధ రంగాలకు చెందిన వారికి పురస్కారాల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ సాంస్కృతిక కళాసంస్థలు, కళాకారుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా సమతా సేవా సమితి సేవలను వివరించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి మహ్మద్ ఇంతియాజ్, జీఆర్కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు, కోగంటి సత్యం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నా వల్లభరావు పాల్గొన్నారు. సమతాసేవా సమితి నిర్వాహకుడు చింతా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రంగస్థల కళాకారుడు దంగేటి సూర్యప్రకాశరావుకు రంగస్థల యశస్వి, గొలిమి రామకృష్ణకు ఉద్యోగ రత్న, పురస్కాలను అందజేశారు. చింతా కృష్ణమూర్తి స్మారక పురస్కారాన్ని మాదాల గోపాల కృష్ణకు ప్రదానం చేశారు. -
సమన్వయంతో ‘పది’ పరీక్షలు నిర్వహిద్దాం
డీఈఓ చంద్రకళ వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షలను సమన్వయంతో నిర్వహిద్దామని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ అన్నారు. ఈ సందర్భంగా మార్చి 2026లో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల ముందస్తు ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు ఓరియెంటేషన్ కార్యక్రమం నగరంలోని కేబీఎన్ కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకత, క్రమశిక్షణ, సమన్వయం పాటించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం, లోపాలు చోటుచేసుకోకుండా ప్రతి అంశాన్ని సక్రమంగా పర్యవేక్షించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్, సీటింగ్ ఏర్పాట్లు, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రాల స్వీకరణ, భద్రపరిచడం, పంపిణీ ప్రక్రియలో గోప్యత, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో 144 సెక్షన్ అమలు, పోలీసు శాఖతో సమన్వయం, పరీక్ష కేంద్రాల వద్ద అనవసర గుంపులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి చీఫ్ సూపరింటెండెంట్ తమ పరిధిలోని సిబ్బందితో ముందస్తు సమావేశాలు నిర్వహించి బాధ్యతలను స్పష్టంగా వివరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో విజయవాడ డీవైఈవోలు డి.సాంబశివరావు (విజయవాడ), ఎ.శ్యామ్సుందర్ (తిరువూరు), యు.గురునాథం (నందిగామ) డీసీఈబీ కార్యదర్శి షేక్ ఉమర్అలీ, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎస్ రాంబాబు, ఏపీవోఎస్ఎస్ కోఆర్డినేటర్ పి.మురళి తదితరులు పాల్గొన్నారు. -
పటిష్ట భద్రతలో ఈవీఎం గోడౌన్
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదాంకు పకడ్బందీ భద్రత ఏర్పాట్లు కల్పించినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గురువారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోగల ఈవీఎం, వీవీప్యాట్ల గోదాంను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. డెప్యూటీ సీఈఓ, ఈవీఎంల నోడల్ ఆఫీసర్ ఆంజనేయులు, డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు. -
5న చలో విజయవాడ
మచిలీపట్నంఅర్బన్: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే మార్చి ఐదో తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రమాదేవి హెచ్చరించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరాయి. ఐసీఈయూ ఎల్ఐసీ డివిజన్ ప్రధాన కార్యదర్శి జి. కిశోర్ కుమార్ దీక్షలకు సంఘీభావం తెలిపారు. రమాదేవి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాల పెంపునకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, లేకుంటే నిరవధిక సమ్మెకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ నెల 23, 24 తేదీలలో ప్రాజెక్టు స్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని, 25 నుంచి 27 వరకు జిల్లా కేంద్రంలో దీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్ట్ లీడర్లు నాంచారమ్మ, లక్ష్మి, శివకుమారి, నాగమణి, గంగాభవానీ, రాజారత్నం, సత్యవతి, విజయలక్ష్మి, దుర్గ, రాజకుమారి దీక్షలో కూర్చున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను జయప్రదం చేయాలి
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసిన శ్రీతిరుపతమ్మ వారి చిన్న తిరునాళ్ల ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ సూచించారు. మార్చి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు జరిగే తిరునాళ్లకు సంబంధించి గురువారం ఆలయ సత్రాల్లో అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ.. తిరునాళ్లు జరిగే ఐదు రోజులు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫ రాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మార్చి ఏడో తేదీన పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లకు విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేసే సందర్భంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయం వద్ద పలు శాఖల సమాచార కేంద్రాలతో పాటు, తాగునీటి సౌకర్యం, తాత్కాలి కంగా బస్టాండ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటుతో పాటు అందులో అన్నిశాఖల అధికారులు ఉండాలన్నారు. తిరునాళ్లకు ముందు రోజు కల్లా అన్ని శాఖల అధికారులు తమ యాక్షన్ ప్లాన్తో పాటు, ఫోన్ నంబర్లను ఆలయ అధికారులకు, రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలన్నారు. బెల్ట్ షాపులు లేకుండా చేయాలని ఎకై ్సజ్ సీఐ రమా దేవికి సూచించారు. ఆలయం వద్ద దుకాణాలను నిర్ణయించిన చోట మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. పసుపు–కుంకుమల బండ్లు ఎన్ని వచ్చేది ముందుగా రెవెన్యూ కార్యాలయంలో తెలపాలని కోరారు. ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామ న్నారు. మునేటిలో భక్తులకు జల్లు స్నానాలతో పాటు మునేరులో తాత్కాలిక కేశఖండనశాల ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులను ఈఓ కోరారు. డీసీపీ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ఎటువంటి అవరోధం లేకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి.శ్రీను, ఆలయ ఈఈ రమాదేవి, నందిగామ ఏసీపీ తిలక్, జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు, వైద్యాధికారి నాగరాణి, విద్యుత్ ఏఈ వెంకటకృష్ణ, పీఆర్ ఏఈ సుందరరామయ్య, ఆర్అండ్బీ ఏఈ సురేష్, గ్రామ కార్యదర్శి శ్యామ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. – నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ -
పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్ రద్దు చేయాల్సిందే
ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వారడిసన్ క్లాస్ పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజును వెంటనే రద్దు చేయాలని ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రామమోహన గ్రంథాలయంలో సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతేడాది మార్చిలో పార్లమెంటులో ఆర్థికబిల్లులో భాగంగా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ వ్యాలిడిషన్ క్లాజ్ చేర్చి ఆమోదించిందన్నారు. ఈ క్లాజ్ పెన్షనర్లను పాత, కొత్త పెన్షనర్లుగా విడగొట్టిందన్నారు. భవిష్యత్తులో వేతన సవరణ జరిగితే పాత పెన్షనర్స్కు పెన్షన్ సవరణ లేకుండా.. కొత్త పెన్షనర్స్కు మాత్రమే సవరణ పొందే హక్కులు కల్పిస్తూ రాష్ట్రపతి ఆమోదం పొందించిందన్నారు. ఇది పెన్షనర్లకు హక్కులను కాలరాసే చర్య అని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎరియర్స్ సహా అమలు చేయండి.. ఫోరం అధ్యక్షుడు వి.వరప్రసాద్ మాట్లాడుతూ 8వ సెంట్రల్ పే కమిషన్ టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ప్రస్తుతం సివిల్ పెన్షనర్లు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్తో సహా అందరికీ పెన్షన్ సరవణ ఉండే విధంగా చూడాలన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి వేతన సవరణ, ఎరియర్స్ సహా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫోరం కన్వీనర్ ఎన్. రామారావు, ఏఐబీడీపీఏ వైస్ ప్రెసిడెంట్ పి. అశోక్ బాబు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కేఎస్సీ బోస్, ఏఐబీఎస్ఎన్ఎల్ పీడబ్ల్యూఏ నాయకులు పాల్గొన్నారు. -
ముగిసిన లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తున్న లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ గురువారం సాయంత్రం ముగిసింది. శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీల్లో పాల్గొన్నారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడతూ.. వచ్చే ఏడాది సౌత్ ఇండియా ప్రీమియర్ లీగ్ పేరుతో ఆరు రాష్ట్రాల శాసన సభ్యులకు విశాఖపట్నంలో క్రీడాపోటీలు నిర్వహిస్తామన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. సౌత్ ఇండియా ప్రీమియర్ లీగ్కు తమ పూర్తి సహాయ సహాకారాలను అందిస్తామన్నారు. శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి పాల్గొన్నారు. స్పోర్ట్స్ మీట్ చివరి రోజు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, టెన్నిస్, క్యారమ్స్ పోటీలు జరిగాయి. -
సుబ్బారాయుడి సన్నిధిలో చీఫ్ పోస్ట్మాస్టర్
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హెడ్ బీపీ శ్రీదేవి గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆమె నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు సీహెచ్ వెంకటేశ్వరావు, విరూప్ శర్మ, మణిదీప్శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. మచిలీపట్నంఅర్బన్: ‘నీట్’ను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం మధ్యాహ్నం న్యూఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాజేష్ లఖన్, రాష్ట్ర ప్రభుత్వ కళాశాల విద్యా కమిషనర్ భరత్ గుప్తాతో కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. క్యాంపు కార్యాలయం నుంచి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాలైన కేంద్రీయ విద్యాలయం, కృష్ణ విశ్వవిద్యాలయలలో నీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్, నీట్ పరీక్షల సమన్వయకర్త మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్, పరీక్షా కేంద్ర పర్యవేక్షకులు సత్యనారాయణ పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: గర్భిణులు, బాలింతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిల్కారి కాల్ సేవలు ఎంతో ప్రయోజనకరమని కృష్ణా జిల్లా కిల్కారి ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు తెలిపారు. గురువారం బందరుకోట, శారదానగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కిల్కారి సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి, బిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ కాల్స్ ద్వారా అందజేస్తారని వివరించారు. గర్భధారణ నాల్గో నెల నుంచి శిశువు ఒక సంవత్సరం పూర్తయ్యే వరకు నెలకు ఒకసారి గర్భిణులు, బాలింతల మొబైల్ ఫోన్లకు ఈ కాల్స్ వస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ నంబర్ (911600403660)ను గర్భిణులు, బాలింతలు తమ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకుంటే కాల్ వచ్చినప్పుడు పూర్తి సమాచారాన్ని వినగలరన్నారు. అవసరమైతే 14423 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి తిరిగి సమాచారాన్ని వినవచ్చని సూచించారు. డాక్టర్ పరమేశ్వరి, డాక్టర్ తాజుద్దీన్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. అవనిగడ్డ: ఘంటసాల పరిశోధన కేంద్రం రూపొందించిన జీబీజీ 164 మినుము పంట అవనిగడ్డలో సాగు చేయగా.. దానిని శాస్త్రవేత్తల బృందం గురువారం పరిశీలించింది. సమన్వయకర్త డాక్టర్ డి. సుధారాణి మాట్లాడుతూ జీబీజీ 164 రకం కాలపరిమితి 80 నుంచి 85 రోజుల పంటని, ఎల్బీజీ 752 రకంతో పోలిస్తే గింజ మెరుగ్గా ఉంటుందని చెప్పారు. కృష్ణాజిల్లా ప్రాంతానికి ఈ రకం అనుకూలంగా ఉంటుందన్నారు. రైతులు జీబీజీ 164 రకాన్ని సాగుచేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. వెంకట లక్ష్మి, డాక్టర్ కె. రేవతి ఏడీఏ జయప్రద, ఏవో శుభ హారిక, వీఏ వి. తేజశ్రీ పాల్గొన్నారు. -
కదులుతున్న రైలు నుంచి పడిపోయిన బాలిక
