breaking news
bjp
-
మల్లిఖార్జున ఖర్గే Vs జేపీ నడ్డా..దద్దరిల్లిన పార్లమెంట్..
-
దేవుడి విరాళాలే కాపాడలేదు పేపర్ లీక్ ఎలా అరికడతారు..?
-
ప్రకాష్ రాజ్ను చేపలకు ఆహారంగా వేస్తా: బీజేపీ ఎమ్మెల్యే
ఉడుపి: ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్కు కర్ణాటకలోని ఉడుపికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్పాల్ సువర్ణ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. కళాకారుల మదిలో విషబీజాలు నాటడం మానుకోవాలని, లేనిపక్షంలో అరేబియా సముద్రంలో చేపలకు ఆహారంగా మారుస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఇటీవల 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి నిరసనలో ప్రకాశ్ రాజ్ పాల్గొని, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో యశ్పాల్ సువర్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్మంతర్ వద్ద జరిగిన నీట్ నిరసనలో పాల్గొన్నవారు అసలైన విద్యార్థులు కారనీ, వారి నేపథ్యాన్ని పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.ఇలాంటి రాజకీయాలు కొనసాగితే బీజేపీ కార్యకర్తలు తగిన రీతిలో స్పందిస్తారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన వీ. సునీల్ కుమార్తో సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు 'ఇండియా' కూటమి నేతలైన రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ తదితరుల ముఖాలతో ఉన్న బొద్దింకల ప్లకార్డులపై క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం గమనార్హం.ఇది కూడా చదవండి: కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్! -
ఆపదలో ఆదుకున్నది కేటీఆర్ అన్న మాత్రమే
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కష్టకాలంలో తమకు అండగా నిలిచి, దేవుడిలా ఆదుకున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రమేనని నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులు ఆవేదనతో తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నాయకులు తమను కేవలం వాడుకున్నారే తప్ప ఎలాంటి సాయం యలేదని మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హామీలు ఇచ్చి మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్ గోపాల్ కుటుంబ సభ్యులు మాట్లాడూతూ... ‘మమ్మల్ని అందరూ రాజకీయంగా వాడుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మా వద్దకు వచ్చి హామీలు ఇచ్చి వెళ్లిపోయారే తప్ప సహాయం చేయలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మా పక్క ఊరికి (రెండు కిలోమీటర్ల దూరంలోకి) వచ్చినా కనీసం పరామర్శించలేదు. మీకు రూ. 20 కోట్లు ఇప్పిస్తా’ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ, రూపాయి సాయం చేయలేదు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వారి పీఏలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదు’ అని ఆరోపించారు. బండి సంజయ్ విజయసంకల్ప యాత్ర చేసిన సమయంలో కూడా మమ్మల్ని కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదని తెలిపారు.కుటుంబ సభ్యుడిలా అండగానిలిచిన కేటీఆర్ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కేటీఆర్ అన్న స్వయంగా డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా చూశారు. ‘నేను మీ ఇంట్లో పెద్ద అన్నలాంటివాడిని, ఆస్పత్రి ఖర్చులు, ఆర్థికసాయం ఏది కావాలన్నా నేను చూసుకుంటా’ అని ధైర్యం చెప్పారని తెలిపారు. ‘చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని పరామర్శించిన ఏకైక నాయకుడు కేటీఆర్ మాత్రమే అని, కల్వకుంట్ల కవిత అక్క కూడా మాతో మాట్లాడి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు’ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ కుటుంబానికి కష్ట సమయంలో నిజమైన అండగా నిలిచింది కేటీఆర్ మాత్రమేనని, అందుకే తాము ఎప్పటికీ ఆయననే నమ్ముతామని స్పష్టం చేశారు. మాట్లాడిన వారిలో గోపాల్ భార్య గంధం లావణ్య, తల్లి బాలవ్వ, కూతుళ్లు అక్షిత, నిఖిత, కొడుకు అభినయ్, తమ్ముడు గొర్రె మహేశ్ ఉన్నారు. -
కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చింది. కంగనా వ్యాఖ్యలను ఆమె పార్టీ కూడా సీరియస్గా తీసుకోదని సౌరవ్ దాస్ అన్నారు. నేతలు ఉపయోగించే భాష గౌరవప్రదంగా ఉండాలని కోరారు. దేశ ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా జెన్జీ చేసింది.అంతకుముందు సీజేపీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసన వీడియోలు వాంతి వచ్చేలా ఉన్నాయని సోషల్ మీడియా పోస్టులో అన్నారు. కాక్రోచెస్ మాట్లాడే విధానం,వాడుతున్న భాష అసభ్యంగా ఉన్నాయి. 75ఏళ్ల ప్రధాని, ఆయన తల్లిపైనా నోరుపారేసుకున్నారు. అలా మాట్లాడే వారిని ఏ కోణంలో విద్యార్థులుగా చూడాలి’అని పోస్టులో పేర్కొంది. కంగనా చేసిన వ్యాఖ్యలపై సీజేపీ పైవిధంగా స్పందించింది. -
నన్ను అడగొద్దు.. డిలీట్ చేయను: బీజేపీ ఎంపీ కూతురి సంచలన పోస్ట్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆయన స్వంత రాష్ట్రం ఒడిశాకే చెందిన ఓ బీజేపీ ఎంపీ కూతురు సంచలన పోస్ట్తో రాజకీయ దుమారం రేపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబురంగా ఆమె ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ తొలగించాలంటూ తనపై ఒత్తిడి వస్తోందంటూ ఆమె అందులో పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సారంగి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఓ వార్తా హెడ్డింగ్ స్క్రీన్షాట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అర్చిత.. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. “డీపీ (ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశించి..) పీఏ నా తల్లికి మెసేజ్ చేసి ఈ స్టోరీని డిలీట్ చేయమని అడుగుతారని తెలుసు.. కానీ నేను డిలీట్ చేయను. ఇలాంటి విషయం ఇంతకుముందు కూడా జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. కాబట్టి అడగాల్సిన అవసరం లేదు.. నేను డిలీట్ చేయను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయినట్లు సమాచారం.ఎవరీ తల్లీకూతుళ్లు?అర్చిత సారంగి తల్లి అపరాజిత సారంగి ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో భువనేశ్వర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న అపరాజిత సారంగి.. బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక అర్చిత ఎంబీఏ పూర్తి చేసుకుంది. అంతకు మించి ఆమె గురించి వివరాలేవీ నెట్టింట సమాచారం. అయితే తన కుమార్తె చేసిన పోస్ట్ విషయంలో ఆమె మాత్రం ధర్మేంద్ర ప్రధాన్కు మద్దతుగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమె సమర్థిస్తూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.Our daughter, Archita, has been selected for the MBA course at UNIVERSITY OF OXFORD. We convey our deep sense of gratitude to all our friends and well wishers.Jai Jagannath ! 🙏 pic.twitter.com/sNejUZYf6s— Aparajita Sarangi, MP,( Lok Sabha) Bhubaneswar (@AprajitaSarangi) March 9, 2024ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు?ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అవకతవకలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆయన.. విద్యార్థుల ఆకాంక్షలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కొత్త చర్చకు కారణంమంత్రికి మద్దతుగా ఆమె తల్లి నిలబడగా.. అదే సమయంలో కుమార్తె మాత్రం రాజీనామా వార్తను షేర్ చేయడం, దాన్ని తొలగించనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అటు అస్సాంలోనూ ఎన్డీయే కూటమి మంత్రి కేశబ్ మహంతా(అస్సాం గణ పరిషత్ పార్టీ) కూతురు దిసాబా కూడా ఇలాగే నీట్ నిరసనల్లో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ నినాదాలు చేశారు. ఇలా కుటుంబంలోనే.. అదీ అధికార పార్టీలకు చెందిన వాటిలో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. -
రాజీనామా వెనుక..మోదీ మ్యాజిక్.. BJP అసలు వ్యూహం అదేనా..
-
మోదీపై అభ్యంతకర పోస్టర్.. నటిపై ఫిర్యాదులు
కోల్కతా:ప్రధాని నరేంద్ర మోదీపై 'అసభ్యకరమైన' పోస్టర్ను ప్రదర్శించారనే ఆరోపణలతో ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు నమోదైంది. కోల్కతాలో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనలో మోదీ చిత్రపటాన్ని అసభ్యకరరీతిలో ప్రదర్శించారని నటి శ్రీలేఖపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.నిన్న (ఆదివారం) ఆనంద్పూర్ పోలీసు స్టేషన్లో బీజేపీ నాయకురాలు కేయా ఘోష్, నటి శ్రీలేఖ మిత్రపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేవలం ఒకే చోట కాకుండా బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్తో సహా పలు జిల్లాల్లోని వివిధ పోలీసు స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు దాఖలైనట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ అంశమై బీజేపీ నేత మాట్లాడుతూ.. "దేశ ప్రధానిని అవమానించేలా ఒక అసభ్యకరమైన పోస్టర్ను ప్రదర్శించినందుకు నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు దాఖలైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. శ్రీలేఖ మిత్రను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి" అని పేర్కొన్నారు.నిరసన ప్రదర్శన నేపథ్యంNEET ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోల్కతా రోడ్లపై భారీ నిరసన ప్రదర్శన జరిగింది.ఈ నిరసనలో శ్రీలేఖ మిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన/అసభ్యకరమైన చిత్రంతో ఉన్న పోస్టర్ను పట్టుకున్నట్లు ఫోటోలు వెలువడ్డాయి.అయితే దీనిపై శ్రీలేఖ మిత్ర తన సోషల్ మీడియా పేజీలో ఒక వీడియో స్టేషను విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు."నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి; నన్ను ఉరిశిక్షకు పంపాలనుకుంటే ఉరిశిక్షకు పంపండి. దీనికి వ్యతిరేకంగా కూడా కచ్చితంగా ఒక ఉద్యమం వస్తుందని నేను నమ్ముతున్నాను" అని ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. -
ప్రభుత్వం మీ సొంత జాగీరు కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని సొంత జాగీరులా నడపొద్దని బీజేపీ–ఆర్ఎస్ఎస్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకవర్గానికి ఒక హెచ్చరిక అని స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవినీతికి మారుపేరైన ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి నుంచి తప్పుకోవడం మంచి పరిణామం అని స్పష్టంచేశారు. విద్యార్థుల నిరసనను ప్రధాని మోదీ. ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గతానికి’, భారతదేశ భవిష్యత్తుకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తు గతాన్ని ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. న్యాయం కోసం ఆందోళన చేసిన విద్యార్థులను క్రూరంగా హింసించారని, వారికి ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన హింసకు, వారిపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడానికి అనుమతించినందుకు హోంశాఖ మంత్రి అమిత్ షానే ప్రత్యక్ష బాధ్యులు అని పేర్కొన్నారు. విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ అంగీకరించదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ప్రకటించారు. అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారు భారతదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుని, చెదపురుగుల మాదిరిగా దానిని లోపలి నుంచే డొల్లగా చేస్తోందని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆ చెదపురుగును తొలగించాలని తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను, దేశ భవిష్యత్తును కాపాడడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ భవిష్యత్తు అయిన మన విద్యార్థుల విజయమని అన్నారు. అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారంటూ విద్యార్థులను ప్రశంసించారు. విద్యా విధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భారత విద్యా వ్యవస్థపై ఆర్ఎస్ఎస్ పట్టు తొలగాలని చెప్పారు. విద్యా వ్యవస్థను సంస్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది గానీ ప్రభుత్వం ఆ పని చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతదేశ విద్యా వ్యవస్థపై నేడు దాడులు జరుగుతున్నాయని, కొందరు కబ్జా చేస్తున్నారని, ప్రైవేటీకరిస్తున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. నేటి యువత ఉద్యమం విద్యా వ్యవస్థలో అక్రమాలకు, నిరుద్యోగానికి, దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు వ్యతిరేకంగా వచ్చిన స్పందన అని వ్యాఖ్యానించారు. దేశంలో ఉద్యోగ కల్పన వ్యవస్థ, విద్యా వ్యవస్థ, సంస్థాగత వ్యవస్థలు కనుమరుగైపోయాయని, అందుకే యువత రోడ్డెక్కుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికీ వ్యక్తిగత జాగీరు కాదని, ఇది ముమ్మాటికీ ప్రజలకు చెందినదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగిసిపోలేదని రాహుల్ అన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల భద్రత, సంస్కరణల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులు, కార్మికులు, పేదలు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన ప్రతి వర్గం కూడా తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధమైన మార్గంలో ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందు జంతర్మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న వారిని రాహుల్ కలిశారు. విద్యార్థులపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ!
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థి ఆందోళనల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సీజేపీ విధించిన 72 గంటల డెడ్లైన్, యువత నుంచి పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత.. మోదీ ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసింది.నిన్న శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో జరిగిన రెండో విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అయితే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చిచెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకునేందుకు 72 గంటల గడువు ఇస్తున్నామని.. లేనిపక్షంలో జూలై 20 నాటి తరహాలో మరోసారి పార్లమెంట్ ముట్టడికి దిగుతామంటూ సీజేపీ హెచ్చరించింది.నడ్డా, జితేంద్ర సింగ్ తాము నాయకత్వాన్ని సంప్రదించి ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత తెలియజేస్తామని మాత్రమే బదులిచ్చారు. విఫలమైన చర్చల అనంతరం.. నడ్డా, జితేంద్ర సింగ్లు పరిణామాలపై హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు వర్గాలు తెలిపాయి. తెరవెనుక చర్చలు జరుగుతుండగానే, నిరసనకారులకు గట్టి సంకేతం పంపే ప్రయత్నంగా విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెందిన 47 మంది అధికారులను తొలగించింది.ఎన్టీఏ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని నియమించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేయడం, పేపర్ లీక్ కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం సహా పరీక్షా విధానంలో సంస్కరణలను కూడా కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చర్యలేవీ నిరసనకారులను సంతృప్తి పరచలేకపోయాయి.శనివారం మధ్యాహ్నం కేంద్రం సీజేపీతో చర్చల ముందు.. నడ్డా, జితేంద్ర సింగ్లు మళ్లీ అమిత్ షాను కలిశారు. అదే సమయంలో ప్రధాన్ తన రాజీనామాను ప్రధాని మోదీకి పంపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త ప్రసారం కావడం ప్రారంభమైన తర్వాతే నడ్డా, జితేంద్ర సింగ్.. సీజేపీ ప్రతినిధులను మళ్లీ కలిశారు. మూడో విడత చర్చలు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో జరిగాయి.ఒక వైపు, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనలు, మరోవైపు దేశవ్యాప్తంగా బలపడుతున్న యువత ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. ఈ కేవలం రాజకీయ ఆందోళన కాకుండా భవిష్యత్ తరానికి సంబంధించిన యువ ఉద్యమం కావడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం వెనుకాడింది. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సమర్పించారు. ప్రధాన్ నిష్క్రమణతో సీజేపీ పట్టువీడింది. తన ఆందోళనను విరమించింది.ఆందోళనకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని.. నీట్ పేపర్ లీక్ ఉదంతం తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నరేంద్ర మోదీ హయాంలో ప్రజా వ్యతిరేకతతో ఒక సీనియర్ మంత్రి పదవి కోల్పోవడం అత్యంత అరుదైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని చాలామందిని ఇది ఆశ్చర్యపరిచింది. శుక్రవారం వరకు తమ సీనియర్ మంత్రుల్లో ఒకరిని వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ఏమాత్రం లేవు. అయినప్పటికీ కేవలం 24 గంటల్లోపే ప్రధాన్ రాజీనామా చేశారు. ఆందోళనకారులతో ప్రభుత్వం మళ్లీ చర్చలు ప్రారంభించింది. చర్చలు సఫలం కావడంతో సీజేపీ తన నిరసనను ముగిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ సమయంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
ఆందోళన విరమించిన సీజేపీ
ఢిల్లీ: కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. జంతర్మంతర్ దగ్గర ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సీజేపీ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని.. మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని అశుతోష్ పేర్కొన్నారు.ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందన్న సీజేపీ.. ఆందోళన విరమించాలని నిర్ణయించింది. జంతర్మంతర్ దగ్గర నుంచి విద్యార్థులు వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్న సీజేపీ.. నాలుగు వారాల తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పేర్కొంది. సీజేపీ 3 డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు ఒప్పుకుంది. త్వరలోనే పరిహారం కూడా చెల్లిస్తామని వెల్లడించింది.వాంగ్చుక్ మాట్లాడుతూ.. నవభారత్కు ఇదొక శుభపరిణామంగా అభివర్ణించారు. యువతకు అభినందనలు తెలిపిన ఆయన.. విద్యారంగంలో సమూల మార్పులు రావాలన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని వాంగ్చుక్ కోరారు. -
2018 తర్వాత, ఇలా రిజైన్ చేసిన తొలి కేంద్ర మంత్రి ఈయనే
సాక్షి,న్యూఢిల్లీ: సీజేపీ ఆందోళనల నేపథ్యంలోఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీమానా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించారు. అలాగే తన లేఖ కాపీని మంత్రి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ధర్మేంద్ర రాజీనామాకు దారితీసిన పరిస్థితులతో పాటు, 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలతో అప్పటి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీనామా అంశం ఇపుడు నెట్టింట హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు దేశ వ్యతిరేక శక్తుల చేతిలోకి వెళ్లకుండా చూడటం, జాతీయ ఐక్యతను కాపాడటం తన బాధ్యత. భారతీయ విద్యార్థుల భవిష్యత్తు సుదీర్ఘ న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, వారు ప్రశాంతంగా తమ చదువులపై, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే గౌరవ ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించాను అని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హయాంలో ఒక మంత్రి ప్రజల లేదా విపక్షాల నిరసనల కారణంగా రాజీనామా చేయడం అత్యంత అరుదైన పరిణామం. గత చరిత్రను పరిశీలిస్తే, 2018 తరువాత అప్పటి కేంద్ర సహాయ మంత్రి ఎమ్జే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నెక్ట్స్ విద్యాశాఖ మంత్రి ఎవరు? 2018 ఎమ్జే అక్బర్మోదీ హయాంలో వివాదాలు ఎదురైనప్పటికీ మంత్రులు రాజీనామా చేయరని, ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే #MeToo ఉద్యమంలో పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలతో 2018లో కేంద్ర సహాయమంత్రిగా ఎమ్జే అక్బర్ రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన అక్బర్, "ఆరోపణలు వైరల్ ఫీవర్లా మారాయి" అని వ్యాఖ్యానించారు. అయితే, వ్యక్తిగత హోదాలో కోర్టులో న్యాయపోరాటం చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు.కాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమానికి, పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం జరుగుతున్న పోరాటానికి ఒక మైలురాయిగా నిలిచింది ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP), విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలకు ఈ రాజీనామా ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. సీజేపీ ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. ఆయన రాజీనామాతో సీజేపీ పోరాటం ఫలించింది. సీజేపీ విధించిన డెడ్లైన్లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశా. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు’’ అని పేర్కొన్నారు.‘‘భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు.. వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. భారత యువశక్తే దేశానికి అసలైన బలం. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే నా సంకల్పం...జంతర్-మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించాను...నరేంద్ర మోదీ మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశసేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో ఉంటాను’’ అని లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.pic.twitter.com/VSArqS98OJ— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026 -
NTAలో 47 మందిపై క్రిమినల్ చర్యలు... BJP సీరియస్ యాక్షన్
-
బొద్దింకలను ఏరిపారేయండి.. మాజీ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంధ్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాక్రోచ్లను శాశ్వతంగా అంతం చేయాలని ప్రధాని మోదీని కోరారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్ఞాఠాకూర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో .. గతంలో ఎక్కడ బొద్దింకలు కనిపించినా వాటిని చీపురుతో ఊడ్చి పారవేసేవారని, కానీ ఇప్పుడు ఆ చీపురు, బొద్దింక స్నేహితులయ్యాయయని, తద్వారా దేశవ్యాప్తంగా మురికి వ్యాపిస్తోందని అన్నారు. ప్రధాని మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దేశ నాయకుడు ఇకపై చీపురును నమ్మకూడదు. దానికి బదులుగా, బొద్దింకలను నిర్మూలించడానికి శాశ్వత ఏర్పాట్లు చేయాలి. దేశాన్ని శుభ్రంగా ఉంచాలి’అని పేర్కొన్నారు.ఠాకూర్ గతంలోనూ తన వ్యాఖ్యల కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఠాకూర్కు లోక్సభ టికెట్ నిరాకరించింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు, అశోక చక్ర గ్రహీత, మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరేను, ఠాకూర్ పురాణాల్లోని ప్రతినాయకులైన రావణుడు, కంసుడితో పోల్చారు.26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో కర్కరే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో కర్కరే తనను అన్యాయంగా ఇరికించారని.. తాను శపించడం వల్లే ఆయన చనిపోయారని’ఠాకూర్ ఆరోపించారుమాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్ధోషి2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలోని మసీదు సమీపంలో మోటర్ సైకిల్కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ప్రగ్యాసింగ్ ఠాకూర్తో సహా ఏడుగురు నిందితులను గతేడాది జూలై నెలలో నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? చేయరా?
కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు కొలిక్కిరాలేదు.. కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన సీజేపీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు కేంద్రం గడువు కోరింది. ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. డిమాండ్లపై రేపు మధ్యాహ్నం వరకు వేచి చూస్తామన్న సీజేపీ.. జంతర్మంతర్లో ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొంది.అయితే.. ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తప్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. సమస్యలకు రాజీనామా పరిష్కారం కాదని.. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్కు పూర్తి మద్దతుగా నిలుస్తోందని, ఆయన రాజీనామా చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రి రాజీనామా నిర్ణయం సులభమే.. కానీ దాంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చారని.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనతా పార్టీ (సీజేపీ) ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలను విరమించబోమని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం సమస్యల మూలాలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఒకవైపు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా, మరోవైపు వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెబుతోంది. -
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి దేశ వ్యాప్తంగా విద్యార్థుల చేస్తున్న ఉద్యమంలో అరాచక శక్తులు చేరాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారంటూ బండి సంజయ్ విమర్శించారు. పోలీసులు, జర్నలిస్టులపై దాడులు చేశారని, ఆ దాడిలో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 24వ తేదీ) నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నుంచి మాట్లాడిన బండి సంజయ్.. రాజస్థాన్లో కాంగ్రెస్ పాలనలో 18 సార్లు పేపర్లు లీకేజీలు జరిగాయని, కర్ణాటక, బెంగాల్, కేరళంలో పేపర్లు లీకైతే ఎవరూ రాజీనామా చేయలేదన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయని, బీఆర్ఎస్ హయాంలో పేపర్లు లీకైతే మీరు రాజీనామాలు చేశారా? అని ప్రశ్నించారు. విద్యార్థుల చేస్తున్న ఆందోళనలో దేశ వ్యతిరేక శక్తులు వచ్చి చేరాయన్నారు. నిరసనలు చేస్తుంది విద్యార్థులైతే.. వారి చేతుల్లో రాళ్లు, రాడ్లు ఎందుకున్నాయంటూ ప్రశ్నించారు. ‘ ఈ ఆందోళనలో పార్లమెంట్పై దాడికి కుట్ర చేశారు. సంఘ విద్రోహలపైనే పోలీసులు లాఠీలు వాడారు. విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి విష ప్రచారం చేస్తున్నారు. యూపీఏ హయాంలో 70 సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. అన్ని రాష్ట్రాల్లో పేపర్ల లీక్ ఘటనలు జరిగాయి. ఆ సమయంలో వారు రాజీనామాలు చేశారా? అని బండి సంజయ్ నిలదీశారు. -
సీజేపీతో చర్చలు.. ఆ డిమాండ్పై రేపటిదాకా గడువు కోరిన కేంద్రం
ఢిల్లీ: సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు ముగిశాయి. ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామన్న సీజేపీ ప్రతినిధులు.. ఈ డిమాండ్లకు నెరవేరేవరకు ఆందోళన విరమించేదిలేదని తేల్చి చెప్పారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ చర్చించారు. రెండు గంటలపాటు చర్చలు కొనసాగాయి.కాన్ట్సిట్యూషన్ క్లబ్లో జరిగిన ఈ చర్చల్లో డిమాండ్ల నోట్ కేంద్ర మంత్రులకు సీజేపీ నేతలు సమర్పించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 3 డిమాండ్లు కేంద్ర మంత్రుల ముందు ఉంచాం.. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని కోరాం. నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సౌరవ్ దాస్ తెలిపారు.‘‘మూడింటిలో రెండు డిమాండ్లకు కేంద్రం పాజిటివ్గా ఉంది. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరాం. మరోసారి కేంద్రం చర్చలు జరుపుతాం. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు గడువు కోరారు. రేపటిలోగా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తారని ఆశిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించకపోతే మరోసారి ఆందోళనకు పిలుపునివ్వాల్సి వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదు’’ అని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. -
మరోసారి పరువు పోయిందిగా..!
నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8.. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై వచ్చిన ఒక వార్తా కథనం. అంటే దీని అర్థం వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ మొదటి స్థానంలో ఉంటే, ప్రస్తుతం కూటమి పాలనలో అది ఎనిమిదో ర్యాంకుకు దిగజారిందన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆధారంగానే సాధారణంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్లు పదేపదే ఒక మాట చెబుతున్నారు. ఏపీకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఒకసారి, వచ్చేశాయని మరోసారి అంటారు. అలాగే 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా ఏడెనిమిది శాతం అధికంగా పెట్టుబడులు వస్తున్నట్లుగా ఊదరగొడుతుంటారు. మనెవ్వరికి కనబడకుండా ఈ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయి? పరిశ్రమలు వచ్చేశాయా?ఉద్యోగాలు వచ్చేశాయా? వస్తున్నాయా? అని ఆశ్చర్యపోవడం ప్రజలకు అలవాటైపోయింది. ఇది నిజమేనేమోలే అని నమ్మేవారు కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా ఊపిరి ఆడకుండా స్టోరీలు అల్లి వడ్డిస్తుంటాయి.నిజంగా ఏ రాష్ట్రానికి అయినా పెట్టుబడులు వస్తుంటే అంతా సంతోషిస్తారు. కాని అతి ప్రచారం చేసుకుంటే మాత్రం ఇలాంటి నెగిటివ్ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విషయం పార్లమెంటులో కూడ వెల్లడైపోయింది. లోక్ సభలో వైఎస్సార్సీపీ నేత మిధున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఏడువేల కోట్ల లోపే అని స్పష్టం చేసింది. దీంతో కూటమి సర్కార్ పరువు మరింత దిగజారినట్లయింది.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ ఒన్ స్థానంలో ఏపీ ఉందంటే దానికి కారణం ఉంది. ఆ రోజుల్లో జగన్ ఆయా పరిశ్రమలవారితో మాట్లాడినప్పుడుకాని, సదస్సులలోకాని ఒక స్పష్టమైన ప్రకటన చేసేవారు. ఏ పారిశ్రామికవేత్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్క పోన్ కాల్ చేస్తే వెంటనే స్పందిస్తానని భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఎంతవరకు చేస్తున్నారో తెలియదు కాని పారిశ్రిమికవేత్తలను భయపెట్టడంలో మాత్రం రెడ్బుక్ బాగానే పనిచేస్తోందన్న విమర్శ ఉంది.మోసకారి నటి జత్వాని కేసును తీసుకోండి. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ను కూడా ఇరికించి ముగ్గురు ఐపీఎస్లను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్కు సజ్జన్ సన్నిహితంగా ఉండి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండేవారు. అలాంటి వ్యక్తిపై వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం నానా రభస చేసింది. దాని ఫలితంగా జిందాల్ ఏపీ వైపు చూడకుండా, తాము మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గతంలో ప్రకటించారు. దీంతో ఏపీకి ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పైగా పారిశ్రామిక సర్కిల్స్లో ఏ స్థాయిలో ప్రచారం జరిగి ఉండవచ్చో ఊహించుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయనతో రాజీ కుదుర్చుకున్నా జరగవలసిన డామేజీ జరిగి ఉంటుంది.అంతేకాదు.. విశాఖ వంటి కీలక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడం కూడా ప్రభుత్వ పరువు తీసి ఉండాలి. ఏపీకి పరిశ్రమలు రావడానికి వెనుకాడుతున్నందున వీరు ఈ భూమిని ఇంత కారుచౌకగా, వేల కోట్ల లాభాలు వచ్చే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్న సంకేతం కూడా నష్టం చేసిందేమో తెలియదు. పైగా కొన్ని సంస్థలకే ఇలా ఇవ్వడం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. కార్పొరేట్ సంస్థల మాటున తమకు కావల్సినవారికి కూడా కారుచౌకగా ప్రభుత్వ భూములు ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇక ప్రభుత్వపరంగా పాలనకన్నా, ప్రతీకార రాజకీయాలకు, రెడ్బుక్ పేరుతో అరాచకాలకు ప్రోత్సాహం ఇస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాంతో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్న భావన సర్వత్రా ఏర్పడింది.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పలు నివేదికలలో ఏపీ ర్యాంకింగ్ బాగా తగ్గిపోయింది. అదే క్రమంలో నీతి అయోగ్ ఇచ్చిన తాజా నివేదికలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒకటి నుంచి ఎనిమిదికి పడిపోయినట్లు వెల్లడైంది. నిజంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా, వచ్చినా నీతి అయోగ్ ర్యాంక్ ఇంత దిగజారిపోవడం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా అందరికి తెలిసిపోతుంటాయి. మరో వైపు జగన్ 17 మెడికల్ కాలేజీలను తెస్తే, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడితే, వాటిని ప్రైవేటువారికి కట్టబెట్టే ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.రామాయంపట్నం పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్కు పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. వీటికి ప్రభుత్వం నుంచి సరైన జవాబు ఉండడం లేదు. జగన్ కాలంలో రెండేళ్ల కరోనా ఉన్నా, అన్ని వాగ్దానాలు అమలు చేసినా, ఆ ప్రభుత్వ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఎంతో సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ప్రభుత్వం రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసేసింది. ఇక పరిశ్రమలవారి నుంచి కొందరు కూటమి ఎమ్మెల్యేలు కప్పం వసూలు చేస్తున్న వైనం కూడా ఏపీ పరువు తీస్తోంది.కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి బూడిద రవాణాపై ఒక బీజేపీ ఎమ్మెల్యే, మరో టీడీపీ నేత మధ్య జరిగిన రగడ ఇంత, అంతా కాదు. స్వయంగా బీజేపీ ఎంపీనే దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఎమ్మెల్యే తనకు మామూళ్లు ఇవ్వకపోతే వారి ఉత్పత్తులు రవాణా కానివ్వబోమని బెదిరించారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల కూటమి ఎమ్మెల్యేలు, నేతల అరాచకాలు పెచ్చుమీరాయి. పైగా టీడీపీ కార్యకర్తలు నేరాలు చేసినా కేసులు పెట్టవద్దని ఒక మంత్రే బహిరంగంగా చెబుతున్నారు. ఈ మధ్య మహిళలపై జరుగుతున్న ఘాతుకాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. చివరికి ఒక టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేయడం, అతనిపై కేసు లేకుండా చేయడానికి పార్టీ నేతలు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడం తెలిసిందే. ఇక లాకప్ మరణాలు సరేసరి. పోలీస్ వ్యవస్థ ధర్మంగా పనిచేయడం లేదన్న భావన నెలకొంది.జగన్ టైమ్లో పలు పరిశ్రమలు వచ్చినా, రానట్లుగా, ఆయన కాలంలో తరిమేసినట్లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారం ఇప్పటికీ ఆపడం లేదు. తాజాగా అమరరాజా ఎప్పుడో తెలంగాణలో మరో పరిశ్రమ పెట్టుకుంది. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరిమివేయడం వల్లే జరిగిందని చెబుతూ లోకేష్ ఆ యాజమాన్యానికి క్షమాపణ చెప్పడం పిల్ల చేష్టగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. అమరరాజా సంగతి సరే! జగన్ టైమ్లో అది ఎక్కడకు వెళ్లలేదు. మరి హెరిటేజ్ ప్లాంట్ విస్తరణ తెలంగాణలో ఎందుకు చేశారు? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చాయి. దీనికి చంద్రబాబు, లోకేష్ల నుంచి సమాధానం లేదు.రెండేళ్ల కూటమి పాలన తర్వాత ఏపీ ర్యాంకు ఎనిమిదో స్థానానికి పడిపోవడానికి జగన్ పాలనలో జరిగిన విధ్వంసమని టీడీపీ నిస్సుగ్గుగా చెబుతోంది. ఇది చిత్రంగా అనిపించదూ! నిజంగా జగన్ పాలనలో విధ్వంసం జరిగి ఉంటే అప్పుడు నెంబర్ ఒన్ ర్యాంక్ ఎలా వస్తుంది? ప్రస్తుతం అంతా సజావుగా ఉంటే ర్యాంకు ఎందుకు పతనం అవుతుంది? ఈ మాత్రం లాజిక్ లేకుండా టీడీపీ నేతలు మాట్లాడడం అంటే వారి అతి తెలివితేటల ర్యాంకింగ్ కూడా ఆ స్థాయికి దిగజారిందని అనుకోవాలా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నీళ్లు ఎత్తాలో.. వద్దో రాష్ట్రమే తేల్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోయాలో, లేదో కేంద్రం నిర్ణయించజాలదని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మరమ్మతులు అవసరమైన మేడిగడ్డ సహా ఇతర బరాజ్ల ద్వారా నీటిని ఎత్తిపోసే అంశం కేంద్ర పరిధిలోనిది కాదని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు గురువారం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డితోపాటు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందర్రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, సీనియర్ నేత వకులాభరణం కృష్ణమోహన్లు పాటిల్తో సమావేశమయ్యారు. రాష్ట్ర నేతలు ఎన్డీఎస్ఏ నివేదికలపై పాటిల్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వాస్తవ పరిస్థితులను ఇప్పటికే ఎన్డీఎస్ఏ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయాలను తెలుపుతూ, అందులో ప్రస్తావించిన అంశాలను వివరించారు. బరాజ్లకు అవసరమైన మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని, ఇందులో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నట్లు తెలిసింది. రాష్ట్రం తమ యంత్రాంగంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నట్లు తెలిసింది.మరమ్మతులు, నీటి ఎత్తిపోతలపై రాష్ట్రం నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే మాత్రం తమ విభాగాల తరఫున సాంకేతిక సహాయాన్ని అందిస్తామన్నట్లు సమాచారం. ఇదే సమయంలో బరాజ్ల మరమ్మతుల పనులను మూడేళ్లుగా చేయకుండా రాష్ట్రం అలక్ష్యం చేశారంటూ రాష్ట్ర ఎంపీలు చెప్పినట్లు తెలుస్తోంది. బరాజ్ల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేస్తే.. మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం మరో తప్పిదం చేసిందనే అభిప్రాయాలు సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. గత, ప్రస్తుత ప్రభుత్వాలు తప్పుచేసి, ఆ నిందను కేంద్రంపై మోపే కుట్రలు చేస్తున్నారని ఎంపీలు చెప్పగా, అలాంటి ప్రయత్నాలను అడ్డుకొని, వాస్తవాలను ప్రజలకు తెలపాలని పాటిల్ సూచించినట్లు తెలిసింది. మరమ్మతుల్లో జాప్యం రాష్ట్రానిదే: అర్వింద్ కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో సమావేశం అనంతరం ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘మేడిగడ్డ బరాజ్ మరమ్మతుల జాప్యానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వమే కారణం. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన రూ.లక్ష కో ట్లపై సమగ్ర దర్యాప్తు జరగాలి. కేసీఆర్, కేటీఆర్ దగ్గర రేవంత్ ఎంత మింగారు? ప్రాజెక్టులో దోచుకున్న దాంట్లో రాహుల్ గాందీకి ఎంత ఇచ్చారు?’అని ఆరోపించారు. ‘మంత్రి ఉత్తమ్కుమార్ బీఆర్ఎస్లోనూ సభ్యుడే, కాంగ్రెస్లో కూడా సభ్యుడు, మంత్రి. ఈయన ఆల్పార్టీ మెంబర్’అంటూ ఎద్దేవా చేశారు. రఘునందన్ రావు మాట్లాడుతూ... ‘పొట్టోడు, పొడుగోడు కలిసి రైతుల కడుపు కొడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ దోషులే’అని చెప్పారు. -
కాంగ్రెస్ ఓట్లే లక్ష్యం.. 'సర్'తో బీజేపీ సర్కార్ కుట్ర: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–సర్) పేరుతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘సర్’ పేరుకే ప్రక్షాళన అని, కాంగ్రెస్ ఓట్ల తొలగింపే టార్గెట్ అని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దళితులు, గిరిజనుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు కోల్పోతే సంక్షేమ పథకాల లబ్ధి పొందడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ నగరంలో లక్షల ఓట్లు తొలగించారని, ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనను సంక్షేమ శాఖకు బదిలీ చేశారని విమర్శించారు. ఇప్పుడు చేస్తున్న ఎస్ఐఆర్కు ఆద్యుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. గురువారం శాసనసభ ఆవరణలో జరుగుతున్న మరమ్మతు పనులను సీఎం పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ మీడి యా అడ్వైజరీ కమిటీ కార్యాలయంలో విలేకరులతో చిట్చాట్ చేశారు. ముందు ఓట్ల తొలగింపు.. తర్వాత సంక్షేమ పథకాలు ‘పేదోడి ఓటు చాలా విలువైంది. ఓటు పోతే వారి జీవితం పోతుంది. అందుకే 3వ తేదీ వరకు మా నేతలకు హైదరాబాద్ రావొద్దని చెప్పా. సర్ ప్రక్రియ ఇప్పటివరకు 70 శాతం పూర్తయ్యింది. ఇంకా 30 శాతం ఉంది.. ఇదే కీలకం. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) అత్యంత కీలక పాత్ర పోషించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలు, దళితులు, గిరిజనుల ఓట్లు పెద్దఎత్తున తొలగిపోయే ప్రమాదం ఉంది. కూలీ పనులకు వెళ్లేవారు, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పేదలంతా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వాళ్లే. బీఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్లు ఇంట్లో లేకపోతే ఆ ఓట్లు పోయినట్టే. కాంగ్రెస్కు ఓటు బ్యాంకుగా ఉన్న ఈ వర్గాల ఓట్లను తొలగించడం ద్వారా పార్టీని బలహీనపరచాలని కుట్ర జరుగుతోంది. ఓటు లేకపోతే ప్రజాస్వామ్య హక్కులు పోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నాకు రెండు ఓట్లు లేవు.. ‘కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటున్నాయి. నీట్ పేపర్ లీకేజీ నుంచి ఎస్ఐఆర్ వరకు రెండు పార్టీల వైఖరి అనుమానాలకు తావిస్తోంది. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. నాకు రెండు ఓట్లు ఉంటే బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. విచారణ చేసి తప్పు అయితే లోపల వేస్తారు. నేను స్వయంగా ఎన్నికల కమిషన్కు దరఖాస్తు పెట్టుకుని ఓటు కొడంగల్కు మార్చుకున్నా. కాళేశ్వరం కేసులో సీబీఐ తన పని చేసుకుంటుంది.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ కమిటీ నివేదికల ఆధారంగానే సీబీఐకి దర్యాప్తుకు అప్పగించాం. తప్పు చేసి ఉంటే తప్పించుకోలేరు. మేడిగడ్డ బరాజ్ గేట్లు తెరిచినా, పంప్హౌస్లు నడిచేపక్షంలో అవెందుకు కట్టారో చెప్పకుండా హరీశ్రావు చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. మేడిగడ్డ, కన్నెపల్లి పంప్హౌస్, బరాజ్ల నిర్మాణం, గేట్ల నిర్వహణపై నిపుణుల నివేదికలు స్పష్టంగా ఉన్నాయి. ఆ అంశాలపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడకుండా కన్నెపల్లి నుంచి నీటిని తరలించాలని కొత్త రాగం అందుకున్నారు. మేడిగడ్డ బరాజ్లో 5 టీఎంసీల నీళ్లు ఉన్నప్పుడే కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని తరలించే అవకాశం ఉంది. అదే పద్ధతి అన్నారం, సుందిళ్లలో కూడా ఉంది. ఇవన్నీ జరగాలంటే మూడు బరాజ్ల గేట్లు మూయాలి. అవి మూస్తే బరాజ్ కూలుతుందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. దేవాదుల ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేస్తున్నాయి..’ అని రేవంత్ వివరించారు. జన్వాడ ఫామ్హౌస్ ఎవరిది? ‘ఇంటర్మీడియెట్ పరీక్షల వ్యవహారంలో 25 మంది విద్యార్థుల మరణాలకు కారణమైందని ఆరోపణలు ఎదుర్కొన్న గ్లోబ్ అరెనా సంస్థ పేరు మార్చుకుని ప్రస్తుతం ’కో ఎంప్ట్’ గా చలామణి అవుతోంది. నీట్ పేపర్ లీకేజీకి స్ఫూర్తి నాటి గ్లోబ్ అరెనా సంస్థ చేసిన ఇంటర్ లీకేజీనే. జన్వాడ ఫామ్హౌస్ ఏ రాజు నుంచి వచ్చిందో...ఆ ఫామ్హౌస్కు, గ్లోబ్ అరెనా సంస్థ ‘రాజు’కు ఉన్న సంబంధమేంటో కేటీఆర్ చెప్పాలి. గ్లోబ్ అరెనా సంస్థ తనది కాదని కేటీఆర్ చెప్పే పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. ఇప్పటికే విజిలెన్స్ ద్వారా గ్లోబ్ అరెనా ఇంటర్ లీకేజీపై విచారణ జరుగుతోంది. కేటీఆర్ ఫిర్యాదు చేస్తే సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగుతారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారి విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు. జైలుకు వెళ్తే సానుభూతి వచ్చి సీఎంలు అయ్యే పక్షంలో, ఎప్పుడో జైల్లో ఉన్న చార్లెస్ శోభరాజ్, బిల్లా రంగాలు కూడా పీఎంలు ఆయ్యే వాళ్లు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. ‘ఇందిరమ్మ’ అదనపు ఖర్చు లబ్ధిదారులదే ‘పేదల ఇళ్లకు రూ.5 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అందుకు అనుగుణంగానే భూమి ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంది. హైదరాబాద్లో ఇచ్చే లక్ష ఇళ్లకు కూడా ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంది. అదనపు ఖర్చు లబ్ధిదారులే చెల్లించాల్సి ఉంటుంది. సమర్ధవంతంగా హైడ్రా వ్యవస్థ హైడ్రా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది. చెరువులను పునరుద్ధరించి ప్రభుత్వ భూములను కాపాడుతోంది. ఉద్యోగాల భర్తీలో మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 55 రోజుల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే నియామకాల జాబితాను పేర్లతో సహా వెల్లడించడానికి సిద్ధం. నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రశ్నపత్రం అమ్ముకోవడం వారి విధానమైతే, నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం మా విధానం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయలేకపోయామని కేటీఆర్ ఒప్పుకున్నాడు. మేము ప్రక్షాళన చేయడమే కాకుండా పదేళ్ల తర్వాత గ్రూప్ –1 పరీక్షలు నిర్వహించాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
‘యువత గొంతు నొక్కితే మీ రాజకీయ పతనం తప్పదు’
హైదరాబాద్: యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదని మంత్రి ఉత్తమ్కుమార్ మండిపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణాలపై మంత్రి ఉత్తమ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్బంధాలు సరికాదని ధ్వజమెత్తారు. ‘ప్రజాస్వామ్యాన్ని భయపెట్టలేరు... రాజ్యాంగాన్ని అణచలేరు. ఉద్యోగాలు అడిగిన యువతకు లాఠీలు, కేసులే బీజేపీ సమాధానామా?, ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కే. విద్యార్థుల స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు. యువత భవిష్యత్తుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యార్థుల మధ్య నిలిచిన రాహుల్ గాంధీ నిజమైన ప్రజానాయకుడు. ప్రజల మధ్య ఉండే నాయకత్వానికే దేశం మద్దతిస్తుంది. భయపెట్టి ప్రజల స్వరాన్ని శాశ్వతంగా అణచలేరు. విద్యార్థుల కలలను సంకెళ్లతో బంధించలేరు. యువత ఆశయాలను జైళ్ల గోడల మధ్య నిర్బంధించలేరురాజ్యాంగాన్ని ఎవరూ ఓడించలేరు. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ చారిత్రక బాధ్యత. యువత విద్వేషం కాదు... విశ్వాసం కోరుకుంటోంది. అహంకారం కాదు... జవాబుదారీతనం కోరుకుంటోంది. ప్రచారం కాదు... పారదర్శక పాలననే యువత కోరుకుంటోంది. 2029 ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణకు కీలకం. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అందిస్తుంది. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తోంది. ప్రజల గొంతు వినే ప్రభుత్వాలే చరిత్రలో నిలుస్తాయి. భారత్ను భయంతో కాదు... ప్రజాస్వామ్యం, రాజ్యాంగంతో నడపండి’ అని సూచించారు. -
సీజేపీ నిరసనలపై ఉక్కుపాదం.. కేంద్రం సంచలన నిర్ణయం
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ జాతీయ భద్రతా చట్టం అమలు చేయనుంది. నిరసనకారులను ఏడాది పాటు నిర్బంధించేందుకు పోలీసులకు అధికారం ఇచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా ఎటువంటి విచారణ లేకుండా ఏడాదిపాటు నిర్బంధించే అవకాశం ఉంది. మూడు నెలల వరకు ఢిల్లీలో చట్టాన్ని అమలు చేస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.. పోలీసు కమిషనర్కు విశేష అధికారం కల్పించారు. ఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు భారీ అదనపు అధికారాలు ఇచ్చింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) కింద నిర్భందించే అధికారం ఉంది. అసాధారణ ఢిల్లీ గెజిట్ నోటిఫికేషన్ను హోం శాఖ విడుదల చేసింది. ఈ ప్రత్యేక అధికారాలను పరిమిత కాలం (మూడు నెలలు) వరకు వినియోగించే అధికారం ఉంది.అయితే, జాతీయ భద్రత చట్టంపై ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ భద్రత చట్టం మూడు నెలలకొకసారి రొటీన్గా రెన్యువల్ అవుతుందని.. సీజేపీ ఉద్యమాలకు ముందే ఈ ఆదేశం జారీ అయిందని పేర్కొన్నారు. ఇటీవల ఘటనలతో సంబంధం లేదని.. సాధారణ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిపై పై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వెళుతోందన్న ఢిల్లీ పోలీసులు.. సీజేపీ ఉద్యమాలను అణచివేయడానికి అధికారాలు ఇచ్చారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఇది రొటీన్ త్రైమాసిక ఎన్ఎస్ఏ పునరుద్ధరణ మాత్రమేనని వెల్లడించారు.కాగా, జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీజేపీ నిరసనలకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. పార్లమెంట్ పరిసరాల్లో ఉద్యమకారులపై పోలీసులు జులుం తర్వాత విద్యార్థుల ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్మంతర్కు తరలివస్తున్నారు. -
బాబూ.. లక్ష్మీ కటాక్షమా.. ఓట్ల రాజకీయమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి సంబంధించి చేస్తున్న ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేవిగా ఉంటున్నాయా? లేక అంతా ఆమోదించేవిగా ఉంటున్నాయా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు చేసిన కొన్ని ప్రకటనలను గమనించండి. అమరావతికి లక్ష్మీ కటాక్షం-హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నాం.. అమరావతి అంటే విజయవాడ గుంటూరు, మంగళగిరి కలిసి ఉండేదే.. ఈ వ్యాఖ్యలను విశ్లేషించుకుంటే ఏమి అర్దం అవుతుంది?ఇంతకాలం అమరావతిని దేవతల రాజధాని అని ఆయన ప్రచారం చేశారు. దీనిపై వస్తున్న ప్రశ్నలను దృష్టిలో పెట్టుకున్నారేమో తెలియదు కాని ప్రజల రాజధాని అని కూడా అంటున్నారు. అంతవరకు సంతోషమే.దేశంలో మరే రాష్ట్రంలో తమది దేవతల రాజధాని అని ఏ ముఖ్యమంత్రి చెప్పి ఉండరు. ప్రజలను సెంటిమెంట్తో ఆకట్టుకోవడం కోసం ఆయన ఇలా చేస్తున్నారన్నది తెలుస్తూనే ఉంది. గత ఏడెనిమిదేళ్లుగా ఆయన ఈ మాట చెబుతూనే ఉన్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నామని చంద్రబాబు అన్నారట. ఇలా అనడంలోని ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు. భారత్.. రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ దేశంగా ఉంది. అన్ని మతాలను సమానంగా చూడాలి. చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉంటే ఒకరకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తుంటారన్న భావన రాజకీయ వర్గాలలో ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు మతపరమైన రాజకీయాలు చేయడానికి రకరకాల యత్నాలు చేశారు. చంద్రబాబు 2024లో మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అదే ప్రయత్నం సాగిస్తున్నారు.తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపించి, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టేందుకు కృషి చేశారు. తీరా అలాంటిదేమీ జరగలేదని తేలడంతో ఆయన సెల్ఫ్గోల్ వేసుకున్నట్లయింది. అయినప్పటికీ ఈ మధ్య మీమతం, మా మతం, మీ దేవుడు, మా దేవుడు అంటూ స్పీచ్లు ఇస్తూ ప్రజలను అటువైపు మళ్లించడానికి తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ఆయన ఇలా మతపర వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలుతోంది.ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత డెబ్బై ఐదేళ్లలో ఎన్నడూ మతాల ఆధారంగా కాకుండా ప్రభుత్వాల పనితీరు, విధానాల ఆధారంగానే ఓట్లు వేస్తూ వచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన అంశాలకు ప్రాధాన్యం పెరిగిన మాట వాస్తవమే. అందులోనూ మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ధోరణి మరింత హెచ్చింది. బీజేపీ మెప్పు కోసం చంద్రబాబు కూడా హిందూయిజాన్ని ప్రధాన అంశంగా మలచుకుని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అమరావతి రాజధానిలో జగన్నాధ రధయాత్రలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా స్వామివారి ఆశిస్సులను కోరుకోవడం, ప్రజలకు మేలు కలగాలని ప్రార్ధించడం సహజంగానే జరుగుతుంది. కాని హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మించడం ఏమిటో తెలియదు. ఈ మాటలు విన్న ఇతర మతాలవారికి అది ఎలాంటి భావన కల్గిస్తుందన్నది ఆయన ఆలోచించుకోవాలి!గతంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని పిలవరా అని అన్నప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. టీడీపీకి దూరంగా ఉన్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు అన్ని కులాలను, మతాలను తన వెంట తీసుకువెళ్లేలా వ్యవహరించాలి. దేశం కాని, రాష్ట్రం కాని మతపరమైనవిగా లేవన్న సంగతి గుర్తించాలి. స్థల మహత్యంతో అమరావతిని ఎవరూ కదలించలేరని అంటూ రాజకీయ లక్ష్యంగా ప్రసంగం చేసినట్లు అనిపిస్తుంది. ఆధ్యాత్మికత తోడుంటేనే ప్రశాంతత వస్తుందని ఆయనే చెబుతారు. కాని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆయనే రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారు.అమరావతికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషపడతారు. లక్ష్మీ కటాక్షం రాష్ట్రం అంతటికి రావాలని ఎవరైనా కోరుకుంటారు కాని, అమరావతికే కోరడం ఏమిటో తెలియదు. ఇప్పటికైతే అమరావతి ద్వారా ప్రభుత్వానికి లక్ష్మీ కటాక్షం ఎంత జరిగిందో అంటే.. ఎంత ఆదాయం వచ్చిందో తెలియదు కాని, అప్పు మాత్రం 47వేల కోట్లకు చేరింది. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడానికి లక్షకోట్లు ప్రస్తుతం ఖర్చు చేయవలసి ఉందని అంటారు. నిజంగానే లక్ష్మీకటాక్షం జరిగి, ప్రజల మీద భారం లేకుండా అమరావతి సొంతంగా సంపాదించుకుంటే చంద్రబాబు చెప్పింది నిజమేనని నమ్ముతారు. అలాకాకుండా వేల కోట్ల అప్పులు తెస్తూ దానినే లక్ష్మీ కటాక్షం అని అనుకోవాలంటే కష్టం అవుతుంది.అంతేకాదు... అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఈ రెండేళ్లలో కలిగిన లక్ష్మీ కటాక్షం పెద్దగా ఏమి లేదని బాధపడుతుంటారు. వారికి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చి ఉంటే కొంత కటాక్షం కలిగేదేమో. పైగా బలవంతపు భూ సేకరణ ద్వారా రైతుల వద్ద ఉన్న లక్ష్మీని కూడా ప్రభుత్వం లాక్కుంటోందన్న బాధ పలువురిలో ఉంది. కొందరు మహిళలను సైతం ప్రభుత్వం ఈ విషయంలో వేధించిన తీరు చూసి లక్ష్మీదేవి కూడా బాధపడి ఉండాలి. ప్రభుత్వం స్టార్ హోటళ్లకు ఎకరా ఎనిమిది కోట్లకు భూమి ఇస్తామని ప్రతిపాదించిందట. అదే టైమ్ లో భూముల సొంతదారులైన రైతులకు మాత్రం కోటి, రెండు కోట్లు కూడా ఇవ్వడం లేదని ఉండవల్లి రైతులు వాపోతున్నారు.చివరిగా మరో మాట.. మాజీ సీఎం జగన్ మావిగన్ అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలను ఒక కారిడార్గా తీసుకుని రాజధాని అభివృద్ది చేయాలని సలహా ఇస్తే దానిని చంద్రబాబు ఎద్దేవ చేశారు. కాని తాజాగా చేసిన ఒక ప్రసంగంలో అమరావతి అంటే విజయవాడ, మంగళగిరి, గుంటూరు కలిసి ఉన్నాయని అంటున్నారు. అవి ఇందులో భాగం అయితే రైల్వేస్టేషన్, ఎయిర్పోర్టు వంటివి మళ్లీ ఎందుకు నిర్మించాలి? వాటికోసం వేల ఎకరాల భూములు తీసుకుని రైతులను ఎందుకు బాధించాలి అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. మొత్తం తెచ్చిన అప్పు అంతా అమరావతి 29 గ్రామాలలోనే ఎందుకు వ్యయం చేస్తున్నారన్నదానికి సమాధానం చెప్పరు. అయితే జగన్ మావిగన్ ప్రతిపాదనను కాదనలేని స్థితికి చంద్రబాబు చేరుకున్నారని అనుకోవాలి. మతం మత్తు మందు వంటిదని కారల్ మార్క్స్ అంటారు. దానిని ఎంతవరకు అంగీకరిస్తారో తెలియదు కాని, మతం పేరుతో రాజకీయ లబ్ది పొందడానికి మాత్రం చంద్రబాబు వేస్తున్న వ్యూహాలు ప్రజలకు అర్థం కాకుండా ఉంటాయా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
2027లో ఉత్తరప్రదేశ్ను ఏలేది ఎవరు?
