breaking news
bjp
-
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో బెంగాల్ ప్రజల మనోగతం ఎలా ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా వెలువడిన ‘ఓట్ వైబ్’ (Vote Vibe) సర్వే ఫలితాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై మమతా బెనర్జీ పట్టు ఏ మేరకు ఉన్నదనేది ఈ సర్వే తేల్చిచెప్పింది.దీదీకే జై కొడుతున్న జనం!తాజా సర్వే వివరాల ప్రకారం బెంగాల్ ముఖ్యమంత్రిగా 42 శాతం మంది మమతా బెనర్జీ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారికి కేవలం 19 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఐప్యాక్ (ఐ-పాక్)సంస్థపై ఈడీ దాడులు జరిగినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పర్సెప్షన్ యుద్ధంలో గెలిచిందని, ముఖ్యంగా ముస్లిం ఓటర్ల మద్దతును పదిలపరుచుకుందని సర్వే పేర్కొంది.ప్రభుత్వ పనితీరుపై మిశ్రమ స్పందనమమత ప్రభుత్వ పనితీరుపై జనం భిన్నంగా స్పందిస్తున్నారు. సుమారు 34 శాతం మంది ‘అద్భుతం’ అని కితాబివ్వగా, 18 శాతం మంది మాత్రం ‘చాలా దారుణం’ అంటూ పెదవి విరిచారు. సర్వేలో అధికార పార్టీకి కొన్ని హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. దాదాపు 36 శాతం మంది ఓటర్లు నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. మరోవైపు టీఎంసీ.. అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న బీజేపీ ప్రచారాన్ని 47 శాతం మంది నమ్ముతుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, యువ ఓటర్లు టీఎంసీకి దూరమయ్యే అవకాశం ఉందని సర్వే హెచ్చరించింది.ఎన్నికల నగారాకు అంతా సిద్ధంవచ్చే వారం రోజుల్లో పశ్చిమ బెంగాల్తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే 294 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నదని సమాచారం. 2021లో భారీ మెజారిటీతో గెలిచిన దీదీ, ఈసారి నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటారా? లేక బెంగాల్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా? అనేది వేచి చూడాలి.ఇది కూడా చదవండి: శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’ -
టీడీపీ X బీజేపీ.. చేతులు దులుపుకున్న లోకేశ్
కదిరి: మిత్రపక్షమైన బీజేపీకి కనీస విలువ ఇవ్వకుండా టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుండటంతో కమలనాథులు భగ్గుమన్నారు. అధికారంలో పాలుపంచుకున్నారనే విషయాన్ని మరిచి బీజేపీ నేతలపై కక్షసాధింపులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ నేత పాల్గొనకూడదని శ్రీసత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అల్టిమేటం జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతటితో ఆగక బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎస్.విష్ణువర్ధన్రెడ్డిని ఏకంగా హౌస్ అరెస్ట్ చేయించడం ఇరుపార్టీ ల మధ్య వివాదాన్ని రగిల్చింది. వివరాల్లోకి వెళితే.. ఆధిపత్యం కోసం తంటాలు పడుతున్న కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్.విష్ణువర్ధన్రెడ్డిని కట్టడి చేసేందుకు ఏకంగా పోలీసులను ప్రయోగించారు. మంగళవారం జరిగిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనేందుకు బీజేపీ నేత విష్ణువర్ధన్కు అనుమతి ఇవ్వకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేయించారు. రథోత్సవంలో పాల్గొనవద్దని బీజేపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే గత నెలలోనే హుకుం జారీ చేశారు. దాంతో ఇది ఆధిపత్య పోరుకు దారి తీసింది. కల్యాణోత్సవం రోజు నుంచే కుట్ర ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత నెల 28న శ్రీవారి కల్యాణోత్సవం జరిగింది. ఆ రోజు బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే కందికుంట కంటపడ్డారు. ఆయన్ని ఇక్కడికి ఎవరు ఆహ్వానించారంటూ పోలీసులతో పాటు ఆలయ అధికారులపై ఆ రోజే ఎమ్మెల్యే కందికుంట ఆగ్రహం వ్యక్తం చేశారు. రథోత్సవం రోజున విష్ణు కనబడితే ఊరుకునేది లేదని పోలీసులకు హెచ్చరించినట్లు సమాచారం. మంగళవారం రథోత్సవంలో విష్ణును కనీసం తిరువీధుల్లోకి కూడా రానివ్వకుండా పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించినట్టు తెలుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కదిరిలో కందికుంట రాజ్యాంగం అమలవుతోంది. రెండేళ్లుగా బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డిని బ్రహ్మోత్సవాల్లో రథంపైకి రాకుండా ఎమ్మెల్యే ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉన్నారు. గత ఏడాది సైతం రథోత్సవం నాడు ఆయనను ఊరిలోకి రాకుండా పోలీసుల ద్వారా ముందే హెచ్చరికలు జారీ చేయించి ఇక్కడ కందికుంట రాజ్యాంగాన్ని అమలు చేయించారు. ఒకవేళ వస్తే తేరుపై నుండి కిందికి తోసేయడం ఖాయమని హెచ్చరికలు జారీ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇక్కడ రాజకీయం ఎలా చేయాలో నాకు తెలుసు’ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న బీజేపీ వర్గాలు పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి లోకేశ్ శ్రీసత్యసాయి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ద్వారా కదిరి ఎమ్మెల్యేకి ఫోన్ చేయించారు. ‘కూటమి పార్టీ నేతలతో ఇలా వ్యవహరిస్తే ఎలా?’ అని మంత్రి అనడంతో ‘నా నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఇక్కడ రాజకీయం ఎలా చేయాలో నాకు తెలుసు’ అంటూ ఎమ్మెల్యే కందికుంట ఫోన్ కట్ చేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కాగా, టీడీపీ వైఖరితో బీజేపీ నేతలు మండిపడుతున్నారు.దేవుడి దగ్గర రాజకీయం చేస్తావా? కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరిలో వ్యక్తిగత స్వార్థం కోసం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. నేను 30 ఏళ్లుగా ఏటా రథోత్సవం నాడు రథం కదలికలను భక్తులకు తెలియజేస్తూ ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తున్నా. ఈసారి నన్ను తేరుపైకి రాకుండా ముందురోజు రాత్రే నా ఇంటికి పోలీసు అధికారులను పంపారు. నేను అక్కడికి వెళితే గొడవలవుతాయని, అక్కడ ప్రాణహాని కూడా ఉందని పోలీసులతో చెప్పించారు. ఉదయాన్నే నా ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరింపజేసి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేయించారు. దేవుడి దగ్గర ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే నాశనమైపోతారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు క్షమించరు. – ఎస్.విష్ణువర్ధన్రెడ్డి, బీజేపీ నేత -
వస్తే దాడి చేస్తాం.. బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి హౌస్ అరెస్ట్
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో టీడీపీ-బీజేపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కదిరిలో ఆధిపత్యం కోంస టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ తంటాలు పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనేందుకు బీజేపీ నేత విష్ణువర్థన్కు పర్మిషన్ ఇవ్వలేదు. రథోత్సవరం పాల్గొనవద్దని బీజేపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. దాంతో ఇది కాస్తా ఆధిపత్య పోరుకు దారి తీసింది. గత కొన్నేళ్లుగా లక్ష్మీనరసింహ రథోత్సవంలో భక్తులకు విష్ణువర్థన్ సూచనలు చేస్తూ వస్తున్నారు. అయితే దీనికి అడ్డుకట్టవేయాలనే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్.. ఆ ఉత్సవంలో పాల్గొనవద్దని బీజేపీ నేతలకు హుకుం జారీ చేశారు. ఒకవేళ బీజేపీ నేతలు వస్తే దాడులు చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా విష్ణువర్థన్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. -
‘కదిరి రథోత్సవంలో పాల్గొనేందుకు వీలులేదు’.. బీజేపీ నేతపై ఆంక్షలు
సాక్షి,అనంతపురం: కదిరిలో టీడీపీ వర్సెస్ బీజేపీ నేతల మధ్య విభేదాలు చర్చాంశనీయంగా మారాయి. బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు విధించారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దని హుకుం జారీ చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ వైఖరిని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి ఖండించారు.గత 30ఏళ్లుగా రథోత్సవంలో పాల్గొంటున్నా. నాపై ఆంక్షలు విధించడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు లెక్క చేయనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, విష్ణువర్ధన్రెడ్డి కట్టడి చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. -
తమిళనాడులో బీజేపీ బిహార్ ఫార్ములా..: స్టాలిన్
చెన్నై: తమిళనాడులో మరో 2 నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ బీజేపీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను కూడా ఆయన గుర్తు చేశారు.తమిళనాడులోని సిరుగనూరులో స్టాలిన్ మాట్లాడుతూ.. ‘తమిళనాడులో గెలవడానికి అన్నాడీఎంకేను బీజేపీ క్రమంగా నాశనం చేస్తోంది. తమిళనాడులో బీజేపీ బిహార్ ఫార్ములాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. బిహార్లో నితీశ్ కుమార్ను పక్కనపెట్టేసి తమ పార్టీకి చెందిన నేతను సీఎం చేయడానికి ఏర్పాటు చేసుకుంది. బిహార్లో ఎప్పుడూ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి లేరు. నితీశ్ను ముందు నిలబెట్టి చూపిస్తూ ఎన్నికలు గెలిచిన తరువాత ఇప్పుడు ఆయనను పక్కకు నెట్టారు. ముఖ్యమంత్రి కావాలన్న స్వార్థంతో పళనిస్వామి బీజేపీకి బానిసగా మారారు.ఈ ఎన్నికలు తమిళనాడుకు, ఎన్డీఏకు మధ్య జరుగుతున్నాయి. ఢిల్లీ టీమ్ గెలుస్తుందా? తమిళనాడు టీమ్ గెలుస్తుందా? అన్న అంశంపై ఆధారపడే 2026 ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ కుతంత్రాలు తమిళనాడులో పనిచేయవు. ఇక్కడ మేమే ఉంటాం, మా నేలపై గెలుపు మాదే, గెలిచేది మేమే. మీరు పల్టీలు కొట్టినా, ఏ ముసుగు వేసినా, ఏ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించినా, తమిళనాడు ఎప్పటికీ మీకు లొంగదు. నేను ఉన్నంత కాలం, నా పార్టీ పనిచేస్తున్నంత కాలం బీజేపీ తమిళనాడులో అధికారంలోకి రావడం అసాధ్యం’ అని స్టాలిన్ తెలిపారు. ఇదీ చదవండి: ‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం‘ -
బిహార్లో ‘జాతీయ’ గీతం!
ఊహించని నిర్ణయాలతో తరచు అందరినీ ఆశ్చర్యపరిచే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈసారి మాత్రం దిగ్భ్రాంతిలో ముంచెత్తారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుని గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయటంతో జేడీ(యూ) అగ్రనాయకులే ఖిన్నులయ్యారు. వారికి కేవలం కొన్ని గంటలముందు మాత్రమే తెలిసింది మరి. పదేళ్లుగా తన పదునైన వ్యూహాలతో దేశంలో బీజేపీ ఎదుగుదలకు చక్రం తిప్పుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే ఈ ఊహించని పరిణామానికి కూడా బాధ్యులని మీడియా కథనాలు చెబుతున్నాయి. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నితీశ్ వాస్తవానికి తన కుమారుడికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని నెల్లాళ్లుగా బీజేపీ అగ్రనేతలను అడుగుతూ వస్తున్నారు. తీరా ఆయన హఠాత్తుగా స్వరం మార్చారు. మధ్యమధ్య కొత్త పొత్తులతో జనం ముందుకెళ్తున్నా మెజారిటీ కాస్త అటూ ఇటూఅయింది తప్ప గత 20 సంవత్సరాలుగా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగారు. తాను రాష్ట్రంలో ఉభయ సభలతోపాటు లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేశాననీ, రాజ్యసభకు వెళ్లలేదన్న అసంతృప్తిని పోగొట్టుకోవటానికే తాజా నిర్ణయం తీసుకున్నాననీ ఆయన చెబుతున్న మాటల్ని మద్దతుదారులు విశ్వసించటం లేదు. పార్టీలో అంతఃకలహాలు, సహకరించని ఆరోగ్యం ఆయన తాజా నిర్ణయానికి కారణమన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.బిహార్ రాజకీయాలపై నితీశ్ ముద్ర చెరగనిది. 1974 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమ నేతగా ముందుకొచ్చిన విద్యార్థి నాయకుల్లో నితీశ్ ఒకరు. 90వ దశకం నుంచీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనదే కీలక భూమిక. తనతోపాటు రాజకీయాల్లో అడుగుపెట్టిన లాలూ ప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్లతో పోలిస్తే నితీశ్ వ్యూహ చతురత గలిగినవారు. అందుకే ‘సామాజిక న్యాయ’ రాజకీయాల ప్రభావం గణనీయంగా ఉన్న రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో లేని కుర్మీ సామాజిక వర్గం నుంచి వచ్చినా అందరినీ ఆకట్టుకోగలిగారు. అత్యంత వెనుకబడిన కులాలకూ(ఈబీసీ), దళితుల్లో అట్టడుగు వర్గాలకూ పదవుల పంపకంలో ప్రాధాన్యమీయటంతోపాటు తన కుర్మీ సామాజిక వర్గాన్నీ, కుష్వాహాలనూ ఏకం చేశారు. ఆయన విజయాలకు ఈ సమీకరణాలొక్కటే కాదు... వాటితోపాటుæరాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించి ‘మంచి పాలన’ అందిస్తున్నా రన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించగలిగారు. ఆయనకు ‘సుశాసన్ బాబు’ అనే పేరు వచ్చింది అందుకే!కూటమిలో జూనియర్ భాగస్వామిగా చేరినా, అచిరకాలంలోనే అగ్రభాగానికి ఎగబాకుతుందని బీజేపీపై ఇప్పటికే ముద్రపడింది. మహారాష్ట్రలో జరిగింది ఇదే. ఇప్పుడు బిహార్లోనూ ఇదే కొనసాగుతోంది. కేంద్రంలో ఎన్డీయే మనుగడకు జేడీ(యూ) మద్దతు తప్పనిసరైనా, రాష్ట్రంలో ఆ పార్టీ సారథ్యాన్ని తప్పించటం చిన్న విషయమేమీ కాదు. 2020 ఎన్నికల్లో తొలిసారి జేడీ(యూ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో బీజేపీ కన్నా తనకు అదనంగా ఒక్క స్థానమైనా కావాలని పట్టుబట్టి తీసుకున్న ఆ పార్టీకి తీరా 43 మాత్రమే లభించాయి. బీజేపీకి ఆ ఎన్నికల్లో వచ్చినవి 74. అందుకే సీఎం పదవి నిలుపుకోవటంపై సంశయం ఏర్పడి నితీశ్ మధ్యలో ఆర్జేడీ వైపు వెళ్లారు. ఆ చెలిమి ఎన్నాళ్లో కొనసాగలేదు. తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. మొన్న నవంబర్లో జేడీ(యూ)కు 85 లభించగా, బీజేపీ గెల్చుకున్నవి 89. అధిక స్థానాలున్న పక్షంగా సీఎం పదవి అడగాల్సి ఉన్నా తాత్కాలికంగా బీజేపీ వెనక్కుతగ్గింది. అదును చూసి నాలుగు నెలల్లో సాధించింది. పార్టీకి ప్రధాన వనరైన మహిళలు, రైతులు బీజేపీ వైపు మొగ్గుతున్నారన్న సమాచారంతో జేడీ(యూ) నేతలు అప్రమత్తమవుతున్నట్టు కథనాలు వచ్చాయి. అందుకే ఇక ఆలస్యం చేయరాదని బీజేపీ భావించినట్టు కనబడుతోంది.నితీశ్ నిష్క్రమణ, బీజేపీ ఆగమనంతో బిహార్ రాజకీయాల్లో సోషలిస్టు నేపథ్యంగల ప్రాంతీయ పార్టీల పాత్ర కొడిగడుతుంది. రాజ్యసభకు వెళ్లినా బిహార్లో తన ముద్రఉంటుందని నితీశ్ చెబుతున్నా అది ఆచరణలో సాధ్యపడదు. ఒకటి నిజం – ఇప్పటికీ బిహార్ నిరుపేద రాష్ట్రాల్లో ఒకటిగానే ఉంది. తన ఏలుబడిలో బీజేపీ దాని ముఖచిత్రాన్ని ఏ మేరకు మార్చగలదో వేచిచూడాలి. -
కాషాయ కండువా కప్పుకోనున్న వీరశివా !
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి బీజేపీలో చేరికకు గ్రీన్సిగ్నల్ లభించింది. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. తెలుగుదేశం, బీజేపీలోని ఒక సెక్షన్ నేతలు వీరశివా బీజేపీ చేరికకు మోకాలొడ్డారు. ఎట్టకేలకు అడ్డంకులన్నీ అధిగమించి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మరోమారు పార్టీ ఫిరాయింపునకు తెర లేపారు. బీజేపీలో చేరిక వ్యవహారం గత కొంత కాలంగా ఊగిసలాటలో ఉండిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మొగ్గు చూపగా, తెలుగుదేశం, బీజేపీ నేతలు కొంతమంది ఇప్పుడు ఆయన అవసరం ఏమిటంటూ అడ్డుతగిలారు. అధికారం కోసమే బీజేపీలో చేరుతున్నారని మండిపడ్డారు. అన్నీ అంశాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పుత్తాకు పక్కలో బల్లెం... కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పక్కలో బల్లెం కానున్నారా...అంటే విశ్లేషకులు అవును అని వెల్లడిస్తున్నారు. బీజేపీలో చేరకముండే కమలాపురం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా వ్యవహారంపై స్పందించారు. కోట్లాది రూపాయాల దోపిడీ వ్యవహారం బహిర్గతం చేశారు. పుత్తా కుటుంబానికి నిత్యం రూ.30లక్షలు అక్రమ ఆదాయం లభిస్తోందని మీడియా సమావేశాలల్లో వ్యాఖ్యనించారు. అదే విషయమై చట్ట పరమైన చర్యలకు సిద్ధమైయ్యారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు అన్నీ రకాల ఎత్తుగడలు అవలంభిస్తున్నారు. ఈపరిస్థితులల్లో బీజేపీలో చేరిన తర్వాత మరింత దూకుడు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనుచరగణాన్ని సమీకరించుకున్న తర్వాత వేగంగా రాజకీయ పావులు కదపనున్నట్లు సమాచారం. -
రాజ్యసభకు నితీష్.. బీహార్ సీఎం రేసులో ఇద్దరు?
పాట్నా: బీహార్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్లు నితీష్ కుమార్ అధికారికంగా ప్రకటన చేశారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ మొదలైంది.అయితే, బీహార్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న కారణంగా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో ఇద్దరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టవచ్చని తెలుస్తోంది. అలాగే, నిత్యానంద రాయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక, సామ్రాట్ చౌదరి బీహార్ రాజకీయాల్లో అంతర్భాగంగా ఉన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పటి నుండి ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వరకు బీజేపీ నాయకుడిగా కీలక పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.సీఎం రేసు కోసం నిత్యానంద్ రాయ్ కూడా పోటీలో ఉన్నారు. రాయ్ ప్రస్తుతం హోంమంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్రంలో పని చేయడానికి ముందు, రాయ్ బీహార్కు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాయ్ హాజీపూర్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2015లో రాయ్ పార్లమెంటరీ టికెట్ గెలుచుకుని ఉజియార్పూర్ నుండి ఎంపీగా పనిచేశారు. మరోవైపు.. నితీష్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.నితీష్ కీలక వ్యాఖ్యలు.. అంతకుముందు సీఎం నితీష్ కుమార్ ట్విట్టర వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘గత రెండు దశాబ్దాలకు పైగా మీరు నాపై ఉంచిన విశ్వాసం, మద్దతు నిరంతరం కొనసాగుతోంది. అదే బలంతో మేము బీహార్ రాష్ట్రానికి, మీ అందరికీ సంపూర్ణ నిబద్ధతతో సేవ చేయగలిగాం. మీ విశ్వాసం, మద్దతు వల్లే బీహార్ ఈరోజు అభివృద్ధి మరియు గౌరవానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇందుకు నేను గతంలో కూడా మీ అందరికీ పలుమార్లు కృతజ్ఞతలు తెలిపాను. నా పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే ఒక కోరిక నా మనసులో ఉంది.బీహార్ శాసన మండలి (విధాన మండల) రెండు సభలతో పాటు, పార్లమెంట్లోని రెండు సభల సభ్యుడిగా కూడా ఉండాలని ఆశించాను. ఆ క్రమంలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా మారాలని కోరుకుంటున్నాను. మీతో నా ఈ అనుబంధం భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని నేను పూర్తి నిజాయితీతో హామీ ఇస్తున్నాను. మీ అందరితో కలిసి అభివృద్ధి చెందిన బిహార్ నిర్మాణం అనే సంకల్పం అలాగే కొనసాగుతుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా పూర్తి సహకారం మరియు మార్గదర్శనం ఉంటుంది’ అని ఆయన అధికారిక ప్రకటన చేశారు. -
నువ్వు అసలు మనిషివేనా? ఛైర్మెన్ పదవిలో ఉంటూ రాసలీలలా
-
రాజ్యసభకు నితిన్ నబీన్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు సన్నాహాలను వేగవంతం చేసింది. మంగళవారం 9 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ను బిహార్ నుంచి బరిలోకి దించనుంది.తొలివిడతగా మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఖాళీ అయ్యే స్థానాలకు బీజేపీ ప్రకటించిన పేర్లు ఇవే..బిహార్ నుంచి నితిన్ నబీన్, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి శివేష్ కుమార్, అసోంనుంచిఎమ్మెల్యే తెరాష్ గోవాలా, రాష్ట్ర మంత్రి జోగెన్ మోహన్, ఛత్తీస్గఢ్ నుంచి పార్టీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలు లక్ష్మీ వర్మ, హరియాణా నుంచి లోక్సభ మాజీ ఎంపీ సంజయ్ భాటియా, ఒడిశా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, రాజ్యసభ ఎంపీగా ఉన్న సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ రాహుల్ సిన్హా ఉన్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఈనెల 16వ తేదీన పోలింగ్ జరగనుంది. -
పవన్కు మొండిచేయి.. అందుకే పక్కనపెట్టారా?