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రాత్రి సమయంలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ ఓ బాలిక పడిపోయింది. సకాలంలో స్పందించిన ఆర్పీఎఫ్, జీఆర్పీ, స్టేషన్ సిబ్బంది ఆ బాలికను రక్షించిన ఘటన బుధవారం రాత్రి ఒంగోలు రైల్వేస్టేషన్ పరిసరాల్లో జరిగింది. బుధవారం రాత్రి 11.53 గంటల సమయంలో ధర్మవరం – నర్సాపూర్ (17248) ఎక్స్ప్రెస్ రైలు ఒంగోలు స్టేషన్కు రెండు మీలోమీటర్ల దూరంలో సూరారెడ్డిపాలెం – ఒంగోలు సెక్షన్ మధ్య ప్రయాణిస్తుండగా తొమ్మిదేళ్ల బాలిక ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిపోయింది. రైలు రాత్రి 12.03 గంటలకు రైలు ఒంగోలు స్టేషన్కు చేరుకోగా ఆమె కుటుంబ సభ్యులు స్టేషన్ మాస్టర్, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ మార్గంలో వస్తున్న తిరుపతి – కరీంనగర్ ఎక్స్ప్రెస్ (12761) రైలులోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. లోకో పైలెట్ ట్రాక్ పక్కన బాలికను గుర్తించి రైలును నిలిపడంతో జనరల్ కోచ్లోని సిబ్బంది ఆమెను రక్షించారు. అప్పటికే ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది కూడా బాలిక కోసం గాలిస్తూ అక్కడకు చేరుకున్నారు. గాయాలతో ఉన్న బాలికను ఒంగోలు స్టేషన్కు తరలించిచారు. ఆమె ఎడమ చేతికి, కాళ్లకు స్పల్పగాయాలవటంతో ప్రథమ చికిత్స చేసి, అనంతరం దగ్గరలోని ఆస్ప త్రిలో చికిత్స చేయించి కుటుంబ సభ్యు లకు అప్పగించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాలికను రక్షించిన రైల్వే సిబ్బంది, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
హాస్టల్ .. హడల్!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. సమాజంలో వెనుకబాటును ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లటానికి హాస్టళ్లు బాసటగా ఉండాల్సి ఉంది. కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు జిల్లాలోని హాస్టళ్లలో దర్శనమిస్తున్నాయి. అన్ని వసతులు కల్పించి విద్యార్థులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తుండటంతో వాటి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో హాస్టళ్లు ఎలుకలకు ఆవాసాలుగా మారాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ప్రతి హాస్టల్లోనూ ఏదో ఒక సమస్య వెంటాడుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారుజిల్లాలో పరిస్థితి..జిల్లా వ్యాప్తంగా 65 హాస్టళ్లు వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతుండగా అందులో సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 34 హాస్టళ్లు, వెనుకబడిన తరగుతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 36, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు చొప్పున హాస్టళ్లు పని చేస్తున్నాయి. అయితే వీటిల్లో సగానికి పైగా హాస్టళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఆయా హాస్టల్స్లో వసతి పొందుతున్న వేలాది మంది విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కేజీబీవీల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి.80 శాతానికి పైగా అసంతృప్తి..జిల్లాలోని పలు హాస్టళ్లపై భారీగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల పలు దఫాలుగా ఐవీఆర్ఎస్ సర్వేలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 శాతానికి పైగా విద్యార్థులు తమ హాస్టల్స్లో వసతులు దారుణంగా ఉన్నాయని విమర్శలు చేశారు. అలాగే హాస్టల్ వార్డెన్లు సైతం నియమనిబంధనల ప్రకారం ఉండాల్సిన సమయాల్లో ఉండటం లేదనే విషయాన్ని సైతం వివరించారు. వీటిపై మంత్రి ఆదేశాలతో నియమించిన అధికారులు వెళ్లి చూడగా ఆ సమయంలోనూ వార్డెన్లు లేక పోవటం, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవటం అంశాలపై వాటి తీరుతెన్నులను స్పష్టం చేస్తున్నాయి.భోజన మెనూ మరీ దారుణం..జిల్లాలోని ఆయా సంక్షేమ హాస్టళ్లలో మెనూ అమలు పరిస్థితి మరింత దారుణంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఫుడ్ కమిషన్ చైర్మన్ సైతం పలు హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించినప్పుడు వాటి పరిస్థితి బయటపడింది. చాలా హాస్టళ్లలో ఒక కూరతోనే సరిపెడుతున్న పరిస్థితి ఉంది. చాలా హాస్టళ్లలో పాలు, పెరుగు వారంలో ఒకటి రెండు రోజులకు పరిమితమవుతున్నాయి. కూరల పంపిణీలోనూ దోపిడీ జరుగుతోంది. ఫిర్యాదు చేస్తే ఎవరు తమను ఏమి అంటారో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు కాలం గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి.హాస్టళ్లపై పర్యవేక్షణ శూన్యం..జిల్లాలో ఉన్న హాస్టళ్లకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ అవసరం. కానీ ఉన్నతాధికారులెవరూ వాటిపై దృష్టి సారించకపోవటంతో వేలాది మంది విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హాస్టళ్లపై అసలు నిఘా కరువైందనే విమర్శలు ఉన్నాయి. అందువల్లే విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఆయా వస్తువులను పంపిణీ చేసే కాంట్రాక్టర్ల నుంచి మామూళ్లను తీసుకోవటంలో ఉన్న శ్రద్ధ హాస్టల్స్లో ఏమి జరుగుతుందనే విషయాలను తెలుసుకోవటంలో చూపటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులెవరూ హాస్టల్స్పై నిఘా పెట్టకపోవటంతో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.ఎలుకలు దాడి చేస్తున్నా పట్టని పాలకులు.. ఏకొండూరులోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఈ నెల ద్వితీయార్థంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో నిద్రిస్తున్న బాలికలను ఎలుకలు దాడి చేసి గాయపరిచిన సంఘటన సంచలనం సృష్టించింది. సుమారు పదకొండు మంది బాలికలు ఎలుకల దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రభుత్వం హాస్టల్స్ నిర్వహణలో చూపుతున్న నిర్లక్ష్యానికి ఇదొక మచ్చుతునక. ఈ సంఘటనతో సాక్షాత్ జిల్లా కలెక్టర్ ఆ ప్రాంగణాన్ని సందర్శించి పరిశీలించారు. ఒకటిరెండు చర్యలు చేపట్టినా సమూల మార్పు తీసుకురావటానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవే పరిస్థితులు చాలా హాస్టళ్లలో కనిపిస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..హాస్టల్స్ నిర్వహణలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వార్డెన్లు అందుబాటులో ఉండటం లేదు. అలాగే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన ఆహారంలోనూ కోతలు విధిస్తూ వారి పొట్టలు కొడుతున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్ప మిగిలిన సమయంలో ఆయా హాస్టళ్లను సందర్శించేవారు గానీ, పట్టించుకునే వారు కానీ ఉండటం లేదు. హాస్టళ్లలో అరకొర వసతులతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికై నా వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి.– సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
ఎండీఎంఏ డ్రగ్స్ కేసు నిందితుడి అరెస్టు
లబ్బీపేట(విజయవాడతూర్పు): బెంగళూరు నుంచి విశాఖపట్నానికి ఎండీఎంఏ డ్రగ్స్ తరలిస్తున్న కేసులో పరారీలో ఉన్న నిందితుడు రాజేష్ను మాచవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గత ఏడాది నమోదైన ఈ కేసులో రాజేష్ నిందితుడు. రెండు నెలల కిందట విజయవాడ మాచవరం పోలీస్స్టేషన్ నుంచి అతను పోలీసుల కళ్లుకప్పి పరారయ్యాడు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్, సెంట్రల్ ఏసీపీ దామోదర్ నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. మాచవరం పోలీసులు, క్రైం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ తరుణంలో నిందితుడికి సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు చిక్కింది. క్రైమ్ కానిస్టేబుల్ తరుణ్ సహకారంతో నిందితుడు రాజేష్ను మాచవరం ఇన్స్పెక్టర్ రమణ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా నగరంలో డ్రగ్స్ విక్రయ కార్యకలాపాల్లో పాల్గొనట్లు అంగీకరించాడు. అతడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారు. హనుమాన్జంక్షన్ రూరల్: గన్నవరం డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, కేసుల విచారణలో పురోగతిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గురువారం సమీక్ష నిర్వహించారు. స్థానిక విజయవాడ రోడ్డు స్వరాజ్య నగర్లోని హనుమాన్జంక్షన్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆయన క్రైమ్ రివ్యూ నిర్వహించారు. డీఎస్పీ చలసాని శ్రీనివాస్తో పాటుగా హనుమాన్జంక్షన్, గన్నవరం, పెనమలూరు సర్కిల్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న కేసులు, డివిజన్లో క్రైమ్ రేట్, రికవరీలపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆరా తీశారు. -
ప్రత్యేక కార్పొరేషన్ కోరుతూ అర్ధ నగ్న ప్రదర్శన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎస్టీ వర్గీకరణ చేయాలని కోరుతూ ధర్నా చౌక్లో గురువారం అర్ధనగ్న ప్రదర్శన జరిగింది. యానాద రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాల్గో రోజుకు చేరాయి. కార్యక్రమానికి కేవీపీఎస్, గిరిజన సంఘాలు, మద్దతు తెలిపాయి. మద్దతు తెలిపిన వారిలో ఆండ్ర మాల్యాద్రి, లోకనాథం, ఈగ శ్రీనివాసరావు, పి. లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి యానాదుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఈ ప్రదర్శనలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపట్ల బ్రహ్మయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుత్తూరు శ్రీనివాసరావు, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
భవిష్యత్ అవసరాల మేరకు హైవే అభివృద్ధి
ఎంపీ కేశినేని శివనాథ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారుల నెట్వర్క్ను అభివృద్ధి చేయడం ముఖ్యమని.. ఈ నేపథ్యంలో ఎన్హెచ్–65 విస్తరణ ఉండాలని కోరుకుంటున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ రహదారి ప్రాజెక్టులపై భాగస్వాముల (స్టేక్హోల్డర్స్) సమావేశం జరిగింది. జాతీయ రహదారులు, రెవెన్యూ, ఆర్అండ్బీ, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులతో పాటు ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, వసంత వెంకట కృష్ణప్రసాద్, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), గద్దె రామ్మోహన్రావు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి–65 ఆరు వరుసల విస్తరణకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం ఎన్హెచ్ 65 విస్తరణకు సంబంధించి కొంతవరకు డీపీఆర్ తయారైందన్నారు. ఈ డీపీఆర్ను పరిశీలించిన మీదట ఎక్కువమంది రైతులు ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. విస్తరణలో ప్రతిపాదించిన రెండు బైపాస్లు (అంబారిపేట–ఐత వరం; కాచవరం–మూలపాడు–ఇబ్రహీంపట్నం వెస్ట్) బదులు పాత రహదారినే పటిష్ట ప్రణాళికతో విస్తరణ, అభివృద్ధి చేయాలని తీర్మానం చేశామన్నారు. సమావేశంలో ఎన్హెచ్ పీడీ (విజయవాడ) ఎం.విద్యాసాగర్, ఎన్హెచ్ పీడీ (హైదరాబాద్) సీహెచ్ శ్రీనివాసరావు, పీడీ (అమరావతి) టి.పార్వతీశం, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్–2 పరీక్షకు 36,579 మంది హాజరు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్షలు ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరిగింది. జిల్లాలోని 98 కేంద్రాల్లో ఇంగ్లిష్–2 పరీక్ష జరిగింది. ఆయా కేంద్రాల్లో 37,083 మంది విద్యార్థులకు 36,579 మంది హాజరై పరీక్ష రాశారు. 504 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆఐఓ ప్రభాకరరావు పరీక్షలను పర్యవేక్షించారు. కలెక్టర్కు ఆహ్వానం గంపలగూడెం: మండలంలోని నెమలి గ్రామంలో వేంచేసిన శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ ఏసీ ఎన్. సంధ్య గురువారం కలెక్టర్ లక్ష్మీశను కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు. బ్రహ్మోత్సవాలు సమర్థంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఏసీ వివరించారు. -
డాక్టర్ దీపిక మృతిపై వీడని మిస్టరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో అనుమనాస్పద స్థితిలో మరణించిన ఎనస్థీషియా పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థిని డాక్టర్ బత్తుల దీపిక మరణంపై మిస్టరీ వీడలేదు. ఈ నెల ఐదో తేదీన ఆమె ఆపరేషన్ థియేటర్లో బెంచీపై కూర్చు ని కుప్పకూలి ప్రాణాలు విడిచిన విషయం విదితమే. ఆమె మృతికి సంబంధించిన కారణాలు తెలియలేదు. మరోవైపు సీసీ కెమెరాల్లో సైతం ఆ రోజు రాత్రి 1.10 నుంచి 1.40 గంటల వరకూ ఆపరేషన్ థియేటర్లోకి బయటి వ్యక్తులు ఎవరూ వెళ్లినట్లు రికార్డు కాలేదు. దీంతో ఆమె మృతి మిస్టరీగా మారింది. పోస్టుమార్టం రిపోర్టు కోసం పోలీసులతో పాటు, ఆస్పత్రి అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ వారాంతంలో ఆ రిపోర్టు వచ్చే అవకాశం ఉందని సమాచారం. వైద్య మంత్రికి వినతి డాక్టర్ దీపిక మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తండ్రి బత్తుల కోదండరామిరెడ్డి నిత్యం పలువురిని కలుస్తూ వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్తో పాటు, ఏసీపీ దామోదర్ను ఇప్పటికే కలిసి తనకున్న అనుమానాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. తాజాగా గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలిసి డాక్టర్ దీపిక కళాశాలలో చేరిన వద్ద నుంచి మరణించిన వరకూ జరిగిన ఘటనలు, అనుమానాలను పేర్కొంటూ వినతి పత్రం అందజేశారు. పీఎం రిపోర్టు వస్తేనే.. దీపిక మృతిపై ఇప్పటికే ముగ్గురు ప్రొఫెసర్లతో ఎనస్థీషియా విభాగంలోని పీజీలు, వైద్యులను విచారణ జరపగా ఎలాంటి ఆధారాలూ తెలియలేదు. ఆమె మృతిపై రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు ఆరా తీశారు. పోలీసులు కూడా కొంత సమాచారాన్ని సేకరించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది. ఆ రిపోర్టు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