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పటికే తారాస్థాయికి చేరింది. అధికార బీజేపీతో పాటు విపక్షాలైన సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే తమ పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సామాజిక సమీకరణాలు, కులగణనలే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు సరికొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.బీజేపీ సరికొత్త వ్యూహం - సంస్థాగత బలోపేతంగత లోక్సభ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకున్న భారతీయ జనతా పార్టీ, ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వెనుకబడిన వర్గాల ఓట్లు పార్టీకి దూరమవ్వకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడంతో పాటు, హిందుత్వ, అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తూ ప్రజల్లో మతపరమైన, సామాజిక ఐక్యతను చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.ఎస్పీ ‘పీడీఏ’ ఫార్ములా - మారుతున్న సమీకరణలుసమాజ్వాదీ పార్టీ ఈసారి టికెట్ల కేటాయింపులో వినూత్న పద్ధతిని అనుసరిస్తోంది. కేవలం నాయకుల వ్యక్తిగత ప్రభావంపై ఆధారపడకుండా, ప్రతి నియోజకవర్గంలోని సామాజిక పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేస్తోంది. కేవలం యాదవ, ముస్లిం ఓట్లకే పరిమితం కాకుండా, ఇతర వెనుకబడిన కులాలను కూడా తమ వైపునకు తిప్పుకోవడానికి ‘పీడీఏ’ (వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాక) నినాదంతో ముందుకు సాగుతోంది.మాయావతి ఒంటరి పోరుయూపీలో మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఏ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. పార్టీకి బలమైన పునాదిగా ఉన్న దళిత ఓటు బ్యాంకును తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు, ఇతర వెనుకబడిన వర్గాలు, సవర్ణుల్లో కొంత భాగాన్ని ఆకట్టుకునేలా పాత సామాజిక ఇంజినీరింగ్ సూత్రాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ దూకుడు - కులగణన అస్త్రంరాష్ట్రంలో కోల్పోయిన పాత ప్రాభవాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా కులగణన అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, జనాభా ప్రాతిపదికన ప్రతి వర్గానికి సరైన ప్రాతినిధ్యం దక్కాలనే డిమాండ్ను బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా రైతులు, యువకులు, వివిధ సామాజిక వర్గాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే పనిలో పడింది.ఓవైసీ ఎంట్రీతో మారుతున్న సమీకరణలుఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ రాక యూపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముస్లిం ఓట్లతో పాటు దళిత, వంచిత వర్గాలను కూడగట్టి సరికొత్త సామాజిక సమీకరణాన్ని తెరపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం నేరుగా విపక్షాలైన ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సామాజిక సమీకరణల ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్ జనాభాలో వెనుకబడిన తరగతులు, దళిత, ముస్లిం కమ్యూనిటీలదే సింహభాగం ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఏ కులం ఎంత బలంగా ఉందనే లెక్కలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తూ వస్తున్నాయి. యాదవ, కుర్మి, లోద్, నిషాద్ వంటి వెనుకబడిన కులాలు, ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించేందుకే అన్ని ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.ఇది కూడా చదవండి: గాంధీ నుంచి సోనమ్ వాంగ్చుక్ వరకు.. -
బీజేపీ సర్వేల జోరు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ నాయకత్వం చేపడుతున్న ‘మిషన్ తెలంగాణ’ కార్యాచరణకు అనుగుణంగా...రాష్ట్రంలో వివిధ సర్వే సంస్థలు, ఏజెన్సీల క్షేత్రస్థాయి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ను వేగవంతం చేయడంలో భాగంగా క్షేత్రస్థాయి అధ్యయనాలు, పరిశీలనలు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులు, సమస్యలు, ప్రజాకాంక్షలు, ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలు పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్రంలో ప్రస్తుతం మూడు సర్వేసంస్థలు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పార్టీపరంగా, నేతల పర్యవేక్షణలో, పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా.. ఇలా వివిధ రూపాల్లో ఇవి పనిచేస్తున్నాయి. అధికార సాధనకు ‘అభీష్ట’... పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన ‘అభీష్ట’సంస్థ తాజాగా రాష్ట్ర బీజేపీ కోసం పనిచేయడం ప్రారంభించింది. తొలుత రాష్ట్రంలో సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు సంబంధించిన అంశాలను ఈ సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. త్వరలో హైదరాబాద్లోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...ప్రదానంగా ఈ ఎన్నికల కోసం రాష్ట్రపార్టీ సమన్వయంతో ఈ సంస్థ పనిచేసేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. సర్కు సంబంధించిన పరిశీలనలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్కు ఈ సంస్థ నివేదిస్తున్నట్టు తెలిసింది. సర్లో భాగంగా బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఈ ప్రక్రియ ఎలా సాగుతోంది? పార్టీపరంగా ఏం చేయాలి? ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి? అనే అంశాలపై రాష్ట్ర నేతలకు ఈ బృందం దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా ‘అభీష్ట’పార్టీ కోసం పనిచేయనున్నట్టు తెలిసింది. ఏబీఎం, జార్వీస్ కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా కార్యాలయం పర్యవేక్షిస్తున్న ‘అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’(ఏబీఎం) ఎన్నికల కన్సల్టెన్సీ సంస్థ కూడా గత కొంత కాలంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తోంది. ఈ ఏజెన్సీ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తుండగా.. దీని ద్వారా బీజేపీ ఎజెండాను, పార్టీ ప్రచారం వ్యూహానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ను చేపడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ‘జార్వీస్’అనే మరో కన్సల్టెన్సీ సంస్థ కూడా ఎన్నికల సంబంధిత ముందస్తు తయారీ, కార్యక్రమాల రూపకల్పన, తదితర అంశాలపై దృష్టి పెట్టి విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ కోసం విస్తృతమైన కాల్ సెంటర్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణలో నమోదైన ఓటర్లను సంప్రదించడం, వారి నుంచి వివిధ అంశాలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవడం వంటి వాటిని చేపడుతున్నట్టు తెలిసింది. బూత్ కమిటీల నియామకం, వాటి పర్యవేక్షణ, క్షేత్రస్థాయి కార్యకర్తల సమీకరణ తదితర అంశాలను ఈ కన్సల్టెన్సీ పర్యవేక్షిస్తోంది. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఉపయోగించే సరళ్ యాప్ అభివృద్ధి, నిర్వహణతో జారి్వస్ సంస్థకు సంబంధం ఉన్నట్టుగా పార్టీవర్గాల సమాచారం. -
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
గన్ ఫౌండ్రి: దేశ రాజధానిలో రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీ తదితర నేతలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా, దేశ ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ వ్యవహరించన తీరును నిరసిస్తూ బీజేపీ గాం«దీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో బుధవారం గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయ పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో పరిస్థితి విషమించింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతోపాటు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక టీవీ జర్నలిస్టు, మహిళా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. బీజేపీ ఆధ్వర్యంలో... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు గాం«దీభవన్ ముట్టడికి ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ విచి్ఛన్నకర రాజకీయాలు, రాహుల్గాంధీ దేశ వ్యతిరేక వైఖరిపై బీజేపీ పోరుబాట చేస్తుందని చెప్పారు. నీట్ పరీక్ష పత్రం లీకేజిపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రాహుల్ ప్రధాని నివాసం ముట్టడికి దిగడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనలో అసలు విద్యార్థులే లేరని, కేవలం సామాజిక విద్రోహ, ఆ్రల్టాలెఫ్ట్ మూకలను జమచేసి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం గాం«దీభవన్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని గోషామహాల్, అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఎన్.రామచందర్రావు, ఇతర బీజేపీ నేతల అరెస్ట్పై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఎం.రఘునందన్రావు, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, ఖండించారు. నీట్ ప్రశ్నపత్రం అంశంపై లోక్ సభలో చర్చకు సిద్ధమని కేంద్ర్రం ముందుకు వచ్చినా కూడా చర్చకు రాకుండా కాంగ్రెస్ రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కిషన్రెడ్డి అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజిపై విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. కరీంనగర్లో ఉద్రిక్తత కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ నిరసన కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని కార్ఖానగడ్డ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి, కోర్టుసర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి ఊహించని విధంగా సమీపంలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం వైపు ర్యాలీ మళ్లింది. అప్రమత్తమైన పోలీసులు మేడిపల్లి సత్యంను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ తదితరులు కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. కార్యాలయంలో ఉన్న బీజేపీ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్రావు తదితరులు కర్రలతో కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారు. కార్యాలయం గేట్ వేసి పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ, ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. చెప్పులు, కుర్చీలు విసురుకున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి బీజేపీ నేతలు సిద్ధమవగా డీసీసీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అమ్మాయిల దుస్తులు చించేస్తారా..? బీజేపీ, కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందా..?
-
10 ఏళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్.. వారిలో ఒక్కరికీ శిక్షపడలేదు
-
కాంగ్రెస్ VS బీజేపీ..హైదరాబాద్ లో హై టెన్షన్
-
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థులు.. కాక్రోచ్ పార్టీ తరఫున ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వివాదం మధ్యలో నిలిచిన ధర్మేంద్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? బీజేపీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. పరీక్షా పత్రాల లీకేజీని ‘ఘోర పాపం’గా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.తండ్రి కేంద్ర మంత్రిధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది.వ్యూహకర్తగా.. బీజేపీలో క్రమంగా ఎదిగిన ధర్మేంద్ర ప్రదాన్ 2004లో తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా..2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రదాన్కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉజ్వల యోజన అమలును కేంద్రం ఆయన శాఖకు చెందిన ముఖ్య విజయాల్లో ఒకటిగా పేర్కొంది. ఆ తర్వాత 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు, విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు.నీట్ వివాదమే ఇప్పుడు అతిపెద్ద పరీక్షవిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్కు అతిపెద్ద రాజకీయ సవాల్గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని చెబుతోంది. లీక్ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ లీక్లో నిందితులపై చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల భవిష్యత్కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.@dpradhanbjp— Narendra Modi (@narendramodi) June 26, 2026బీజేపీలో ఎందుకు కీలకం?ధర్మేంద్ర ప్రదాన్ను బీజేపీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరిగా భావిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం అధిష్ఠానం దృష్టిలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ.. ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ-షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీట్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా.. ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముందున్న అసలు సవాల్ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి.. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై తగ్గిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత.. ఇవన్నీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ ముందున్న సవాళ్లు. మంత్రి పదవి కొనసాగుతుందా? లేదా?? అన్నది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. కోట్లాది విద్యార్థులు నమ్మే పరీక్షా వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం ఆయన ముందున్న అసలు పరీక్షగా మారింది.కుటుంబ నేపథ్యం.. వ్యక్తిగత జీవితంధర్మేంద్ర ప్రదాన్ భార్య పేరు మృదులా ప్రదాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. కుటుంబాన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ, ఎక్కువ సమయం పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలకే కేటాయించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ధర్మేంద్ర ప్రదాన్కు చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో క్లియర్గా వెల్లడించారు. -
10 నెలల కిందటే చెప్పా.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమీపంలో జరిగిన కాక్రోచ్ పార్టీ (CJP) ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యువత ఆకాంక్షలను పట్టించుకోకపోతే దేశంలో జెన్-జీ ఉద్యమం తప్పదని తాను 10 నెలల క్రితమే హెచ్చరించానని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘దాదాపు 10 నెలల క్రితం ఓ మీడియా సమావేశంలో.. యువత ఆశయాలు, ఆకాంక్షలను పరిష్కరించకపోతే మన దేశంలో జెన్-జీ నిరసన తప్పదని చెప్పాను’’ అని గుర్తుచేశారు.‘‘ఢిల్లీలో నిన్న జరిగిన నిరసనల తర్వాత కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుత పాలన, జవాబుదారీతనం, విద్యా రంగ సంస్కరణలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’’ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. యువతలో పెరుగుతున్న అసంతృప్తికి కారణాలను గుర్తించి, విద్యా వ్యవస్థలో మార్పులు, ఉద్యోగ అవకాశాలు, పాలనలో పారదర్శకత వంటి అంశాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. పార్లమెంట్ వైపు చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండడంతో.. పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. About 10 months ago, I had made a comment at a media event that a Gen-Z protest is imminent in our country if the aspirations of youngsters are not addressed After yesterday’s Delhi protest, it is high time for the Union Govt to address the demand for accountability and… pic.twitter.com/9kTIDx9Oi8— KTR (@KTRBRS) July 21, 2026 -
అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా.. ప్రశాంత్ కిషోర్ సవాల్!
పట్నా: బిహార్లోని పట్నా పరిధిలోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక రాజకీయం వేడెక్కింది. జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత నితిన్ నబీన్కు అలాగే బీజేపీకి బహిరంగ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే ఎవరి మద్దతూ లేకుండా ఒంటరిగా పోరాడి చూడండి’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్నాలోని బాంకీపూర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను తిప్పికొట్టేలా ఆయన నేరుగా ఎన్నికల రణక్షేత్రంలోకి దూకారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ఆయన ఈ సవాల్ విసిరారు. ఈ రాజకీయ సవాల్తో బీహార్ రాజకీయాల్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ప్రధాన రాజకీయ కేంద్రంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ దూకుడుతో అధికార, ప్రతిపక్ష శిబిరాల్లో ఉత్కంఠ నెలకొంది.ఇది కూడా చదవండి: పెరూలో భూకంపం.. ఆరుగురు మృతి -
‘ఆ ఇద్దరు ఒకటైతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా?’
సాక్షి, హైదరాబాద్: మరోసారి బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఒక మంచి ఆలోచనతో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఈటల రాజేందర్, బండి సంజయ్ని ఒక చోట కూర్చోబెట్టారు అభయ్ పాటిల్.. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒకటైతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా..?. ఆ నేతల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు..అయినా ఒకటిగానే ఉన్నారు. పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి?’’ అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు.‘‘గతంలో చాలామంది మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిచారు. వాళ్ల దగ్గరకి వెళ్లి వాళ్ల సమస్యలు, డివిజన్ సమస్యలు, బూత్ కార్యకర్తల సమస్యలు అడుగుతున్నారా?. గ్రేటర్ హైదరాబాద్లో జరిగే మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో మూడు మేయర్లు గెలుస్తామని చెపుతున్నారు. ఆ మూడు కార్పొరేషన్లలో బీజేపీ బలంగా ఉందని తెలుసుకున్నారా? సమావేశాల్లో మేము చాలా బలంగా ఉన్నామని బీజేపీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మూడు కార్పొరేషన్ మేయర్లు గెలవడం కాదు.. ఒకటి కూడా కాదు.. ఒక కార్పొరేషన్లోని సగం సీట్లు గెలిచి చూపించండి’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.‘‘బీజేపీ పని తీరు నాకు అట్లా కనిపిస్తుంది.. కొంత మందికి అధ్యక్ష పదవి రావొద్దని.. ఆ పదవిలో కొంత మంది రాంచందర్రావుని కూర్చోపెట్టారు. రాంచందర్ రావు చేతులు కట్టేసి పని చేయమంటే ఎట్లా?. రాంచందర్రావు ఎంత బాధలో ఉన్నారో నాకు తెలుసు. ఒకే ఒక్క వ్యక్తి మేము చెప్పినట్లే పని చేయాలని చెపితే ఎట్లా చేస్తారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిస్తే మీకే పేరు వస్తుంది. ఉన్న సీట్లలో తగ్గితే మీపైనే రాళ్లు వేస్తారు. మీ చేతులు కట్టేసిన వాళ్ళ గురించి కేంద్ర పెద్దలకు చెప్పండి. మీరు ఫ్రీ హ్యాండ్గా పని చేస్తేనే మంచి పలితాలు వస్తాయి...అధిష్టానం, పార్టీలో ఉన్న పెద్దలకి నా విజ్ఞప్తి.. ఒక వ్యక్తి కోసం ఎప్పడు ఆలోచన చేయకండి. నాలాంటి వాళ్లు పార్టీలోకి వచ్చి బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ భిక్షం నాకు వద్దు. ఇద్దరు ముగ్గురు ఇగోల వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగిందో హైకమాండ్కి చెప్పండి. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని బీజేపీ శ్రేణులు, ప్రజలు కోరుకుంటున్నారు. కాషాయ రాజ్యం కోసం చాలా మంది కలలు కంటున్నారు. ఆ కలలని నిజం చేయండి’’ అంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు. -
తెలంగాణ: రాబోయే నెల రోజుల్లో ఏం జరగబోతుందంటే..!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటనతో రాష్ట్ర పార్టీలో జోష్ వచ్చిందని.. ఆ తర్వాత ఇన్ఛార్ట్గా నా బాధ్యతలు నేను చేస్తున్నాను’’ అని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ అన్నారు. నిన్న(శనివారం) లక్ష్మణ్ ఇంట్లో ఇద్దరు కీలక నేతలతో కలిసి రొటీన్ లంచ్ మీటింగ్ జరిగిందన్నారు. మీటింగ్ తర్వాత కార్యకర్తల్లో జోష్ వచ్చిందని వింటున్నాను. పాజిటివ్ వేవ్ వస్తుందంటే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తాం కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.బండి సంజయ్, ఈటల రాజేందర్ సమావేశం ప్రత్యేకం కాదు.. ఇలాంటివి రానున్న రోజుల్లో చాలా జరుగుతాయి. రానున్న నెల రోజుల్లో ఏం జరగబోతుందో మీరే చూస్తారు. పార్టీని బలోపేతం చేయడం.. అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. సాయంత్రం మరో ఎమ్మెల్యేతో కూడా భేటీ కాబోతున్నాం. నితిన్ నబీన్ ఆదేశాలతో పని చేస్తున్నాను. పార్టీ డోర్స్ ఓపెన్ చేస్తున్నాం.. త్వరలో ఎవరెవరు వస్తారో చూడండి’’ అంటూ అభయ్ పాటిల్ చెప్పుకొచ్చారు. కాగా, రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతో కూడా అభయ్ పాటిల్ ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు.కాగా, రాష్ట్ర ముఖ్యనేతల మధ్య అంతర్గత వైషమ్యాలకు చెక్ పెట్టి, సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం నడుం బిగించింది. తెలంగాణలోని ఎంపీలు, ఇతర నాయకుల మధ్య నెలకొన్న ఈగోలు, గ్రూపులు, ఇతర సమస్యల పరిష్కారం దిశగా చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్రపార్టీకి కాయకల్ప చికిత్సలో భాగంగా... శనివారం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నివాసంలో రాష్ట్రపార్టీ ఇన్చార్జి అభయ్ పాటిల్ సమక్షంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. రెండుగంటల పాటు జరిగిన ఈ భేటీ అనంతరం ఇరువురు కరచాలనంతోపాటు ఆలింగనం చేసుకుని తమ మధ్య విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టినట్టుగా సంకేతమిచ్చారు.ఇప్పటివరకు జరిగిన విషయాలను పక్కనపెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఇరువురు కృషిచేయాలన్న అధిష్టానం సందేశాన్ని అభయ్పాటిల్ తెలియజేసినట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీలోని అంతర్గత రాజకీయాలపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టిందని.. ‘కమలదళానికి కాయకల్ప చికిత్స’ శీర్షికతో సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సంజయ్-ఈటల భేటీ, అనంతరం ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాసానికి అభయ్పాటిల్ వెళ్లి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. విభేదాలు నెలకొన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలను కూడా ఆయన త్వరలో కలిసి తమ మధ్య ఏర్పడిన అంతరాలను దూరం చేసుకుని పార్టీ దారిలోకి రావాల్సిందేనని హెచ్చరిస్తారని సమాచారం.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటనలో నేతలంతా విభేదాలు పక్కనపెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కలిసి పనిచేయాలని గట్టి హెచ్చరిక జారీ చేసివెళ్లారు. ఈ పర్యటన తర్వాత కొన్నిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్బన్సల్, అభయ్పాటిల్ ద్వారా రాష్ట్ర నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ దృష్టిపెట్టింది. తెలంగాణలోని నాయకులంతా పార్టీ లైన్లోకి రావాల్సిందేనని స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగా... ఎంతోకాలంగా ఉప్పు నిప్పుగా సాగుతున్న సంజయ్-ఈటలను ట్రాక్పైకి తెచ్చింది.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలో మంచి వాతావరణం ఉండాలని చెప్పింది. విభేదాలు విడిచి పార్టీ లైన్లోకి వచ్చేందుకు సుముఖంగా లేనివారిని పక్కన పెట్టి వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటామనే సంకేతాలు ఇచ్చేందుకూ సిద్ధమైంది. అభయ్ పాటిల్ చొరవతో ఎడమొహం పెడమొహంగా ఉన్న సంజయ్–ఈటల మధ్య సయోధ్య కుదిరినట్టేననే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తమ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి ముందుకు సాగుతామంటూ వీరిద్దరూ స్పష్టంచేసినట్టు తెలుస్తోంది.ఈ సమావేశం ముగిశాక బండి సంజయ్ స్పందిస్తూ.. ‘పార్టీ ఆదేశాలు నాకు శిరోధార్యం.. హైకమాండ్ ఏం చెబితే అది చేస్తా’ అని చెప్పారు. ఈటల సైతం స్పందిస్తూ.. ‘తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం, పార్టీ కోసం ఎందాకైనా వెళ్తా’ అని పేర్కొన్నారు. అయితే లక్ష్మణ్ మాత్రం... తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇది క్యాజువల్ లంచ్ మీట్ అని చెప్పడం గమనార్హం. కాంగ్రెస్ను గద్దె దించేందుకు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.సంస్థాగతంగా బలోపేతానికి నేతల మధ్య సమన్వయం, సమిష్టి తత్వం వాతావరణం నెలకొల్పే ప్రయత్నాలు ప్రారంభించింది. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో అభయ్ పాటిల్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, వర్గపోరుపై పార్టీ జాతీయ నాయకత్వం దృష్టిసారించింది. రాబోయే మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే నాయకుల మధ్య సమన్వయం తప్పనిసరని భావించింది. ఈ నేపథ్యంలో విభేదాలు ఉన్న ఏ ఇద్దరు నేతల మధ్యనైనా సరే సయోధ్య కుదిర్చే బాధ్యతను హైకమాండ్.. రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్కు అప్పగించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. అభయ్ పాటిల్ నిన్న ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్లతో ప్రత్యేకంగా లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఇద్దరు నేతలను ముఖాముఖి కూర్చోబెట్టి, విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని స్పష్టం చేస్తూ ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. బండి, ఈటల భేటీ ముగిసిన వెంటనే అభయ్ పాటిల్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తోనూ భేటీ అయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.రాష్ట్ర పార్టీలో ఇంకా సెట్ చేయాల్సిన అంశాలపై అభయ్ పాటిల్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా చర్చిస్తున్నారు. హైకమాండ్ ఆదేశాల ప్రకారం, తెలంగాణ బీజేపీలో ఏ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నా వాటిని వెనువెంటనే పరిష్కరించి ఏకతాటిపైకి తెచ్చేలా ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నారు. -
బెంగాల్లోనూ బుల్డోజర్ న్యాయం
కోల్కతా: బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన బెంగాల్లోనూ బుల్డోజర్ న్యాయం అమలవుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లా అమ్తాల్లో ఉన్న ఎంపీ అభిషేక్ బెనర్జీకి చెందిన టీఎంసీ కార్యాలయాన్ని అధికారులు శనివారం కూల్చివేశారు. ఉదయం అమ్తాల్ ప్రాంతాన్ని పోలీసులు, కేంద్ర బలగాలు దిగ్బంధించాయి. మధ్యాహ్నం వేళ అక్కడికి చేరుకున్న మూడు బుల్డోజర్లతో కార్యాలయం ముందున్న షెడ్ను, భవనం ముందు భాగాన్ని నేలమట్టం చేశాయి. భవన నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని జిల్లా అధికారులు తెలిపారు. భవనాన్ని అక్రమంగా నిర్మించారంటూ అందిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 15వ తేదీన సంబందీకులకు నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. భవన యాజమాని, నిర్మాణ వివరాలు కావాలని అడిగినా సమాధానం ఇవ్వలేదని తెలిపారు. అందుకే, చట్ట ప్రకారం, నిబంధనల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు వివరించారు. కాగా, ఆ సమయంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు తమ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. కూల్చివేత సమయంలో భవనంలో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, పెద్ద సంఖ్యలో ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అభిషేక్ డైమండ్ హార్బర్ ఎంపీ కాగా, అమ్తాలా ఆ నియోజకవర్గంలో ఒక భాగం. టీఎంసీ పార్టీ కార్యాలయం నడుస్తున్న ఈ భవనం లీప్స్ అండ్ బౌండ్ అనే కంపెనీ పేరుతో కొనుగోలు చేసినట్లు రికార్డుల్లోఉందని అధికారులు తెలిపారు. అన్ని అనుమతులు ఉన్నాయి: ఎంపీ అభిషేక్ అమ్తాలాలోని టీఎంసీ కార్యాలయ భవనమున్న స్థలాన్ని తాము కొనుగోలు చేసిన చోటే అన్ని అనుమతులు పొందాకే నిర్మించినట్లు ఎంపీ అభిషేక్ బెనర్జీ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగానే కూల్చివేతలు చేపట్టిందన్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూమిలోనే భవనాన్ని కట్టామని చెప్పారు. దీనిపై కలకత్తా హైకోర్టులో అన్ని ఆధారాలతో పిటిషన్ వేస్తామని, సత్వరమే విచారణ చేపట్టాలని కోరుతామన్నారు. భవనాన్ని బుల్డోజర్లతో ధ్వంసం చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు కూడా అందులో పాలుపంచుకోవడం, ఆ ప్రాంతంలో కూల్చివేతలను పర్యవేక్షించిన అధికారులు, సిబ్బందికి సంబంధించిన మొత్తం వీడియో తమ వద్ద ఉందన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)కి కూడా ఫిర్యాదు చేస్తామని వివరించారు. -
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ లక్ష్మణ్ ఇంటికి బండి సంజయ్, ఈటల రాజేందర్ వెళ్లారు. ఈటల, బండి సంజయ్ మధ్య సయోధ్య దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. పార్టీ అంతర్గత విభేదాలపై ఇప్పటికే హైకమాండ్కు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. నేతల విభేదాలకు చెక్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.కాగా, కమలదళానికి కాయకల్ప చికిత్స సిద్ధమైంది. బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యమైన అధికార సాధన అనే కీలక ఘట్టానికి చేరడంలో రాష్ట్రపార్టీ ఎదుర్కొంటున్న బలహీనతలు, ఇబ్బందులను జాతీయ అధినాయకత్వం గుర్తించింది. రాష్ట్ర పార్టీలోని ముఖ్య నేతల ఈగోలు, సమన్వయలేమి అనేవి ప్రధాన సమస్యలుగా మారాయని గుర్తించి ‘కీలెరిగి వాత’పెట్టేందుకు సమాయత్తమైనట్లుగా బీజేపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.దశాబ్దాలుగా తెలంగాణలో బీజేపీకి గుర్తింపు ఉన్నా.. గత 10–15 ఏళ్లుగా పూర్తిస్థాయిలో రాజకీయంగా పుంజుకునే అవకాశాలున్నా వాటిని వినియోగించుకోకపోవడంపై జాతీయనాయకత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ పూర్తిస్థాయిలో పుంజుకుని, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లకు ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదగకపోవడానికి ముఖ్యనేతలంతా ‘ఎవరికి వారే యమునాతీరే’అన్నట్టుగా వ్యవహరిస్తుండడం ముఖ్యమైన సమస్యగా పరిణమించిందని వారు అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో (3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు గెలుపు) ముఖ్యనేతల మధ్య గ్రూపుల సమస్య తీవ్రస్థాయికి చేరినట్లుగా వారు అంచనా వేసినట్లు సమాచారం.ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో గ్రూపు రాజకీయాల కుంపట్లు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇక వాటికి చెక్ పెట్టాల్సిన రోజులు దగ్గరపడ్డాయని అగ్రనేతలు గుర్తించినట్లు సమాచారం. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన సీనియర్ నేతలకు, కొన్నేళ్ల క్రితం చేరిన వలస నేతలకు మధ్య తీవ్రస్థాయిలో నడుస్తున్న కోల్డ్ వార్కు సైతం చరమగీతం పాడాలని నిర్ణయించినట్టు సమాచారం. -
నోట్ల ముద్రణ ప్రైవేట్ పరం?.. అఖిలేష్ సంచలన ఆరోపణలు!
లక్నో: దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన ఒక టెండర్ నోటీసును అఖిలేష్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రస్తావిస్తూ ఈ ఆరోపణలు చేశారు.నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక పాలీమర్ సబ్స్ట్రేట్ షీట్ల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన నోటీసుపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ‘భ్రష్ట బీజేపీ పాలనలో ఇప్పుడు కరెన్సీ నోట్ల ప్రైవేటీకరణ కూడా జరగబోతోందా?’ అని ఆయన ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ పరంగా స్వయం ప్రతిపత్తిని కోల్పోతే, దేశం ఎలా ఆత్మనిర్భర్ భారత్గా మారుతుందని ఆయన నిలదీశారు. भ्रष्ट भाजपा राज में अब नोटों का भी प्राइवेटाइजेशन हो जाएगा क्या? कमीशनख़ोरी का मॉडल इस हद तक गिर जाएगा, देश की जनता ने सोचा न था। जब देश की मुद्रा ही आत्मनिर्भर नहीं होगी तो अर्थव्यवस्था और देश आत्मनिर्भर कैसे होगा? अब क्या सरकार भी आउटसोर्सिंग पर दे दी जाएगी?इतने बड़े और… pic.twitter.com/rvyxRjY5rZ— Akhilesh Yadav (@yadavakhilesh) July 17, 2026బీజేపీ ప్రభుత్వం పాలకుల వలె కాకుండా, లాభాపేక్ష కలిగిన వ్యాపారుల భాగస్వామిగా వ్యవహరిస్తోందని, ఈ టెండర్ ప్రక్రియ కేవలం నామమాత్రపు లాంఛనం మాత్రమేనని అఖిలేష్ ఆరోపించారు. కాగా, ఈ టెండర్లకు సంబంధించిన బిడ్లు ఆగస్టు 18న తెరవనున్నారు. కరెన్సీ వంటి అత్యంత సున్నితమైన అంశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు.ఇది కూడా చదవండి: ఆమిర్ ఖాన్కు గ్యాంగ్స్టర్ హెచ్చరిక -
అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్ గేమ్!
మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తెర వెనుక కదలికలు మొదలయ్యాయా? కొంతకాలంగా దూరంగా ఉన్న రాజకీయ శిబిరాల మధ్య పెరుగుతున్న రాకపోకలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతలు అధికార కూటమి పెద్దలను కలుస్తుండటం.. కీలక నాయకుల మధ్య జరుగుతున్న భేటీలు.. భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్న పవార్ కుటుంబం చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఢిల్లీ నుంచి ముంబై వరకు హాట్టాపిక్గా మారాయి.ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో శరద్ పవార్ వర్గానికి చెందిన నేతల భేటీలు, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో శరద్ పవార్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ సమావేశాలు అధికారికంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసమేనని నేతలు చెబుతున్నప్పటికీ.. తెర వెనుక రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని NCP (శరద్చంద్ర పవార్) ఎన్డీఏ వైపు అడుగులు వేయబోతోందా? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ పరిణామాల వెనుక బీజేపీ ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందన్న చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.బీజేపీ వ్యూహం ప్రకారం.. ముందుగా విడిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వర్గాలను మళ్లీ దగ్గర చేయడం, ఆ తర్వాతే ఎన్డీఏతో సంబంధాలపై ముందుకు వెళ్లడం లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే కేవలం శరద్ పవార్ వర్గాన్ని కూటమిలోకి తీసుకోవడం కాకుండా.. మొత్తం ఎన్సీపీని ఒకే రాజకీయ శక్తిగా మార్చి ఎన్డీఏలోకి తీసుకురావాలన్న ఆలోచన ఉన్నట్లు సమాచారం.2023 జూలైలో అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది. శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) పేరుతో కొనసాగుతోంది.ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ వర్గం అధికారంలో భాగస్వాములుగా ఉన్నాయి. మరోవైపు శరద్ పవార్ వర్గం ప్రతిపక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు దగ్గరవడం జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.బీజేపీ వ్యూహంలో మూడు దశలు?రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. బీజేపీ వ్యూహం మూడు దశల్లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మొదట పవార్ వర్గాల మధ్య సయోధ్యకు మార్గం సుగమం చేయడం, రెండో దశలో ఎన్సీపీ పునరేకీకరణ, మూడో దశలో ఎన్డీఏతో అధికారిక అనుబంధం వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శరద్ పవార్ వర్గాన్ని నేరుగా ఎన్డీఏలోకి తీసుకోవడంపై బీజేపీలో కొంత సంకోచం ఉందని సమాచారం. ముందుగా పార్టీ అంతర్గత విభేదాలు పరిష్కారమైతేనే దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.బీజేపీకి అసలు లాభం ఏంటి?ఈ మొత్తం పరిణామాల్లో బీజేపీకి ఉన్న ప్రధాన రాజకీయ లాభం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో శరద్ పవార్కు దశాబ్దాలుగా ఉన్న రాజకీయ ప్రభావం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న పట్టు బీజేపీకి కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీకి అధికార బలం ఉన్నప్పటికీ.. మరాఠా రాజకీయాల్లో పవార్ కుటుంబ ప్రభావాన్ని పూర్తిగా పక్కన పెట్టడం అంత సులువు కాదు. శరద్ పవార్ వర్గం ఎన్డీఏకు దగ్గరైతే.. ప్రతిపక్ష శక్తులను బలహీనపరచడంతో పాటు, భవిష్యత్ ఎన్నికల్లో కూటమికి అదనపు బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ముఖ్యంగా 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడం బీజేపీకి కీలక వ్యూహంగా మారనుంది. ప్రస్తుతం శరద్ పవార్ వర్గం ఇండియా కూటమిలో భాగంగా ఉండటం వల్ల ప్రతిపక్షాలకు ఓ రాజకీయ ఆధారం లభిస్తోంది. ఆ వర్గం ఎన్డీఏ వైపు వస్తే.. ఇండియా కూటమికి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా పార్లమెంట్లో కీలక బిల్లులపై సంఖ్యాబలం కూడా బీజేపీకి ఉపయోగపడుతుంది. లోక్సభలో ఎనిమిది మంది సభ్యులు ఉన్న NCP(SP) మద్దతు లేదా అనుకూల వైఖరి కేంద్రానికి రాజకీయంగా ప్రాధాన్యత కలిగించవచ్చు.మరోవైపు మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ రాజకీయాల్లో కూడా పవార్ వర్గాల కలయిక బీజేపీ-షిండే-అజిత్ కూటమికి అదనపు బలం ఇవ్వగలదన్న అంచనాలు ఉన్నాయి.అయితే దీనికి మరో వైపు కూడా ఉంది. శరద్ పవార్ వంటి సీనియర్ నేతను ఎన్డీఏలోకి తీసుకురావడం వల్ల కూటమిలో అంతర్గత సమతుల్యత ఎలా ఉంటుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గాల మధ్య సయోధ్య సాధ్యమవుతుందా? అన్నదే అసలు సవాల్గా మారనుంది.కేంద్ర కేబినెట్ ఆశలు.. అజిత్ వర్గం ఎదురుచూపులుఇదిలా ఉండగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర స్థాయిలో మరింత ప్రాధాన్యత కోసం ఎదురుచూస్తోంది. భవిష్యత్ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తమ పార్టీకి ప్రాతినిధ్యం రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు పార్థ్ పవార్కు కేంద్ర కేబినెట్లో అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం ఢిల్లీ బీజేపీ పెద్దల చేతుల్లోనే ఉందని తెలుస్తోంది.ఆమె ఖండించినా.. కొనసాగుతున్న ప్రచారంమరోవైపు శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్డీఏలో చేరే ప్రచారాన్ని ఖండిస్తోంది. NCP(SP) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కూడా ఇలాంటి వార్తలను పలుమార్లు తోసిపుచ్చారు. తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోందని, అలాంటి ఊహాగానాల్లో వాస్తవం లేదని ఆమె వ్యాఖ్యానించారు.అయితే పార్లమెంట్ లెక్కలు, రాబోయే రాజకీయ పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం ప్రాధాన్యతను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లోక్సభలో NCP(SP)కు ఉన్న ఎనిమిది మంది ఎంపీల సంఖ్య కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.మొత్తంగా చూస్తే.. మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ లెక్కలు కొత్త దిశలో సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. పవార్ కుటుంబంలో మళ్లీ ఐక్యత వస్తుందా? ఎన్సీపీ పునరేకీకరణ జరుగుతుందా? లేక ఇవన్నీ కేవలం రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. -
కమలదళానికి కాయకల్ప చికిత్స
సాక్షి, హైదరాబాద్: కమలదళానికి కాయకల్ప చికిత్స సిద్ధమైంది. బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యమైన అధికార సాధన అనే కీలక ఘట్టానికి చేరడంలో రాష్ట్రపార్టీ ఎదుర్కొంటున్న బలహీనతలు, ఇబ్బందులను జాతీయ అధినాయక త్వం గుర్తించింది. రాష్ట్ర పార్టీలోని ముఖ్య నేత ల ఈగోలు, సమన్వయలేమి అనేవి ప్రధాన స మస్యలుగా మారాయని గుర్తించి ‘కీలెరిగి వాత’పెట్టేందుకు సమాయత్తమైనట్లుగా బీజేపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. దశాబ్దాలుగా తెలంగాణలో బీజేపీకి గుర్తింపు ఉన్నా, గత 10–15 ఏళ్లుగా పూర్తిస్థాయిలో రాజకీయంగా పుంజుకునే అవకాశాలున్నా వాటిని వినియోగించుకోకపోవడంపై జాతీయనాయకత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా గత కొన్నినెలలుగా పార్టీతో ప్రత్యక్ష సంబంధాలు లేని రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆరెస్సెస్) అనుకూల శక్తుల ద్వారా రాష్ట్రంలోని పరిస్థితులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయి లోపాలపై నివేదికలు..: బీజేపీ పట్ల, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప ట్ల తెలంగాణ ప్రజలు పూర్తి ఆదరాభిమానాల ను ప్రదర్శిస్తున్నా దానిని రాష్ట్రపార్టీ నాయకులు ఉపయోగించుకోలేక పోవడానికి ప్రధాన కారణాలను సంఘ్ పరివార్ ప్రతినిధులు గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో తాము జరిపిన సుదీర్ఘ అధ్యయనం ఆధారంగా రూపొందించిన ఓ నివేదికను జాతీయ నాయకత్వానికి అందజేసినట్లు సమాచారం.తెలంగాణలో బీజేపీ పూర్తిస్థాయిలో పుంజుకుని, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లకు ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదగకపోవడానికి ముఖ్యనేతలంతా ‘ఎవరికి వారే యమునాతీరే’అన్నట్టుగా వ్యవహరిస్తుండడం ముఖ్యమైన సమస్యగా పరిణమించిందని వారు అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో (3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు గెలుపు)ముఖ్యనేతల మధ్య గ్రూపుల సమస్య తీవ్రస్థాయికి చేరినట్లుగా వారు అంచనా వేసినట్లు సమాచారం. సర్వేల్లో సమస్యలు తేటతెల్లం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా ‘కాషాయజెండా’పాతుతామని ఢిల్లీ పెద్దలు గట్టిగా చెబుతున్నా దానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో అందుకు తగిన పరిస్థితులు లేవని పరిశీలకులు తేల్చినట్లు పార్టీవర్గాల సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెరుగుతున్నా నేతల మధ్య ఉన్న అంతరాలు, గ్రూపు రాజకీయాల వల్ల అది ఓట్లుగా మారడం లేదని బీజేపీ హైకమాండ్ గుర్తించింది. రాష్ట్ర బీజేపీకి రాజకీయ ప్రత్యర్థులు, బయటి శత్రువుల కంటే కూడా అంతర్గతంగా లోపలి వారే పెద్ద మైనస్గా మారారని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని ఉమ్మడిగా ముందుకు నడపాల్సిన నేతలే ఒకరి కాళ్లు మరొకరు లాక్కుంటూ, పరస్పరం గోతులు తవ్వుకుంటున్నారని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉడుకుతున్న ఉత్తర తెలంగాణ... ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో గ్రూపు రాజకీయాల కుంపట్లు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇక వాటికి చెక్ పెట్టాల్సిన రోజులు దగ్గరపడ్డాయని అగ్రనేతలు గుర్తించినట్లు సమాచారం. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన సీనియర్ నేతలకు, కొన్నేళ్ల క్రితం చేరిన వలస నేతలకు మధ్య తీవ్రస్థాయిలో నడుస్తున్న కోల్డ్ వార్కు సైతం చరమగీతం పాడాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యనేతలు, ఎంపీలు మధ్య విభేదాలను అస్త్రంగా చేసుకుని ఇతర విపక్షాలు సోషల్ మీడియాలో ట్రోల్స్, ట్రాప్స్ రెడీ చేస్తున్నాయి. ఇదే సమయంలో సొంత పార్టీలోని కొందరు నేతలు సైతం వీరి మధ్య గొడవలున్నాయని సాకుగా చూపుతూ...తమకు అవకాశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం పార్టీని మరింత బలహీనపరుస్తోందని ఈ నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ విభేదాలకు చెల్లుచీటి దిశలో అధినాయకత్వం వెంటనే చర్యలతోపాటు ఆయా నేతల మధ్య సంధికి సమాలోచనలతో త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని సంకేతాలు ఇచి్చనట్లుగా పార్టీవర్గాల సమాచారం. -
హిందూ విద్యార్థులకు తిలక ధారణ తప్పనిసరి చేస్తాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందూ విద్యార్థులందరికీ తిలక ధారణ తప్పనిసరి చేస్తామని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కల్మా సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేసిన సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని హిందూ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలని ఓ ప్రకటనలో కోరారు. దీనిపై సోకాల్డ్ సెక్యులర్ సంఘాలు నోరెందుకు మెదపడం లేదని, దీనిని చూసీచూడనట్లు వదిలేస్తే తెలంగాణ అంతటా ఈ సంస్కృతి విస్తరించే ప్రమాదం ఉందన్నారు. ఆటో డ్రైవర్ భరత్ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలవల్లే.. కాంగ్రెస్ మార్క్ ‘ఎడ్యుకేషన్ జిహాద్’పై సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు.. ముస్లింలు అంటే కాంగ్రెస్’అన్న రేవంత్రెడ్డి ఓటు బ్యాంకు, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల వల్లే ఇలాంటి శక్తులకు తెగింపు పెరిగిందని మండిపడ్డారు. సక్సెస్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ‘కుట్ర’గా అభివర్ణించిన వీహెచ్పీ న్యూఢిల్లీ: హైదరాబాద్లోని సక్సెస్ స్కూల్లో హిందూ మతానికి చెందిన విద్యార్థికి కల్మా చదవడాన్ని హోంవర్క్గా ఇవ్వడాన్ని వీహెచ్పీ ఖండించింది. ఇది ఏదైనా ‘కుట్ర’లో భాగమా కాదా అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించాలని డిమాండ్ చేసింది. ఇందులో ప్రమేయం ఉన్నవారిని గుర్తించేందుకు దర్యాప్తు జరపాలని వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. స్కూల్పై చర్యలు తీసుకోవాల్సిందే: కిషన్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: హిందువులకు కల్మా చదవాల్సిన అవసరం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులపై మతపరమైన అంశాలను బలవంతంగా రుద్దుతున్న సైదాబాద్లో ఉన్న సక్సెస్ స్కూల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. హైదరాబాద్లో అన్ని ప్రైవేటు స్కూళ్లలో పాఠాల బోధనపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెంచాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఉందని ఎవరైనా మతాంతీకరణకు ప్రయత్నిస్తే.. చూస్తూ ఉరుకునే ప్రసక్తే లేదని కిషన్రెడ్డి హెచ్చరించారు. -
బీజేపీ మిషన్ 360.. మోదీ మాస్టర్ ప్లాన్కు కౌంట్డౌన్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకుముందు బీజేపీ తన 'మిషన్ 360' ప్రయత్నాలను వేగవంతం చేసింది. నరేంద్ర మోదీ సర్కార్ మహిళలకు రిజర్వేషన్, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు అంశాలను ఒకదానితో ఒకటి అనుసంధానించాలనే ఆలోచనలో ఉంది. ఏప్రిల్లో జరిగిన 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు అవసరమైన రెండు వంతుల మెజారిటీ లభించలేదు. దీంతో మరోసారి ప్రయత్నించే ముందు మద్దతు పెంచుకునే చర్యలను ఎన్డీఏ ముమ్మరం చేసింది.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులు ఈ సారి సర్కార్కు అనుకూలంగా ఉండొచ్చని బీజేపీ భావిస్తోంది. పార్లమెంట్లో తన బలాన్ని పెంచుకునే లక్ష్యంతో అధికార పార్టీ విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమావేశాలకు ముందు చర్చలు వేగవంతం చేశాయి.తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ), శరద్ పవార్ వర్గంలో ఇటీవల ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నా, రాజ్యాంగ సవరణ ఆమోదానికి అవసరమైన రెండు వంతుల మెజారిటీకి బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఇంకా దాదాపు ఆరుగురు ఎంపీల మద్దతును సంపాదింకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిపాదిత బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నం సర్కార్ చేస్తుందా అన్న అంశంపై రాజకీయ పరిశీలకులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో జులై 19న బీజేపీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.బీజేపీ వ్యూహాలువర్షాకాల సమావేశాలకు ముందు బీజేపీ అంతర్గత చర్చలను వేగవంతం చేసింది. గత వారం రోజులుగా పార్టీ అగ్రనేతలు పలు కీలక సమావేశాలు నిర్వహించారు. వాటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్. సంతోష్ హాజరయ్యారు.వర్షాకాల సమావేశాల్లో సర్కార్ అనుసరించాల్సిన పార్లమెంటరీ వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో బి.ఎల్. సంతోష్ హాజరు కావడంతో నితిన్ నబీన్ నాయకత్వంలో కొత్త జాతీయ బృందాన్ని బీజేపీ త్వరలో ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సంస్థాగత స్థాయిలో విస్తృత సంప్రదింపులు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి పదవులకు తగిన నాయకుల పేర్లను కోరారు. వచ్చిన సిఫార్సుల ఆధారంగా కొత్త బృందాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధానమంత్రి నివాసంలో జరిగిన సమావేశం సంస్థాగత అంశాలకే పరిమితం కాలేదు. సర్కార్ శాసన కార్యక్రమం, ప్రతిపక్షాల వ్యూహం, సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్న బిల్లులపై కూడా చర్చ జరిగింది. వాటిలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు రిజర్వేషన్కు సంబంధించిన ప్రతిపాదనలపైనే ఎక్కువ చర్చ సాగింది.ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలమే!ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గతంతో పోలిస్తే మరింత అనుకూలంగా ఉన్నాయని సర్కార్ భావిస్తోంది. అధికార కూటమి బలమైన స్థితిలో ఉండగా, ప్రతిపక్షం తక్కువ బలంతో కనిపిస్తోందని అంచనా వేస్తోంది. పలు ప్రాంతీయ పార్టీల వైఖరి కీలకంగా మారే అవకాశం ఉంది. 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే కొన్ని అంశాల్లో సర్కార్కు మద్దతు ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపిన వివరాల ప్రకారం.. కీలక అంశాల్లో డీఎంకే వైఖరి కాంగ్రెస్ వైఖరితో భిన్నంగా ఉండొచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. పార్లమెంట్లో కాంగ్రెస్కు దూరంగా ఉండాలని, సభలో విడిగా కూర్చోవాలని డీఎంకే నిర్ణయించినట్టు సమాచారం. దీనితో అంశాల వారీగా డీఎంకే మద్దతు లభిస్తుందన్న ఆశలను బీజేపీ పెంచుకుంది.ప్రస్తుతం ఉన్న 3 ఖాళీల కారణంగా లోక్సభ సభ్యుల సంఖ్య 540గా ఉంది. రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు అవసరం.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఎన్డీఏకు దాదాపు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన ఎన్సీపీఐకి చెందిన 20 మంది ఎంపీలు, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల మద్దతు లభిస్తే ఆ సంఖ్య దాదాపు 335కు చేరొచ్చు. మరికొన్ని పార్టీల నుంచి మరో 5 కలుపుకుని మద్దతు దాదాపు 340కు చేరుతుందని అంచనా.మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకుంటోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరినట్టు వస్తున్న సమాచారంతో ఎన్డీఏ బలం దాదాపు 346కు చేరే అవకాశం ఉంది. 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ పార్టీ కూడా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వంటి రాజ్యాంగ సవరణకు మద్దతు ఇస్తే, కూటమి సంఖ్య దాదాపు 354కు చేరుతుంది. అయినా రెండు వంతుల మెజారిటీకి ఇంకా ఆరుగురు ఎంపీలు తక్కువగానే ఉంటారు.చివరి ఆరుగురు ఎంపీల మద్దతు ఎలా సాధిస్తుంది?రెండు వంతుల మెజారిటీ దాటాలంటే ఎన్డీఏకు ఇంకా ఆరుగురు ఎంపీల మద్దతు అవసరం. ఈ పరిస్థితుల్లో హోంమంత్రి అమిత్ షా వరుస రాజకీయ సమావేశాలు నిర్వహించారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, వర్షాకాల సమావేశాలకు ముందు బీజేపీ తన సంఖ్యాబలాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ పలు పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తోంది.మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు షరతులతో మద్దతు ఇస్తామని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంకేతాలు ఇచ్చారు. అయితే ఆయన పార్టీ పెట్టిన షరతులను సర్కార్ అంగీకరించే అవకాశం తక్కువని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
ఎమ్మెల్యే సంజయ్ కు ఘోర అవమానం
-
మా హయాంలోనే సింగరేణికి వెలుగు
రుద్రంపూర్: దేశ ప్రధానిగా మన్మోహన్సింగ్ ఉన్నప్పుడు రూ.2.50 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక పైసా దారి తప్పకుండా చూస్తూ సింగరేణిని ఆదుకునే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ‘సింగరేణి భరోసా యాత్ర’పేరిట చేపట్టిన యాత్ర మొదటి రోజైన సోమవారం కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి వరకు కొనసాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, మహబూబ్నగర్ ఎంపీ డీకే.అరుణ, నాయకులతో కలిసి యాత్రలో కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పైసలు తీసుకొని బ్లాక్లు కేటాయించే విధానం ఉంటే, దీన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. దీంతో బీజేపీ అధికారంలోకి వచ్చాక వేలంలో పాల్గొన్న వారే బ్లాక్లు పొందే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు.సింగరేణి సంస్థకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్, బొగ్గుకు సంబంధించి సుమారు రూ.54 వేల కోట్ల బకాయి ఉండడంతో అభివృద్ధి కుంటు పడిందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్రం తొలిసారి వేలం లేకుండా తాడిచర్ల–2 బ్లాక్ను సంస్థకు కేటాయించిందని తెలిపారు. ప్రజలు, కారి్మకులు బీజేపీ కృషిని గుర్తించి రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఆదరించాలని కిషన్రెడ్డి కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, నేతలు కోటేశ్వరరావు, అంజిరెడ్డి, గౌతంరావు, ఆనంద్ గౌడ్, బైరెడ్డి ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
రౌడీషీటర్ బర్త్డే పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సందడి
బెంగళూరు: తమిళనాడులోని బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ దాసా అలియాస్ ‘కింగ్ మేకర్ దాసా’ పుట్టినరోజు వేడుకల్లో యలహంక బీజేపీ శాసనసభ్యుడు ఎస్ఆర్ విశ్వనాథ్ పాల్గొనడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. నెలకుంట్ల పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.ఈ వీడియోలో రౌడీషీటర్ దాసా కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే విశ్వనాథ్ ఆయనకు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యేతో పాటు పలువురు స్థానిక బీజేపీ నేతలు కూడా ఈ సంబరాల్లో ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ వేడుకల సమయంలో పోలీసులెవ్వరూ అక్కడ లేకపోవడం గమనార్హం.చిక్కజాల పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్గా నమోదైన దాసాపై యలహంక, నెలమంగళ, దాసరహళ్లి ప్రాంతాల్లో భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది కూడా దాసా పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఒక బెంగళూరు పోలీసు ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఏడాది ప్రజాప్రతినిధి స్వయంగా రౌడీషీటర్ వేడుకల్లో పాల్గొనడంపై నెటిజన్లు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మాదానాయకనహళ్లి పోలీసులు స్పందిస్తూ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు! -
జర్నలిస్ట్ను పెళ్లాడిన ‘ఆర్జీ కర్’ దర్శకుడు.. రూమర్లకు ఎండ్కార్డ్!