రాజ్యసభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటు మాజీ ఎమ్మెల్యే శివేష్ కుమార్ బిహార్ నుంచి బరిలో ఉన్నారు. అసోం రాష్ట్రం నుంచి తేరాష్ గోవాల్లా, జోగెన్ మోహన్లను అభ్యర్థులుగా ప్రకటించింది. మన్మోహన్ సమల్, సుజీత్ కుమార్లను ఒడిశా తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాకు అవకాశం దక్కింది. లక్ష్మీవర్మ (ఛత్తీస్గఢ్), సంజయ్ భాటియా(హరియాణా)లకు కూడా రాజ్యసభ అభ్యర్థిత్వం దొరికింది. ప్రఖ్యాత భోజ్పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్కు కమలం పార్టీ మొండిచేయి చూపింది. ఎంపీ కావాలకున్న ఆయన ఆశలపై బీజేపీ అధినాయకత్వం నీళ్లు చల్లింది. దీంతో ఆయనను రాజ్యసభకు పంపిస్తారని వస్తున్న ఊహాగానాలకు తాజాగా తెరపడింది. బిహార్ నుంచి నితిన్ నబీన్తో పాటు సీనియర్ నాయకుడు శివేష్ కుమార్ (Shivesh Kumar) అవకాశం దక్కించుకున్నారు.తీరని పవన్ కలఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న పవన్ సింగ్ కోరిక ఇంకా ఫలించలేదు. ఈసారైనా తనకు ఎంపీ దక్కుతుందని భావించినా ఆయనకు నిరాశే మిగిలింది. రెండోసారి కూడా అవకాశం దక్కినట్టు దక్కి చేజారిపోయింది. ఎంపీ కావాలన్న ఉద్దేశంతోనే బిహార్ ఎన్నికలకు ముందు ఆయన రెండోసారి బీజేపీలో చేరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని అసన్జోల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా పోటీలో నిలిచారు. అయితే తన పాటల్లో బెంగాలీ మహిళలను అభ్యంతకరంగా చిత్రీకరించారనే విమర్శలు రావడంతో పోటీ నుంచి ఆయనను తప్పించింది. దీంతో మనస్తాపం చెందిన పవన్ సింగ్.. బిహార్లోని కరకట్ లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఫలితంగా బీజేపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయితే పవన్ సింగ్ కారణంగా పలుచోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఓటమిపాలయ్యారన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.'ఎమ్మెల్యే కాదు.. ఎంపీయే'గతేడాది అక్టోబర్ 1న తిరిగి కమలం గూటికి వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ బిహార్ ఇన్ఛార్జ్ వినోద్ తవ్డే, కరకట్లో ఆయన ప్రత్యర్థి ఉపేంద్ర కుష్వాహా సమక్షంలో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి రావడంతో.. పవన్ సింగ్ శాసనసభకు పోటీ చేస్తారని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే పవన్కు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం లేదని, ఎంపీ కావాలన్నది ఆయన కోరిక అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వెల్లడించారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున పవన్ సింగ్ ప్రచారం సాగించారు.చదవండి: రాజ్యసభ బరిలో నితీశ్ కుమార్ తనయుడు?అందుకే ఇవ్వలేదా?ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధించడంతో ఆయనకు కచ్చితంగా రాజ్యసభ సీటు దక్కుతుందని బాగా ప్రచారం జరిగింది. అయితే బిహార్కే చెందిన నితిన్ నబీన్ (Nitin Nabin) బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పరిస్థితి మారినట్టు తెలుస్తోంది. నబీన్ పార్లమెంట్కు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పవన్ను పక్కన పెట్టాల్సివచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు పవన్ సింగ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయనకు ఎంపీ సీటు దక్కలేదన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. మరోవైపు ఎప్పటికైనా తమ హీరో ఎంపీ అవుతారని పవన్ సింగ్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.BJP announces its candidates for the upcoming Rajya Sabha elections.Nitin Nabin, Shivesh Kumar from Bihar.Terash Gowalla, Jogen Mohan from Assam.Laxmi Verma from Chhattisgarh.Sanjay Bhatia from Haryana.Manmohan Samal, Sujeet Kumar from OdishaRahul Sinha from West Bengal. pic.twitter.com/jM3afnPLLi— ANI (@ANI) March 3, 2026 -
రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎంపిక
ఢిల్లీ: ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నితిన్ నబీన్ను రాజ్యసభకు పంపనుంది పార్టీ అధిష్టానం. ఈ మేరకు 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. బిహార్ నుంచి నితీన్ నబీన్తో పాటు శివేష్ కుమార్లను రాజ్యసభకు ఎంపిక చేసింది. వీరిద్దరితో పాటు మిగతా వారి వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం నుంచి తేరాష్ గోవాలా,జోగెన్ మోహన్ఛత్తీసగఢ్ నుంచి లక్ష్మి వర్మహర్యానా సంజయ్ భాటియాఒడిశా నుంచి నుంచిమన్మోహన్ సామల్, సుజిత్ కుమార్పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాసొంత రాష్ట్రమైన బిహార్ నుంచి నితిన్ నబీన్..ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబీన్ ఇన్నాళ్లూ బిహార్లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన్ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ బంకీపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అసెంబ్లీకి హాజరవ్వడం అంత సులభమేమీ కాదు. అటు ఎమ్మెల్యేగా, ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ద్వంద్వ పాత్రలు పోషించడం కష్టమని అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే ఆయనను ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే మాదిరిగా మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాజ్యసభకు పంపారు. వచ్చే ఏప్రిల్లో బిహార్లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనిలో భాగంగానే రాజ్యసభ సభ్యుల ఎంపికను షురూ చేసింది బీజేపీ. -
సీఎం రేవంత్కు కేందమంత్రి కిషన్రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బడ్జెట్ సమావేశాల కంటే ముందే పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించిన కిషన్రెడ్డి.. రాష్ట్రంలో జీతాలు, రైతు భరోసా, సంక్షేమ పథకాల అమలు.. ఇలా ఏ పని చేయాలన్నా అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శలు గుప్పించారు.సాస్కి (SASCI) పథకం కింద తెలంగాణకు రూ.10,000 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను కేంద్రం అందించిందని కిషన్రెడ్డి వివరించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా, ఖజానా ఖాళీ అని నెపం నెట్టడంపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని లేఖలో ఆయన స్పష్టీకరించారు.‘‘2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టో ద్వారా 6 ప్రధాన గ్యారంటీలతో పాటుగా 420 హామీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఈ హామీలను నమ్మిన తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెట్టింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మీరు, ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలునుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు...రాష్ట్ర ఖజానా గురించి ఇలా మాట్లాడిన మీరే, ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ సోనియా గాంధీ-రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ. 1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరు మాట్లాడిన తీరును చూస్తుంటే, రాష్ట్ర ఖజానా నిల్ - కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్ అన్న విషయం అర్థమవుతోంది...2014 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తూ వస్తోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరెన్నో మూలధన పెట్టుబడులు మొదలైనవాటి రూపంలో గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ. 12 లక్షల కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది...అందులో రూ.2.5 లక్షల కోట్ల పన్నుల వాటా నిధులు, రూ.1.85 లక్షల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, దాదాపు రూ.36,000 కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో రూ. 50,000 కోట్ల విలువైన రైల్వే పనులు, దాదాపు రూ.40,000 కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.50,000 కోట్ల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు వివిధ ఆర్థిక సంఘాల సిఫారసుల ద్వారా అందిస్తున్న రూ.40,000 కోట్లకు పైగా నిధులు, రూ.12,000 కోట్లకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులు, రూ.14,000 కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు, ఎరువుల సబ్సిడీ కోసం రూ.80,000 కోట్లకు పైగా నిధులు, విద్య & క్రీడలకు రూ.21,000 కోట్లకు పైగా నిధులు, దాదాపు రూ.9,000 కోట్ల ఆరోగ్య సంరక్షణ నిధులు మొదలైనవి ఉన్నాయి...అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించింది. మరో రూ.60,000 కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి పత్తిని సేకరించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను ఇవ్వడమే కాకుండా, వివిధ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు రూ. 10 లక్షల కోట్ల ఋణాలను కూడా తెలంగాణ రాష్ట్రానికి అందించింది.వీటికి అదనంగా రాష్ట్రాలలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మూలధన పెట్టుబడి నిధుల కోసం రాష్ట్రాలకు 50 సంవత్సరాల కాలపరిమితితో కూడిన వడ్డీ రహిత ఋణాలను అందించి ఆయా రాష్ట్రాల అభివృద్ధికి అదనపు సహకారాన్ని అందించాలనే ప్రధానమంత్రి మోదీ గారి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం “స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్(SASCI)” పేరిట ఒక నూతన పథకాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది...కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించిన ఈ సౌలభ్యాన్ని సానుకూలంగా అందిపుచ్చుకున్న రాష్ట్రాలు 2020-21 నుండి నేటి వరకూ మూలధన పెట్టుబడితో కూడిన అనేక ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఈ ఋణాల ద్వారా సమకూర్చుకున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది. SASCI పథకం కింద 2020-21 నుంచి 2025-26 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 10,000 కోట్లకు పైగా వడ్డీ రహిత ఋణాలను అందించడం జరిగింది. ఈ ఋణాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూలధన పెట్టుబడితో కూడిన కొన్ని వందల ప్రాజెక్టులు అమలుకు నోచుకున్నాయి...మురుగునీటి నాళాలు, రోడ్ల విస్తరణ, రైల్వే లైన్ల విస్తరణ, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, ఆసుపత్రులు, మెడికల్ & నర్సింగ్ కాలేజీలు, సంక్షేమ, మైనారిటీ పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణం, పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ORR & RRR మధ్యన రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి-మూసీ నది అనుసంధానం, మూసీ నది సుందరీకరణ, స్మార్ట్ సిటీ మిషన్ లో రాష్ట్ర వాటా నిధులు, వరదల వలన పాడైపోయిన నిర్మాణాల పునరుద్ధరణ, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రాష్ట్ర వాటా నిధులు వంటి అనేక ప్రాజెక్టులకు సాస్కి నిధులు ఖర్చు చేశారు. ..ముఖ్యంగా MMTS ఫేజ్ - II కోసం రూ.200 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కోసం రూ. 114 కోట్లు, స్మార్ట్ సిటీస్ పథకం కోసం రూ. 315 కోట్లు, పీఎం గ్రామ సడక్ యోజన కోసం రూ. 674 కోట్లు, ORR & RRR మధ్యన రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం రూ. 200 కోట్లు, సిద్ధిపేట బైపాస్ రోడ్డు కోసం రూ. 110 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల కోసం రూ. 388 కోట్లు, పలు హాస్టళ్ల నిర్మాణం కోసం రూ. 300 కోట్లు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రహిత ఋణాల మీద ఆధారపడటం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉందో తెలుస్తోంది. ఇవి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న ఋణాలకు వడ్డీలు చెల్లించడానికి ఋణాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఋణాలు, రైతు భరోసా నిధులకు ఋణాలు, సంక్షేమ పథకాల అమలుకు ఋణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఋణాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉంది. ..2014 లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన దుస్థితికి నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్ధం పడుతోంది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పెరుగుతున్న రాష్ట్ర తలసరి అప్పు కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తోంది...ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి, మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ ప్రజల తరపున మిమ్మల్ని కోరుతున్నాను’’ అంటూ కిషన్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
నేటి నుంచి బెంగాల్లో బీజేపీ ‘పరివర్తన్ యాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాషాయదళం ముందుకు సాగుతోంది. పోలింగ్కు ముందు పార్టీ శ్రేణులను సన్న ద్ధం చేసేలా బృహత్ కార్యాచరణతో ముందుకెళుతోంది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేలా ఆదివారం నుంచి వారం పాటు ‘పరివర్తన్ యాత్ర’కు శ్రీకారం చుట్టింది. 260 భారీ సభలు..2021 అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ బీజేపీ 77 సీట్లు గెలుచుకుంది. ఈసారి 160 స్థానాలు లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో తృణముల్ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాత్రను మొదలు పెట్టనుంది. రాష్ట్రంలో రాజ్యాంగం అమలుకావడం లేదని, మహిళలపై నేరాలు పెరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తోంది. ముఖ్యంగా రైతులకు లబ్ధి చేకూర్చే పీఎం కిసాన్ వంటి పథకాలు రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదని చెబుతోంది. అక్రమ ఓటర్లు, చొరబాటుదారుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ జాతీయ భద్రతపై టీఎంసీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. వీటన్నింటినీ తమ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకుగాను 260 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు, 250 చిన్నచిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తూ మొత్తంగా 5 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేలా యాత్రను డిజైన్ చేశారు. దీనిద్వారా ప్రత్యక్షంగా కోటిన్నర మంది ప్రజలను కలవాలన్నది లక్ష్యంగా ఉంది. ఆదివారం ప్రారంభం కానున్న ఈ యాత్రలో తొలిరోజు కూచ్బెహర్ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కానుండగా, నదియా ఉత్తర్లో మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఘార్గ్రామ్లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పురులియాలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి పాల్గొననున్నారు. 2వ తేదీన దక్షిణ 24 పరగణాలు, మథురాపూర్, రాయదిఘి సభలకు హోంమంత్రి అమిత్ షా, హౌరా, హూగ్లీ జిల్లాల సభలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాద్వాన్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు సభలకు హాజరు కానున్నారు. ఈ యాత్ర చివరి రోజు నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా ఈ యాత్ర ముందుకు సాగనుంది. -
నీకు దమ్ముంటే.. రేవంత్ కు ఓపెన్ ఛాలెంజ్
-
Liquor Scam Case మోదీ, అమిత్షా కుట్ర : కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ మాజీ ఎక్సైజ్ (లిక్కర్) విధానానికి సంబంధించిన స్కాంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అవినీతి కేసులో సహా నిందితులందరినీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆప్నేత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత, కేజ్రీవాల్ బీజేపీపై తన దాడిని ఎక్కుపెట్టారు. తనపై తప్పుడు కేసులు బనాయించి,తనను ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం కుట్ర పన్నిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో ఆరోపణలకు స్పందిస్తూ, తనపై, తన పార్టీపై వచ్చిన అన్ని ఆరోపణలు నిరాధారమైనవని తేలిందని కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో సీబీఐ ,ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినప్పటికీ, ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అనే దానిపై తుది నిర్ణయం కోర్టుదేనని స్పష్టం చేశారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, కేసును కొనసాగించ డానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు తేల్చిందని కేజ్రీవాల్ అన్నారు. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు క్లీన్ చిట్, మాజీ సీఎం భావోద్వేగంకేజ్రీవాల్కు క్లీన్ చిట్ రావడంతో అటు ఆప్ శ్రేణులు, ఇటు ఆయన భార్య సునీత ఆనందంలో మునిగి తేలారు. భర్తను ఆలించగనం చేసుకొని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. -
దేశ యువత, ప్రజలకు దేశ యువత, ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో ఏఐ సమ్మిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన యాదృచ్ఛి కంగా చేసింది కాదని,అది పూర్తిగా రాహుల్గాంధీ చేయించిన సిగ్గుమా లిన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు ఎన్.రాంచందర్రావు మండిపడ్డారు. ‘రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ దేశ గౌర వాన్ని దెబ్బతీసేలా, అంతర్జాతీయ వేదికలపై భారత్ను అవమానించేలా ప్రవర్తించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.ఇప్పటికైనా రాహుల్ దేశ యువత, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో బీఆర్ఎస్కు చెందిన లంకల రమేశ్రెడ్డి, విజేశ్వర్రెడ్డి, ప్రదీప్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు శివశంకర్, వేణుగోపాల్రెడ్డి, శివప్రసాద్, నరేశ్కుమార్, న్యాయవాది శివకుమార్ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కూడా మావోయిస్టు ముక్త్గా చేయాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. చేరికల కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్రెడ్డి, మాధవరం కాంతారావు, గణేశ్కుందే, నిరంజన్ యాదవ్, శ్రీధర్, కిశోర్, తాడూరి శ్రీనివాస్, రవినాయక్ పాల్గొన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారుతోంది రాష్ట్రంలో వరుస హింసాత్మక ఘటనలతో శాంతిభద్రతలు క్షీణించాయని, వెంటనే పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కామారెడ్డి జిల్లా బాన్సువాడ, కామారెడ్డిటౌన్, నిజామాబాద్ జిల్లా రుద్రూర్లలో జరిగిన ఘటనలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. బుధవారం డీజీపీకి ఎమ్మెల్యే హరీశ్బాబు, ఎమ్మెల్సీలు సి.అంజిరెడ్డి, మల్క కొమురయ్య తదితరులతో కలిసి రాంచందర్రావు వినతిపత్రం సమర్పించారు. -
కూటమి సర్కార్ కు షాకిచ్చిన సోము వీర్రాజు
-
6 గ్యారంటీలు, 420 హామీల అమలు తేదీ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఏ రోజు నుంచి అధికార కాంగ్రెస్ అమలు చేస్తుందో..వాటికి ఎంత ఖర్చవుతుందో చెప్పి అమలు తేదీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో అధికారానికి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా అమలు చేయనందుకు సిగ్గన్పించడం లేదా సీఎం గారూ? డూప్లికేట్ గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు పంపాలనే శ్రద్ధే తప్ప మీకు ప్రజా సమస్యలు పట్టవా’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.‘రాష్ట్ర మంత్రివర్గంలో డూప్లికేట్ గాంధీ కుటుంబానికి పంపాల్సిన రూ.వెయ్యి కోట్ల నిధుల సేకరణపైనే చర్చ జరుపుతున్నారా’అని ఎద్దేవా చేశారు. డూప్లికేట్ గాంధీ కుటుంబానికి మూటలు పంపి పదవులు కాపాడుకోవాలనే తాపత్రయమే తప్ప 6 గ్యారంటీల అమలుపై ఎన్నడైనా చర్చించారా అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఆరు గ్యారంటీల అమలుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో ఉద్యమించి హామీలను పూర్తిచేసేలా ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని హెచ్చరించారు.మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలు సాధ్యాసాధ్యాలపై కేబినెట్లో ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు. ‘మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని చెప్పి రెండున్నరేళ్లు అయ్యింది. ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెన్ఫిట్స్ చెల్లించకపోవడంతో 61 మంది చనిపోయినా మీలో చలనం లేదా? ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డీఏలు, పెండింగ్ బకాయిలు అందక ఇబ్బంది పడుతున్నా మీకు పట్టదా? ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలివ్వకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వేలాది యాజమాన్యాలు అల్లాడుతున్న సంగతి మర్చిపోయారా’అని ప్రశ్నించారు. -
బీజేపీ కుట్రలను సాగనీయం
వికారాబాద్: రాజ్యాంగ మార్పు, కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ బీజేపీ చేస్తున్న కుట్రలను సాగనీయబోమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్స్లో కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాహుల్గాంధీని ప్రధానిని చేసే వరకూ ఇరు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. కులవివక్షను సమర్థవంతంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. తాను సైతం వివక్షను ఎదుర్కొన్నానని తెలిపారు.దేశాన్ని అనేక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయని, బీజేపీ ప్రభుత్వం దీనికి ఆజ్యం పోస్తోందని తెలిపారు. రాహుల్గాంధీ ప్రధాని అయితే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కులవివక్ష కారణంగా బలవన్మరణానికి పాల్పడితే రాహుల్గాంధీ యూనివర్సిటీకి చేరుకొని, బాధితులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రోహిత్ వేముల చట్టం తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజాప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమానంగా దూసుకుపోతోందన్నారు. కేవలం 50 రోజుల్లో కులగణన పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ సభ్యులు వంశీచంద్రెడ్డి, సచిన్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
దేవుడితో రాజకీయం చేస్తావా.. లడ్డూపై కుట్రలో బాబుకు బీజేపీ నేత షాక్
-
ఉద్రిక్తంగా ‘చలో కామారెడ్డి’
సాక్షి, హైదరాబాద్/లాలాపేట: బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఆదివారం తలపెట్టిన చలో కామారెడ్డి ఉద్రిక్తంగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం రాత్రి నుంచే వారి ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. బీజేపీ నాయకత్వాన్ని కామారెడ్డికి వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాత్రి నుంచి హౌస్ అరెస్టులో ఉన్న రాంచందర్రావు ఎలాగైనా సరే కామారెడ్డి పర్యటనకు వెళ్లాల్సిందేనంటూ ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చారు.అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు రాంచందర్రావును అడ్డుకున్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తార్నాకకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, బీజేపీ శ్రేణుల తోపులాటల మధ్య రాంచందర్రావుతోపాటు మరికొందరిని అరెస్టు చేసి బొల్లారం, గాంధీనగర్ పోలీసు స్టేషన్లకు తరలించారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లోని ఎమ్మెల్సీ మల్క కొమరయ్యను, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను హౌస్ అరెస్టు చేశారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా హౌస్ అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో రౌడీ రాజ్యం: కేంద్రమంత్రి సంజయ్రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి? కాంగ్రెస్, ఎంఐఎం కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దుర్మార్గం. ఈ అరాచకాలను అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంకావాలి. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే. బాన్సువాడలో 70 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. రాళ్ల దాడి స్పష్టంగా కన్పిస్తున్నా చర్యల్లేవు. గొంతునొక్కే కుట్ర: ఏలేటి మహేశ్వర్రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రను చేస్తోంది. నియంతృత్వంగా వ్యవహరించడంలో బీఆర్ఎస్ సర్కారును తలపిస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కేసీఆర్కు పట్టిన గతే పడుతుంది. నిర్బంధ పాలన: ఎంపీ డీకే అరుణరాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిర్బంధ పాలన చేస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ అధ్యక్షుడు వెళ్లడం నేరమా? బీజేపీని అణిచివేసే కుటిల ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. అక్రమ అరెస్టులు చేసి, నిర్బంధించడం హేయమైన చర్య. కేసీఆర్ ప్రభుత్వం తరహాలోనే..: ఎంపీ ఈటలరాంచందర్రావు అరెస్ట్ అప్రజాస్వామికం. కేసీఆర్ ప్రభుత్వంలో హౌస్ అరెస్టుల తీరు ఇప్పుడు పునరావృతమైనట్లు కనిపిస్తోంది. నాడు కేసీఆర్ ఇదే తరహా హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయగా.. నేడు రేవంత్రెడ్డి అదే పాటిస్తున్నారు. అధికార పార్టీ నేతలే గూండాయిజం చేస్తున్నారు.ఎమర్జెన్సీని గుర్తు చేశారు: రాంచందర్రావుఅరెస్ట్కు ముందు రాంచందర్రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాం«ధీ హయాంలో విపక్ష నేతలను ఇష్టానుసారంగా అరెస్టు చేసి గొంతు నొక్కిన 1975 ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తుచేసిందని మండిపడ్డారు. కామారెడ్డి, బాన్సువాడ ఘటనల అనంతరం ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేశారని దుయ్యబట్టారు.ప్రజాస్వామ్యం ఖూనీ: జి.కిషన్రెడ్డిబీజేపీ నేతల హౌస్ అరెస్టు కక్షసాధింపే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఖూనీ చేస్తోంది. అధికారాన్ని దుర్వినియోగం చేసి అరెస్టులకు దిగడం దౌర్భాగ్యకరం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటును కాంగ్రెస్ నాయకులు కారుతో గుద్ది ధ్వంసం చేయడం.. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఉదాహరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయడం చూస్తుంటే.. రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారాన్ని ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటోంది. -
సీఎం రేవంత్పై అరవింద్ తీవ్ర విమర్శలు
సాక్షి హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రెండేళ్లలో అధికంగా డబ్బు సంపాదించి అది కొవ్వుగా మార్చుకున్నారని దీంతో అక్రమ హౌస్ అరెస్టుల పేరుతో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ అరాచక పాలన నడుస్తుందన్నారు. అమ్మాయిపై ఒక వర్గం వారు దౌర్జన్యం చేస్తే మరో వర్గం వారిని అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని హిందువులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.MLA వెంకటరమణారెడ్డపై దాడి జరిగితే కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించారా? ఎమ్మెల్యేపై దాడి గురించి ఏమైనా ఆరా తీశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల రెస్పాన్సిబులిటీ స్పీకర్ ది కాదా అని ప్రశ్నించారు.సీఎం రేవంత్ చాలా డేంజరని ఆరోపించారు. కేసీఆర్ ధోరణిలోనే కాంగ్రెస్ సైతం హౌస్ అరెస్టులు చేస్తుందని వాటిని తాము ఖండిస్తున్నామని అరవింద్ తెలిపారు. సూపర్ మార్కెట్ లోకి వచ్చి గొడవ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని MLA క్యాంప్ ఆఫీస్ పై దాడికి వచ్చిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. -
‘రేవంత్రెడ్డికి బీజేపీ భయం పట్టుకుంది’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు. కామారెడ్డిలో బీజేపీకి చైర్మన్ పదవి రాకుండా చేశారని రాంచందర్రావు ధ్వజమెత్తారు. ప్రజాహక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. బొల్లారం పీఎస్ నుంచి రాంచందర్ రావును విడుదల చేశారు. కామారెడ్డికి వెళ్లకూడదన్న షరతులతో ఆయన్ను విడుదల చేశారు పోలీసులు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంచితే, నేడు చలో కామారెడ్డికి తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో రాంచందర్ సహా, ముఖ్య నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించి వారిని కామారెడ్డి వెళ్లకుండా అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులు చేశారు. ఈ క్రమంలోనే రాంచందర్ రావును బొల్లారం పీఎస్కు తరలించారు. -
హైదరాబాద్ లో బీజేపీ రామచందర్ రావు అరెస్ట్
-
తెలంగాణలో రౌడీ రాజ్యం.. ప్రశ్నిస్తే దాడులేంటి?: బండి సంజయ్