నేడు ఆయేషా మీరా అవశేషాలకు అంత్యక్రియలు
తెనాలిరూరల్: సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్య కేసును సీబీఐ కోర్టు ఇటీవల మూసివేయడంతో ఆమె అవశేషాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి 2019లో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యుల అభిప్రాయం తీసుకుని ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు. ఈ నెల 20న కేసు మూసి వేస్తూ న్యాయ మూర్తి ఆదే శాలు జారీ చేశారు. తమ కుమార్తె అవశేషాలను అప్పగించాలని ఆయేషా తల్లిదండ్రులు షంషద్బేగం, ఇక్బాల్బాషా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27వ తేదీ ఉదయం తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తు అధికారి కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. భద్రత నడుమ గౌరవప్రదంగా ఆయేషామీరా అంత్యక్రియలు జరిగేలా చూడాలని సూచించారు. ఆమేరకు శుక్రవారం కోర్టులో పంచనామా చేసిన అనంతరం అవశేషాలను స్వస్థలమైన తెనాలికి తరలించనున్నారు. చెంచుపేటలోని ఖబర్స్తాన్లో అవశేషాలకు అంత్యక్రియలు జరుగుతాయి. -
ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణను బుధవారం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన పరీక్ష కేంద్రంలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, సరైన విధంగా హాజరు నమోదు, ఇన్విజిలేటర్ల విధుల నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాయడానికి తగిన డెస్కులు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఫస్ట్ ఎయిడ్ వంటి ఏర్పాట్లు ఉన్నాయా అని పరిశీలించారు.ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందో బస్తు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, ప్రశ్నపత్రాల రవాణా, భద్రపరచడం వంటి అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, ప్రథమ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఇదే క్రమశిక్షణతో, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 98 పరీక్ష కేంద్రాల్లో 36,928 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 39,980 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 76,908 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా ఇంట ర్మీడియెట్ విద్యాధికారి బి.ప్రభాకరరావు తెలియజేశారు. -
యంత్రం.. ఛూమంత్రం
యంత్రం.. ఛూమంత్రం జి.కొండూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చి కుదించడం, క్రాప్ ఇన్సూరెన్స్ ను ఎత్తివేయడం, పంట నష్ట పరిహారాన్ని అందించకుండా వేధించడంతో పాటు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన యంత్ర సేవా కేంద్రాలను సైతం ఎత్తివేసి రైతులకు రాయితీపై అందించవలసిన యంత్రాలు, పరికరాల పంపిణీకి మంగళం పాడింది. రైతులు తమకు అవసరమైన యంత్రా లు, పరికరాలను అద్దెకు తీసుకోవాలంటూ రెండు యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది యాంత్రీకరణ లేనట్టే వ్యవసాయ యాంత్రీకరణ కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన యంత్ర సేవా కేంద్రా లకు మంగళం పాడిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది అంటే 2024–25 వ్యవసాయ సంవత్సరంలో తూతూమంత్రంగా వ్యవసాయ పరికరాలను అందించి చేతులు దులుపుకొంది. ఎన్టీఆర్ జిల్లాలో 1,08,859 మంది రైతులు ఉంటే 867 మంది రైతులకు మాత్రమే రూ.167.27 లక్షలతో వ్యవసాయ పరికరాలను అందించారు. రూ.274.40 లక్షలతో 35 కిసాన్ డ్రోన్లను పంపిణీ చేశారు. ట్రాక్టర్లు, ఇతర యంత్రాలేవీ పంపిణీ చేయలేదు. పంపిణీ చేసిన పరికరాలు కూడా అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో టీడీపీ సానుభూతిపరులకే అందించారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం రాయితీపై అందించిన పరికరాల ధర, బయట మార్కెట్లో లభించే పరికరాల ధరకు వ్యత్యాసం లేదని విమర్శలు వచ్చాయి. ఇక ఈ ఏడాది అంటే 2025–26 వ్యవసాయ సంవత్సరం మార్చితో ముగిస్తున్నప్పటికీ యాంత్రీకరణ ఊసే ప్రభుత్వం ఎత్తకపోవడంతో రైతుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అద్దెకు తీసుకునేలా యాప్లు రైతులకు వ్యవసాయ పరికరాలు, యంత్రాలను రాయితీపై అందించలేని చంద్రబాబు ప్రభుత్వం వాటిని అద్దెకు తీసుకునేలా ఏపీ ఎయిమ్స్, ఊబైరెజేషన్ యాప్లను అంటుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ అందుబాటులోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ జిల్లాలో ఇప్పటివరకు 12వేల మంది మాత్రమే లాగిన్ అయినట్లు తెలుస్తోంది. అది కూడా యాభై శాతంకు పైగా స్మార్ట్ఫోన్లు లేని రైతులకు కీప్యాడ్ ఫోన్లకు ఓటీపీ పంపి లాగిన్ చేయించినట్లు సమాచారం. యాప్ నిర్వాహకులకు దోచిపెట్టే సొమ్ముతో రైతులకు రాయితీపై యంత్రాలనే అందించొచ్చని రైతులంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేతల్లో కనిపించడంలేదు. వ్యవసాయ యంత్రాలు, పరికరాలు రాయితీపై అందించలేక ఇప్పుడు అద్దెకు తీసుకోవాలంటూ యాప్లను తీసుకొచ్చారు. –గుడిపూడి రమేష్, రైతు, కోడూరు, జి.కొండూరు మండలం పోయిన సంవత్సరం తూతూ మంత్రంగా వ్యవసాయ పరికరాలను అందించిన ప్రభుత్వం ఈ ఏడాది అది కూడా చేతకాక అద్దెకు తీసుకునేలా యాప్ తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం. –మండల శేషయ్య, రైతు, మునగపాడు, జి.కొండూరు మండలం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ఒక్కొక్క రైతు భరోసా కేంద్రానికి ఒక యూనిట్గా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరి కోత యంత్రాలకు పది శాతం రైతు వాటాతో ప్రభుత్వం అందించే 40 శాతం రాయితీతో కలుపుకొని ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా 50 శాతం రుణాలను మంజూరు చేయించింది. ఈ విధంగా ఒక్కొక్క యంత్ర సేవా కేంద్రానికి రూ.15లక్షల విలువ చేసే ట్రాక్టరు, యంత్ర పరికరాలను అందజేశారు. క్లస్టర్ యంత్ర సేవా కేంద్రంలో ఏర్పడిన రైతు గ్రూపునకు రూ.25లక్షల విలువ చేసే వరికోత యంత్రాన్ని అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 267 రైతు భరోసా కేంద్రాలకు గానూ 257 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, 34 క్లస్టర్ లెవెల్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.32.84కోట్ల విలువగల 1667 వ్యవసాయ పరికరాలు, 35 వరికోత యంత్రాలు, 183 ట్రాక్టర్లను రైతులకు అందజేశారు. ఈ విధంగా ప్రభుత్వం నుంచి రూ.11.83కోట్ల రాయితీని రైతులు పొందారు. -
ఉత్సాహంగా లెజిస్లేటివ్ స్పోర్ట్స్మీట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, శాసనసభ్యులు(లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్–2026) నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలాచారి ఇండోర్ స్టేడియంలలో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది. స్పోర్ట్స్ మీట్లో రెండో రోజైన బుధవారం క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్(పురుషులు, మహిళలు), పికల్బాల్ (మెన్), మ్యూజికల్ చైర్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రికెట్ పోటీల్లో మొదటి మ్యాచ్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సత్యకుమార్ యాదవ్ జట్ల మధ్య పోటీ జరిగింది. పల్లా శ్రీనివాసరావు జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 69 పరుగులు సాధించింది. 70 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన మంత్రి సత్యకుమార్ యాదవ్ జట్టు 7 వికెట్ల తేడాతో సునాయాసంగా 70 పరుగులు సాధించి విజయం సాధించింది. -
సర్వం సర్వేల మయం
క్షేత్రస్థాయిలో సిబ్బందికి ప్రాణాంతకంపెడన: చంద్రబాబు ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై సర్వేల భారం మోపుతోంది. ఉద్యోగులు తమ దైనందిన విధులకు తోడు ఈ సర్వేల కారణంగా అదనపు భారం మోయలేక శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం లక్ష్యాల సాధనలో భాగంగా ముంచెత్తుతున్న సర్వేల భారంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతూ సతమతమవుతున్నారు. ప్రధానంగా వైద్య శాఖలో ఏఎన్ఎంలు, రెవెన్యూ శాఖలో వీఆర్వో లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం ఇష్టానుసారంగా భారం మోపుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన ఆరోగ్య సిబ్బంది సర్వేల పేరిట ఇంటింటికీ పరుగులు తీయాల్సివస్తోంది. దీంతో ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ఏఎన్ఎంల ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక రెవెన్యూ సిబ్బంది సంగతి సరేసరి. విద్యుత్శాఖలోని సిబ్బంది సైతం విద్యుత్ సర్వీసులకు ఆధార్ అనుసంధానంపై సర్వే పేరిట పరుగులు తీయాల్సివస్తోంది. వీరంతా క్షణం తీరిక లేకుండా తమకు అప్పగించిన సర్వేలను పూర్తి చేయడానికి నానా అగచాట్లు పడుతున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడి నెల రోజుల్లో జరగాల్సిన పనిని వారంలో పూర్తి చేయాలని, లేదంటే మెమోలు జారీ చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో వీఆర్వోలు, ఏఎన్ఎంలు, సచివాలయ ఉద్యోగులు, విద్యుత్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పని హడావుడి లో తమకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంటర్నెట్ అందక సకాలంలో వాటిని పూర్తి చేయలేక చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతూ మానసిక రుగ్మతలకు గురై బీపీ, షుగర్ వంటి రోగాల బారిన పడుతున్నారు. వారంలో ఆరు రోజులు సర్వేలతో తీవ్ర మనో వేదనకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఒకదాని వెంట మరొకటి... వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంల పరిస్థితి మరీ దారుణం. ఒక సర్వే పూర్తి కాక ముందే మరో సర్వే నెత్తిన పెడుతున్నారని, రోజుకు 24 గంటలు పనిచేసినా లక్ష్యాలు పూర్తి కావని, అధికారుల వేధింపులతో పాటు వైద్యులు చెప్పిన పని చేయకపోతే జీతం రాదని బెదిరింపులు కూడా ఎక్కువయ్యాయని వాపోతున్నారు. వీఆర్వోలకు కూడా సర్వేలతో పాటు రెవెన్యూపరమైన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, వాటిని అందించిన తరువాత వారి నుంచి వివరాల సేకరణ, రీ సర్వే, మధ్య మధ్యలో బీఎల్వో(ఎన్నికల) విధులు, ఇవి కాకుండా నీటి తీరువా వసూళ్లు టార్గెట్ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడాలు లేకుండా ఒకటో తేదీన ఆదివారం సెలవు రోజు వస్తే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేయించడం చేయిస్తూ సర్వేలతో సెలవులు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారంటూ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. చివరకు పండగ రోజుల్లో కూడా విధులు నిర్వర్తించాలంటూ అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని వాపోతున్నారు. డిపార్ట్మెంట్ జాబ్ చార్టు ప్రకారం ఏ విధులు నిర్వహించాలో కూడా స్పష్టత లేకుండా ఒకేసారి అన్ని విధులూ చేయలేక మానసిక ఆందోళనకు గురవుతున్నామని వాపోతున్నారు. పనిభారం అధికమై ఇటీవల సచివాలయ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలను సైతం సమర్పించారు. అయినా ఫలితం లేకపోయింది. ఉన్నతాధికారులు సర్వేల పేరుతో సిబ్బందిని ఒత్తిడికి గురి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది పని భారాన్ని గమనించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సర్వేల్లో భాగంగా ఓటీపీలు చెప్పడానికి ప్రజలు నిరాకరిస్తున్నారన్నారు. ఒక్కో కుటుంబాన్ని సర్వే చేయడానికి అరగంట సమయం పడుతోంది. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సర్వేల ఒత్తిడిని తగ్గించాలని ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు కోరుతున్నారు. చంద్రబాబు సర్కారులో క్షేత్రస్థాయిలో ఉద్యోగులు నిరంతర సర్వేలతో సతమతమవుతున్నారు. పని ఒత్తిడితో మానసిక వేదనకు గురవుతున్నారు. తమ బాధలు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉద్యోగుల హఠాన్మరణాలు, బలవన్మరణాలు జరుగుతున్నాయి. అయినా పాలకుల వైఖరి మారడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన అవసరం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మందుల వినియోగంపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం వినియోగదారులు మందులు కొనుగోలు చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, యాంటీబయోటిక్స్ సరైన వినియోగం, నాణ్యమైన జనరిక్ ఔషధాల ప్రోత్సాహం వంటి అంశాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుల సూచన లేకుండా యాంటీబయోటిక్స్ను వినియోగించడం వలన యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పోస్టర్లలో లైసెన్సు కలిగిన మెడికల్ షాపుల నుంచే మందులు కొనుగోలు చేయడం, తప్పనిసరిగా బిల్ తీసుకోవడం, మందుల గడువు తేదీ పరిశీలించడం, స్వయంగా మందులు వాడకూడదని, వైద్యులు సూచించిన విధంగా పూర్తిగా కోర్సు పూర్తి చేయాలని సూచనలు ఇచ్చామన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ అమ్మకాన్ని నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నాణ్యత, భద్రత, ప్రమాణాలు పాటించే జనరిక్ ఔషధాల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. తక్కువ ఖర్చుతో సమర్థమైన చికిత్స అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని పోస్టర్ల ద్వారా తెలియజేశారన్నారు. కార్యక్రమంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.