కోల్కతా: ప్రముఖ బీజేపీ నేత, సినీ దర్శకుడు శంకుదేబ్ పాండా తాజాగా టెలివిజన్ జర్నలిస్ట్, రిపబ్లిక్ బంగ్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్వర్ణాలి మితా సర్కార్ను కోల్కతాలో వివాహం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం సంప్రదాయ బెంగాలీ పద్ధతిలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి రిలేషన్షిప్పై వస్తున్న ఊహాగానాలకు ఈ పెళ్లితో తెరపడింది. ఈ వివాహ వేడుకకు రాజకీయ, వినోద, మీడియా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. Congrats 👏 Sankudeb Panda & Swarnli Sarkar Definitely Love Marriage ❤️ pic.twitter.com/GnMzvkTTVT— SANDIP HALDER (@HALDERSAN) July 12, 2026వివాహ వేడుకలో శంకుదేబ్ పాండా ఎరుపు రంగు కుర్తా, ధోవతి ధరించగా.. స్వర్ణాలి మితా సర్కార్ సాంప్రదాయ బంగారు ఆభరణాలు, ఎరుపు రంగు బనారసి చీరలో మెరిసిపోయారు. పెళ్లికి ముందు జరిగిన ‘గాయే హోలుద్’వేడుక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. శంకుదేబ్ పాండా రాజకీయాలతో పాటు సినిమా రంగంలోనూ కొనసాగుతున్నారు. ఆర్జీ కర్ ఆస్పత్రి అత్యాచారం, హత్య ఉదంతం ఆధారంగా ఆయన త్వరలో ‘అభయ శక్తి’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రాణా సర్కార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ ఘటనకు సంబంధించిన కీలక పరిణామాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు, ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, ఒక ఉద్యమమని శంకుదేబ్ పేర్కొన్నారు. వివాహ బంధంతో సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆయన, త్వరలోనే ఈ సినిమా పనుల్లో బిజీ కానున్నారు.ఇది కూడా చదవండి: అయోధ్య విరాళాల గోల్మాల్: ఆరెస్సెస్ నమ్మకం ఇదే.. -
కాళేశ్వరం పునరుద్ధరణలో కాంగ్రెస్ విఫలం.. రాంచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం మూడు బ్యారేజీల పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ఆలస్యంతో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ రోజు (ఆదివారం) కాళేశ్వరం ప్రాజెక్టు అంశమై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. NDSA సిఫారసులను సకాలంలో అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం చెందిందని 2024, 2025, 2026లో మూడు పూర్తి వర్కింగ్ సీజన్లు ఉన్నా పునరుద్ధరణ పనులు పూర్తి చేయలేదన్నారు.రాంచందర్ రావు లేఖలో "200 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయింది. NDSA ఇప్పటికే సమగ్ర పరీక్షలు, సాంకేతిక పరిశీలనలు, పునరుద్ధరణ చర్యలు సూచించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సాంకేతిక మార్గదర్శకత్వానికేనని, అమలు బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే NDSA కమిటీపై బాధ్యత నెట్టడం ద్వారా సీఎం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారుఅన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తక్కువ నష్టం జరిగిందని, వాటిని ముందే పునరుద్ధరిస్తే ఉత్తర తెలంగాణకు నీరు అందేది. 20–25 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణకు తాగునీరు అందించే అవకాశం కోల్పోయింది." అన్నారు.విజిలెన్స్ కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని, విజిలెన్స్ నివేదికలో సూచించిన వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం హైకోర్టులో సమర్థంగా వాదించలేదు.బీఆర్ఎస్ పెద్దలను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. CBI విచారణకు కేవలం మూడు బ్యారేజీల అంశానికే పరిమితమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారన్నారు. రూ.1.30 లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని.. పంప్ హౌస్లు, కాల్వలు, టన్నెల్లు, రిజర్వాయర్లు సహా మొత్తం ప్రాజెక్టుపై CBI విచారణ జరగాలని రాంచందర్ రావు లేఖలో పేర్కొన్నారు. -
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్
కోల్కతా: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన మరో 12 బ్యాంకు ఖాతాలను పశ్చిమ బెంగాల్ పోలీసులు స్తంభింపజేశారు. అంతకుముందు రోజు పార్టీకి చెందిన 3 ఖాతాలను పరిమితంగా నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఆ 3 ఖాతాల్లో సుమారు రూ.440 కోట్ల నిధులు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.సీనియర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తాజాగా స్తంభింపజేసిన 12 ఖాతాలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 15 టీఎంసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. వాటిలో సుమారు రూ.1,000 కోట్ల డిపాజిట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఖాతాల యజమానుల వివరాలు, నమోదైన ఆర్థిక లావాదేవీల సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరినట్టు సమాచారం.ఈ చర్యకు ఒక రోజు ముందు కోల్కతా హైకోర్టు టీఎంసీకి చెందిన 3 హెచ్డీఎఫ్సీ ఖాతాలను పరిమితంగా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు రిటైర్డ్ న్యాయమూర్తి సుబ్రత తాలూక్దార్ను ప్రత్యేక అధికారిగా నియమించింది.తాత్కాలిక ఉత్తర్వుల ప్రకారం, ప్రత్యేక అధికారి ప్రతి చెక్కుపై ప్రతిసారి సంతకం చేసిన తర్వాత మాత్రమే టీఎంసీ ఆ నిధులను రోజువారీ పరిపాలనా ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, న్యాయపరమైన ఖర్చుల కోసం వినియోగించవచ్చు. ప్రత్యేక అధికారికి పార్టీ నిధుల నుంచి నెలకు రూ.1.25 లక్షల పారితోషికం చెల్లిస్తారు.పోలీసులు పార్టీకి చెందిన 3 ఖాతాలను స్తంభింపజేయడంతో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ మమతా బెనర్జీ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత తిరుగుబాటు చేసిన టీఎంసీ ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకును కోరారు.నిధుల మూలంపై దర్యాప్తు చేపట్టాలని బిధాన్నగర్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగానికి కూడా వారు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈడీ చర్యను సవాల్ చేసిన టీఎంసీపోలీసుల చర్యతో పాటు, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కూడా అదే 3 ఖాతాలను స్తంభింపజేయడంతో టీఎంసీ ఇప్పటికీ ఆ రూ.440 కోట్ల నిధులను వినియోగించలేకపోతోంది. ఈడీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీఎంసీ శుక్రవారం కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. సీనియర్ న్యాయవాది కిశోర్ దత్తా అత్యవసర విచారణ కోరుతూ న్యాయమూర్తి కృష్ణారావు ఎదుట వాదనలు వినిపించారు. న్యాయమూర్తి సౌగత భట్టాచార్య ఉత్తర్వులు పోలీసుల చర్యలకు సంబంధించిన కేసుపై ఉన్నాయని, తాజా పిటిషన్ పీఎంఎల్ఏ కింద ఈడీ తీసుకున్న చర్యను సవాల్ చేస్తోందని తెలిపారు. ఈ కేసు సోమవారం విచారణకు రానుంది.ప్రైవేటు విమానయాన సంస్థకు సంబంధించిన సుమారు రూ.160 కోట్ల మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎంబ్రాయర్ బిజినెస్ జెట్, అగస్టా హెలికాప్టర్ కొనుగోలుకు సంబంధించిన అంశాలపై ఈడీ అదే 3 ఖాతాలను స్తంభింపజేసింది. -
పీకే దాడికి ముందే బీజేపీ ప్లాన్ మార్చిందా?
బిహార్లోని బాంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థిని మార్చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తొలుత అభిషేక్ కుమార్ బంటీని అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ.. ఆయనతో నామినేషన్ కూడా దాఖలు చేయించింది. అయితే.. గంటల వ్యవధిలోనే వెనక్కి తగ్గి, నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపింది. దీంతో అసలు ఈ హఠాత్పరిణామం వెనుక కారణమేంటన్న ప్రశ్న బిహార్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.బాంకిపూర్ బీజేపీకి సంప్రదాయ బలమైన నియోజకవర్గం. 1995 నుంచి ఈ స్థానం ఆ పార్టీ చేతిలోనే ఉంది. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభిషేక్ కుమార్ బంటీని అభ్యర్థిగా ఎంచుకుంది బీజేపీ. దీంతో గురువారం ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సహా ఎన్డీఏ అగ్రనేతల సమక్షంలో అభిషేక్ ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. గంటలు కూడా తిరగక ముందే సీన్ మారింది. Patna, Bihar: BJP candidate Abhishek Kumar “Bunty” filed his nomination for the Bankipur Assembly by-election. Several senior NDA leaders attended the nomination pic.twitter.com/YqQ6MUU7f7— IANS (@ians_india) July 9, 2026శుక్రవారం అనూహ్యంగా ఆయన దానిని ఉపసంహరించుకున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో.. పెద్దగా చదువుకోని బంటీని బరిలోకి దింపడం సబబు కాదని బీజేపీ భావించిందనే ప్రచారం ఉదృతంగా జరిగింది. అయితే దానిని బంటీ కొట్టిపారేశారు. "వ్యక్తిగత కారణాల వల్ల పోటీ చేయడం సాధ్యం కాదని" రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరావోగికి లేఖ రాసి తప్పుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో కూడా అదే కారణాన్ని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణం వేరేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. सुनिए क्यों बांकीपुर से BJP के उम्मीदवार अभिषेक बंटी नॉमिनेशन के बाद अपना उम्मीदवारी वापस लिए #BJP #Bankipur #election pic.twitter.com/MQ0UWMrwk5— Mukesh singh (@Mukesh_Journo) July 10, 2026అభిషేక్ బంటీ తండ్రి రవీంద్ర ప్రసాద్.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి దాణా (ఫోడర్) కుంభకోణం కేసులో దోషిగా తేలిన వ్యక్తి. 2022లో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూతో పాటు మరో 75 మందికి శిక్ష విధించగా, అప్పట్లో మగధ్ కెమికల్ కార్పొరేషన్ మేనేజర్గా పనిచేసిన రవీంద్ర ప్రసాద్కు కూడా మూడేళ్ల జైలు శిక్ష పడింది.ఈ నేపత్యంలో.. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సేకరించి, ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారంలో రక్షణాత్మక స్థితిలో పడకూడదన్న ఉద్దేశంతో బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు ఇటీవలే పార్టీ అగ్రనేతల దృష్టికి రావడంతో వెంటనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా సాధారణ పార్టీ కార్యకర్తగా గుర్తింపు పొందిన నీరజ్ కుమార్ సిన్హా బరిలో నిలిచారు. ఆయన నేరుగా ప్రశాంత్ కిశోర్తో తలపడనున్నారు.#WATCH | Bye-elections | Bihar BJP President Sanjay Sarogi felicitates party's candidate from Bihar's Bankipur Assembly seat, Neeraj Kumar Sinha Neeraj Kumar Sinha says, "I am overjoyed. I am deeply grateful to the top leadership, the state president, our leader Nitin Nabin ji,… pic.twitter.com/aKPWkznCQq— ANI (@ANI) July 10, 2026ప్రశాంత్ కిశోర్ బరిలో ఉండటం, చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి మారడం వంటి పరిణామాలతో ఈ ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ఆసక్తికర రాజకీయ పోరుగా మారింది. -
మళ్లీ బీజేపీ ఆకర్షణ మంత్రం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కమలదళం మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు పావులు కదుపుతోందా? ఈ ప్రశ్నకు పార్టీ ముఖ్య నేతల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల మీడియాతో ఇష్టాగోష్టిలో ఓ ఎమ్మెల్యే తమతో టచ్లోకి వచ్చారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పేర్కొనగా తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యలతో ఇతర పార్టీల నుంచి నేతల చేరికకు మళ్లీ రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ భారీగా చేరికలకు తెరతీయడం తెలిసిందే. ఇది శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి కలిసి రాకపోయినా లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్తో సమానంగా 8 ఎంపీ సీట్లను గెలుచుకోవడానికి దోహదపడింది. ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, డీకే అరుణ, గోడెం నగేశ్ ఎంపీలుగా గెలిచారు. ఆ త ర్వాత ఈ చేరికల ప్రణాళిక మూలన పడడంతో బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు అంతగా ఆసక్తి చూపలేదు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా... తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కమలదళం వేరే పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకోవడం కోసం మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి కొనసాగింపుగానే గురువారం రాత్రి పార్టీ ముఖ్యనేతలతో అంతర్గత భేటీ సందర్భంగా చేరికల తలుపులు తెరవాలని.. ఇతర పార్టీల నుంచి నాయకులు చేరితేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని నడ్డా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ భేటీ గురించి నడ్డా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్తో ప్రజలు విసిగిపోయారని.. హిమాచల్ ప్రదేశ్ తరహాలో ఇతర పార్టీల నాయకులను బీజేపీలోకి ఆహ్వానించాలని నడ్డా కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో రాష్ట్ర బీజేపీలో పాత–కొత్త నేతల మధ్య సమన్వయలేమి సమస్యలు వెంటాడుతుండటంతో స్థానిక నేతలు విభేదాలు పక్కనపెట్టి పార్టీని బలోపేతం చేయాలని కూడా ఆయన పిలుపునిచి్చనట్లు సమాచారం. వ్యూహాత్మకంగా అడుగులు.. ప్రస్తుతం అధికార కాంగ్రెస్–ప్ర«దాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లో ఎండగట్టడం ద్వారా ఆయా పార్టీల్లోని వారిని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయతి్నస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఇతర పార్టీల నేతల చేరికల విషయంలో వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంతోపాటు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ బలోపేతం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా, మండల స్థాయిల్లో ప్రభావం చూపగల ద్వితీయశ్రేణి నాయకులను చేర్చుకోవడానికి సైతం ప్రాధాన్యం ఇవ్వనున్నారని.. సంస్థాగతంగా అంతగా బలంగా లేకపోవడంతోపాటు గతం నుంచి పట్టులేని ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నారని తెలియవచ్చింది. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా తెలంగాణ జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎంబీసీ వర్గాలకు చెందిన ఇతర పార్టీల నేతల ఆకర్షణ ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని కమలదళం భావిస్తోంది. -
చట్టాల పేరుతో కొత్త సవాళ్లు.. ప్రజాస్వామ్యంపై పెరుగుతున్న ప్రశ్నలు!
భారతదేశం ఎటు వైపు పయనిస్తోంది? ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) విధించి పౌర హక్కులను కాలరాశారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ కాకపోయినా, దాదాపు అదే రీతిలో వివిధ రాష్ట్రాలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయా అన్న భావనను పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జూన్ 25న ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్ను ఎండగట్టే బీజేపీ పెద్దలు, తాము ఏమి చేస్తున్నామో కూడా ఆత్మపరీశీలన చేసుకోవడం అవసరం అనిపిస్తుంది.పశ్చిమబెంగాల్లో తీసుకువచ్చిన ఒక చట్టం అందరిని భయపెట్టేలా ఉంది. పేరుకు సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకు వస్తున్నామని, దీనిని దుర్వినియోగం చేయబోమని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించినా, ఆచరణలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో అన్న ఆందోళనను వివిధ రాజకీయ పక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో అతి ముఖ్యమైన క్లాజ్ ఏమిటంటే ఎవరైనా ఈ చట్టం కింద అరెస్టు అయితే ఏడాదిపాటు జైలులోనే ఉంచుతారట. లాయర్ కలుసుకోవడానికి కూడా అవకాశం ఉండదట. దీనిని రాజకీయంగా వాడుకోబోమని చెబుతున్నా గ్యారంటీ ఏమి ఉంటుందన్న ప్రశ్న వస్తుంది.ఒకవైపు ఉత్తరప్రదేశ్లో హాఫ్ ఎన్కౌంటర్ల పేరిట పోలీసులు సాగిస్తున్న ఘాతుకాలపై ఆయా జాతీయ ఆంగ్ల పత్రికలలో వస్తున్న వ్యాసాలు చదువుతుంటే భయం వేస్తుంది. యూపీలో మరీ ఇంత ఘోరంగా పరిస్థితి ఉందా అన్న భావన కలుగుతుంది. ఇక పశ్చిమబెంగాల్ వంతు వచ్చిందేమో అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టి అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటి సోషల్ యాక్టివిటీస్ బిల్లును ఆమోదించారు. ఇది కేవలం జైళ్లకు పంపడం కాదు.. సమాజాన్ని రక్షించడం అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కాని ఒక ఏడాది వరకు ఎలాంటి విచారణ లేకుండా, కోర్టులతో సంబంధం లేకుండా చట్టాన్ని అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించుకోవడం కష్టం కాదు. ఈ బిల్లు దెబ్బకి, ఆ రాష్ట్రంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరవలసిన అనివార్య పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదు. తద్వారా కేసుల బారీ నుంచి తప్పించుకోవచ్చు.గతంలో టీఎంసీలో మంత్రిగా ఉన్న సువేందు అధికారిపై స్వయంగా ప్రధాని మోదీ పలు అవినీతి ఆరోపణలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అదే సువేందు బీజేపీలో చేరడం, ముఖ్యమంత్రి అవడం కూడా జరిగిపోయింది. అలాగే ఆయా పార్టీల ఎంపీలు తమపై ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా బీజేపీ లేదా దాని మిత్రపక్షాలలో చేరిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ప్రజాస్వామ్యానికి మరింత చేటు చేసే అవకాశం ఉంది. ఈ చట్టం న్యాయ సమీక్షలో నిలబడదని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ చట్టం యూపీ మోడల్లో వచ్చిన బిల్లు అని కొందరు అభివర్ణిస్తున్నారు.ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రౌడీ శక్తులను అణచివేయడానికి ఎన్కౌంటర్లు, హాఫ్ ఎన్కౌంటర్ల పద్దతిని అనధికారికంగా ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ 30 నాటి సంచికలో సందీప్ రాయి, కృష్ణ చౌదరి అనే ఇద్దరు వ్యాసకర్తలు రాసిన ఆర్టికిల్ చదివితే యూపీలో భయానక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుంది.2017లో యోగి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఈ ఎన్కౌంటర్లను కొన్ని సందర్భాలలో ప్రజలు కూడా స్వాగతించి ఉండవచ్చు. శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా ఆయా కేసులలో నిందితుల ఇళ్లను కూల్చివేసేవారు. అలాంటి వాటిని సుప్రింకోర్టు కూడా తప్పు పట్టింది. ఇటీవలికాలంలో నిందితులుగా భావించేవారి ప్రాణం పోకుండా కాళ్లపైనో, ఇతర శరీర భాగాలపైన పోలీసులు తుపాకితో కాల్చుతున్నారట. దాంతో వారు ఏళ్ల తరబడి కదలలేని స్థితిలో పడిపోతున్నారు. వీటిని హాఫ్ ఎన్కౌంటర్లని పిలుస్తున్నారు. ఇలా గాయపడ్డవారిలో ఎందరు నిజంగా నేరం చేశారో, ఎందరు అమాయకులో ఎవరికి తెలియదు. ఈ వ్యాసంలో పలు ఉదాహరణలను కూడా వారు వివరించారు.యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత 289 మందిని ఎన్కౌంటర్లలో మరణించారట. క్రిమినల్స్గా పరిగణించిన 34వేలమందిలో సుమారు మూడోవంతు 11834 మంది హాఫ్ ఎన్కౌంటర్లలో తీవ్రంగా గాయపడ్డారట. వీరిలో పలువురు కదలలేని స్థితిలో ఉన్నారు. వారికి జీవనోపాధి కూడా లేకుండా పోయిందట. నిజంగానే ఈ ఎన్కౌంటర్లు ఫలితాన్ని ఇస్తున్నాయా అంటే అదీ గ్యారంటీ లేదు. 2024లో 2823 మంది తీవ్రంగా గాయపడితే, 2025లో హాఫ్ ఎన్కౌంటర్లలో గాయపడ్డవారి సంఖ్య 3153 గా ఉందట. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం ఫలిస్తే ఇలాంటివి తగ్గాలి కాని, ఎలా పెరుగుతాయన్న ప్రశ్నకు బదులు దొరకదు. రాజకీయ వైరాలకు కూడా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు సహజంగానే వస్తాయి. ఈ క్రమంలో పోలీసులలో విచ్చలవిడితనం పెరిగి, వారి ఇష్టారాజ్యంగా ఎవరిపైన అయినా ఇలా దారుణంగా వ్యవహరించే అవకాశం లేదని చెప్పలేం.బీహారులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు బహిరంగంగా కాల్చి చంపడం పెద్ద వివాదం అయింది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇక బీజేపీ మిత్ర పక్షమైన తెలుగుదేశం ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పేరుతో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో అందరికి తెలిసిన సంగతే. తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపక్షాన్ని అణచివేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేవారిపై కక్ష తీర్చుకోవడానికి పోలీసులను వాడుకోవడం సర్వసాధారణం అయిపోయిందన్న విమర్శ ఉంది.కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక సీఐ చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీవారు దాడులు చేసినా, అరాచకాలు చేసినా వారిపై తూతూమంత్రంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై గంటల తరబడి పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులు చేసినా వారిపై సరైన కేసులే పెట్టలేదు. పైగా బాధితులపైనే కేసులు పెట్టడం ట్రెండ్గా చేసుకున్నారు.తాజాగా అమరావతి గ్రామాలలో కొందరు రైతుల కోరిక మేరకు వారి సమస్యలను చూడడానికి వెళ్లబోయిన వైఎస్సార్సీపీ బృందంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. అయినా పోలీసులు వైఎస్సార్సీపీవారిపై కేసులు పెట్టారు. ఇలా బీజేపీ, మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో అధికార దుర్వినియోగం, ఎన్కౌంటర్లు, హాఫ్ ఎన్కౌంటర్లు, లాకప్ డెత్లు సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఈ తరుణంలో పశ్చిమబెంగాల్లో ఏడాదిపాటు నిర్భందించే చట్టం వస్తే ఇంకెంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా పోలీసులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలను కాపాడేదెవరు?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
BRSకు మల్లారెడ్డి దూరం.. BJPలోకి జంప్! కోడలు ప్రీతీ రెడ్డితో మంతనాలు
-
బెంగాల్లో పొలిటికల్ ట్విస్ట్.. బీజేపీ యూటర్న్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ మరో కీలక వ్యూహానికి తెరలేపింది. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నేతలకు తమ తలుపులు మూసేశామని ప్రకటించిన కమలం పార్టీ.. ఇప్పుడు అదే పార్టీ నుంచి వచ్చిన తాజా మాజీలకు వెంటనే పెద్దపీట వేసింది. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురిని రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించడం బెంగాల్ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.గురువారం కోల్కతాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సమక్షంలో సుఖేందు శేఖర్ రే, సుష్మితా దేవ్, ప్రకాశ్ చికా బరైక్లు పార్టీ కండువా కప్పుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్కు, రాజ్యసభ పదవులకు రాజీనామా చేసి కమలం గూటికి చేరిన ఈ ముగ్గురి పేర్లను.. కొన్ని గంటల వ్యవధిలోనే జులై 24న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. దీంతో బెంగాల్ రాజకీయాల్లో ఈ పరిణామం హాట్టాపిక్గా మారింది.‘తలుపులు మూసేశాం’ అంటూనే..అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి తృణమూల్ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చిన బీజేపీ.. ఆ పార్టీ నాయకులకు తమ పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు గంటల వ్యవధిలోనే ముగ్గురు మాజీ టీఎంసీ ఎంపీలకు రాజ్యసభ అవకాశం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది సాధారణ విధానం కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమని బెంగాల్ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలను వేధించని, అవినీతి ఆరోపణలు లేని నేతలను మాత్రమే టీఎంసీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగస్వాములను చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పేర్కొంది.ఎవరెవరు చేరారంటే..సుఖేందు శేఖర్ రే: 2012 నుంచి తృణమూల్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రే.. ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన తర్వాత పార్టీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శించారు.సుష్మితా దేవ్: అస్సాం నుంచి తృణమూల్ లోక్సభ సభ్యురాలిగా ఉన్న సుష్మితా దేవ్ కూడా పార్టీని వీడి బీజేపీలో చేరారు. పార్టీలో అవినీతి తీవ్రతపై గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో సంప్రదింపుల అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ప్రకాశ్ చికా బరైక్: 2023లో రాజ్యసభకు వెళ్లిన బరైక్.. ఉత్తర బెంగాల్లో టీ తోటల కార్మికుల మధ్య పార్టీ కార్యకలాపాలతో గుర్తింపు పొందారు.ఇక రాజ్యసభ ఉప ఎన్నికల సమీకరణాలు కూడా బీజేపీకి అనుకూలంగా మారాయి. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 294 మంది సభ్యుల సభలో బీజేపీ 208 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే తృణమూల్లో ఏర్పడిన అంతర్గత విభేదాలు రాజ్యసభ ఎన్నికల లెక్కలను పూర్తిగా మార్చేశాయి. ప్రస్తుతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోవడంతో.. మూడు రాజ్యసభ స్థానాలను కూడా గెలుచుకునే అవకాశం బీజేపీకి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జరిగే 2-1 పోటీ కాస్తా.. ఇప్పుడు మూడు స్థానాలపై కమలం గురి పెట్టే పరిస్థితి ఏర్పడింది.బెంగాల్లో రాజకీయ పోరు కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా.. ఎన్నికలకు ముందే ఆధిపత్యం కోసం సాగుతోంది. తృణమూల్ నుంచి వచ్చిన నేతలకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా బీజేపీ ఒకేసారి రెండు లక్ష్యాలను సాధించాలనే వ్యూహంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు మమతా బెనర్జీ పార్టీలో అసంతృప్తి ఉందనే సంకేతాన్ని ఇవ్వడం.. మరోవైపు తృణమూల్కు ప్రత్యామ్నాయ శక్తిగా తమ స్థాయిని పెంచుకోవడం కమలం పార్టీ ఉద్దేశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.రాజ్యసభలో బలం పెంచుకోవడంతో పాటు.. బెంగాల్లో స్థానిక స్థాయిలో బలమైన నేతలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా భవిష్యత్ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే పునాది వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తృణమూల్ నుంచి వచ్చిన నేతలను వెంటనే కీలక స్థానాల్లోకి తీసుకోవడం.. గతంలో బీజేపీ చేసిన ‘తలుపులు మూసేశాం’ ప్రకటనతో విరుద్ధంగా ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. -
ఎన్డీయే వైపు శరద్ పవార్ అడుగులు?
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఆపరేషన్ టైగర్’అనంతరం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ‘ఆపరేషన్ తుతారీ’చర్చ తీవ్ర స్థాయికి చేరుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధికార ఎన్డీయే కూటమిలో చేరుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న కీలక నేతల వరుస సమావేశాలు ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే ఎన్డీయేతో తమ పార్టీ జతకట్టబోతోందన్న వాదనలు, విశ్లేషణలతో శరద్ పవార్ సోదరుని మనవడు, పార్టీ ఎమ్మెల్యే అయి రోహిత్ పవార్ తీవ్రంగా వ్యతిరేకించారు. బుధవారం విధాన భవన్లో ఏక్నాథ్ షిండేతో శరద్ పవార్ సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో వేడి రగిలించింది. పవార్ విధాన భవన్కు చేరుకున్నారన్న సమాచారం అందగానే, షిండే తాను నిర్వహిస్తున్న సమావేశాన్ని కాసేపు పక్కనపెట్టి బయటకు వచ్చి పవార్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందనే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, భవిష్యత్ రాజకీయ సమీకరణాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవార్, షిండేల భేటీకి ముందే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేతో ఎన్సీపీ(ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సమావేశమయ్యారు. రోహిత్ పవార్ అసహనం పార్టీ ఎన్డీయే కూటమిలో చేరే అవకాశాలపై ఎన్సీపీ (ఎస్పీ) అంతర్గత వర్గాల్లో ఏకాభిప్రాయం లేదు. బీజేపీతో చేతులు కలపడాన్ని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఇలాంటి రాజకీయ నిర్ణయాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్సీపీ(ఎస్పీ) పాత మిత్రపక్షాల కూటమి అయిన మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)తోనే కలిసి సాగాలని రోహిత్ గట్టిగా వాదిస్తున్నారు. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్ త్వరలోనే తన బహిరంగ వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది. ఆయన తీసుకోబోయే నిర్ణయంపై అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శరద్ పవార్ వేసే తదుపరి రాజకీయ అడుగులు మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఆపరేషన్ తుతారీ’అంటే ఏమిటి? అజిత్ పవార్ తెచ్చిన చీలికతో ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్ వర్గానికి మహారాష్ట్ర సంప్రదాయ బూర అయిన తుతారీ గుర్తును కేటాయించింది. మహారాష్ట్రలో గతంలో శివసేనను చీల్చిన తరహాలోనే, ఇప్పుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) వర్గాన్ని మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో విలీనం చేసుకునేందుకు లేదా ఆ పార్టీ మద్దతు కూడగట్టేందుకు తెరవెనుక జరుగుతున్న రాజకీయ ప్రయత్నాలకే రాజకీయ వర్గాలు ‘ఆపరేషన్ తుతారీ’అని పేరు పెట్టాయి. -
తలుపులు తెరవండి.. వేరే పార్టీల వారిని చేర్చుకోండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోకి ఇతర పార్టీల వారిని చేర్చుకునేందుకు తలుపులు తెరవాలని రాష్ట్ర పార్టీ నేతలకు కేంద్ర ఆరోగ్య, రసాయనాలు–ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. వేరే పార్టీలకు చెందిన వారిని కలుపుకుంటేనే బీజేపీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. రాష్ట్ర పార్టీ నేతలంతా విభేదాలను పక్కన పెట్టి పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా చూడాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ‘మీరు కష్టపడి పనిచేయండి మీతోపాటు మేము ఉంటాం. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అభిమానించేంతలా చూసుకోవాలి. కార్యకర్తలతో మంచిగా ఉండండి. వారితో మంచిగా లేకుంటే మీరు డిస్కనెక్ట్ అవుతారు’అని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తమకు సమాచా రం ఉందన్నారు. గురువారం రాష్ట్రానికి వచ్చిన నడ్డా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ‘ఇప్పటికే ఒకసారి మన బస్సు (అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి) మిస్సయింది. ఇంకోసారి బస్సు మిస్ కానివ్వకండి. వేర్లు లేని చెట్ల లాగా మారకండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల వ్యతిరేకతే మనల్ని గెలిపిస్తుందనే భావనతో ఉండకండి. సొంతంగా పార్టీ గెలిచేందుకు మనం ఏం చేస్తున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. నేను అవినీతికి పాల్పడను. ఇంకొకరిని అవినీతి చేయనివ్వను అన్న ప్రాథమిక సూత్రంతోనే మోదీ విజయం సాధించారు. మనమంతా కూడా మోదీ పేరు చెప్పుకొని గెలుస్తున్నా...సొంతంగా గెలుపు కోసం అనుసరించబోయే కార్యాచరణ ఉందా ? మీ అంత మీరు గెలిచేందుకు ఏం చేస్తున్నారు? ఆత్మవిమర్శ చేసుకోండి. అవినీతితో పోరాడడంతోపాటు ఎల్లప్పుడూ ప్రజల పక్కనే చేదోడువాదోడుగా నిలిస్తే తప్పకుండా వారు ఆదరిస్తారు. మీ మీ కార్యక్షేత్రాలను వదలకుండా కష్టపడి పనిచేయాలి. లీడర్ల వెంట తిరిగినంత మాత్రాన లీడర్లు కాలేరు. రేపు కాంగ్రెస్ నేతలను (హిమాచల్లో) కలవడానికి వెళుతున్నాను. ఎందుకంటే వారిని కలిస్తే వారు మనవారు అవుతారు’అని నడ్డా దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, పార్టీనేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, గరికపాటిమోహన్రావు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, శాంతికుమార్, చింతల రామచంద్రారెడ్డి బండారు విజయలక్ష్మి, లంకెల దీపక్రెడ్డి, కప్పర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఏటీఎంగా మార్చిన సర్కార్ ఉండాలా ? ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం ఏటీఎంగా మారిందని, అదే ప్రభుత్వం కొనసాగాలా? మారాలా? అన్నది రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. గురువారం ఓ హోటల్లో ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం–దౌత్యం–అభివృద్ధి’అంశంపై నిర్వహించిన మేధావుల గోష్టిలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ను అంతర్గతంగా బలోపేతం చేస్తూనే, ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చిన ఘనత ప్రధాని మోదీదని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హెచ్సీయూ వీసీ జె.అనురాధ, ఐఫ్లూ వీసీ ప్రొ.నాగళ్లపల్లి నాగరాజ్ ప్రసంగించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, వివిధరంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు. -
మా జోలికి వస్తే.. మీ తాత వచ్చినా భయపడం
సాక్షి, చెన్నై : కేంద్రంలోని బీజేపీ అనే పెద్ద వాషింగ్ మెషీన్కు పోటీగా, తమిళనాడులో అవినీతిపరులను శుభ్రం చేయడానికి టీవీకే ఒక చిన్న వాషింగ్ మెషీన్లా ఆవిర్భవించిందని డీఎంకే యువజన నేత ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్ ఎద్దేవా చేశారు. అయితే, ఎలాంటి ఆయుధంతోనైనా సరే.. డీఎంకేని ఎవరూ, ఏ పార్టీ కూడా తాకలేవని వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, కరుణా నిధి 103వ జయంతిని పురస్కరించుకుని చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ కార్యకర్తల సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో 800 మందికి పైగా డీఎంకే కార్యవర్గ సభ్యులను ఉదయనిధి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది ’రీల్స్’ ప్రభుత్వం – మంత్రులంతా దొంగలే ప్రస్తుత విజయ్ ప్రభుత్వంపై ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము సో షల్ మీడియాలో రీల్స్వేసి అధికారంలోకి వచ్చామ ని ఎంత చెప్పుకున్నా, ప్రస్తుతం వారు చేస్తున్నది కూడా కేవలం రీల్స్ వేయడమే తప్ప పాలన కాద న్నారు. ఈ ప్రభుత్వంలో ఎవరు మంత్రులో ముఖ్య మంత్రికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. గతంలో పైరసీ వీసీడీలు అమ్మిన వ్యక్తి, బ్లాక్లో సినిమా టిక్కెట్లు అమ్మిన వ్యక్తి, బ్లాక్లో లాటరీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తులే తాజాగా మంత్రులుగా కూర్చున్నారనిధ్వజమెత్తారు. వీరి పేర్లు అందరి కీ తెలుసు, వీరిని ప్రత్యేకంగా శిక్షించాల్సిన అవస రం లేదని, ప్రజలే బుద్ధి చెబుతారని ఎద్దేవా చేశారు. మా జోలికి వస్తే.. మీ తాత వచ్చినా భయపడం: డీఎంకేను కేవలం రాజకీయ ప్రతీకార చర్యలతో భయపెట్టాలని చూస్తున్నారని ఉదయనిధి మండిపడ్డారు. తమ పార్టీ వర్గాలపై తప్పుడు కేసులు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేయాలనుకుంటే, తాను ఒకటే చెబుతున్నానని తమరు కాదు కదా, తమరి తాత దిగివచ్చినా సరే ఒక్క డీఎంకే కార్యకర్తను భయట పెట్టలేరని హెచ్చరించారు. అవినీతి కేసుల్లో ఉన్న అన్నాడీఎంకే నాయకుల్ని టీవీకేలోకి చేర్చుకోవడమే అవినీతి రహిత పాలనా.?. అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో శత్రువు ఎవరో తేల్చుకుంటాం గత ఎన్నికల్లో అసలైన శత్రువు ఎవరో తమకు స్పష్టత రాలేదని, అన్నాడీఎంకేను ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్లామన్నారు. అయితే, ఇక, రాబోయే ఎన్నికల్లో తమకు అసలైన శత్రువు ఎవరో పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వ్యూహాత్మకంగా బరిలోకి దిగుతామన్నారు. -
తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ 2028.. అసలు గేమ్ మొదలైందా?