సాక్షి, వికారాబాద్: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి? అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమర్జెన్పీ రోజులు ప్రారంభమయ్యాయని.. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధకావాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘‘కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకోండి. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం దుర్మార్గం. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషం. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే. ఆత్మ రక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గు చేటు...బాన్సువాడలో 70 మందిని అరెస్ట్ చేయడం అక్రమం. రాళ్ల దాడి స్పష్టంగా కన్పిస్తున్నా చర్యలేవి?. బాన్సువాడ వెళ్లేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్యాయం. ఎంఐఎంను కాపాడటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’’ అంటూ బండి సంజయ్ ఆరోపించారు. -
AI సమ్మిట్ వద్ద.. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన
-
Kamareddy : కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
-
అనపర్తిలో ఆగని కూటమి సర్కార్ అక్రమ కూల్చివేతలు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో కూటమి సర్కార్ అక్రమ కూల్చివేతలు ఆగడం లేదు. ఆక్రమణల పేరుతో వైఎస్సార్సీపీ నేతకు చెందిన జీబీఆర్ విద్యాసంస్థల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు.సమీపంలోనే దుప్పలపూడి గ్రామంలో మెయిన్ రోడ్డుని ఆక్రమించి ఉన్న ఇతర నిర్మాణాల జోలికి వెళ్లని అధికారులు.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బంధువులకు చెందిన నిర్మాణాలు కావడంతో కూటమినేతల ఒత్తిడితో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బలగాలను మోహరింపజేసి విద్యాసంస్థల నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. -
ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ నిరసన.. బీజేపీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా చివరిరోజున కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐ సదస్సులో యువ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు లేకుండా నిరసన చేపట్టారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ .. ఇది ఎటువంటి మేధస్సులేని, భావోద్వేగంలేని చర్యగా అభివర్ణించింది. ఈ సమ్మిట్ ఐదవరోజు శుక్రవారం(ఫిబ్రవరి 20వ తేదీ) భారత్ అధికారికంగా అమెరికా ప్రధాన ఏఐ ప్రాజెక్ట్ Pax Silicaలో చేరింది. ఇది అమెరికా యొక్క కృత్రిమ మేధస్సు-సరఫరా గొలుసు భద్రతకు సంబంధించిన ప్రధాన కార్యక్రమం. అయితే దీనిపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. భారత మండపం (ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ)లో ఆఖరిరోజు సదస్సులో భాగంగా యూత్ కాంగ్రెస్ సభ్యులు చొక్కాలు విప్పి నినాదాలు చేశారు.ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువైపోయాయంటూ పలువురు నిరసనలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీజేపీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఇది చొక్కాలు లేని నిరసనే కాదు.. బుర్రలేని నిరసన అంటూ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. చివరి రోజు సమ్మిట్లో భాగంగా భారత విద్యా వ్యవస్థపై పునరాలోచించడం, అమెరికా-భారత్ భాగస్వామ్యం ద్వారా AI యుగానికి శక్తినివ్వడం, చర్చలు-రాజనీతిలో ఏఐ వినియోగం తదితర అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. -
టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే
కోల్కతా: ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రంలోని తమ పార్టీ అనుకూలంగా లేదన్న ఆగ్రహంతో పశ్చిమబెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ గురువారం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పారీ్టలో చేరారు. కుర్సియాంగ్ శాసనసభ్యుడైన శర్మ కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీఎంసీలో చేరారు. మరో రెండు నెలల్లో బెంగాల్లో ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ బీజేపీ రెబల్ ఎమ్మెల్యే పార్టీని వీడటం గమనార్హం. ‘కుర్సియాంగ్ ఓటర్ల మనోభీష్టానికి వ్యతిరేకంగా పనిచేయదల్చుకోలేదు. ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని. ఎవరేం అనుకున్నా భయపడేదే లేదు’’అని పార్టీ మారాక బిష్ణుప్రసాద్ అన్నారు. బెంగాల్ కొండ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా విభాగం ఉండాలని గత రెండేళ్లుగా బీజేపీ అధిష్టానంతో బిష్ణు పోరాడుతున్నారు. పశ్చిమబెంగాల్ మాత్రమేకాదు నార్త్ బెంగాల్ కూడా ముఖ్యమే’’అని గతంలో వ్యాఖ్యానించారు. పార్టీ వద్దని వారించినాసరే బిష్ణు ప్రసాద్ 2024 లోక్సభ ఎన్నికల్లో డార్జిలింగ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేశారు. -
2029 నాటికి దేశంలో ఎక్కడా కాంగ్రెస్ పాలన ఉండదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కాదని...అది తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్ కాంగ్రెస్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. వివిధ దర్యాప్తు సంస్థల అధికారులు రాష్ట్ర మంత్రుల అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నారని, మంత్రుల అవినీతికి కొందరు ఐఏఎస్ అధికారులే మధ్యవర్తులుగా ఉన్నారని, అతి త్వరలో మంత్రుల కమీషన్ల చిట్టాతోపాటు ఐఏఎస్ అధికారుల దందాలన్నీ బయటపెడతామని సంజయ్ హెచ్చరించారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ 10వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ సౌగాని కొమరయ్య పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలన ఉండదన్నారు. మంత్రి పదవులను అడ్డుపెట్టుకుని బరితెగించి రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాలని చూస్తే వారి సంగతి చూస్తామన్నారు. మంత్రుల మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలయ్యేలా చేస్తామన్నారు. తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారన్నారు. కరీంనగర్ స్ఫూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాషాయ జెండాను ఎగరేస్తామన్నారు. ఢిల్లీ పర్యటనలతో పాలన గాలికి... బీజేపీ చీఫ్ రాంచందర్రావు ఢిల్లీ పర్యటనలు, చిట్ చాట్లతో పబ్బం గడుపుతూ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసారని బీజేపీ చీఫ్ రాంచందర్రావు విమర్శించారు.ఎన్నికలు రాగానే అమలు కాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. విద్యాశాఖను స్వయంగా సీఎం చూస్తున్నా ఎలాంటి మార్పు లేదని, గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్ల పేరుతో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తే రేవంత్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ డ్రామాలు ఆడుతూ విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందన్నారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమంటే భవిష్యత్ తెలంగాణ బీజేపీదేనని అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది మేధావులు త్వరలో పార్టీలో చేరేందుకు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని రాంచందర్రావు తెలిపారు. -
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బీజేపీ, జనసేనను అవమానిస్తోన్న టీడీపీ
-
చైర్మన్ పదవుల కోసం బీజేపీ-కాంగ్రెస్ అక్రమపొత్తులు: హరీష్
-
నీ పని నువ్వు చూసుకో నాగబాబు తీరుపై టీడీపీ, బీజేపీ నేతల ఆగ్రహం
-
'నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా'.. హీరోయిన్ త్రిషకు క్షమాపణలు
హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల విజయ్పై రాజకీయ విమర్శలు చేస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించారు. త్రిషతో బంధం నుంచి విజయ్ బయటికి రావాలని నాగేంద్రన్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.స్పందించిన త్రిష..'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.అసలేం జరిగిందంటే..అయితే ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. హీరో విజయ్ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్కి రాజకీయాలు తెలియవు.. ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా కామెంట్స్ చేశారు. దీంతో పెద్ద వివాదానికి దారితీసింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు ఈ వ్యాఖ్యలను ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. -
త్రిష, విజయపై బీజేపీ నేత.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష
-
కరీంనగర్ మేయర్ గా బీజేపీ కొలగాని శ్రీనివాస్
-
ట్విస్ట్.. ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ
సాక్షి,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరూ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్, అలాగే బీఆర్ఎస్లో చేరిన ఇండిపెండెంట్ సభ్యుడు పార్టీ బలాన్ని పెంచారు. దీంతో బీఆర్ఎస్ బలం 14కి చేరింది. కాంగ్రెస్ బలం మాత్రం 12 వద్ద నిలిచింది. ఈ సమీకరణలతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. ఫలితంగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలు బలపడుతున్నాయి.స్థానికంగా ఈ పరిణామం పెద్ద రాజకీయ చర్చలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫిషియో ఓట్లను పరిగణలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం రాజ్యాంగబద్ధంగా తమకే అధికారం ఉందని వాదిస్తోంది. -
ఫోర్.. నెవర్ బిఫోర్
మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన పాలమూరుతోపాటు బీజేపీ కంటే తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ఎంఐఎం, బీఆర్ఎస్ల మద్దతు, స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓట్ల సహకారంతో కరీంనగర్, నిజామాబాద్లలో కూడా పాగా వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కరీంనగర్లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఒక్కటి కావడం గమనార్హం. మరోవైపు పాలమూరులో కాంగ్రెస్–ఎంఐఎంలు కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోనుండగా, కొత్తగూడెంలో సీపీఐకి అవకాశం దక్కనుంది. రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్లలో పరిస్థితి ఇది.బీజేపీకి అధిక డివిజన్లు వచ్చినా..66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీకి 30 డివిజన్లు దక్కాయి. నలుగురు స్వతంత్రులు, ఎంపీ బండి సంజయ్ ఓటుతో ఆ పార్టీ బలం 35కు చేరింది. కానీ, ఇక్కడ బీజేపీని కట్టడి చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరికి మజ్లిస్, స్వతంత్రులు కూడా తోడయ్యారు. దీంతో కాంగ్రెస్ (14), బీఆర్ఎస్ (9), స్వతంత్రులు (4), మజ్లిస్ (3), ఏఐఎఫ్బీ (2) తోపాటు ఎమ్మెల్యేలు కమలాకర్ (బీఆర్ఎస్), కవ్వంపల్లి సత్యనారాయణ (కాంగ్రెస్)ల ఎక్స్అఫీషియో ఓట్లతో ఆ కూటమి బలం 34కు చేరింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... బీజేపీ గూటికి వెళ్లిన స్వతంత్రుల్లో ఒకరు కాంగ్రెస్ కూటమికి రావడంతో కూటమి బలం 35కు పెరిగితే, బీజేపీ బలం 34కు తగ్గింది. బీజేపీ నుంచి మరో ఇద్దరు కూడా వస్తారనే ప్రచారం జరుగుతుండడంతో కమలం శిబిరం కలవరపాటుకు గురవుతోంది.కొత్తగూడెంలో కామ్రేడ్లుచెరో 22 డివిజన్లలో గెలిచిన కాంగ్రెస్, సీపీఐల మధ్య అధికార పంపిణీ ఒప్పందం కుదరడంతో ఇక్కడ ఆ రెండు పార్టీలు కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోనున్నాయి. తొలి రెండున్నరేళ్లు సీపీఐకి, మలి రెండున్నరేళ్లు కాంగ్రెస్కు మేయర్ పదవి ఇచ్చేలా ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది.పాలమూరులో మేయర్ ఎవరో..!మహబూబ్నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పరం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే..మేయర్ అభ్యర్థిత్వంపై ఈ పార్టీలో అభిప్రాయభేదాలు వచ్చాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు 31 ఓట్లు కావాల్సి ఉండగా, కాంగ్రెస్ గెలుపొందిన 29తోపాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు, ముగ్గురు ఎంఐఎం, నలుగురు స్వతంత్రుల మద్దతుతో ఆ పార్టీ బలం 37కు చేరింది. బీఆర్ఎస్ 15, బీజేపీ 8 మంది చొప్పున బలం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే, ఇక్కడ కాంగ్రెస్ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కొందరు కార్పొరేటర్లు క్యాంపు నుంచి శనివారం రాత్రే పాలమూరుకు చేరుకోవడం హాట్ టాపిక్గా మారింది.నిజామాబాద్ కాంగ్రెస్దే...!ఇందూరు కార్పొరేషన్ కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన మేరకు ఆ పార్టీ బలం సమకూర్చుకుంది. ఇక్కడ బీజేపీకి 28 డివిజన్లు రాగా, మ్యాజిక్ ఫిగర్కు మూడు తగ్గాయి. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డిలు ఎక్స్ అఫీషియో ఓట్లు వేస్తే ఆ మేరకు బలం చేకూరనుంది. కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం 14 మందితోపాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక కార్పొరేటర్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ కూటమి బలం 34కు చేరనుంది. దీంతో మేయర్ పీఠం కాంగ్రెస్కు, డిప్యూటీ మేయర్ ఎంఐఎంకు దక్కడం లాంఛన ప్రాయమే కానుంది. ⇒ నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లు కాంగ్రెస్ పరం కావడం కూడా లాంఛన ప్రాయమే. -
హంగు.. కొత్త రాజకీయ రంగు
రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖచిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొన్నిచోట్ల కాంగ్రెస్–బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్–బీజేపీ, ఒక్కోచోట కాంగ్రెస్–బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళుతుండడం, మజ్లిస్, ఏఐఎఫ్బీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత రెండు రోజులుగా మారిన రాజకీయ సమీకరణలను బట్టి సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా, మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చిన వాటితోపాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే చాన్స్ ఉంది. హంగ్ పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు నాలుగైదు, బీజేపీకి ఒకట్రెండు మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్⇒ మహబూబాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్కు 19 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్ నుంచి 13, బీఆర్ఎస్ నుంచి 12 మంది గెలిచారు. కాంగ్రెస్కు ముగ్గురు సీపీఎం, బీఆర్ఎస్కు ముగ్గురు సీపీఐ సభ్యులు మద్దతిస్తున్నారు. వీరు కాకుండానే ఇంకా మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన మరో ముగ్గురి కోసం స్వతంత్రులకు అధికార కాంగ్రెస్ గాలం వేసింది. ఈ ప్రయత్నాలు సఫలం కావడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే పీఠం దక్కించుకోనుంది. అయితే, చైర్మన్గా కాంగ్రెస్లో చేరిన ఇండిపెండెంట్ అయ్యే అవకాశం ఉంది. ⇒ తొర్రూరు: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన 9 మంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇక్కడ ఆ పార్టీకే మున్సిపల్ పీఠం దక్కే మెజారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిలను రంగంలోకి దింపుతోంది. ఇద్దరినీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేయించింది. దీంతో ఇరు పార్టీల బలం తొమ్మిదికి చేరనుంది. ఇక్కడ కూడా టాస్ అనివార్యం కానుంది. ⇒ ఆసిఫాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిర్ ఫిగర్ 11. ఇక్కడ కాంగ్రెస్కు ఏడుగురు, బీఆర్ఎస్కు 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు కాంగ్రెస్లో చేరగా ఈ మున్సిపాలిటీ ఆ పార్టీ పరం కానుంది. ⇒ ఖానాపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లకు 4 చొప్పున రాగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు గెలిచారు. ఒక స్వతంత్రుడు కాంగ్రెస్లో చేరడంతో వారి బలం 4కు చేరింది. ఇప్పుడు మూడు పార్టీల బలం సమంగా ఉంది. అయితే, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (కాంగ్రెస్) నమోదు కావడం, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి ఒక్కో స్వతంత్రుడు కాంగ్రెస్ వైపునకు వచ్చారన్న ప్రచారంతో ఈ మున్సిపాలిటీ హస్తగతం కావొచ్చు.లేదంటే 3 పార్టీలు అధికారాన్ని పంచుకునే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ⇒ ఆదిలాబాద్: మ్యాజిక్ ఫిగర్కు నాలుగు తక్కువగా 21 వార్డుల్లో విజయం సాధించిన బీజేపీని నిలువరించడమే కర్తవ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కూటమి కట్టాయి. తమ పార్టీల నుంచి కాకుండా స్వతంత్రుడిని చైర్మన్ చేయాలని నిర్ణయించాయి. దీంతో కాంగ్రెస్ (11), బీఆర్ఎస్ (6), ఎంఐఎం (6)తో పాటు స్వతంత్రుల మద్దతుతో ఈ మున్సిపాలిటీ పీఠంపై ఇండిపెండెంట్ కూర్చునే అవకాశాలున్నాయి. ⇒ భైంసా: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14. ఇక్కడ ఎంఐఎం 12 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ నుంచి ఒకరు కలిపితే ఆ పార్టీ బలం 13కు చేరనుంది. బీజేపీ నుంచి ఆరుగురు గెలిచారు. ఆ పార్టీకి ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లతో బీజేపీ బలం కూడా 13కు చేరింది. మరో ఇద్దరు స్వతంత్రులు ఎంఐఎం వ్యతిరేక వర్గంగా ఉన్నారు. వీరు ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ ఇద్దరు స్వతంత్రుల మనసు మారకపోతే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు. ⇒ కాగజ్నగర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ కాంగ్రెస్కు 9 మంది, బీఆర్ఎస్కు 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు, స్వతంత్రులు కలిపి కాంగ్రెస్కు మద్దతివ్వనుండడంతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లనుంది. ⇒ క్యాతనపల్లి: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 12 స్థానాలకుగాను ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి. బీఆర్ఎస్(10), సీపీఐ(4)ల మద్దతుతో ఈ స్థానం బీఆర్ఎస్ పరం కానుంది. ⇒ బెల్లంపల్లి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, ఇక్కడ పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన 14 మందిలో ఇద్దరు బీఆర్ఎస్ పక్షం చేరడంతో ఆ పార్టీ బలం 12కు తగ్గింది. అయితే, నలుగురు ఇండిపెండెంట్లతో మళ్లీ 16కు పెరిగింది. ఇక, 14 మంది కౌన్సిలర్లు గెలిచిన బీఆర్ఎస్ పక్షాన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరడంతో ఆ పార్టీ బలం కూడా 16కు చేరింది. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్లు ఈ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కాంగ్రెస్ జెండానే ఎగురవేయాలనే వ్యూహంతో ఉన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కూడా వారు టచ్లో ఉన్నట్టు సమాచారం. ⇒ బోధన్ : ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 20. కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం నుంచి గెలిచిన 12 మంది మద్దతుతో ఇక్కడ కాంగ్రెస్ పాగా వేయనుంది. మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎంఐఎం కొంత విభేదించినా చివరకు కాంగ్రెస్ ఇష్టానికే చైర్మన్ అభ్యరి్థత్వాన్ని వదిలేయడంతో కథ సుఖాంతమైంది. ⇒ కామారెడ్డి: ఈ మున్సిపాలిటీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు పావులు కదుపుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 25 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా, బీజేపీకి 16 మందితో పాటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్కు 19, బీఆర్ఎస్ 11 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. కాంగ్రెస్కు చైర్మన్, బీఆర్ఎస్కు వైస్చైర్మన్ దక్కే అవకాశాలున్నాయి. ⇒ అలంపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు ఆరుగురి బలం కావాలి. బీఆర్ఎస్కు ఐదు, కాంగ్రెస్కు ఐదు వచ్చాయి. ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటుతో గులాబీ జెండా ఎగరనుంది.⇒ జనగామ: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. కాంగ్రెస్కు 12, బీఆర్ఎస్కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. సీపీఎం కూడా కాంగ్రెస్కు మద్దతిస్తోంది. దీంతో ఆ పార్టీ బలం 13కు చేరుతుంది. నలుగురు స్వతంత్రులు గెలవగా.. ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. జనగామలోనే ఉన్న మరో కౌన్సిలర్ కాంగ్రెస్కు మద్దతిస్తారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ చామల కిరణ్ (కాంగ్రెస్), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(బీఆర్ఎస్) నమోదు చేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల బలం 16కు చేరుతుంది. ఈ నేపథ్యంలో జనగామ టాస్ వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ⇒ అలియాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 11. కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 7 కౌన్సిలర్లు గెలిచారు. ఇక్కడ బీఎస్పీతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. ముగ్గురు బీజేపీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్ఎస్లలో ఎవరికీ మద్దతివ్వడం లేదు. చైర్మన్ పదవి అడుగుతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చీల్చే పనిలో కాంగ్రెస్ ఉంది. ఏం జరుగుతుందో సోమవారమే స్పష్టత రానుంది. ⇒ ఎల్లంపేట: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్కు 8 మంది, బీఆర్ఎస్కు 12 మంది బలం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి (బీఆర్ఎస్) ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం 13కు చేరనుంది. ఈ మేరకు స్పష్టత ఉన్నా, బీఆర్ఎస్లో చీలిక తెస్తున్నామని కాంగ్రెస్ అంటోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపేట పీఠం ఎవరికి దక్కుతుందో సోమవారమే తేలనుంది. ⇒ పరిగి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్కు 10 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 8 మంది బలం ఉంది. ఇద్దరు స్వతంత్రులు చెరో పక్షం చేరారు. దీంతో ఇరు పార్టీలకు బలం చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఆర్ (కాంగ్రెస్) ఎక్స్ అఫీషియో నమోదు చేసుకోవడంతో ఆయన ఓటుతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరనుంది. ⇒ మొయినాబాద్ : ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 14. ఇందులో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7 గెల్చుకున్నాయి. ఇక్కడ స్వతంత్రులు ఐదుగురు గెలిచారు. వీరిలో మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనంత మంది స్వతంత్రులు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరి సహకారంతో మొయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరం కానుంది. ⇒ వికారాబాద్: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, కాంగ్రెస్ నుంచి 17 మంది గెలిచారు. స్వతంత్రుల మద్దతులో ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండానే కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వర్ధన్నపేట: ఈ మున్సిపల్ పీఠం కోసం 7గురు సభ్యుల బలం అవసరం. ఇందులో కాంగ్రెస్ గెలిచిన ఐదింటితోపాటు మరో స్వతంత్రుడు కలిపితే అధికార పార్టీ పక్షాన ఆరుగురు అయ్యారు. బీఆర్ఎస్ ఆరుగురు కౌన్సిలర్లను గెలిచింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఓటుతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పరం కానుంది. ⇒ కేసముద్రం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 9 మంది బలం కావాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు 8 చొప్పున స్థానాలు వచ్చాయి. ఇక్కడి నుంచి మహబూబాబాద్ లోక్సభ సభ్యుడు బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈయన ఓటుతో కేసముద్రం పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ జహీరాబాద్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19 కాగా, బీఆర్ఎస్ 15, బీజేపీ 3 కలిసినా మ్యాజిక్ ఫిగర్ రాదు. 14 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు. వీరికి ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతివ్వనుండడంతో పాటు ఎంపీ సురేశ్ షెట్కార్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రానుండడంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలున్నాయి. ⇒ గద్వాల: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 19. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్ 11, బీజేపీ నుంచి 7గురు, ఎంఐఎం నుంచి ఒక్కరు, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలం 19కి చేరుతోంది. అయితే, ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లు అవగాహన కుదర్చుకున్నారు. రెండు పార్టీల బలం 18కి చేరుతోంది. కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ఇద్దరు స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఏకంగా చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎంపీ మల్లురవిలు ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే... ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన 11 మందిలో పలువురు సరిత వర్గీయులే. దీంతో గద్వాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ⇒ నారాయణపేట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్ 7, ఎంఐఎం రెండు కలిపితే 9 మంది అవుతున్నారు. బీజేపీకి 11తోపాటు ఎంపీ అరుణ ఎక్స్ అఫీషియో ఓటు, స్వతంత్రుడితో ఆ పార్టీ బలం 13కి చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్ (2), ఏఐఎఫ్బీ (1)తో పాటు ఎమ్మెల్యే పరి్ణకారెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కాంగ్రెస్కు వస్తే ఆ పార్టీ బలం కూడా 13కు చేరనుంది. కానీ, గద్వాలతో ముడిపెట్టిన బీజేపీ.. బీఆర్ఎస్ను కాంగ్రెస్ వైపునకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలను విరమించలేదు. అనూహ్యం జరగకపోతే ఈ మున్సిపాలిటీ బీజేపీ పరమయ్యే అవకాశాలే ఎక్కువ. ⇒ అమరచింత: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ఆరు కాగా, మూడు ప్రధాన పార్టీలు మూడు చొప్పున గెలుపొందాయి. ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. సీపీఎం కాంగ్రెస్కు మద్దతివ్వడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పీఠం పంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఎవరు చైర్మన్ కావాలన్న పీఠముడి వీడితే అమరచింత బీజేపీ, బీఆర్ఎస్ కూటమిదే. ⇒ జమ్మికుంట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిచింది. ముగ్గురు స్వతంత్రులు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓటుతో ఆ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయతి్నంచింది. కానీ, 10 మంది కౌన్సిలర్లు గెలిచిన కాంగ్రెస్ పక్షానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు చేరడంతో బీఆర్ఎస్ బలం తగ్గింది. ఆ కౌన్సిలర్తోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్బీ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ బలం 15కు చేరనుంది. మ్యాజిక్ ఫిగర్కు రెండు పక్షాలకు ఒక ఓటు తగ్గుతుండడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ⇒ ఇస్నాపూర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 14 కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన 12 మంది, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి (ఎక్స్ అఫీషియో), ఒక ఇండిపెండెంట్తో కలిసి మ్యాజిక్ ఫిగర్ వస్తోంది. కానీ, ఇక్కడ ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్కు మద్దతిస్తున్నారు. 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా ఎంపీ రఘనందన్రావు ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ⇒ మెదక్, నర్సాపూర్ : హంగ్ ఏర్పడిన ఈ రెండు మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవగాహన కుదుర్చుకుంటున్నారు. మెదక్లో కాంగ్రెస్, నర్సాపూర్లో బీజేపీకి చైర్మన్ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ⇒ రాయికల్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 7 కాగా, బీఆర్ఎస్, బీజేపీల నుంచి గెలిచిన ఆరుగురికి తోడు స్వతంత్ర అభ్యర్థి జట్టుకట్టి ఈ మున్సిపాలిటీని దక్కించుకునేలా అవగాహన కుదిరింది. ⇒ దేవరకద్ర: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏడు కాగా, కాంగ్రెస్ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు గెలిచారు. అదే పార్టీ రెబెల్ ఒకరు పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి మరొకరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండా ఈ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ ఇంద్రేశం: ఈ మున్సిపాలిటీలో మేజిక్ ఫిగర్ 10 కాగా, ఎన్నికల్లో గెలిచిన 9 మందితోపాటు స్వతంత్ర కౌన్సిలర్ కూడా ఒకరు మద్దతివ్వనుండడంతో అక్కడ గులాబీ జెండా ఎగరనుంది. ⇒ కోహిర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 9 కాగా, గెలిచిన 8 మంది కౌన్సిలర్లతోపాటు మరో ఇండిపెండెంట్, ఒక ఎంఐఎం కౌన్సిలర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని దక్కించుకోనుంది. ⇒ జిన్నారం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11 కాగా, బీఆర్ఎస్ (8), బీజేపీ (4) మధ్య బేరసారాలు జరుగుతున్నాయి. బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ⇒ మెట్పల్లి: ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్లు కలిసి బీజేపీకి చెక్ పెడుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 14కుగాను బీఆర్ఎస్(6), కాంగ్రెస్ (6)తో పాటు నలుగురు స్వతంత్రులు కలిసి పాలకమండలి ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీంతో 10 చోట్ల గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ⇒ జగిత్యాల: మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 26 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 23 గెలిచింది. ఇక్కడ స్వతంత్రులుగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబెల్స్ 15 మంది గెలుపొందారు. వీరికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డితో ఆ పార్టీ అగ్రనాయకత్వం చర్చలు ఫలించడంతో జగిత్యాల పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వేములవాడ: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 15. 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లకుతోడు స్వతంత్రులు, ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా తోడయ్యారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానుంది.ఆమనగల్లులో ఏమవుతుందో?బీఆర్ఎస్కు చెక్పెట్టే యోచనలో కాంగ్రెస్, బీజేపీఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు పావులుఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, వీటిలో అధికార కాంగ్రెస్ కేవలం ఒక్క వార్డు మాత్రమే గెలుచుకుంది. ఆరు వార్డుల్లో బీజేపీ గెలుపొందగా, బీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంది. క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మద్దతు పలికినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చైర్మన్ పదవిని కాంగ్రెస్కు అప్పగించి, వైస్ చైర్మన్ పదవితో సర్దుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూలు ఎంపీ మల్లురవి ఎక్స్ అఫీషియో ఓట్లతో ఈ పీఠాన్ని ఆ రెండు పార్టీలు కైవసం చేసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది. -