శ్రీరామమూర్తి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కె.వి.భూపేష్, బి.గోపాలకృష్ణ, జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి డి.వి.ఆర్.సాయి కుమార్, ఉపాధ్యక్షుడు కె.సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 7న విజయవాడలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వచ్చే నెల 7వ తేదీన విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఏపీ జేఏసీ, అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ గవర్నర్పేటలోని ఏపీ ఆర్ఎస్ఏ భవన్లో బుధవారం వేడుకలకు సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా దినోత్సవానికి మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉన్న హెడ్ ఆఫీసుల్లో (ప్రధాన శాఖాధిపతి కార్యాలయాలు), విజయవాడలోని అన్ని జిల్లా స్థాయి కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులంతా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మహిళా విభాగం చైర్పర్సన్ పారె లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళా దినోత్సవం అనేది కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా మహిళల హక్కులు, సమానత్వం, భద్రత, గౌరవం వంటి అంశాలపై సమాజంలో చైతన్యం కలిగించే ఉద్యమ దినమని అన్నారు. మహిళలు విద్య, ఉపాధి, నాయకత్వం వంటి రంగాల్లో ముందుకు రావాలంటే ప్రభుత్వ విధానాలు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మహిళల ఐక్యత అవసరమని తెలిపారు. వేడుకల సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ నాయకులు పలిశెట్టి దామోదరరావు, తిమ్మసర్తి నాగేశ్వరరావు, రామిశెట్టి వెంకట రాజేష్, ఎ.అర్లయ్య, మందపాటి శంకరరావు, బత్తిన రామకృష్ట పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా సీతా నగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూనీళా సమేత వైకుంఠనాథ్ పెరుమాళ్, శ్రీలక్ష్మీ హయగ్రీవ స్వామి, శ్రీ యోగాంజేయ స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. బుధవారం ఉదయం శ్రీ నారసింహ హవనం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి మంగళ శాసనాలు అందుకున్నారన్నారు. -
క్షేత్రస్థాయిలో ఉద్యోగుల పరిస్థితి దయనీయం
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(కుటుంబ వివరాలు), అక్షరాంధ్ర, మన మిత్ర, ఈ–గవర్నర్స్, పురమిత్ర యాప్, పీ–4, వాట్సప్ గవర్నర్స్, ఈ–కేవైసీ అప్డేట్, మొబైల్ అప్డేట్ సర్వేలతో పాటు ఎవరైనా ఇంటి వద్ద వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు ఎంతమంది చేస్తున్నారనే సర్వేలు కూడా చేయిస్తూ సచివాలయ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించే క్రమంలో ఉన్నతాధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ మెమోలు జారీ చేయడానికి సైతం వెనుకాడటం లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా–8లో..గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026వేర్వేరు ప్రాంతాల్లో చోరీ అయిన 122 ఫోన్లను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. వాటిని బుధవారం సైబర్క్రైం డీసీపీ కృష్ణ ప్రసన్న బాధితులకు అందజేశారు. విజయవాడ పోలీసులు నిర్వహిస్తున్న డ్రగ్స్పై దండయాత్ర సైకిల్ ర్యాలీ బుధవారం నందిగామ చేరింది. కార్యక్రమంలో సినీనటుడు సుమన్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన అనేక పథకాలను ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయంపై ఆది నుంచి చిన్నచూపు ఉన్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా తన పాత వైఖరినే కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు బహుళ ప్రయోజనకారిగా దోహదపడిన రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చినా పేరులోనే తప్ప సేవలు పూజ్యం అన్నట్టుగా చేశారు. ఇక యంత్ర సేవా కేంద్రాలకై తే ఏకంగా మంగళం పాడేశారు. 7 -
పాల కల్తీ టెస్టింగ్ కిట్ల కొరత
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాజమండ్రిలో కల్తీపాలు తాగి ఐదుగురు మృత్యువాత పడటంతో పాటు పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో విజయవాడలో ఫుడ్ కంట్రోల్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా 13 ప్రాంతాల్లో లూజు పాలు విక్రయిస్తున్న వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్షల కోసం హైదరాబాద్ లేబొరేటరీలకు పంపించారు. ఆ రిపోర్టులు వచ్చేందుకు వారం రోజులు పడుతుందని, ఆ ఫలితాల ఆధారంగా ఏదైనా కల్తీ ఉంటే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. టెస్టింగ్ కిట్ల కొరత పాలలో కల్తీ గుట్టును సత్వరమే తెలుసుకునేందుకు అవసరమైన టెస్టింగ్ కిట్లు ప్రభుత్వం వద్ద అందుబాటులో లేని దయనీయ స్థితి నెలకొంది. దీంతో ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించినా ఆయుధాలు లేని సైనికుల మాదిరిగా మారారు. అవి కల్తీ అయ్యాయో లేదో తెలుసుకోవటానికి వారం రోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవంగా కిట్స్ ఉంటే ప్రాథమికంగా అప్పుడే తెలుసుకోవచ్చు, మరిన్ని ఫలితాల కోసం లేబొరేటరీలకు పంపుతారు. కానీ కిట్ల కొరతతో కేవలం శాంపిల్స్ను సేకరించి, వాటిని ల్యాబ్లకు పంపించడం మాత్రమే చేస్తున్నారు. తనిఖీలు ఇలా... నగరంలో కొత్తపేట, వన్టౌన్, విద్యాధరపురం, గాంధీనగర్, కృష్ణలంక, పటమట, ఫన్టైమ్స్ రోడ్డు, కరెన్సీనగర్, గురునానక్ కాలనీ ప్రాంతాల్లో లూజుగా అమ్ముతున్న గేదె పాల శాంపిల్స్ను సేకరించారు. పటమట, కొత్తపేట ప్రాంతాల్లో లూజుగా విక్రయిస్తున్న ఆవు పాల శాంపిల్స్ను సైతం సేకరించారు. ఆయా శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని విమ్టా లేబొరేటరీకి పంపారు. రాజమండ్రిలో డీ ఫ్రిజ్లో పెట్టిన పాలలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయినందుకు ఆ దిశగా కూడా అధికారులు దృష్టి సారించారు. రాజమండ్రి ఘటన నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పాల శాంపిల్స్ను సేకరించారు. వాటిని హైదరాబాద్ ల్యాబ్కు పంపించాం. టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేవు. వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ప్రజలు పాలు కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్లపై తేదీని చూసి కొనుగోలు చేయాలి. –బి.శ్రీనివాసరావు, ఫుడ్ కంట్రోల్ అధికారి -
పన్నులు సజావుగా వసూలు చేయాలి
చిలకలపూడి(మచిలీపట్భం): జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు సజావుగా వసూలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఆయన చాంబర్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఆస్తులు, భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలన్నారు. తప్పనిసరిగా వస్తు సేవల పన్నులు వసూలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పౌర సరఫరాలు, తూనికలు కొలతలు, గనులు భూగర్భ శాఖల అధికారులు టాస్క్ఫోర్స్ ఏర్పాటై ఉమ్మడిగా వాహనాలను తనిఖీ చేసి వస్తుసేవల పన్ను వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ జి. కల్పన, అదనపు ఎస్పీ వి. నాయుడు, వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్లు సౌమ్య, జగదీష్, రాజకుమార్, డీపీఓ డాక్టర్ జె. అరుణ, డీఎస్ఓ మోహన్ బాబు జెడ్పీ డెప్యూటీ సీఎం సీఈఓ ఆనంద్ కుమార్. జిల్లా ఆడిట్ అధికారి సూర్య ప్రకాష్ రావు జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
దుర్గమ్మ సేవలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సీఎస్ విజయానంద్ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీనానాయక్ సీఎస్ విజయానంద్కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్ర దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. హరి జవహర్లాల్ మంగళవారం తెల్లవారుజామున అమ్మవారి ఖడ్గమాలార్చనలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అమ్మవారి ఖడ్గమాలార్చనలో పాల్గొనేందుకు తెల్లవారుజాము 4 గంటలకు ఆలయానికి చేరుకున్న హరిజవహర్లాల్కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి ఖడ్గమాలార్చన, మల్లేశ్వర స్వామి వారి విశేష అభిషేకాలలో పాల్గొన్న అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం, పట్టువస్త్రాలను అందించారు. వీరులపాడు: ఒంటరిగా తిరుగుతున్న మానసిక స్థితి సరిగా లేని ఆరేళ్ల బాలుడిని ఆటో డ్రైవర్ గమనించి పంచాయతీ కార్యాలయంలో అప్పగించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన దార్ల నాగరాజు కుమారుడు అనీష్ మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి మధిర రోడ్డు మీదుగా నడుచుకుంటూ జుజ్జూరు గ్రామానికి చేరుకున్నారు. గ్రామ శివారులో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గమనించిన ఆటో డ్రైవర్ హనుమంతరావు ఆటోలో ఎక్కించుకుని వచ్చి జుజ్జూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ఉద్యోగులకు అప్పగించాడు. పంచాయతీ సిబ్బంది విషయాన్ని సర్పంచ్ రమావత్ కోటికి తెలుపగా సర్పంచ్ భర్త రాము బాలుడి ఫొటోతో సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు. విషయం తెలుసుకుని జుజ్జూరు గ్రామానికి వచ్చిన తల్లిదండ్రులకు సర్పంచ్ బాలుడిని అప్పగించారు. తమ కుమారుడిని క్షేమంగా అప్పగించిన సర్పంచ్ కోటి, భర్త రాము, ఆటో డ్రైవర్కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎలుకల మందు తాగి మహిళ ఆత్మహత్య
గుడివాడరూరల్: ఎలుకల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై గుడివాడ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తటివర్రు గ్రామానికి చెందిన కొల్లూరి జాన్ భార్య మరియమ్మ(40) గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోందన్నారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం పొలం వెళ్లేందుకు మరియమ్మ భర్త అడుగగా కడుపునొప్పిగా ఉందని తాను రాలేనని చెప్పడంతో, సరేనని భర్త పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో పొలం నుంచి ఇంటికి వచ్చిన భర్తకు కడుపు నొప్పిగా ఉందని తాగేందుకు కూల్డ్రింక్ తీసుకురావాలని కోరిందని, ఈ క్రమంలో తీసుకువచ్చి ఇచ్చాడు. రాత్రి 11గంటల సమయంలో మరియమ్మకు వాంతులు అవుతుండగా కుమారుడు వచ్చి ప్రశ్నించగా తాను ఎలుకల మందు తాగినట్లు మరియమ్మ తెలిపిందన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వైద్య సేవల నిమిత్తం తరలించగా మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. కంకిపాడు: జాతీయ రహదారిపై ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాద స్థాయి ఊహించని విధంగా ఉన్నా, ప్రాణాపాయం లేకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం కంకిపాడు–గోసాల సెంటర్ గ్రామాల నడుమ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ప్రమాదాల వివరాల్లోకి వెళితే.. కంకిపాడు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆటోకి డీజిల్ అయిపోవటంతో మరో ఆటో డ్రైవరు తన కాలితో ఆటోను వెనుక నుంచి నెడుతూ ఆటో నడుపుతున్నాడు. కంకిపాడు బైపాస్ దాటగానే వాహనాలు అదుపుతప్పి జాతీయరహదారిపై పల్టీ కొట్టాయి. ఒక ఆటో ఏకంగా పంట బోదెలోకి దూసుకెళ్లింది. అయితే ఆటోలో డ్రైవర్లు మినహా ఎవరూ లేరు. వారికి కూడా స్వల్ప గాయాలే అయ్యాయి. గోసాల గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు జాతీయరహదారిపై పడ్డ ఆటోను రోడ్డు మార్జిన్కు తరలించి, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకున్నారు. కారును ఢీకొట్టిన టిప్పరు.. ఇదే సమయంలో కంకిపాడు నుంచి గోసాల వైపు వెళ్తున్న కారును వెనుకగా వస్తున్న భారీ టిప్పరు ఢీకొంది. కారులో ఉన్న భార్యాభర్తలు, వారి కుమారుడు ప్రాణభయంతో కేకలు పెట్టారు. టిప్పరు ఢీకొనటంతో కారు డోర్లు ధ్వంసమై ఇరుక్కుపోవటంతో భయాందోళనలు చెందారు. అక్కడే ఉన్న పారిశుద్ధ్య కార్మికులు అతికష్టం మీద కారు డోర్లు తెరవటంతో ఆ కుటుంబం ఊపిరిపీల్చుకుంది. ఈ రెండు ప్రమాదాల్లోనూ ఎవరికీ ప్రాణాపాయం లేకపోవటంతో అంతా ఊపిరితీసుకున్నారు. -
‘బాబూ’.. తప్పుదోవ పట్టించొద్దు!