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. ప్రధాని మోదీనే ఇందుకు శ్రీకారం చుట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించి వివిధ సభలలో పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే.. 2028 శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. ఆయన కొత్తగా అధ్యక్షుడు అయినందున భవిష్యత్తులో వచ్చే ఎన్నికలన్నీ ఆయన సామర్థ్యానికి పరీక్షలు అవుతాయి. జయాపజయాలపై పూర్తిగా ఆయనదే బాధ్యత కాకపోవచ్చు. కాని సహజంగానే ఆయనపై అందరి దృష్టి ఉంటుంది.నితిన్ చేసిన ప్రసంగాలలో కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్లో మాదిరే విజయం సాధించాలని, అందుకోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తెలంగాణలో గెలుపుపై ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తే తప్పుకాదు. కాని మతపరమైన అంశాలతో ప్రజలను రెచ్చగొట్టడం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో లక్షల ఓట్ల తొలగింపు వంటివి జరుగుతాయా అన్న సందేహం వస్తుంది.బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండవచ్చు. కాని దానికి మించి బీజేపీ కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి మమతను ఉక్కిరిబిక్కిరి చేయడానికి యత్నించింది. తన చేతిలో ఉండే సీబీఐ, ఈడి వంటి సంస్థలను విచ్చలవిడిగా టీఎంసీనేతలపై ప్రయోగించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందా? అంటే లేదని చెప్పడం కష్టమే.గత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఎనిమిది సీట్లను సాధించి బీజేపీ సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ బాగా బలహీనపడినట్లు కనిపించినా, తర్వాత యధా ప్రకారం ఆ పార్టీ అగ్రనేతలు బాగా యాక్టివ్ అయి టూర్లు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగిస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మాచ్ పిక్సింగ్ చేసుకుంటే తప్ప బీజేపీ అధికారంలోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా అది బీజేపీకి ప్లస్ అవుతుందన్న నమ్మకం ఇంకా రా లేదు.జనంలో ఉన్న ఒక అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ప్రధాన పోటీ ఉండవచ్చనిపిస్తుంది. అందుకే ఒక నెల రోజులలో తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు తయారు కావాలని నితిన్ నబీన్ పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్లోని కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయాలు సాధించాలని ఆయన నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు కలిసికట్టుగా ఎంత దూకుడుగా వెళతారు? కేంద్రంలో తమకు ఉన్న అధికారాన్ని ఇక్కడ కూడా ఏ మేరకు ప్రయోగిస్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను ఎదగనీయకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను ఏమైనా అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది.ఈ క్రమంలో బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధపడవచ్చని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దికాలం క్రితం ఇదే మాట ఓపెన్గా చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న పొత్తులు కొనసాగిస్తారా? లేక అక్కడ కూడా ఒంటరిగా ఎదగడానికి యత్నిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో దాని మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అన్న చర్చ వస్తుంది. పెద్దగా బలం లేకపోయినా, ఆ పార్టీలకు ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు గురుశిష్యులుగా పేరొందారు.కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సభలో కర్నాటక ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్తో కలిసి చంద్రబాబు, రేవంత్లు పాల్గొన్నారు. డీ.కే మాట్లాడుతూ తాము ముగ్గురం కలిసి చరిత్ర సృష్టించబోతున్నామని వ్యాఖ్యానించారు. రేవంత్ను చంద్రబాబు పొగిడారు. తెలంగాణ అభివృద్ది కోసం రేవంత్ బాగా కష్టపడుతున్నారని, తెలంగాణ ప్రాజెక్టుల కోసం రేవంత్ రాజీ పడరని ప్రశంసించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న సమయంలో బీజేపీ మిత్రుడైన చంద్రబాబు ఇలా కాంగ్రెస్ నేతను మెచ్చుకోవడం ఆసక్తికరమైన అంశమే. దీనిపై ఏమి మాట్లాడాలో బీజేపీ తెలంగాణ నేతలకు అర్థం కావడం లేదు. అందుకే ఏపీకే తమ మితృత్వం పరిమితమని, ఇక్కడ టీడీపీ తన సొంత వ్యూహం అమలు చేయవచ్చని వారు చెబుతున్నారు.మరో వైపు రేవంత్ రెడ్డి తనకు టీడీపీతో ఉన్న సంబంధాలను వాడుకుంటూ ఆ పార్టీకి కాస్తో, కూస్తో ఉన్న క్యాడర్ను, అభిమానులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి యత్నిస్తున్నారు. టీడీపీతో పాటు ఒక సామాజికవర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. టీడీపీ వారు కూడా కాంగ్రెస్కే మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ అధికార ప్రతినిదులు బహిరంగంగానే అకనాలెడ్జ్ చేస్తూ, టీడీపీ తమకే మద్దతు ఇస్తుందని టీవీ చర్చలలో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నగరపాలక సంస్థల ఎన్నికలు పలు రాజకీయ పరిణామాలకు కీలకంగా ఉండవచ్చు. ఈ ఫలితాల ప్రభావం భవిష్యత్తులో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై పడే అవకాశం ఉంది.చంద్రబాబు వ్యూహాత్మకంగా రేవంత్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో పరోక్ష స్నేహం కొనసాగిస్తున్నారని, అలాగే చంద్రబాబు ద్వారా రేవంత్ బీజేపీ అగ్ర నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. అయితే దీనికి ఇప్పటికిప్పుడు ఆధారాలు కనిపించకపోవచ్చు. కాకపోతే ప్రధాని మోదీ తన సభలో రేవంత్ను ఉద్దేశించి తమతో కలిసి పనిచేయాలని అంటూ చేసిన వ్యాఖ్యలను కొందరు ఉదహరిస్తుంటారు. అంతేకాక రేవంత్కు మోదీ అప్పాయింట్మెంట్ ఇచ్చే విధానాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తుంటారు.కాగా ఇటీవల మెట్రో రైల్ వివాదంలో రేవంత్ కోరిక మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చలు జరిగేలా చూశారు. అయినా మెట్రో రుణం విషయం కాని, రెండో దశ గురించి కాని స్పష్టత రాలేదు. రేవంత్కు సహకరిస్తున్నట్లు కనిపిస్తూనే బహుశా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీజేపీ ఈ వ్యూహం అమలు చేస్తోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని నితిన్ మండిపడ్డారట. ఒకవైపు అలాంటి ప్రాంతీయ పార్టీలతో జతకడుతూ, మరోవైపు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వినే జనం ఆశ్చర్యపోవల్సిందే.వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని వీరు చెబుతారు. కాని అదే వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో మితృత్వం చేస్తుంటారు. అవకాశవాద రాజకీయాలకు బీజేపీ అతీతం కాదని చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ఏది ఏమైనా తన అధికారాన్ని అడ్డు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై వేదింపులు, అక్రమ కేసులు, సీబీఐ, ఈడి సంస్థల దాడులు వంటివి చేయకుండా ఫెయిర్ రాజకీయం చేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాని ప్రస్తుత బీజేపీ నాయకత్వం అలాంటి నిబద్దత కలిగిన రాజకీయం చేస్తోందా అన్నదే ప్రశ్న.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బీజేపీకి బిగ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో బీజేపీకి మరో శత్రువు లేడు. పార్టీలోనే ఒకరికి ఒకరు శత్రువులు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. ప్రధానమైన ఈ సమస్యను అధిగమిస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’అని రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అభయ్ పాటిల్ ఇటీవలి సమావేశంలో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధినాయకత్వం చేసిన సీరియస్ హెచ్చరికలను రాష్ట్ర నేతలు సీరియస్గా తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్టాపిక్గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో వెనుకడుగుపై నిర్దిష్ట కార్యాచరణ రూపకల్పనలో రాష్ట్ర బీజేపీ విఫలమవుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నా యి. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగట్టే విషయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైనా స్పష్టత కొరవడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముగ్గురు ముఖ్య నేతలు పర్యటించినా.... దాదాపు 40 రోజుల వ్యవధిలోనే బీజేపీకి చెందిన అగ్ర నాయకత్వ త్రయం తెలంగాణలో పర్యటించింది. మే 10న సికింద్రాబద్ పరేడ్గ్రౌండ్స్లో ప్రధాని మోదీ, జూన్ 12న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, జూన్ 28–30 తేదీల మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ పర్యటించారు. రాష్ట్ర పర్యటనల విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నా.. రాష్ట్ర బీజేపీ మొక్కుబడిగా అప్పుడప్పుడు క్షేత్రస్థాయి పోరాటాలు తప్ప ఓ స్పష్టమైన దీర్ఘకాలిక కార్యాచరణతో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడంలో వెనుకడుగు తప్పడం లేదంటున్నారు. తెలంగాణలో పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకొని, ప్రజల ఆదరణతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ పుంజుకోవడం మళ్లీ ఎన్నికల ముందు చతికిలబడడం ఓ ప్రహసనంగా మారడంతో అధినాయకత్వం తలపట్టుకుంటోంది. అధిష్టానం ‘మందు బిళ్ల’పనిచేస్తుందా ? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ మూడురోజుల పర్యటన సందర్భంగా రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడం, సమన్వయ లేమి సమస్యలుండడాన్ని సహించబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యనేతలు మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గ్రూపులుగా విడిపోవడం, పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడంపై పద్ధతి మార్చుకోవాలని మందలించినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూపులను టాలరేట్ చేసే పరిస్థితి లేదని నితిన్నబిన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపక్షించే పరిస్థితి లేదని గట్టి వార్నింగే ఇచ్చారు. బెంగాల్ కేడర్ కసి ఇక్కడెందుకు లేదు ? తాజాగా జరిగిన రాష్ట్ర కార్యవర్గభేటీలో పదేళ్లలో తృణముల్ కాంగ్రెస్ పాలనలో పశ్చిమబెంగాల్లో బీజేపీ కార్యకర్తలు ఎంతటి పీడన, అణచివేత, హత్యలు, అత్యాచారాలకు గురయ్యారో ఆ రాష్ట్ర ఇన్చార్జ్గా పనిచేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్ వివరించారు. అక్కడ తృణమూల్ అరాచకాలను ఎదుర్కోవడంతోపాటు, 15 వేల మంది కార్యకర్తలు తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లినా వెనుకడుగు వేయకుండా పోరాడారని, అలాంటి నిబద్ధత, కచ్చితంగా ఫలితాలు సాధించాలనే కసి రాష్ట్ర పార్టీలో ఎందుకు కరువైందని ప్రశ్నించారు. రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గసభ్యుల్లో ఎవరు పని చేస్తున్నారు? ఎవరు టైంపాస్ చేస్తున్నారో అధిష్టానం దగ్గర పూర్తి సమాచారం ఉందని బన్సల్ హెచ్చరిచ్చినట్టు తెలిసింది. బెంగాల్లో కార్యకర్తల మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసు కేసులకు సైతం వెరవకుండా రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. -
ఆర్జేడీ వ్యవస్థాపక దినోత్సవం వేళ బీజేపీపై లాలు నిప్పులు
పట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) 30వ వ్యవస్థస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ సుప్రీమ్ లాలు ప్రసాద్ యాదవ్ బిహార్ ప్రజలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆదివారం ఒక సందేశాన్ని విడుదల చేశారు. 1997 జూలై 5న ప్రారంభమైన తమ పార్టీ మూడు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుందని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లోకి తీసుకుని, ఏకపక్ష అధికార బలంతో బీజేపీ దేశాన్ని వెనక్కి నెట్టేస్తోందని లాలు ఆరోపించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆర్జేడీ కేవలం ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ మాత్రమే కాదని, కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా సమాజంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల హక్కుల కోసమే ఈ పార్టీ పుట్టిందని, రాబోయే రాజకీయ పోరాటం గతంతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు విభేదాలను పక్కనబెట్టి, పార్లమెంట్ నుంచి వీధుల వరకు ప్రజల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. -
బిహార్ ఎమ్మెల్యేకి నాలుగేళ్ల జైలు
న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కాల్పులు జరిపి ఒకరి మృతికి కారణమైన బిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్కి ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. చట్టపాలన నడిచే మన దేశంలో పుష్ప, సింగమ్ల వంటి వారితో పని లేదంటూ స్పెషల్ కోర్టు విశాల్ గొగ్నె వ్యాఖ్యానించారు. ‘అధికారముందనే అహంకారంతో మద్యం మత్తులో తన హోదాను ప్రదర్శించుకునేందుకు కాల్పులు జరిపినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఉదాసీనత చూపితే అక్రమ ఆయుధాల దందా మొదలై రాజకీయాల్లోకి బాహుబలులు ప్రవేశిస్తారు. చట్టపాలన నడిచే చోట పుష్ప, సింగమ్ల వంటి వారితో అవసరం లేదు. దోషి రాజు కుమార్ సింగ్ బరితెగింపు చర్య మిగతా వారిని ప్రేరేపించేలా ఉంది’అని ఆయన వ్యాఖ్యానించారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రాజు సింగ్.. వేడుక సమయంలో చుట్టూ జనం ఉన్నారన్న విషయాన్ని, వారిలో సొంత కుటుంబీకులున్న విషయాన్ని సైతం విస్మరించి, నిర్లక్ష్యంగా, నేరపూరితంగా వ్యవహరించారని జడ్జి విశాల్ పేర్కొన్నారు. నివాసంలో వివిధ రకాల మారణాయుధాలు, బుల్లెట్లు లభించడాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఆయనకు ప్రొబేషన్ను నిరాకరిస్తున్నట్లు తీర్పులో స్పష్టం చేశారు.జరిమానాతో ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమంటూ జడ్జి విశాల్..వివిధ వ్యాపారాలతో భారీగా ఆదాయం పొందే రాజు సింగ్ బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. 2018 డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఫతేపూర్ బేరిలోని ఓ ఫాంహౌస్లో ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ నూతన సంవత్సర వేడుకలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆహ్వనంపై అర్చనా గుప్తా, ఆమె భర్త, పిల్లలు హాజరయ్యారు. నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన గుర్తుగా ఎమ్మెల్యే సింగ్ తన చేతిలోని తుపాకీని పలుమార్లు కాల్చారు. అయితే, బుల్లెట్లు తగిలి అర్చనా గుప్తా(45) ప్రాణాలు కోల్పోయారు. -
‘రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా 46 మంది కాంగ్రెస్ నేతలు.. అధిష్టానానికి లేఖలు’
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్రెడ్డిని తప్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హైకమాండ్కు లేఖలు రాశారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. సీఎం రేవంత్రెడ్డికి, ఆయన మంత్రివర్గంలోని మంత్రులకు మధ్య గ్యాప్ బాగా పెరిగిందని ఆరోపించారు. ఇటీవల రేవంత్రెడ్డి చేసిన ‘హిట్లర్’ వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నెగెటివ్ అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లోనే 46 మంది నాయకులు సీఎంకు వ్యతిరేకంగా ఉన్నారని, రేవంత్రెడ్డిని మార్చాలంటూ పలువురు మంత్రులు సైతం అధిష్టానాన్ని కోరినట్లు వెల్లడించారు.ప్రస్తుతం రేవంత్రెడ్డిని ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్లు మాత్రమే కాపాడుతున్నారని ఏలేటి వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి వ్యవహారశైలి కారణంగానే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల మధ్య కూడా విభేదాలు వచ్చాయని అన్నారు. గతంలో రేవంత్రెడ్డిపై మీనాక్షి నటరాజన్ నివేదిక సమర్పించారని.. ఆ నివేదికను మనసులో పెట్టుకునే ఆమెకు ఎంపీ పదవి రాకుండా రేవంత్రెడ్డి అడ్డుకున్నారని మహేశ్వర్రెడ్డి ఆరోపించారు -
మహా రాజకీయాల్లో బాంబు పేల్చిన జూనియర్ థాక్రే
మహారాష్ట్ర యువనేత ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు అక్కడి రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ యూబీటీ(ఉద్దవ్ థాక్రే) శివసేన నుంచి జరుగుతున్న వరుస వలసలు యాదృచ్ఛికం కాదని, దీని వెనక పెద్ద కుట్ర దాగుందని అంటున్నారాయన. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై సంచలన ఆరోపణలు చేశారు. ఇవన్నీ షిండే నేతృత్వంలో జరుగుతున్న ‘‘ప్లాన్డ్ పొలిటికల్ ఆపరేషన్’’లో భాగమని ఠాక్రే ఆరోపించారు.ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జూనియర్ థాక్రే.. మహారాష్ట్రలో గత కొంతకాలంగా జరుగుతుందని ఆపరేషన్ టైగర్ కాదని.. దానిని ఆపరేషన్ దేవేంద్ర ఫడ్నవిస్ అని అభివర్ణించారు. దీని వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల వ్యూహాత్మక హస్తం ఉందని, షిండేను ముందుంచి ఆ పెద్దలు ఈ డ్రామాను నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆపరేషన్ ఉద్దేశం.. ఫడ్నవిస్ను ఎదగకుండా అడ్డుకోవడమే సంచలన వ్యాఖ్యలు చేశారు.శివసేన (UBT) నుంచి ఇటీవల 9 మంది ఎంపీల్లో 6 మంది షిండే వర్గానికి చేరిన విషయాన్ని ప్రస్తావించిన ఆదిత్య ఠాక్రే.. తమ పార్టీని ఈ పెద్ద రాజకీయ ఎత్తుగడలో “కాలాటరల్ డ్యామేజ్”గా(లక్ష్యంగా కాకపోయినా దెబ్బతినడం) వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గానికి తరలించబడే అవకాశం ఉందని, ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు.‘‘బహుశా ఇది దేవేంద్ర ఫడ్నవీస్కు చివరి అసెంబ్లీ సెషన్ కావచ్చు’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. షిండే కూడా తిరిగి ముఖ్యమంత్రి పదవిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.వలసల వెనుక డబ్బు పాత్ర ఉందన్న ఆరోపణలను కూడా ఆదిత్య ఠాక్రే పునరుద్ఘాటించారు. కొన్ని వీడియోలు, మీడియా క్లిప్స్ను ఆధారంగా చూపుతూ, ఎమ్మెల్యేలు పార్టీ మారిన వెంటనే ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. “పార్టీ మారిన వెంటనే లగ్జరీ ఫ్లాట్లు, ఖరీదైన కార్లు ఎలా వస్తాయి?” అని ఆయన వ్యాఖ్యానించారు.అదేవిధంగా బీజేపీపై కూడా ఆదిత్య ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. రామమందిర ట్రస్ట్ నిధులపై వచ్చిన వివాదాలను ప్రస్తావిస్తూ, పారదర్శకతపై ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. బీజేపీని ‘‘బాబర్ జనతా పార్టీ’’గా అభివర్ణించారు.అయితే ఈ ఆరోపణలపై బీజేపీ, షిండే వర్గాలు ఇంకా స్పందించలేదు. అయితే.. ఉద్దవ్ శివసేన (UBT) రాజకీయంగా ఒత్తిడిలో ఉండటం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీని బాబర్జనతా పార్టీగా అభివర్ణించడమూ రాజకీయంగా పెద్ద దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. -
నోరు పారేసుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు పారేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని చెప్పుతో కొడతానంటూ దూషణకు దిగారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు. కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుంది. అప్పటిలోగా వైఎస్సార్సీపీ నేతలకు సినిమా చూపిస్తా’’ అంటూ ఆదినారాయణరెడ్డి బెదిరింపులకు దిగారు.ఇవాళ జిందాల్ స్టీల్ సందర్శనకు వైఎస్సార్సీపీ పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన జిందాల్ స్టీల్కు మళ్ళీ శంకుస్థాపనకు చంద్రబాబు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ హయాంలోనే భూమి పూజ పూర్తయి, పనులు కూడా ప్రారంభమైన జిందాల్ స్టీల్ ప్లాంట్కు చంద్రబాబు మళ్లీ భూమి పూజ చేస్తూ ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడటాన్ని ప్రజల ముందు ఉంచడానికి వైఎస్సార్సీపీ చలో జిందాల్ కార్యక్రమం తలపెట్టింది. ఈ సందర్భంలో వైఎస్సార్సీపీ నేతలపై ఆదినారాయణరెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారు. -
త్రిలింగ భూమిపై కమలం వికసించాలి
సాక్షి, హైదరాబాద్/ఘట్కేసర్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు కౌంట్డౌన్ ప్రారంభమైందని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కల సాకారం చేయాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం వెంటనే సడక్ సే సన్సద్ తక్ (గల్లీ నుంచి చట్టసభల దాకా) పోరుబాటకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ లక్ష్యాలను వివరించాలని సూచించారు. తెలంగాణలో పరివర్తన, ప్రజల గొంతుకగా వారి సమస్యలపై రోడ్లపైకి వచ్చి పోరాడితేనే అధికారం సాధ్యమని.. ఈ త్రిలింగ భూమిపై కమలం వికసించేలా పోరాడాలని కోరారు. మంగళవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అవుషాపూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నితిన్ నబీన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ల పాలనను తూర్పారబట్టడంతోపాటు తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సొమ్ము రాహుల్ యాత్రలకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ పూర్తి చేయలేదని నితిన్ నబీన్ విమర్శించారు. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు పేరిట లూటీకి తలుపులు తెరిచిందని దుయ్యబట్టారు. అవినీతి, నేరమయ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పర్యాయపదంగా మారిందని.. దేశంలోని తుక్డే తుక్డే గ్యాంగ్లతో చేతులు కలిపి పనిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల శ్రమతో సంపాదించిన డబ్బును ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ఢిల్లీకి తరలిస్తోందని.. ప్రజల డబ్బును, రైతులకు ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సొమ్మును రాహుల్ గాంధీ విదేశీ యాత్రలకు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే అవినీతి, అక్రమాలను కొనసాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ లెక్కలన్నీ తేలుస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని ప్రకటించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమరయ్య, పార్టీ నేతలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, రేఖా శర్మ, పొంగులేటి సుధాకర్రెడ్డి, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. విభేదాలు వీడండి: సునీల్ బన్సల్ ‘తెలంగాణలో ఫైర్ ఉన్నా దానిని ఎలా ఉపయోగించుకోవడమే సమస్యగా మారుతోంది. మీలో మీరు కొట్టుకుంటున్నారు. దీంతో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితిని పక్కనపెట్టి అన్ని శక్తులను ఒకే దిశలో పెట్టే ప్రక్రియ అవసరం ’అని రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగింపు సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ పేర్కొన్నట్లు సమాచారం. నేతలంతా టార్గెట్ తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ‘రాష్ట్రంలో బీజేపీకి మరో శుత్రువు లేదు. పార్టీలోనే ఒకరికొకరు శత్రువులు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. దీన్ని అధిగమిస్తే పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’అని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.తీర్మానాలు ఇవే...» కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కోసం రాష్ట్ర పార్టీ కృషి చేయాలని, ప్రభుత్వాన్ని గద్దె దించేలా పోరాడాలని రాష్ట్ర కార్యవర్గం రాజకీయ తీర్మానం ఆమోదించింది. » నిరుద్యోగ భృతి చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మరో తీర్మానం. » రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతుల పక్షాన పోరాడాలని వ్యవసాయ రంగ తీర్మానం ఆమోదం. » ప్రధాని మోదీ పన్నెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలను ప్రశంసిస్తూ మరో తీర్మానం. » తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి ఎంతో సహకరిస్తోందని ఇంకో తీర్మానానికి ఆమోదముద్ర. గ్రూపులను సహించం.. కలిసి పనిచేయాల్సిందే పార్టీ ముఖ్య నేతలతో భేటీలో నితిన్ నబీన్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడాన్ని, సమన్వయ లేమి వల్ల పార్టీలో సమస్యలు తలెత్తడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపక్షించే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇప్పటికైనా కొందరు నేతలు పద్ధతి మార్చుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని ఆయన సూచించారని తెలిసింది. మంగళవారం రాష్ట్ర కార్యవర్గ భేటీ సందర్భంగా విడిగా ముఖ్య నేతలతో నితిన్ నబీన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, వైఫల్యాలు ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ నేతలంతా కలిసిమెలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పినట్లు తెలిసింది.రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకుప్రజలు సిద్ధంగా ఉన్నారు: రాంచందర్రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా పేరిట కూల్చివేతలతో సర్కార్ను ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. మూసీ ప్రక్షాళనపై బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే గాంధీ సరోవర్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రకటించి లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజలను నిర్వాసితులను చేయడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీకి అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మంగళవారం ఘట్కేసర్ సమీపంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ మనలో మనం పోరాడకుండా, విభేదించుకోకుండా ‘టీమ్ బీజేపీ’గా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తిచేసుకుంటున్న సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి, ప్రతి అడుగులోనూ సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాంచందర్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. నితిన్ నబీన్ నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేస్తుందనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. -
తెలంగాణపై కాషాయ జెండా
సాక్షి ప్రతినిధి, వరంగల్: 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణపై కాషాయ జెండా ఎగురుతుందని.. బీజేపీ అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా జోస్యం చెప్పారు. ఆ లక్ష్య సాధన కోసం ప్రతి బూత్లో పార్టీని బలోపేతం చేయాలని.. కార్యకర్తలంతా ప్రజల్లో నిరంతరం ఉండాలని పిలుపునిచ్చారు.సోమవారం మధ్యాహ్నం హనుమకొండలో వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం గిరిజన నేతలతో సమావేశమైన ఆయన.. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన పార్టీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో మాట్లాడారు. బీజేపీ విజయానికి బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీలను వెన్నముకగా అభివర్ణించారు. వారి కృషి వల్లే దేశవ్యాప్తంగా కమలం వికసిస్తోందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమన్నారు.తెలంగాణతో బీజేపీది పోరాటాల బంధంతెలంగాణతో బీజేపీకి కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదని.. అది పోరాటాల ద్వారా ఏర్పడిన బంధమని నితిన్ నబీన్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో బీజేపీ రాజకీయ లాభనష్టాలు చూడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మద్దతిచ్చిందని చెప్పారు. దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చారని గుర్తుచేశారు.బీజేపీ తెలంగాణకు కొత్త పార్టీ కాదన్న ఆయన.. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా గెలిచిన రెండు స్థానాల్లో ఒకటి తెలంగాణ నుంచే రావడం చారిత్రక విషయమన్నారు. అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం బీజేపీ పనిచేస్తోందని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గొంతుకగా, అధికారంలో ఉన్నప్పుడు మరింత సమర్థంగా ప్రజలకు సేవ చేయాలన్నదే పార్టీ సిద్ధాంతమని చెప్పారు.బీజేపీ కార్యకర్తలంతా పూర్తిస్థాయి ప్రజాసేవకులుగత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని నితిన్ నబీన్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం వినియోగించిందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనలో ప్రజల ఆశలు నెరవేరలేదని, తెలంగాణకు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లో కనిపించే పార్ట్టైమ్ రాజకీయ నాయకుడు అని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు మాత్రం 24 గంటలూ ప్రజల కోసం పనిచేసే ఫుల్టైమ్ ప్రజాసేవకులని కొనియాడారు.వరంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం: జి. కిషన్రెడ్డితెలంగాణలో బీజేపీ అధికారంలో లేకపోయినా వరంగల్ అభివద్ధికి కేంద్రం గణనీయమైన నిధులు కేటాయించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీకి వరంగల్పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధిపై నివేదికతో సహా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వరంగల్కు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేసిందని విమర్శించే వారికి పూర్తి వివరాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని... కేసీఆర్, రాహుల్ గాంధీ విమర్శలు వాస్తవాలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అత్యధికంగా కేంద్ర నిధులు వరంగల్కే వచ్చాయని.. కానీ వాటిని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ నిధులతో కరీంనగర్ అభివృద్ధి చెందగా వరంగల్లో అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురుతుందని.. బీజేపీ గెలిస్తేనే వరంగల్ సుందర నగరంగా మారుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్, జాతీయ, రాష్ట్ర నాయకులు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, టి.రాజేశ్వర్రావు, దొంతి దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఆ మూడు వర్గాల సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధియువత, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని నితిన్ నబీన్ చెప్పారు. ఆ మూడు వర్గాల సాధికారత ద్వారానే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ సిద్ధాంతంతో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రతి కుటుంబానికీ తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. -
ఫీజు బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
సాక్షి, హైదరాబాద్/ఘట్కేసర్: ‘తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను గాలికొదిలేసిందని విమర్శించారు. సోమవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఘట్కేసర్ వీబీఐటీ క్యాంపస్లో ‘వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్క్లేవ్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత్–భవిష్యత్ సవాళ్లు, 2047 వికసిత్ భారత్ లక్ష్యం, 12 ఏళ్ల మోదీ పాలన తదితర అంశాలపై పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానమిచ్చారు. మన యువతది తుక్డే తుక్డే మైండ్సెట్ కాదు‘ఇతర దేశాల్లో సాగుతున్న జెన్–జీ ఉద్యమాలను అందిపుచ్చుకోవాలంటూ కొన్ని రాజకీయశక్తులు మన దేశంలోని యువతను రెచ్చగొడుతున్నాయి. కానీ భారత్లోని జెన్–జీ ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కాదు. మన యువత అరాచకాలను విశ్వసించదు. ఇది రాళ్లు విసిరే తరం కాదు... జాతిని నిర్మించే తరం.. వారిది తుక్డే తుక్డే మైండ్సెట్ కాదు. యువ భారతీయులు దేశాభివృద్ధికి, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్ భారతానికి వారి వంతు కృషి చేస్తున్నారు’ అని నితిన్ నబీన్ పేర్కొన్నారు. ‘జీవితానికి అడ్డదారులు ఉండవు...యువత, విద్యార్థులు ఏ విషయంలోనూ సత్వర మార్గాలు ఎంచుకోవద్దని.. జీవితానికి అడ్డదారులు ఉండవని నితిన్ నబీన్ సూచించారు. ‘జీవితం అనేది ఒక సుదీర్ఘ పరుగు. ఇది 100 మీటర్ల పరుగుపందెం కాదు. ఇది ఓపికకు పరీక్ష’ అని వివరించారు. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినంత సమయం తీసుకోవాలని.. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి ఆ నిర్ణయం సరైనదా కాదా అనే చర్చ జోలికి వెళ్లరాదని సూచించారు. విద్యార్థులు వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అప్పుడే వారిలోని అసలైన సామర్థ్యం బయటపడుతుందన్నారు.తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని.. అలా తొలినాళ్లలో తన భవిష్యత్తు ఏమవుతుందోనని గందరగోళానికి గురైనట్లు చెప్పారు. ఈ క్రమంలో తనకు లభించిన ఎలాంటి పనినైనా నిబద్ధతతో పూర్తి చేస్తూ అందులో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశానన్నారు. ఈ కాన్క్లేవ్లో నల్సార్, ఐఎస్బీ, హెచ్సీయూ, కేయూ, ఓయూ, ఐఐటీ, ఐఐఐటీ, హార్వార్డ్, ఎన్ఐటీ, ఇఫ్లూ, బిట్స్ తదితర విద్యాసంస్థల నుంచి దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్, మహారాష్ట్ర మంత్రి ఆశిష్ సెల్లార్, ఎంపీ రేఖా శర్మ, బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేవైఎం అధ్యక్షుడు గణేశ్ కుండె, మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి, టెన్నిస్ క్రీడాకారిణి రష్మిక శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. -
కుళ్లిన గుడ్లతో ఆ పార్టీ నేత మీద దాడి.. ‘ఎగ్ థెరపీ’ అంటూ..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీఎంసీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఉత్తర 24 పరగణాల ఖర్దాహ్లో పనిహాటి మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ జయంత దాస్ అలియాస్ గోబింద్ దాస్పై కొందరు కుళ్లిన గుడ్లు విసిరారు. ఖర్దాహ్ పోలీస్ స్టేషన్ నుంచి బరాక్పూర్ సబ్-డివిజనల్ కోర్టుకు పోలీసులు ఆయనను తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో పోలీస్ స్టేషన్ బయట ఉన్న కొందరు జయంత దాస్పై కుళ్లిన గుడ్లతో దాడి చేశారు. దీన్ని ఎగ్ థెరపీ అని నిరసనకారులు అభివర్ణించారు. జయంత దాస్ను మాజీ పనిహాటి ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. కుళ్లిన గుడ్లతో దాడి ఘటన తర్వాత కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గుడ్లు ఎవరు విసిరారు? నిరసనకు కారణం ఏమిటి? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత భద్రతను కూడా పెంచారు.అవినీతి, వసూళ్లు, అక్రమ భూ వ్యవహారాలు, రాజకీయ హింస ఆరోపణలతో టీఎంసీ నేతలను పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అదే సమయంలో ప్రజలు నిందితులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు, కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్కు సన్నిహితుడిగా భావించే మాజీ టీఎంసీ కౌన్సిలర్ షమ్స్ ఇక్బాల్ను కూడా గార్డెన్ రీచ్ పోలీసులు రూ.70 లక్షల వసూళ్ల కేసులో అరెస్టు చేశారు.North 24 Parganas- Rotten eggs thrown at Panihati TMC councillor Jayanta Das. pic.twitter.com/1P60SspuQ9— News Arena India (@NewsArenaIndia) June 29, 2026 -
ఉర్దూ టీచర్పై దాడి.. ఆర్మూర్లో హైటెన్షన్
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉర్దూ టీచర్పై దాడికి పాల్పడ్డ బీజేపీ నేత బాలును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలపై నిషేదం విధించారు. -
కార్పొరేషన్లు గెలవాలి.. కాంగ్రెస్ను దించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను గద్దె దించడమే ధ్యేయంగా వచ్చే రెండున్నరేళ్లపాటు యావత్పార్టీ ముందుకు సాగాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా ఎంపీలు మొదలు అన్ని స్థాయిల వారు తమ పరిధులు, క్షేత్రాల్లో పోరాడి, ఎక్కడికక్కడ ప్రజల మద్దతును కూడగట్టాలన్నారు. ఆదివారం రాత్రి బీజేపీ కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో జరగబోయే ప్రతీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలోని ప్రతి గడపకు తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధి, ప్రజల పురోగతి కోసం అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనిపై వెంటనే యువమోర్చా ఆధ్వర్యంలో రోడ్డెక్కి విద్యార్థి, యువత మద్దతును కూడగట్టే దిశలో కార్యాచరణను ప్రారంభిస్తుందని ప్రకటించారు.రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తిస్థాయిలో సహకరిస్తే..తెలంగాణ ఏర్పడ్డాక గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా చిదిమేశాయని మండిపడ్డారు. ప్రధానంగా నీటిపారుదల రంగంలో భారీ అవినీతికి తెరతీసి తెలంగాణలోని బీడుబారిన పొలాలకు సాగునీరు చేరకుండా అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. నెల రోజుల్లో వాతావరణం మారాలి: ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యం. నెల రోజుల్లో ఆ వాతావరణం క్రియేట్ చేయాలి. ఎవరో వస్తారు కాదు. మీరు ఒక నేరేటివ్ క్రియేటివ్ చేయాలి. మీరు అది క్రియేట్ చేశాక అప్పుడు హైకమాండ్ నుంచి ఏం చేయాలో అది చేస్తాం. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్కోప్ ఉంది. కులపిచ్చి బంద్ చేయండి..మీరు ఇలాగే ఉంటే పార్టీ ముందుకు పోదు. ఇకనైనా మారండి. పార్టీ ఫస్ట్..లీడర్ నెక్టŠస్. ఎవరు ఏం చేస్తున్నారో నాకు ఐడియా ఉంది. కష్టపడి పని చేయండి. ఐక్యంగా ముందుకు సాగాలి. నేను గతంలో తెలంగాణలో పర్యటించాను. నాకు కొంత ఐడియా ఉంది. ఇవాళ తేదీ గుర్తు పెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇది గుర్తు చేసుకోవాలి’ అని నితిన్నబిన్ చెప్పారు. ఆదివారం ఆయన పాల్గొన్న మూడు సమావేశాల్లోనూ దశాబ్దాలుగా తెలంగాణతో బీజేపీకున్న అనుబంధం, కార్యకర్తల త్యాగం, బలమైన కేడర్ తదితరాలను ప్రస్తావించారు. మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని, అక్కడి నుంచి ఊట్పల్లిలో రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యాలయం, మరో 8 జిల్లాల ఆఫీస్లను వర్చువల్గా ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలోని పోలింగ్ బూత్ల అధ్యక్షులను ఉద్దేశించి ప్రసంగించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఘట్కేసర్లోని వీబీఐటీ క్యాంపస్లో ‘స్టూడెంట్స్ అండ్ యూత్ కాన్క్లేవ్’లో యువత, విద్యార్థులతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి భువనగిరి మీదుగా వరంగల్కు చేరుఒని, మధ్యాహ్నం 2 గంటలకు హనుమకొండలోని అశోక కన్వెన్షన్లో గిరిజన, ఆదివాసీ నాయకులతో, సాయంత్రం 4 గంటలకు వరంగల్లోని ఆర్ట్స్కాలేజీ గ్రౌండ్స్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో భేటీ జరగనుంది. రాత్రికి హైదరాబాద్కు చేరుకుంటారు. -
మేం సిద్ధం.. మీరు సిద్ధమా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన, పదేళ్ల బీఆర్ఎస్ పాలన, దేశంలో 12 ఏళ్ల బీజేపీ పాలన, మేనిఫెస్టోలపై చర్చించేందుకు తాము సిద్ధమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమం, ఆత్మ బలిదానాలపై కూడా చర్చిద్దామని, ప్రజలకు ఎవరేం చేశారో తేల్చుకుందామని అన్నారు. ‘మీరు స్పీకర్కు లేఖ రాయండి.. అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహిద్దాం. ఎన్ని రోజులైనా చర్చిద్దాం.. ఇందుకు మీరు సిద్ధమా..’ అని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.13 వేల కోట్లతో నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అక్కడి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన హ్యామ్ రోడ్ల పైలాన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 వరకు మాదే అధికారం.. ‘మా ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. కాంగ్రెస్ రెండున్నరేళ్లలో ఏమీ చేయలేదని బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కేసీఆర్ శుక్రాచార్యుడిలా ఫామ్హౌస్లో ఉంటే కేటీఆర్, హరీశ్లు బిల్లారంగా తరహాలో తెలంగాణలో తిరుగుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం పోవాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ప్రజలు అలా ఏమీ కోరుకోవడం లేదు. వారి కుటుంబం, వారికి సంబంధించిన వారే కోరుకుంటున్నారు. సింగరేణిలో టెండర్ ప్రక్రియ పూర్తి కాకముందే ఆరోపణలు చేశారు. వారు ఎన్ని నాటకాలు వేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. వారు సామాజికంగా బీఆర్ఎస్ను బహిష్కరించారు. 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం. పదేళ్లు వెనక్కు తిరగకుండా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం. మాకు ప్రజలు అండగా ఉండాలి..’ అని సీఎం కోరారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, కోమటిరెడ్డి త్యాగాలను ఏమనాలి? ‘బీఆర్ఎస్ త్యాగాల పునాదులపై తెలంగాణ వచ్చిందన్నారు. మీవి త్యాగాలా? ఆ పేరుతో రాజీనామాలు చేసి ఎన్నికలు తెచ్చి కలెక్షన్లు చేశారు. మీరు చేసినవే త్యాగాలంటే.. కొండా లక్ష్మణ్ బాపూజీ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన త్యాగాలను ఏమనాలి? 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ మంత్రి పదవి తీసుకోలేదు. మలి దశ ఉద్యమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి పదవి వదిలేసి, నల్లగొండ గడ్డపై తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తెలంగాణ వచ్చాకే పదవి తీసుకుంటానని ప్రతినబూని వచ్చాకే మళ్లీ మంత్రి పదవి తీసుకున్నారు. రూ.100 పెట్రోలు తెచ్చుకుని 1 రూపాయి అగ్గిపెట్టె తెచ్చుకోలేని హరీశ్రావుది త్యాగమా? శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యలది త్యాగమా? అగ్గిపెట్టె హరీశ్రావు ఆర్థిక మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసినప్పుడు తెలంగాణ అప్పులు రూ.69 వేల కోట్లు ఉంటే బీఆర్ఎస్ పాలనలో రూ.8.11 లక్షల కోట్లకు పెంచారు. అలాంటి వారి దోపిడీని ప్రజలు ఇంకా సహించాలా? పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించిన మిమ్మల్ని ఏమనాలి?..’ అని రేవంత్ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కడుపు మంట ఎందుకు? ‘రూ.16 వేల కోట్లు పెట్టి పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం. ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్ ఏం తింటున్నారో, తండాలో ఉండే గిరిజన బిడ్డలు కూడా ఆ సన్న బియ్యమే తింటున్నారు. బీఆర్ఎస్ నేతలకు డౌటు ఉంటే తండాలు, గూడేలకు వెళ్లి సన్న బియ్యం తింటున్నారో? లేదో? చూసి రావాలి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదు. మేము రెండున్నరేళ్లలో 4.5 లక్షల ఇళ్లు కట్టిస్తుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపు మండుతోంది. పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే వందల ఎకరాల్లో ఫామ్హౌస్లు కట్టుకున్న వారికి కడుపుమంట ఎందుకు? తండ్రి, కొడుకు, అల్లుడికి ఫామ్ హౌస్లు, పదవులు తప్ప ప్రజల గురించి ఆలోచనే లేదు. పరీక్షలు పెట్టి పేపర్లు అమ్ముకుని వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు..’ అని సీఎం దుయ్యబట్టారు. వందలాది అంబేడ్కర్లు తయారు కావాలి ‘మా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. యంగ్ ఇండియా స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పేద బిడ్డ పెద్ద చదువులు చదవాలి. వందల మంది అంబేడ్కర్లు తయారు కావాలి. అడ్డు పడితే మూసీలో వేసి తొక్కుతా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతా. ఎవరు అడ్డు పడినా మూసీలో వేసి తొక్కుతా. మోదీ సబర్మతే కాదు..ఢిల్లీ యమునా కాదు.. యోగి గంగా నది కాదు.. దేశానికి ఎవరొచ్చినా మూసీ ప్రక్షాళన చూడటానికే రావాలనేలా, దేశానికే తలమానికంగా ఉండేలా మూసీని ప్రక్షాళన చేస్తా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి కృష్ణా జలాలను నల్లగొండ గడ్డపై పారించి రైతులకు సాగునీరు అందిస్తా. డిండి ఎత్తిపోతలను కూడా పూర్తి చేస్తా..’ అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చరిత్రలో మొదటిసారిగా..: భట్టి దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా రూ.23 వేల కోట్లతో రోడ్ల పథకాన్ని ప్రారంభించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా రూ. 90 వేల కోట్లతో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించడం ద్వారా తెలంగాణ భవిష్యత్కు అద్భుతమైన పునాదులు వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అహంకారంతో ప్రజలను హింసించిందని, తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రజల అవసరాలను తీర్చే కార్యక్రమాలు చేస్తోందని చెప్పారు. మొదటి వరుసలో నల్లగొండ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోళ్లలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే, రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మొదటి వరుసలో ఉందన్నారు. ఒక్క యాసంగి సీజన్లోనే 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో రూ.19,013 కోట్లు వేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.79,886 కోట్లు వేశామని తెలిపారు. ఏపీలో రూ.3 వేల కోట్లు..ఇక్కడ రూ.26 వేల కోట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.3 వేల కోట్లతో రోడ్డు పనులు చేస్తుంటే రాష్ట్రంలో రూ.6 వేల కోట్లతో చేస్తున్నామని చెప్పారు. దానికి అదనంగా రూ.13 వేల కోట్లతో హ్యామ్ రోడ్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.7 వేల కోట్లతో హ్యామ్ రోడ్లు, శాఖాపరంగా అన్నీ కలిపి రూ.26 కోట్లతో రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఎస్ఎల్బీసీ డి్రస్టిబ్యూటరీ పనులతో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, దాన్ని వెంటే బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్లు సిద్ధమయ్యాయని, అవీ కలిపితే రోడ్ల పనులు దాదాపు రూ. 80 వేల కోట్లకు చేరతాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు.. టెండర్లు ఓపెన్ చేయకుండానే స్కామ్లు జరిగాయని ఆరోపించడం దురదృష్టకరమన్నారు. ‘ఇప్పుడు టెండర్లు తెరిచాం. పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. గతంలో మీరు చేసినప్పటి రేట్లు ఇప్పటి రేట్లు చూసుకోవాలి’ అని ఆయన హితవు పలికారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తదితరులు మాట్లాడారు. -
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనుందంటూ మరోసారి వార్తలు షికారు చేస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ముందుగానే భారీగా మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మార్పుల ప్రక్రియ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించనున్న కొత్త కార్యవర్గం ప్రకటనతో పాటే ఉండొచ్చని కూడా ఊహాగానాలు వినవస్తున్నాయి. త్వరలో నబీన్ ప్రకటించే జాబితాలో సంస్థాగతమైన కీలక బాధ్యతల్లో యువ నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే, నితిన్ గత వారం కొందరు కేంద్ర సహాయ మంత్రులతో చర్చలు జరిపినట్లు సమాచారం. వీరిని పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి తీసుకుని, చురుగ్గా వ్యవహరించే కొందరు పదాధికారులను ప్రధాని మోదీ కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో, కొందరు మంత్రుల శాఖలు కూడా మారే అవకాశం ఉంది. మంత్రివర్గంలో మార్పులు జూలైలో, అదీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ముందే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ తేదీని ఖరారు చేయనున్నారు. కీలక మంత్రిత్వ శాఖల్లో కొత్త రక్తాన్ని నింపాలనే ఆలోచనతో పాటు ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు, విధేయత వంటి వాటికి కూడా సమతూకం పాటించాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రాలకు వరుసగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. బీజేపీ ’ఒక వ్యక్తి –ఒకే పదవి’ విధానం కారణంగా, వీరు కేబినెట్ నుంచి తప్పుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. తిరుగుబాటు వర్గాలకు చోటు.. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), శివసేన (యూబీటీ) తిరుగుబాటు వర్గాలకు చెందిన ఎంపీలకు మంత్రి పదవులు దక్కవచ్చని చెబుతున్నారు. ఆప్ని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీల్లోకి ఒకరిద్దరికి కూడా అవకాశం లభించవచ్చు. ఆ ముగ్గురు గవర్నర్ల స్థానంలో.. ప్రస్తుత కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, బీఎల్ వర్మల రాజ్యసభ పదవీకాలం నవంబర్తో ముగియనుంది. వీరిని తిరిగి నామినేట్ చేయడంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అలాగే, కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్), మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, ఉత్తరాఖండ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ల పదవీకాలం మరికొద్ది నెలల్లో ముగియనుంది. వీరి స్థానాల్లో మంత్రివర్గంలోని కొందరిని పంపే అవకాశమూ ఉంది. ఏదేమైనా, ప్రధాని మోదీ తన కీలక నిర్ణయాలను చివరి నిమిషం వరకు అత్యంత గోప్యంగా ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. -
‘పశ్చిమబెంగాల్లో జరిగిందే.. తెలంగాణలో..’
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ అన్నారు. ఈ రోజు (ఆదివారం) తొమ్మిది జిల్లాలలో బీజేపీ ఆఫీసులను వర్చువల్గా ప్రారంభించారు. గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో జరిగిందే తెలంగాణలోనూ జరుగుతుందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందన్నారు.కాగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ చేరుకున్న ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. క్యాడర్ని బలోపేతం చేసేలా పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించున్నారు.జూన్ 29న రేపు ( సోమవారం) ఘట్కేసర్లోని VBIT ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. తర్వాత వరంగల్ పర్యటనలో భాగంగా గిరిజన సంఘాల నేతలతో, పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశమవుతారు. తదుపరి జూన్ 30 నఘట్కేసర్లో రాష్ట్ర కార్యవర్గం, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను దిశానిర్దేశం చేసి, అనంతరం ఢిల్లీకి పయనం కానున్నారు. -
ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం
విక్టోరియా: సముద్ర పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ అనుకూల వృద్ధి (గ్రీన్ గ్రోత్), సముద్ర వనరుల బాధ్యతాయుత నిర్వహణలో ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ సెషెల్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హరైజన్’ అవార్డును ప్రధానికి ప్రదానం చేసింది.ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రెసిడెన్షియల్ సైటేషన్లో ప్రధాని మోదీ సుస్థిర ఆర్థిక వృద్ధి, బ్లూ ఎకానమీ (సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ) పట్ల చూపిన నిబద్ధతను సెషెల్స్ ప్రభుత్వం కొనియాడింది. ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలకు భారత్ అందిస్తున్న మద్దతును, వాతావరణ ప్రతిఘటన శక్తిని పెంపొందించడంలో, అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడంలో మోదీ పోషించిన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది.ఈ పురస్కారం భారత్-సెషెల్స్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని సెషెల్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తనకు లభించిన ఈ ప్రతిష్టాత్మక గౌరవంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. సెషెల్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడంపై గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ, పర్యావరణ పరిరక్షణను తమ భవిష్యత్ తరాల పట్ల బాధ్యతగా భావిస్తున్న ప్రపంచంలోని అన్ని దేశాలకు దీనిని అంకితం చేస్తున్నాను’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.పర్యావరణం, వ్యవసాయ రంగాలలో ప్రధాని మోదీ అంతర్జాతీయంగా అందుకున్న అవార్డుల పరంపరలో ఇది తాజా చేరింది. కాగా, ఈ ఏడాది మేలో ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రధానికి ‘అగ్రికోలా మెడల్’ అందజేసింది. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, ఆధునిక వ్యవసాయ మార్పులు తీసుకురావడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. -
ఎన్ని ఓట్లు తొలగిస్తారు సర్!
జూన్ 25వ తేదీని బీజేపీ మాదిరిగా దేశంలో మరే పార్టీ గుర్తుపెట్టుకోలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఐదు దశాబ్దాల కింద ఇందిరాగాంధి విధించిన ఎమర్జెన్సీ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా ప్రతియేటా బీజేపీ పాటిస్తున్నది. ఈయేడు కూడా బీజేపీ అగ్రనేతలంతా ఆనాటి అకృత్యాలపై ఎలుగెత్తారు. ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ ‘దేశ చరిత్రలో ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఒక చీకటి అధ్యాయాన్ని ప్రారంభించింద’ని విమర్శించారు. పురాణాల్లోంచి నాలుగు సంస్కృత పంక్తులను సంగ్ర హించి ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. ‘స్వాతంత్య్రం ద్వారానే మనిషి నిజమైన సుఖాన్ని పొందుతాడు, ఉన్నతమైన విజయాలను సాధిస్తాడు. స్వేచ్ఛ ద్వారానే మనిషికి మనశ్శాంతి, సంతృప్తి లభిస్తాయి. స్వాతంత్య్రం ద్వారానే అత్యున్నత స్థితికి చేరుకోగలుగుతాము’ అని ఆయన సందేశానికి అర్థం. ప్రధాని చెప్పినట్టుగా ఎమర్జెన్సీ కాలం ఈ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమే. లక్షమందికి పైగా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను, నాయకులను అక్రమంగా నెలల తరబడి నిర్బంధించిన రోజులవి! భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాణప్రదమైన పౌరహక్కులను సమస్త ప్రజానీకం సామూహికంగా కోల్పోయిన అస్వతంత్ర దినాలవి! లాకప్ చిత్రహింసలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కోటిమందికి పైగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా వారిలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పీడకాలం అది. లక్షలాది నిరుపేదల ఆవాసాలను సర్కారీ బుల్డోజర్లు కర్కశంగా చిది మేసిన నిరంకుశ క్షణాలవి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేని అటు వంటి స్థితిలో మనిషికి నిజమైన సుఖసంతోషాలుండవని ప్రధానమంత్రి ప్రబోధించారు. కాకతాళీయంగా జూన్ 25 మాదిరిగానే జూన్ 24 కూడా భవిష్యత్తు చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజుగా మిగిలిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. భారత రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) కార్యక్రమం గత సంవత్సరం జూన్ 24న బిహార్లో ప్రారంభమైంది. ఇప్పటికి పన్నెండు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా ఓటర్ల పరిశీలన పూర్తయింది. వీరిలో ఐదు కోట్ల పైచిలుకు మందిని జాబితాల నుంచి తొలగించారు. చని పోయిన వారిని మినహాయించగా మిగిలిన వారి సంఖ్య ఇది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మిగిలిన రాష్ట్రాల్లో 39 కోట్ల మంది ఓటర్ల పరిశీలనా కార్యక్రమం ఈ జూన్లో ప్రారంభమైంది. సర్ కార్యక్రమం తొలగింపు సరాసరి లెక్కన ఈ మూడో దశలో కూడా మరో పది శాతం మందిని జాబితాల నుంచి తొల గించే అవకాశం ఉన్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ అనుమానాలే నిజమైతే జర్మనీ జనాభాకు ఇంచుమించు సమాన స్థాయిలో మన దేశంలో అనర్హులుగా తేల్చిన ఓటర్ల సంఖ్య ఉంటుంది. వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? వారి అప్పీళ్లు ఎప్పుడు పరిష్కారమవుతాయన్నది అగమ్యగోచరం. తమ అనర్హతపై బిహార్లో 47 లక్షలమంది, బెంగాల్లో 27 లక్షల మంది చేసుకున్న అప్పీళ్లపై ఇప్పటికీ విచారణే ప్రారంభం కాలేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలదీ అదే కథ. ఈలోగా ఎన్ని కలు పూర్తయి కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. వయోజను లైన భారత పౌరులందరికీ మన రాజ్యాంగం ఎటువంటి వివక్ష లేకుండా ఓటు హక్కును కల్పించింది. మానసిక స్థితి బాగా లేనివారు, కొన్ని తీవ్రమైన నేరాల్లో శిక్షపడినవారు, విదేశీయు లకు మాత్రమే ఓటు హక్కును తిరస్కరించే అవకాశం ఉన్నది. ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్న ఐదు కోట్లమంది, ఉండే అవ కాశం ఉన్న మరో మూడు కోట్ల మందిని ఏ కేటగిరీలో చేర్చాలి?సార్వత్రిక ఓటు హక్కు అనేది రాజ్యాంగ స్ఫూర్తి. అర్హులైన అందరినీ ఓటర్లుగా నమోదు చేసి వారి జాబితాలను తయారు చేసే బాధ్యతను రాజ్యాంగం ఎన్నికల సంఘం మీద మోపింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఓటర్లుగా నమోదయ్యే బాధ్యతను, అందుకోసం తన పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ప్రజలపైనే ప్రస్తుత ఎన్నికల సంఘం మోపింది. వయోజనులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించడం రాజ్యాంగ ఆశయమైతే, అదే రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం వైఖరి వీలై నంత ఎక్కువమందిని ఓటు హక్కుకు దూరం చేసేదిగా కనిపి స్తున్నది. రాజ్యాంగ ఆశయానికి అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని (1950) రూపొందించారు. దాంతోపాటు ఓటర్ల నమోదు నిబంధనావళి (1960)ని పార్లమెంట్ తయారు చేసింది.ఈ చట్టం ప్రకారం ప్రతి జనరల్ ఎలక్షన్కు ముందు సాధా రణ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ జరగాలి. చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారి ఓట్లను తొలగించడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం వరకు ఈ ప్రక్రియ పరిమిత మవుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఓటర్ల జాబితా ‘ప్రత్యేక’ సవరణకు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 21 (2) అనుమతినిస్తున్నది. అయితే ఆ ప్రత్యేక సందర్భాన్ని ముందుగా ఎన్నికల సంఘం పేర్కొనాలి. ఆ తర్వాత ఈసీఐ అవసరమని భావించిన ఏదైనా నియోజకవర్గంలోగానీ, నియోజకవర్గంలోని కొన్ని భాగాల్లోగానీ ప్రత్యేక సవరణ చేపట్టవచ్చునని చట్టం చెబుతున్నది. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ అనేది చట్టం పరిధి దాటిన వ్యవహారంగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు చేపట్టే సవరణ సాధారణ సవరణగానే ఉండా లని చట్టం స్పష్టంగా పేర్కొన్నది.పెద్దసంఖ్యలో అక్షరజ్ఞానం లేనివారు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో కనీస డిజిటల్ పరిజ్ఞానం లేనివారు, తాత్కాలిక వలస లకు వెళ్లే శ్రమజీవులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలున్న దేశంలో ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది వీలైనంత సరళంగా ఉండాలి. కానీ సాధ్యమైనంత సంక్లిష్టమైన ప్రక్రియగా ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్చివేసింది. 2002 ఓటర్ల జాబితాను ఆధారం చేసుకొని ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేయడం ఈ ప్రక్రియలో తొలిదశ. అందులో ఉన్న ఓటర్లకు ఇబ్బందేమీ ఉండదు. ఎన్యుమరేషన్ ఫాం నింపితే సరిపోతుంది. నలభయ్యేళ్ల లోపు వయసు వాళ్లకు అప్పట్లో ఓటు ఉండే అవకాశం లేదు కనుక వారు అప్పటి జాబితాలో ఉన్న తండ్రి పేరును, తాత పేరును వెతికి పట్టుకొని సమర్పించాలి. దాంతోపాటు మీరు మీరేనని ధ్రువీకరించే పత్రాన్ని కూడా సమర్పించాలి.2002 జాబితాలో పేరు లేక మ్యాపింగ్ కాని ఓటర్లతోపాటు అప్పటి జాబితాతో పోల్చితే స్వల్ప తేడాలు, స్పెల్లింగ్ తప్పు లున్న మ్యాపింగ్ అయినవారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉన్నది. వారు ఈఆర్వో ముందు హాజరై తాము ఈ దేశ పౌరులమే, ఓటు హక్కుకు అర్హులమే అని నిరూపించుకోవ లసిన బాధ్యత వారిపైనే ఉన్నది. ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి తెలంగాణలో 30 శాతం, ఏపీలో 24 శాతం మంది ఓటర్లకు 2002 జాబితాలో మ్యాపింగ్ జరగలేదు. అధికార యంత్రాంగం కనుక కొన్ని సెక్షన్ల ఓటర్లను తొలగించాలనే లక్ష్యంతో పనిచేస్తే మ్యాపింగ్లో ఎదురయ్యే చిన్నచిన్న తప్పులను కూడా అవకాశంగా మలుచుకోవచ్చు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ విచక్షణాధికారాలన్నీ కేంద్రం నియమించిన ‘సూక్ష్మ పరిశీలకులకు’ సంక్రమించాయి.ఓటర్ల తొలగింపు కార్యక్రమంలో పలురకాల వింతలు చోటు చేసుకున్నాయి. కొద్దిపాటి చరిత్ర జ్ఞానమున్న వారికి సైతం మీర్ జాఫర్ పేరు తెలియకుండా ఉంటుందా? 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీకి సహకరించి సిరాజుద్దౌలా ఓటమికి కారణమైన వ్యక్తి. ఈ ఘటన దేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. అతని కుటుంబ వారసులు గత పది పదిహేను తరాలుగా ముర్షిదాబాద్లో నివసిస్తున్నారట! ఆ ఖాన్దాన్కు చెందిన 346 మంది ఓట్లు అనుమానితుల జాబితాలో చేరాయి. వారిప్పుడు తమ పౌర సత్వాన్ని నిరూపించుకోవడమనే అగ్ని పరీక్షను ఎదుర్కోవలసి ఉన్నది. విదేశాంగ శాఖ కార్యదర్శిగా, కామన్వెల్త్ నేషన్స్ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా పనిచేసిన కృష్ణన్ శ్రీనివాసన్ పేరు 2002 జాబితాలో ఎందుకు లేదని నోటీసులిచ్చారట! ఉద్యోగ బాధ్యతలో చిరకాలం విదేశాల్లో ఉన్న వ్యక్తిని ఈ ప్రశ్న అడగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వ్యవస్థకు ఇంగితజ్ఞానం కూడా లేదని నిరూపించే ఇటువంటి విశేషాలు పెద్దఎత్తున వెల్లడవుతున్నాయి.సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి దేశం మొత్తానికి ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలా? లేదంటే జాతీయ స్థాయితోపాటు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిషన్లు ఉండాలా అనే అంశంపై కూడా రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఉద్యోగం, ఉపాధి అవకాశా లను వెతుక్కుంటూ పెద్దసంఖ్యలో ప్రజలు శాశ్వత వలసలకు వెళ్లే అవకాశాలున్నందువలన రాష్ట్రాల కమిషన్లు ఈ వలస ప్రజల పట్ల వివక్ష చూపవచ్చన్న అనుమానంతో దేశమంతటికీ ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలని రాజ్యాంగ సభ నిర్ణయించింది. సార్వత్రిక ఓటు హక్కుకు ఏరకమైన అవరోధాలు రాకూడదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ సభ ఆశ యానికీ, ఓటర్ల తగ్గింపే పరమావధిగా పెట్టుకున్న ప్రస్తుత ఎన్ని కల సంఘం వ్యవహార శైలికీ మధ్యన హస్తి మశకాంతరం ఎందుకేర్పడిందో చెప్పవలసిన బాధ్యత ఆ సంఘంపైనే ఉన్నది.ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు సమర్థించి ఉండవచ్చు. చట్టం పరిధిని మీరినట్టు స్పష్టంగా కనిపి స్తున్న ఎన్నికల సంఘం వ్యవహారం రాజ్యాంగబద్ధమేనని సర్వో న్నత న్యాయస్థానం అభిప్రాయపడి ఉండవచ్చు. ఆధిపత్య శక్తుల ప్రభావం వలన రాజ్యాంగ వ్యవస్థల నడుమ మంచి సమ న్వయం సమకూరి ఉండవచ్చు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు లేకుండా జాబితాలను శుద్ధి చేయడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతున్న మాటలు మంచివే కావచ్చు. కానీ ఓటర్ల తొలగింపే ధ్యేయమన్నట్టు సాగుతున్న ఈసీ సంక్లిష్ట కార్యక్ర మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సంక్లిష్టత కారణంగా ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉన్నవారిలో పేదవర్గాలు, నిరక్షరాస్యులు, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉండే పరిస్థితిని ఎలా అడ్డుకోగలుగుతాము? ఇప్పటికే బెంగాల్, బిహార్లలోని బీజేపీ ప్రభుత్వాలు కొత్త ఓటర్ల జాబితాలను సంక్షేమ పథకా లకు లింక్ చేశాయి. తొలగించిన ఓటర్లందరూ లబ్ధిదారుల జాబితా నుంచి కోతకు గురికాబోతున్నారు.ఈమాత్రం హింట్ చాలదా ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ చెలరేగిపోవడానికి! ఇటువంటి సావకాశం లేకుండానే అది వీలైనంతవరకు ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టింది. అమలు చేస్తున్న పథకాల్లో కూడా లబ్ధిదారుల సంఖ్యలకు కత్తెర వేస్తున్నది. సర్ రూపంలో మరో అవకాశం తరుముకొస్తుంటే ఒడిసిపట్టకుండా ఊరుకుంటుందా? టీడీపీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను క్రియాశీలకంగా రంగంలోకి దింపింది. ఎన్ని కల సంఘం తరఫున పనిచేసే బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ)తో టీడీపీ ఏజెంట్లను పూర్తిస్థాయిలో ‘మ్యాపింగ్’ చేసి నట్టు వార్తలు వస్తున్నాయి. బీఎల్ఓల దగ్గర మాత్రమే ఉండా ల్సిన సమాచారం కూడా టీడీపీ ఏజెంట్లకు అందుబాటులోకి వస్తున్నది. టీడీపీ బీఎల్ఏలు తమ పరిమితికి మించి ఎన్యూమ రేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని సమాచారం. కొందరు బీఎల్ఓలు అన్ని పార్టీల ఏజెంట్లకూ ఇవ్వాల్సిన హౌస్ విజిట్ సమాచారాన్ని కూటమి ఏజెంట్లకు మాత్రమే చేరవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం బీఎల్ఏల గ్రూప్ కాల్స్లో అధికారులు మాట్లాడుతూ మార్గ నిర్దేశనం చేస్తున్న వ్యవహారాలు కూడా అక్కడక్కడా బయటపడుతున్నాయి. ఇటువంటి ధోరణులకు చెక్ పెట్టే విధానంగానీ, యంత్రాంగంగానీ ఎన్నికల సంఘం దగ్గర లేదు. అసలు ఎన్నికల సంఘం నిష్పాక్షికత పైనే ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. పాస్పోర్టు కూడా పౌరసత్వానికి రుజువు కాదని తాజాగా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ప్రకటించారు. భారతీయ పౌరులు కానివారికి పాస్పోర్టు జారీ చేయరాదని పాస్పోర్టు చట్టం స్పష్టంగా చెబుతున్నది. చట్టం చెప్పినదానికీ, అధికారి వివరణకూ మధ్యన ఉన్న వైరుధ్యాన్ని ఎవరు పరిష్కరించాలి? ఆధార్, ఓటర్ ఐడీ, పాన్కార్డు ఏదీ కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే న్యాయస్థానాలు, ప్రభుత్వ శాఖలు స్పష్టం చేశాయి. మరి ఓటరు జాబితాలో నమోదుకు అనర్హు లుగా మిగులుతున్న కోట్లాదిమంది పరిస్థితి ఏం కానున్నది? వారి సమస్యను పరిష్కరించడానికి ఎంతకాలం పడుతుంది? పుట్టి పెరిగిన దేశంలో పౌరసత్వం లేదని నిబంధనలు వెక్కిరి స్తుంటే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆ ప్రజలు ఎలా అనుభవించగలరు? సంక్షేమ పథకాల నుంచి తొలగిస్తుంటే బడుగు వర్గాల ప్రజలు సంతృప్తిగా ఎలా జీవించగలరు? ‘స్వాతంత్య్రాత్ సుఖమాప్నోతి/ స్వాతంత్య్రాల్లభతే పరమ్!’ అంటూ ప్రధాని చెప్పిన శ్లోకం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి కౌంటర్గా మాత్రమే పనికొస్తుందా? సర్ ఎమర్జెన్సీ మీద సెటైర్గా పనికిరాదా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అందుకే విష ప్రచారం చేస్తున్నారు: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘సర్’ ప్రక్రియ ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చే కీలక కార్యక్రమం అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా చాలాసార్లు జరిగిందని.. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా నిర్వహించే సాధారణ చట్టబద్ధమైన ప్రక్రియగా కిషన్రెడ్డి పేర్కొన్నారు.‘‘అర్హులైన వారికి ఓటు కల్పించాలి.. కానీ దీనిపై కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు. ‘సర్’పై సుప్రీంకోర్టు కూడా దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి. భారత పౌరుల విలువ పెంచే ప్రక్రియ ‘సర్’. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును భద్రపరచుకోవాలి.. స్వచ్ఛందంగా పాల్గొనాలి. బోగస్ ఓట్లు ఉండకూడదు. ‘‘సర్’ వచ్చాక ఓటు పర్సంటేజ్ పెరగడం అందరం చూశాం. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా బీహార్, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఓటు శాతం పెరగడానికి కారణం ‘సర్’ అని కిషన్రెడ్డి చెప్పారు.‘‘ప్రజాస్వామ్యానికి భారత దేశం తల్లి లాంటిది.. మదర్ ఆఫ్ డెమోక్రసీ అని ప్రధాని మోదీ చెబుతుంటారు. ఎన్నికల కమిషన్ ఎవరి కనుసన్నల్లో పనిచేసే సంస్థ కాదు. కాంగ్రెస్ దీనిపై లేనిపోని అపోహలు సృష్టిస్తోంది. ఎన్నికల కమిషన్పై బురద చల్లాలని చూస్తున్నారు. ఆటం బాంబులు వేస్తా.. ప్రళయం సృష్టిస్తా అని చెప్పి వారి పరువు వారే తీసుకుంటున్నారు. ‘సర్’ వల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు గుండెలు బాదుకుంటున్నాయి?. ఓటర్లను అవగాహన, చైతన్యం కల్పించాల్సిన పార్టీలు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాయి’’ అంటూ కిషన్రెడ్డి ప్రశ్నించారు.‘‘బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు.. రేషన్ కార్డులు పొందారు. ఆధార్ కార్డులు పొందారు. లోన్లు కూడా తీసుకున్నారు. వీటిపై ఎందుకు ఈ పార్టీలు మాట్లాడటం లేదు. ‘సర్’ను మతంతో ముడిపెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సీఎం చేస్తున్నారు. హైదరాబాద్లోని చాలా బస్తీల్లో రోహింగ్యాలు ఉన్నది వాస్తవం కాదా?. ఎవరు గుండెలు బాదుకున్నా? ఈ ప్రక్రియను ఎవరూ అడ్డుకోలేరు. కానీ రేవంత్ మాత్రం లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ‘సర్’ చేసేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా. కాంగ్రెస్కు ప్రభుత్వ ఉద్యోగులపై విశ్వాసం లేదు. అందుకే అబద్ధపు, విష ప్రచారం చేస్తున్నారు.. రెచ్చగొడుతున్నారు..కాంగ్రెస్ నేతలు బీఎల్ఓలను బెదిరిస్తున్నారు. మజ్లిస్ కూడా ఎవరి ఇళ్లకు వెళ్లొద్దు.. మా వద్దకు వస్తే మేము చెప్పిన డేటా తీసుకోవాలని బెదిరిస్తున్నారు. మజ్లిస్ కనుసైగల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తోంది. ఉద్యోగులు బెదరవద్దు.. మేము అండగా ఉంటాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ దిగజారి వ్యవహరిస్తున్నాయి. పౌరసత్వంతో కూడా ఓటు హక్కుకు ముడిపెట్టారు. ఓటు ఎక్కడున్నా సరే.. దానికి సంక్షేమ పథకాలకు సంబంధం లేదు. అలాగే పౌరసత్వంతో కూడా ‘సర్’కు సంబంధం లేదు. ఇవే మాటలు కేరళలో ఎందుకు మాట్లాడటం లేదు...బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ కబంధ హస్తాలోనే ఈ ప్రక్రియ జరిగింది. దీనిపై అక్కడ ఎందుకు మాట్లాడలేదు. ఇవన్నీ నిరాధారమైన విమర్శలు మాత్రమే. ప్రజల్లో ఆందోళన రేకెత్తించి ప్రయోజనం పొందాలని కొందరు చూస్తున్నారు. ఓటర్ లిస్టును చెక్ చేసి ఎక్కడ నివాసముంటే అక్కడకు ఓటు హక్కు పొందేలా చూడాలి. అలాగే తప్పుల సవరణ కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కంటోన్మెంట్లో ‘సర్’కు వెళ్ళిన బీఎల్ఓలతో ఇందిరమ్మ చీరలు అందించాలని కాంగ్రెస్ నీచంగా వ్యవహరించింది. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫోటోతో సహా ఫిర్యాదు చేశాం. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి‘సర్’కు వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ఎవరైనా బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని అడిగారా?. అదే నిజమైతే కేసీఆర్, కేటీఆర్, అసదుద్దీన్ ఇంటికి కూడా సిబ్బంది వెళతారు.. వారు కూడా సభ్యత్వం తీసుకుంటారా మరి?. అసదుద్దీన్ బారిస్టర్లో రాజ్యాంగం గురించి సరిగ్గా చదవలేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎలా అబద్ధాలు మాట్లాడాలో నేర్చుకున్నాడు. పాత బస్తీలో దొంగ ఓట్లు ఉన్నాయి.. నగరంలో కూడా చాలా ఉన్నాయి.. అవి తొలగిస్తే వారి పప్పులు ఉడకవని భయంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో ఉండే ఇతర రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు.. ఇక్కడే ఓటు హక్కు తీసుకోవాలి’’ అని కిషన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
‘బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణ’
హైదరాబాద్: బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణలో విజయ ఢంకా మోగించడమేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచే తెలంగాణలో విజయానికి నాంది పలుకుతామన్నారాయన. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి బీజేపీ సత్తా చూపెడతామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు కలిసినా బీజేపీని ఓడించలేవన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు(ఆదివారం) హైదరాబాద్కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వస్తున్నారని రాంచందర్ రావు తెలిపారు.తెలంగాణ వైపు బీజేపీ జాతీయ నాయకత్వం చూస్తుందివరంగల్ : తెలంగాణ వైపు బీజేపీ జాతీయ నాయకత్వం చూస్తుందన్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్,. పశ్చిమ బెంగాల్లో గెలిచి మొదటి మాసంలో చెప్పిన మాటలను నిలబెట్టుకున్నామన్నారు. 29వ తేదీన నితిన్ నబీన్ వరంగల్లో పర్యటించనున్నారని, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బూత్ లెవెల్ కార్యకర్తల సదస్సులో నితిన్ నబీన్ పాల్గొంటారని లక్ష్మణ్ తెలిపారు. జాతీయ అధ్యక్షుడి పర్యటనలో అన్ని వర్గాలను కలుస్తారని, గిరిజన నాయకులతో సమావేశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆస్తులను వేలం వేసి దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీజేపీని కాదని కాంగ్రెస్ని గెలిపిస్తే.. పెనం మీద నుండి పొయ్యిలో పడ్టడ్లు అయ్యిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను పారిశ్రామిక అభివృద్ధి, ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. -
నాకు చెప్పడానికి నువ్వెవడివి.. చంద్రగిరి నీ జాగీరా...