మూడు ముక్కలాట!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల విలక్షణ తీర్పు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను సంకటంలో పడేసింది. 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు రావడంతో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అంశం ఆయా పార్టీల మధ్య మూడు ముక్కలాటగా మారింది. పరస్పరం కత్తులు దూసుకొనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు సహకరించుకుంటేనే కనీసం 15 మున్సిపాలిటీల్లో పాలకమండళ్లు కొలువుతీరే పరిస్థితి నెలకొనడం పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది.ఒకవేళ ప్రధాన రాజకీయ పక్షాలు సహకరించుకోకుంటే ‘గోడ దూకుళ్లు’ మాత్రమే ఆయా మున్సిపాలిటీల్లో పీటముడి వీడేందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. మరో 12 మున్సిపాలిటీల్లో స్వతంత్రుల సాయంతో, ఇంకో 5 మున్సిపాలిటీల్లో స్వతంత్రులతోపాటు ఎంఐఎం, ‘లెఫ్ట్’పార్టీల సాయంతో పాగా వేసేందుకు అధికార పార్టీకి అవకాశం ఉండటంతో ఆ దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ముడిపడిన మున్సిపాలిటీలివే.. హంగ్ ఫలితాలు వచి్చన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేయాలంటే 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ మద్దతు తప్పనిసరి కానుంది. ఈ జాబితాలో మెట్పల్లి, రాయికల్, అలంపూర్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్నగర్, మెదక్, నర్సాపూర్, ఎల్లంపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత, వర్ధన్నపేట, కేతనపల్లి ఉన్నాయి. కేతనపల్లిలో ఇరు పార్టీలు చైర్మన్, వైస్చైర్మన్ల పంపకాలపై అవగాహనకు వచ్చేందుకు అవకాశాలు ఉండగా మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్నగర్, మెదక్, నర్సాపేర్, ఎల్లంపేట, నారాయణపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్తో బీజేపీ కలిస్తే సులువుగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు చేజిక్కించుకొనే అవకాశం ఉంది. మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్లలో బీజేపీకి ఎక్కువ స్థానాలు రాగా మిగిలిన చోట్ల బీజేపీ కంటే బీఆర్ఎస్కు ఎక్కువ కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. కానీ రాజకీయంగా ఏ రెండు పార్టీలు కలిసినా మూడో పార్టీకి లబ్ధి కలుగుతుందనే అంచనాతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వెనుకంజ వేస్తున్నాయి. గైర్హాజరు... గోడ దూకుళ్లు ప్రధాన పార్టీలు మూడు దిక్కులుగా ఉన్న పరిస్థితుల్లో మిగిలిన ప్రత్యామ్నాయాలపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారికంగా అవగాహన కుదుర్చుకోకపోయినా స్థానిక నేతల మధ్య జరిగే చర్చలను బట్టి ఒక పార్టీ గెలుపు కోసం మరో పార్టీ గైర్హాజరైతే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చలు జరుగుతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అయితే అలా గైర్హాజరు కావడం ద్వారా మేజిక్ ఫిగర్లో మార్పులు వస్తే ఇబ్బందులు వస్తాయని.. నేరుగా మద్దతివ్వడమే పరిష్కారమని అంటున్నాయి. ఈ రెండు మార్గాలు కుదరని పక్షంలో మరో పార్టీకి చెందిన కౌన్సిలర్లను లాక్కోవడమే మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ అలా జరిగితే అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పలు చోట్ల స్వతంత్రులు కాంగ్రెస్లో చేరడమో లేదా మద్దతు ప్రకటించడమో జరిగిపోయింది. అయితే ఇందుకోసం రూ. లక్షల నుంచి రూ. కోట్ల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. స్వతంత్రుల సాయం తీసుకుంటే.. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ 12 మున్సిపాలిటీలను గెలిచే అవకాశం ఉందని ఫలితాలు చెబుతున్నాయి. జనగామ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మొయినాబాద్, ఇస్నాపూర్, కోహిర్, పరిగి, పోచంపల్లి, జగిత్యాల, వేములవాడ, దేవరకద్ర, వికారాబాద్ మున్సిపాలిటీల్లో స్వతంత్రులుగా గెలిచిన వారు కాంగ్రెస్ వైపు వస్తే ఆ స్థానాలు అధికార పార్టీ వశం అవుతాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఒక్క ఎక్స్ అఫీషియో ఓటుతో కేసముద్రం మున్సిపాలిటీని కూడా గెలుచుకోవచ్చు. దీంతో అధికార పార్టీ ఖాతాలో ఈ 13 మున్సిపాలిటీలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితోపాటు గద్వాల, మహబూబాబాద్, నారాయణపేట, జహీరాబాద్, బోధన్లలో స్వతంత్రులతోపాటు లెఫ్ట్, ఎంఐఎంలు సహకరిస్తే ఆయా పీఠాలు కూడా అధికార పార్టీకి లభిస్తాయి. ఇక ఆలియాబాద్లో మ్యాజిక్ ఫిగర్కు మూడు స్థానాలు తక్కువ పడగా ఒక స్వతంత్ర, ఒక బీఎస్పీ కౌన్సిలర్ను కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో మరొకరు అవసరం కాగా బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్కు వైస్చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. సీఎం వద్దకు వడ్డేపల్లి కౌన్సిలర్లు వడ్డేపల్లి మున్సిపాలిటీలో సంచలన విజయం సాధించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)కు చెందిన 8 మంది కౌన్సిలర్లు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరినట్టయింది. స్థానిక నేత వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంను కలిసిన వారిలో కౌన్సిలర్లు కుర్వ పావని, శారద, మంజుల, యుగేందర్రెడ్డి, దేవమ్మ, విజయభాస్కర్, జయశ్రీ, ఎరుకల తిమ్మప్ప ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళికా కమిషన్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్. సంపత్కుమార్ పాల్గొన్నారు. -
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లో కీలక పరిణామం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ బలం.. మ్యాజిగ్ ఫిగర్కి చేరుకుంది. బండి సంజయ్ సమక్షంలో రెబల్, ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీలో చేరారు. ఆ ఇద్దరి చేరికతో కార్పోరేషన్లో 34కి బీజేపీ బలం చేరుకోగా.. బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో 35కి బీజేపీ బలం చేరింది. కరీంనగర్ కార్పోరేషన్ దాదాపు బీజేపీ కైవసం చేసుకున్నట్లయింది.కరీంనగర్లో ఫలితాల తర్వాత రాజకీయం ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లో 66 డివిజన్లలో 30 సీట్లు గెల్చుకుని బీజేపీ.. అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లు దక్కించుకోవాలంటే 34 సీట్లు అవసరం. ఎక్స్ అఫీషియో మెంబర్లగా ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిల ఓట్లతో బీజేపీ బలం 33కి చేరింది. ఇప్పటికే మరో ఐదుగురు ఇండిపెండెంట్స్ బీజేపీలో చేరికతో కరీంనగర్ బల్దియాపై కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు బీజేపీకి లైన్ క్లియర్ అయ్యింది. కరీంనగర్లో 30 స్థానాలు గెలుచుకుని బీజేపీ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 స్థానాలకు పరిమితమవడంతో మేయర్ పీఠం బీజేపీ వశమవడంనల్లేరు మీద నడకలా ఉంది. తెరపైకి ఎక్స్అఫిషియో ఓట్లుఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. రాయికల్, మెట్పల్లి, జమ్మికుంటలో హంగ్ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి చోట్ల ఎక్స్అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గపరిధిలోని మున్సిపాలిటీలో ఎక్స్అఫిషియో ఓటుహక్కు కలిగి ఉంటారు. తన పరిధిలో రెండు మూడు మున్సిపాలిటీ ఉంటే.. ఎక్కడ అవసరమో అక్కడ ముందే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాని సమయంలో వీరి ఓటు కీలకమవుతుంది. తాజాగా పాత కరీంనగర్ జిల్లాలో ఎక్స్అఫిషియో ఓట్లపై జోరుగా చర్చ సాగుతోంది.కరీంనగర్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. మేజిక్ ఫిగర్ చేరుకోలేదు. అవసరాన్ని బట్టి 10 మంది ఇండిపెండెంట్ కార్పొరేటర్లతోపాటు, ఎక్స్అఫిషియో ఓట్లు వినియోగించుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అన్ని పార్టీలు తమ అమ్ముల పొదిలో దాచిన ఈ ఓట్లను అవసరాన్ని బట్టి వినియోగించనున్నాయి. బీజేపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఓట్లు ఉండగా..కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్లో, మేడిపల్లి సత్యం చొప్పదండిలో, ఆది శ్రీనివాస్ వేములవాడలో, మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ ధర్మపురిలో, మంత్రి శ్రీధర్బాబు మంథనిలో, హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్, విజయరమణారావు పెద్దపల్లి, సుల్తానాబాద్లో, రామగుండంలో మక్కాన్సింగ్ ఓట్లు వినియోగించుకునే అవకాశముంది. వీరే కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, భానుప్రసాద రావు ఉన్నారు. బీఆర్ఎస్కు గంగుల కమలాకర్, కేటీఆర్, కోరుట్లలో సంజయ్, హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ ఓట్లు అందుబాటులో ఉన్నాయి. -
ఒక్క ఓటు రాదు.. విజయ్పై బీజేపీ సంచలన కామెంట్స్
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్.. టీవీకే అధినేత విజయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార DMKకు విజయ్ పార్టే ప్రధాన ప్రతిపక్షం అన్నది విజయ్ అవగాహనా రాహిత్యం అన్నారు. ఇంటిమీద కోడిని పట్టుకోలేనోళ్లు.. ఆకాశం ఎగురుతా అని కలలు కనకూడదని హితవు పలికారు.తమిళనాడులో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ తమ అస్త్ర శస్త్రాలు తీసి ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్నాయి. విమర్శ, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే టీవీకే చీఫ్ విజయ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకేకు గట్టిపోటీ ఇచ్చేది తన పార్టీనేనని తమ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఇదే వెల్లడైందన్నారు. అయితే తాజాగా దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ స్పందించారు."విజయ్ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో ఆయన అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తున్నాయి. ఇంటిపైకెక్కి కోడినిపట్టుకోనోళ్లు.. ఆకాశం పైకి ఎగిరారట. ఆయన ప్రజల్లోకి వస్తే వాస్తవ పరిస్థితులేంటో ఆయనకు అర్థం అవుతోంది. గొప్ప నాయకులతో సంభాషించి రాజకీయం తెలుసుకోవాలి. కుండలో ఏదుంటో గరిటలోకి అదే వస్తుంది" అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీవీకే అధికారం సాధించడం కాదు కదా ఒక్క ఓటు కూడా ఆ పార్టీకి రాదన్నారు.అయితే అంతకు ముందు ఒక ర్యాలీలో విజయ్ మాట్లాడుతూ టీవీకేకు ఇండియా కూటమితో గాని, బీజేపీతో గాని పొత్తు ఉండదని ఆ పార్టీ ఒంటరిగానే అత్యధిక మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. దీనిపై బీజేపీ లీడర్ కౌంటరిచ్చారు. -
కన్నీళ్లు పెట్టుకున్నా... 10 ఓట్లు మాత్రమే వచ్చాయి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 9వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేసిన బొమ్మగాని రాజమణి ఓటమి పాలయ్యారు. ప్రచారంలో భాగంగా దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కన్నీళ్లు పెడుతూ యువతను ఓటు వేయాలని వేడుకుంది. అయితే ఆమెకు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. View this post on Instagram A post shared by Politics Meter (@politicsmeter) మూడే ఓట్లు.. అయినా తగ్గేదేలె.. జనగామ: జనగామ మున్సిపాలిటీలోని 27వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన అనంతుల డు ఓట్లు మాత్ర మే వచ్చాయి. అయినా మూడు వేళ్లతో చూపిస్తూ చిరునవ్వు చిందించారు.కల్నల్ తల్లి ఓటమి సూర్యాపేట: భారత్–చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోశ్బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయారు. -
పురంలో పైచేయి
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 66 మున్సిపాలిటీలు, రామగుండం, నల్లగొండ, మంచిర్యాల కార్పొరేషన్లలో విజయకేతనం ఎగురవేసింది. మరో ఐదారు మున్సిపాలిటీలు, మరో కార్పొరేషన్ను కూడా దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది.ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 13 పురపాలికల్లో విజయం సాధించింది. బీజేపీ, ఎంఐఎం విషయానికి వస్తే ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో మంచి ఫలితాలు సాధించిన కమలం పార్టీ.. పీఠాన్ని సొంతంగా కైవసం చేసుకోవడంలో వెనుకబడింది.ఇక దాదాపు 36 మున్సిపాలిటీలతో పాటు మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఎంఐఎం, సీపీఐ, సీపీఎం అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పలు వార్డు స్థానాల్లో విజయం సాధించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్తో తలపడిన సీపీఐ ఆ పార్టీకి దీటుగా విజయాలను సాధించినా మ్యాజిక్ ఫిగర్ను మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక అనూహ్యంగా గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) బలపర్చిన తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఎక్కువ చోట్ల గెలుపొందడం గమనార్హం. 51 శాతం స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ మున్సిపాలిలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డులు, డివిజన్ల వారీగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సగం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే విజయం సాధించింది. మొత్తం 2,996కు గాను 2,995 వార్డులు, డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో (మక్తల్లో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నిక నిర్వహించలేదు) ఆ పార్టీకి 1,538 స్థానాలు లభించాయి. అంటే దాదాపు 51 శాతం వార్డులు, డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (2020) కేవలం 580 వార్డులు, డివిజన్లను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్.. గతం కంటే ఏకంగా 900కు పైగా స్థానాలను అదనంగా దక్కించుకుంది.బీఆర్ఎస్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ 781 డివిజన్లు, వార్డుల్లో విజయం సాధించింది. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి 26 శాతం స్థానాలు లభించాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో 1,767 స్థానాల్లో గెలుపొందిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో దాదాపు 1,000 స్థానాలను కోల్పోవడం గమనార్హం. అయితే రెండు సందర్భాల్లోనూ అధికార పార్టీలే మెరుగైన ఫలితాలు సాధించడం కూడా గమనించ వలసిన విషయం. ఇక బీజేపీకి గత ఎన్నికల్లో 311 చోట్ల విజయం సాధించగా, ఈసారి ఆ పార్టీకి 3335 స్థానాలు దక్కాయి. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో 11.3 శాతం గెలుపొందింది. మరోవైపు సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 331 (11.3 శాతం) చోట్ల విజయం సాధించారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే సీపీఎం, ఎంఐఎం స్థానాలు గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. రెండుచోట్ల మినహా కాంగ్రెస్ జోరు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. ఉమ్మడి ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీలనూ స్వీప్ చేయగా, నల్లగొండలో కేవలం ఒక్క మున్సిపాలిటీ మినహా 16 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెజార్టీ స్థానాలు, కరీంనగర్ కార్పొరేషన్ మినహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్న్ను దక్కించుకోగలిగింది.ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ ఉమ్మడి మెదక్లో కొంత డీలా పడింది. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మున్సిపాలిటీల్లోనూ కొంత వెనుకబడింది. ఇక్కడ గులాబీ పరిమళం ఉమ్మడి మెదక్, హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాలు రావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీకి ఈ రెండు చోట్లనే ఎక్కువ స్థానాలు రాగా, 26 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కొంచెం అటూ ఇటుగా అవే ఫలితాలు వచ్చాయి. అయితే అప్పటి ఎన్నికల తరహాలోనే గ్రామీణ తెలంగాణ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు ఫలితాలు రావడం గమనార్హం. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు నారాయణపేట, నిర్మల్, ఖానాపూర్, కాగజ్నగర్ తదితర మున్సిపాలిటీలు, నిజామాబాద్, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో ఆ పార్టీకి చెప్పుకోదగిన స్థానాలు లభించాయి.కమలం పార్టీ విషయానికొస్తే ఈ ఎన్నికకల్లో నామమాత్రపు ప్రభావాన్ని మాత్రమే చూపగలిగింది. కొన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేలున్నప్పటికీ ఓటమి చవి చూడాల్సి వచి్చంది. వార్డుల వారీగా వచి్చన సంఖ్యలో గతంతో పోల్చుకుంటే పెద్దగా మార్పు లేకపోవడం, పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలపడుతుందనే సంకేతాలు కరీంనగర్, నిజామాబాద్ మినహా పురపాలికల్లో పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. 40 చోట్ల హంగ్! గతంలో ఎన్నడూ లేని విధంగా 36 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. అంటే వీటిల్లో సొంతంగా ఎవరూ మేయర్, చైర్పర్సన్లను దక్కించుకునే అవకాశం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్లో మ్యాజిక్ ఫిగర్కు 31 డివిజన్లు అవసరం కాగా, సీపీఐ, కాంగ్రెస్లకు చెరి 22 స్థానాలు మాత్రమే లభించాయి. ఇక నిజామాబాద్లో కూడా మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 31 స్థానాల కంటే మూడు స్థానాలు వెనుకబడిన బీజేపీ 28 స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ ఎంఐఎం (13), కాంగ్రెస్ (18)లకు కలిపి మ్యాజిక్ ఫిగర్ లభించడం గమనార్హం. కార్పొరేషన్లలో ఇలా.. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లలో మ్యాజిక్ ఫిగర్ సాధించిన ఆ పార్టీ అక్కడ మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైపోయింది. సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులు కూడా ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్అఫీషియోలుగా రంగంలోకి దించడం, ఏదీ కుదరకపోతే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని పదవులు, పదవీకాలం పంచుకోవడం లాంటి వ్యూహాలతో మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కరీంనగర్లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. క్యాంపులు షురూ..! ఏకంగా 40 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో హంగ్ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. ఈనెల 16వ తేదీ వరకు గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కాపాడుకోవాల్సి ఉండడంతో దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అన్ని పార్టీలు క్యాంపులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎక్స్అఫీషియో సభ్యుల నమోదుకు నేటి వరకు గడువు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకోవడానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు. రాజ్యసభ సభ్యులు శనివారం సాయంత్రం లోగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. అలా నమోదు చేసుకున్నవారికే.. ఈనెల 16వ తేదీన నిర్వహించే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత ఉంటుంది. కార్పొరేషన్లలో ఇలా.. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మూడు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండంలో మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైంది. సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులూ ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్అఫీషియోలుగా రంగంలోకి దించడం, లేదంటే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.కరీంనగర్లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మహబూబ్నగర్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 31కి ఒక్క స్థానం దూరంలో ఉంది.రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీపై వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనం. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా సంపూర్ణ ఆమోదం తెలిపారు. - రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రిమున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సామ, భేద, దాన, దండోపాయాలన్నీ ప్రయోగించినా ప్రజలమనసు గెలవలేకపోయింది. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే లౌకిక శక్తులతో కలిసిపనిచేస్తాం - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ గెలిచే అవకాశాలున్న చోట కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర పన్ని ఓడించాయి.ఈ మూడు పార్టీల మధ్య ఫెవిక్విక్ బంధం మరింత బలోపేతమైందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తమ మనుగడకుప్రమాదమన్న అక్కసుతో మజ్లిస్, అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు వ్యూహాత్మకంగా ఓడించే ప్రయత్నం చేశారు. - రాంచందర్రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు -
కరీంనగర్లో గెలుపు పట్టరాని సంతోషాన్ని ఇచ్చింది: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ గెలవడం గొప్ప విషయం అని.. ఈ గెలుపు పట్టరాని సంతోషాన్ని ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీపై నమ్మకంతో మాత్రమే కరీంనగర్ జనం గెలిపించారని.. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. కరీంనగర్కు కేంద్రం ఏమీ ఇవ్వలేదనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టామన్నారు. కరీంనగర్ ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారని.. ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని బండి సంజయ్ అన్నారు.‘‘హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్కు గుణపాఠం చెప్పారు ఓటర్లు. నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. ఒకనాడు రెండు సీట్లతో బీజేపీ ప్రస్థానం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై కోట్ల రూపాయలు వెదజల్లారు. మా పార్టీ కార్యకర్తలకు కూడా ఫోన్లు చేసి లక్షలిస్తామన్నారు. మేం మ్యాజిక్ ఫిగర్ దాటాం ఆల్రెడీ. ఇండిపెండెంట్స్ గా గెల్చినవారు కూడా మాకు మద్దతిస్తారు.ఎంఐఎం పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగురేసిన పార్టీ బీజేపీ’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
మేము ఓడిపోలేదు ముగ్గురూ కలిసి ఓడించారు
-
త్రిముఖ పోటీతో నష్టం జరిగింది: రాంచందర్రావు
సాక్షి, హైదరాబాద్: ఆరు మున్సిపాలిటీలో సింగల్ లార్జెస్ట్ గా అవతరించామని.. మొదటిసారి రెండు కార్పొరేషన్లు కైవసం చేసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. మొత్తం కలిపి 300 పైగా వార్డు, కార్పొరేటర్లు గెలిచారు. నారాయణపేటలో గెలిచాం. గతం కంటే ఇపుడు మెరుగయ్యాం. ఎన్నికల్లో మేము మేనిఫెస్టో ఇచ్చాం. ప్రభుత్వ తప్పిదాలపై ఛార్జీ షీట్ కూడా ప్రకటించాం. చాల చోట్ల స్వల్పంగా ఓడిపోయాం. త్రిముఖ పోటీలో నష్టం జరిగింది’’ అని రాంచందర్రావు పేర్కొన్నారు.‘‘ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం సాధించాం. ఖమ్మం కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో కూడా ఒకటి గెలిచాం. అధికార దుర్వినియోగం వల్లే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి ఇది క్లియర్ మెజారిటీ కాదు. బీఆర్ఎస్ కూడా గతం కంటే వెనకబడింది. బీఆర్ఎస్ది రెండో స్థానం అనుకోవడం కాదు.. గతం కంటే వెనుకబడ్డారు. బీజేపీకి ఓటు శాతం పెరిగింది. బీజేపీ ఓటింగ్ ప్రాంతాల్లోనే మజ్లీస్ పార్టీ, బీఆర్ఎస్.. కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. ఉత్తర తెలంగాణలో ముస్లిం పాపులేషన్ ఉంది. వాళ్ల ఓట్ల వల్లనే బీఆర్ఎస్, కాంగ్రెస్ అక్కడ గెలిచింది, కాంగ్రెస్ బీఆర్ఎస్, మజ్లీస్ ఒక్కటి అయ్యాయి’’ అని రాంచందర్రావు వ్యాఖ్యానించారు. -
కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుని పోతాం : కేటీఆర్
సాక్షి,తెలంగాణ భవన్: కొత్తగూడెం కార్పొరేషన్ హంగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. సీపీఐకి బీఆర్ఎస్ బహిరంగ మద్దతు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. మున్సిపాలిటీల్లో 2,500 స్థానాల్ని గెలుచుకోబోతున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విరోచిత పోరాటం చేశారు. కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుని పోతాం.కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల మా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లారు. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి ఫలితాలొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం,డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టింది.సింగరేణిలో జరుగుతున్న కుంభకోణణాన్ని బయటపెట్టాం. కొత్తగూడెం సింగరేణి బెల్ట్లో భాగం. కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తాము. ఇదే విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడాం. కాంగ్రెస్,బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లౌకిక పార్టీలతో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుంది. కాంగ్రెస్,బీజేపీ కుయుక్తులు పన్నుతున్నాయి.కాంగ్రెస్ను గద్దె దించే శక్తి ,బీజేపీ అడ్డుకునే శక్తి బిఆర్ఎస్ పార్టీకే ఉంది. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఫలితాలు సంతృప్తినిచ్చాయి.హైదరాబాద్ కార్పోరేషన్ , ఎంపీటీసీ,జెడ్పీటీ ఎన్నికల్లో ఇదే ఉత్సాహం కనబరుస్తాం. ఈ దేశం చాల గొప్పది, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి వారే ఓడిపోయారు. రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ సఫలం అవుతుంది. 2029లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.అధికార పార్టీ చాలా రకాలుగా సామ దాన దండోపాయలు ప్రదర్శించినా..ప్రజల మనస్సులు గెలుచుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి 40శాతం సర్పంచులు గెలిపించారు. నోరు మూసుకునేలా పురపోరులో ఫలితాలు సాధించాం.750 వరకు వార్డుల్లో BRS గెలుస్తుంది. వీరోచిత పోరాటం చేశాం.అధికారులను అడ్డం పెట్టుకొని కొన్ని వార్డుల్లో గెలిచి ప్రయత్నం చేస్తున్నారు.15 మున్సిపాల్టీలను సింగిల్ గా కైవసం చేసుకున్నాం.. మరో 15 మున్సిపాలిటీల్లో కూడా ఇతరుల సాయంతో అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు, మద్యం, అక్రమాలు తారా స్తాయికి చేరాయి.రేపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు గులాబీ జెండా పట్టుకొని తిరగాల్సి వస్తుంది.కాంగ్రెస్,బీజేపీ కలిసి పని చేస్తున్నట్లు అందరు చూస్తున్నారు.సింగరేణిలో దోపిడీపై ప్రశ్నిస్తే కాంగ్రెస్,బీజేపీ నుంచి సమాధానం లేదు. కాంగ్రెస్,బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్ఎస్కే ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మా నాయకులు,కార్యకర్తలు విరోచితంగా పోరాడారు. గద్వాలలో అధికారులను అడ్డం పెట్టుకుని గెలిచారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
కరీంనగర్ లో బీజేపీ డామినేషన్..