● రైతులను ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదు ●న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే సమ్మె ●సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు చల్లపల్లి: కో–ఆపరేటివ్ ఇన్చార్జి కమిషనర్ బాబు సహకార సొసైటీలపై లేనిపోనివి చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చండ్ర రవికుమార్, కృష్ణాజిల్లా జిల్లా అధ్యక్షుడు తోట కృష్ణారావు ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు ఈనెల 16వ తేదీ నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. కాగా అవనిగడ్డ నియోజవర్గంలోని 37 సొసైటీలకు చెందిన 130 మంది ఉద్యోగులు, సిబ్బంది స్థానిక కేడీసీసీ బ్యాంక్ వద్ద మంగళవారం సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సహకార సంఘాలు 40 శాతం నష్టాల్లో ఉన్నాయన్నది వాస్తవమైతే ఆ నష్టాలకు కారకులెవరో కమిషనర్ బాబు ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. అందరం చిన్న ఉద్యోగులమని కింది స్థాయిలో రైతాంగానికి విత్తనం దగ్గర నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకూ ఏన్నో సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవం బాధాకరమన్నారు. న్యాయ పోరాటానికి సిద్ధం.. ఇతర రాష్ట్రాల్లో ఏజెన్సీల ద్వారా సొసైటీల కంప్యూటరీకరణ చేయిస్తే.. మన రాష్ట్రంలో మాత్రం కమిషనర్ తమతోనే అన్ని కంప్యూటీకరణ పనులు చేయించారని కృష్ణారావు చెప్పారు. కంప్యూటర్ సిబ్బందిని రెగ్యులర్ చేయకపోతే న్యాయపోరాటానికై నా తాము సిద్ధమని పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము సమ్మెకు దిగాల్సి వచ్చిందని రైతులను ఇబ్బంది పెట్టాలని గానీ, సొసైటీలను నష్టపెట్టాలని గానీ తమ ఉద్దేశం కాదని విన్నవించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే యూనియన్ నాయకుల ఆదేశాల మేరకు ఆమరణ నిరాహార దీక్షకు కూడా తాము సిద్ధమని స్పష్టం చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు కోసూరు రామాంజనేయులు, సహకార సంఘాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేబుల్ వైర్లకు మంటలు.. తప్పిన ముప్పు
మధురానగర్(విజయవాడసెంట్రల్): నిత్యం రద్దీగా ఉండే చుటుగుంట సిగ్నల్స్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 3.10 గంటలకు విద్యుత్ స్తంభానికి కట్టి ఉన్న నెట్ కేబుళ్ల వద్ద మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు వ్యాపించటంతో విద్యుత్ ఫీడర్ ట్రిప్ అయ్యింది. సమాచారం అందుకున్న చుట్టుగుంట విద్యుత్ సబ్స్టేషన్ ఈఈ వెంకట్రావు సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం నీరు, ఇసుక, నిచ్చెనలు, గడకర్రలు తాళ్లు ఉపయోగించి మంటలను అదుపు చేసి, పాడైన ఇన్సులేటర్ను మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి విద్యుత్ సిబ్బంది మంటలు అదుపు చేసి, విద్యుత్ సరఫరా పునరుద్దరించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేబుల్, నెట్వైర్లు విద్యుత్ స్తంభాల వద్ద చుట్టగా చుట్టి వదలివేయటం వల్ల అధిక వేడి వల్ల మంటలు వచ్చే ప్రమాదం ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. -
గుర్తు తెలియని మహిళ మృతి
పెనమలూరు: పోరంకిలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఆస్పత్రిలో చేర్చగా ఆమె మంగళవారం మృతి చెందింది. ఎస్ఐ ఉషారాణి తెలిపిన వివరాల ప్రకారం పది రోజుల క్రితం పోరంకి సెంటర్లో గుర్తు తెలియని మహిళ(50) పడిపోయి ఉండటంతో స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది ఆమెను విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్సకై చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు. మృతురాలు యాచకురాలని, ఆమె వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
విద్యుత్ అదాలత్కు 12 అర్జీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ వినియోగదారుల అదాలత్కు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని టౌన్ ఈఈ రవీంద్రబాబు తెలిపారు. మంగళవారం విజయవాడ ఏపీసీపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ కాన్ఫరెన్స్ హలు నందు సీజీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టౌన్ డివిజన్కు సంబంధించిన 16 సెక్షన్లకు సంబంధించి అదాలత్లో మొత్తం 12 మంది వినియోగదారులు తమ సమస్యలపై అర్జీలు అందజేశారన్నారు. వీటిలో స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, వేలాడే విద్యుత్ తీగలు సరిచేయాలని, లైన్ షిఫ్టింగ్ వంటి పలు అంశాలపై వినియోగదారులు అదాలత్లో ఫిర్యాదు చేశారన్నారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎన్. విక్టర్ ఇమ్మానుయేలు అధ్యక్షతన జరిగిన అదాలత్లో సాంకేతిక సభ్యుడు డి. కృష్ణానాయక్, ఆర్థిక సభ్యుడు కె. కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ. సునీత, ఎస్ఈ యు. హనుమయ్య పాల్గొని అర్జీలను స్వీకరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక మధుచౌక్లోని మొగల్ ఎగ్జిబిషన్ హాలులో ఈ నెల 28 శనివారం నుంచి మార్చి 8వ తేదీ వరకు మహిళా ఉత్సవ్–2026ను నిర్వహిస్తున్నామని జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు వారే స్వయంగా విక్రయించేందుకు ఏటా ఈ మహిళా ఉత్సవ్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 28వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, డీఆర్డీఏ ఎన్టీఆర్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎన్వీ నాంచారయ్య, జన శిక్షణ సంస్థాన్ వైస్ చైర్పర్సన్ గోళ్ల వాణీ హాజరై మహిళా ఉత్సవ్ను ప్రారంభిస్తారని చెప్పారు. -
బాలుడిపై వీధి కుక్కల దాడి
తీవ్రగాయాలతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చిట్టినగర్(విజయవాడపశ్చిమ): స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న 9 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు విచ్చక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన కొత్తపేట ఆంజనేయవాగు సెంటర్లో చోటు చేసుకుంది. కొత్తపేట ఆంజనేయవాగు కొండ ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల రాచకొండ రిషి కస్తూరి సీతారామయ్య స్కూల్ రెండో తరగతి చదువుతున్నాడు. తండ్రి శివ, తల్లి చిన్ని చేపల మార్కెట్లో బట్టల వ్యాపారం చేస్తుంటారు. మంగళవారం ఉదయం స్కూల్కు వెళ్లిన రిషి సాయంత్రం నాలుగు గంటలకు తోటి విద్యార్థులు, స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. వాగు సెంటర్లోని బాలభక్త సమాజం మీదుగా కొండపై వాటర్ ట్యాంక్ వైపునకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో బాలభక్త సమాజం వద్దకు వచ్చేసరికి రోడ్డుపై కుక్కలు గుంపులుగా ఉండటంతో భయంతో ఓ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లసాగాడు. వెంటనే మూడు కుక్కలు గుంపుగా రిషిపై పడి తీవ్రంగా గాయపరిచాయి. విరిగిన ముక్కు ఎముక.. కుక్కలు రిషి ముఖంపై కరవడంతో ముక్కు ఎముక విరిగిపోవడంతో పాటు ముఖంపై పలు చోట్ల గాయాలయ్యాయి. ఇంతలో స్థానికులు రిషిని కుక్కల బారి నుంచి కాపాడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, స్థానికులు హుటాహుటిన రిషిని కొత్తపేటలో ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించగా, అక్కడి వైద్యులు బాలుడిని పరీక్షించి, కొత్త ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో రిషి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆటోలో కొత్త ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు రిషిని పరీక్షించి ఆపరేషన్ చేయాలని సూచించారు. -
● ఇంటి వద్దకే పసుపు గానుగ
ఆలోచన ఉంటే ఉపాధి మార్గం వెతుకోవచ్చు అంటారు.. అదే ఆలోచనతో స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు హైదరాబాద్కు చెందిన ఇస్సాక్ కుటుంబ సభ్యులు. రూ. లక్ష పెట్టుబడితో పసుపు గానుగ పట్టే యంత్రాన్ని కొనుగోలు చేసి వ్యాన్లో అమర్చారు. తమతో పాటుగా నాణ్యమైన నిజామాబాద్ పసుపు కొమ్ములను తీసుకొచ్చి పసుపు గానుగ ఆడిస్తున్నారు. వీరు మంగళవారం కంకిపాడు పరిసరాల్లో సంచరిస్తూ విక్రయాలు చేపడుతున్నారు. పావుకిలో పసుపు రూ. 100, కిలో రూ. 400 చొప్పున విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. నాణ్యమైన పసుపు, కళ్లెదుటే గానుగ ఆడించి ఇవ్వటంతో పసుపు కొనుగోళ్లు చేసేందుకు కంకిపాడు పట్టణ వాసులు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా ఇస్సాక్ను ‘సాక్షి’ పలుకరించగా, ప్రజలు మన వద్దకు రావాలని చూడటం కంటే వారి వద్దకే వెళ్లి విక్రయాలు చేపట్టడం మేలని, ఈ తరహాలో విక్రయాలు చేస్తున్నట్లు చెప్పారు. – కంకిపాడు -
జోగి సోదరుల బెయిల్ రద్దు పిటీషన్పై నోటీసులు
విజయవాడ లీగల్: నకిలీ మద్యం కేసులో బెయిల్ పొందిన జోగి రమేష్, ఆయన సోదరుడు రాము షరతులకు విరుద్ధంగా మీడియాతో మాట్లాడటం, ర్యాలీ నిర్వహించారనే అభియోగంపై వారి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు 7వ అదనపు జిల్లా జ్యూడీషియల్ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్పై వారిరువురికీ న్యాయమూర్తి నోటీసులు పంపించారు. దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఇదే కేసులో రిమాండ్లో ఉన్న సీపీ సెంథిల్ బెయిల్ పిటీషన్పై విచారణను ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి వచ్చే నెల 2వ తేదీకి, ఆయన్ను కస్టడీకి కోరుతూ ఎకై ్సజ్ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్పై తీర్పును ఈనెల 26వ తేదీకి వాయిదా వేశారు. మద్యం అక్రమ కేసులో గుంటూరు రిమాండ్లో ఉన్న వాసుదేవరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు మంగళవారం ఏసీబీ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. పెనమలూరు: కరెంట్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వ్యాన్ డ్రైవర్గా పనిచేసే లింగాల కిరణ్తేజ(30) పెనమలూరు ఆశ్రమం వెనుక కాలువకట్టపై భార్య తులసి, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కాగా కిరణ్తేజ తన ఇంటి మరమ్మతులు చేయటానికి ఇంటి పక్కనే ఉన్న మరో ఇంట్లోకి వారం క్రితమే అద్దెకు మారాడు. బాత్రూమ్లో లైట్ వెలగక పోవటంతో మంగళవారం రాత్రి లైట్ వెలిగించటానికి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్షాక్కు గురై కుప్పకూలిపోయాడు. స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చారు. కేసు నమోదు చేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేయాలి ● సమస్యల సుడిలో జనరల్ నర్సింగ్ విద్యార్థులు ● భోజనంలో సుద్ద అన్నం, నీళ్ల చారు ● థియరీ బోధనకు తరగతి గదులు కరువు ● వైద్య మంత్రికి సమస్యలను వివరించిన విద్యార్థులు ● రెండు నెలలు అవుతున్నా మంత్రి తీసుకున్న చర్యలు శూన్యంలబ్బీపేట(విజయవాడతూర్పు): జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థులు అరకొర సౌకర్యాలతో సతమతవుతున్నారు. థియరీ పాఠాలు బోధించేందుకు తరగతి గదులు సరిపడా లేవు. నివసించేందుకు సైతం అవసరమైనన్ని గదులు కరువయ్యాయి. సుద్ద అన్నం, నీళ్ల చారుతో కూడిన భోజనం మింగుడు పడక ఇబ్బందిపడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించండి సారూ అంటూ వైద్య శాఖ మంత్రికి విన్నవించారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి రెండు నెలలు గడిచినా ఏ ఒక్క సమస్యా ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదు. తమ పరిస్థితి ఇంతేనా, సమస్యలతో సహవాసం చేయాల్సిందేనా అని జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మదనపడుతున్నారు. ప్రభుత్వాస్పత్రికి అనుబంధంగా నర్సింగ్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థులు 300 మంది వరకూ ఉన్నారు. వారికి అక్కడే వసతి సౌకర్యంతో పాటు, తరగతులు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వాస్పత్రిలో క్లినికల్ శిక్షణ పొందుతుంటారు. గతంలో నర్సింగ్ స్కూల్ నిర్వహించిన భవనంలో సగ భాగాన్ని బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు కేటాయించారు. దీంతో జీఎన్ఎం విద్యార్థులకు తరగతి గదులు, వసతి గదులు చాలడం లేదు. థియరీ పాఠాలు వినేందుకు తరగతి గదులు, వసతి పొందేందుకు గదులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గదుల కొరతతో ఒక్కోసారి ఆరుబయట నిర్వహిస్తున్న తరగతులకు హాజరై పాఠాలు వినాల్సిన దయనీయ స్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు. తమకు అందిస్తున్న భోజనం తిన లేని విధంగా ఉంటోందని జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థులు వాపోతున్నారు. సుద్ద అన్నం, నీళ్ల చారుతో ముద్ద మింగుడు పడటం లేదని, ఒక్కొక్క సారి ఉడికీ ఉడని అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ భోజనం అరగక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో ఇచ్చే బియ్యంతో అన్నం వండుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగుల ధర్నా కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న సహకార సంఘాల ఉద్యోగులు 7గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులపై ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన డీడబ్ల్యూఎస్ఎం సమావేశం మంగ ళవారం జరిగింది. జేజేఎం–కుళాయి కనెక్షన్లలో పురోగతి, పథకం పనితీరుపై సమీక్షించారు. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్)– ఓడీఎఫ్ ప్లస్, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, నీటి నాణ్యత పర్యవేక్షణ, నిఘా తదితరాలపై చర్చించారు. ఎ.కొండూరు మండలంలోని సీకేడీ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటి కుళాయి కనెక్షన్ల భౌతిక స్థితిని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. 100 శాతం కనెక్షన్లు కల్పించేందుకు డీపీఓకు ఆదేశాలిచ్చారు. గొల్లమండల తండా, జమలగడ్డ, దీప్లానగర్కు మార్చి నాటికి తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటికి కొరత లేకుండా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎ. రామకృష్ణారావు, డీపీఓ పి.లావణ్యకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి పాల్గొన్నారు. నందివాడ: కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్కుమార్ మంగళవారం నందివాడ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. రికార్డులను, ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి నగరంలోని కొత్తపేటకు చెందిన భక్తుడు సుంకర వెంకటేశ్వరరావు మంగళవారం రూ.1,00,116 విరాళం సమర్పించారు. -
అకాల వర్షం.. పంటలకు నష్టం
తిరువూరు/గంపలగూడెం: తిరువూరు నియోజకవర్గంలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాలవర్షానికి వాణిజ్య పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. తిరువూరు మండలంలో 8.2 మిల్లీ మీటర్లు, గంపలగూడెంలో 3.4, విస్సన్న పేటలో 2.6, ఎ.కొండూరులో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంపలగూడెం మండలంలో ఐదు వేల ఎకరాల్లో మిర్చిపంట సాగు చేయగా, మొదటి కోతను కల్లాల్లో ఆరబోసిన మిర్చి నీటిపాలైందని తునికిపాడు, దుందిరాలపాడు, ఊటుకూరు, నెమలి, రాజవరం, కొణిజర్ల గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ ఇస్తున్న ప్రోత్సాహంతో గంపలగూడెం మండలంలో 8వేల ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్న రైతులు కూడా అకాలవర్షం కారణంగా నష్టపోయామని వాపోతున్నారు. 70 శాతం పంట వర్షం కారణంగా పాడవడంతో ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలవాలిన మొక్కజొన్న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఎ.కొండూరు మండలంలో మొక్కజొన్న నేల వాలింది. మండలంలోని వల్లంపట్ల, పోలిశెట్టిపాడు, గొల్ల మందల, మాధవరం, రేపూడి తదితర గ్రామాల్లో 250 ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. తిరువూరు మండలంలోని ఎర్రమాడు, కొమ్మిరెడ్డిపల్లి, రాజుగూడెం గ్రామాల్లో మిర్చి పంటకు పాక్షికంగా నష్టం జరిగిందని రైతులు తెలిపారు. అకాల వర్షం కారణంగా కలిగిన పంటనష్టం అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. వర్షంతో తడిసిన మిర్చి గంపలగూడెం మండలం ఊటుకూరులో నేలకొరిగిన మొక్కజొన్న పంట మిర్చి, మొక్కజొన్న రైతుల దిగాలు పంట నష్టం అంచనా వేస్తున్న అధికారులు చేతికందే దశలో వాణిజ్య పంటలు నేలపాలు -
లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. శాసన మండలి చైర్మన్ కె.మోషేన్రాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జట్లుగా ఏర్పడి వాలీబాల్, కబడ్డీ, పరుగు పందెం వంటి క్రీడల్లో పాల్గొన్నారు. శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి, అసెంబ్లీ కార్యదర్శి ఎస్.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. – మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) -
శక్తి పునరుద్ధరణ కోసం మహా కుంభాభిషేకం
● మార్చి 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శక్తి పునరుద్ధరణ కోసం మహా కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి ఆరో తేదీన ప్రారంభమయ్యే ఈ మహోత్సవ ఏర్పాట్లను కలెక్టర్, దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈఓ శీనానాయక్, జిల్లా అధికార యంత్రాంగం, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదిక వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులతో కలిసి మీడియా సమావేశం నిర్వ హించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. 12 ఏళ్లకు ఒక సారి మహా కుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు. చివరి సారిగా 2014 ఫిబ్రవరిలో ఈ వేడుక జరిగిందన్నారు. మార్చి ఆరో తేదీ ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిజీ చేతుల మీదగా ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఎనిమిదో తేదీ ఉదయం 9.45 గంటలకు కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదగా కుంభాభిషేకం జరుగుతుందన్నారు. ఉత్స వంలో సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారని తెలిపారు. మహా కుంభాభిషేకంలో ఆలయ బంగారు గోపుర సంప్రోక్షణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభోట్ల దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో వేద పండితులు క్రతువులు నిర్వహిస్తారన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవా లకు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. చైర్మన్ చాంబర్లో సమీక్ష కుంభాభిషేకం ఏర్పాట్లపై జిల్లా అధికారులు, దుర్గగుడి అధికారులు చైర్మన్ చాంబర్లో సమీక్ష జరిపారు. గతంలో నిర్వహించిన కుంభాభిషేకం విశేషాలను ఆలయ వైదిక కమిటీ సభ్యులు కలెక్టర్కు వివరించారు. ఆలయ వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, ఎల్.దుర్గాప్రసాద్, ఎం.షణ్ముఖేశశాస్త్రి, వి.శ్రీధర్, ఈఈ కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
పాలిసెట్ పోస్టర్ ఆవిష్కరణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన కల్పటపు శేషశాయి, అడవి రాధాకృష్ణమూర్తి, రమాదేవి, ప్రసాద్ రూ.లక్ష విరాళంగా సమర్పించారు. మంగళవారం ఉదయం ఆలయానికి విచ్చేసిన వారు తొలుత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మదుసూధనరావును కలిసి విరాళం అందజేశారు. వారి కుటుంబీకులు కల్పటపు కామేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, బాల సూర్యనారాయణమూర్తి పేరిట రూ.లక్ష, కల్పటపు వీరభద్రయ్య, శేషమ్మ పేరిట రూ.లక్ష చొప్పున విరాళాలను అందజేశారు. దాతలను ఆలయ అధికారులు సత్కరించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడి యెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 98 కేంద్రాల్లో జరీక్షలు జరిగాయి. తొలి రోజు 38,211 మంది విద్యార్థులను ఆయా పరీక్ష కేంద్రాల్లో కేటాయించారు. 37,625 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 586 మంది గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అధి కారి ప్రభాకరరావు పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగ లేదని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నంఅర్బన్: క్రీడలు శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయని కృష్ణా జిల్లా క్రీడా ప్రాధి కార అధికారి కె.ఝాన్సీలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ.. బాలురకు పది, బాలికలకు ఆరు కిలోమీటర్ల దూరంలో మాస్ పార్టిసిపేషన్, టైమింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించామన్నారు. గన్నవరం, కంకి పాడు, గుడివాడ, గూడూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. అండర్–18 విభాగంలో విజేతలుగా నిలిచిన బాలురు, బాలికలు 28 మంది ఆదివారం విజయవాడ రూరల్ మండ లంలోని నున్న వద్ద జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలి పారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎం.అరుణ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యకు దరఖాస్తులు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.44 లక్షలుగా ఉండాలని, స్టేట్ సిలబస్లో చేరే విద్యార్థి జూన్ 2, 2020 నుంచి, 31 మే 2021 మధ్య జన్మించి ఉండాలని, అలాగే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ పాఠశాలలో చేరే విద్యార్థి రెండు ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చి 2021 మధ్య జన్మించి, ఐదు సంవత్సరాలు నిండి ఉండాలని పేర్కొన్నారు. వెబ్సైట్, స్వర్ణగ్రామ, వార్డు సచివాలయాలు, ఎంఈవో కార్యాలయం, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే చిరునామా ధ్రువీకరణకు ఏదైనా గుర్తింపు కార్డు, పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. విద్యార్థి జనన, కుల, వార్షికాదాయ ధ్రువీకరణ పత్రాలు జతచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 512 కార్పొరేట్, ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయని అందులో గత ఏడాది వెయ్యి మందికి ప్రవేశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. మార్చి 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, అదే నెల 25వ తేదీన లాటరీ తీసి విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 13 నుంచి 23వ తేదీ వరకూ ప్రవేశాల నిర్ణయం ఉంటుందని వివరించారు. ● హామీలు అమలు కాని పక్షంలో మార్చి 2న మహాధర్నా ● ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ మచిలీపట్నంఅర్బన్: అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆద్వర్యంలో సోమవారం కలక్టరేట్ ధర్నా చౌక్ వద్ద రిలే నిరహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మీ, సీహెచ్ నాంచారమ్మ మాట్లాడుతూ 2024 జూలైలో వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చిందని.. కానీ హామీల అమలులో ఆలస్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందని గద్దెనెక్కి రెండేళ్లు అవుతున్నా ఒక్కహామీ కూడా అమలు చేయలేదన్నారు. హామీల అమలు సాధనకు ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ప్రాజెక్టు, జిల్లా స్థాయిలలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ చేయని పక్షంలో మార్చి 2న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు సీహెచ్ జయరావు, లింగం ఫిలిప్, ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శలు జి. చిట్టి కుమారి, పి. ధనశ్రీ తదితరులు మద్దతు తెలిపారు. -
బరితెగించిన మట్టి దొంగలు!