-
యూపీ బీజేపీ కార్యవర్గం ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరిగే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ తన కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి కీలకంగా ఉన్న ‘పీడీఏ’(వెనుకబడిన, దళిత, మైనారిటీ) అస్త్రాన్ని దీటుగా ఎదుర్కొనే మిషన్– 2027 వ్యూహాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి 64 మంది సభ్యుల జంబో కమిటీ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ కమిటీలో 19 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 19 మంది కార్యదర్శులు, ఆరుగురు ప్రాంతీయ అధ్యక్షులు ఉన్నారు. కుల సమీకరణాలకే ప్రాధాన్యం యూపీలో అధికారం నిలబెట్టుకోవాలంటే నాన్–యాదవ్ ఓబీసీలు అత్యంత కీలకం. అందుకే, యూపీ బీజేపీ తన కార్యవర్గంలో ఏకంగా ఓబీసీ నేతలకు 20కి పైగా కీలక పదవులను కట్టబెట్టింది. గత కమిటీలో ఓబీసీ నేతలు 18 మంది మాత్రమే కాగా, ఈసారి వారి ప్రాతినిథ్యాన్ని మరింతగా పెంచింది. రాజ్భర్, బింద్, గుర్జర్, సైని తదితర వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. పార్టీలోని ఆరుగురు ప్రాంతీయ అధ్యక్షుల్లో నలుగురు (నవాబ్ సింగ్ నగర్–పశ్చిమ యూపీ, పూరన్ లాల్ లో«దీ–బ్రిజ్, రామ్ కిషోర్ సాహు–కాన్పూర్, అశోక్ చౌరాసియా–కాశీ) ఓబీసీ వర్గానికే చెందిన వారు కావడం విశేషం. మిగిలిన రెండు ప్రాంతాలకు బ్రాహ్మణ, భూమిహార్ వర్గాలకు చెందిన అవధేష్ ద్వివేది (అవ«ద్), వినోద్ రాయ్ (గోరఖ్పూర్) లను ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శుల్లో ఎనిమిది మందిగాను ముగ్గురు ఓబీసీ వర్గానికి చెందినవారే. -
రాహుల్పై బీజేపీ ‘మీమ్స్’ వార్.. కాంగ్రెస్ కౌంటర్
ఢిల్లీ: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ మరో డిజిటల్ వార్ మొదలుపెట్టింది. రాహుల్ విదేశీ పర్యటనలపై మీమ్స్తో పోస్టులు పెడుతూ.. విమర్శలు గుప్పిస్తోంది. రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఆయన తరచూ చేసే విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి వస్తోందంటూ నిలదీసింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తూ.. రాహుల్ గాంధీ గ్లోబల్ లీడర్ అని.. అనేక దేశాలు, సంస్థలు ఆయనను ఆహ్వానిస్తుంటాయంటూ పేర్కొంది.ప్రముఖ సినిమా టైటిళ్ల ఆధారంగా రూపొందించిన 'ఛడ్ దే ఇండియా' (ఇండియాను వదిలేయ్), 'లాపతా రాహుల్' (కనిపించకుండా పోయిన రాహుల్) పోస్టర్లతో బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గో రాహుల్ గాన్, టూరిస్ట్ జిందా హై, పరదేశ్ వంటి మరికొన్ని పోస్టర్లు కూడా వైరల్గా మారాయి. రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆయనను కలవాలని అనుకుంటున్నారని స్పష్టం చేసింది. ఆయన చాలా తక్కువ సమయం మాత్రమే కేటాయించగలరు కాబట్టి, ఆయన పర్యటనలు చిన్నవిగా, తరచుగా ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు."రాహుల్ గాంధీ కేవలం మన దేశానికి మాత్రమే నాయకుడు కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆయనను ఒక గొప్ప నాయకుడిగా భావిస్తారు. చాలా మంది ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వరుస ఆహ్వానాల కారణంగా ఆయన కేవలం రెండు రోజులు, నాలుగు, ఐదు రోజులు మాత్రమే సమయం కేటాయించి ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీతో ఏకీభవించరని గ్రహించాలి. ప్రజలు భారతదేశాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు, ఆ కోణంలోనే వారు రాహుల్ గాంధీని కూడా చూస్తారు" అని ఖుర్షీద్ పేర్కొన్నారు.విదేశీ పర్యటనలు చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చిన వెంటనే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా విదేశాలకు వెళ్లారని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్తే తప్పేంటి? విదేశాలకు వెళ్లవద్దన్నా ప్రధాని.. ఆ తర్వాత తనే స్వయంగా విదేశీ పర్యటనకు వెళ్తారు. రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడంటూ ఆయన సమర్థించారు. -
కాంగ్రెస్ వస్తే.. బీజేపీ నేతలు సెక్యూరిటీతో తిరగాలి
న్యూఢిల్లీ: సీనియర్ నేత, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా చేసిన తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేంద్రంలో అధికార మార్పు జరిగితే.. రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. గత 12-15 ఏళ్ల పరిణామాలను ప్రజలు మరచిపోలేదని పేర్కొంటూ.. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ నాయకులు ప్రజల్లోకి భద్రత లేకుండా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుండగా, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి.గురువారం కాంగ్రెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ ఖేరా.. గత దశాబ్ద కాలంగా దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. అధికార దుర్వినియోగం, దర్యాప్తు సంస్థల వినియోగం, ప్రతిపక్షాలపై రాజకీయ ఒత్తిళ్లు వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ నేతలు భద్రత లేకుండా రోడ్లపై తిరగలేని పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్ హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.A very strong statement by Congress MP @Pawankhera ji to BJP, “Let our government come to power. When we recount these 12–15 years, BJP leaders will not be able to step out on the streets without security. I am telling you this, they will even need protection to come out in… pic.twitter.com/YrpIHF96Ch— Harmeet Kaur K 🇮🇳 (@iamharmeetK) June 25, 2026మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం పవన్ ఖేరా వ్యాఖ్యలను వేరే కోణంలో చూడాలని అంటున్నాయి. గత కొన్నేళ్లుగా రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థల వినియోగం, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రజల్లో పెరిగిన అసంతృప్తి వంటి అంశాల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వివరిస్తున్నాయి.అయితే పవన్ ఖేరా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వాటిని రాజకీయ వ్యాఖ్యలుగానే అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశం జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. -
బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం.. ఇక వాళ్లందరూ..
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలు బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు యూసీసీ అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.“యూసీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే అది చట్టంగా మారొచ్చు. ఇది ఒక మైలురాయి అవుతుంది. ఒకే దేశం, ఒకే చట్టం అనే మా పార్టీ విధానానికి ఇది అనుగుణంగా ఉంది” అని బీజేపీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే జాతీయ మీడియాకు తెలిపారు. గురువారం రాత్రి రాష్ట్ర అసెంబ్లీలో వ్యాపార సలహా సమావేశం జరిగింది. యూసీసీ సహా పలు బిల్లులు ప్రవేశపెట్టడంపై చర్చ జరిగిందని జాతీయ మీడియా పేర్కొంది. “సోమవారం ఈ బిల్లును సభలో ఉంచే అవకాశం ఉంది” అని తెలిపింది.ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అనేది మత ఆధారిత వ్యక్తిగత చట్టాలకు బదులుగా పౌరులందరికీ వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత అంశాల్లో ఒకే విధమైన లౌకిక చట్టాలను అమలు చేసే ప్రతిపాదిత వ్యవస్థ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఆధారంగా రూపొందిన ఈ ప్రతిపాదన, లింగ న్యాయం, జాతీయ సమైక్యతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉంది. చరిత్రాత్మకంగా హిందూ వివాహ చట్టం, ముస్లిం వ్యక్తిగత చట్టం వంటి చట్టాలు వ్యక్తిగత వ్యవహారాలను నియంత్రిస్తున్నాయి.ఉత్తరాఖండ్లో బీజేపీ ఇప్పటికే యూసీసీ అమలు చేసింది. గుజరాత్లో కూడా ఈ చట్టాన్ని ఆమోదించింది. అస్సాం యూసీసీ అమలు చేసిన మూడో బీజేపీ పాలిత రాష్ట్రంగా నిలిచింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్పై కఠిన చట్టాలు తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చింది.రాష్ట్ర “సామాజిక సమగ్రత, భౌగోళిక సమగ్రత”ను రక్షించడమే తమ లక్ష్యమని కూడా పేర్కొంది. అఖిల భారత ముస్లిం వ్యక్తిగత చట్ట మండలి సభ్యుడు ఉజ్మా ఆలం మాట్లాడుతూ.. యూసీసీ అమలు మైనారిటీల హక్కులకు భంగం కలిగిస్తుందని అన్నారు. “ఇది మా హక్కుల ఉల్లంఘన. మాపై ఏదీ బలవంతంగా రుద్దకూడదు. పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం దీనిని అర్థం చేసుకోవాలి” అని ఆయన చెప్పారు. -
కోలుకోలేని షాక్.. మమతా కోటలో మహువా చిచ్చు..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోగా, తాజాగా ఆ పార్టీ ఫైర్బ్రాండ్, లోక్సభ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కార్చిచ్చు రేపాయి.బీజేపీ అగ్రనేత,పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై ఆమె అసాధారణ రీతిలో ప్రశంసలు కురిపించడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మహువా మొయిత్రా మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి, సువేందు అధికారితో తనకున్న వ్యక్తిగత, భావోద్వేగ అనుబంధాన్ని బహిరంగంగా పంచుకున్నారు.2014 పార్లమెంట్ ఎన్నికల్లో నాకు లోక్సభ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. ఆ రాత్రంతా ఏడ్చాను. ఆ క్లిష్ట సమయంలో సువేందు అధికారి నన్ను ఓదార్చి, ధైర్యం చెప్పారు. 2016 కరీంపూర్ శాసనసభ ఎన్నికల్లో తన గెలుపు కోసం సువేందు ఎంతో కృషి చేశారని, తన తరఫున మొదటి రాజకీయ ప్రచార ర్యాలీని ఆయనే నిర్వహించారు. ప్రస్తుతం ఇద్దరి రాజకీయ మార్గాలు వేరైనప్పటికీ.. ఆయనతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ను నేనెప్పటికీ మర్చిపోలేనని ఆమె స్పష్టం చేశారు.పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత విధేయురాలిగా, కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరంతరం విరుచుకుపడే నేతగా మహువా మొయిత్రాకు గుర్తింపు ఉంది. అలాంటి ఫైర్బ్రాండ్ లీడర్, ఇప్పుడు తృణమూల్ పార్టీ ప్రధాన శత్రువుగా భావించే సువేందు అధికారిని ప్రశంసించడంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె కూడా టీఎంసీని వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందన్నచర్చ మొదలైంది. ఎన్నికల పరాజయం తర్వాత టీఎంసీ ఇప్పటికే బలహీనపడుతుండగా, మహువా మొయిత్రా కూడా త్వరలోనే పార్టీ మారే యోచనలో ఉన్నారా అనే చర్చకు ఈ ఇంటర్వ్యూ తెరలేపింది. -
‘బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని.. కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఇందులో కొంతమంది పెద్దల పేర్లు వినపడుతున్నాయి.. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘పీసీసీ చీఫ్కు ఎసరు పెడుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. రైతుబంధుకు వీళ్ళు ఇచ్చిన నిధుల కంటే ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది. వారం రోజులు తిట్టుకుని ఇప్పుడు డ్యూయెట్లు పాడుతున్నారు. బీఆర్ఎస్ రాదనే కాంగ్రెస్ వాళ్లు.. కేటీఆర్ పర్యటనలకు ఎందుకు భయపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం పీఏగా పని చేస్తున్నారా...?. తెలంగాణ హైబ్రిడ్ సీఎం మోదీ జట్టు అని ఖాయమైంది. రైతులకు 30 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది. భట్టి శాఖలో జరుగుతున్న వెయ్యి కోట్ల అవినీతిపై విచారణ జరపాలి..జాతీయ బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసి భయపెడుతున్నారు. చంద్రబాబు,మోదీ ఆలోచనలతో పుట్టిన క్రాస్ బ్రీడ్ హైబ్రీడ్ సీఎం రాష్ట్రంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తే కేంద్ర మంత్రి ఇతర కేంద్ర మంత్రులను కలిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కాదు.. దేశంలో ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. వాళ్ళ శరీరం నిర్మాణం అయ్యింది తెలంగాణ తిండితో.. బీజేపీ, రేవంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి అందుతున్న నాటకాలు. అందరూ కలిసి మ్యాచ్ ఫిక్స్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. -
నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్.. ఏం జరుగుతోంది?
దేశ రాజకీయాల్లో మరోసారి ఫిరాయింపుల రాజకీయాలు వేగం పుంజుకున్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు అనర్హత నుంచి తప్పించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార బలం పెంచుకోవడానికి జరుగుతున్న ఈ రాజకీయ వ్యూహాలు ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తరచూ జరిగే పార్టీ మార్పులు రాజకీయ పార్టీలపైనే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో పెరుగుతున్న ఫిరాయింపులు, వాటి వెనుక ఉన్న కారణాలు, చట్టపరమైన అంశాలు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి.దేశ రాజకీయాల్లో మరోసారి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం క్షీణిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేనలో అధికారికంగా చేరారు. 2022లో శివసేనను చీల్చి, భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిండే.. ఇప్పుడు మరోసారి ఫిరాయింపులను ప్రోత్సహించారు. "ఆపరేషన్ టైగర్" పేరుతో సాగిన ఈ ప్రక్రియలో ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు చెల్లిస్తున్నారని, అందులో రూ.15 కోట్లు ముందుగానే ఇచ్చారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఆరోపణలు చేస్తోంది.పార్టీ ఎంపీల్లో మూడింట రెండొంతుల మంది మారుతుండడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత తప్పించుకుంటారని విశ్లేషకులు వాదిస్తున్నారు. అయితే, ఎంపీల బృందం మరో పార్టీలో చేరాలంటే, ముందు వారి అసలు పార్టీ కూడా అదే తరహా విలీనాన్ని అధికారికంగా ఆమోదించాలనే నిబంధన ఉందన్న వాదన కూడా ఉంది.వరసగా ఫిరాయింపులుఈ ఫిరాయింపులకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా పార్టీ మార్పులు జరిగాయి. ఏప్రిల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు భారతీయ జనతా పార్టీలో చేరారు. మేలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, లోక్సభలో ఆ పార్టీకి చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది త్రిపుర కేంద్రంగా ఉన్న, పెద్దగా గుర్తింపు లేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు.వ్యంగ్యంగా చెప్పాలంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా లేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుల్లో కొందరికి ఈ ప్రముఖ ఫిరాయింపు విషయం కూడా తెలియలేదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఫిరాయింపుల నుంచి సురక్షితంగా కనిపించడం లేదు. సమాజ్వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)లో కూడా ఇలాంటి పరిణామాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు పార్టీలకు లోక్సభలో వరుసగా 37 మంది, 8 మంది ఎంపీలు ఉన్నారు.ఈ రాజకీయ పరిణామాల వెనుక అతిపెద్ద లబ్ధిదారుగా బీజేపీ నిలుస్తోంది. పార్లమెంట్లో మద్దతు పెంచుకునే ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ రాజకీయ అవకాశవాదం, ఫిరాయింపులను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇప్పుడు అది ‘‘ప్రభావం కోల్పోయిన నిబంధన’’గా మారింది. -
NEET ఎగ్జామ్ మిస్.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీడియా ఎదుట వాపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆదివారం జరిగిన ఈ సంఘటన విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. నిన్న దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ రీ-టెస్ట్ రాసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. విద్యార్థులు 1.30 గంటలకు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. కానీ ట్రాఫిక్ పెరగడంతో తల్లిదండ్రులు బైక్లను ఫుట్పాత్లపై నడిపే పరిస్థితి వచ్చింది. చివరికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా చేరుకోవడంతో పరీక్షకు అనుమతి ఇవ్వలేదు. వారు గేటు ఎక్కి లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా, నిర్వాహకులు గేట్లను మూసివేశారు.అయితే తల్లిదండ్రులు కాంగ్రెస్ ర్యాలీని తప్పుబట్టారు. 7 కిలోమీటర్ల దూరం సాధారణంగా 20 నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ ర్యాలీ కారణంగా 35 నిమిషాలకుపైగా పట్టింది. పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీలు నగర బయట జరగాలి అని ఓ తండ్రి అసహంన వ్యక్తం చేశారు. మరొకరు రాహుల్ గాంధీ విద్యార్థుల కోసం కోటాకు వెళ్లారు. కానీ ఆయన పార్టీ ర్యాలీ వల్ల నలుగురు విద్యార్థులు పరీక్ష మిస్సయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.ఈ ఘటనపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ‘కాంగ్రెస్ అధికార దాహం కోసం ఎంత వరకు దిగజారుతుంది?’ అంటూ వీడియోను షేర్ చేశారు. దీనికి కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ‘కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత దశాబ్దంలో 89 పేపర్ లీకులు జరిగాయి’ అని ప్రతిస్పందించారు.కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ‘కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విన్నాను. వారికి కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ బీజేపీ పాలనలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి వారు క్షమాపణ చెప్పారా?’అని ప్రశ్నించారు. జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి ఈ ఘటనను ప్రభుత్వానికి అవమానకరమైన పరిణామంగా అభివర్ణించారు.Bengaluru, Karnataka: A parent of one of the students says, "Rahul Gandhi, D.K. Shivakumar, and even the Commissioner of Police, Bengaluru, do not seem to be concerned. Rahul Gandhi went to Kota for the cause of students, right? But because of his party's function today, four… https://t.co/1ixZBqPcRc pic.twitter.com/No3W5edKEb— IANS (@ians_india) June 21, 2026 -
డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లు
కోలకతా, సాక్షి: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బెంగాల్ ప్రజలను ఆకట్టుకునేదిశగా లక్ష ఉద్యోగాలు, ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్,ఉద్యోగులకు డీఏ పెంపు లాంటి అనేక జనాకర్షక తాయిలాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి స్వపన్ దాస్గుప్తా సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వపు మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర రుణ భారాన్ని తగ్గించడం, ఆదాయ వసూళ్లను పెంచడం, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలను ఆయన వివరించారు."వికసిత్ భారత్" విజన్కుఅనుగుణంగానే "వికసిత్ బంగ్లా"అభివృద్ధి ఎజెండా ఉంటుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. మునుపటి ప్రభుత్వం నుండి తమకు రూ. 8.15 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని, అయితే ప్రస్తుతమున్న అన్ని సామాజిక సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.బడ్జెట్లోని ముఖ్యాంశాలు:లక్ష ఉద్యోగాలు : ప్రభుత్వ రంగంలో లక్ష ఖాళీలను భర్తీ చేయనున్నామనే ప్రకటన ప్రధానంగా నిలిచింది. ఇందులో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించారు. పోలీస్ శాఖలో 20వేల పోస్టులు, విద్యాశాఖలో 50,000 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిలో ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల సడలింపును మరో రెండేళ్లపాటు పొడిగించారు.ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యాన్ని (DA) అక్టోబర్ నుండి 20శాతం పెంచనున్నారు.ప్రభుత్వ మరియు ప్రభుత్వ సాయం పొందే పాఠశాలల్లో చదువుకునే బాలికలకు రూ. 50,000 స్కాలర్షిప్ అందజేస్తారు.అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఇపుడిక బెంగాల్ కూడా చేరిపోయింది. ఇందు కోసం రూ. 550 కోట్లు కేటాయించారు. దీని కోసం త్వరలోనే 'పింక్ కార్డ్' (Pink Card) పథకాన్ని ప్రారంభించనున్నారు.అన్నపూర్ణ యోజన పథకం కోసం రూ. 36,000 కోట్లు కేటాయించారు.పీఎం ఆవాస్ యోజన కింద బెంగాల్లో మరో 25 లక్షల మందికి పీఎం ఆవాస్ ఇళ్లను నిర్మించి ఇస్తారు.ఉపాధి హామీ పథకం (MGNREGA) పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచారు.వలస కార్మికులకు ఆయుష్మాన్ భారత్: వలస కూలీల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేస్తారు. గిగ్ కార్మికుల (Gig workers) కోసం సంక్షేమ బోర్డును ప్రతిపాదించారు.కోల్కతా సమీపంలో సరికొత్త 'గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం' (Greenfield airport) ఏర్పాటు కానుంది.ఎమ్మెల్యే నిధుల పెంపు: ఎమ్మెల్యే అభివృద్ధి నిధులను రూ. 70 లక్షల నుండి రూ. 1 కోటికి పెంచారు.AI మిషన్ ప్రారంభం, భూమి రికార్డుల డిజిటలైజేషన్, మైనింగ్ కార్యకలాపాల కోసం కేంద్రీకృత వేలం విధానంసివిక్ వాలంటీర్ల సంఖ్యలో 2000 పెంపు, గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు, కండక్టర్లకు వేతనం పెంపు రిటైర్డ్ జర్నలిస్టులకు రూ. 5,000 నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. దీంతోపాటు రాజకీయ కారణాలతో జైలులో ఉన్న వారికి నెలకు రూ.10,000 అందించనున్నారు. సాంప్రదాయ బెంగాలీ చాపలు , జనపనారతో తయారు చేసిన ఫైల్లో ఈ బడ్జెట్ను తీసుకురావడం మరో విశేషం. ఇదీ చదవండి: అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం -
టూవీలర్లకు ‘ఎల్నినో’ బ్రేక్ ..!
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై 2027) లో 3–5 శాతం పరిమిత హోల్సేల్ వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్స్ సంస్థ ‘ఇక్రా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఎల్నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడే సూచనలు, ద్రవ్యోల్బణంతో వాహనాల ధరలు పెరగడం, గత ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన అత్యధిక విక్రయాల ప్రభావం (హై బేస్ ఎఫెక్ట్) వంటి అంశాలు ఈ రంగానికి సవాళ్లుగా మారొచ్చని రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది. సానుకూలతలున్నా.. అంతర్జాతీయ సవాళ్లు పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగైన రిటైల్ విక్రయాల జోరు, నిలకడైన ఎగుమతుల మద్దతుతో ద్విచక్ర వాహన రంగం తన నిలకడైన ప్రదర్శనను చాటుకుంటోందని ఇక్రా పేర్కొంది. ‘జీఎస్టీ 2.0’ సంస్కరణలతో వాహనాలు అందుబాటు ధరల్లోకి రావడం, పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ధోరణి మార్కెట్ వృద్ధికి సానుకూలంగా మారనున్నాయి. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సప్లై చైన్ను దెబ్బతీసే అవకాశం ఉన్నందున, ఆ పరిణామాలను క్షుణ్ణంగా గమనించాల్సి ఉంటుందని తెలిపింది. మేలో విక్రయాల జోరు దేశీయ హోల్సేల్ విక్రయాలు 2026 మే నెలలో వార్షిక ప్రాతిపదికన 15.7 శాతం బలమైన వృద్ధితో 19 లక్షల యూనిట్లకు చేరాయని ఇక్రా నివేదిక తెలిపింది. జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాహన తయారీ కంపెనీలు ధరలు పెంచుతారనే ముందస్తు అంచనాలతో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఇందుకు కారణమైంది. ఇక రిటైల్ విక్రయాలు కూడా మే నెలలో ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పెళ్లిళ్ల సీజన్, ఎంట్రీ–లెవెల్ నుంచి ప్రీమియం శ్రేణి వరకు విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండటం మార్కెట్కు కలిసొచ్చింది. అయితే, దేశంలో నమోదైన విపరీతమైన ఎండల కారణంగా షోరూమ్లకు కస్టమర్ల రాక తగ్గడం, కొన్ని మోడళ్ల సరఫరాలో అంతరాయాలు వృద్ధి వేగాన్ని కొంతమేర నియంత్రించాయి. ఈ–టూ వీలర్స్ దూకుడు ఇక్రా నివేదికలో ఎలక్ట్రిక్ వాహన విభాగ ప్రదర్శన ఆకట్టుకుంది. 2026 మే నెలలో రిటైల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏకంగా 71.7 శాతం వార్షిక వృద్ధితో 1,72,148 యూనిట్లకు చేరాయి. మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఈవీల వాటా ప్రస్తుతం 8.9 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణకు, మారుతున్న పర్యావరణ వ్యవస్థకు ఇది నిదర్శనమని ఇక్రా స్పష్టం చేసింది. -
బెంగాల్కు పునర్వైభవం
తారకేశ్వర్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అరాచక పాలన సంకెళ్లను ఛేదించుకొని బీజేపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి దిశగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శనివారం బెంగాల్లో పర్యటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ఇక్కడ అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో ‘పశ్చిమ్బంగ దివస్’వేడుకలకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. బెంగాల్ గాలిలో ఇప్పుడు ఒక తాజాదనం కనిపిస్తోందని అన్నారు. బెంగాల్ వైభవం తిరిగి మొదలైనట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఒక కొత్త కాంతి దర్శనమిస్తోందని, గ్రామాల్లో ఆనందం, నమ్మకం అనే భావన వ్యక్తమవుతోందని చెప్పారు. ప్రజల ఒక్క ఓటు ఎలాంటి మార్పును తీసుకురాగలదో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు నిరూపించిందని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాల వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సూపర్ఫాస్ట్ స్పీడ్తో పని పనిచేస్తోందని మోదీ తేల్చిచెప్పారు. ఇప్పుడు మధ్యవర్తులు లేరు, అడ్డంకులు లేవు ‘‘రైల్వేలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్య పరిశ్రమ, అనుసంధాన రంగాల్లో పలు ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇవి బెంగాల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. బెంగాల్ తన నూతన భవిష్యత్తును నిర్మించుకుంటోంది. ఈ ప్రాజెక్టులు బెంగాల్ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయి, ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రాజకీయ వైరం కారణంగా ఇక్కడ ఏళ్ల తరబడి అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి, కొన్ని ఆలస్యమయ్యాయి. నేడు ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి, ప్రతి ప్రభుత్వ పథకం ప్రయోజనాలను నేరుగా ప్రజలకు చేరవేస్తున్నాం. ఇప్పుడు మధ్యవర్తులు లేరు, అడ్డంకులు లేవు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి గత ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. కంచె నిర్మాణానికి చర్యలు మొదలయ్యాయి’’ అని మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధికి గేటు వే తూర్పు భారత్ రాయ్రంగ్పూర్: కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తూర్పు భారతదేశం ఇప్పుడు అభివృద్ధికి ఒక ముఖద్వారంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన శనివారం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో పర్యటించారు. రాయ్రంగ్పూర్లో రూ.47,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి పథంలో ఒడిశా వేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తంచేశారు. తూర్పు భారతదేశ అభివృద్ధి ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ‘పూర్వోదయ’విధానంపై ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర వనరులను అవకాశాలుగా మారుస్తోందని చెప్పారు. ఇప్పటివరకు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ముర్ము అత్తగారి గ్రామానికి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని మయూర్భంజ్ జిల్లాలోని ఆమె అత్తగారి గ్రామమైన పహద్పూర్ను మోదీ సందర్శించారు. ఈ గ్రామాన్ని ‘సోలార్ విలేజ్’గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పహద్పూర్ ఒక ఆదర్శవంతమైన సౌరశక్తి ఆధారిత గ్రామంగా ఎదుగుతుందని చెప్పారు. రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ నేల నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఆమె ఎదిగిన తీరు ఒడిశాకు, దేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. సంతాలీ భాషకు ‘ఓల్ చికి’లిపిని సృష్టించిన పండిట్ రఘునాథ్ ముర్ముకు మోదీ నివాళులరి్పంచారు.కిసాన్ సమ్మాన్ నిధి విడుదల ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనలో పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత సొమ్మును విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లను నేరుగా బదిలీ చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అగ్రి స్టాక్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫారి్మంగ్, ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన వంటి పథకాలను మోదీ ప్రారంభించారు. -
ఒడిశా లెక్కలే ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడుతున్నాయా?
న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణలో తెలెత్తిన అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్షాలు ఆయన రాజీనామా చేయాలంటూ గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ, బీజేపీ మాత్రం ప్రధాన్కు అండగా నిలుస్తోంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, గట్టిగా వెనకేసుకొస్తుండటం వెనుక బలమైన రాజకీయ, ఎన్నికల వ్యూహాలు దాగి ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.బీజేపీ ట్రబుల్ షూటర్.. అమిత్ షా తర్వాత..ధర్మేంద్ర ప్రధాన్ కేవలం మంత్రి మాత్రమే కాదు, బీజేపీ అగ్రనాయకత్వంలో అత్యంత నమ్మకమైన ఎన్నికల వ్యూహకర్త. అమిత్ షా తర్వాత పార్టీలో సంక్లిష్టమైన ఎన్నికల వ్యవహారాలను చక్కదిద్దగల సమర్థుడిగా ఆయనకు పేరుంది. ఎలాంటి హడావుడి లేకుండా, తెరవెనుక ఉండి వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. విబేధాలను పరిష్కరించడం, రాష్ట్రాల నాయకత్వాలను సమన్వయం చేయడం, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ప్రధాన్ శైలి ప్రత్యేకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు పార్టీలో ఆయన స్థానాన్ని మరింత పటిష్ఠం చేశాయి.ఒడిశాలో చారిత్రాత్మక విజయం2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ఎదుగుదలకు మైలురాయిగా నిలిచింది. ఒడిశాకు చెందిన సీనియర్ నేతగా, అక్కడ దాదాపు 24 ఏళ్ల నవీన్ పట్నాయక్ సుదీర్ఘ పాలనకు ముగింపు పలకడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ అద్భుత విజయంతో ఒడిశాలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఇతర ప్రాంతాలకు పార్టీని ఎలా విస్తరించాలో ప్రధాన్ తన వ్యూహాలతో నిరూపించారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, దేశవ్యాప్త రాజకీయ నెట్వర్క్ ఆయనను పార్టీలో కీలక నేతగా మార్చాయి.హర్యానా, బిహార్లలో ఊహించని విజయాలురాజకీయంగా ఎంతో సవాలుతో కూడుకున్న రాష్ట్రాల్లో ధర్మేంద్ర ప్రధాన్ తన వ్యూహాలతో పార్టీని గెలిపించారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసినా.. ప్రధాన్ నేతృత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంలో క్షేత్రస్థాయి వ్యూహకర్తగా ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. సీట్ల సర్దుబాటు, కూటమి నిర్వహణను ఆయన సమర్థవంతంగా అదుపు చేశారు.యూపీ టర్నింగ్ పాయింట్.. నందిగ్రామ్ సంచలనంభారతదేశంలోనే అత్యంత సంక్లిష్టమైన 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ధర్మేంద్ర ప్రధాన్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. బూత్ స్థాయి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, 255కు పైగా స్థానాలతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేశారు. అంతకుముందు 2017 ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 57 స్థానాలు సాధించడంలో, 2014 జార్ఖండ్ గెలుపులో ఆయన పాత్ర ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నందిగ్రామ్’ నియోజకవర్గ బాధ్యతలను ప్రధాన్ తీసుకుని, మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించేలా వ్యూహాలు రచించడం బీజేపీ చరిత్రలో ఒక మైలురాయి.లీకుల వివాదం ఉన్నా.. నీట్ వివాదం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున విపక్షాల డిమాండ్ సమంజసమే అయినప్పటికీ, బీజేపీ మాత్రం ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకోవడం లేదు. రాజకీయ విశ్లేషకురాలు నీర్జా చౌదరి అభిప్రాయం ప్రకారం.. విపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడు ప్రధాన్తో రాజీనామా చేయిస్తే, అది ఒక సంప్రదాయంగా మారి భవిష్యత్తులో మరిన్ని రాజీనామాలకు విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉందని బీజేపీ భయపడుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో పవన్ బన్సల్, కామన్వెల్త్ గేమ్స్ వివాదాల సమయంలో ఇలాగే జరిగిందని పార్టీ గుర్తు చేసుకుంటోంది. ఒకవేళ ప్రధాన్ను మార్చాలనుకున్నా, విపక్షాల ఒత్తిడితో కాకుండా తర్వాత ఎప్పుడైనా క్యాబినెట్ విస్తరణలో భాగంగానే ఆ పని చేయవచ్చని ఆమె విశ్లేషించారు.జవాబుదారీతనంపై చర్చమరోవైపు నీట్, సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్-స్క్రీన్ మార్కింగ్ అవకతవకల నేపథ్యంలో విద్యాశాఖలో మంత్రుల జవాబుదారీతనంపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విశ్లేషకుడు నిఖిల్ జైన్ ప్రకారం.. పార్టీకి రాజకీయంగా, సంస్థాగతంగా అవసరమైన నాయకులను మంత్రులుగా నియమించడం సాధారణమే. అయితే, మంత్రిత్వ శాఖ పరిధిలో వివాదాలు వచ్చినప్పుడు మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రోజువారీ పరిపాలనను బ్యూరోక్రాట్లు (అధికారులు) చూసుకున్నప్పటికీ, విధానపరమైన నిర్ణయాలు, ప్రజలకు, పార్లమెంటుకు సమాధానం చెప్పే బాధ్యత మంత్రులదే. గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి, నితీష్ కుమార్ వంటి నేతలు రాజీనామా చేసిన ఉదాహరణలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: అమెరికా-ఇరాన్ యుద్ధం: ప్రపంచాన్ని కుదిపేసిన మహా నష్టం -
కర్ణాటకలో క్రాస్ ఓటింగ్.. కాంగ్రెస్ ఘన విజయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి 135 మంది సభ్యుల బలం ఉండగా ఏకంగా 151 ఓట్లను సాధించి, 5 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకోగా, జేడీఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీఎస్ (JD-S) పార్టీలకు చెందిన 12 మంది వరకు ఎమ్మెల్యేలు తమ పార్టీ ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్లు సమాచారం. ఆ పార్టీకి అసెంబ్లీలో 18మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే జేడీఎస్ అభ్యర్థికి 18ఓట్లు రావాలి. కానీ, జేడీఎస్ మొదటి ప్రాధాన్యతా ఓట్లు 14 మాత్రమే వచ్చాయి. అంటే, నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్లు సమాచారం. బీజేపీ కనీసం మూడు ఓట్లను కోల్పోగా కాంగ్రెస్కు అదనంగా వచ్చిన ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే గందరగోళం ఏర్పడింది. దీనిపై విచారణ సాగుతుంది.ఈ క్రాస్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ అఖండ విజయం సాధించగా, ప్రతిపక్ష శిబిరంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ, జేడీఎస్ కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడంపై ఆయా పార్టీల అగ్రనాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరిపి, బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని బిజెపి నేతలు ప్రకటించారు. కాగా సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇందులో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఈ గెలుపుపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
రేవంత్కు డబుల్ ట్రబుల్?