-
కేంద్రం కార్మిక హక్కుల చట్టాలను కాలరాస్తోంది
కవాడిగూడ/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కుల చట్టాలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాలరాస్తూ కార్పొరేటర్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పలువురు వక్తలు విమర్శించారు. గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భారీ ప్రదర్శనను ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరాపార్కు వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మిక, రైతు, ప్రజా సంఘాలు కదం తొక్కా యి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, బీఆర్టీ యూ, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల ఫెడరేషన్లు, అసోసియేషన్లు, రైతు సంఘాల నేతలు వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను పూర్తిగా కాలరాస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో లేబర్ కోడ్లను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు, ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఎం.నర్సింహ, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టీయూటీసీ రాష్ట్ర నాయకులు ఎస్ఎల్ పద్మ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కశ్య పద్మతో పాటు వివిధ సంఘాల నేతలు, ఆటో డ్రైవర్ యూనియన్లు, గిగ్ వర్కర్స్ యూనియన్, బ్యాంక్, అంగన్వాడీ, మున్సిపల్, జీహెచ్ఎంసీ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. -
రాహుల్ సభ్యత్వం రద్దు! జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా
-
Exit Poll: మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా!
హైదరాబాద్: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగిందని పీపుల్స్ పల్స్ పేర్కొంది.కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. నిజమాబాద్, కరీంనగర్, మహబుబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్ మేకర్ కానుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేవు’’ అని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.‘‘రామగుండంలో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-9, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఇతరులు 2-4 వార్డులు గెలుపొందే అవకాశం ఉందిమహబుబ్నగర్లో కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, బీజేపీ 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. నల్లగొండలో కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-10, ఎంఐఎం 2-4, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. నిజమాబాద్లో కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, బీజేపీ 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. కరీంనగర్లో కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉంది. 8-14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా?’ అన్నట్టు పోటీ ఉంది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -కాంగ్రెస్ పార్టీ 1210-1290, బీఆర్ఎస్ 860-930, బీజేపీ 250-270, ఏఐఎంఐఎం 35-44, సీపీఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది’’ అని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. -
శ్రీశైలంలో శివ భక్తులపై లాఠీచార్జ్ ఘటనపై బీజేపీ ధార్మిక సెల్ ఆగ్రహం
-
ముంబై మేయర్గా రీతూ తావ్డే ఏకగ్రీవం
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చరిత్రలో కొత్తదనం చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ముంబై నూతన మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 40 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక పదవిని బీజేపీ దక్కించుకోవడం ఇదే తొలిసారి. శివసేన (యూబీటీ) అభ్యర్థిని బరిలోకి దింపకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనితో బీఎంసీపై 25 ఏళ్లుగా సాగుతున్న థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శివసేన నేత సంజయ్ ఘాడీ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు.53 ఏళ్ల రీతూ తావ్డే ఘాట్కోపర్ వెస్ట్ నుండి మూడుసార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. క్షేత్రస్థాయి రాజకీయాలు, ప్రజా సంక్షేమ రంగాల్లో ఆమెకు దశాబ్ద కాలానికి పైగా అనుభవం ఉంది. 2012లో వార్డు 127 నుండి తొలిసారిగా బీఎంసీలోకి అడుగుపెట్టిన ఆమె, 2017లో వార్డు 121 నుండి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవల జనవరి 15న జరిగిన ఎన్నికల్లో వార్డు 132 నుండి ఘనవిజయం సాధించి తన పట్టును మరోమారు నిరూపించుకున్నారు. గతంలో ఆమె ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ చైర్పర్సన్గా కూడా సేవలందించారు.మొత్తం 227 స్థానాలు ఉన్న బీఎంసీలో బీజేపీ 89 సీట్లు గెలుచుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని మిత్రపక్షమైన శివసేన 29 స్థానాలను దక్కించుకుంది. 118 మంది కార్పొరేటర్ల బలంతో బీజేపీ నేతృత్వంలోని 'మహాయుతి' కూటమి మేయర్ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకుంది. 1997 నుండి సుమారు 25 ఏళ్ల పాటు బీఎంసీని పాలించిన శివసేన (యూబీటీ) ఈసారి 65 స్థానాలకే పరిమితమైంది. వారి మిత్రపక్షాలైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆరు స్థానాలను, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నాయి. సంఖ్యాబలం లేకపోవడంతో మేయర్ అభ్యర్థిని నిలబెట్టకూడదని శివసేన (యూబీటీ) నిర్ణయించుకుంది. -
పాలన ‘కమ్మ’దనంపై స్వపక్షం పెదవివిరుపు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వెళుతున్నాయి? రాష్ట్రంలో పాలన ‘కమ్మ’గా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్య పొలిటికల్ ఆటంబాంబుగా మారింది. కూటమిలో తెలుగుదేశం పార్టీ, ఒక సామాజికవర్గం పెత్తనంపై వ్యతిరేకత పెరిగిపోయిందనేందుకు ఇదో సూచిక. ముఖ్యమంత్రి చంద్రబాబేమో.. కుమారుడు లోకేశ్కు పట్టం కట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉంటే.. పాలన అధ్వాన్నంగా మారిందన్న అంచనాలు బలపడుతున్నాయి. అదే సమయంలో టీడీపీ రాజకీయ కక్షసాధింపులు, తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చేసిన రచ్చ కూడా కూటమి భాగస్వాములు బీజేపీ, జనసేనల అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణమవుతోంది. దీన్నే ఆదినారాయణ రెడ్డి తనదైన రీతిలో బయటపెట్టారు. ఇంకొంరు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల భావన కూడా ఇదే అయినప్పటికీ ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు పట్ల విధేయతగా ఉండడంతో తగ్గి ఉంటున్నారు. టీడీపీలో నిజంగానే ఒక సామాజికవర్గం అధికారం చెలాయిస్తోందా? అవుననే అంటున్నారు చాలామంది. ఆది నారాయణ రెడ్డి ‘కమ్మ’గా ఉందన్న కామెంట్కు సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలంతా చప్పట్లు కొట్టడం కూడా ఒక సంకేతమే. కమ్మ సామాజికవర్గం నాయకత్వం ఎలా ఉన్నా.... మిగిలిన వారిని కూడా కలుపుకొనిపోవాలని ఆయన సలహా ఇచ్చారు. బీజేపీ లేనిదే టీడీపీ, జనసేనలకు ఉనికి ఉండదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదం అంశంలో ఎంతో కష్టపడి ప్రచారం చేస్తున్న కుట్ర థియరీ గాలి కూడా ఆదినారాయణ తీసేశారు. లడ్డూ అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్దే పైచేయి అని స్పష్టం చేశారు. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్లో ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆ తరువాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు మంత్రివర్గ సభ్యుడు కూడా. 2019లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీలో ఆయనకు చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరుపొందిన అనకాపల్లి ఎంపీ సీ.ఎం. రమేష్కు మధ్య వర్గపోరు కూడా సాగుతోంది. ఇదో కోణమైతే ప్రభుత్వంలో చంద్రబాబు కంటే ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ మాటకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని టీడీపీతోపాటు బీజేపీ, జనసేనల్లోనూ బలంగా నమ్ముతున్నాయి. లోకేశ్ సొంత కోటరీతో షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయా అంశాలలో అహంకార పూరితంగా ప్రవర్తిస్తూ, గిట్టని వారిపై రెడ్బుక్ ప్రయోగిస్తూ అరాచకాలు చేయిస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. ఇతర పక్షాల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. చంద్రబాబు సీనియర్ నేత, ముఖ్యమంత్రి కనుక ఆయన వద్దకు వెళ్లి ఏ సమస్య అయినా మాట్లాడవచ్చు. కాని లోకేశ్ వద్దకు వెళ్లడం మిత్రపక్షాలకు అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల రాగం ఆలపిస్తుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,ఇతర నేతలు మౌనంగా ఉంటున్నారు. తాజాగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు లడ్డూ ప్రసాదంలో కల్తీ లేదని చెప్పడం గమనించదగిందే. అలాగే బీజేపీ నేతలపై కూడా చంద్రబాబు ఒత్తిడి చేసి తనకు అనుకూలంగా మాట్లాడాలని కోరుతున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఇంత గందరగోళం చేస్తున్నా బీజేపీ కేంద్ర పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదు.రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు మాధవ్ను తన అవసరార్థం పిలిపించుకుని లడ్డూపై ఉమ్మడి సమావేశంలో పాల్గొనేలా చేశారు. ఇవన్ని చూస్తే కూటమిలో అంత సవ్యత లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. క్రెడిట్ ఉంటే చంద్రబాబు, లోకేశ్లే తీసుకుంటున్నారని, నెగిటివ్ వచ్చినప్పుడే తాము కావల్సి వస్తున్నామని మిత్రపక్షాలలో ముఖ్యంగా బీజేపీలో ఉందట. ఆదినారాయణ రెడ్డి ఇదే సంగతిని పరోక్షంగా వెల్లడించారు. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని ఆక్షేపించారని వార్తలు వచ్చాయి. అంతకుముందు తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు తమ పార్టీ పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా అతను చేసిన కీచక పర్వం ఒక ఎత్తు అయితే, కేవలం ఒక డమ్మీగా స్థానిక టీడీపీ నేత రూపానందరెడ్డి పెత్తనంలో ఉండాల్సి రావడం కూడా గమనించవలసిన అంశం. జనసేనకు సంబంధించి కనీసం పది మంది అంతకుముందు టీడీపీలో ఉన్నవారే. చంద్రబాబు వారిని జనసేనలోకి పంపించి ఆ పార్టీ టిక్కెట్లు ఇప్పించారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ను మొదటి నుంచి బలహీనుడిగానే నిలబెట్టారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అనేకమంది చేస్తున్న దందాలు ఉండనే ఉన్నాయి. వాటిలో జనసేన, బీజేపీలకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఆ అసంతృప్తి కూడా ఉంది. రాష్ట్రంలో 95 శాతం మద్యం షాపులు, బెల్ట్ షాపులు టీడీపీ వారికే దక్కాయి. పైకి టీడీపీతో కలిసి ఉంటున్నప్పటికీ, ఈ సంగతులు తెలియని స్థితిలో మిత్రపక్షాలు ఉండవు కదా! అందులోను బీజేపీ జాతీయ పార్టీ.ఆ పార్టీ అండతోనే టీడీపీ గెలవగలిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎన్నికల సంఘం కూటమికి అనుకూల నిర్ణయాలు చేయడం వంటివి ఎన్నికల సమయంలో కనిపించాయి. కేంద్రంలో ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాలను పొగుడుతూ, రాష్ట్రంలో మాత్రం తమ పెత్తనాన్ని చంద్రబాబు సాగించుకుంటున్నారన్నది బీజేపీలో ఒక అభిప్రాయంగా ఉంది.కులపరంగా చూస్తే ఎంత కాదన్నా టీడీపీని కమ్మ సామాజికవర్గం తమ సొంత పార్టీగా భావిస్తుంటుంది.మంత్రివర్గంలో వారికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. పార్టీ అధిష్టానానికి సన్నిహితంగా ఉండేవారిలో ఎక్కువ మంది ఆ వర్గంవారే అంటారు. ఇతర వర్గాల వారి మాట పెద్దగా చెల్లడం లేదన్నది రాజకీయ వర్గాలలో ఉన్న అభిప్రాయం. ఇక జనసేన పార్టీ కాపు సామాజికవర్గంపై ఎక్కువగా ఆధారపడిన పార్టీ అన్నది తెలిసిందే. ఆ వర్గాన్ని ఆకర్షించడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకోగలిగారు. అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం లేదన్న విషయం అర్థమైన తర్వాత ఆ వర్గంలో అసంతృప్తి పెరుగుతోంది. దానికితోడు కాపు వర్గానికి జగన్ టైమ్లో లభించిన పథకాలు కూటమి ప్రభుత్వంలో రావడం లేదు. మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడం, ఇంటిపైకి వెళ్లి విధ్వంసకాండ సృష్టించిన వారు టీడీపీ గూండాలైనా అందులో కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు ముఖ్య పాత్ర పోషించారన్న ప్రచారం, అంబటిని దూషించిన ఒక కమ్మ సామాజికవర్గ మహిళపై కేసు పెట్టకపోవడంపై కూడా చర్చించుకుంటున్నారు. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబుతో ఉన్న బంధుత్వం కారణంగా అంబటినే తప్పుపట్టారని, అదే అంబటిని తీవ్రగా దూషించిన వారిని ఖండించలేదని, ఇది కుల ప్రభావమేనని కాపు సామాజికవర్గం భావిస్తోంది. అంబటి కుమార్తె మౌనిక మాట్లాడిన పద్దతి కూడా ఆ వర్గాన్ని ఆకట్టుకుంది. ఇక బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులు విసిరి నిప్పుపెట్టడం, అలా చేసిన టీడీపీ వారిపై చిన్న కేసులు పెట్టి సరిపెట్టడం బీసీ వర్గాలలో కూడా ఆందోళన కనిపించింది. దళిత వర్గాలపై ఈ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు గతంలో ఎప్పుడూ జరిగి ఉండవు. దాంతో ఆ వర్గంలో తీవ్ర అసమ్మతి ఉందని చెబుతున్నారు. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులపై కక్షతో తప్పుడు కేసులు పెట్టించిన తీరుతో ఆ వర్గం కూడా టీడీపీకి దూరం అవుతోందని చెబుతున్నారు. లడ్డూ ప్రసాదం వివాదాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్న తీరుపై బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా లడ్డూలో జంతుకొవ్వు, బాత్ రూమ్ కెమికల్స్ వంటివి ఉన్నాయని చంద్రబాబు, పవన్, లోకేశ్లు చెప్పడం పట్ల వారు మండిపడుతున్నారు. తమకు లడ్డూ ప్రసాదం తీసుకోవాలంటేనే బెరుకుగా ఉంటోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన వ్యాఖ్య దీనికి నిదర్శనం. పైగా టీడీపీ వాళ్లు ఫోన్ పోన్ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ను తిట్టడం, బెదిరించడం కూడా బాగా ప్రభావం చూపుతోంది. నిజానికి గత ఎన్నికల సమయంలో ఈ వర్గాలలో మెజార్టీ భాగం కూటమికే మద్దతిచ్చాయి. అయినా ప్రస్తుతం పరిస్థితి కేవలం ఒక సామాజికవర్గానికే అనుకూలంగా ఉందన్న భావన ప్రజలలో నెలకొంది. దానికి తోడు టీడీపీ పత్రికలుగా పేరొందిన మీడియా యజమానులు కూడా అదే సామాజికవర్గంగా ఉండడం, కూటమి ప్రభుత్వం చేసే అకృత్యాలకు సైతం మద్దతు ఇచ్చేలా కథనాలు రాయడం ఏపీ సమాజం గమనిస్తోంది. ఈ కారణాల రీత్యా ఆదినారాయణరెడ్డి వంటి నేతలు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2014 టర్మ్లో కూడా టీడీపీ ఇలాగే ఆయా సామాజిక వర్గాలను దూరం చేసుకుంది. ఈసారి మరింత ముందుగానే ఆ పరిస్థితి తెచ్చుకుందన్న భావన వివిధ రాజకీయ పక్షాలలో నెలకొంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కార్పొరేషన్ కహానీ
రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన జాబితాలో మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్నగర్ ఉన్నాయి. ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి.. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం గతం నుంచి కార్పొరేషన్లుగా కొనసాగుతున్నాయి. ఎంఐఎం కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్లగొండలో పోటీలో ఉంది. దీంతో ప్రధాన పార్టీల గెలుపోటములపై మజ్లిస్ ప్రభావం చూపనుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యే ఫైట్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నీలగిరి కార్పొరేషన్పై మూడు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. అయితే గట్టి పోటీ మాత్రం కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్యే కొనసాగుతోంది. ఇటీవల కార్పొరేషన్గా మారిన నల్లగొండలో మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్య ర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. బీజేపీ మజ్లిస్ మూడో స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.బీజేపీ– కాంగ్రెస్ హోరాహోరీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరపాలక సంస్థలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యహోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక్కడ పార్టీల మధ్య ఎలాంటి పొత్తులు లేవు. అయితే ఫలితాల అనంతరం మాత్రం పొత్తులు నెలకొనే పరిస్థితులు ఉంటాయనే అంచనా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రానిపక్షంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య అవసరాన్ని బట్టి పొత్తులు కుదిరే అవకాశముంది. కమలం – హస్తం..సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంది. అయితే కొన్ని డివిజన్ల పరిధిలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల నడుమ త్రిముఖపోటీ నెలకొంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ, రెబెల్స్ మధ్య పోటీ ఉంది. ఎంఐఎం కూడా 15 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపింది. ఈ కార్పొరేషన్ పరిధిలో హంగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉంది. ఇప్పటికే ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా, అది కూడా కాంగ్రెస్కే దక్కింది. మెజారిటీ డివిజన్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులదే పైచేయిగా ఉంది. మొదటి సారిగా బీజేపీ అధిక డివిజన్లలో పోటీ చేస్తోంది.‘గూడెం’లో కాంగ్రెస్ వర్సెస్ సీపీఐ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయ్యాక తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ వైరివర్గాలుగా మారి కొత్తగూడెంలో నువ్వా, నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, సీపీఎంతో జత కట్టి 58 డివిజన్ల నుంచి బరిలోకి దిగింది. సీపీఐ, టీడీపీతో పొత్తు కుదుర్చుకొని 57 స్థానాల నుంచి పోటీ చేస్తోంది. రెండు పార్టీల రెబెల్స్పై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ చివరకు ఒంటరిగానే బరిలో నిలిచింది. మంచిర్యాలలో కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్యే సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల కార్పొరేషన్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉండగా, పలు డివిజన్లలో బీజేపీ కూడా ప్రభావం చూపుతోంది. కార్పొరేషన్గా మారాక మొదటిసారి ఎన్నికలు జరుగుతుండడంతో మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే ఉత్కంఠ రేపుతోంది. నగరంలో అన్నిపార్టీలకు బీసీల మద్దతే కీలకంగా మారింది. అన్ని పార్టీలు మహిళలకు రిజర్వు అయిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ అధికంగా బీసీలకే బీఫాంలు ఇచ్చాయి. పాలమూరు.. త్రిముఖ పోరు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత ఇలాకా కావడం.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా పాలమూరు ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కొన్ని డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య, మరి కొన్నింటిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఎంఐఎం అభ్యర్థులు 16 డివిజన్లలో పోటీలో ఉన్నారు. వీరికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా, అది కాంగ్రెస్ ఖాతాలో చేరింది. -
మహాదేవప్ప మృతికి .. .. మంత్రి శ్రీహరి కారణం..!
-
సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు
బిహార్ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా అధికార పార్టీ చేసిన పనిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థిస్తుంటారు. అయితే అక్కడ అసెంబ్లీలో ఇందుకు వ్యతిరేకంగా జరిగింది. ఇటీవల బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ అక్కడి ఆసుపత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఆలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్యేలలో ఆమె అతి పిన్న వయస్కురాలు. అయితే ప్రస్తుతం బిహార్లో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడి వైద్యశాఖ మంత్రి మంగళ్ పాండేని మైథిలీఠాకూర్ ఆసుపత్రుల పనితీరుపై ప్రశ్న అడిగింది. దీనికి ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే దీనిపట్ల మైథిలీ ఠాకూర్ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేసింది.మైథిలీ మాట్లాడుతూ "వైద్యశాఖ మంత్రి ఆసుపత్రుల భవనాలకు చిన్న మరమ్మత్తులు చేస్తే సరిపోతుందన్నారు. అయితే నేను వాటిని స్వయంగా చూశాను. అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడి ఆసుపత్రులన్ని ఒక చిన్న గదిలో కొనసాగుతున్నాయి. మంత్రి సమాధానంపై నాకు సంతృప్తి కలగలేదు". అని మైథిలీ ఠాకూర్ అన్నారు.వైద్యశాఖ మంత్రి అంతా బాగుందన్నారు. అయితే పరిస్థితులు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి అని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ఇంతకు ముందు ఆసుపత్రులలో ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండేవారని ఇప్పుడు మాత్రం ఆయుష్ ప్రాక్టీషినియర్లతోటే ఆసుపత్రులు నడుస్తున్నాయని తెలిపారు.ప్రస్తుతం జనాభా 40 నుంచి 50 వేలున్న ప్రాంతంలో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్ ఫోక్ సింగర్. అయితే బిహార్లో ఇటీవలే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ, ఆర్జేడీలతో పాటు ఇతర మిత్రపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో స్వంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడంతో ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో మైథిలీ వ్యాఖ్యలు హాట్ టాఫిక్గా మారాయి. -
Hyderabad: డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. బారికేడ్లను తోసుకొని కార్యాలయం ముందుకు దూసుకువచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. వారి మధ్య వాగ్వాదం జరిగింది. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై బీజేపీ నిరసనలకు దిగింది. మంత్రి శ్రీహరి వేధింపులే కారణమని బీజేపీ ఆరోపిస్తుంది.మక్తల్ బీజేపీ అభ్యర్థి సూసైడ్ చేసుకున్నట్లు ఫిర్యాదు వచ్చిందని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని... మహాదేవప్ప సూసైడ్ లెటర్ రాయలేదని.. విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. కాగా, మక్తల్ పట్టణ కేంద్రంలో 6 వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి చెందడంతో తాత్కాలింగా ఆ వార్డు ఎన్నిక మాత్రమే రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
తెలుగువారి పరువు తీస్తున్న బాబూ అండ్ కో!