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ దందాజి.కొండూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సహజ వనరుల దోపిడీనే ఆదాయ మార్గంగా ఎంచుకున్న టీడీపీ నాయకులు, చెరువుల్లో నిండు కుండలా నీళ్లు ఉండగానే మట్టి తవ్వకాల కోసం ముమ్మర ప్రయత్నాలు చేయడం విస్మయానికి గురి చేస్తోంది. వేసవిలో మూగ జీవాల తాగునీటి అవసరాల కోసం నిల్వ ఉన్న నీటిని బయటకు పంపి మట్టి తవ్వకాలు చేయాలనే కుట్రను రైతులే భగ్నం చేశారు. మైలవరం మండల పరిధి గణపవరంలోని తూర్పు చెరువులో మట్టి తవ్వకాలు చేయకూడదని హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు బరితెగించి నీళ్లను బయటకు పంపే ప్రయత్నం చేయగా.. రైతుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. కోర్టు నుంచి స్టే తెచ్చిన రైతులుగణపవరం గ్రామాన్ని ఆనుకొని ఎగువన 160.17ఎకరాల విస్తీర్ణంలో తూర్పు చెరువు ఉంది. ఈ చెరువు కింద ఆయకట్టు భూమి 500ఎకరాలు ఉంది. వర్షాధారంతో అడవి నుంచి ఈ చెరువుకు నీరు సరఫరా అవుతోంది. ఈ చెరువులో మట్టి తవ్వకాలు చేపడితే చెరువు లోతు ఎక్కువై నీరు పరిమితికి మించి నిల్వ ఉంటే కట్ట తెగి ఊరుమీద పడే అవకాశం ఉంది. అంతే కాకుండా మట్టి తవ్వకాల కోసం చెరువులో ఉన్న నీటిని వేసవికి ముందే బయటకు విడుదల చేస్తుండటంతో మూగజీవాలు ఇబ్బంది పడతాయని భావించిన రైతులు, చెరువులో చేపట్టిన మట్టి తవ్వకాలను నిలుపదల చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన రైతు ఉమ్మా నర్మదా ఆధ్వర్యంలో గత ఏడాది ఏప్రిల్ నెలలో హై కోర్టుకు వెళ్లారు. రైతుల అభ్యర్థన మేరకు ఈ అంశంపై గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ చెరువులో ఎటువంటి తవ్వకాలు చేయొద్దని ఈ ఏడాది జనవరి 28వ తేదీన హైకోర్టు శాశ్వత ఉత్తర్వులను సైతం జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత చెరువుకు ఉన్న రెండు తూములలో ఒక తూము తాళపు చెవిని స్థానిక రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో తూము తాళపు చెవి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి దగ్గరే ఉంది. దీనితో కోర్టు ఆర్డర్ని సైతం పక్కనబెట్టిన టీడీపీ నాయకుడు తన దగ్గర ఉన్న తాళపు చెవిని వినియోగించి ఈ నెల 16వ తేదీన తూము తెరిచి చెరువు నుంచి నీటిని అనవసరంగా బయటకు వదిలారు. దీనితో గ్రామానికి చెందిన రైతుల ఫిర్యాదు మేరకు కోర్టు ఆర్డర్ని పాటిస్తూ రెవెన్యూ అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. ఆ తర్వాత చెరువులో నీటి విడుదలను అడ్డుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన 480మంది రైతులు, గ్రామస్తులు సంత కాలను చేసి ఈ నెల 20వ తేదీన ఇరిగేషన్శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని టీడీపీ నాయకులు ఈ నెల 21వ తేదీన రాత్రి మరలా తూము తెరిచి చెరువులో నీటిని బయటకు విడుదల చేశారు. దీనితో మరలా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. గ్రామస్తుల ఆందోళన.. టీడీపీ నాయకులు తూర్పు చెరువులో విచ్చలవిడిగా తవ్వకాలు చేయడం వల్ల చెరువులోతు పెరిగి పరిమితికి మించి నీరు నిల్వ ఉండి గత ఏడాది చెరువు కళంగి వద్ద కట్ట తెగడంతో నీరు గ్రామం మీదకు వచ్చింది. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. మరలా అటువంటి ఘటనలే జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేసవి సమీపిస్తున్న వేళ ఎగువన ఉన్న చెరువులో నీటిని బయటకు పంపితే గ్రామంలో భూగర్భజలాలు పడిపోయి తాగునీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉందని, వేసవిలో మూగజీవాలు తాగునీటి అవసరాలకు నీరు లేకపోతే నరకయాతన పడతామని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గణపవరం తూర్పు చెరువును చెరపట్టిన టీడీపీ నాయకులు మట్టి తవ్వకాల కోసం నీటిని బయటకు పంపే ప్రయత్నాలు రైతుల ఫిర్యాదుతో నీటి విడుదలను అడ్డుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చెరువులో తవ్వకాలు చేయవద్దని హైకోర్టు నుంచి ఉత్తర్వులు అనుమతి లేకుండా నీటిని విడుదల చేస్తే ఊరుకునేది లేదు గణపవరం తూర్పు చెరువులో అనవసరంగా చేస్తున్న నీటి విడుదలను అడ్డుకున్నాం. అదే కొనసాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చెరువులో అక్రమ మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నాం. చెరువులో ఎటువంటి కార్యకలాపాలు చేయాలన్నా అనుమతి పొందిన తర్వాతే చేయాలి. – రాజశేఖర్, ఇరిగేషన్ ఏఈ, మైలవరం -
ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారత్, చైనా కీలకం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారత్, చైనా ప్రధాన శక్తులుగా ఎదుగుతున్నాయని, 21వ శతాబ్దం ఆసియాదేనని ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి మీడియా సలహాదారుడు డాక్టర్ సంజయబారు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సోమవారం కనకదుర్గాంబ అండ్ డాక్టర్ జంధ్యాల దక్షిణామూర్తి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్, విజయవాడ 13వ స్మారకోపన్యాసం ‘అభివృద్ధి చెందుతున్న ఆసియాలో అభివృద్ధి చెందుతున్న భారతదేశం‘ అనే అంశంపై జరిగింది. ముఖ్య అతిథి సంజయబారు మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ ఆర్థికవృద్ధి సుమారు ఏడు శాతం ఉందని, కానీ ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలంటే అది 10 నుంచి 12 శాతం వరకు పెరగాలన్నారు. ఉత్పత్తి పెరిగితే ఉపాధి పెరుగుతుందని, పరిశ్రమలు, తయారీ రంగం అభివృద్ధి చెందితేనే పెద్ద స్థాయిలో ఉద్యోగాలు సృష్టించవచ్చన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జంధ్యాల శంకర్, ట్రస్టీలు డాక్టర్ సి.నాగేశ్వరరావు, కె.దుర్గాప్రసాద్(వెస్టిన్ కాలేజ్ డైరెక్టర్) తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి మీడియా సలహాదారుడు డాక్టర్ సంజయబారు -
ఆలయాలతో గ్రామాలకు ఆధ్యాత్మిక బలం
పామర్రు(పమిడిముక్కల): గ్రామ జీవనానికి ఆలయాలు ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ అన్నారు. పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని (గౌడ రామాలయం) సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రతిష్టా మహోత్సవాల పోస్టర్లను, కరపత్రాలను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ట మహోత్సవాలను విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తున్నామని, ఆలయ కార్యకలాపాలకు తన మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి పీఏసీఎస్ మాజీ చైర్మన్ బొర్రా వీర వెంకట రామ్మోహనరావు(చిన్నబాబు) ఆధ్వర్యంలో మొత్తం విరాళాలు రూ.3,61,579ను మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. బొర్రా వీర వెంకట రామ్మోహనరావు రూ.2,25,999, ఈడే వెంకట సత్యనారాయణ రూ.1,00,116, కోకా మాధవరావు రూ.10,116, కాగిత సుబ్బారావు రూ.10,116, ఈడే జంగమయ్య రూ.10,116, పరిమికాయల విజయలక్ష్మి రూ.5,116 స్వామికి విరాళాలుగా అందజేశారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్, వైస్ ఎంపీపీ గంజాల సీతారామయ్య, మండల ప్రధాన కార్యదర్శి గరికపూడి బుజ్జి, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ -
ఆస్తి వివాదాలపై అధిక ఫిర్యాదులు
పటమట(విజయవాడతూర్పు): జిల్లా పోలీస్ కమిషనరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కార్యక్రమంలో మొత్తం 81 ఫిర్యాదులు అందాయి. డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కమిషరేట్లో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ఫిర్యాదులను స్వీకరించారు. భూ/ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 48, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 08, వివిధ మోసాలపై 02, మహిళా సంబంధిత నేరాలపై 04, దొంగతనాలపై 03, ఇతర వివిధ సమస్యలపై 16 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ఫిర్యాదుల పరిష్కారానికి సహకరించారు. చట్ట పరిధిలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఉదయరాణి చెప్పారు. ఆటోనగర్(విజయవాడతూర్పు): భారతీనగర్ సర్వీస్ (తూర్పువైపు) రోడ్డులో ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్ర పక్కన జిరాక్స్షాపు తెరచి ఉంచారు. నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రం సమీపంలో ఇలాంటివి తెరిచి ఉండకూడదు. పరీక్ష జరిగే సమయంలో తప్పనిసరిగా మూయించాల్సి ఉంది. అయితే అధికారులు, పోలీసులు అలాంటి చర్యలేమి తీసుకోలేదు. దీనిని పలువురు తప్పుబడుతున్నారు. రామవరప్పాడు: అతి ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ అధిరోహణకు విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జెడ్పీ పాఠశాల దివ్యాంగ విద్యార్థి గట్టెం విశ్వాస్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సోమవారం విశ్వాస్ను పాఠశాల హెచ్ఎం తాయారు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా తాయారు మాట్లాడుతూ ఎవరెస్ట్ అధిరోహణే లక్ష్యంగా జాతీయ స్థాయి హై ఆల్టిట్యూడ్ శిక్షణకు విశ్వాస్ ఎంపికై నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జోనల్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఎంపికై , కడప జిల్లా గండికోటలో నెల రోజుల పాటు శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్లోని లడక్లో ట్రైనింగ్కు ఎంపికై నట్లు వివరించారు. శారీరక లోపం ఉన్నా ఏమాత్రం అధైర్యపడకుండా పట్టుదలతో ఇంతటి ఘనత ను సాధించడం అభినందనీయమన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఆ సినిమాకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్ర చేపట్టినట్లు హీరో శివ కందుకూరి తెలిపారు. బెంజిసర్కిల్లోని ట్రెండ్సెట్మాల్లో ప్రేక్షకులతో కలిసి హీరో శివ కందుకూరి, హీరోయిన్ తేజు అశ్విని, దర్శకుడు ప్రమోద్ హర్ష చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ప్రేక్షకులను నేరుగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో శివ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న చిత్రాన్ని తప్పనిసరిగా ఆదరిస్తారనడానికి తమ చిత్రమే నిదర్శనం అన్నారు. అనంతరం హీరోయిన్ తేజు అశ్విని మాట్లాడుతూ తాను విజయవాడ వాసినే అని, ఇక్కడి ప్రేక్షకులను నేరుగా కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పటమట(విజయవాడతూర్పు): రాష్ట్ర బడ్జెట్లో బీసీ కార్పొరేషన్లకు జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.మారేష్ డిమాండ్ చేశారు. విజయవాడలోని పటమటలో సోమవారం కుల సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మారేష్ మాట్లాడుతూ బీసీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందజేయాలని కోరారు. సీఎం చంద్రబాబు బీసీ కార్పొరేషన్లపై రివ్యూ నిర్వహించి ఇంకా వెల్లడించని కులాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆదరణ పథకాన్ని ప్రారంభించాలని, రాష్ట్రవ్యాప్తంగా బీసీ స్టడీ సర్కిళ్లకు బడ్జెట్ పెంచాలన్నారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్ నూటికి నూరు శాతం బీసీలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి