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ క్రీడలో పోటీ పడుతున్నాయి. రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ఫర్వాలేదు కాని, అవి నష్టం చేసేలా ఉంటే మాత్రం చాలా ప్రమాదకర క్రీడ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి అపాయం సంభవిస్తుందేమో అన్న అనుమానం వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కొత్త సంక్షోభంలోకి వెళుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంకట పరిస్థితిని సృష్టిస్తున్నదా? లేక ఆయన అనుభవరాహిత్యం కారణమా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు గాను ఆ కంపెనీకి సుమారు 1400 కోట్లు ముట్టచెప్పడానికి, 13600 కోట్ల రుణాన్ని భరించడానికి ఒప్పందం అయినట్లు కూడా వెల్లడించారు. అంతా సజావుగా జరిగితే ప్రభుత్వానికి కొంత భారం అయినా, రేవంత్ సర్కార్కు ప్రతిష్ట వచ్చేది. ప్రభుత్వం కోరినట్లు 13600 కోట్ల మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు భారత రైల్వే ఆర్థిక సంస్థ(ఐఆర్ఎఫ్సీ) అంగీకరించింది. దీంతో అంతా హాపీస్ అనుకుంటున్న వేళ ఆ సంస్థ వెనక్కి తగ్గడం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారింది. మెట్రో రెండోదశ నిర్మాణానికి సుమారు నలభై వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తూ డీపీఆర్ను కేంద్రానికి రాష్ట్రం పంపించింది. దీనికి కూడా ఆమోద ముద్ర పడలేదన్నది రేవంత్ ఆరోపణ.రుణం మంజూరు ఆగిపోవడం కాని, రెండో దశ నిలిచిపోవడానికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణమని, ఆయన వెనుక బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉన్నారని రేవంత్ ఆరోపించారు. దీనిని కిషన్ రెడ్డి తోసిపుచ్చినా, సహజంగానే కేంద్రంపైన సందేహాలు వస్తాయి. అందులోనూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడానికి వెనుకాడటం లేదన్న విమర్శ ఉంది. నిజంగానే రేవంత్ చెప్పినట్లు కేంద్రం కనుక మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ఇలాగే వ్యవహరించి ఉంటే వచ్చే ఎన్నికలలో బీజేపీకి చేటు అవుతుంది. అయితే రేవంత్వి తప్పుడు ఆరోపణలు అని బీజేపీ తిప్పికొడుతోంది. కాని నిర్దిష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు కనిపించలేదు.బీజేపీ రాజకీయం ఇలా ఉంటుందని రేవంత్ సర్కార్ ఆలోచించలేక పోయిందా? ఇక్కడే ఆయన అనుభవ రాహిత్యం కనిపిస్తోందా? సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటి గేమ్ ఆడుతూనే ఉంటాయి. అలాగే ప్రతిదానికి కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్రంలోని అధికార పార్టీ తనవంతు రాజకీయం తాను ఆడుతుంది. ఈ గేమ్ ప్రమాదకరంగా మారనంతవరకు ఫర్వాలేదు. కాని ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తు సంకటస్థితిలో పడుతోంది. ఆ ప్రాజెక్టుకు ఏడాదికి 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 30వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అది కరెక్టు అయితే ఎల్ అండ్ టీ ఎందుకు 15వేల కోట్లకే అంగీకరించిందన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. అంటే ఈ కంపెనీకి ఉన్న ఆస్తులపై రేవంత్ టీమ్ కన్నేసిందని ఆ నేతలు ఆరోపిస్తున్నారు.ఐఆర్టీసీ నుంచి తక్కువ వడ్డీకి రుణం వస్తుందని, అందువల్ల మెట్రోని లాభాల పట్టించవచ్చన్న ఆశ రాష్ట్రానికి ఉన్నా, ఇప్పుడు పరిస్థితి ఎదురు తిరిగింది. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వని వైభవ్, కిషన్ రెడ్డిలు కూడబలుక్కుని రుణం ఆపారా? లేక ఆదాయంలో రుణ వాయిదా చెల్లించాలన్న కండిషన్ కారణంతో రుణం ఆగిందా అన్నది చర్చగా ఉంది. ఆర్బీఐ కూడా ఈ రుణం మంజూరుకు ఓకే చేసిన తర్వాత కేంద్రం అడ్డు పడడం కుదురుతుందా? అలా ఆగిపోవడానికి కేంద్రం నుంచి లేఖ ఏదైనా వెళ్లిందా? లేక మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారా అన్నదానిపై ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ డీల్ పూర్తి అయితే కాంగ్రెస్కు, రేవంత్కు పేరు వస్తుందని, దానివల్ల బీజేపీకి ఏమి లాభమన్న ఆలోచన జరిగిందన్నది మరో ఆరోపణ. కాగా కేసీఆర్ టైమ్లో ప్లాన్ చేసిన రెండో దశను రేవంత్ రద్దు చేసి, జనం లేని ఫ్యూచర్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు ప్లాన్ చేయడం కూడా నష్టం చేసిందా అన్నది మరో పాయింట్గా ఉంది.ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీతో రేవంత్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారన్న భావన ఉంది. కొద్ది రోజుల క్రితం నీతి అయోగ్ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయనతో ముఖాముఖీ మాట్లాడారు. అప్పుడు ఈ మెట్రో గురించి చర్చించారా? లేదా? చర్చించినా ఈ ప్రాజెక్టుకు ఈ సమస్య ఎదురైందంటే ఏమని అర్థం అవుతుంది. రాజకీయాలలో వీటన్నిటిని ముందుగా ఊహించుకుని ఒక వ్యూహంతో వెళ్లాలి. లేకుంటే సహజంగానే ప్రజాస్వామ్య రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఉమ్మడి ఏపీలో కేంద్రం తమకు సహకరించడం లేదని, అనేక ప్రాజెక్టులను పెండింగులో పెడుతోందని టీడీపీ వ్యవస్థాపకుడు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీరామారావు విమర్శించేవారు. కేంద్రం ఒక మిధ్య అని కూడా సీరియస్ వ్యాఖ్య చేశారు. తెలంగాణకు ఆర్థికంగా రావల్సిన మొత్తాలు రావడం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయడం లేదని కిషన్ రెడ్డి తదితరులు వాదిస్తుంటారు.ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ద్వారా ఇబ్బంది పెట్టడానికి కొందరు బీజేపీ నేతలు ప్రయత్నించేవారు. జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ గతంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఒక తప్పుడు ఆరోపణతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్కు అప్పట్లో వినతిపత్రం అందచేశారు. తద్వారా విపక్ష టీడీపీకి మేలు చేయడానికి ఆమె యత్నించేవారు. అంతెందుకు! ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పలువురు ఐపీఎస్, ఐఏఎస్ లను కూటమి ప్రయోజనం కోసం బీజేపీ నేతలు పోస్టు చేయించుకున్నారు. అంతేకాక ఏకంగా ఏభై లక్షల మాయ ఓట్లు అదనంగా అర్ధరాత్రి వేళ పోల్ అవడం వెనుక ఎవరు ఉన్నది అర్థం చేసుకోలేరా? దీనిపై పరకాల ప్రభాకర్ ఎన్ని విమర్శలు చేసినా నోరు తెరవడం లేదంటేనే పరిస్థితి అర్ధం చేసకోవచ్చు.ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శించడం మొదలు పెడితే రాష్ట్రాలను చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంది. దీనికి తగినట్లు రాష్ట్రాలలోని విపక్ష ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటివెన్నో చేసిందన్నది సర్వవిధితమే. ఆమె తెలివి తక్కువగా సొంత పార్టీ నేతలను కూడా కష్టాల పాలు చేసి జైళ్లలో పెట్టి, చివరికి తన అధికారాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత అధికంగా ఇలాంటి రాజకీయాలు చేస్తోందన్న భావన ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ మెట్రో వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్లు వ్యవహరించి ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది.ఏడాదికి మహా అయితే 500 కోట్ల నష్టం రావచ్చు. దానిని భరించే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. అలాకాకుండా ఏదేదో చేయాలని భావించి ఊబిలో చిక్కుకున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరచి కొత్త ఆలోచన చేయకపోతే అది రాష్ట్రానికి నష్టం చేస్తుందని చెప్పవలసి ఉంటుంది. కాగా మరో అంశం కూడా చూడాలి. కాంగ్రెస్ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లో రాజ్యసభకు పోటీచేస్తే ఆమెపై ఏదో కేసు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలే బీజేపీవారికి ఉప్పందించినట్లు వచ్చిన సమాచారం ఆ పార్టీకి తీరని చేటు అవుతుంది. దీని వెనుక రేవంత్ హస్తం ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ విషయంలో రేవంత్.. బీజేపీపై ఘాటైన విమర్శలే చేశారు. ఓట్ చోరీతో పాటు సీట్ చోరికి బీజేపీ పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా ఓటుకు నోటు కేసులో ఉన్నది రేవంతేనని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నది నిజమే. మొత్తం మీద ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కాంగ్రెస్లో అంతా సజావుగా లేదన్న సంగతి అర్థం అవుతుంది. అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీపరంగా డిఫెన్స్లో పడితే అది కాంగ్రెస్తో పాటు రేవంత్ భవిష్యత్తు రాజకీయానికి ఇక్కట్లు తేవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇసుక మైనింగ్ : బీజేపీ నేత కారుకు నిప్పు, ముగ్గురు సజీవ దహనం
ఛత్తీస్గఢ్లోని కోరియా (Koriya) జిల్లాలో ఇసుక మైనింగ్ వివాదం అత్యంత ఘోరమైన నరమేధానికి దారితీసింది. ఒక ఫార్చ్యూనర్ (Fortuner) కార్ను ట్రక్కుల మధ్య లాక్ చేసి, దానిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో బీజేపీ నేత, నాయకుడు, మాజీ జన్పద్ పంచాయతీ అధ్యక్షుడు భరత్ సింగ్ (లల్లా సింగ్) సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు.ఏం జరిగింది?ప్రాథమిక సమాచారం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోన్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగైన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇసుక క్వారీ నిర్వహణ వివాదాన్ని పరిష్కరించు కోవడానికి, చర్చల కోసం భరత్ సింగ్ను పిలిచారు ప్రత్యర్థులు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆయన ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు చుట్టుముట్టారు. అనంతరం అటూ ఇటూ ట్రక్కులను అడ్డుగా పెట్టి, కారు కదలకుండా లాక్ చేశారు. ఆపై కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో భరత్ సింగ్ కారులోనే సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో భరత్ సింగ్ బంధువులు, వీరేంద్ర సింగ్, నాగేంద్ర సింగ్ ఉన్నారు. వీరేంద్ర సింగ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో బంధువు మయాంక్ సింగ్ తీవ్ర గాయాతో బిలాస్పూర్లోని అపోలో ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఇదీ చదవండి: జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడుగతంలో కాంగ్రెస్లో ఉండి, భూపేష్ బఘేల్ ప్రభుత్వ హయాంలో బీజేపీలో చేరారు. భరత్ సింగ్కు ఇసుక మైనింగ్లో స్థానికంగా మంచి పట్టు ఉంది. ఆ ప్రాంతంలోని ఇసుక క్వారీ కాంట్రాక్టు భరత్ సింగ్ కుటుంబానికి దక్కింది. ఆ తర్వాత, సోన్హట్, కైలాష్పూర్, తెలిముడ, బెలియా , ఛింగురా ప్రాంతాలలో ఇసుక రవాణా, తవ్వకాలకు సంబంధించిన వసూళ్లపై ఆధిపత్య పోరు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. భరత్ సింగ్ వర్గానికి , మరో మనోజ్ త్రిపాఠి కుటుంబానికి మధ్య ఈ వివాదం గత కొన్ని నెలలుగా రగులుతోంది. త్రిపాఠి కుటుంబానికి చెందిన టిప్పర్ ట్రక్కుల ద్వారా ఇసుక రవాణా చేసే విషయంలో పేమెంట్లు, వర్గ ఆధిపత్య పోరు పెరిగి పెద్దదై మంగళవారం రాత్రి ఈ ఘోర కలికి దారి తీసింది. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని, దీనిపై సీబీఐ (CBI) దర్యాప్తు జరిపించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి : ఎస్ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యాడు!ఈ హింసాత్మక ఘటనతో కోరియా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులను (అక్షత్ త్రిపాఠి, విశాల్ త్రిపాఠి, సత్యప్రకాష్ త్రిపాఠి, మన్ను త్రిపాఠి) అరెస్ట్ చేశారు. మొత్తం తొమ్మిది మందిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అడిషనల్ ఎస్పీ సురేషా చౌబే తెలిపారు. -
తెరవెనుక బాగోతం నడిచింది
సత్తుపల్లి: బుగ్గపాడు ఫుడ్పార్క్ భూములను ఎకరం రూ.40.47 లక్షలుగా నిర్ణయించి, రూ.21 లక్షలకే కేటాయించారంటే తెర వెనుక బాగోతం నడిచినట్టేనని బీజేపీ తమిళనాడు రాష్ట్ర కో ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్పార్కు భూములను పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావుతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ ధరకు భూమి కేటాయింపులో అవినీతి, కుట్ర, కుంభకోణం దాగి ఉందని, ఇదంతా ప్రభుత్వంలోని జిల్లాకు చెందిన ముఖ్యనేత కన్నుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. తక్కువ ధరకు కేటాయింపులనే వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎవరి ప్రమేయంతో జరిగిందో చెప్పాలి? ఏపీకి చెందిన దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీకి 72 ఎకరాలు కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటో, కేబినెట్ అనుమతితో జరగాల్సిన భూకేటాయింపు అందుకు విరుద్ధంగా ఎవరి ప్రమేయంతో జరిగిందో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. ఫుడ్పార్కు అభివృద్ధి నిధులు రూ.109 కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.49.70 కోట్లు ఇచ్చిందని తెలిపారు. భూ కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో దర్యాప్తు చేయించేలా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం ఆయన హైవేలోని వేంసూరు ఎగ్జిట్ వద్ద మొక్కలు నాటారు. -
త్వరలో జైలుకు అఖిలేష్ యాదవ్?
ఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీలో కలకలం రేపుతోంది. ఆ పార్టీలో చీలికలు మొదలయ్యాయని, మైనింగ్ కేసులో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జైలుకెళ్తారంటూ ఆ రాష్ట్ర పంచాయతీ, సంక్షేమ శాఖ మంత్రి ఓపీ ప్రకాష్ రాజ్ భర్ బాంబు పేల్చారు. ఇటీవల మహరాష్ట్ర,పశ్చిమ బెంగాల్కు చెందిన నేతలు సొంత పార్టీలను వీడి అధికార బీజేపీలో చేరేందుకు క్యూకడుతున్నారు.ఈ క్రమంలో యూపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ మీడియాతో మాట్లాడారు. త్వరలో సమాజ్ వాదీ పార్టీలో ఒక పెద్ద చీలిక రాబోతోంది. ఇప్పటికే ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మైనింగ్ కేసులో సీబీఐ అఖిలేష్ యాదవ్ పేరు ఉందని త్వరలోనే జైలుకు వెళ్తారు. ఇందులో భాగంగానే ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్గోపాల్ యాదవ్తో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయమై రామ్గోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. ఆ లేఖలో పార్టీని వీడి బీజేపీలో చేరే నేతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉందని కూడా చెప్పారని తెలిపారు. అయితే ఆ లేఖలో పార్టీ మారుతున్న నేతల పేర్లు, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు స్పష్టంగా లేవు. మీడియా ప్రశ్నించగా ఓంప్రకాష్ రాజ్భర్ మాట్లాడుతూ.. ‘ఎస్పీని వీడే నేతల వివరాలు నాకు తెలుసు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అవి అలాగే జరగనివ్వండి. ఇప్పుడు నేను చెప్పితే నాశనం అవుతుంది. మరికొన్ని రోజులు ఆగితే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారు’ అని అన్నారు.ఇక లేఖపై రామ్గోపాల్ యాదవ్ స్పందిస్తూ.. ‘నేను లేఖ రాశానని మీరంటున్నారు. ఆ లేఖ గురించి అమిత్షాను అడగండి. దేశంలో ఎవరూ ఓం ప్రకాష్ రాజ్భర్ను సీరియస్గా తీసుకోరు. ఆయన ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతుంటారు. అసలు తాను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు’ అని వ్యాఖ్యానించారు. ఆయన అవన్నీ వదంతులేనని, పార్టీలో అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, సుహుల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓంప్రకాష్ రాజ్భర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలు గెలుచుకున్నారు. కొద్ది నెలలకే ఎస్పీకి గుడ్బై చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన యూపీ కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు.కాగా, మహారాష్ట్ర, బెంగాల్ తర్వాత ఎస్పీ బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు. ప్రతిపక్షంలో అత్యంత కీలకమైన రెండు పార్టీలు టీఎంసీ, శివసేన(యూటీబీ) పార్లమెంట్ శ్రేణుల నుంచి తిరుగుబాటుతో కుదేలవుతున్న తరుణంలో యూపీ మంత్రి కీలక ప్రకటన సంచలనంగా మారింది. -
AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!
-
ఇందిరా గాంధీ బ్రతికి ఉంటే.. బీజేపీ బ్యాన్ ?
జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గనుక ప్రస్తుతం బ్రతికి ఉంటే బీజేపీని దేశంలో బ్యాన్ చేసేదన్నారు. జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇలా మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటరిచ్చింది.జైపూర్లో ఓ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన అశోక్ గెహ్లాత్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ "ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు గత 50 ఏళ్లుగా నేను చూడలేదు. ఇందిరా గాంధీ లాంటి నాయకురాలు ఈ రోజు జీవించి ఉంటే, ఆమె బీజేపీ లాంటి పార్టీని నిషేధించి ఉండేవారు. నేటి వాతావరణం అత్యంత ప్రమాదకరంగా ఉందని నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నాను. దేశం ఇప్పటికీ మేల్కొనకపోతే, భవిష్యత్తులో ఈ దేశ ప్రజలే ఈ మతవివక్ష మూలంగా ఏర్పడే పర్యవసానాలను అనుభవిస్తారు." అని ఆయన అన్నారు.దేశంలోనే అత్యధిక చట్టసభల స్థానాలు కలిగిఉన్న ఉత్తరప్రదేశ్లో ముస్లింలకు కనీసం సీట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. మీరు సెక్యులర్ పార్టీ అని దేశ ప్రజలకు చూపించడానికైనా కనీసం ఐదు సీట్లు ఇచ్చి ఉండవచ్చు. కానీ మీది మతతత్వ పార్టీ అని 'మేము పూర్తిగా హిందుత్వ పార్టీ' అని ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే కేవలం హిందుత్వ మద్దతుదారులను రెచ్చగొట్టి పాలించడమే ఆలోచనగా ఉన్నవారికి టికెట్లు ఇచ్చారన్నారు. మీరు కేవలం హిందుత్వ ఎజెండాతోనే పార్టీని నడుపుతారా? కేవలం హిందువుల పేరుతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? అని ఆయన బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు.కాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇది హిందువుల పట్ల, హిందుత్వ పట్ల కాంగ్రెస్కు ఉన్న ద్వేషాన్ని మాత్రమే చూపిస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు."కాంగ్రెస్ పార్టీ హిందువులను, హిందుత్వను ద్వేషిస్తుంది. దీనికి నిదర్శనం అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలేనని తెలిపింది. హిందుత్వం అంటే మతం కాదు అది ఒక జీవన విధానమని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సైతం చెప్పింది. మరి ఇందిరా గాంధీ దానిని ఎందుకు నిషేధిస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు. -
బరువెక్కిన హృదయంతో వైదొలగుతున్నా!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కు ప్రముఖ నటి గౌతమి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రా థమిక సభ్యత్వంతో పా టు ప్రచార సంయుక్త కార్యదర్శి పదవికి ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి పంపినట్లు గౌతమి ప్రకటించారు. వివరాలు.. గౌతమి గతంలో సుదీర్ఘ కాలం పాటు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతంలో కొన్ని వ్యక్తిగత, రాజకీయ కారణాల వల్ల బీజేపీకి రాజీనా మా చేసిన ఆమె, ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరా రు. పార్టీ ఆమెకు స్టార్ క్యాంపెయినర్ హోదాలో కీలకమైన ప్రచార సంయుక్త కార్యదర్శి పదవిని కూడా అప్పగించింది. రాజపాళయం నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి ఆమె దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధిష్టానం ఖాతరు చేయలేదు. అయినా, ఆమె పార్టీ కోసం ప్రచారంలో విస్తృతంగానే ఎన్నికల సమయంలో దూసుకెళ్లారు. కాగా ఆదివారం గౌతమి చేసిన ప్రకటన అన్నాడీఎంకే వర్గాలకు షాక్గా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమి తన లేఖలో పేర్కొన్నారు. ఈనెల 14(ఆదివారం) నుండి అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే పార్టీ ప్రచార సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో తాను మరింత స్వేచ్ఛగా సామాజిక సేవ చేయడానికి వీలుగా.. బరువెక్కిన హృదయంతో పార్టీ నుండి తప్పుకుంటున్నానని గౌతమి స్పష్టం చేశారు. పారీ్టలో చేరిన నాటి నుండి తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆమె తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
బీఆర్ఎస్, బీజేపీ మిలాఖత్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత బీఆర్ఎస్ నాయకత్వం, బీజేపీ కలిసి సింగరేణికి నష్టం చేసి, ఇప్పుడు ఇద్దరూ మిలాఖత్ అయి దొంగే దొంగ అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దోపిడీదారులు, కుట్రలు చేసే వారి నుంచి సింగరేణి ఆస్తులు, వనరులను కాపాడతామని చెప్పారు. శనివారం మంచిర్యాల జిల్లాలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలసి ఆయన దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి, మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయాల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు 335 మందికి సింగరేణి కారుణ్య నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. హరీశ్రావు పదేళ్లు మంత్రిగా పని చేసి రోజుకో అబద్ధం చెబుతూ అబద్ధాల రావుగా మారారని భట్టి ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రిగా ఉండి కిషన్రెడ్డి సింగరేణికి ఏం చేశారని ప్రశ్నించారు. సంస్థపై కుట్రపూరితంగా హరీశ్రావు లేఖ రాస్తే, కిషన్రెడ్డి స్పందిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల కోసం రెండు బ్లాక్లను సంస్థకు రాకుండా చేశారని ఆరోపించారు. కోయగూడెం బ్లాక్ వేలంలో పాల్గొనకపోవడంతో రూ.29,106 కోట్ల విలువైన 67 మిలియన్ టన్నుల బొగ్గును సంస్థ కోల్పోయిందన్నారు. దీంతో సంస్థకు వచ్చే రూ.19,360 కోట్ల లాభం చేజారిపోయిందని మండిపడ్డారు. ఎనిమిదేళ్లు మైనింగ్ చేసే సత్తుపల్లి బ్లాక్ 3లో 32 మిలియన్ టన్నుల బొగ్గు ఉండగా, వేలంలో పాల్గొనక రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.2,624 కోట్ల నికర లాభాన్ని సింగరేణి నష్టపోయిందన్నారు. సింగరేణి. ‘మారుపేర్ల’సమస్యపై ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. గోదారి పుష్కరాలు, ఆలయాలకు రూ.3 వేల కోట్లు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 37 రోజుల్లోనే నిధుల మంజూరు చేసి గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి రూ.70 కోట్లతో పనులు ప్రారంభించామని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్లు మంజూరు చేశామన్నారు. గోదావరి పుష్కరాల కోసం అవసరమైన వసతులు, ఘాట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గోదావరి పరీవాహక ఆలయాల అభివృద్ధికి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పుణ్యక్షేత్రాలను రూ.802 కోట్లతో సుందరీకరించి, ఆధ్యాత్మిక కారిడార్గా వృద్ధి చేస్తామన్నారు. ఈ పర్యటనలో గూడెం గుట్ట ఆలయ అభివృద్ధికి రూ.70కోట్లు, మినీ ఎత్తిపోతల పథకానికి, మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల ఆఫీసులకు రూ.1.40కోట్లు, విశ్వనాథ ఆలయం అభివృద్ధికి రూ.3 కోట్లతో పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కె.ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్, రాజ్ ఠాకూర్, గండ్ర సత్యనారాయణరావు, రామ్దాస్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. -
బీజేపీ కొత్త జట్టు రెడీ..!
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు ము హూర్తం దగ్గరపడింది. ఈ నెల 15తో అధిక మాసం ముగియనుండటంతో కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటన ఎప్పుడైనా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రాల స్థాయిలో సంస్థాగత ఎన్నికలు, అధ్యక్షుల నియామకాలు దాదాపు పూర్తి కావడంతో కేంద్ర సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో జరిగిన వరస సంప్రదింపులు, సంఘ్ పెద్దలతో చర్చలు కూడా ముగింపు దశకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతుండటంతో వచ్చే వారం దీనిపై కలక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. యువత.. దక్షిణాది రాష్ట్రాలు.. ఓబీసీలు..కొత్త జాతీయ జట్టు కూర్పులో ప్రధానంగా యువత, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం, ఓబీసీలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక వేదికలైన పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ), జాతీయ మండలిలో ఈసారి గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గత దశాబ్దంలో పార్టీ విస్తరణకు సేవలందించిన సీనియర్లకు గౌరవప్రద స్థానం కొనసాగిస్తూనే, ఎన్నికల రాజకీయాల్లో చురుకుగా పనిచేసే కొత్త తరం నాయకులకు బాధ్యతలు అప్పగించే దిశగా కసరత్తు జరిగినట్లు సమాచారం.ముఖ్యంగా ఇటీవలి బెంగాల్, బిహార్, హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ విజయాలకు బాటలు వేసిన నేతలకు ప్రాధాన్యం ఇస్తూనే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జట్టు రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచే అంశంపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.తెలంగాణకు చెందిన కిషన్రెడ్డి, బండి సంజయ్, కర్ణాటకకు చెందిన విజయేంద్ర, ప్రహ్లాద్ జోషి, తమిళనాడు నుంచి ఎల్. మురుగన్, కేరళ నుంచి రాజీవ్ చంద్రశేఖర్, ఏపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి వంటి నేతలకు జాతీయ టీమ్లో ప్రాధాన్యం పెరిగే అవకాశాలపై ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పటికే రాష్ట్ర విభాగాల నుంచి అభిప్రాయాలు సేకరించి, సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతౌల్యం, ఎన్నికల సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.కొత్త కార్యవర్గంలో 40–50 ఏళ్ల నాయకులకు ప్రాధాన్యం దక్కవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణలో చురుకుగా పనిచేసిన నేతలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓబీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం దాదాపు ఖాయమనే అభిప్రాయం ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా నాయకులకు కూడా కార్యవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.ఎన్నికల వ్యూహంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది కేంద్ర మంత్రులు, సంస్థాగత నేతలకు అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. -
కిమ్ బాటలో కాషాయ పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ బాటలోనే బీజేపీ పయనిస్తోందని, ఆయన్ను రోల్మోడల్గా తీసుకునే ఓటు చోరీ–సీటు చోరీలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసిన మీనాక్షి నటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేకున్నా, ఊహాజనిత కేసును చూపెట్టి ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం ముమ్మాటికీ బీజేపీ కుట్రేనని అన్నారు.బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్లే కుట్రదారులని ఆరోపించారు. ప్రైవేటు ఫిర్యాదులపై ఇచ్చే నోటీసులన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల అఫిడవిట్లో చూపెడుతున్నారా? అని ప్రశ్నించారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్రెడ్డి శుక్రవారం మీడియాతో పలు అంశాలపై చిట్చాట్ చేశారు. ఉత్తర కొరియాలో ఓట్లన్నీ కిమ్కే.. ‘ఇన్నాళ్లూ బీజేపీకి గాడ్సే ఆదర్శం అనుకున్నాం. గాంధేయవాదులకీ, గాడ్సే వారసులకీ యుద్ధం జరుగుతోందని భావించాం. కానీ బీజేపీ ఇప్పుడు కిమ్ జాంగ్ను ఆదర్శంగా తీసుకుంటోంది. ఉత్తర కొరియాలో ఎన్నికల్లో ఒకే పార్టీ పోటీ చేస్తుంది. ఓట్లన్నీ ఆ పార్టీ నేత కిమ్ జాంగ్కే పడతాయి. ఆయనే అధ్యక్షునిగా ఎన్నిక అవుతారు. అదే మాదిరి బీజేపీ ఓట్లు, సీట్లు అన్నీ తమకే దక్కేలా కుట్రలు చేస్తోంది. మీనాక్షి విషయంలోనూ అదే చేసి చూపించింది. బలం లేకుండా మూడో అభ్యర్థిని పెట్టారు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేకుండా మూడో అభ్యర్థిని పోటీలో పెట్టడం వెనుకే పెద్ద కుట్ర ఉంది. అక్కడ బీజేపీకి గెలిచేంత బలమే లేదు. అయినా అభ్యర్థిని పోటీలో పెట్టారు. మీనాక్షి నామినేషన్ వేశాక కుట్రలకు తెరలేపారు. వాస్తవానికి ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. తెలంగాణలో ఆమెపై ఎలాంటి కేసులు లేవు. ఓ ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన విషయంలో ఆమెకు సమన్లు మాత్రమే జారీ అయ్యాయి.2023లో ఇద్దరి మధ్యలో జరిగిన వివాదంతో మీనాక్షికి సంబంధం లేదు. అయినప్పటికీ రిటర్నింగ్ ఆఫీసర్ ఒక పార్టీకి కార్యకర్తలా వ్యవహరించి నామినేషన్ తిరస్కరించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, రిటర్నింగ్ ఆఫీసర్ ఇద్దరూ కుట్రదారులే. బీజేపీ టాప్ నేతలే దీనికి వ్యూహరచన చేశారు. కేసే లేనప్పుడు తెలంగాణ నుంచి ఈ వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారన్న దానిపై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదు..’అని సీఎం అన్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్రెడ్డి ఆడుతున్నారు.. ‘తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వొద్దని కిషన్రెడ్డి ప్రతి కేంద్రమంత్రినీ కలిసి చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తానే నిలిపివేయించానని బీఆర్ఎస్ మాజీమంత్రి కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్రెడ్డి ఆడుతున్నారు. ఐఆర్ఎఫ్సీకి లోన్ ఎందుకు ఇవ్వడంలేదు? 30వ తేదీన రావాల్సిన ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదు? ఆర్ఆర్ఆర్ లో 320 కిలోమీటర్ల టెండర్ల ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోంది? మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా సీఎం ఫడ్నవీస్తో మాట్లాడి 1,500 ఎకరాలు తెలంగాణకు ఇప్పించలేరా? రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులపై ప్రధానికి కిషన్రెడ్డి ఎన్ని లేఖలు రాశారో చెప్పాలి. కేబినెట్ భేటీకి రానని చెప్పాలి.. మేము అడుగుతున్న మెట్రో, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. వీటిపై ఆయన ప్రధాని మోదీని కేబినెట్లో ఎందుకు అడగడం లేదు? ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు మంత్రివర్గ సమావేశానికి హాజరుకానని కిషన్రెడ్డి చెప్పాలి. లేదంటే కిషన్రెడ్డి సహా..రాష్ట్రానికి చెందిన మొత్తం 8మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రాజెక్టులు పరిగెత్తుకుంటూ వస్తాయి. మెట్రో వస్తే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు పేరు వస్తుందని కిషన్రెడ్డి ఆపుతున్నారు..’అని రేవంత్ ఆరోపించారు. నిధుల కేటాయింపుల్లో వివక్ష ‘బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో వివక్ష ఉంది. ఈ వివక్ష పోవాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రధానిని మారిస్తే సరిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే దేశం ముందుకెళుతుంది. రాష్ట్రం కోరుతున్న ట్రిపుల్ ఆర్, రీజనల్ రింగ్రోడ్డు, ఐఐఎం, మెట్రోలకు ఇప్పటికైనా కేంద్రం నిధులచ్చి సహకరించాలి. జూలైలో మహారాష్ట్రతో చర్చలు.. గోదావరి జలాల వినియోగం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై వచ్చే నెలలో మహారాష్ట్రతో చర్చలుంటాయి. నీతిఆయోగ్ సమావేశం సందర్భంగా దీనిపై ఫడ్నవీస్తో మాట్లాడా. వచ్చే నెలలో దీనిపై చర్చిద్దామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి 1,500 ఎకరాలు ఇప్పించలేదా? హిట్లర్ వ్యాఖ్యలకు వక్రభాష్యం.. రాష్ట్ర కేబినెట్ పునరవ్వ్యవస్థీకరణపై ఎలాంటి చర్చలు జరగలేదు. మంత్రి పదవులపై ఎవరైనా పార్టీ పెద్దలను కలవొచ్చు.. ఏదైనా అడగొచ్చు. బుద్ధి ఉన్నోడు ఎవడూ హిట్లర్ను ఆదర్శంగా తీసుకోడు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసే నేతలు ఎవరైనా ఆయన రోల్మోడల్ అని చెప్పరు. నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది..’అని సీఎం విమర్శించారు. వైఎస్ జగన్ సభలకు అనుమతిస్తున్నారా? ‘తెలంగాణకు ఎవరైనా రావొచ్చు..మాట్లాడొచ్చు..పోటీ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయి. ఏవైనా శాంతి భద్రతల సమస్యలు వస్తాయని భావిస్తే పోలీసులు అనుమతులు ఇవ్వరు. పవన్ కల్యాణ్ సభ విషయంలో అక్కడి పరిస్థితులను బట్టి సమస్యలు వస్తాయనే అనుమతులు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలకు అనుమతులు ఇస్తున్నారా? శాంతిభద్రతల సమస్యలున్నాయని సభలను తిరస్కరించట్లేదా?. ఇప్పటికి ఎన్ని సభలను అడ్డుకున్నారో వైఎస్ జగన్ను అడిగితే ఆయనే జాబితా ఇస్తారు..’అని రేవంత్ అన్నారు. రాహుల్గాంధీతో భేటీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శక్రవారం ఉదయం లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీతో భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరుపై వీరిద్దరూ చర్చించుకున్నారు. బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఈ సందర్భంగా రాహుల్ సూచించినట్లు తెలిసింది. -
‘బీజేపీ వైఖరి కిమ్ జాంగ్ను తలపిస్తుంది’
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కిమ్ జాంగ్లా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బీజీపీపై విమర్శలు సంధించారు రేవంత్. ‘నార్త్ కొరియా తరహాలో ఏక పార్టీ ఎన్నికలు పెడుతున్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓటు చోరీ చేయలేక సీటు చోరీ చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. లేని బలంతో మూడో అభ్యర్థిని పెట్టడం అంటేనే బీజేపీ ముందుగానే కుట్రలకు తెరలేపిందనేది అర్థమవుతుంది. బిజెపి కుట్రను డైవర్ట్ చేసేందుకు, కాంగ్రెస్ కోవర్టులని దుష్ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించారు.‘శాంతి భద్రతల కారణంతో మేం కూడా పవన్ కళ్యాణ్ మీటింగుకు అనుమతి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు మా మంత్రులు జవాబు ఇచ్చారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా?, హిట్లర్ నాకు ఆదర్శం కాదు. నా మాటలను మీడియా వక్రీకరించింది. హైడ్రా పదం ఎక్కడి నుంచి వచ్చిందో అని మాత్రమే చెప్పాను. క్యాబినెట్ ఎప్పుడు విస్తరించాలో అప్పుడే విస్తరిస్తాం. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలే నరేంద్ర మోదీతో ఉన్నాయి. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారా?, కేంద్ర మంత్రుల వద్దకు కిషన్ రెడ్డితో పాటే నేను వస్తా. జూలైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సమావేశం ఉంటుంది. తుమ్మిడి హట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా సహకరించాలి. కేటీఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి ఢిల్లీలో డాన్స్ చేస్తున్నారు. 8 మంది ఎంపీలు కేంద్రంతో పట్టుపడితే ప్రాజెక్టులు ఎందుకు రావు. ఈటెల రాజేందర్ నియోజకవర్గానికి మెట్రో రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి అనుచరులే ఫ్లెక్సీలు కట్టారు. కిషన్ రెడ్డి నెగటివ్ ఎనర్జీ నేను పాజిటివ్ ఎనర్జీ. స్కూలు ఫీజుల నియంత్రణపై మీడియా గట్టిగా రాస్తే నేను చర్యలు తీసుకుంటా’ అని హెచ్చరించారు. -
నేను భావోద్వేగానికి లోనయ్యాను: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ అధ్యక్షతన భారత మండపంలో బుధవారం ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరిపారు.ఇందులో మోదీ మాట్లాడుతూ... ‘‘నా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. నా జీవితంలో ఇదో అద్భుతమైన క్షణం. ఈ రోజు ఈ ప్రయాణంలో భాగమైన సహచరులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది మీ ఆప్యాయతను, ఉదారతను ప్రతిబింబిస్తోంది. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని నేను వ్యక్తిగత విజయంగా చూడను. ప్రతి విధంగానూ ఇది మనందరి విజయం, ఎన్డీఏలోని ప్రతి భాగస్వామ్య పార్టీ సాధించిన ఉమ్మడి విజయం. అందువల్ల ఈ తీర్మానాన్ని మీ అందరికీ, మన ఎన్డీఏ కుటుంబంలోని ప్రతి కార్యకర్తకు అంకితం చేస్తున్నాను. భారతమాతకు ఇంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం లభించడం, ఆమెకు సేవ చేసే భాగ్యం దక్కడం దేవుని ప్రత్యేక కృప వల్లే సాధ్యం. నా దృష్టిలో ప్రజలే దైవ స్వరూపం. అందుకే ఈ సేవను నేను ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధనగా చూశాను. ఈ ఆధ్యాత్మిక సాధన ఎప్పుడూ ఒంటరిది కాదు. ఇది ఒక సామూహిక యజ్ఞం. ఇందులో మీరందరూ, ఇంకా ఎంతోమంది సహచరులు కర్తవ్య భావనతో తమ సేవలు అందించారు. మీ అందరూ ఈ రోజును నాకు నిజంగా చిరస్మరణీయంగా మార్చారు. నేను భావోద్వేగానికి లోనయ్యాను. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 'చరైవేతి, చరైవేతి' అనే మంత్రాన్ని జపిస్తూ, ఈ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ వచ్చిన నేను, ఈ మైలురాయిని ఒక రోజు చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. నిరంతరంగా ఎన్నికైన ప్రధానిగా అత్యంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం దక్కడం నా అత్యున్నత భాగ్యంగా భావిస్తున్నాను" అని తెలిపారు. చరైవేతి, చరైవేతి అంటే నిరంతరం ముందుకు సాగాలని చెప్పే ప్రాచీన సంస్కృత మంత్రం.దేశ అవసరాలే మా విధానాలకు పునాది ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని మోదీ తెలిపారు. "2014లో భారతదేశానికి అవసరమైన మొబైల్ ఫోన్లలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వచ్చేవి. ఈ రోజు భారతదేశం దేశీయంగా 330 మిలియన్లకు పైగా మొబైల్ హ్యాండ్సెట్లను తయారు చేస్తోంది. 2014లో సౌర విద్యుత్ సామర్థ్యం కేవలం 2.5 గిగావాట్లు మాత్రమే ఉండేది. ఈ రోజు అది 150 గిగావాట్లను దాటింది. 2014లో ఇథనాల్ మిశ్రమం కేవలం 1.5% మాత్రమే ఉండేది. ఈ రోజు అది 20%కు చేరుకుంది. 2014లో దేశంలో ఒక్క సెమీకండక్టర్ యూనిట్ కూడా లేదు. ఈ రోజు నిర్మాణంలో ఉన్న 10కుపైగా సెమీకండక్టర్ యూనిట్లు భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపిస్తున్నాయి.దేశ అవసరాలనే మా విధానాలకు, నిర్ణయాలకు పునాదిగా చేసుకున్నాం. కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు కొత్త ఆలోచనా విధానాన్ని స్వీకరించాం. యువత కోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను సృష్టించాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక మత్స్యశాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. దివ్యాంగుల కోసం చట్టాన్ని తీసుకొచ్చాం. గిరిజన సమాజాల కోసం 'జనమన్' వంటి పథకాలను ప్రారంభించాం. ఇంతకుముందు పశుపోషకులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనం అందేది కాదు. ఆ సౌకర్యాన్ని వారికి కూడా విస్తరించాం. అంతేకాకుండా, వీధి వ్యాపారులకు మా ప్రభుత్వం 'స్వనిధి' రుణ కార్డు సౌకర్యాన్ని అందించింది..." అని మోదీ తెలిపారు. -
మోదీ అధ్యక్షతన ఎన్డీఏ నేతల కీలక భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరుపుతున్నారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించారు. మోదీని అభినందిస్తూ ఎన్డీఏ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.ఎన్డీఏలోని కీలక నేతలు భారత్ మండపానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.అలాగే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి భవిష్యత్ వ్యూహం, రాజకీయ అజెండాపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.కాగా, 2014 మే 26న తొలిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ, ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా వరుసగా 4,399 రోజులు పూర్తి చేశారు. ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా జవహర్లాల్ నెహ్రూ పదవీకాలాన్ని అధిగమించారు. అయితే నెహ్రూ 1947 నుంచి 1964లో మరణించే వరకు ప్రధానిగా కొనసాగారు. కానీ ఈ పోలిక ప్రత్యేకంగా తొలి లోక్సభ ఎన్నికల తర్వాతి కాలానికి మాత్రమే సంబంధించింది. -
మీనాక్షి నామినేషన్ రద్దు.. బీజేపీ చేతికి ఆ పేపర్లు ఎలా?
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వ్యవహారం ఇప్పుడో.. పెద్ద పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుకు సంబంధించిన సమాచారం దాచినట్లు ఆరోపణలతో రిటర్నింగ్ అధికారి ఆర్వింద్ శర్మ ఆమె నామినేషన్ను తిరస్కరించడం.. రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలతో ఈ ఎపిసోడ్ పూటకో మలుపు తిరుగుతోంది.. తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై కేసు ఉందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పత్రాలు బీజేపీ చేతికి ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ నుంచే తమకు ఆ సమాచారం అందిందని బీజేపీ బాంబ్ పేల్చింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కాంగ్రెస్లోనే అంతర్గత విభేదాలు, లీక్ రాజకీయాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, “ఈ పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముందుకెళ్లి, బీజేపీకి ఈ సమాచారం కాంగ్రెస్ లోపలి వ్యక్తుల నుంచే వచ్చి ఉండొచ్చని కూడా ఆయన అనడంతో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఇదే సమయంలో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్లో అంతర్గత వర్గపోరు వల్లే ఈ లీక్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఈ వ్యవహారం “యాదృచ్ఛిక లీక్” కాకుండా ఒక ప్రణాళికాబద్ధ రాజకీయ మార్గం ద్వారా బీజేపీకి చేరినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ బీజేపీ నేత ఇచ్చిన వివరాల మేరకు.. ఆ పత్రాలు మధ్యప్రదేశ్ బీజేపీకి చేరగా, ఆ పార్టీ వెంటనే చురుకుగా స్పందించిందట. ఆ పత్రాల్లో కోర్టు కేసులు, నోటీసులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం.బోపాల్కు చేరిన తర్వాత బీజేపీ లీగల్ వ్యూహాన్ని సిద్ధం చేసి రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం దాఖలు చేసింది. ఈ కేసును బలంగా వాదించేందుకు పార్టీ తరఫున రాహుల్ కొఠారి, మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్యను నియమించినట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ స్క్రూటినీ సమయంలో బీజేపీ బలమైన సవాలు విసరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మరోవైపు కాంగ్రెస్ ఈ మొత్తం ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్క్రూటినీ సమయంలో మాజీ న్యాయమూర్తి పాల్గొనడంపై కాంగ్రెస్ నేత జేపీ ధనోపియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్లే తమ అభ్యర్థిపై అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది.ఈ వివాదానికి మూలం 2022లో తెలంగాణలో జరిగిన ఒక కేసు అని తెలుస్తోంది. ఒక మహిళ చేసిన ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉండగా, ఆ సమయంలో ఆ వ్యవహారంతో మీనాక్షి నటరాజన్కు కూడా సంబంధం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం ఆమెపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కోర్టు కేవలం షోకాజ్ నోటీసులు.. సమన్లు మాత్రమే ఇచ్చిందని.. చట్టపరంగా నామినేషన్లో ఆ వివరాలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ విషయంలో గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ దిశగా అడుగులు వేయొచ్చని సంకేతాలిస్తోంది.మొత్తానికి ఈ వ్యవహారం కేవలం నామినేషన్ రద్దు ఘటనగా కాకుండా, కాంగ్రెస్–బీజేపీ మధ్య పత్రాల రాజకీయ యుద్ధంగా మారింది. “పేపర్ ఎవరు ఇచ్చారు?”, “లీక్ వెనుక ఎవరు ఉన్నారు?” అనే ప్రశ్నలతో మధ్యప్రదేశ్ రాజ్యసభ పోరు ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్గా మారిపోయింది.ఈసీ ఏం చేయబోతోంది?..ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
ఎన్డీఏకు టీఎంసీ ఎంపీల మద్దతు..?
దేశంలో ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. అయితే ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి డబుల్ బోనస్ను తెచ్చిపెట్టాయి. ఒకటేమో ఎంతోకాలంగా అందని ద్రాక్షలా ఉన్న బెంగాల్లో విజయం సాధించడమైతే. మరోటేమే తమ ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న డీఎంకే, టీఎంసీలను మట్టికరిపించి ఇండియా కూటమిని దెబ్బతీయడం.ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత.. ప్రస్తుతం అధికార ఎన్డీఏ కూటమికి సరిగ్గా సరిపోతుంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఎన్టీయే జయకేతనం ఎగురవేసింది. దానితో పాటు ఎంతో కాలంగా కాషాయ పార్టీకి కొరకరాని కొయ్యలుగా ఉన్న టీఎంసీ మమతా బెనర్జీ, డీఎంకే స్టాలిన్ ఓడిపోవడంతో ఆ పార్టీకి డబుల్ బోనస్ లభించినట్లయింది. దీంతో జాతీయస్థాయిలో ఎన్డీఏకు ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమిని బలహీనపరిచి జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం లేకుండా చేసుకుంటుంది.టీఎంసీలో చీలికటీఎంసీలో మమతా బెనర్జీకి అసమ్మతి సెగ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు అసమ్మతి గళం ఎగురువేశారు.లోక్సభలో టీఎంసీ చీఫ్ విప్ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి అధికారికంగా మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టీఎంసీ సీనియర్ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి, అలాగే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజా చీలికతో మమతా బెనర్జీ వైపు కేవలం 8 మంది ఎంపీలు మాత్రమే మిగిలారు. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి చీలిపోయారు. దీంతో మమతా బెనర్జీకి వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి.కాంగ్రెస్కు డీఎంకే షాక్మరోవైపు డీఎంకే కాంగ్రెస్కు షాక్ ఇచ్చింది. హస్తం పార్టీ మిత్రధర్మాన్ని పాటించకుండా టీవీకేకు మద్దతిచ్చిందని ఆరోపించింది. దీంతో ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాము ఇకపై ఇండియా కూటమిలో భాగం కాదని స్పష్టం చేసిన డీఎంకే, భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా మరో కొత్త లౌకిక కూటమి ఏర్పాటయ్యే అవకాశం ఉందని సూచించింది.మెజార్టీ లేక వీగిపోయిన బిల్లు కాగా ఇటీవల కేంద్రం లోక్సభలో ప్రవేశ పెట్టిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ లేక వీగిపోయాయి. ప్రత్యేక మెజారీటీకి 352 మంది ఎంపీల మద్దతు అవసరం ఉండగా 298 సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. దీంతో బిల్లు వీగిపోయింది. కాగా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఎస్పీ తరువాత అత్యధిక ఎంపీ స్థానాలు తృణముల్ 28, డీఎంకే 22 స్థానాలు గెలుపొందాయి.ప్రస్తుతం డీఎంకే ఇండియా కూటమి నుంచి వైదొలగగా, టీఎంసీ ఎంపీలు ఎన్డీఏకు మద్దతిస్తామని స్పీకర్కు లేఖ రాశారు. దీంతో ఇండియా కూటమికి దాదాపుగా 40 మంది ఎంపీల మద్దతు తగ్గినట్లైంది. త్వరలో జరిగే వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో బీజేపీ మరోసారి రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.అయితే డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుండి వైదొలిగినప్పటికీ బీజేపీకి మద్దతివ్వడం అనేది దాదాపు అసంభవం. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాధాన్యత తగ్గుతుందని నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీలలో డీఎంకే ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ బిల్లులకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ప్రకటించదు. అయినప్పటికీ గతంతో పోలిస్తే లోక్సభలో బీజేపీ బలం మరింత పెరిగింది.దీంతో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇటు బీజేపీకి విజయం ఇవ్వడంతో పాటు ప్రధాన ప్రతిపక్షాలను మట్టికరిపించాయనేది కాదనలేని సత్యం. -
యూసుఫ్ పఠాన్కు మహువా స్ట్రాంగ్ వార్నింగ్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చోటుచేసుకున్న తిరుగుబాట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 20 మంది లోక్సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) వైపు అడుగులు వేస్తున్నారనే ఊహాగానాల మధ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామాల దరిమిలా టీఎంసీ ఫైర్బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా తిరుగుబాటుదారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ మ్యాండేట్ను ఉల్లంఘించి ఎన్డీఏతో చేతులు కలపాలని చూస్తున్న వారిని స్వార్థపరులుగా, దేశద్రోహులుగా ఆమె అభివర్ణించారు.‘వెన్నెముక ఉండాలి'.. యూసుఫ్ పఠాన్పై ఆగ్రహంమహువా మోయిత్రా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్' లో చేసిన ఒక పోస్ట్లో మాజీ క్రికెటర్, టీంఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ను నేరుగా టార్గెట్ చేశారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘అమిత్ షా పిలిచారని మీరు ఢిల్లీకి పరిగెడుతున్నారా? కాస్త ధైర్యం ప్రదర్శించండి. మీరు భారతదేశం తరపున ఆడారు. మా జిల్లా ప్రజలు మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. కాస్త సిగ్గు, వెన్నెముక ఉండాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల తీర్పు టీఎంసీకి ఇచ్చినదని, ఎన్డీఏకు కాదని ఆమె స్పష్టం చేశారు.బీజేపీ టికెట్పై గెలవాలని సవాల్పార్టీ మారే ఆలోచనలో ఉన్న అసమ్మతి ఎంపీలకు మహువా మోయిత్రా ఒక బహిరంగ సవాల్ విసిరారు. పసుపు రంగు మరకలున్న ప్యాంట్లు వేసుకున్న స్వార్థపూరిత దేశద్రోహులంతా వెంటనే బీజేపీలో చేరవచ్చని, అయితే ముందుగా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి, తిరిగి బీజేపీ టికెట్పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ వెలుపల వారి ఎన్నికల బలం ఎంతో నిరూపించుకోవాలని, అప్పుడే వారు ఎంతటి వీరులో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.తల వంచేది లేదు: కాకోలి ఘోష్ దస్తీదార్మరోవైపు లోక్సభలో ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లు కోరిన 20 మంది అసమ్మతి ఎంపీల గ్రూపులో ఉన్న రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ ఈ విమర్శలపై ఘాటుగానే స్పందించారు. ‘నా తల తెగినా వంగేది లేదు, నేను ఇప్పటికే చాలా భరించాను’ అని ఆమె మీడియా సంస్థ ‘ఏఎన్ఐ’తో అన్నారు. తానేమీ 2011లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలోకి రాలేదని, గత 40 ఏళ్లుగా ఇక్కడే పోరాడుతున్నానని చెప్పారు. తనకు జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రత మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: బీపీలకు, టెన్షన్లకు చెక్.. డాంకీలతో మైండ్ బ్లోయింగ్ ట్రీట్మెంట్! -
మీనాక్షికి అగ్ని పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో రాజకీయాలు వేడెక్కాయి. మూడో సీటు కోసం కాంగ్రెస్ అభ్యర్థి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్పై బీజేపీ అనూహ్యంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో, తమ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్, తమకు అవసరమైన 10 అదనపు ఓట్లను సమీకరించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తున్నాయి. రెండు రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, మూడో సీటుపై కన్నేసింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘మూడో సీటూ మాదే. ఇంకెక్కడికి వెళ్తుంది?’ అంటూ ఆదివారం చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మత్స్యకార నేత మహేష్ కేవత్ను ఆదివారం రాత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అసెంబ్లీలో మొత్తం 230 మంది ఎమ్మెల్యేలకు గాను ప్రస్తుతం రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో 228 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్కో రాజ్యసభ స్థానం గెలుపునకు 58 ఓట్లు కాగా బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ లెక్కన రెండు సీట్లు గెలిచిన తర్వాత మిగిలే ఓట్లు 48. మూడో సీటు కూడా దక్కాలంటే మరో పది ఓట్లుంటే సరిపోతుంది. కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక ఎమ్మెల్యే ఓటింగ్కు దూరంగా ఉండే అవకాశం ఉండటంతో 63కు ఆ సంఖ్య తగ్గొచ్చు. ఇది గెలుపు కోటా కంటే 6 ఓట్లు మాత్రమే ఎక్కువ. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్, అసంతృప్తి ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తమ ఎమ్మెల్యేలను తెలంగాణ లేదా కర్ణాటకకు తరలించే ఆలోచనలో ఉంది. మీనాక్షీ నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. మూడో అభ్యర్థిని గెలిపించుకునేందుకు సీఎం అధ్యక్షతన బీజేపీ నేతలు సమావేశమై కాంగ్రెస్లోని అసంతృప్తి వర్గాలను ఆకర్షించే వ్యూహాన్ని ఖరారు చేశారు. గెలుపు అవకాశాలు కాంగ్రెస్కే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ పార్టీలో అంతర్గత అసమ్మతిని బయటపెట్టడమే బీజేపీ లక్ష్యమని అంటున్నారు. -
కేంద్రం భారీగా నిధులిస్తున్నా ఏం చేయలేదంటారా?
సాక్షి, హైదరాబాద్: అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, సంచుల మూటలు మోయడం, పార్టీలు మారడంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమర్థుడే అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నా.. ఏమీ చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. సోమవా రం తన మంత్రిత్వ శాఖ రెండేళ్లలో సాధించిన ప్రగతిపై మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఆయన విలేకరులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు కిషన్రెడ్డి పైవిధంగా స్పందించారు. కేంద్రం దొడ్డు బియ్యం సేకరించి ఏం చేయాలి? ‘ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం రూ.26 వేల కోట్లు వ్యయం చేస్తోంది. రాష్ట్రంలో పండిస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలకు ఉచితంగా ఇవ్వలేకపోతున్నారు. వారికి సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అలాంటప్పుడు కేంద్రం దొడ్డు బియ్యాన్ని సేకరించి ఏం చేయాలి? దొడ్డు బియ్యం రాష్ట్ర ప్రజలే తిననప్పుడు మిగిలిన రాష్ట్రాల ప్రజలు తినాలని ఎలా చెప్తాం? దేశంలోని గోదాములన్నీ బియ్యంతో నిండిపోవడం, రబీ సీజన్లో భారీగా ధాన్యం వస్తుందన్న ఉద్దేశంతోనే మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడం జరిగింది.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో కేవలం 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు ఉంటే.. ప్రభుత్వం మాత్రం ఏకంగా 70 లక్షలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతోంది. రాష్ట్రంలో పండించే సన్న ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు క్వింటాల్కు రూ.4,500కు విక్రయిస్తూ.. ఇక్కడకు మాత్రం రూ.3,500 క్వింటాల్కు కొనుగోలు చేసిన బియ్యం సరఫరా చేస్తున్నారు. పది రకాల ధాన్యాలకు బోనస్ ఇస్తామని అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సన్న ధాన్యానికి ప్రకటించి.. ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు..’ అని కిషన్రెడ్డి దుయ్యబట్టారు. మెట్రో టేకోవర్కు కేంద్రమే రుణం సమకూర్చింది ‘ఎల్ అండ్ టీ నుంచి మెట్రో స్వా«దీనానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే.. రైల్వేనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 13,500 కోట్లు రుణాన్ని ఇచ్చింది. అంతేకాక మెట్రో రెండో దశకు అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉంది. అలాగే మిగిలిన 50 శాతం నిధులను రుణ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవడానికి కూడా అంగీకారం తెలిపింది. మెట్రో టేకోవర్ పూర్తయ్యాక తిరిగి డీపీఆర్ పంపించాలి. అలా పంపించిన డీపీఆర్ను కేంద్రంలోని మెట్రోబోర్డు, అలాగే ఇతర మంత్రిత్వ శాఖలు పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.ఆ తర్వాత వాటిని కేబినెట్ ఆమోదానికి పంపుతాయి. అలాగే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయం అవుతుంది. గత వారమే కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ రహదారుల కోసం దాదాపు రూ. 7,500 కోట్లకు పైగా నిధులకు ఆమోదం తెలిపింది. ఒక్క నెలలోనే దాదాపు రూ. 28 వేల కోట్లు కేంద్రం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేసింది..’ అని కిషన్రెడ్డి తెలిపారు. సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా? ‘సింగరేణిలో ఏదో బొగ్గు కుంభకోణం జరిగిందని కేటీఆర్ మాకు లేఖ రాసిన విషయం వాస్తవమే. సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా? గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు ఒక్క విషయంలోనూ హరీశ్రావు, కేటీఆర్లకు నేను కేంద్ర మంత్రినని గుర్తుకు రాలేదు కానీ.. ఇప్పుడు అవినీతి జరిగిందంటూ.. అందులో కిషన్రెడ్డికి కూడా వాటా ఉందా అని ప్రశ్నించడం ఏమిటి. వారి హయంలో సింగరేణిలో అవినీతి జరగలేదా? ఒక్క సింగరేణిలోనే కాదు.. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ విభాగంలో అవినీతి జరగడం లేదో చెప్పాలి?..’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. -
ఎంతకాలం గుజరాత్కు గులాంలుగా ఉంటారు?