తమిళనటుడు కమల్హాసన్ తెలుగువారి కీర్తి దశదిశలా మారుమోగేలా చేశారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో తెలుగువారు గర్వించదగ్గ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కవిత ‘వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్’’ను చదివి వినిపించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ కవితకు ఆర్థం తెలుగువారికి బాగా తెలుసంటూ ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు అది వేరే సంగతి.ఒక పక్క ఓ తమిళ నటుడు తెలుగువారి సాహితీ వైభవాన్ని చాటిచెబితే ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అందరి ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడటం మాత్రం తెలుగువారికి ఏమంత గర్వకారణం కాదు. అంతేకాదు.. ఈ రాజకీయ బురదలోకి బాబు అండ్ కో బీజేపీ నేత మాధవ్ను కూడా దింపేశారు. కల్తీ మకిలిని మాజీ సీఎం జగన్పైకి నెట్టేందుకు టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలం కావడం.. జగన్ జనాల్లో తిరుగుతూ ప్రభంజనాన్ని సృష్టిస్తుండడంతో చంద్రబాబుకు ఎటూ పాలుపోవడంలేదుఅందుకేనేమో.. పవన్కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మరికొందరు మంత్రులతో మూకుమ్మడిగా ప్రెస్మీట్ పెట్టి జగన్, వైసీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. మత కోణాన్ని తెచ్చి జగన్ను దెబ్బతీయాలని ప్రయత్నించి బోర్లాపడ్డారు. ఈ క్రమంలోనే పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ చంద్రబాబు హిందూ ధర్మంలో విడాకులు ఉండవని, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని వింత వ్యాఖ్యలు చేస్తూ విడాకులు తీసుకోవడాన్ని తప్పుపట్టారు. సహజంగానే ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్ర అసహనం కలిగింది.అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అప్పుడే చంద్రబాబు తప్పు మాట్లాడుతున్నారని ధైర్యంగా చెప్పగలిగి ఆయన గౌరవం పెరిగేది జనసైనికులలో ఆయనపై నమ్మకం కలిగేది. కాని ఆయన మౌనంగా కూర్చోవడం వారి గుండె మంటకు కారణమైంది. ఎందుకంటే హిందూ ధర్మం అయినా, మరే మత ధర్మమైనా అవి విశ్వాసాలే. కాని దేశానికి ఒక రాజ్యాంగం, చట్టం ఉంటాయి.రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి విడాకుల గురించి అలాంటి మాటలు మాట్లాడితే మరి చట్టం మాటేమిటి? ఏ కారణం వల్లనైనా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినా, మహిళలు హింసను కూడా భరించాలని చంద్రబాబు చెప్పదలిచారా? సంసారాలు విడాకుల వరకు వెళ్లగూడదని చెప్పడం వేరు. అసలు విడాకులు తీసుకోవమే నేరం అన్నట్లు మాట్లాడడం వేరు.ఇది ఒక కోణమైతే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో కుట్ర జరిగిందని చంద్రబాబు ఇంకో దిక్కుమాలిన వాదన తీసుకువచ్చారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న తన ఆరోపణలో నిజం లేదని వెల్లడయ్యాక, ప్రజలలో వచ్చిన అప్రతిష్టను డైవర్ట్ చేయడానికి మరో కుట్ర చేసినట్లు కనిపిస్తుంది. నిజానికి రాజకీయ ప్రత్యర్థి జగన్పై బురద రాయాలన్న తాపత్రయంలో, ఓట్ల రాజకీయంలో భాగంగా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారన్న విషయం అందరికి తెలుసు.విశేషం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏమో తిరుమలకు అపవిత్రత రాకూడదన్న లక్ష్యంతో పాకులాడుతుంటే, తాను స్వామివారి భక్తుడిని అంటూ ఆయనకే అపచారం చేసే విధంగా మాట్లాడడానికి చంద్రబాబు వెనుకాడడం లేదు. తన హయాంలో జరిగిన తప్పులను సైతం వైసీపీపై తోసివేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వికటిస్తున్నా, గోబెల్స్ మాదిరి అదే తప్పుడు ప్రచారం పదే, పదే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనికి ఎల్లో మీడియా డైరెక్షన్ ఎటూ ఉంది.పవన్ కళ్యాణ్ తాను గతంలో చేసిన కొన్ని ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడానికి సీఎంకు ఏమి సంబంధం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబుతో భేటీ తర్వాత పాతపాటే పాడారు. చంద్రబాబు బతిమలాడారా? బెదిరించారా? ఈ వివాదంలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంటీ అంటనట్లే ఉంటున్నారు. కాని చంద్రబాబు ఆయన్నూ పనికట్టుకుని ప్రెస్మీట్లో పాల్గొనేలా చేశారు. తద్వారా ఆ బురదను ఈయనకు కూడా అంటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు లడ్డూ వివాదాన్ని సృష్టించడానికి ఏ రకంగా పనిచేసింది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఒక క్రమ పద్ధతిలో వివరించారు. అదంతా వింటే జగన్పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది. లడ్డూ ప్రసాదం కల్తీపై దర్యాప్తునకు సిట్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దాంతో ఈ విచారణ చాలావరకు చంద్రబాబు చేతి నుంచి జారి పోయింది. రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు సిట్లో ఉన్నా ప్రధాన పాత్ర సీబీఐది కావడం వల్లనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టమైన నివేదిక ఇవ్వగలిగారు.ఈ పరిణామంతో తాము జనంలో బాగా పలుచనయ్యామన్న సంగతిని అర్థం చేసుకున్న చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని ఏకంగా ఫ్లెక్సీలు కట్టి జగన్, సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిలపై దుష్ప్రచారం చేయించారు. జంతు కొవ్వు ఆరోపణ చేయడం, అరాచకపు ఫ్లెక్సీలు కట్టించడం, లడ్డూకు ఏదో అయిందన్నట్లు అదే పనిగా ప్రచారం చేయించడం.. వీటిని కదా వెంకన్నకు మకిలి అంటించే కుట్ర అనేది? జగన్ గుంటూరు పర్యటనకు జనం విశేషంగా రావడం, అక్కడ లడ్డూ అంశాన్ని ప్రస్తావించి చంద్రబాబును తీవ్రంగా తప్పుపట్టడంతో చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టి మరింత గందరగోళంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని ప్రశ్నలు సంధించారు. నెయ్యి కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి శాంపిల్స్ తీసింది కూటమి ప్రభుత్వంలోనా? కాదా? వెనక్కి పంపించిన నాలుగు ట్యాంకర్లు కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో ఉంచడం, తదుపరి ఆ నెయ్యిని కూడా స్వీకరించారని సిట్ తెలిపిందా? లేదా? బోలేబాబా కంపెనీ వచ్చింది 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనా? కాదా? చంద్రబాబు హయాంలోనే కిలో నెయ్యి రూ.291లకే టీటీడీ ఎలా కొనుగోలు చేసింది?ఈ ప్రశ్నలకు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్లు ఎక్కడా జవాబు ఇవ్వలేదు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిట్ తేల్చింది కదా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు చంద్రబాబులో కనిపించిన అసహనం అన్నిటికి జవాబు చెబుతోంది. ప్రెస్మీట్ లో పాల్గొన్నవారిలో ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క కనిపించడం లేదని, తప్పు చేశామన్న గిల్టితో ఉండి దబాయింపు చేసి బయటపడాలన్న వారి తాపత్రయం కనబడుతోందని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అనిపిస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ మరోసారి మాట మార్చి భగవంతుడిపైనే పగబట్టారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.దానికి పేర్నినాని జవాబు ఇస్తూ పవన్ కళ్యాణ్ ఒకసారి క్రిస్టియన్ అని, బాప్టిజం తీసుకున్నానని చెబుతారు. మరోసారి ముస్లిం అని అంటారు. ఇంకోసారి తన తండ్రి దీపారాధన వత్తుల మంటలో సిగరెట్ వెలిగించుకుంటారని అంటారు..ఇక ఆయన సోదరుడు తాను నాస్తికుడనని చెబుతారు.. మళ్లీ హిందూ సనాతని అన్నట్లు మాట్లాడుతున్నారు..అని మండిపడ్డారు.వీరంతా రాజకీయ అవసరాల కోసం రకరకాల అవతారాలు ఎత్తుతున్నారని వైసీపీ ధ్వజమెత్తుతోంది.నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు హిందూ ధర్మం పట్ల నిబద్దత ఉంటే నిత్యం అబద్దాలు చెబుతారా? మోసపూరిత హామీలు ఇచ్చి జనాన్ని మభ్య పెడతారా? అన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు. తనపై తనకు నమ్మకం లేనప్పుడు, తమ అసమర్ధతను ప్రజలు బాగా గుర్తిస్తున్నారని భయపడినప్పుడే పాలకులు మతాన్ని తెరపైకి తెస్తారని ఒక రచయిత అంటారు. నిజమే కావచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. వేధింపులే కారణమా?
సాక్షి నారాయణ పేట: మక్తల్లో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప ఆరవ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి తొమ్మిదిన సోమవారంతో ప్రచారం ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవ్.. అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.రేపు బుధవారం ఎలక్షన్ ఉండడంతో కొందరు వ్యక్తులు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్ చేసుకున్నారా.. వేరే కారణం ఉందా అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. -
కాంగ్రెస్, బీజేపీ మధ్యే మున్సిపోరు: కిషన్రెడ్డి
గోదావరిఖని/శ్రీరాంపూర్: రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగైందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సింగరేణి కార్మీకులకు ఇప్పటికే కోత విధించిన ఆదాయపన్ను తిరిగి చెల్లిస్తామని, భవిష్యత్లో పూర్తిగా మాఫీ చేస్తామని మంత్రి కిషన్రెడ్డి అభయం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం బీజేపీ కేంద్ర నాయకుడు ఎస్.కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో భయాకమైన పరిస్థితులు నెలకొన్నాయని, సింగరేణి అధికారులతో సమీక్షించాక అనేక విషయాలు వెలుగు చూశాయని తెలిపారు. రూ.51వేల కోట్లకన్నా అధికంగానే ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉందని, బొగ్గు, విద్యుత్ తీసుకుంటూ ఒక్కపైసా చెల్లించడం లేదన్నారు. సంస్థ పనితీరు, సంక్షోభం గురించి కార్మీక సంఘాలు కూడా నిర్మొహమాటంగా అనేక విషయాలు వెల్లడించారన్నారు. ఈ విషయాలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. ముస్లిం ఓట్ల కోసమే రేవంత్ఖాన్గా.. ముస్లిం ఓట్లకోసమే సీఎం రేవంత్రెడ్డి తన పేరును రేవంత్ఖాన్గా పెట్టుకున్నారని మంత్రి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. మజ్లిస్ కనుసన్నల్లోనే కాంగ్రెస్ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను దోచుకున్నాయని, రెండు పార్టీలకు సింగరేణి ఏటీఎంగా మారిందన్నారు. కారు గుర్తుకు భవిష్యత్ లేదని కేసీఆర్ కూతురు కవిత వ్యాఖ్యానిస్తున్నారని, కారులో ఒకటైరు కవిత, మరోటైరు కేటీఆర్ తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితం అయ్యారని, బీఆర్ఎస్ రాష్ట్రంలో కనుమరుగైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ప్రజలను వంచనకు గురిచేస్తోందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే రామగుండం అభివృద్ధి చెందుతుందన్నారు. నాయకులు ఎస్.కుమార్, దుగ్యాల ప్రదీప్, బల్మూరి వనిత, సంధ్యారాణి, సంజీవరెడ్డి, గోమాస శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కాసిపేట శివాజీ, కోమళ్ల మహేశ్, రాజమౌళి గౌడ్ పాల్గొన్నారు. సింగరేణిని దోచుకుంటున్నారు.. కాంగ్రెస్ అంటేనే కమీషన్, కరప్షన్, మోసం, దగా అని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సింగరేణిని దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. సింగరేణిని రక్షించుకోవాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలని, ఒకవేళ వారు గెలిస్తే మనకు వాత పెడుతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్రావు, జోనల్ అధ్యక్షుడు సత్రం రమేశ్, అభ్యర్థులు కమలాకర్రావు, ముఖేశ్గౌడ్, పొన్నవేని సదానందం, వనపర్తి కేత రాజేశ్, కాదాసి భీమయ్య తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్లో వార్ వన్ సైడే..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్ వన్సైడ్గా మారిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. మొత్తం 66 డివిజన్లలో బీజేపీ 45 స్థానాలను కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. మేయర్ పీఠం బీజేపీకి అప్పగిస్తే.. కరీంనగర్ ప్రజలకు రక్షణ కవచంగా మారి భూకబ్జాదారులు, డ్రగ్స్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. ప్రచారం చివరి రోజైన సోమవారం ఆయన కరీంనగర్లోని తీగలగుట్టపల్లి, చింతకుంటలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్ విఠల్తోపాటు స్థానిక నేతలు పాల్గొన్న ఈ మీటింగ్లలో బండి సంజయ్ మాట్లాడుతూ, గతంలో ఆర్వోబీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకుండా ఇబ్బంది పెడితే, కేంద్రం నుంచి సేతుబంధు పథకం కింద మొత్తం రూ.154 కోట్లు తానే మంజూరు చేయించుకొచ్చానని వివరించారు. ఎన్నికలు అయిపోగానే వీలైనంత త్వరగా ఆర్వోబీ సమస్యను తీర్చే బాధ్యత తనదే అన్నారు. ప్రస్తుతం అమృత్ 2.0 కింద వచ్చిన రూ.32 కోట్లతో ఎక్కువ శాతం పనులు చింతకుంట పరిధిలో చేయిస్తున్నామని, త్వరలోనే ఇక్కడ తాగునీటి సమస్య తీరుతుందన్నారు.‘కరీంనగర్లో ఎలాగూ గెలవమని కొందరు పైసల సంచులు దించారట. తీసుకోండి. ఎంత ఇచ్చినా.. అదంతా మన వద్ద దోచుకున్న సొమ్మే. ఇన్నాళ్లూ దాచుకుని ఇప్పుడు ఇస్తు న్నారు. వాళ్లు మనీని నమ్ముకున్నారు. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. దయచేసి మీరు కరీంనగర్ను ఆగం చేయకండి. ఆలోచించకుంటే ఐదేళ్లు ఆగమైతం.. బీజేపీకి ఓటు వేయకుంటే అన్ని రకాలుగా నష్టపోతాం’అని పేర్కొన్నారు. -
బీజేపీ తెచ్చిందేమీ లేదు.. బీఆర్ఎస్కు అర్హత లేదు
సాక్షి, హైదరాబాద్: పన్నెండేళ్లలో రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ ఇప్పుడు నిధులు తెస్తామంటే నమ్మాలా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్రెడ్డి, బండి సంజయ్లు ఏ ఒక్క పథకం కిందనైనా అదనంగా నిధులు తీసుకుని వచ్చారా? అని నిలదీశారు. పదేళ్లు వార్డు సభ్యుని నుంచి సీఎం వరకు అన్ని పదవులు అనుభవించిన బీఆర్ఎస్కు సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఓటు వేయాలని అడిగే అర్హత లేదని అన్నారు. మున్సిపాలిటీల్లో సమస్యలకు బీఆర్ఎస్ కారణమని, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వాన్ని పట్టణ ప్రాంత ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును విశ్లేషించి ఓటు వేయాలని కోరారు. కళ్లముందున్న గతం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నదని చెప్పారు. సోమవారం సీఎం తన నివాసంలో సలహాదారు వేం నరేందర్రెడ్డి, టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి, టీపీసీసీ నేత నీలం మధుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఒక్క ప్రాజెక్టు అయినా కేటాయించిందా? ‘2014 ఎన్నికల ముందు మోదీ పాలమూరు సభలో రంగారెడ్డి– పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నారు. 12 సంవత్సరాలు గడిచినా రాలేదు. మొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చారు. ఆ విషయం ప్రస్తావిరని భావించా. కానీ దాని ఊసెత్తకుండా మోదీని చూసి ఓటేయండని అడిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదిలాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో కట్టుకోవడానికి అనుమతిస్తామంటూ చెప్తారని ఆశించా. అదేమీ లేకుండా మహారాష్ట్రలో భూమి మునిగితే తెలంగాణ కనీసం నష్టపరిహారం ఇవ్వలేదంటూ రాష్ట్రాన్ని అవమానించారు. హైదరాబాద్లో వరద సమయంలో బండి సంజయ్ ఆటోకు ఆటో, బండికి బండి, ఇంటికి ఇల్లు అని ప్రచారం చేశారు. వారి మాట నమ్మి ప్రజలు దాదాపు 50 డివిజన్లలో గెలిపించారు. ఎన్నికలయ్యాక..మీకు ఇన్సూరెన్స్ ఉంది అన్నీ వస్తాయని చెప్పారు. సత్రంలో భోజనం ఉచితమే.. దానికి నెల్లూరు పెద్దారెడ్డి సిఫారసు లేఖలా ఉంది బండి సంజయ్ తీరు. తాజాగా కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని నమ్మించే యత్నం చేస్తున్నారు. 12 ఏళ్లుగా అదనంగా ఒక్క రూపాయి ఇవ్వని వారిని ఇప్పుడు నమ్మొచ్చా? రాజ్యాంగబద్ధంగా, ఎవరి ప్రమేయం లేకుండా వచ్చే నిధులను తాము ఇచ్చినట్లు చెప్పుకోవడమేమిటి? కేంద్రం తన విచక్షణతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా కేటాయించిందా? రాష్ట్రం నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్కరైనా మోదీ దృష్టికి తీసుకెళ్లారా?..’అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు మాట్లాడతారా? ‘కిషన్రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీకి, ఢిల్లీకి తాకట్టు పెట్టినట్లు మాట్లాడడం ఏమి న్యాయం? మూసీకి, మెట్రోకు, సమ్మక్క సారక్కకు, ఇతర దేవాలయాలకు ప్రత్యేకంగా నిధులు తెచ్చారా? వరంగల్ విమానాశ్రయం కోసం వందల కోట్లు ఖర్చు చేసి భూములు కేంద్రానికి ఇచ్చాం. పక్కనున్న ఏపీలో ఆరేడు విమానాశ్రయాలు ఉంటే.. తెలంగాణకు ఒక్కటి మాత్రమే ఉంది. ఇప్పుడు మోదీని చూసి ఓట్లు వేయాలంటున్నారు. మోరీల్లో చెత్త తీయడానికి మోదీ వస్తారా? అసదుద్దీన్ను భూతంగా చూపించి ఎంతకాలం మత రాజకీయాలు చేస్తారు? బీజేపీకి అసదుద్దీన్ లైఫ్లైన్గా మారారు..’అని రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ను యాసిడ్ పోసి కడగాలి ‘బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రారు. వచ్చిన వారు అభివృద్ధి కోసం కాకుండా సభను అడ్డుకోవడానికి వస్తారు. సభల్లో వారిద్దరు అహంకారం, విద్వేషంతో గంజాయి, కొకైన్ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఈ పార్టీ వారికి ఓటు వేస్తే వారు మునిసిపాలిటీలకు రారు. అభివృద్ధి పట్టించుకోరు. ఇప్పుడున్న సమస్యలన్నింటికీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు కారణం కాదా? ఇప్పుడు మూడోసారి మళ్లీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్లు వసూలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లది 2023 వరకు విడదీయలేని అనుబంధం. నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్లచట్టాలు, ట్రిపుల్ తలాక్కు మద్దతిచ్చారు. అందుకే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతోంది. బీఆర్ఎస్ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు. బీఆర్ఎస్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వొద్దు..’అని సీఎం వ్యాఖ్యానించారు. మేం రెండేళ్లలో ఎన్నో చేశాం.. ‘మేం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదటి తారీఖునే వచ్చేలా చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు చెల్లించి లాభాల బాటలోకి తెచ్చాం. రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా రూ.9 వేల కోట్లు చెల్లించాం. సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. పేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు అందిస్తున్నాం.70 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. వందేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా బీసీ కులగణన చేసి చూపించాం. నలభై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలంగాణ సమాజానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి..’అని రేవంత్ కోరారు. -
బాబుపై తిరగబడుతున్న బీజేపీ, జనసేన
-
బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన లేదు
-
కూటమిలో తలో మాట!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ పొత్తు రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. పైకి మూడు పార్టీలు కలిసే ఉన్నప్పటికీ, లోలోన మాత్రం టీడీపీ తమను పెద్దగా పట్టించుకోవడం లేదని రుసరుసలాడుతున్నాయి. కూటమి కట్టకపోతే అధికారంలోకి వచ్చే వారమే కాదని, ఈ పరిస్థితిలో అందరం కలిసి అధికారం చేపట్టినప్పుడు ప్రాధాన్యత కూడా అలానే ఉండాలని జనసేన, బీజేపీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఇతర చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్నప్పుడు పూర్తి పెద్దన్న హోదాలో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించినా, మిత్రపక్ష చిన్న పార్టీలను అణగదొక్కేలా వ్యవహరించినా, పెద్దగా పట్టించుకోని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు కేవలం 19 నెలల పాలనలోనే తెలుగుదేశం పార్టీ ఒంటెత్తు పోకడలను మిత్రపక్ష జనసేన, బీజేపీ నేతలు తప్పుపట్టే పరిస్థితివచ్చింది. సీఎం చంద్రబాబు కేవలం ఒక్క కులానికే పెద్ద పీట వేయడాన్ని ఆదివారం తిరుపతిలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తప్పుపట్టారు.రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే కమ్మగా ఉందని చెప్పారు. పైగా ‘కమ్మ’గా అంటే తాను ప్రత్యేకించి చెప్పక్కర లేదని, మీకందరికీ (సమావేశంలో ఉన్నవారికి) అర్థమై ఉంటుందన్నారు. ఆ కమ్మతోపాటే మనందరం ఉన్నామని చెప్పారు. ఒక్క కులం, మతం అని కాదు.. ఎవరు గట్టిగా పని చేస్తారో వారికి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.పెత్తనమంతా టీడీపీ నేతలదేబీజేపీ–జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలే పెత్తనం చెలాయించడం.. ఆయా నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ గ్రామ స్థాయి నేతలను టీడీపీ నేతలు పట్టించుకునే పరిస్థితే లేకపోవడంతో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రాజీనామా చేసిన బొలిశెట్టి సత్యనారాయణ కూడా కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పదవులిచ్చే వారి పేరు పక్కన జనసేన నేత అని పెట్టారు తప్ప.. వాళ్లు జనసేన పార్టీ కోసం ఎప్పుడూ పని చేసిన వారు కాదంటూ బొలిశెట్టి వాపోయిన విషయం తెలిసిందే. జనసేన నేతలు కానప్పటికీ, టీడీపీ నేతలకు జనసేన ముద్ర వేసి పదవుల పందేరం చేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిట్లోనే ఉమ్మడి కార్యాచరణ మిత్రపక్షాల పట్ల టీడీపీ తమకు అవసరం ఉన్నప్పుడు ఒకలా.. మిగతా సమయాల్లో మరోలా వ్యవహరిస్తున్న తీరును పలువురు బీజేపీ నేతలు ఈ సందర్భంగా ఎత్తిచూపుతున్నారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్న సందర్భంలో పొత్తులో ఉన్న మిత్రపక్షాలకు కొద్దిపాటి రాజకీయ ప్రయోజనం కూడా దక్కకూడదన్నట్టు వ్యవహరిస్తారని పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. అలాంటిది తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ చార్జిషీటు దాఖలు చేయడంతో ఈ వ్యవహారంలో బీజేపీని బలవంతంగా భాగస్వామిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీలో చర్చ జరుగుతోంది. 2024 సెప్టెంబర్లో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చేసిన తీవ్ర ఆరోపణలకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ చార్జిషీటు తర్వాత వ్యక్తిగతంగా తాను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాగానే, బీజేపీని ఈ అంశంలోకి లాగేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ను ప్రత్యేకంగా మంత్రుల సమావేశానికి పిలిపించారని రాజకీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఉమ్మడి కార్యాచరణ అంటూ తన పాపాన్ని అందరి మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నారని తప్పు పడుతున్నారు. నామినేటెడ్ పదవులు, అధికారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం దూరం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన కమ్మగా ఉందిజమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బీజేపీ లేకుంటే టీడీపీ, జనసేన రాష్ట్రంలో నిలబడలేవురాష్ట్రాభివృద్ధిలో బీజేపీ కీలకం.. తక్కువగా అంచనా వేయొద్దుతిరుపతి గాంధీ రోడ్డు : రాష్ట్రంలో పాలన కమ్మగా సాగుతోందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి భవితవ్యాన్ని నిర్ణయించే శక్తి బీజేపీకే ఉందని గుర్తుంచుకోవాలన్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పుడే కాళహస్తి ఆనంద్ అడిగాడు.. రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందన్నా అని. ఎన్టీఆర్ హయాంలో పాలన ఎలా సాగుతోందని ఒకరు గజ్జల మల్లారెడ్డిని అడిగితే కమ్మగా సాగుతోందని చెప్పారు. ఇప్పుడు నేనూ అదే చెబుతున్నా. రాష్ట్రంలో పాలన ఇంకా కమ్మగా సాగుతోంది. ఆ పరిస్థితి పోవాలి. కమ్మగా అంటే మీకు అర్థమై ఉంటుంది. అయితే ఈ కమ్మతో పాటే మనందరం ఉన్నాం. అందువల్ల కుల, మతాలకు అతీతంగా నిజాయితీగా కష్టపడే వారందరికీ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. బీజేపీ లేకుండా తెలుగుదేశం గానీ, జనసేన గానీ రాష్ట్రంలో రాజకీయంగా నిలబడలేవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని, అధిక శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ విషయంలో గట్టిగా మాట్లాడాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలకం అని తెలిపారు. గూగుల్, కాగ్నిజెంట్ వంటి బహుళజాతి సంస్థలు రాష్ట్రానికి రావడానికి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీ పాత్రను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. -
కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో కబడ్డీ ఆట మొదలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇండియా పేరుతో బీజేపీ, పాకిస్తాన్ పేరుతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి కబడ్డీ ఆటను ప్రారంభించాయన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు ఖాయమని, కబడ్డీ కప్ బీజేపీ గెలుచుకోవడం తథ్యమని తేలడంతో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్ (మ్యాచ్ ఫిక్సింగ్) కుదిరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బుతో పెద్ద ఎత్తున ఓట్లను కొనుగోలు చేసి, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ‘విజయ సంకల్ప ర్యాలీ’నిర్వహించారు. బీజేపీ తెలంగాణ ఇన్చార్జి, మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశీష్ షెల్లార్, మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెవెన్యూ గార్డెన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వేలాది మంది కాషాయ పగిడీలు ధరించి పాల్గొన్నారు. టవర్ సర్కిల్ వద్ద బండి సంజయ్, నవనీత్ కౌర్ ప్రసంగించారు. అభివృద్ధి నినాదంతో తాము కరీంనగర్ ఎన్నికలకు వెళ్తున్నామని, బీజేపీ 50 సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని అందుకోబోతోందని సర్వేలన్నీ తేల్చడంతో కాంగ్రెస్, ఎంఐఎం నేతల వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. అందుకే ఒవైసీ శనివారం రాత్రి కరీంనగర్కు వచ్చి ఎంఐఎం గేర్ మారుస్తుందని మాట్లాడారని గుర్తు చేశారు. రామాయణం, మహాభారతంలో రావణుడు, కౌరవులకు ఏ గతి పట్టిందో.. ఎంఐఎంకు కూడా అదే గతి పట్టించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని అన్నారు. -
‘బీజేపీ, బీఆర్ఎస్ రెండూ బొమ్మ-బొరుసులే’
భూపాలపల్లి: ఫోన్ల ట్యాపింగ్తో బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు సంపాదించారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ఫోన్ల ట్యాపింగ్ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్కు బీజేపీకి సహకరిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్లు రెండూ బొమ్మ-బొరుసు లాంటి పార్టీలని మండిపడ్డారు. ఇక భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారనే వార్తలపై సీఎం రేవంత్ స్పందించారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మారింది. కాంగ్రెస్ అభివృద్ధితోనే భూపాలపల్లి ఈ స్థాయికి చేరింది. భూపాలపల్లి ఎక్కడికి పోదు.. తప్పుడు ప్రచారం నమ్మొద్దు. మరొకవైపు మెడికల్ బోర్డు రద్దు అవుతుందనే విషం ప్రచారం కూడా మొదలుపెట్టారు. మెడికల్ బోర్డు రద్దు ఆలోచన ప్రభుత్వ దృష్టిలో లేదు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు’ అని సీఎం రేవంత్ హెచ్చరించారు. -
‘గత ప్రభుత్వం తప్పులనే కాంగ్రెస్ కొనసాగిస్తోంది’
నల్లగొండ: గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు. ఎస్సీ, బీసీ, రైతు, యువ డిక్లరేషన్లు ఏమయ్యాయని, ఆరోగ్యశ్రీ బకాయిలు, రీయింబర్స్మెంట్, రైతు భరోసా రావడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ బహిరంగ సభలో రాంచందర్రావు ప్రసంగించారు. ‘రేవంత్ రెడ్డి పేరు రేవంతొద్దీన్. దేవాలయాలను, హిందూ దేవుళ్లను కాంగ్రెస్ అవమానిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్కు ఓటేసినట్లే. బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే గెలిచినవాళ్లు పార్టీలు మారరు. జీతాలు ఇవ్వడానికి నిదులు లేవని రేవంత్ అంటున్నారు. జీతాలు, ఫించన్లు ఇవ్వడానికి నిధులు లేకపోతే రాష్ట్ర అభివృద్ధి ఎలా చేస్తావ్ రేవంత్.జనాలపై పన్నుల భారం పెంచబోతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లేదు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరబోతోంది. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మంచినీటి సరఫరా, రోడ్లు సరిగా లేవు. నల్లగొండను స్మార్ట్ సిటీ చేస్తాం. కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది’ అని స్పష్టం చేశారు. -
కూటమి పాలనపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
-
‘ప్రభుత్వం కమ్మగానే ఉంది.. పాలన కూడా ఇంకా కమ్మగానే ఉంది’
తిరుపతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో ఆదినారాయణరెడ్డి కూటమి ప్రభుత్వంలోని పదవుల కేటాయింపులపై వ్యంగ్యంగా స్పందించారు. ‘ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది. పాలన కమ్మగా ఉంది అంటే అందరికీ అర్థమై ఉంటుంది. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి పాలన కమ్మగానే ఉందని చెప్పారు. అదే విషయాన్ని మళ్లీ నేను చెబుతున్నా. ఎన్టీఆర్ పాలనపై గజ్జల మల్లారెడ్డి చెప్పిందే నేను చెబుతున్నా. కూటమి పాలన ఇంకా కమ్మగానే ఉంది. ఒక కులం కాకుండా.. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కమ్మతో పాటు అందరం ఉన్నాం. కులాలకు సంబంధంలేకుండా అందరినీ సమానంగా చూడాలి. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన లేదు. కూటమిలో బీజేపీనే ప్రధానం..ఆ తర్వాతే టీడీపీ, జనసేన’ అంటూ వ్యాఖ్యానించారు. -