స్థాయీ సంఘ సమావేశంలో వీఎంసీ మేయర్ భాగ్యలక్ష్మి పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఆమె స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశపు అజెండాలో మొత్తం 32 అంశాలు ప్రతిపాదనకు రాగా వాటిలో 23 అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఒక అంశాన్ని వాయిదా వేయగా, నాలుగు అంశాలు ర్యాటీఫై చేస్తూ తీర్మానించారు. ఒక అంశాన్ని రికార్డు చేయగా మరో అంశాన్ని ధ్రువీకరించారు. ప్రధానాంశాలివే.. ● విజయవాడలోని సర్కిల్–2 పరిధిలో ఉన్న లెనిన్ సెంటర్ వద్ద శిల్కోషోరూం ఎదురుగా వీఎంసీ పార్కింగ్ స్థలాన్ని లీజు పొడగింపునకు వచ్చిన ప్రతిపాదనను సభ్యులు తిరస్కరిస్తూ తీర్మానించారు. ● నగరపాలక సంస్థ పరిధిలోని సర్కిల్–1లో కబేళాను ఏడాదిపాటు లీజుకు ఇచ్చేందుకు వచ్చిన ప్రతిపాదనను వాయిదా వేస్తూ తీర్మానం చేశారు. ● నగరపాలక సంస్థలో హార్టీకల్చర్ ఆఫీసర్(హెచ్వో)లుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు రూ. 60వేలు వేతనాన్ని పెంచుతూ వచ్చిన తీర్మానంపై సభ్యులు ఆమోదం తెలిపారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థి రైలు కింద పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం జిల్లా బురుజుపల్లె తండాకు చెందిన మూడావత్ గణేష్ నాయక్(18) పెనమలూరులోని ప్రైవేటు కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. గణేష్ నాయక్ తల్లిదండ్రులు ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్కు రూ. 2.6లక్షలు, ద్వితీయ సంవత్సరానికి రూ. 2.85 లక్షలు చెల్లించి చదివిస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదు. ఇదే విషయాన్ని గణేష్నాయక్ తలిదండ్రులకు ఫోన్ చేసి తాను ఎంత కష్టపడి చదివినప్పటికీ మార్కులు రావటం లేదని.. గుర్తుండటం లేదని చెప్పాడు. దీనికి తలిదండ్రులు గుర్తున్నదే రాయి అని ధైర్యం చెప్పారు. అంతర్మథనంతో అఘాయిత్యం.. అయినప్పటికీ రూ. లక్షలాది రూపాయల వ్యయంతో తనను చదివిస్తున్నారని.. తాను ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోతున్నానని మథన పడుతున్నాడు. మంగళవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి స్టడీ అవర్ నుంచి బయటకు వచ్చిన గణేష్ నాయక్ విజయవాడ రైల్వేస్టేషన్కు చేరుకున్నాడు. 7వ నంబర్ ప్లాట్ఫాంలో ఆదివారం రాత్రి రైలు కదులుతున్న సమయంలో ఒక్కసారిగా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. తల్లిదండ్రుల అనుమానం.. గణేష్నాయక్ తల్లిదండ్రులు ఈ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో ఏదో గొడవ కారణంగానే ఇది జరిగిందని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారించి, న్యాయం చేయాలని కోరుతున్నారు. గుణదల(విజయవాడ తూర్పు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన గడ్డం సుమంత్(28) గత కొంత కాలంగా మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద స్వీట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మూడు నెలల క్రితం పరిచయమైన రామలక్ష్మి అనే మహిళతో సహజీవనం చేస్తూ.. ఇద్దరూ అదే ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య వ్యక్తి గత విషయాలపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచీ ఇంట్లోనే ఉన్న సుమంత్ ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటికి అక్కడకు వచ్చిన రామలక్ష్మి అతనిని చూసి కంగారు పడి కేకలు వేసింది. అంతలో అక్కడకు చేరుకున్న స్థానికులు మృతుడిని కిందకి దించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
సిబ్బంది అనుచిత ప్రవర్తనతో ఆలయ ప్రతిష్టకు దెబ్బ
దుర్గగుడి ఈవో శీనానాయక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది తీరు, కాంట్రాక్టర్ల వ్యవహార శైలి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని దుర్గగుడి ఈవో శీనానాయక్ అన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులో సమావేశంలో నిర్వహించగా, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఆలయ స్థానం దిగజారుతోంది.. ఈవో మాట్లాడుతూ వివిధ సేవల కాంట్రాక్టర్ల ప్రవర్తనతో దేవస్థానానికి అపకీర్తిని కలుగుతోందన్నారు. కొబ్బరి కాయలు కొట్టే చోట, క్లోక్రూమ్, చెప్పుల స్టాండ్ల వద్ద అదనపు వసూళ్లు, పార్కింగ్ కాంట్రాక్టర్ దురుసు ప్రవర్తనతో ఆలయంలో ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రయోజనం లేకుండా పోతోందన్నారు. భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అసంతృప్తి ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా ప్రభుత్వం దృష్టికి వెళ్తోందన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఇంద్రకీలాద్రి ర్యాంకింగ్ వెనుకబడిపోతోందన్నారు. భక్తుల రద్దీ సమయాల్లో వారు ఒత్తిడిలో ఉంటారని, వారిని గద్దించడం, విసుక్కోవడం వంటివి చేయకూడదని సూచించారు. భక్తుల పట్ల ప్రవర్తనలో మార్పు రాకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో ఏసీ రంగారావు, ఏఈవో వెంకటరెడ్డి, చంద్రశేఖర్, తిరుమలేశ్వరరావు ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం సోమవారం కనులపండువగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో కల్యాణ వేదికపై కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉపాలయంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం రాజగోపురం ఎదుట కల్యాణోత్సవం జరిగింది. దేవస్థానం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించగా, కమిటీ చైర్మన్ రాధాకృష్ణ కల్యాణంలో పాల్గొన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న వారికి మేలు జరుగుతుందని, వివాహం కానివారికి వివాహం, సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని అర్చకులు పేర్కొన్నారు. బస్టాండ్(విజయవాడ పశ్చిమ): రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ ( ఏపీ పీటీడీ) మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీస్ ఆఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డి.అంకినీడు, జోనల్, రీజనల్ నాయకులు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. వారి వెంట సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు, అడిషనల్ జనరల్ సెక్రటరీ కొండారెడ్డి, రవి తదితరులు ఉన్నారు. -
మామిడిపై పగమంచు
మధురఫలం మామిడికి మంచు దెబ్బ తగిలింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం లేదు. ప్రస్తుతం మామిడి తోటలకు ఓ వైపు మంచు, మరో వైపు తెగుళ్ల ప్రభావంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏడాది కష్టం నేలపాలయ్యే పరిస్థితి ఉండి.. దిగుబడి ఆశలు రాలిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెనుగంచిప్రోలు: మామిడి రైతుల ఆశలపై మంచుతెరలు కమ్ముకోవడంతో అవస్థలు తప్పడం లేదు. కొంతకాలం క్రితం వరకు మామిడి తోటలు పూతతో కళకళలాడాయి. దిగుబడి బాగుంటుందని, కష్టాలు తీరతాయని మామిడి రైతులు భావించారు. ఇంతలోనే నల్లతామర పురుగుకు తోడు తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించడం.. ప్రతికూల వాతావరణం ఎదురుకావడంతో పూతంతా మాడి పోయింది. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 57 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో తోటలు అధికంగా ఉన్నాయి. కృష్ణా నది, మునేరు, పాలేరు ఏరుల పరీవాహక ప్రాంతాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. పూతకు నష్టం వాతావరణ పరిస్థితులు, మంచు ప్రభావానికి మామిడి పంటను చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసంతో తేనె మంచు తెగులు, బూడిద తెగులు, తామర పురుగు విజృంభించి పూతకు నష్టం కలిగిస్తున్నాయి. తేనె మంచు పురుగు లేత ఆకులు, పూతపై చేరి రసం పీల్చుతుండటంతో ఎండిపోయి పూత రాలిపోతోందని రైతులు దిగులుపడుతున్నారు. ఇవి విడిచే జిగట పదార్థంతో నల్లబూజు ఏర్పడి పూత మాడిపోయినట్లు కనిపిస్తోంది. బూడిద తెగులు పూతపై తెల్లటి పౌడర్ లాంటి పొర ఏర్పడి క్రమంగా అది గోధుమ రంగులోకి మారి పూత ఎండిపోతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో చలి, పగటి పూట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది తీవ్రమవుతుంది. అకాల వర్షాలు, మంచు కురవడం, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పూత మాడిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రైతు పూత వచ్చిన నాటి నుంచి దాన్ని కాపాడుకోవటానికి 5 నుంచి 10 సార్లు రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. చివరిలో తామర పురుగు ఆశించటంతో చేసిన ప్రయత్నమంతా వృథా అవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మందులు కొట్టిన ప్రతిసారి ఎకరానికి రూ.3 వేల నుంచి రూ.5 వేలు ఖర్చు అవుతోందని రైతులు వాపోతున్నారు. ఏటా మామిడి పంటతో నష్టపోతున్నామని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు అంటున్నారు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు తొలి రోజు 945 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకూ ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షలకు సంబంధించి 36,567 మంది హాజరుకావాల్సి ఉండగా, 35,622 మంది విద్యార్థులు హాజరయ్యారు. పోలీసు శాఖ ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు చేపట్టింది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగాయి. జిల్లాలో నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించాయి. జిల్లాలో 36,928 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 39,980 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 76,908 మంది విద్యార్థులకు 98 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి బి.ప్రభాకరరావు తెలిపారు. కలెక్టర్ పరిశీలన నగరంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, శారద కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. తొలి రోజు 945 మంది విద్యార్థులు గైర్హాజరు -
ముగిసిన మహిళా ఆర్చరీ ర్యాంకింగ్ టోర్నమెంట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్న 3వ ఎన్టీపీసీ కేలో ఇండియా ఆర్చరీ నేషనల్ ర్యాంకింగ్ (మహిళల) టోర్నమెంట్ సోమవారం ముగిసింది. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో రికర్వ్, కాంపౌండ్ అంశాల్లో పోటీలు జరిగాయి. ఆది, సోమ వారాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు సోమవారం బహుమతులను అందజేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, విజయవాడ నగర పాలక సంస్థ స్పోర్ట్స్ కమిటీ మాజీ చైర్మన్ దోనేపూడి శంకర్, హైకోర్టు న్యాయవాదులు ఎన్.సాయి శంకర్, పి.రాజశేఖర్ విజేతలకు బహుమతులను అందజేశారు. చెరుకూరి ఓల్గా అర్చరీ అకాడమీ క్రీడాకారులు వి.స్ఫూర్తి సబ్జూనియర్ కాంపౌండ్ విభాగంలో బంగారు పతకం, కె.రుషికీర్తన జూనియర్ కాంపౌండ్ విభాగంలో రజత పతకం సాధించింది. ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ 11 మంది టెక్నికల్ సిబ్బంది పర్యవేక్షణలో టోర్నమెంట్ జరిగిందన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.వెంకట రమణ, సంఘ సభ్యులు అభినందించారు. -
తిరుపతమ్మ తిరునాళ్లకు విస్తృత ఏర్పాట్లు
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ చిన్న తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 4 నుంచి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు నుంచి పసుపు, కుంకుమల బండ్లు రాక ప్రధాన ఘట్టంగా నిలవనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. మునేరులో జల్లు స్నానాలు, పలు చోట్ల భక్తుల సౌకర్యార్థం చేతి పంపులు, శుద్ధి చేసిన తాగు నీటికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. పలుచోట్ల షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి రోజు అఖండ జ్యోతి స్థాపనతో ప్రారంభం చిన్న తిరునాళ్లలో మొదటి రోజు మార్చి 4న ఉదయం 6.19 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవుతాయి. నిత్య కల్యాణ మూర్తులకు అభిషేకం చేస్తారు. రెండో రోజు గ్రామోత్సవం తిరునాళ్లలో రెండో రోజు మార్చి 5వ తేదీ రాత్రి 7.02 గంటలకు ఉత్సవమూర్తుల రథోత్సవం (గ్రామోత్సవం) కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించనున్నారు. మూడో రోజు దివ్య ప్రభోత్సవం మూడో రోజు మార్చి 6వ తేదీ రాత్రి 10.02 గంటలకు దివ్య ప్రభోత్సవం వైభవంగా జరగనుంది. సుమారు 90 అడుగుల దివ్యప్రభపై ఉత్సవమూర్తులను ఉంచి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయిస్తారు. నాలుగోరోజు అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమలు చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు నాలుగో రోజు మార్చి 6న అనిగండ్లపాడు గ్రామం నుంచి రాత్రి 7.32 గంటలకు ప్రారంభం కానున్నాయి. అమ్మవారి పుట్టింటి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి నుంచి ఏటా పసుపు కుంకుమలు బండ్లపై తీసుకు రావడం ఆనవాయితీగా వస్తోంది. మార్చి 8న భక్తుల బోనాల సమర్పణతో చిన్న తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి. 4 నుంచి ఉత్సవాలు ప్రారంభం 7న అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు రాక చిన్న తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు, ప్రసాదాల కౌంటర్లు, తదితర ఏర్పాట్లను ఆలయ ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్నారు. మునేరులో షవర్బాత్లు, తలనీలాలు తీసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరగనున్నాయి. భక్తులతో పాటు గ్రామస్తులు, అధికారులు సహకరించి విజయవంతం చేయాలి. తిరునాళ్లలో ఆలయం వద్ద రాత్రి సమయంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. – బి.మహేశ్వరరెడ్డి, ఆలయ ఈఓ