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు కూడా గెలిస్తేనే కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యారు. ఆయన సబర్మతీ రివర్ఫ్రంట్ కడితే ఆహా.. ఓహో.. అబ్బా అని పొగుడుతారు. కానీ మనకు అవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ను మాత్రం అడ్డుకుంటారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు ఎంపీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్రావు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కారా? మన అభివృద్ధికి, మన ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎందుకు ప్రయత్నించరు? ఎంతకాలం గుజరాత్కు గులాంలుగా ఉంటారు? ఈ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడి ఎంపీలకు లేదా? నగర తాగునీటి అవసరాలకు గోదావరి, సింగూరు జలాలు, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్, మూసీ ప్రక్షాళనలకు అనుమతులు, నిధుల కోసం ఎందుకు పాటుపడరు?..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు.‘మున్సిపల్ వార్డు ఎన్నికలకు సైతం మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. ఇక్కడి మన మోరీలో మురికి తీయాలంటే మోదీ వస్తారా? అందుబాటులో ఉండి పనులు చేసేవారిని, ఇక్కడి సమస్యలు తెలిపిన వారిని గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి..’ అని అన్నారు. ‘పదేపదే నేనేం చేశాననిఅడుగుతున్న వాళ్లు.. ప్రస్తుతం ఫామ్హౌస్లో ఉన్న కేసీఆర్ పదేళ్లలో, ప్రధాని మోదీ పన్నెండేళ్లలో ఏం చేశారో చెబితే.. గత రెండేళ్లలో నేనేం చేశానో చెబుతా. ఈ అంశంపై అసెంబ్లీలో నాలుగు రోజులు చర్చ పెడతాం. నేనేం చేశానో, ఏం ప్రణాళికలున్నాయో పీఏసీ చైర్మన్ గాంధీతోనే చెప్పిస్తా..’ అని చెప్పారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మియాపూర్లో దాదాపు రూ.1,675 కోట్ల విలువైన..సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయ భవనం సహా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వివక్ష, వితండవాదం వద్దు ‘రాజకీయాలు, జెండాలు, అజెండాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వివక్ష, వితండవాదం లేకుండా ప్రతిపక్ష పారీ్టలు ముందుకు రావాలి. 2009 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు రాజకీయం చేద్దాం.. అప్పటిదాకా అభివృద్ధికి సహకరించాలి. చేతనైతే కేసీఆర్, కిషన్రెడ్డి విలువైన సూచనలివ్వాలే కానీ, అబద్ధాలు, అవినీతి, అహంకారంతో అడ్డుపడొద్దు. మీ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు.నేను ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రుల్ని కలిసిన ప్రతిసారీ మూడు రోజుల తర్వాత వారిని కలిసి.. పాలల్లో ఉప్పు వేసినట్లు.. పనులు చేస్తే ఆయనకే పేరొస్తదని కిషన్రెడ్డి చెడగొడతారు. ఇలాగే అభివృద్ధికి అడ్డం పడితే రాబోయే రోజుల్లో ప్రజలు పుట్టగతుల్లేకుండా తీర్పు ఇస్తారు. మీరు మళ్లీ ఢిల్లీ వెళ్లకుండా చేస్తారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావొద్దనే.. ‘ప్ర«దాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివసించే ఢిల్లీలో కాలుష్యం సమస్య. ముంబైలో వరదనీరు, ట్రాఫిక్, మురికివాడల సమస్యలు. ఐటీకి పేరెన్నికగన్న బెంగళూరులో ట్రాఫిక్ సమస్య. ఇంటినుంచి వెళ్తే ఎయిర్పోర్టుకు చేరేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. చెన్నైలో అపార్ట్మెంట్లు, కాలనీలు వర్షమొస్తే నీళ్లలోనే. కోల్కతాలో బయటకు వెళ్లినవారు ఇంటికి ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తెలియని శాంతిభద్రతల సమస్య. వాటి తీవ్రతను అర్థం చేసుకునే హైదరాబాద్కు ఆ దుస్థితి రాకుండా నిపుణుల సూచన మేరకు మూడు కార్పొరేషన్లు చేశాం. ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యేలా సరిహద్దులు నిర్ణయించాం..’ అని రేవంత్ తెలిపారు. పేదల కోసం లక్ష ఇళ్లు ‘కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఆడబిడ్డలు.. ఆదానీ, అంబానీలతో, కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడుతున్నారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు పెట్రోలు బంకుల నిర్వహిస్తున్నారు. అమెజాన్లో ఇందిరా మహిళాశక్తి స్టాల్స్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఆడబిడ్డలకు ప్రథమ ప్రాధాన్యం, నిరుద్యోగ యువతకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్పోర్ట్స్ స్కూళ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నాం. మహానగరంలో పేదల కోసం లక్ష ఎల్ఐజీ, ఎంఐఈ ఇళ్లు కడతాం. గాజుల రామారంలో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెరి్మనల్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాజుల రామారంలో వెయ్యి ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెరి్మనల్ పనులు త్వరలో ప్రారంభించనున్నాం. సీఎంసీ కార్యాలయాన్ని సైతం ఐటీ కార్పొరేట్ కంపెనీల కార్యాలయాలను తలపించేలా నెట్జీరోగా నిర్మిస్తాం..’ అని సీఎం చెప్పారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ..రాబోయే కాలంలో విశ్వనగరంగా ఎదిగేందుకు పనులు చేపడతామని చెప్పారు. శేరిలింగంపల్లిలో 1,500 ఐటీ సంస్థలు ఉండగా, 10 లక్షల మంది పనిచేస్తున్నారని, వారికి రవాణా, మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుదని అన్నారు. ఒకేచోట 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన గచ్చిబౌలి: సీఎంసీ, విద్యాశాఖ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ శాఖల నిధులతో ఒకేచోట 11 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. మియాపూర్లోని లక్ష్మీనగర్లో వేదిక వద్ద ఈ మేరకు 11 శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. సీఎంసీ ప్రధాన కార్యాలయం, మియాపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్, శేరిలింగంపల్లి ఆర్ఓబీ నిర్మాణం, ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన, పలు రోడ్లు, ఆర్వోబీలు, యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమానంతరం పక్కనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.కాగా ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేసిన శాలువ, బొకెతో సీఎం రేవంత్రెడ్డిని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సన్మానించారు. వాటర్ పెట్ బాటిల్స్ వ్యర్థాలతో శాలువ తయారు చేయగా, బొకెను షాంపు బాటిల్స్ వ్యర్థాలతో రూపొందించారు. ప్లాస్టక్ వ్యర్థాలతో తయారు చేసిన కుర్చిలలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు కూర్చున్నారు. దుండిగల్లో ఏర్పాటు చేయనున్న చెత్త ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ నమూనాను సీఎం పరిశీలించారు. -
పొలిమేర దాటనివ్వననడానికి రేవంత్రెడ్డి ఎవరు..?: డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులపై సీఎం రేవంత్కు చిత్తశుద్ధి లేదన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సోయిలేకుండా మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.‘‘పొలిమేర దాటనివ్వననడానికి అతను ఎవరు..? కలసికట్టుగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తాం. అలాగే, టీబీజేపీ నేతలమంతా ఐక్యంగానే ఉన్నాం. అందుకు ఎలాంటి అనుమానాలకు తావులేదు’’ అని డీకే అరుణ తెలిపారు. -
బీజేపీని ఎదుర్కొనే ధైర్యం విజయ్కు లేదా?
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ సీటు సరికొత్త హీటు పుట్టిస్తోంది. పార్టీ పుట్టి, అధికారంలోకి వచ్చాక తమ తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించింది విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే పార్టీ. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారం వెనుక కృతజ్ఞత కాదని.. రాజకీయ లెక్కలు ఉన్నాయని అంటోంది. ఆ విమర్శలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి.తమిళగ వెట్రి కళగం (TVK) తన తొలి రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించడంపై అధికార డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ఉద్దేశపూర్వకంగానే తన పార్టీ నేతలను రాజ్యసభకు పంపకుండా కాంగ్రెస్కు సీటు ఇచ్చారని ఆరోపించింది. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ పని చేశారని ఎద్దేవా చేసింది. డీఎంకే అధికార ప్రతినిధి శ్రవణన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాజ్యసభకు వెళ్తే ప్రతి జాతీయ అంశంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా నేరుగా పోరాడాల్సి ఉంటుంది. అందుకే టీవీకే నుంచి ఎవరినీ రాజ్యసభకు పంపలేదు" అని విమర్శించారు. విజయ్ బీజేపీపై తన అసలు రాజకీయ వైఖరిని బయటపెట్టేందుకు సిద్ధంగా లేరని.. పార్లమెంట్ వేదికపై బీజేపీని నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని భావించే ఆ బాధ్యతను కాంగ్రెస్పైకి నెట్టేశారని డీఎంకే ఆరోపిస్తోంది.If you go to Rajya Sabha you’ll have to take a stand on every issue. More importantly you have to oppose BJP directly. That’s the only reason no member from TVK was sent to Rajya Sabha. Let’s not forget that Mr. Vijay did not even meet the Congress leaders, Mrs. Sonia Gandhi,… pic.twitter.com/qZZnS7jGAM— Saravanan Annadurai (@saravofcl) June 3, 2026ఇదిలా ఉండగా.. తన తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచినట్లు టీవీకే చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇరు పార్టీల సంబంధాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా జరిగిన మంతనాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడినే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే డీఎంకే ఈ నిర్ణయాన్ని రాజకీయ వ్యూహంగా కాకుండా.. విజయ్ రాజకీయ సంకోచంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో తాము ముందుంటే, టీవీకే మాత్రం స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా ముందుకెళ్తోందని డీఎంకే వాదిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అసలు చర్చ రాజ్యసభ సీటు గురించి కాదు.. విజయ్ నిజంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కట్టుబడి ఉన్నారా? లేదంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలనుకుంటున్నారా? అన్నదే డీఎంకే లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు ఇచ్చిన ఒక రాజ్యసభ సీటు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద సిద్ధాంతపరమైన చర్చకు దారి తీసింది. డీఎంకే విమర్శలకు టీవీకే ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
మీనాక్షికి క్రాస్ఓటింగ్ గండం
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార బీజేపీకి కచ్చితంగా రెండు సీట్లు దక్కే పరిస్థితి ఉన్నప్పటికీ, ఇప్పుడు చర్చ అంతా మూడో స్థానం చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘మూడో సీటు వస్తుంది.. లేదంటే ఎక్కడికి వెళ్తుంది?’ అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ వ్యూహాలపై కొత్త చర్చకు తెరతీశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ పోటీ చేస్తున్నారు. మూడో స్థానం కోసం ఆమె పోటీపడుతున్నారు. మూడో స్థానం గెలిచేందుకు బీజేపీకి కేవలం 9 ఓట్లే అవసరం. దాంతో కాంగ్రెస్ను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ పోటీకి దిగారు. కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకొనే అవకాశాలు ఉండటంతో మీనాక్షి నటరాజన్ బరిలో నిలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు సులువుగా విజయం సాధించగలరు. ఆ పార్టీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. ‘పార్టీ ఆదేశిస్తే మూడో అభ్యర్థిని గెలిపించగలం’ అని బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ తేల్చిచెప్పారు. దీంతో క్రాస్ ఓటింగ్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో కలకలం మొదలైంది. మీనాక్షీ నటరాజన్ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత నరేష్ జ్ఞానచందానీ బహిరంగంగా ప్రశ్నించారు. ‘క్రాస్ ఓటింగ్ ప్రమాదం పొంచి ఉంది’ అని ఆయన హెచ్చరించడం కాంగ్రెస్లో ఆందోళనను మరింత పెంచింది. -
సీఎంకు ‘హిట్లర్’ సెగ!
సాక్షి, హైదరాబాద్: జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించగా, జాతీయ మీడియా సైతం ‘ఎమర్జెన్సీ మైండ్సెట్’గా అభివర్ణించింది. హిందూ గ్రూప్ శనివారం బెంగళూరులో నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ డైరెక్టర్ ఎన్.రామ్తో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి సంభాషిస్తూ పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు.‘హైడ్రా పదం హిట్లర్కు ఫేవరేట్ పదం. అతడి కోర్ టీమ్ పేరు హైడ్రా. ఎవరినైనా హతమార్చగలిగేది. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా అని పేరు పెట్టి ఒక సంస్థను స్థాపించాను. ఇప్పుడు మా దగ్గర ఎవరైనా జలవనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి..’ అని హైడ్రాపై అడిగిన ఓ ప్రశ్నకు సీఎం రేవంత్రెడ్డి బదులిచ్చారు. హైదరాబాద్ మహానగరం, పరిసర ప్రాంతాల్లో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఫుట్పాత్ల ఆక్రమణల నిర్మూలనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 2024లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో సంస్థను స్థాపించడం తెలిసిందే. ఇప్పటివరకు కబ్జాదారుల చెర నుంచి రూ. 80,000 కోట్ల విలువైన 2,182 ఎకరాల భూమిని స్వా«దీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హైడ్రా కార్యకలాపాలు ఆది నుంచి వివాదాలు, విమర్శలకు దారితీశాయి. రాష్ట్రంలో బుల్డోజర్ పాలన జరుగుతోందని ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఆరోపణలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహరించి వివాదాల్లో ఉన్న స్థలాల్లోని కట్టడాల కూల్చివేతలు చేపట్టడాన్ని యుద్ధ వాతావరణంతో రాష్ట్ర హైకోర్టు పోల్చింది. హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ను విచారణకు పిలిపించి మొట్టికాయలు సైతం వేసింది. హైడ్రా ఎడాపెడా కూల్చివేతలు జరుపుతుండటంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని విపక్షాలు ఆరోపణలూ చేశాయి. ఇప్పటికే హైడ్రా పనితీరుపై విమర్శలు, లెక్కలేనన్ని కోర్టు కేసులుండగా హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సంస్థకు నామకరణం చేసినట్లు సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం మరింత దూమారం రేపింది. హైడ్రా కూల్చివేతలను ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ విధ్వంసాలతో పోల్చడాన్ని విపక్షాలు విమర్శించాయి. బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు.. ‘హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వం మళ్లీ బహిర్గతమైంది. హిట్లర్ స్ఫూర్తి కలిగించాడని రేవంత్రెడ్డి బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎమర్జెన్సీ నుంచి హిట్లర్ వరకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రజలను అణచివేసింది. రేవంత్రెడ్డి సిగ్గుతో తలవంచి క్షమాపణ చెప్పాలి’ అని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. మరో కేంద్ర మంతికిరణ్ రిజిజు సైతం ‘ఎక్స్’లో ఘాటుగా స్పందించారు. ‘వాహ్.. కాంగ్రెస్ సీఎం హిట్లర్తో పూర్తిగా స్ఫూర్తి పొందారు. ఒకవేళ బీజేపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మా వ్యతిరేకులందరూ నాజీయిజం, ఫాసిజం అంటూ విమర్శలు చేసేవారు’ అని ఆయన విమర్శించారు. ‘ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ మొదలు రేవంత్రెడ్డి జర్నలిస్టులు, విద్యార్థులను అరెస్టు చేయడం వరకు.. ఇది కాంగ్రెస్ తానాషాహీ మనస్తత్వం’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తప్పుబట్టారు. ‘రాష్ట్ర ప్రజలకు ఇది ముందే తెలుసు. యావత్ దేశానికి స్పష్టత ఇచ్చినందుకు సీఎం రేవంత్కు కృతజ్ఞతలు’ అని కేటీఆర్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైడ్రాను రద్దు చేస్తూ తొలి ఫైల్పై సంతకం చేస్తామని గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హిట్లర్ కోర్ టీమ్కు హైడ్రా పేరు లేదు హిట్లర్ కోర్ టీమ్కు హైడ్రా అనే పేరు ఉన్నట్లు చరిత్రలో ఆధారాలు లేవని చరిత్రకారులు అభిప్రాయపడుతున్న ట్లు సౌత్ ఫస్ట్, మరికొన్ని వార్తాసంస్థలు పేర్కొన్నాయి. వాస్తవానికి 1943 ఆగస్టు 17–18 రాత్రి బ్రిటన్ ఆపరేషన్ హైడ్రా పేరుతో నాజీల వీ–ఆయుధ కార్యక్రమంపై బాంబు దాడి చేసిందని గుర్తుచేశాయి. మార్వెల్ కామిక్ పుస్తకం, సినిమాల్లోని ఊహాజనిత నియో–ఫాసిస్ట్ సంస్థ ‘హైడ్రా’తో సీఎం పొరబడినట్లు పేర్కొన్నాయి. -
హిట్లర్, తుగ్లక్ కలిస్తే ఆయనే..: ఏలేటి మహేశ్వర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హిట్లర్, తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానానికి గులాంగిరీ చేస్తున్నారని చెప్పారు.‘సాక్షి’తో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో తెలంగాణ నుంచే ఎఫ్సీఐ 60 శాతం ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ‘‘హిట్లర్ ప్లస్ తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అసమర్థ పాలన కొనసాగుతోంది. సోనియా గాంధీ కుటుంబానికి సలాం చేసేది రేవంత్ రెడ్డి.పదవి కాపాడుకోవడానికి సోనియాకు పన్నులు కడుతున్నారు. 11 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణ కట్టిన పన్నుల్లో 80 శాతం కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చింది. సోనియా కుటుంబం ముందుకు రేవంత్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారు’’ అని చెప్పారు. -
మారుదాం... మార్చుదాం..!
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై శుక్రవారం తన సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. ‘మారుదాం... మార్చుదాం’అనే నినాదంతో ఇకపై నూతన రాజకీయయాత్రను ఆరంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. బీజేపీ నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం ఒప్పుకుందని, తన రాజీనామాను బీజేపీ అగ్రనాయకత్వం శుక్రవారం అంగీకరించిందని అన్నామలై వెల్లడించారు. తన రాజీనామా, కొత్త రాజకీయ ఉద్యమాల వివరాలను ఫేస్బుక్ లైవ్స్ట్రీమింగ్ ద్వారా అన్నామలై వెల్లడించారు. ‘‘నా మార్గం వేరు. నా లక్ష్యాలు చాలా పెద్దవి. రాష్ట్రంలో ఒక సరికొత్త రాజకీయ సంస్కృతిని, సమున్నతమైన మార్పును తీసుకురావాలన్నదే నా ఆశయం. రాష్ట్రంలో కొత్త రాజకీయ ఉద్యమం అత్యావశ్యకమైంది. ఇది పేరుకు సంబంధించినది కాదు ఒక ఆలోచనకు సంబంధించినది. మనల్ని మనం ముందుకుగా మార్చుకుందాం. తర్వాత సమాజంలో మార్పు దానంతట అదే వస్తుంది. మన ఉద్యమానికి పునాది మనం మారుదాం. అంతా మార్చేద్దాం. ఫక్తు రాజకీయాలను మనం తుదముట్టిద్దాం. సామాన్యుడి రాజకీయాలు చేద్దాం. ప్రజావసరాలే మనకు పరమావధిగా ఉండాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో మనకు పోటీలేదు. ఎవరితోనూ పోటీపడేందుకు మనం లేం. అధికార పార్టీని, విపక్షాలను వాళ్ల రాజకీయాలు వాళ్లను చేసుకోనిద్దాం. మన సమయం వచ్చినప్పుడు మనం రాజకీయాలు చేద్దాం. మొదట రాజకీయ ఉద్యమాన్ని మొదలెడదాం. ఇందులో ఆసక్తి ఉన్నవాళ్లు wetheleader. org పోర్టల్ ద్వారా వలంటీర్లుగా సభ్యత్వం తీసుకోండి. మీకు రాజకీయాలు నేరి్పస్తా. త్వరలో కోయంబత్తూర్లో ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ సంస్థను ఆరంభించి శిక్షణనిస్తా. నేటి నుంచి కొత్త పథం. కొత్త ఉద్యమం. కొత్త రాజకీయపోరాటం’’అని వ్యాఖ్యానించారు. wetheleader. org పోర్టల్కు అనూహ్య స్పందన మొదలైంది. గంటల వ్యవధిలోనే 10లక్షలకుపైగా సభ్యత్వం తీసుకోవడం విశేషం. మనకు అన్ని పార్టీలూ ఒక్కటే.. ‘‘వ్యతిరేకించడం మన రాజకీయ వైఖరి కాదు. డీఎంకే, అన్నాడీఎంకే, ఎన్టీకే, సీమన్, పీఎంకే నేత అన్బుమణి, టీఎంసీ మూపనార్ జీకే వాసన్, ఏసీ షణ్ముగం, పారివేంద్రన్, జాన్ పాండియన్, కృష్ణస్వామి, వైగో, ప్రేమలతలను ఎలాగైతే ఇప్పుడు వ్యతిరేకిస్తానో ఇకపై బీజేపీనీ అలాగే వ్యతిరేకిస్తా. పార్టీని వీడేటప్పుడు తమిళనాడు పద్ధతి ప్రకారం గౌరవప్రదంగా కలిసి వివరించి బీజేపీ నుంచి ని్రష్కమించా. కేంద్ర మంత్రి అమిత్ షా సహా అగ్రనేతలను కలిసి పార్టీ వీడుతున్నట్లు స్పష్టంగా చెప్పా. 18 నెలల క్రితమే 2024 డిసెంబర్ 4న పార్టీకి తొలిసారి వివరించా. వద్దు అని వారించారు. మే చివరిదాకా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల బాధ్యతలు చూసుకోవాలని నన్ను ఆపేశారు. తమిళునిగా కొనసాగుతూ బీజేపీ నేతగా ఉండటం కష్టమైన పని’’అని అన్నారు. ఉక్కు వ్యవస్థను తీసుకొస్తా ‘‘పార్టీని పటిష్టమైన ఉక్కులాంటి వ్యవస్థను తీర్చిదిద్దుతా. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం మొదలు 30,000 స్థానిక సంస్థల్లోని ప్రతినిధుల దాకా ప్రతి ఒక్కరికీ పదవీకాలంపై పరిమితి విధిస్తా. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిసార్లు పోటీచేయొచ్చనే దానిపై పరిమితి తీసుకొస్తా. ఉద్యమం విజయవంతమయ్యాక రాజకీయ పార్టీగా మారి రాజకీయ ప్రస్థానం ఆరంభిస్తా. అధికార కుర్చీ ఎవరికీ శాశ్వతంకాదు. చివరకు నాక్కూడా. భారతీయునిగా కొనసాగుతూ తమిళుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తా. నా అభిమానులు, వారియర్లు ఆన్లైన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లే పనులు పెట్టుకోకండి. హద్దు మీరు వివాదాస్పద వ్యాఖ్యలు ఆన్లైన్లో చేయకండి’’అని అన్నామలై తన మద్దతుదారులకు సూచించారు. మాకు ఎలాంటి నష్టంలేదు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ అన్నామలై ని్రష్కమణతో పార్టీకి ఎలాంటి నష్టంలేదని బీజేపీ తమిళనాడు చీఫ్ నైనార్ నాగేంద్రన్ అన్నారు. ‘‘ఆయన రాజీనామాచేసినా పార్టీకి ఎలాంటి నష్టంలేదు. బీజేపీ ఏ విధంగానూ ఇబ్బందిపడబోదు. బీజేపీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ. సిద్ధాంతంపరంగా పార్టీ దృఢంగా ముందుకుసాగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు’’అని అన్నారు. బీజేపీ నుంచి అన్నామలై వెళ్లిపోవడాన్ని ఎండీఎంకే చీఫ్ దురై వైగో, కాంగ్రెస్ నేతలు, వీసీకే చీఫ్ థోల్ తిరుమావళవన్ స్వాగతించారు. -
తమిళనాడులో బీజేపీకి మరో బిగ్షాక్
సాక్షి,బెంగళూరు: తమిళనాడులో బీజేపీకి మరో బిగ్షాక్ తగిలింది. తమిళనాడులో బీజేపీకి మరో బిగ్షాక్ తగిలింది. తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చేసిన తర్వాత, ఆయన బాటలో మరికొందరు నేతలు కూడా పార్టీని వీడారు. ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ సహా కనీసం 15 మంది కీలక పదవుల్లో ఉన్న నాయకులు రాజీనామా చేశారు.కరు నాగరాజన్ 2016లో మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2017లో ఆర్కే నగర్ ఉపఎన్నికలో పోటీ చేశారు. అయితే రెండు సార్లూ ఘోర పరాజయం పాలయ్యారు. ముఖ్యంగా 2017 ఉపఎన్నికలో ఆయనకు వచ్చిన ఓట్లు నోటా కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఆ ఎన్నికలో ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ విజయం సాధించారు.ఇక బీజేపీకి రాజీనామా, రాజీనామాకు బీజేపీ పెద్దలు ఆమోదం తెలపడంపై అన్నామలై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాష్ట్రంలో తాను కొత్త ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అన్నామలై మక్కల్ ఇయ్యక్కం (AMI) పేరుతో ప్రారంభమైన ఈ ఉద్యమం 2031 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కల్ట్ పొలిటిక్స్ నుంచి బయటపడుతూ, సాధారణ ప్రజల రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నామలై స్పష్టం చేశారు.పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిఅన్నామలై ఈ వారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్లతో సమావేశమయ్యారు. తన రాజీనామా లేఖలో, తమిళనాడు రాజకీయ వ్యూహంపై పార్టీ నాయకత్వంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.అన్నామలై రాజకీయ ప్రయాణం కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి వీద ఫౌండర్ లీడర్స్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించారు. 2020లో బీజేపీలో చేరి, ఏడాదిలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై ఆయన చేసిన దూకుడు ప్రచారాలు, పాదయాత్రలు బీజేపీకి తమిళనాడులో గుర్తింపు తెచ్చాయి. అయితే 2026 ఎన్నికల్లో బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమి నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడంతో చివరికి ఆయన పార్టీని వీడారు. -
అన్నామలై రాజీనామాపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఎదిగి, ఆ పార్టీతో తన ప్రస్థానాన్ని ముగించుకున్న అన్నామలై వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ స్పందించారు. ప్రధానంగా అన్నామలై రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బీజేపీకి గుర్తింపు తెచ్చిన అన్నామలై పార్టీని వీడటం దురదృష్టకరమన్నారు. ‘ అన్నామలై ఆరేళ్ల కింద ఐపీఎస్కి రాజీమానా చేసి బీజేపీలో చేరారు. ఆయన తమిళనాడు లో బీజేపీకి గుర్తింపు తెచ్చాడు. అన్నామలై పార్టీని వీడడం దురదృష్టకరం. ఇలాంటి నేతలు పార్టీ వీడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా రాజీనామా ఇస్తే.. దానికి కారణం తెలుసుకోవాలి... వారిని పిలిచి మాట్లాడాలి. నాకు జరిగిందో అన్నామలై విషయంలో కూడా జరిగింది. తెలంగాణలో జరిగిన విషయాలనే కేంద్ర పెద్దలకు చెప్పాను. పెద్ద నాయకులను కలవడానికి ప్రయత్నం చేశా.. ఎవ్వరు కలవలేదు.. చివరకి పార్టీకి రాజీనామా ఇచ్చాను. కనీసం ఎందుకు రాజీనామా ఇచ్చావో అడగకుండా రాజీనామాను ఆమోదించారు. నేను బయటకి వచ్చి ఏడాది అయింది.. ఏ పార్టీ లోకి వెళ్ళలేదు.. వెళ్ళను కూడా. నాలాంటి, అన్నామలై లాంటి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత పార్టీ పై ఉంది. ఇలాంటి వాళ్ళు బాధ పడితే.. రాష్ట్ర, కేంద్ర నాయకులు పిలిచి మాట్లాడాలి’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:బీజేపీపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు.. -
బీజేపీకి గుడ్ బై అన్నామలై నెక్స్ట్ స్టెప్ ఏంటి?
-
సస్పెన్స్కు తెర.. బీజేపీకి అన్నామలై గుడ్బై
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత, రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావశీల నాయకుడిగా పేరున్న అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లు సమాచారం.పార్టీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో అన్నామలై రాజీనామా చేయబోతున్నారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో హైకమాండ్ ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకుని భేటీలు జరిపింది. అయితే ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. అంతర్గతంగా జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఆయన రాజీనామాను ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది.బిజెపి సభ్యత్వానికి అన్నామలై చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారని.. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. కే అన్నామలై.. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లలో వేగంగా ఎదిగిన యువ నాయకుల్లో ఒకరు. 1984 జూన్ 4న జన్మించిన ఆయన.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్లో ర్యాంక్ కొట్టారు. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో విధులు నిర్వహించారు. కఠినమైన, నిష్పాక్షిక అధికారిగా గుర్తింపు పొందిన ఆయన, కొంతకాలానికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.అలా మొదలైంది.. 2020 ఆగస్టులో బీజేపీలో చేరడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. యువతను ఆకర్షించే ప్రసంగాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తమిళనాడులో బీజేపీకి కొత్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే ఆ ఫలితంతో సంబంధం లేకుండా.. అదే ఏడాది ఆయనను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టి, డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. నొచ్చుకుని..రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్థిరమైన పట్టు సాధించడంలో సవాళ్లు ఎదురయ్యాయి. ఆపై లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడారాయన. అయినప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్, దూకుడు నాయకత్వం తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అన్నామలై.. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే పొత్తును ఆయన వద్దన్నారని.. ఆ ఎఫెక్ట్తోనే(పళనిస్వామి ఒత్తిడితోనే) ఆయన్ని బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోగా.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన క్రియాశీలకంగా కనిపించలేదు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత ఆయన బీజేపీని వీడబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలను తమిళనాడు బీజేపీ యూనిట్ తోసిపుచ్చుతూ వచ్చింది. మరోవైపు.. అన్నామలైని వదులుకోకూడదని మంచిది కాదని ఆరెస్సెస్ బీజేపీకి సూచిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు ఆయనతో చర్చించారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో తాజాగా ఆయన రాజీనామాను ఆమోదించింది.ఇక అన్నామలై తదుపరి అడుగు ఏమిటన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని అంచనా. మొత్తంగా, అన్నామలై రాజీనామాతో తమిళనాడు బీజేపీకి పెద్ద దెబ్బ తగిలినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
బీజేపీకి ఝలక్.. టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీ మూడు, జనసేన ఒక స్థానం కేటాయించుకున్నాయి. నాలుగింటిలో బీజేపీకి ఒక్క స్థానం ఇస్తారని ప్రచారం జరిగినా.. అది జరగలేదు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గురువారం జరిగిన ఎన్డీయే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రాజ్యసభ స్థానాల కేటాయింపు, రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆ వివరాలను పల్లా, మాధవ్, నాదెండ్ల కలిసి మీడియాకు వివరించారు. మూడు స్థానాలు టీడీపీ, ఒక స్థానం జనసేనకి కేటాయించాలని నిర్ణయించినట్టు చెప్పారు. జనసేన రాజ్యసభ అభ్యర్థిని పవన్కళ్యాణ్ ప్రకటిస్తారని మనోహర్ చెప్పారు. టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకీ ఉన్నట్టేనని మాధవ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై 9న తిరుపతి, 12న అమరావతి, 15న విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13, 16, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లాల్లో రెండేళ్ల పాలనపై కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని, త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. ‘సర్’ గురించి కూడా సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. గతంలో రెండు, రెండు గతంలో నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అయినప్పుడు టీడీపీ, బీజేపీ రెండు చొప్పున పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఖాళీ అవుతున్న నాలుగింటిలో మూడు తమ పార్టీకి కేటాయించాలని చంద్రబాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. గతంలో తమకు ఒక స్థానం కూడా దక్కలేదు కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వాలని పవన్కళ్యాణ్ కోరడంతో జనసేనకు ఒక స్థానం కేటాయించారు. టీడీపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కుతుండడంతో సానా సతీష్, కిలారు రాజేష్ కు ఇవ్వాలని ఈ సమావేశంలో లోకేశ్ చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ సతీష్, రాజేష్లలో ఒకరికే అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే కంభంపాటి రామ్మోహనరావు, భాష్యం రామకృష్ణ, డాక్టర్ దేవయ్య, ఓ మహిళా నేతల్లో ఒకరికి చాన్స్ ఉండొచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. గురువారం రాత్రి అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. జనసేనకు దక్కనున్న ఒక స్థానాన్ని పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు ఇవ్వనున్నట్టు తెలిసింది. -
తెలంగాణ నీళ్లు కర్ణాటకకు ధారాదత్తం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ తెలంగాణ నీటి వాటా ధారాదత్తం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. కృష్ణా జలాల్లో కర్ణాటకకు అదనపు వాటా లేకపోయినా రాయచూర్ వద్ద నిర్మిస్తున్న కోరకుంట ప్రాజెక్టుకు నీటి సరఫరాకు అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంతకం చేసిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మెప్పు పొందేందుకే డీకే శివకుమార్ సీఎం కాగానే రేవంత్ ఈ బహుమతినిచ్చారని విమర్శించారు. బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే వాతావరణం ఏర్పడడంతో..మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రధాన లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాల సాధనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని ధ్వజమెత్తారు. అభివృద్ధిపై కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నానని, రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పర్యటించి వచ్చి మాట్లాడదామా? అని అన్నారు. గురువారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ‘12 ఏళ్ల తెలంగాణ: ఆకాంక్షల సాధన– భవిష్యత్ ప్రయాణం’పై నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమంలో రాంచందర్రావు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ నేతృత్వంలో సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుదీర్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించగా.. రామచందర్రావు మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం వల్లే.. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలకు స్పష్టమైన పాలసీ లేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సర్కార్ రూ.1.30 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినా ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంటూ ప్రకటనలు చేస్తోంది. తాగు, సాగునీటిపై దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం వల్లే మన నీళ్లు ఇతర రాష్ట్రాలకు మళ్లుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కచ్చితంగా బీజేపీకి అధికారం కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేవలం హిందూ సమాజం అంశాన్నే ఎజెండాగా తీసుకోదు. అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమమే మా ప్రధాన ఎజెండా. గతంలో ఒక్క వార్డులో కూడా గెలవని త్రిపురలో ఇంకా హర్యానా, అస్సాంలలో మూడేసి సార్లు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లలో గెలిచిన బీజేపీ తెలంగాణలోనూ గెలిచి డబుల్ ఇంజిన్ సర్కార్ను ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ సాధనలో బీజేపీ చరిత్రాత్మకమైన పాత్రను పోషిస్తే, బీఆర్ఎస్, కాంగ్రెస్ సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ బిల్లు రూపకల్పన, సవరణల ప్రక్రియలో నేను ప్రత్యక్షంగా భాగస్వామినయ్యా. పార్టీ నేతల మధ్య విభేదాల్లేవు.. అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్సిటీని లక్ష నాగళ్లు పెట్టి దున్నిస్తామని చెప్పి, ఆ తర్వాత తెలంగాణ వ్యతిరేకులను బీఆర్ఎస్లో చేర్చుకుని ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో, సీపీఎం పార్టీలతో బీఆర్ఎస్ ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్వయంగా ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేయాల్సి రావడం దురదృష్టకరం. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్ ధర్మపురి సహా ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. సోషల్ మీడియాలో ’కాక్రోచ్ జనతా పార్టీ’ లాంటి దు్రష్పచారాల వెనుక అర్బన్ నక్సల్స్ శక్తులు పనిచేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోని రాజకీయ విధానాలు, అంశాలు, రాజకీయ ఎజెండా వేర్వేరుగా ఉంటాయి. వచ్చే జీహేచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఎన్నికల విధానాలు, పొత్తులు వంటివి జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. హైదరాబాద్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సభకు అనుమతినిస్తే సరిపోయేది. ఎలాంటి వివాదానికి ఆస్కారం ఉండేది కాదు. హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇళ్లకు ప్రధాని మోదీ వెళ్లినప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
'అన్నామలై రాజీనామా చేయలేదు'
చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై విషయం గత కొద్ది రోజులుగా హాట్ టాఫిక్గా మారింది. ఆయన పార్టీని వీడుతున్నారని త్వరలోనే ఒక కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని పుకార్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు. అన్నామలై బీజేపీకి రాజీనామా చేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవాలని ఆయన రాజీనామా చేయలేదని కొట్టిపేడేశారు.నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. "అన్నామలై బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ కేవలం ఆధారాలు లేని పుకార్లు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నాకు ఆయన నుంచి ఎలాంటి రాజీనామా లేఖ అందలేదు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. కొత్త పార్టీ పెట్టే విషయంపై అన్నామలై ఎవరితోనూ మాట్లాడలేదు. మేము కూడా ఆయనతో ఈ విషయం మాట్లాడలేదు, ఆయన కూడా మాతో ప్రస్తావించలేదు. ఆయన రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం, వాటిలో ఎలాంటి నిజం లేదు, అవన్నీ కేవలం వదంతులు మాత్రమే." అని నాగేంద్రన్ అన్నారు. ఈ క్రమంలోనే అన్నామలైకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.ఇటీవలే న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీ అయ్యారు. తదుపరి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఐదు పేజీల లేఖను ఆయనకు సమర్పించారు. అయితే ఆయన రాజీనామాను బీజేపీ ఇంతవరకూ ఆమోదింపలేదు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఈ విధంగా వ్యాఖ్యానించారు.కాగా ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నామలైను పూర్తిగా సైడ్ట్రాక్ చేసింది. ఆయన అభిప్రాయాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీజేపీ అన్నామలైని శాంతిపజేసే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల
ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, గుజరాత్ నుంచి రాజుభాయ్ శుక్లా, ముకేశ్ భాయ్ రత్వ, మాన్సింగ్, జితేంద్ర మేక్జి భాయ్, మణిపూర్ నుంచి శారదా దేవి, రాజస్థాన్ నుంచి ఆల్క గుర్జర్, సతీష్ పునియా ,ఒడిశా నుంచి దేభాషిస్ సమంతరే, లు పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది.కాగా ఇటీవలే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న పెద్దల సభకు ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే రోజున ఫలితాలుంటాయి. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నామినేషన్ దాఖలుకు జూన్ 8 చివరితేదీ కాగా జూన్ 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్ 11 వరకూ విత్డ్రాకు సమయముంటుంది. జూన్ 20తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది -
ఏం మాట్లాడుతున్నారు మీరు.. పవన్ మా పార్టనర్, అలా మాట్లడరు.. మీరే సృష్టించారు
-
టీఎంసీని కాపాడే పనిలో బీజేపీ!?
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ బలహీనపడితే ఆనందపడటం సహజం. ఆ పార్టీ చీలిపోతే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, బీజేపీ మాత్రం ఆ పార్టీ పూర్తిగా కూలిపోవాలని కోరుకోవడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే తాజా పరిణామాలు ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం టీఎంసీలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమైంది. పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేయడం, మమతా ఎంపిక చేసిన నాయకత్వానికి వ్యతిరేకంగా రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.టీఎంసీ ఆవిర్భావం తర్వాత ఇదే అతిపెద్ద అంతర్గత సంక్షోభంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ప్రత్యర్థి బీజేపీ దాడిని మరింత ఉధృతం చేయాలి. కానీ ఆశ్చర్యకరంగా అలా జరిగిన పరిస్థితి కనిపించడం లేదు. పైగా, టీఎంసీ పూర్తిగా కూలిపోవడం బీజేపీకి అంత మంచిది కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.టీఎంసీ కూలిపోతే బీజేపీకి నష్టమా?ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ ఉంది. టీఎంసీ బలహీనపడితే రాజకీయంగా లాభపడాల్సింది బీజేపీ. కానీ బీజేపీలోని ఒక వర్గం మాత్రం టీఎంసీ పూర్తిగా కూలిపోవడం ప్రమాదకరమని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం వామపక్షాల పునరాగమనం.ఒకప్పుడు 34 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ను ఏలిన సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ గత కొన్నేళ్లుగా రాజకీయంగా దాదాపు కనుమరుగైంది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డోమ్కల్ అసెంబ్లీ స్థానంలో విజయం, ఫాల్టా రీపోల్లో 40 వేలకుపైగా ఓట్లు సాధించడం, మూతపడిన పార్టీ కార్యాలయాలు మళ్లీ తెరుచుకోవడం, కార్మిక సంఘాలు తిరిగి చురుకుగా మారడం వంటి పరిణామాలు వామపక్షాల పునరుజ్జీవనానికి సంకేతాలుగా చెబుతున్నారు.దీంతో ఇప్పుడు బీజేపీకి అసలు భయం మమతా బెనర్జీనా? లేక తిరిగి బలపడుతున్న లెఫ్ట్-కాంగ్రెస్ కూటమినా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.ఓటు బ్యాంక్ మొత్తం..గత రెండు ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగింది. అయితే టీఎంసీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే. దాని ప్రభావం ప్రధానంగా బెంగాల్కే పరిమితం. కానీ కాంగ్రెస్, సీపీఎం వంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఉనికిని కలిగి ఉన్నాయి.ఒకవేళ టీఎంసీ పూర్తిగా కూలిపోతే, దాని ఓటు బ్యాంక్లో గణనీయమైన భాగం లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని బీజేపీలోని కొందరు నేతలు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లెఫ్ట్ ఓటర్లలో గణనీయమైన వర్గాన్ని తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని లెఫ్ట్ టీఎంసీ ఓటర్లపై ప్రయోగిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి.అందుకే చేరికలకు విముఖత?టీఎంసీలో అసంతృప్తి పెరుగుతున్నా, తిరుగుబాటు నేతలను పెద్దఎత్తున బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, టీఎంసీ ఎమ్మెల్యేలను భారీ సంఖ్యలో చేర్చుకుంటే ఆ పార్టీ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఆ దిశగా అడుగులు వేయకుండా జాగ్రత్త పడుతోంది.బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ సైతం ఒక సందర్భంలో "కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు వెంటనే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అలాంటి చర్య జరగలేదు. టీఎంసీ నుంచి వచ్చే వారిని విచక్షణారహితంగా చేర్చుకోవద్దని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా బహిరంగంగానే చెబుతోంది.ఈ పరిస్థితిని కొందరు రాజకీయ పరిశీలకులు "టీఎంసీని పూర్తిగా కూల్చకుండా నియంత్రిత బలహీనతలో ఉంచే వ్యూహం"గా అభివర్ణిస్తున్నారు.ఒడిశా మోడల్ ఇప్పుడు బెంగాల్లోనా?ఈ చర్చల్లో మరో ఉదాహరణ కూడా తరచూ వినిపిస్తోంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న తర్వాత కూడా పూర్తిగా చీలిపోకుండా నిలబడగలిగింది. కాంగ్రెస్ పునరాగమనాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పరోక్షంగా బీజేడీని నిలబెట్టిందన్న విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి.ఇప్పుడు అదే తరహా వ్యూహం బెంగాల్లోనూ అమలవుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఎంసీ బలహీనపడాలి కానీ పూర్తిగా కూలిపోకూడదు. ఎందుకంటే ఆ ఖాళీని లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి భర్తీ చేస్తే అది భవిష్యత్తులో బీజేపీకి మరింత పెద్ద రాజకీయ సవాలుగా మారవచ్చన్నది ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా చెబుతున్నారు.అసలు పోరాటం ఇప్పుడే మొదలైందిప్రస్తుతం బెంగాల్ రాజకీయాలను పరిశీలిస్తే, ఇది ఇక టీఎంసీ వర్సెస్ బీజేపీ పోరాటం మాత్రమే కాదు. టీఎంసీ బలహీనతతో ఏర్పడే రాజకీయ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? అన్నదే అసలు ప్రశ్నగా మారింది. ఒకవైపు మమతా బెనర్జీ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. బీజేపీ మాత్రం టీఎంసీని ఓడించాలని కోరుకుంటూనే, అది పూర్తిగా కనుమరుగవ్వకూడదని భావిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అందుకే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఒక్కటే.. "టీఎంసీని కూల్చేయగల శక్తి బీజేపీకి ఉన్నా... కాపాడే వ్యూహాన్నే ఎంచుకుందా?". రానున్న రోజుల్లో బెంగాల్ రాజకీయాల దిశను నిర్ణయించేది ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే కావొచ్చు. -
‘‘ఒకే ఒక్క స్పష్టమైన సమాధానం కోసం డిమాండ్ చేస్తున్నాం’’
హైదరాబాద్: తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకుంటోందంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అవినీతి ముఖ్యమంత్రా? లేక బీజేపీ 'కోవర్ట్' మిత్రుడా? అని నిలదీస్తూ ట్వీట్ చేశారు.‘‘ఒకవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా బహిరంగంగానే రేవంత్ రెడ్డిని "ఛోటే భాయ్" (తమ్ముడు) అని సంబోధిస్తూ, “హమ్సే జుడ్ జావో" (మాతో కలిసిపోండి) అంటూ అప్యాయంగా ఆహ్వానిస్తారు. మరోవైపు, అదే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో కూర్చుని.. "రేవంత్ రెడ్డి అవినీతిపరుడు, తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన ఏటీఎంలా వాడుకుంటోంది" అంటూ ఒక పొలిటికల్ స్క్రిప్ట్ చదువుతారు!అసలు ఇది మీ జాతీయ విధానమా? లేక రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్తో కలిసి మీరు ఆడుతున్న కుమ్మక్కు రాజకీయ నాటకమా (మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా)? పరస్పర విరుద్ధంగా పదే పదే మారుతున్న ఈ ప్రకటనలు, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం ప్రదర్శిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను, బీజేపీ- తెలంగాణ కాంగ్రెస్ లోపాయికారీగా ఒకరితో ఒకరు చేతులు కలిపారనే నిజాన్ని స్పష్టంగా బట్టబయలు చేస్తున్నాయి.ఇది ఒక ప్రమాదకరమైన రాజకీయ వ్యూహానికి అద్దం పడుతోంది. బయట ప్రపంచానికి తాము ప్రతిపక్షం అని చెప్పుకుంటూ, నాటకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. తెరవెనుక మాత్రం ఆయనను రేపు పొద్దున తమ వైపు తిప్పుకోబోయే ఒక సంభావ్య ఫిరాయింపుదారుడిగా (Turncoat), అస్సాంలో హిమంత బిస్వా శర్మ లేదా పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి తరహా నాయకుడిగా బీజేపీ సిద్ధం చేస్తోంది.తెలంగాణ సమాజం, ఈ దేశ ప్రజలు బీజేపీని సూటిగా ఒకే ఒక్క స్పష్టమైన సమాధానం కోసం డిమాండ్ చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి మీ దృష్టిలో జైలుకు వెళ్లాల్సిన కాంగ్రెస్ పార్టీ అవినీతి ముఖ్యమంత్రా? లేక మీ పార్టీలో చేరాల్సిందిగా మీరు బహిరంగంగా ఆహ్వానిస్తున్న (హమ్సే జుడ్ జావో) మీ 'కోవర్ట్ మిత్రుడా ' (Covert Friend)? దేశ ప్రజలు ఈ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు!’’ అని అన్నారు. -
రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా?
తమిళనాడు రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిన ‘అన్నామలై రాజీనామా’ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. బీజేపీని వీడబోతున్నారన్న ఊహాగానాల మధ్య ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారాయన. అయితే ఆయన తన రాజీనామా లేఖ అందించారనే ప్రచారం జోరుగా జరుగుతుండగా.. అసలు అలాంటి చర్చే జరగలేదన్న సమాచారం బయటకు వచ్చింది. దీంతో అసలు అన్నామలై వ్యూహం ఏమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి గుడ్బై చెప్పనున్నారన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఆయన ఢిల్లీలో మకాం వేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లతో భేటీ కావడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తన అసంతృప్తిని నేరుగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సమావేశాల్లో రాజీనామా అంశం ప్రస్తావనకే రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బదులుగా తమిళనాడులో పార్టీ పరిస్థితి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఏఐఏడీఎంకేతో పొత్తు ప్రభావం వంటి అంశాలపై అన్నామలై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారన్నది ఉత్త ప్రచారంగా తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని అన్నామలై ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఏఐఏడీఎంకేతో పొత్తు పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతోందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడం కూడా ఆయన అసంతృప్తికి కారణమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అంతేకాదు, రాష్ట్ర బీజేపీ నేతలు, మిత్రపక్ష నేతల్లో కొందరి వైఖరిపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామని, రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ను కూడా ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు వచ్చాయి. రేపు అన్నామలై చెన్నైకి వస్తారని ఆయన అనుచర గణం చెబుతోంది. దీంతో ఆయన స్పందిస్తేనే.. ఈ ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, అన్నామలై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది బీజేపీకి అనుబంధంగా ఉంటుందా? లేదంటే కొత్తగా పార్టీ పెట్టడం, లేదంటే పార్టీ కంటే ముందుగా ఒక సామాజిక-ప్రజా వేదికను నిర్మించడంపై ఉంటుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. యువతతో పాటు వివిధ వర్గాల వారిని కలుపుకోవాలన్న వ్యూహంపై ఆయన దృష్టి పెట్టినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో అన్నామలై ఆలోచనలు కేవలం పదవుల చుట్టూ కాకుండా, భవిష్యత్ రాజకీయ ప్రణాళికల వైపు సాగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
బీజేపీకి అన్నామలై రాజీనామా..
-
తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం..!