సమయం లేదు మిత్రమా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల క్షేత్రం ఇప్పుడు రణరంగంగా మారింది. ప్రచార గడువు ముగియ డానికి కేవలం రెండు రోజులే సమయం మిగిలి ఉండటంతో, రాష్ట్రంలోని 116 మున్సి పాలిటీలు, 7 కార్పొరేషన్లలో బీజేపీ తన దూకుడును అమాంతం పెంచింది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి లభి స్తున్న అపూర్వ స్పందనను చూస్తుంటే గెలుపుపై ధీమా పెరుగుతోందని, ఈ సానుకూల వాతావరణాన్ని ఓట్ల రూపంలోకి మలచడమే తక్షణ కర్తవ్యమని పార్టీ శ్రేణులకు నాయకత్వం దిశానిర్దేశం చేసింది.అంతర్గత నివేదికల ప్రకారం.. కనీసం 3 కార్పొరేషన్లు, 30 నుంచి 40 మున్సిపాలి టీల్లో కమలం జెండా ఎగురవేసేందుకు పరిస్థితు లు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఈ గెలుపు అవకాశాలను శాస్త్రీయంగా అంచనా వేస్తూ రాష్ట్ర పార్టీ అభ్యర్థులను ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా వర్గీ కరించింది. కచ్చితంగా గెలిచే స్థానాలను ‘ఏ’ గ్రేడ్లో ఉంచి, అక్కడ పోలింగ్ బూత్ స్థాయి మేనేజ్ మెంట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. స్వల్ప తేడాతో గెలిచే అవకాశం ఉన్న ‘బీ’ గ్రేడ్ వార్డులలో ఉన్న లోటుపాట్లను అధిగమించేందుకు వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. స్థానిక నాయకులు, తటస్థులు, మీడియా వర్గాల సమాచారాన్ని ధ్రువీకరించుకుంటూ.. ఈ వర్గీకరణను పటిష్టం చేశారు.దిగ్గజ నేతల వ్యూహ రచనఈ రాజకీయ సమరంలో దిగ్గజ నేతలు తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పరిధిలో, ఎంపీ అర్వింద్æ ధర్మపురి నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఇప్పటికే సొంత సర్వేల ద్వారా బలాబలాలను బేరీజు వేసుకుని అభ్యర్థులను గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇదే బాటలో ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పర్యవేక్షణ ముమ్మరం చేశారు.సుడిగాలి పర్యటనలుప్రచార ముగింపు సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆదివారం హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ కొత్తగూడెం, కోదాడ, నల్లగొండలలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నారు. చివరి రోజైన సోమవారం నిజామా బాద్లో ఆయన పర్యటన ఉండగా, కరీంనగర్లో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ ప్రచార పగ్గాలు చేపట్టనున్నారు. ప్రచార గడువు ముగిసే వరకు ప్రతి ఇంటినీ తాకుతూ, భారీ రోడ్డు షోలతో మున్సిపల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడడమే లక్ష్యంగా బీజేపీ సర్వసన్నద్ధమైంది. -
పవన్ ప్రచారం చేస్తే.. మైనస్సే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం రద్దయింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారంతో రాష్ట్ర బీజేపీ ఈ ప్రచారయత్నాలను విరమించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుతో జనసేన పార్టీ స్థానికనేతలు సమావేశమైనప్పుడు ఈ అభిప్రాయం వచ్చినట్లు తెలిసింది. ఏపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన అభ్యర్థులను నిలపడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ రెబెల్ అభ్యర్థికి జనసేన తరఫున బీఫామ్ ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చే పవన్ కల్యాణ్ బీజేపీకి ఓటేయమంటారా లేక జనసేనకు ఓటేయమంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీ జెండాలు కూడా ప్రదర్శిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. దీంతో శనివారం నుంచి వికారాబాద్, తాండూరు, నల్లగొండ తదితర చోట్ల నిర్వహించాలని భావించిన పవన్ ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు పార్టీ నాయకులు పేర్కొన్నారు. పైకి మాత్రం అనారోగ్య కారణాలు చూపినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంటూ బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి పోటీచేసిన 8 చోట్లా డిపాజిట్ గల్లంతు కావడాన్ని గుర్తుచేస్తున్నారు. -
వారిదే ఫెవికాల్,ఫెవిక్విక్ బంధం
సాక్షి.హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఫెవికాల్, ఫెవిక్విక్ బంధం ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైందని, నేటికీ కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వ్యాఖ్యానించారు. గతంలో ‘ఓటుకు కోట్లు’కేసులో రేవంత్రెడ్డిని కేసీఆర్ కాపాడితే, నేడు కాళేశ్వరం అవినీతి విషయంలో కేసీఆర్ను రేవంత్ కాపాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్లు కూలినపుడు కేవలం వాటి పైనే జస్టిస్ ఘోష్ కమిషన్ను వేసి రేవంత్ చేతులు దులుపుకున్నారని, అయితే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోందని చెప్పారు.శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సహ ఇన్చార్జిలు అశోక్ పర్మాణి, రేఖాశర్మ, మాజీ ఎంపీ పి.రాములు, పార్టీ నేతలు డా.ఎన్.గౌతమ్రావు, ఎన్వీ సుభాషలతో కలిసి.. ‘వికసిత్ తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం’పేరిట మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార గీతాన్ని కూడా వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడారు. కమీషన్ల సర్కార్ నడిపిస్తున్నారు.. ‘ఈ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందనే పూర్తి నమ్మకం ఉంది. బీజేపీ విజయం తథ్యమని తెలుసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అసహనంతో మాట్లాడుతున్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని సీఎం రేవంత్ అంటున్నారు. జిల్లాల వారీగా ఎంతెంత ఇచ్చామో చిట్టా మా వద్ద ఉంది. రాష్ట్ర బడ్జెట్లో ఏ జిల్లాకు ఎంత నిధులు ఇచ్చారో రేవంత్ చెప్పగలరా? ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో కమీషన్లు తీసుకుంటూ కమీషన్ సర్కార్ నడిపిస్తున్నారు..’అని రాంచందర్రావు విమర్శించారు. కేంద్రంలో మా సర్కార్ ఉందని మరిచిపోవద్దు ‘మా పార్టీ కార్యకర్తలపై పోలీసులు అనవసర కేసులు, దాడులు, బెదిరింపుల వంటి అరాచకాలకు పాల్పడితే బీజేపీ చూస్తూ ఊరుకోదు. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉందని పోలీసులు మరిచిపోవద్దు. జాతీయ మానవహక్కుల కమిషన్ వద్దకు లాక్కెళ్లి నిలబెడతాం. శనివారం మంచిర్యాలలో ఎన్నికల ప్రచారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వస్తుంటే.. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులను కొట్టి, బెదిరించి ఉపసంహరింపజేసిన ఉదంతాలను సీరియస్గా తీసుకుంటాం. కర్ణాటకలో మాదిరిగా హేట్స్పీచ్ యాక్ట్ (విద్వేషపూరిత వ్యాఖ్యల చట్టాన్ని)ను బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ తెలంగాణలోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చట్టాన్ని తీసుకొస్తే ముందుగా సీఎం రేవంత్రెడ్డిపై మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టినందుకు కేసులు పెట్టాల్సి వస్తుంది..’అని రాంచందర్రావు అన్నారు. బీజేపీ ప్రధాన హామీలివే.. ⇒ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదు ⇒ ఆన్లైన్, సింగిల్ విండో సిస్టం ద్వారా వారం రోజుల్లో ఇంటి అనుమతులు ⇒ ప్రతి వార్డు/డివిజన్లో బస్తీ దవాఖానాల బలోపేతానికి కృషి, చౌక ధరల్లో మందులు ⇒ అర్హత కలిగిన మున్సిపాలిటీలు/కార్పొరేషన్లను స్మార్ట్ సిటీలుగా ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పిస్తాం ⇒ మున్సిపాలిటీ/కార్పొరేషన్లను గ్రీన్ టౌన్/క్లీన్ సిటీలుగా తీర్చిదిద్దుతాం ⇒ అన్ని చోట్లా 100% భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ.. షీ టీమ్స్ వ్యవస్థ బలోపేతం ⇒ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, క్రమం తప్పకుండా జాబ్ మేళాలు ⇒ ఏఐ సాంకేతికత సహకారంతో అవినీతి రహితంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ⇒ 100% ఇంటింటి చెత్త సేకరణ, సమర్థవంతంగా వ్యర్థాల నిర్వహణతో చెత్త రహిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు -
రేవంతుద్దీన్ అంటే నాకు సంతోషమే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నన్ను రేవంతుద్దీన్ అని ముస్లిం పేరుతో పిలిచారు. ఈ పిలుపును నేను సంతోషంగా స్వీకరిస్తా. అయితే రాంచందర్రావు పక్కన కూర్చున్న కిషన్రెడ్డి మాత్రం కల్వకుంట్ల కిషన్రావుగా మారి కేసీఆర్ను జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నారు. కేసీఆర్కు కేటీఆర్ అనే దొంగ పుత్రుడు ఉండగా, కేంద్రమంత్రి కిషన్రెడ్డి కల్వకుంట్ల కిషన్రావు దత్తపుత్రుడిగా మారాడు.ఈ దత్తపుత్రుడు కేసీఆర్, హరీశ్రావులను కాపాడుతున్నాడు. గతంలో మోదీ రాష్ట్రానికి వచి్చనప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను ఆరు నెలల్లో జైలుకు పంపుతామని చెప్పిన కిషన్రెడ్డి ఇప్పుడు ఏ బొక్కలో దాక్కున్నాడు?..’అంటూ సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కిషన్రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును కోరుతున్నా అని అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కేశాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ను ఎప్పుడు జైలుకు పంపుతారు? ‘కేసీఆర్ను ఎప్పుడు జైలుకు పంపుతారని కిషన్రెడ్డి, ఎంపీ అరి్వంద్లను ప్రశి్నస్తున్నా. కేసీఆర్, హరీశ్రావులను జైల్లో పెట్టి చిప్ప కూడు తినిపించాలని «ఎంపీ ధర్మపురి అరి్వంద్ అంటుంటారు. మేం కాళేశ్వరం విషయమై శాసనసభలో చర్చ పెట్టి కేసును సీబీఐకి ఇచ్చాం. ఇప్పటివరకు సీబీఐ పట్టించుకోలేదు. కేసీఆర్, హరీశ్రావులను చర్లపల్లి జైలులో పెట్టకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? దీనిపై ధర్మపురి అరి్వంద్ ఎందుకు మాట్లాడరు?..’అని సీఎం ప్రశ్నించారు. అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ వెళ్తా.. ‘బ్రిటిష్ హయాం తర్వాత 100 ఏళ్ల వరకు బీసీ కులగణన జరగలేదు. ఇప్పుడు కులగణన చేసినందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ నన్ను గతంలో రేవంత్గౌడ్ అని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపడంతో మంత్రి దామోదర రాజనర్సింహ రేవంత్ మాదిగ అన్నారు. 30 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన వాకిటి శ్రీహరిని మంత్రిని చేస్తే ముదిరాజ్ వర్గం నన్ను రేవంత్ ముదిరాజ్ అని వ్యాఖ్యానించింది. అనిల్కుమార్ యాదవ్ను రాజ్యసభకు పంపిస్తే రేవంత్ యాదవ్ అని పిలిచారు. స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తానన్నందుకు సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని పిలిచారు.ఇవన్నీ నాకు సంతోషం కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఆ వర్గానికి అనేక పదవులు ఇచి్చంది. షబ్బీర్ అలీ నిజామాబాద్లో గెలవకపోయినా పదవి ఇచ్చాం. ఎమ్మెల్యేగా ఓడిపోయినా అజహరుద్దీన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నాం. 8 మంది మైనారిటీ నాయకులకు కార్పొరేషన్ పదవులు ఇచ్చాం. కాబట్టి రాంచందర్రావు నన్ను రేవంతుద్దీన్ అని పిలిచినా సంతోషంగా తీసుకుంటా. నాకు ఎలాంటి సమస్య లేదు. అన్ని కులాలు, మతాలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తా. తెలంగాణను నంబర్ వన్గా తయారు చేస్తా..’అని ముఖ్యమంత్రి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లది వీణావాణి బంధం ‘కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చాం. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.500లకే 50 లక్షల కుటుంబాలకు సిలిండర్ ఇస్తున్నాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అమలు చేస్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరికి ఓటేసినా మూసీలో వేసినట్లే. ఈ రెండు పార్టీలది వీణావాణి బంధం.. ఫెవికాల్ బంధం..’అని సీఎం విమర్శించారు. నేను, మహేశ్గౌడ్ జోడెద్దుల్లా పనిచేస్తున్నాం.. ‘నేను, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ జోడెద్దుల్లాగా కలిసి పని చేస్తున్నాం. వైఎస్ రాజశేఖర్రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ సారథ్యంలో 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 2023లో నేను పీసీసీ అధ్యక్షుడిగా, మహేశ్గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చాం. 2028లోనూ నేను సీఎంగా, మహేశ్గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా ఎనిమిదేళ్లు అధికారంలో ఉంటుంది..’అని రేవంత్ చెప్పారు. ఈ సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ. ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సభాపర్వం నిరాశాజనకం
‘మీ స్వరాన్ని పెంచకండి... చట్టసభల్లో మెరుగుపరుచుకోవాల్సింది మీ వాదనను మాత్రమే’ అన్నారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా హక్కుల యోధుడు డెస్మండ్ టుటు. దేశంలో చట్టసభల తీరుతెన్నులు చూస్తున్నవారికి ఎప్పుడూ ఖేదమే మిగులుతోంది. చట్టసభల పేరుచెబితే వాగ్యుద్ధాలూ, వాకౌట్లూ గుర్తుకొస్తున్నాయి. ఎప్పటిలాగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా ఆ ధోరణిలోనే సాగుతున్నాయి. ఈసారి పార్లమెంటు లోపలే కాదు, వెలుపల కూడా ఆధిక్యతా ప్రదర్శన కనబడుతోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కావొచ్చు, అధికార విపక్షాలు ప్రత్యర్థుల్లాకాక శత్రుపక్షాల్లా పోట్లాడుకుంటున్నాయి. చివరకు ఎక్కడివరకూ పోయిందంటే... కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ పట్ల అవాంఛ నీయ చర్యకు పాల్పడే అవకాశం ఉందంటూ తనకు సమాచారం అందటంతో ఆయన్ను సభకు రావొద్దంటూ తానే సూచించానని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అదంతా అబద్ధమన్నది కాంగ్రెస్ వాదన. నిజానిజాల సంగతలా ఉంచి లోక్సభ స్పీకర్ ప్రధానిని సభకు రావద్దని సూచించటం ఊహకందనిది. ఇలాంటి పరిణామాలు ప్రపంచం దృష్టిలో మన ప్రజాస్వామ్యాన్ని పలచబారుస్తాయి. కాంగ్రెస్ తీరుచూస్తే సభను సాగనివ్వకపోవటమే దాని ఏకైక వ్యూహంగా కనబడు తోంది. దీనిద్వారా ఆ పార్టీ ఎలాంటి సందేశం పంపదల్చుకున్నదోగానీ, కీలకమైన బిల్లులు ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతున్నాయి. పద్దులు గిలెటిన్ అవుతున్నాయి. పాలక పక్షం పని సులభమవుతోంది. సభలో మెజారిటీయే దేన్నయినా నిర్ణయిస్తుంది. విపక్షాలు దాన్ని అడ్డుకోలేవు. కనీసం అర్థవంత మైన చర్చంటూ జరిగితే ఎలాంటి బిల్లులు వస్తున్నాయో, వాటి లోటుపాట్లేమిటో,అందువల్ల కలిగే పరిణామాలేమిటో సామాన్యులు అర్థం చేసుకునే వీలుంటుంది. తమ వ్యూహం సామాన్య పౌరులకు ఆ అవకాశాన్ని నిరాకరిస్తున్నదని కాంగ్రెస్ గ్రహించటం లేదు. యూపీఏ హయాంలో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. దాన్నే తామూ ప్రయోగించి పైచేయి సాధించాలని చూడటం ద్వారా కాంగ్రెస్ ఆశిస్తున్న ప్రయోజనమేమిటో అర్థంకాదు. తోచింది చేసుకుంటూ పోవటం, జరిగే ఘటనలపై అప్పటికప్పుడు అనాలోచితంగా స్పందించటం తప్ప కాంగ్రెస్కు పకడ్బందీ వ్యూహం ఉన్నట్టు కనబడదు. బుధవారం పార్లమెంటు మకరద్వారం వద్ద జరిగిన ఘటనే ఇందుకు తార్కాణం. కేంద్ర మంత్రి రవనీత్సింగ్ బిట్టూతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జగడం నివారించదగింది. బిట్టూ అక్కడ ధర్నాకు కూర్చున్న కాంగ్రెస్ ఎంపీలనుద్దేశించి అవహేళనగా వ్యాఖ్యానించి ఉండొచ్చు. కానీ అవి యథాలాపంగా అన్న మాటలు కాదు. ఇరుపక్షాల మధ్యా యుద్ధం సాగుతున్న వేళ వ్యూహాత్మకంగా మాట్లాడినవి. రాహుల్ గాంధీ ఆయన్ను కాస్తా ద్రోహి అంటూ నిందించటం ద్వారా బీజేపీకి పదునైన ఆయుధం ఇచ్చారు. పార్టీ మారటం ద్రోహమైతే, అలాంటివారు కాంగ్రెస్లో లేరా? అసలు పార్టీని నమ్ముకుని ఉన్నవారి పట్ల అధినేతలుగా తాము చేసిన, చేస్తున్న ద్రోహం మాటేమిటి? అవసరార్థం పక్క పార్టీలతో కుమ్మక్కవుతూ మొత్తంగా పార్టీలో ఉన్నవారందరికీ చేస్తున్న ద్రోహమెంత? రాహుల్గాంధీ ఆలోచించారా? పరిస్థితులు మళ్లీ చక్కబడితే బిట్టూ లాంటివారు తిరిగి కాంగ్రెస్ లోకి రారనీ, రాహుల్ తీసుకోబోరనీ ఎవరైనా చెప్పగలరా?ఎందుకో ఈసారి పార్లమెంటులోనూ, వెలుపలా ‘పుస్తక ప్రదర్శన’ జరిగింది. చైనా నుంచి ముప్పు ముంచుకొస్తున్నవేళ బాధ్యతంతా రాజకీయ నాయకత్వం అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ నరవణేపై వదిలేసి, చేతులు దులుపుకొన్నదని రాహుల్ ఆరోపించారు. జనరల్ నరవణే పుస్తక సారాంశాన్ని సభలో చెబుతానన్న భయంతోనే తనను అడ్డుకున్నారని అన్నారు. దీనికి పోటీగా బీజేపీ సభ్యులు సభలో పుస్తకాలు ప్రదర్శించారు. ఈ దఫా పుస్తకాల ప్రస్తావన రావటం బాగున్నా, వాటిని ప్రదర్శించటంతో సరిపెట్టక ఇరుపక్షాలవారూ ఎవరికివారు చదువుకోవాలి. అప్పుడు మన చట్టసభల తీరు ఇంత అధ్వాన్నంగా అయితే ఉండదు. కనీసం సభల నిర్వహణకయ్యే వ్యయాన్నయినా దృష్టిలో ఉంచుకుని సమావేశాలను వృథా కానీయరాదని రెండు పక్షాలూ గ్రహించటం అవసరం. -
‘కరీంనగర్లో కాంగ్రెస్ చేతులెత్తేసింది’
కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులెత్తేసింవదని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి , బీజేపీ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్లో కాంగ్రెస్ ఓడిపోతుందనే తెలిసే సీఎం రేవంత్ ఇక్కడకు రాకుండా పారిపోయారన్నారు. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 6వ తేదీ) కరీంనగర్ 10, 11 డివిజన్ల ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ ప్రసంగించారు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. ఎంఐఎంకు మేయర్ పదవి ఆఫర్ చేశారు. కేంద్రం నిధులిస్తే.. మేమే తెచ్చామనడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గు లేదా?, కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి? , ఢిల్లీ నుండి గల్లీకి నిధులు తెచ్చే దమ్ము బీజేపీకే ఉంది’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
‘హేట్ స్పీచ్ చట్టం అమలైతే మొదటి కేసు ఆయనపైనే పెట్టాలి’
హైదరాబాద్: తెలంగాణలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రాంచందర్రావు. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 6వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు రాంచందర్రావు. దీనికి బీజేపీ ఎన్నికల సహ ఇంచార్జ్లు, పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. దీనిలో భాగంగా రాంచందర్రావు మాట్లాడుతూ.. ‘ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. మేము వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఈ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి. యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తాం. మోడ్రన్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతాంకబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం. అవినీతి రహిత పాలన అందిస్తాం. మా పార్టీ నేతలు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం. అధికారులపై కూడా చర్యలు తప్పవు. వికసిత్ మున్సిపాలిటీ, వికసిత తెలంగాణ, వికసిత భారత్గా తీర్చిదిద్దుతాం. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు.. ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. తెలంగాణకు ఏమివ్వలేదని విమర్శిస్తున్నారు. మేము ఏ జిల్లాకు ఏమిచ్చామో చెబుతాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాకు ఏమిచ్చిందో చెప్పగలరా?, రెండ్రోజులుగా పోలీస్ వ్యవస్థ మొత్తం మా కార్యకర్తలపై దాడులు చేస్తోంది. కొట్టి, బెదిరించి విత్ డ్రా చేయించారు. కాంగ్రెస్.. పోలీసులను కార్యకర్తల్లా వినియోగించుకుంటోంది. మా కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేస్తే ఊరుకోను. కేంద్రంలో ఉన్నది మా ప్రభుత్వమే.. అన్న విషయం మరిచిపోవద్దు. పోలీసులు ఇప్పటికైనా స్మార్ట్ యాక్టింగ్ ఆపేయాలి. రేవంత్ హేట్ స్పీచ్ బిల్లు పెట్టాలంటున్నారు.. ఆయన సొంత బుర్రతో ఆలోచించకుండా పక్క రాష్ట్రం ఆలోచనను ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారు. హేట్ స్పీచ్ చట్టం అమలైతే మొదటి కేసు రేవంత్ పైనే పెట్టాలి. గతంలో ఆయన అడ్డగోలుగా మాట్లాడదలేదా?, బీజేపీ పెరుగుతోంది కాబట్టే భయపడి బీజేపీని అడ్డుకోవాలని హేట్ స్పీచ్ తేవాలని చూస్తున్నారు. తెలంగాణలో దొంగలు పోయి దోపిడీ దొంగలు వచ్చారు. పవన్ కల్యాణ్ ప్రచారం షెడ్యూల్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ తో దోస్తీ లేకుంటే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై ఎందుకు విచారణకు ఆదేశించలేదు. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ కాపాడినట్టే కాళేశ్వరం విషయంపై బీఆర్ఎస్ను రేవంత్ కాపాడుతున్నారు’ అని విమర్శించారు. -
వారిది ఫెవికాల్ బంధం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీజేపీ– బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం. రెండింటి మధ్య చీకటి ఒప్పందం ఉంది. బీఆర్ఎస్ నేతల నుంచి ప్రొటెక్షన్ మనీ పేరిట మామూళ్లు వసూలు చేసి.. రూ.లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులపై బీజేపీ ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు..’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో ‘ప్రజాపాలన– ప్రగతిబాట’బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత రామడుగు మండలంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రసంగించారు. అరెస్టు చేయరు..విచారణ సాగదు ‘2014లో మోదీ పాలమూరుకు వచ్చినప్పుడు పాలమూరు– రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కాళేశ్వరం, మెట్రో, మూసీ, రీజినల్ రింగ్రోడ్డు అనుమతులు వేటికీ మోక్షం లేదు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవ దానం తరహాలో ఓట్లు దానం చేసి 8 స్థానాల్లో బీజేపీని గెలిపించింది. కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం కార్డు అయిందన్న మోదీ, అమిత్షాలు ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్రానికి నివేదిక పంపినా పట్టించుకోరు.. కేసీఆర్, హరీశ్లను అరెస్టు చేయరు.. సీబీఐ విచారణ ముందుకు సాగదు. ఫార్ములా ఈ రేసులో అక్రమాలపై కేటీఆర్ను అరెస్టు చేయరు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నాడు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీశ్లు పిల్లి శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. సంతోష్ రావు మిడ్మానేరులో భూములు, ఇసుక, కంకర, గాలి, నీరు దేన్నీ వదలకుండా దోచుకున్నాడు..’అని రేవంత్రెడ్డి ఆరోపించారు పాల పిట్టల్లా ఆడపడుచులు ‘2004లో ఇదే కరీంనగర్ గడ్డ మీద సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామని మాటిచ్చారు. ఏపీ, కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చి న మాటకు కట్టుబడి 60 ఏళ్ల తెలంగాణ ప్రజాకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాది. ప్రజలు కేసీఆర్కు పదేళ్లు అధికారమిస్తే.. ఆస్తులు, కాంట్రాక్టులు, టీవీలు, పేపర్లు, ఫామ్హౌస్లు కూడబెట్టారు. 2004 నుంచి 2014 వరకు మేము తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే.. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు. రైతు కష్టాలు చూసి చలించి ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అసలు ఉచిత కరెంటు అంటేనే కాంగ్రెస్ పేటెంట్. రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రతిష్టాత్మక పథకాలు తెచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతుబీమా, రైతు భరోసా, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం తదితర పథకాలు అమలు చేస్తోంది. గతంలో బతుకమ్మ చీరల్లో కుంభకోణాలకు పాల్పడ్డారు. వాటిని ఎవరూ కట్టుకోలేదు. మేం ఇచ్చిన ఇందిరమ్మచీరలు కట్టుకుని నా ఆడపడుచులుపాల పిట్టల్లా కనిపిస్తున్నారు..’అని సీఎం వ్యాఖ్యానించారు. అన్నిచోట్లా కాంగ్రెస్ జెండా ఎగరాలి ‘రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు రూ.17,442 కోట్లు ఇస్తే.. అందులో పాత కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.2,778 కోట్లు ఇచ్చాం. మరిన్ని పనులు సజావుగా జరగాలంటే మీ కౌన్సిలర్, కార్పొరేటర్ కాంగ్రెస్ వాళ్లే అయి ఉండాలి. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. 8 ఏండ్లు మేమే అధికారంలో ఉంటాం. గతంలో వేములవాడకు వెళితే పదవులు పోతాయన్న అపవాదును మేం అధిగమించాం. అక్కడే సభ పెట్టి రూ.150 కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం. కొండగట్టు, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.5 వేల కోట్లు వెచ్చిస్తా. కరీంనగర్ ఔటర్ రింగు రోడ్డు, వరంగల్ ఔటర్ రింగు రోడ్డులకు మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తాం. బండి, గుండులను మోదీ గుర్తుపట్టడు బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఢిల్లీ నుంచి నిధులు తేవడం చేతకాదు. అసలు బండి, గుండులను మోదీ గుర్తే పట్టడు. కరీంనగర్ కార్పొరేషన్ను చేజిక్కించుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి. కానీ ఢిల్లీ నుంచి మోదీ, అమిత్షాలు వచ్చినా ఆ పార్టీ ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవకుండా కాంగ్రెస్ సత్తా చూపిస్తాం..’అని సీఎం అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, రాజ్ఠాకూర్, విజయరమణా రావు, కవ్వంపల్లి సత్యనారాయణ సభలో పాల్గొన్నారు. -
ఎంపీగా సిగ్గుతో తలదించుకుంటున్నా
సాక్షి, హైదరాబాద్ / కంటోన్మెంట్: ప్రజల కు మాటి చ్చి.. ఏడాది న్నరగా చేయలేకపో యినందుకు ఎంపీగా సిగ్గుతో తలదించు కుంటున్నా.. అంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మారేడు పల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వా లంటూ స్థానిక కార్పొ రేటర్ కొంతం దీపిక చేపట్టిన దీక్షకు ఆయన హాజరై మాట్లాడారు. మారేడు పల్లిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో ఎనిమిదేళ్ల క్రితం ఇళ్లు కూల్చేసి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చేపట్టారన్నారు. 2022లో సుమారు 250 మందికి ఇళ్లు కేటాయించినా, మరో 150 మందికి ఇప్పటికీ ఇళ్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు.డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరి జాగీరు కాద ని, ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించిన కాంగ్రెస్ నేతలు, వారు అధికారంలోకి వచ్చి ఒరగబెట్టిందేంటని నిలదీశారు. ఈ అంశంపై ఏడాదిన్నరగా తాను ప్రయ త్నాలు చేస్తున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేద న్నారు. అధికారులకు సైతం ఎంపీ అన్నా లెక్కలేకుండా పోయిందన్నారు. గత డిసెంబర్లో కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో తాను స్వయంగా పాల్గొన్నానని గుర్తు చేశారు. జనవరి ఒకటో వారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారు లకు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినా, నేటికీ పని పూర్తికాలేదన్నారు. ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్లతో పదేపదే మాట్లాడినా ఎలాంటి స్పందన లేదన్నారు. -
పాలమూరు నుంచి బీజేపీ శంఖారావం
మహబూబ్నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కమలదళం పాలమూరు నుంచి శ్రీకారం చుట్టింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ..జాతీయ నాయకత్వాన్ని కూడా రంగంలోకి దింపింది. బీజేపీ పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశాన్ని ‘విజయ సంకల్ప సమ్మేళనం’గా పేర్కొంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ అధ్యక్షుడిగా తొలి సారిగా తెలంగాణకు వచ్చిన ఆయన.. మున్సిపోల్స్ సందర్భంగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో అధికంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లను గెలవడంతో.. ప్రస్తుతం దక్షిణ తెలంగాణపైనా జాతీ య, రాష్ట్ర నాయకత్వాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లలో మంచి ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. గతంలోనూ పార్టీపరంగా అనేక కార్యక్రమాలను మహబూబ్నగర్ నుంచే ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో...తెలంగాణ పోరుయాత్రను కృష్ణానది తీరం నుంచి మొదలుపెట్టారు. గతంలో బండి సంజయ్ రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా ఉండగా ఒక విడత పాద యాత్రను జోగుళాంబ ఆలయం వద్ద నుంచి ప్రారంభించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి ఇక్కడి నుంచే శంఖారావం పూరించారు.ఎంపీలకు అగ్నిపరీక్ష..: ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీ ఎంపీలకు అగ్నిపరీక్షగా మారనుంది. 8 మంది ఎంపీలున్న ప్రాంతాల్లో విజయాలపై వారు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా పార్లమెంట్ సమావేశాల నుంచి కూడా మినహాయింపునిచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మునిసిపాలిటీలన్నింటి లోనూ వారు గట్టిగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీలో తమ పట్టు నిలుపుకో వాలంటే నియోజకవర్గాల్లో అత్యధిక స్థానా ల్లో గెలుపొందితేనే అదిసాధ్యమవుతుందన్న అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతోంది. -
కమీషన్ల సర్కార్.. వసూళ్ల రాజ్యం!