సాక్షి, చెన్నై: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఒక యువతిపై తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక నేతలు సామూహిక లైంగిక ఒడిగట్టిన ఉదంతం తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. శాంతిభద్రతల వైఫల్యంపై , మహిళల భద్రతపై ప్రస్తుత సీఎం విజయ్ లక్ష్యంగా డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. వివరాలు.. తూత్తుక్కుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని ఆరుముగమంగళం ప్రాంతానికి చెందిన టీవీకే తూత్తుకుడి పశ్చిమ జిల్లా యువజన విభాగం నిర్వాహకుడు బాలమురుగన్, రామనాథపురం ప్రాంతానికి చెందిన టీవీకే ప్రతినిధి జయపాల్ ఇద్దరూ కలిసి.. శ్రీవైకుంఠం పరిధిలోని ఒక యువతికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. అనంతరం ఆమెను మోసగించి, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం మంగళవారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. దుమ్మెత్తి పోసిన ప్రతి పక్షాలు ఈ ఘటనను అస్త్రంగాచేసుకుని సీఎం విజయ్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాయి. డీఎంకే మాజీ మంత్రి గీతా జీవన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలైలు వేర్వేరుగా స్పందిస్తూ, శ్రీవైకుంఠం వద్ద యువతిపై టీవీకే నేతలు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తోందని మండిపడ్డారు. ఈ అఘాయిత్యాలకు టీవీకే శ్రేణులే పాల్పడుతుండటం బట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజల రక్షణను ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సీఎం విజయ్ కేవలం పేజీల కొద్ది డైలాగులతో వ్యాఖ్యల తూటాలను పేల్చుతున్నారేగానీ, ఆచరణలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో మహిళల రక్షణ గురించి గొప్పగా మాట్లాడిన విజయ్.. ఇప్పుడు తన పార్టీ నేతలే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇదేనా తమరి మార్పు అని నిలదీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ ఏటీఎంగా తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు..అమరవీరుల స్వప్నాలను సాకారం చేసే సత్తా కేవలం బీజేపీకే ఉందని ఆ పార్టీ జాతీయ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన సొంత ఏటీఎంగా మార్చుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ, తెలంగాణ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వికసిత్ తెలంగాణ బీజేపీతోనే సాధ్యం: నితిన్ నబీన్ ‘జై తెలంగాణ‘నినాదంతో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కాంగ్రెస్ అవినీతి పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో ఒక అవినీతి ప్రభుత్వం పోయిందనుకుంటే, ఇప్పుడు అంతకంటే ఘోరమైన మరో అవినీతి సర్కార్ కొలువు దీరిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్కు కప్పంగా కడుతోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో గట్టిగా నిలబడ్డారని, వాజ్పేయి హయాం నుంచే బీజేపీ చిన్న రాష్ట్రాలకు మద్దతుగా ఉందన్నారు. తెలంగాణ వికాసం, సమృద్ధి కేవలం మోదీ నేతృత్వంలోని ‘వికసిత్ తెలంగాణ’తోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారమయ్యే వరకు బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ది ఊసరవెల్లి రాజకీయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి, వెనుక నుంచి మిర్చి పౌడర్లు, పెప్పర్ స్ప్రేలు కొట్టించిన ఊసరవెళ్లి రాజకీయాల చరిత్ర కాంగ్రెస్దని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. వందలాది మంది అమాయకుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. నాడు బీజేపీకి ఒక్క ఎంపీ లేకపోయినా సుష్మా స్వరాజ్ అండగా నిలిచారని గుర్తు చేశారు. ‘బంగారు తెలంగాణ’పేరుతో కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకొని, తీవ్ర అవినీతితో దోచిపెట్టారని విమర్శించారు. ఇప్పుడు వచి్చన రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడా దానికి మినహాయింపు ఏమీ కాదన్నారు. సహకారంతోనే ఉభయ రాష్ట్రాల ప్రగతి: రాంచందర్రావు తెలంగాణ కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు..అది అసంఖ్యాక త్యాగాల ఆత్మగౌరవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పేర్కొన్నారు. ‘వికసిత్ తెలంగాణ’–‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’లు పరస్పర స్నేహం, సంపూర్ణ సహకారంతో కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే ‘వికసిత్ భారత్’స్వప్నం సాకారమవుతుందని, రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎమర్జెన్సీ మైండ్ సెట్ను బయటపెట్టుకుందని రాంచందర్రావు విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒవైసీ సోదరులకు, అర్బన్ నక్సలైట్ల సభలకు అనుమతులిచ్చే ఈ ప్రభుత్వం పవన్ కల్యాణ్ సభను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. సెంటిమెంట్ రాజకీయం సాగదు: ఎంపీ రఘునందన్రావు ఏపీకి వెళ్లి మాజీమంత్రి రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఏమైందని ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. కేసీఆర్, రేవంత్రెడ్డిలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేయొచ్చు కానీ, పవన్ కల్యాణ్ వస్తే తప్పా? అని నిలదీశారు. ఉడత ఊపులకు బీజేపీ భయపడదని, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలనేదే తమ నినాదమని స్పష్టం చేశారు. -
దీదీ ఉక్కిరి బిక్కిరి.. బీజేపీలోకి 75 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు?!
కోల్కతా: 15ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ను పాలించిన మాజీ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు, అలాగే తాను స్థాపించిన పార్టీ చేజారిపోతుందేమోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 80 స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ 80 మంది ఎమ్మెల్యేలలో 70 మందికి పైగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి ఊతం ఇచ్చేలా సెంట్రల్ కోల్కతాలో మమతా చేపట్టిన నిరసన కార్యక్రమం వేదికైంది.అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ కార్యకర్తలపై దాడులు, కేసులు, ఇతర అంశాలపై మమతా బెనర్జీ మంగళవారం ఆందోళన చేపట్టారు. కానీ ఆ నిరసనకు 80 మంది ఎమ్మెల్యేలలో 75 మంది గైర్హాజరయ్యారు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే పాల్గొన్నారు.ఎస్ప్లనేడ్లో జరిగిన నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేలలో శోవన్దేబ్ చటోపాధ్యాయ్, నైనా బందోపాధ్యాయ్, మదన్ మిత్రా, అశోక్ దేబ్, అసిమా పాత్రా ఉన్నారు. మమతా పక్కన కనిపించిన ఎంపీలలో డోలా సేన్, కళ్యాణ్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్ ఉన్నారు. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.మరోవైపు మహారాష్ట్ర శివసేన తరహాలో టీఎంసీ కూడా రెండుగా చీలే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీలో చేరకపోయినా, పార్టీ గుర్తును మమతా బెనర్జీకి దూరం చేయాలన్న ఉద్దేశంతో బహిష్కృత నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. రీతబ్రత బెనర్జీ, సందీపన్ సాహా తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.శోభన్దేబ్ చటోపాధ్యాయ్ను ప్రతిపక్ష నాయకుడిగా ఆమోదిస్తూ రాసిన లేఖలో పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతకుముందు మమతా బెనర్జీ నివాసంలో జరిగిన సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది గైర్హాజరయ్యారు.అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో జరిగిన దాడి తర్వాత కూడా చాలా మంది టీఎంసీ నాయకులు బహిరంగంగా స్పందించలేదు. ఇప్పటికే 100 మందికి పైగా కౌన్సిలర్లు పార్టీని వీడగా, పలువురు నాయకులు ముఖ్యంగా అభిషేక్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేయడం కూడా పెద్ద దెబ్బగా మారింది. ఈ వరుస పరిణామాలతో టీఎంసీ భవిష్యత్తు అంధకారమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
పోరాడతాం లేదా చనిపోతాం: ధర్నాలో మమతా బెనర్జీ ప్రతిజ్ఞ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం కోల్కతాలో భారీ ధర్నా నిర్వహించారు. ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఎన్నికల తర్వాత జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు.మొదట ఎస్ప్లానేడ్లోని వై-చానెల్ వద్ద ధర్నా ప్రదేశానికి మమతా బెనర్జీ చేరుకున్నారు. పక్కనే ఉన్న రాణి రష్మోని రోడ్డులో నిరసన చేపట్టాలన్న టీఎంసీ విజ్ఞప్తిని కోల్కతా పోలీసులు తిరస్కరించారని పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “పోరాడతాం లేదా చనిపోతాం” అని ప్రతిజ్ఞ చేశారు. రాణి రష్మోని రోడ్డుపై నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై బీజేపీపై విమర్శలు గుప్పించారు. బుల్డోజర్ పాలిటిక్స్తో టీఎంసీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. “వేదిక ఏర్పాటు చేసుకునేందుకు, మైక్రోఫోన్లు ఉపయోగించేందుకు మాకు అనుమతి ఇవ్వలేదు” అని ఆమె మెగాఫోన్ ద్వారా మద్దతుదారులను ఉద్దేశించి చెప్పారు. నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. “బీజేపీ వ్యతిరేక పార్టీలు” త్వరలో ఢిల్లీలో సమావేశమై “దేశవ్యాప్త కార్యాచరణ”పై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలో వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు నినాదాలు చేయడంతో నిరసన ప్రాంగణం హోరెత్తింది.కోల్కతా మేయర్, ఎమ్మెల్యే ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, డెరెక్ ఓబ్రియన్, కల్యాణ్ బెనర్జీ, డోలా సేన్ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు మమతా బెనర్జీతో కలిసి పాల్గొన్నారు. గత శనివారం తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, ఎన్నికల అనంతర హింస, వీధి వ్యాపారుల తొలగింపునకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నామని మమతా బెనర్జీ తెలిపారు. ముందుగా నిర్ణయించినట్టు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా తనను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. -
50 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ? టీఎంసీ ఇక తమదేనంటూ..
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ను అంతర్గత సంక్షోభం కలవరపెడుతోంది. చీలిక దిశగా టీఎంసీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. 50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తారన్న అంచనాలు వస్తున్నాయి. టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత్ బెనర్జీ వద్దకు అసంతృప్త నేతలు వెళ్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కోల్కతాలో పలుసార్లు రహస్య సమావేశాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో కీలక సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరైన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 50 మందికి తిరుగుబాటు చేస్తే దీదీకి కష్టాలు మొదలవుతాయి. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపైనా భవిష్యత్తులో పోరు జరిగే అవకాశం ఉంది. బెంగాల్ రాజకీయాల్లో మమత నాయకత్వానికి కొత్త సవాల్ వస్తుంది. తాజా పరిణామాలు టీఎంసీ భవిష్యత్తు ఏంటన్న అంశంపై ఉత్కంఠ రేపుతున్నాయి.పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి పెరుగుతున్న వేళ ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసిన రిజు దత్తా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారని, ఇటీవల ఓ హోటల్లో సమావేశమయ్యారని చెప్పారు. తమ వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే, బెంగాల్లో “మహారాష్ట్ర మోడల్” తరహా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని కూడా ఆయన అన్నారు. కొందరు పార్టీ నాయకులు తమ సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీ స్పీకర్ను కలవనున్నారని కూడా చెప్పారు.బెంగాల్లో మహారాష్ట్ర నమూనా?బెంగాల్లో “మహారాష్ట్ర నమూనా” అమల్లో ఉందని రిజు దత్తా అన్నారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు ఏకమై మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారని తెలిపారు. “మా వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. నిజమైన తృణమూల్ కాంగ్రెస్ మాదే కాబట్టి, ప్రతిపక్ష నేతగా శోభన్దేవ్ చట్టోపాధ్యాయ్ కాదు, రితబ్రత బందోపాధ్యాయ్ ఉంటారు” అని రిజు దత్తా చెప్పారు. అలాగే, ఈ ఎమ్మెల్యేలే మెజారిటీగా ఉండడంతో పార్టీ గుర్తుపై కూడా తమకే హక్కు ఉండాలని ఆయన పేర్కొన్నారు. -
బీజేపీకి అన్నామలై రాజీనామా
సాక్షి,ఢిల్లీ: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు ఐదు పేజీల రాజీనామా లేఖ ఇచ్చారు. ఆ లేఖలో తమిళనాడులో బీజేపీ ఫెయిల్యూర్ గల కారణాల్ని వివరించారు. దీంతో పాటు ఐపీఎస్ పదవిని వదులుకొని బీజేపీలో చేరిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.మంగళవారం న్యూఢిల్లీలో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్నామలై తన రాజీనామా లేఖ అందించారు. రాజీనామాతో అన్నామలై బీజేపీ, ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సెక్యులర్, తమిళ్ ఫస్ట్ అనే నినాదంతో వచ్చే వారంలో పార్టీ ప్రకటన ఉండొచ్చని తమిళ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదనే వాదన ఆయన సన్నిహితుల ద్వారా బయటకొచ్చింది. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అసలు కారణం చెప్పేసిన అన్నామలై!
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం మరింత బలపడుతోంది. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో ఆయన భేటీ కావడం.. ఆ భేటీ సారాంశం బయటకు రావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.ఇకపై తాను సొంత రాజకీయ మార్గంలో ముందుకు సాగాలనుకుంటున్నట్లు అన్నామలై పార్టీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీతో స్నేహపూర్వకంగానే విడిపోవాలని కోరుకున్నప్పటికీ, ఆయనను బీజేపీలోనే కొనసాగించాలని అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నామలై మాత్రం తన నిర్ణయంపై దృఢంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత జరగబోయే ఉపఎన్నికల్లోనే అన్నామలై తన రాజకీయ బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందని తమిళనాట జోరుగా చర్చ మొదలైంది. ముఖ్యంగా.. తమిళగ వెట్రి కగళం అధినేత, సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చిలోనే అన్నామలై పోటీ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ.. తిరుచ్చిలో వీలు కాకుంటే అన్నాడీఎంకే నుంచి టీవీకేలో చేరిన ఎమ్మెల్యేల ప్లేస్లో ఉప ఎన్నికలు గనుక వస్తే.. ఏదో ఒక స్థానం నుంచి కూడా పోటీ చేయొచ్చని చర్చించుకుంటున్నారు.అన్నామలై నిష్క్రమణకు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకోవడం కూడా ఈ పరిణామాలకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అన్నామలై దూకుడు ప్రచారాలు, పాదయాత్రలు, సోషల్ మీడియా వ్యూహాలతో బీజేపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. తమిళనాడులో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపారు.అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ పొత్తు నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో మార్పులు కోరడంతో అన్నామలై అధ్యక్ష పదవి కోల్పోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విషయంలోనే ఆయన డీప్గా హర్టయినట్లు అధిష్టానానికి ఇచ్చిన తాజా వివరణతో స్పష్టమవుతోంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయకపోవడం, ప్రచారంలోనూ పెద్దగా కనిపించకపోవడం ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. బీజేపీకి గుడ్బై చెప్పి అన్నామలై తన దారి తాను చూసుకుంటారా? లేదంటే బుజ్జిగింపులకు లొంగిపోయి ఏదైనా ట్విస్ట్ ఇస్తూ బీజేపీతోనే కొనసాగుతారా?? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెర పడనుంది. -
అన్నామలైకి మైనస్సే! తమిళనాడులో కొత్త పార్టీ..?
-
బీజేపీ అంత సాహసం చేస్తుందా?
ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను శాసించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ).. ఇప్పుడు తన అస్తిత్వానికే పోరాడుతోందా? వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు సంకేతాలు, వేటులు, పార్టీ అంతర్గత విభేదాలు, బీజేపీ ప్రభావం.. ఈ పరిణామాలన్నీ టీఎంసీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని కాపాడగలిగేది మమతా బెనర్జీ ఒక్కరేనా? లేదంటే టీఎంసీ ఆమె చేతుల్లో నుంచి కూడా జారిపోతుందా? అనే చర్చ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 294 స్థానాల్లో 208 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా.. టీఎంసీ కేవలం 80 స్థానాలకు పరిమితమైంది. దాదాపు పదిహేనేళ్ల అధికారాన్ని కోల్పోయిన పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఫలితాల తర్వాతే టీఎంసీలో అసంతృప్తి బయటపడటం మొదలైంది. ఇటీవల మమతా నిర్వహించిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది హాజరుకాకపోవడం పార్టీ పరిస్థితిని స్పష్టంగా చూపించింది. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పరిస్థితి తీవ్రతను వెల్లడించింది.బహిరంగంగానే అంగీకారంపార్టీలో చీలిక తీసుకురావడానికి కుట్ర జరుగుతోందని మమతా బెనర్జీ స్వయంగా ఫేస్బుక్ లైవ్లో అంగీకరించారు. కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తెచ్చి పార్టీని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “నాయకులు భయపడవచ్చు.. కానీ కార్యకర్తలు భయపడరు. కార్యకర్తలు ఉన్నంతకాలం నేను పార్టీని మళ్లీ నిర్మిస్తా” అని ఆమె ప్రకటించారు.అభిషేక్పై అసంతృప్తి?పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలిపై కూడా టీఎంసీ సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పాత తరం నాయకులను పక్కనపెట్టి కొత్త బృందానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఎన్నికల వ్యూహ సంస్థ ఐ-ప్యాక్కు అధిక ప్రాధాన్యం కల్పించడం వల్ల మధ్యస్థాయి నాయకత్వం పార్టీకి దూరమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక మంది నేతలు ఎన్నికల ఓటమికి ఐ-ప్యాక్ వ్యూహాలే కారణమని కూడా ఆరోపిస్తున్నారు.పార్టీ నుంచి నిష్క్రమణల పరంపరఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్బై చెప్పారు. టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ పార్టీ పదవులకు రాజీనామా చేయడం పెద్ద చర్చకు దారితీసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు శంతను సేన్, సీనియర్ అధికార ప్రతినిధి అరూప్ చక్రవర్తి కూడా పదవులు వీడారు. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ, సినీ దర్శకుడు రాజ్ చక్రవర్తి, అసోం యూనిట్ మాజీ అధ్యక్షుడు అభిజిత్ మజుందార్ వంటి ప్రముఖులు పార్టీని పూర్తిగా విడిచిపెట్టారు. మరోవైపు వందకు పైగా కార్పొరేటర్లు కూడా టీఎంసీకి రాజీనామా చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఎందుకు దూరమవుతున్నారు?రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. టీఎంసీలో సిద్ధాంతపరమైన బలం ఎప్పటినుంచో బలహీనంగానే ఉంది. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను గెలుపు అవకాశాల కోసం పార్టీలోకి తీసుకువచ్చారు. వారు మమతా ఇమేజ్, టీఎంసీ బలంతో గెలిచినా.. పార్టీతో భావోద్వేగ అనుబంధం లేదంటే సిద్ధాంతపరమైన నిబద్ధత మాత్రం ఎక్కువగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి అధికారం కోల్పోయిన తర్వాత అలాంటి నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు వెతకడం సహజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.బీజేపీ అంత సాహసం చేస్తుందా?టీఎంసీ నేతల్లో చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఎంసీలో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు ప్రత్యామ్నాయ రాజకీయ ఆశ్రయాల కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అధికార పార్టీతో ఉండటం రాజకీయంగా లాభదాయకమని భావిస్తున్న నేతలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.అయితే టీఎంసీ నుంచి వచ్చే ప్రతి నేతకు బీజేపీ తలుపులు తెరుస్తుందా? అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. 2021 ఎన్నికల సమయంలో టీఎంసీ నుంచి భారీగా వచ్చిన నేతలకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం పార్టీకి మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పాత బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి పెరగడంతో పాటు, టీఎంసీ నుంచి వచ్చిన వారిని ప్రజలు పూర్తిగా నమ్మలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.అంతేకాకుండా అవినీతి, స్థానిక వివాదాలు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు మాజీ టీఎంసీ నేతలను చేర్చుకోవడం వల్ల బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు కేవలం సంఖ్యాబలం కోసం కాకుండా.. పార్టీకి రాజకీయంగా ఉపయోగపడే, ప్రజల్లో బలమైన గుర్తింపు ఉన్న నాయకుల విషయంలో మాత్రమే బీజేపీ ఆసక్తి చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు టీఎంసీ నుంచి బయటకు రావాలనుకునే నేతలకు కూడా బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ఆహ్వానం కనిపించడం లేదు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్న నేతలు కూడా కొంత గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం టీఎంసీలో అసంతృప్తి ఉన్నప్పటికీ.. అది వెంటనే బీజేపీలో భారీ చేరికలుగా మారుతుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేని అంశంగానే మిగిలింది.టీఎంసీకి మమతే బలం.. అదే బలహీనతటీఎంసీ అంటే మమతా.. మమతా అంటే టీఎంసీ అన్న స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగింది. అదే ఇప్పుడు పార్టీకి బలం కూడా, బలహీనత కూడా అయింది. ప్రత్యామ్నాయ నాయకత్వం కనిపించకపోవడం ఒకవైపు సానుకూల అంశమైతే.. మొత్తం పార్టీ ఒకే వ్యక్తిపై ఆధారపడటం మరోవైపు ప్రమాద సంకేతంగా మారింది. ప్రస్తుతం మమతా లేకుండా టీఎంసీని ఊహించడం కష్టమే. కానీ మమతా ఒక్కరే పార్టీని మళ్లీ గాడిలో పెట్టగలరా? అనే ప్రశ్న మాత్రం మరింత బలంగా వినిపిస్తోంది.అసలైన పరీక్ష ఇప్పుడేబెంగాల్ రాజకీయ చరిత్ర చూస్తే ఒకసారి అధికారాన్ని కోల్పోయిన పార్టీ మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు. కాంగ్రెస్, సీపీఎం వంటి దిగ్గజాలు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు టీఎంసీ కూడా అలాంటి మలుపు వద్ద నిలిచింది. ప్రస్తుతం మమతా బెనర్జీకి రెండు సవాళ్లు ఒకేసారి ఎదురయ్యాయి. బయట బీజేపీ బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతుండగా.. లోపల పార్టీ చీలికల ముప్పు వెంటాడుతోంది. 2029 లోక్సభ, 2031 అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని కాపాడటం, మళ్లీ కార్యకర్తల్లో నమ్మకం నింపడం ఆమె ముందున్న అతిపెద్ద పరీక్షగా మారింది. -
ఢిల్లీలో అన్నామలై.. రెండు రోజుల్లో జరిగేది ఇదేనా?
బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండురోజుల్లో అన్ని చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన మద్దతుదారులు పోస్టర్లను హోరెత్తిస్తున్నారు.ఈ పరిస్థితులలో చెన్నై నుంచి ఢిల్లీకి ఆయన బయలుదేరి వెళ్లారు. సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆయన బీజేపీ జెండా లేని కారులో రావడం చర్చకు దారి తీసింది. ఆయన్ని మీడియా ప్రతినిధులు చుట్టు ముట్టి ప్రశ్నలను సంధించగా, అన్నింటికి రెండురోజులలో సమాధానం చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటూ ముందుకెళ్లారు. కాగా, ఢిల్లీ వెళ్లిన అన్నామలై మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.కాగా, కె.అన్నామలై త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు సోమవారం తమిళనాట వార్తలు షికార్లు చేశాయి. వీటిపై ఆయన స్పందించలేదు. కానీ సోమవారం హడావుడిగా ఢిల్లీకి వెళ్లి పార్టీ చీఫ్ నితిన్ నబిన్తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. ఢిల్లీకి వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న అన్నామలైను మీడియా పలకరించింది. ‘‘రెండ్రోజుల్లో మనందరం కూర్చుని మాట్లాడుకుందాం. నా తదుపరి కార్యాచరణను మీకు తెలియజేస్తా’’అని చెప్పి వెళ్లిపోయారు.త్వరలో ఆయన సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వార్తలొచ్చాయి. బీజేపీలో తనకిక భవిష్యత్ లేదు అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్ ప్రభంజనం ధాటికి ప్రధాన ద్రవిడ పార్టీలు చెల్లాచెదురుకాగా బీజేపీ కేవలం ఒకే ఒక్క చోట విజయబావుటా ఎగరేసింది.జూన్ నాలుగోతేదీన అన్నామలై పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో అదేరోజున ఆయన తన రాజకీయ భవిష్యత్ నిర్ణయాలను వెలువరించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. 41 ఏళ్ల అన్నామలై 2011 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి. బెంగళూరు సౌత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్గా బదిలీచేసిన కాలంలో 2019లో హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామాచేసి తమిళనాడులో రాజకీయాల్లో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉంటూ మంచి పేరు సంపాదించారు. -
12 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి..!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెల రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ తరఫున వరుసగా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన ప్రధానిగా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నాయకత్వం, ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ‘విశ్వాసం–అభివృద్ధి–ప్రజా సంక్షేమం’నినాదంతో జూన్ 7 నుంచి 21 వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. జూన్ 8 నుంచి 14వ తేదీ వరకు ‘ప్రగతి పథ యాత్ర’లు, ‘వికసిత్ భారత్ సంకల్ప్’సదస్సులు నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి పదాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 12 ఏళ్ల మోదీ పాలన ప్రచార అంశాలతో పాటు, సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, కొత్త వారికి అవకాశాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అంశాలపై జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సోమవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించారు. ఇందులో పార్టీ ప్రచార కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీనియర్ నేతలతో ప్రత్యేక బృందాలు ప్రచారంలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అమలైన ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ నేతలు వివిధ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించనున్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, దేశ సమగ్ర అభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఐదు, జిల్లా స్థాయిలో నలుగురు సీనియర్ నాయకులతో ప్రత్యేక బృందాలను బీజేపీ ఏర్పాటు చేసింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఎంపీ తన లోక్సభ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రోజు, ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక రోజు పర్యటించనున్నారు. అలాగే వివిధ రంగాలకు చెందిన కనీసం 500 మంది ప్రముఖులను కలిసి ప్రభుత్వ విజయాలను వివరించే సమాచార పత్రాలను అందజేసి సన్మానించనున్నారు. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ వాయ్ వందన, పీఎం సూర్య ఘర్, పీఎం స్వనిధి, లక్పతి దీదీ, వీబీ–జీ–రామ్ పథకాల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు.సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఈ ప్రచార కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కొత్త జట్టుపై ముమ్మర కసరత్తు... పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఈ నెలలో ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాటి సమావేశంలో ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కొందరు ప్రస్తుత పదాధికారులకు మార్పులు ఉండవచ్చని, కొంతమంది కేంద్ర మంత్రులను సంస్థాగత బాధ్యతల్లోకి తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇందుకుగాను రాష్ట్రాల నుంచి ఆశావహుల జాబితాను సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా మోర్చా, యువమోర్చా విభాగాల్లో సమగ్ర పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయా పేర్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేక పునర్వ్యవస్థీకరణపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ఇక, 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల గడువు జూన్ 8తో ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపైనా భేటీలో రాష్ట్రాల నేతలు, అధ్యక్షుల నుంచి అధ్యక్షుడు నితిన్ నబీన్ అభిప్రాయాలు సేకరించినట్లు చెబుతున్నారు. -
బీజైపీకీ అన్నామలై గుడ్బై..?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కే అన్నామలై త్వరలోనే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అనంతరం త్వరలోనే సొంతంగా ఒక రాజకీయ ఉద్యమాన్ని, ఆ తర్వాత కొత్త పార్టీని స్థాపించే యోచనలో ఉన్నట్లు సమాచారం.బీజేపీ నేత అన్నామలైకి అధిష్ఠానంతో అస్సలు పొసగడంలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (2026) ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించినప్పటికీ, బీజేపీ అధిష్టానం మాత్రం తిరిగి AIADMKతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఒత్తిడి మేరకు అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన కనీసం పోటీ కూడా చేయకుండా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.ఈ నేపథ్యంలో పార్టీలో తనకు సరైన గుర్తింపు, భవిష్యత్తు లేవనే అసంతృప్తితో ఉన్న ఆయన ఈ విషయమై బీజేపీ జాతీయ నేత నితిన్ నబిన్తో సమావేశం కావడానికి నిన్న( సోమవారం) ఢిల్లీ పయనమయ్యారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను మీడియా ప్రతినిధులు పలకరించగా.. "దయచేసి రెండు రోజులు ఆగండి, మనం కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం" అని క్లుప్తంగా సమాధానమిచ్చారు. అయితే, ఆయన విమానాశ్రయానికి వచ్చిన వాహనానికి బీజేపీ జెండా లేకపోవడంతో ఆయమ పార్టీ మారనున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.ప్లాన్ సిద్ధమైందా..?కాగా జూన్ 4న అన్నామలై పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో ఇప్పటికే "మా నాయకుడా, వచ్చి మమ్మల్ని నడిపించు" అనే నినాదాలతో భారీ పోస్టర్లు వెలిశాయి. ఆయన ప్రస్తుతం నడిపిస్తోన్న "వి ది లీడర్స్" అనే స్వచ్ఛంద సంస్థ ఆధారంగా ఒక బలమైన నెట్వర్క్ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఉద్యమం చేపట్టి ఆపై దానిని ఒక రాజకీయ పార్టీగా మార్చేలా అన్నామలై వ్యూహం రచిస్తోన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అప్పట్లో పనిమనిషి.. నేటి నుంచి బెంగాల్ మంత్రి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఔస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కలితా మాఝీ అనే మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసిన ఆమె ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగారు. సోమవారం ఆమె రాష్ట్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు నెలకు ఆమె జీతం కేవలం రూ.2,500. ఇప్పుడు రాష్ట్ర బాధ్యతల్లో భాగస్వామి కావడం విశేషం.ప్రమాణ స్వీకారం అనంతరం కలితా మాఝీ మాట్లాడుతూ.. "మోదీజీ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. నేను ఎమ్మెల్యేని అవుతానని కూడా ఊహించలేదు. మంత్రిని అవుతానని అస్సలు అనుకోలేదు. 2014 నుంచి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంపైనే దృష్టి ఉండేది. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ బాధ్యత నా భుజాలపై ఉంది" అని తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలితా మాఝీ చదువును మధ్యలోనే నిలిపివేశారు. కుటుంబ పోషణ కోసం అనేక ఇళ్లలో పనిమనిషిగా చేశారు. ఆమె భర్త ప్లంబర్గా పనిచేస్తుండగా, కుమారుడు పార్థ్ ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నాడు.బూత్ స్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన కలితా మాఝీకి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2026లో మరోసారి అవకాశం కల్పించగా ఆమె విజయం సాధించారు.సోమవారం కోల్కతాలోని లోక్ భవన్లో గవర్నర్ ఆర్ఎన్ రవి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గ విస్తరణలో 13 మంది క్యాబినెట్ మంత్రులు, ముగ్గురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 19 మంది రాష్ట్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు.కాగా, బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి చెందిన శ్యామా ప్రసన్న లోహర్ను ఆ కలితా మాఝీ దాదాపు 12 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 207 స్థానాలను గెలుచుకుంది. టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. -
బీజేపీ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాం: సీఎం రేవంత్
ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామం (కొత్తగూడ)లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా రూ. 112. 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లను సైతం ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కాళేశ్వరం కూలేశ్వరమైంది. రూ. లక్ష కోట్లు గోదావరిలో పోసినట్లైంది. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తాం. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర సీఎంతో చర్చలకు యత్నిస్తున్నాం. మహారాష్ట్ర సీఎంతో మీటింగ్కు కిషన్రెడ్డి చొరవ చూపాలి. తుమ్మిడిహెట్టి నిర్మిస్తే లిఫ్ట్లు అవసరం లేదు.75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటున్నాం. మేం కొన్న ధాన్యాన్ని, మొక్కజొన్నను కేంద్రం తీసుకోవాలి.బీజేపీ నేతలు బస్సు యాత్రలు కాదు.. కేంద్రాన్ని ధాన్యం కొనమని చెప్పండి. లేదంటే అదేంటో తేలుస్తాం. ధాన్యాన్ని కిషన్రెడ్డి ఇంటి ముందు పారబోస్తాం. లేకపోతే ఈ నెల 15 తర్వాత బీజేపీ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాం’ అని హెచ్చరించారు. -
అన్నామలై సంచలన నిర్ణయం?
సాక్షి,చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసి త్వరలో కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఆయన అనుచరులు కూడా తమ నేతకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. కొత్త పార్టీ గురించి అన్నామలైని ప్రశ్నించగా.. రెండు మూడు రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తానని ఆయన తెలిపారు.ఇటీవల తమిళనాడులో పార్టీ అధ్యక్ష పదవి మార్పు, అనంతరం జరిగిన పరిణామాలపై అన్నామలై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తుపై అనేక అనుమానాలు తలెత్తాయి.అన్నామలై కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంటున్నప్పటికీ.. ఆయన ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీతో భేటీ కానుండడం చర్చనీయాంశమైంది. అయితే, ఆయన అనుచరులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు కేవలం పుకార్లేనని, అందులో వాస్తవం లేదని అంటున్నారు. ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, అన్నామలై స్థాపించబోయే పార్టీ పేరు ‘తమిళగ మక్కల్ శక్తి ఖచ్చి (టీఎంఎస్కే)’గా వినిపిస్తున్నప్పటికీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.బీజేపీ ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులను మార్చింది. తమిళనాడులో కూడా నాయకత్వ మార్పులపై చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో, ఈ నెల చివర్లో కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ స్థాపనపై వస్తున్న వదంతులు అన్నామలై కేంద్ర నాయకత్వం ముందు తన బేరసారాల స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహమని ఆయన ప్రత్యర్థులు గుసగుసలాడుతున్నారు.2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం, నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్ వంటి సీనియర్ బీజేపీ నాయకుల ప్రభావం తగ్గిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, అన్నామలై కోయంబత్తూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా.. ఆ స్థానంలో వనతి శ్రీనివాసన్కు అవకాశం ఇ ఇచ్చింది. దీంతో నిరాశకు గురైన అన్నామలై చివరికి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని గానీ లేదా కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని గానీ ఆశించే అవకాశంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.రాజీనామా నిజమేనా?అన్నామలై పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో పార్టీ అధినేత నితిన్ నబిన్కు తన నిర్ణయాన్ని తెలియజేయనున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న అన్నామలై, తన నిర్ణయాన్ని ఖరారు చేస్తూ నబిన్ను కలవనున్నారు.ఇప్పటికే తన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని, ఢిల్లీ పర్యటన కేవలం రాజకీయ సమావేశం కోసమే కాకుండా తన ఆరేళ్ల రాజకీయ జీవితం పట్ల కృతజ్ఞత తెలిపేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్నన్నారని, ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ తనకు కల్పించిన అవకాశాలు, అనుభవాలు, రాజకీయ ప్రయాణానికి సహకరించిన నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారని వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు
పెళ్లి అంటేనే హడావిడి..సందడిఅందులోనూ రాజకీయ నాయకుడిదైతే ఇక చెప్పేదేముంది. కానీ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా ఛత్తీస్గఢ్లోని బెమేతరా (Bemetara) బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు (Deepsh Sahu) వివాహం నిలుస్తోంది. అదీ ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద సామూహికంగా వివాహాలు చేసుకుంటున్న జంటలతో కలిసి, అత్యంత సాదాసీదాగా ప్రభుత్వ ఖర్చులతో పెళ్లి చేసుకోవడం చర్చకు దారితీసింది. నెట్టింట వైరల్గా మారింది.ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు. సామాజిక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన తరుణా సాహుతో కలిపి దీపేష్ సాహు ఏడు అడుగులు వేశారు. అంతేకాదు వీరి వివాహ ఊరేగింపు విలాసవంత మైన వాహనంలో కాకుండా, ఎద్దుల బండిపై సాగింది. ఈ వివాహ ఊరేగింపులో మరో ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు స్వయంగా ఎద్దుల బండిపై ప్రయాణించారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ రమణ్ సింగ్ కూడా హాజరై ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్రంలో ఈ వివాహ పథకం కింద ఒక ఎమ్మెల్యే వివాహం చేసుకోవడం ఇదే మొదటిసారి.ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా! తన పెళ్లి కబురును దీపేష్ ట్విటర్లో తన అభిమానులతో పంచుకున్నారు. ‘నా లైఫ్ పార్ట్నర్తో జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ప్రతి అడుగులోనూ కలిసి, ప్రతి ఆనందాన్ని పంచుకుంటూ, ప్రతి కష్టంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ — ఇదే మా కొత్త ప్రయాణం.’’ అంటూ అందరి ఆశీస్సులు, ప్రేమను కోరుకున్నారు.“ज़िंदगी का सबसे खूबसूरत सफर, अब मेरे जीवनसाथी के साथ शुरू हुआ है। ✨💛हर कदम पर साथ, हर खुशी में साझेदारी, और हर मुश्किल में एक-दूसरे का सहारा — यही है हमारा नया सफर। ❤️आप सभी के आशीर्वाद और प्रेम की अपेक्षा। 🙏#NewJourney #LifePartner #TogetherForever #WeddingVibes pic.twitter.com/LF2WXgnfrO— Dipesh Sahu (@DipeshSahuBJP) May 31, 2026వివాహాలలో ఆడంబరం, విలాసాలు పెరిగిపోతున్న ఈ కాలంలో, సామూహిక వివాహాలు సమాజానికి ఒక సానుకూల దిశను చూపే చొరవ అంటూ ఎమ్మెల్యే దీపేష్ సాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రశంసించారు. అనవసరపు ఆడంబరాలకు పోకుండా, వీలైతే ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకోవాలని దీపేష్ సాహూకి తానే గతంలో ఆయనకు సూచించానని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం కింద వచ్చిన నిధులను ప్రతిభావంతులైన బాలికా విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఇరవై మూడు జంటలకు వివాహాలు జరిగాయి. కాగా వధువు తరుణా సాహు తండ్రి డ్రైవర్, తల్లి గృహిణి.ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే! -
పవన్.. కొండగట్టు అంజన్నపై ఒట్టేసి చెప్పు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టనున్న ‘నవనిర్మాణ సంకల్ప సభ’ రాజకీయ దుమారానికి దారితీసింది. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు, ఆ తర్వాత కూడా తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయ, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన వ్యక్తికి ఇక్కడ నవనిర్మాణం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ వారి కనులు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో సభలు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి, అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడికి వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరన్నారు.తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం రాజకీయ నాటకమేనని విమర్శించారు. ‘‘కన్న తల్లికి గాజులు కొనలేని వాడు పినతల్లికి ఒడ్డాణం చేస్తాడనే సామెత ఉంది. ఆంధ్రప్రదేశ్లో చేయలేనిది తెలంగాణలో వచ్చి చేస్తాననడం విడ్డూరం’’ అని వ్యాఖ్యానించారు.పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభల వెనుక బీజేపీ రాజకీయ ఎజెండా ఉందని ఆరోపించిన పొన్నం.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, తమిళనాడుల్లో కాకుండా తెలంగాణనే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సామాజిక వైషమ్యాలు సృష్టించడం లక్ష్యంగా బీజేపీ డైరెక్షన్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు.‘‘సినిమాల్లో హీరోగా అభిమానించొచ్చు. కానీ రాజకీయాల్లో తెలంగాణ వ్యతిరేక ధోరణితో వస్తే నిలదీస్తాం. పవన్ కళ్యాణ్ సినిమా నటుడు. పైసలు ఇస్తే ఏ పాత్రనైనా పోషిస్తాడు. ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్కు తగ్గట్టే నటిస్తున్నాడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ కోసం పార్లమెంట్లో, ఉద్యమాల్లో, సకల జనుల సమ్మెలో వేలాది మంది పోరాడారని గుర్తుచేసిన మంత్రి పొన్నం.. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఎవరైనా కించపరిస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు పండుగరోజు అని, ఆ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఎవరైనా రావొచ్చని, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి ఇక్కడ రాజకీయ సభలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్తో తమకు సోదర సంబంధాలే ఉన్నాయని, అక్కడి ప్రజలపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. అయితే తెలంగాణపై విషం కక్కిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రేమ నటిస్తే ప్రజలు నమ్మరన్నారు. ‘‘బీజేపీ ఇచ్చే రెమ్యూనరేషన్ కోసం తెలంగాణకు రావడం లేదని నువ్వు నమ్మిన దేవుడు కొండగట్టు అంజన్నపై ప్రమాణం చేసి చెప్పగలవా పవన్ కళ్యాణ్?’’ అంటూ సవాల్ విసిరారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల అంశం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలపై స్పందించకుండా తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ‘‘సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదు.. నిజ జీవితంలో ప్రజల కోసం నిలబడాలి. ఏపీ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. ముందు అక్కడ నవనిర్మాణం చేసి చూపించు’’ అని హితవు పలికారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఆయన రాజకీయ ఉద్దేశాలను అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు -
సీబీఎస్ఈలో జేబు దొంగలు.. జాగ్రత్త!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తున్న ఆన్సర్ షీట్ స్కానింగ్, రీవ్యాల్యుయేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విద్యార్థుల సమాధాన పత్రాలను స్కానింగ్ చేయడంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవడానికి కూడా విద్యార్థుల నుంచే డబ్బు వసూలు చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు.ఈ సందర్భంగా ఎక్స్లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జేబుదొంగలతో జాగ్రత్త.. ఇప్పుడు వాళ్లు CBSEలోనే కూర్చున్నారు. బోర్డు తప్పు వల్ల మీ మార్కులు తప్పుగా నమోదైతే మీకు ఏమి దక్కుతుంది? ఒక బిల్లు మాత్రమే. డిజిటల్ స్కాన్డ్ కాపీకి ఒక్కో సబ్జెక్టుకు రూ.100, రీ-టోటలింగ్కు రూ.100, రీ-ఎవాల్యుయేషన్కు ఒక్కో ప్రశ్నకు రూ.25 చెల్లించాలి” అంటూ మండిపడ్డారు.जेबकतरों से सावधान - आज वो CBSE के अंदर बैठे हैं। CBSE की गलती से नंबर ग़लत आए तो आपको क्या मिलता है?एक bill:Digital scan copy: ₹100/विषयRe-totalling: ₹100/paperRe-evaluation: ₹25/सवालअपनी ही answer sheet की सही जाँच के लिए एक बच्चे को ₹2000 तक भरने पड़ सकते हैं।… pic.twitter.com/H0WS1xF6Zf— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2026సీబీఎస్ఈ పరీక్షల ఆన్సర్ షీట్ల స్కానింగ్, డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. విద్యార్థుల మార్కులు తప్పుగా అప్లోడ్ అవుతున్నాయని, వాటిని సరిచేయాలంటే మళ్లీ డబ్బు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. ఒక విద్యార్థి తన సమాధాన పత్రం సరిగ్గా మూల్యాంకనం అయ్యిందో లేదో నిర్ధారించుకోవడానికి సుమారు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.CBSE’s May 2025 tender required answer sheets to be scanned with automatic robotic scanners, spines preserved, at a minimum of 300 DPI.The tender re-issued in August quietly removed all of it. “Scanners” became generic. Resolution dropped to 200 DPI.Now we know what that… https://t.co/XXdorOi3oq— Rahul Gandhi (@RahulGandhi) May 31, 2026“తప్పు సీబీఎస్ఈది.. శిక్ష విద్యార్థికి.. లాభం ప్రభుత్వానికి” అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా చూస్తే తప్పులు సరిదిద్దబడవని, మరింత పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో ఎక్కువ నష్టం చవిచూస్తున్నది పిల్లలేనని, వారి సమయం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లు మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. దీనివల్ల పేజీలు మిస్ కావడం, బ్లర్ కాపీలు రావడం, సమాధాన పత్రాలు పూర్తిగా అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.ఎవరీ సార్ధక్ సిద్ధాంత్..ఈ వివాదానికి సంబంధించి రాహుల్ గాంధీ షేర్ చేసిన పోస్ట్లో ఉన్న అంశాలను బయటపెట్టిన వ్యక్తి జార్ఖండ్కు చెందిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్. సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో అందుబాటులో ఉన్న టెండర్ పత్రాలను పరిశీలించిన ఆ 17 ఏళ్ల కుర్రాడు.. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) కాంట్రాక్ట్ నిబంధనలను మూడు దశల్లో సడలించినట్లు ఆధారాలతో వెల్లడించాడు. ఈ మార్పులు ప్రత్యేకంగా హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాడు.సార్థక్ సిద్ధాంత్ తన వెబ్సైట్లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 2025 మేలో విడుదల చేసిన టెండర్లో ఆన్సర్ షీట్లను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లతో, కనీసం 300 DPI నాణ్యతతో స్కాన్ చేయాలని పేర్కొన్నారు. అయితే అదే టెండర్ను ఆగస్టులో మళ్లీ విడుదల చేసినప్పుడు ఆ నిబంధనలను సడలించి, స్కానర్ల ప్రస్తావనను సాధారణీకరించడంతో పాటు రిజల్యూషన్ను 200 DPIకు తగ్గించినట్లు వెల్లడించారు. అనంతరం ఆన్సర్ షీట్లను మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు బయటపడిందని, దీనివల్లే బ్లర్ కాపీలు, మిస్సింగ్ పేజీలు, స్కాన్ కాని సమాధాన పత్రాల సమస్యలు వచ్చాయని ఆరోపించారు.ఇక రాహుల్ గాంధీ కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థపై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో ఈ సంస్థ మరో పేరుతో వివాదాల్లో చిక్కుకుందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సమాధాన పత్రాల గందరగోళానికి సంబంధించిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నామని సీబీఎస్ఈ చెబుతోంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్లకు చెందిన నిపుణులతో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వ్యవస్థను సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.మొత్తంగా, లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన ఈ వివాదం దేశవ్యాప్తంగా విద్యా మూల్యాంకన వ్యవస్థ పారదర్శకత, సాంకేతిక ప్రమాణాలు, రీవ్యాల్యుయేషన్ ఫీజులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. -
కష్టకాలంలో దీదీ పార్టీ!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దారుణ పరాభవం. ఆ వెంటనే పార్టీ నేతలపై దాడులు. నిరసనలు.. వీధి పోరాటాల పిలుపు నేపథ్యంలో కీలక సమావేశానికి రావాలని స్వయంగా పార్టీ అధినేత్రి నుంచి ఆహ్వానం. కానీ ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేల డుమ్మా! దీంతో ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఒకటే చర్చ. అసలు టీఎంసీలో ఏమి జరుగుతోంది?.. ఇది కేవలం రాజకీయ ఉద్రిక్తతల ప్రభావమా? లేక మరేదైనా పెద్ద సంకేతమా?పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రస్తుతం రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడం కొత్త వివాదానికి తెరతీసింది. ఆ ఘటన తర్వాత పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కలీఘాట్ నివాసంలో అత్యవసరంగా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరిణామంతో మమత సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో.. చేసేది లేక సమావేశం వాయిదా వేశారు.సాధారణంగా రాజకీయ సంక్షోభ సమయంలో పార్టీ అధినేత పిలిస్తే శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అలాంటిది దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత టీఎంసీ ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఈ గైర్హాజరు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే టీఎంసీ దీనికి భిన్నమైన వివరణ ఇస్తోంది. అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని, పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనలను పర్యవేక్షిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు. పరిస్థితుల దృష్ట్యా సమావేశాన్ని వాయిదా వేయాలని వారే కోరారని, అందుకే పార్టీ అంగీకరించిందని చెప్పారు.కానీ ఈ వ్యవహారంలో రాజకీయంగా మరింత ఆసక్తికరమైన అంశం ఆరోపణలు-ప్రత్యారోపణలే. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి వెనుక బీజేపీ అనుకూల వర్గాల హస్తం ఉందని టీఎంసీ ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, దాడికి పాల్పడింది టీఎంసీకి చెందిన వర్గాలేనని ఎదురుదాడి చేస్తోంది. పార్టీ అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని కమలనాథులు విమర్శిస్తున్నారు.ఇక్కడే రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవేళ బీజేపీ చెబుతున్నట్లుగా ఈ ఘటన వెనుక నిజంగానే టీఎంసీ అంతర్గత వర్గాల ప్రమేయం ఉన్నట్లు తేలితే.. అది పార్టీకి పెద్ద రాజకీయ, సంస్థాగత సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత నాయకత్వం, వారసత్వం, భవిష్యత్ వ్యూహాలపై పార్టీలో అసంతృప్తి ఉందన్న ప్రచారానికి అప్పుడు మరింత బలం చేకూరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమావేశానికి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం కూడా అదే కోణంలో విశ్లేషణకు దారితీయొచ్చు.అయితే ప్రస్తుతం ఈ ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు. అందుకే టీఎంసీ, బీజేపీ రెండూ తమ తమ రాజకీయ కథనాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు అభిషేక్ బెనర్జీపై దాడిని ప్రజా ఉద్యమంగా మలచాలని టీఎంసీ భావిస్తుండగా, మరోవైపు అధికార పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎత్తిచూపాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో టీఎంసీ మరింత దూకుడైన ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. బ్లాక్ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు నిరసన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. కోల్కతాలో మమతా బెనర్జీ స్వయంగా పాల్గొనే ధర్నా కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఎన్నికల అనంతర హింస, కార్యకర్తలపై దాడులు, బుల్డోజర్ చర్యలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా చూస్తే.. అభిషేక్ బెనర్జీపై దాడి కంటే, ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది గైర్హాజరు కావడం, బీజేపీ-టీఎంసీ మధ్య ఆరోపణల యుద్ధం, వీధి పోరాటాలకు పార్టీ సిద్ధమవడం.. ఇవన్నీ కలిసి ఒక పెద్ద రాజకీయ కథకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అసలు ఇది కేవలం ఒక దాడి ఘటన ప్రభావమా? లేదంటే టీఎంసీలో జరుగుతున్న లోతైన రాజకీయ మార్పులకు సూచనా? అనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
బెంగాల్లో మళ్లీ హింస: టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
హుగ్లీ: పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చండితాల పోలీస్ స్టేషన్ వెలుపల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టుకు నిరసనగా టీఎంసీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి.ఘర్షణకు దారితీసిన పరిస్థితులుటీఎంసీ బృందం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, అదే సమయంలో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. రెండు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగడంతో పాటు పరిస్థితి భౌతిక దాడుల వరకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలు ‘చోర్-చోర్’ (దొంగ-దొంగ) అంటూ నినాదాలు చేస్తున్న సమయంలో, టీఎంసీ మద్దతుదారులకు, వారికి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరిందని సమాచారం. ఈ క్రమంలో జరిగిన దాడిలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ తలకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు.అధికార యంత్రాంగం అప్రమత్తంఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్టులు, ఆ తర్వాత జరిగిన ఈ ఘర్షణ ఘటన రాజకీయంగా మరింత దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. -
గెటప్ వెనుక కథ ఏమిటో!
కర్ణాటక: డీకే శివకుమార్ మామూలుగా గడ్డం అనేది లేకుండా ఉండేవారు. కానీ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయి తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన ప్రతిజ్ఞ పూని గడ్డం విడిచారు. తీహార్ జైలు నుంచి బయటికి వచ్చిన తరువాత గడ్డం గెటప్ అలాగే కొనసాగుతోంది. ఈ మార్పు గురించి విలేకరుల సమావేశాల్లో ప్రశ్నించినా డీకే శివకుమార్ సమాధానం చెప్పేవారు కాదు. గడ్డం వెనుక రహస్యం ‘సీఎం కుర్చీయే’ అని చర్చ జరుగుతుండేది. ఆయన త్వరలోనే షేవ్ చేసుకుంటారని, సెలూన్ వారి ద్వారా ఈ సమాచారం తెలిసిందని బీజేపీ పక్ష నేత అశోక్ అసెంబ్లీలోనూ చెప్పారు. గడ్డం పెంచడం వెనుక ప్రతిజ్ఞ ఏమిటని కూడా ప్రశ్నించారు. అజ్జయ్య స్వామి చెప్పినపుడు గడ్డం తీస్తారు అని మంత్రి కృష్ణ బైరేగౌడ సరదాగా సమాధానమిచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి గడ్డం తీసేస్తారా?, ప్రమాణ స్వీకారోత్సవంలో కొత్త కొత్త లుక్లో కనిపిస్తారా అనేది కుతూహలంగా ఉంది.