మహబూబ్నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధితెలంగాణలో కమీషన్ల సర్కార్ నడుస్తోందని, వసూళ్ల రాజ్యం కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాహుల్గాం«దీ–రేవంత్రెడ్డి (ఆర్ఆర్) ట్యాక్స్, హఫ్తా, కమీషన్లు వసూలు అవుతున్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజల్లోకి వెళతామని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేసేలా కార్యాచరణకు రూపకల్పన చేస్తామని తెలిపారు. బుధవారం మహబూబ్నగర్లో బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇలాగైతే ఎక్కువ కాలం అధికారంలో ఉండలేరు.. ‘తెలంగాణలో కొన్ని నెలలుగా వరసగా దేవాలయాలు, గుళ్లపై దాడులు, కూల్చివేతల ఘటనలు జరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇదే పద్ధతి కొనసాగిస్తే ఎక్కువకాలం అధికారంలో ఉండలేరు. సనాతన, హైందవ ధర్మంపై దాడులను బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. వాటిని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడే ప్రసక్తే లేదు’ అని నితిన్ నబీన్ అన్నారు.హామీలు నెరవేర్చకుండా మోసం ‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలను నారీశక్తిగా మార్చేందుకు, స్వశక్తితో నిలిపేందుకు కృషి చేస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.రెండున్నర వేలు, కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం వంటి వాగ్దానాలను ఎప్పుడో మరిచిపోయింది. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎలాంటి తేడా లేదు. కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి మహిళలకు ఈ విషయాలన్నీ వివరించాలి. ప్రస్తుతం జరుగుతున్న మోసం, దగాపై పోరాడాలి. కాంగ్రెస్ రైతులు, రైతుకూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ఒక్కహామీని కూడా నెరవేర్చలేదు. ఈ వర్గాలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో ఈ సర్కార్కు తగిన బుద్ధి చెప్పాలి..’అని నితిన్ నబీన్ విజ్ఞప్తి చేశారు. రేవంత్ సర్కార్వి సంతుషీ్టకరణ రాజకీయాలు ‘రాష్ట్రంలో రేవంత్ సర్కార్ సంతుïÙ్టకరణ రాజకీయాలు చేస్తూ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కించపరుస్తోంది. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెబుతూ నిస్సిగ్గుగా ముస్లిం ఓట్బ్యాంక్ కోసమే పనిచేస్తూ కాంగ్రెస్ చరిత్రను చాటుతోంది. అల్పసంఖ్యాక వర్గాల ఓట్ల కోసం వక్ఫ్ భూముల్లో అక్రమాలకు వంత పాడుతున్నారు. దీనికి ధీటైన జవాబు ఇవ్వాల్సిన అవసరముంది. బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు (8 శాతం ఓటింగ్), 2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు (35 శాతం ఓటింగ్) గెలిచేలా ప్రజలు మద్దతు పలికారు. ఈ ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలుపొందుతోంది. మహారాష్ట్ర, బిహార్, చండీగఢ్, కేరళ, గోవా తదితర రాష్ట్రాల్లో జరిగిన వివిధ ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగించింది. ప్రతి బూత్లో 50% పైగా ఓటింగ్ సాధించాలి రాష్ట్రంలో కూడా బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నందున రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లో 50 శాతానికి పైగా ఓటింగ్ సాధన లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వ విజయాలు, ప్రజలకు వివిధ పథకాల ద్వారా అందిస్తున్న ప్రయోజనాల గురించి ప్రజలకు కార్యకర్తలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనూ కమలం వికసించేలా..యువ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా, అన్నివర్గాల ప్రజల్లో సంతోషం వెల్లివిరిసేలా చేయాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం. ఆ తర్వాత 2028లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం కూడా ఖాయం. అయితే బీజేపీ అధికారం కోసం ప్రాకులాడడం లేదు. రాష్ట్ర భవిష్యత్, ఇక్కడి ప్రజల క్షేమం, అభ్యున్నతే లక్ష్యం. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రోడ్డు, రైల్వే కారిడార్లు, రెండు ఇండ్రస్టియల్ కారిడార్లు, మరెన్నో ప్రయోజనాలు చేకూరేలా చేశారు. రాష్ట్ర ప్రజల పట్ల మోదీకున్న ప్రేమాభిమానాలను ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం తెలంగాణ ప్రజల పక్షానే ఉందని చెప్పడానికి ఇదే తార్కాణం..’అని బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. అంతకుముందు శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాం అమ్మవారికి, మైసిగండి ఉమామహేశ్వర అమ్మవారికి, తెలంగాణ విమోచన పోరాట యోధులకు, సర్దార్ వల్లభాయ్పటేల్కు నమస్సుమాంజలి ఘటించారు. తాజాగా పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలియజేశారు. మళ్లీ ఏప్రిల్లో వస్తా.. ‘మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేయండి...మంచి ఫలితాలు సాధించండి... జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తా.. ఈ సారి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలి..మళ్లీ ఏప్రిల్లో వస్తా..’ అని నితిన్ నబీన్ మహబూబ్నగర్ నుంచి తిరుగు ప్రయాణంలో రాష్ట్ర పార్టీ నేతలకు చెప్పినట్లు రాంచందర్రావు ‘సాక్షి’ కి తెలిపారు. ఘన స్వాగతం శంషాబాద్: నితిన్ నబీన్ తొలిసారి తెలంగాణ పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, రాజసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. -
నేడు రాష్ట్రానికి నితిన్ నబీన్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ మిశ్రా తొలిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. బుధవారం మహబూబ్నగర్ ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, పరిసర ప్రాంతాల కార్యకర్తల సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఈ ప్రసంగాన్ని వీక్షించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు తెలిపారు. అనంతరం బహిరంగ సభ ఉంటుంది. కాగా సమ్మేళనం బూత్ స్థాయి కార్యకర్తలు, మున్సిపల్ నాయకులు, పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్సాహం, ప్రేరణనిచ్చేదిగా నిలుస్తుందని రాష్ట్ర పార్టీ నాయకత్వం విశ్వసిస్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేలా.. నితిన్ నబీన్ పర్యటన తెలంగాణ బీజేపీకి ఓ కీలక మైలురాయిగా నిలవనుందని రాంచందర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో జరుగుతున్న ఈ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని, సంస్థాగత సంకల్పాన్ని బలోపేతం చేసి, ప్రజలతో పార్టీ అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇదీ నితిన్ నబీన్ షెడ్యూల్.. » మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు » రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు స్వాగతం పలుకుతారు. సంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. » ఆ తర్వాత రోడ్డు మార్గాన మహబూబ్నగర్కు బయలువేరి వెళతారు » 4 గంటల ప్రాంతంలో మహబూబ్నగర్లో కార్యకర్తల సమ్మేళనం, బహిరంగసభ » 6 గంటల కల్లా రోడ్డుమార్గాన శంషాబాద్ విమానాశ్రయానికి. అక్కడి నుంచి ఢిల్లీకి. -
మణిపూర్ నూతన సీఎంగా ఖేమ్చంద్ సింగ్
ఇంఫాల్: మణిపూర్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న మణిపూర్కు కొత్త సీఎంగా బీజేపీ నేత, రాష్ట్ర ఖేమ్చంద్ సింగ్ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుంది.మణిపూర్లో గత ఏడాది నుంచి ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది. మాజీ సీఎం ఎన్. బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ హైకమాండ్ కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈమేరకు బీజేపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ ఖేమ్చంద్ సింగ్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అనుభవం, విశ్వసనీయత ఉండటంతో పాటు, ప్రజలతో అనుబంధం కూడా బలంగా ఉండడంతో సీఎం బాధ్యతల్ని ఖేమ్చంద్ సింగ్కు అప్పగించేందుకు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఖేమ్ చంద్ సింగ్ నియామకంతో గత ఏడాది నుంచి కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, పరిపాలనా లోటు ఈ నియామకంతో ముగుస్తుందని ఆశిస్తున్నారు.ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉండటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి పనులు, పరిపాలనా నిర్ణయాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ద్వారా పరిస్థితులు చక్కబడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.బీజేపీ హైకమాండ్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఖేమ్చంద్ సింగ్ నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో మరింత బలపడుతుందని, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం రేసులో ఇద్దరు కాదు.. ఆరుగురు!
దాదాపు ఏడాది రాష్ట్రపతి పాలన తర్వాత ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నాం మణిపూర్ భవన్లో బీజేపీ ఎమ్మెల్యేలంతా సమావేశమై శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే.. రేసులో ఇప్పటిదాకా ఇద్దరే ఉన్నారని ప్రచారం జరిగినా.. ఇప్పుడా సంఖ్య ఆరుకు చేరడం గమనార్హం. మొయితీ-కుకీ తెగల మధ్య ఘర్షణలు.. హింసాత్మక పరిస్థితులు ఏడాదిన్నరపాటు(2023 మే 3న మొదలై..) కొనసాగాయి. ఈ అల్లర్లలో 260 మందికి పైగా మృతి చెందగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ మధ్యలో సీఎం రాజీనామా చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చినా.. అలాంటిదేం జరగలేదు. చివరకు.. 2025 ఫిబ్రవరి 13న బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా.. ఈ మధ్యలో బీజేపీ ఎమ్మెల్యేలు కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నాలు ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి తేవాలంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్కు బీజేపీ బాధ్యతలు అప్పగించింది. సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డ సమావేశం.. తరుణ్ చుగ్కు బాధ్యతలు అప్పగించింది. అయితే అంతకుముందు.. ఆదివారమే బీజేపీ, మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ వెంటనే బీజేపీ మణిపూర్ అధ్యక్షురాలు శారదా దేవి సహా పలువురు నేతలు హస్తినకు చేరడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే.. ఇవాళో, రేపో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ఇక్కడే మరో ట్విస్ట్!మణిపూర్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే కూటమి భావిస్తోంది. బీజేపీకి 37 ఎమ్మెల్యేలు, మిత్రపక్షాలైన ఎన్పీపీకి 6, ఎన్పీఎఫ్కు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కల్లోల ప్రాంతంగా దేశం దృష్టిలో మణిపూర్ మిగిలిపోవడంతో.. ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఆ పార్టీ నాయకత్వం పర్వత ప్రాంతాలు–లోయ ప్రాంతాల కీలక వర్గాలకు ప్రాతినిధ్యం కలిగిన సమగ్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కానీ ప్రభుత్వ ఏర్పాటునకు కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యేలు మోకాలు అడ్డుపెడుతున్నారు. రాజకీయంగా, మణిపూర్ అసెంబ్లీలో 10 మంది కుకి ఎమ్మెల్యేలు(వీరిలో 7 మంది బీజేపీకి చెందినవారు) ఉన్నారు. జనవరి 13వ తేదీన ఈ వర్గం గువాహటిలో కుకీ సంఘాలతో కలిసి ఓ భేటీ నిర్వహించి.. ప్రత్యేక పరిపాలన (లెజిస్లేటివ్ ఉన్న యూనియన్ టెరిటరీ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన వేళ.. వ్రాతపూర్వక హామీ కోరుతోంది. మణిపూర్లో ప్రభుత్వ పునరుద్ధరణకు బీజేపీ తొలి అడుగు వేసినా, కుకి వర్గం ప్రత్యేక పరిపాలన డిమాండ్ తీర్చకపోతే ఈ ప్రయత్నం సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.ఇద్దరు కాదు.. ఆరుగురు సీఎం రేసులో తొలుత ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అసెంబ్లీ స్పీకర్, మాజీ మంత్రి థోక్చోమ్ సత్యబ్రత సింగ్ తో పాటు మరో మంత్రి థోంగమ్ బిస్వజిత్ సింగ్ పేర్లు ఈ రేసులో తొలుత తెరపైకి వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా ఆ సంఖ్య ఆరుకి చేరింది. ఆ లిస్ట్లో ఉన్న పేర్లు, వాళ్ల ప్రొఫైల్స్ ఇలా ఉన్నాయి.. థోక్చోమ్ సత్యబ్రత సింగ్ – ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్, యైస్కుల్ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2020–22లో మంత్రి కూడా అయ్యారు.థోంగమ్ బిస్వజిత్ సింగ్ – 2012 నుంచి ఎమ్మెల్యే, పర్యావరణ మరియు పిడబ్ల్యూడీ శాఖల మంత్రిగా పనిచేశారు.యుమ్నం ఖేమ్చంద్ సింగ్ – సింగ్జమేయి నియోజకవర్గం ఎమ్మెల్యే, 2017–22లో స్పీకర్, తరువాత మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, విద్యా శాఖల మంత్రిగా ఉన్నారు.గోవిందాస్ కాంతౌజామ్ – బిష్ణుపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, పీడబ్ల్యూడీ మంత్రిగా పనిచేశారు.థౌనౌజామ్ బసంత్ కుమార్ సింగ్ – నాలుగు సార్లు ఎమ్మెల్యే, నంబోల్ నియోజకవర్గం ప్రతినిధి. గతంలో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో క్రీడల సహాయ మంత్రిగా పని చేశారు.థోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్ – హైరోక్ నియోజకవర్గం ఎమ్మెల్యే, రిటైర్డ్ IPS అధికారి. గల్లంట్రీ, మెరిటోరియస్ సర్వీస్ కోసం రాష్ట్రపతి పోలీస్ మెడల్ పొందారు. మొత్తంగా, బీజేపీ పై ఆరుగురిలో ఒకరిని కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ వారంలోనే ఈ ఉత్కంఠకు తెరపడే చాన్స్ ఉంది. -
మున్సిపాలిటీల్లో రెండున్నర వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రెండున్నర వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. ఎన్నికలు జరగనున్న 7 కార్పొరేషన్లతో పాటు, మిగతా మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నా అవి అభివృద్ధి పనులకు ఖర్చుచేయకుండా ఎక్కడికి వెళుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణాలు, నగరాల అభివృద్ధి, మౌలిక వసతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నగరాల్లో, మరీ ముఖ్యంగా ప్రజల బతుకుల్లో మార్పులొచ్చాయా? అని ప్రశ్నించారు. సోమవారం టూరిజం ప్లాజాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అశిష్ షెలార్, సహ ఇన్చార్జి అశోక్ పర్ణామి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతమ్ రావు, మీడియా ఇన్చార్జి ఎన్వీ సుభాష్లతో కలిసి రామచందర్రావు రాష్ట్ర ప్రభుత్వంపై చార్జిషీట్ను విడుదల చేశారు. ‘బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు’పేరిట కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనపై బీజేపీ చార్జిషీట్ అంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజలకు చేసిన మోసాలను ఎత్తిచూపేందుకే ఈ చార్జిషీట్ను రాష్ట్ర బీజేపీ విడుదల చేస్తోందన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు, పథకాలు తీసుకురావడంతో పాటు పురపాలికల్లో అవినీతిరహిత, సమర్థవంతమైన పాలనను అందిస్తామని హామీనిస్తున్నామన్నారు. గతంలో బీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్కు అవకాశమిచ్చినందున, ఇప్పుడు బీజేపీకి అవకాశమిస్తే పట్టణాల్లో అన్ని విధాలుగా మార్పు తీసుకొచ్చి చూపుతామన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వద్దనున్న హోం, మున్సిపల్, విద్య వంటి కీలక శాఖలు పూర్తిగా విఫలం కావడంతో సీఎం కూడా పాలనలో వైఫల్యం చెందారన్నారు. ఒక మంత్రికి మరో మంత్రికి పడదని, కలెక్షన్లు, కమీషన్లతో మునిగితేలుతున్నారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణం, టెండర్లలో అక్రమాలు తదితరాలతో, కాంగ్రెస్ సర్కార్ 40 శాతం కమీషన్ల పాలనగా మారిందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉంటూ ప్రజలకు ఏ మేలు చేయని కాంగ్రెస్ పారీ్టకి, సీఎం రేవంత్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అశిష్ షెలార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కూడా ప్రజలను వంచించే మోసపూరిత పార్టీలేనన్నారు. ఈ చార్జిషీట్లో ఏముందంటే.. ⇒ ఉద్యోగులకు మోసం : అన్ని పెండింగ్ డీఏలు ఇవ్వకుండా, పీఆర్సీ అమలు చేయకుండా, హెల్త్కార్డులు ఇవ్వకుండా, ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకురాకుండా మోసం. ⇒ అన్నదాతల అరిగోసలు : కొందరికే రుణమాఫీ, రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఇస్తామని దానికీ మంగళం, రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వలేదు, భూ భారతితో కొత్త వివాదాలకు ఆజ్యం. ⇒ ఆగమైన విద్యా రంగం: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా ఇవ్వలేదు, మున్సిపాలిటీల్లో ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు మరిచారు. ⇒ వైద్యం అగమ్యగోచరం : రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ.10 లక్షలు అని మరిచారు. బిల్లులు చెల్లించక ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం నిలిపివేత, ప్రతీ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ, అన్ని మున్సిపాలిటీల్లో వంద పడకల ఆస్పత్రులు తదితరాలు అమలు కాలేదు ⇒ మహిళలకు మహా మోసం: ప్రతీ నెల రూ.రెండున్నర వేలు ఆర్థిక సహాయం ఇవ్వలేదు. ఈ లెక్కన ప్రతీ మహిళకు రూ.లక్ష చొప్పున సర్కార్ బాకీ పడింది. కళ్యాణమస్తులో తులం బంగారం ఇస్తామని మొండిచేయి. ⇒ కార్మీకులపై కక్ష : అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పన చట్టం అమలు జాడలేదు. వారి కోసం సంక్షేమ బోర్డు, హమాలీల బోర్డు ఏర్పాటు కాలేదు.హెల్త్కార్డులు ఇవ్వలేదు ⇒ యువత ఆశలు ఆవిరి: ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అమలు కాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాలేదు.యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్, ప్రతీ ఏడాది జూన్2న నోటిఫికేషన్లు, సెపె్టంబర్ 17కు నియామకాల పూర్తి హామీకి తిలోదకాలు. ⇒ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నయవంచన : అంబేడ్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం హామీ అమలు మరిచారు. అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని పెంచలేదు. ⇒ పారిశ్రామికాభివృద్ధిపై నిర్లక్ష్యం : పూచీకత్తు లేని రుణాలకు ఎమ్మెస్ఎంఈల కోసం రాష్ట్ర స్థాయి క్రెడిట్ గ్యారెంటీ పథకం హామీ మరిచారు. ⇒ సింగరేణిపై సిగపట్టు: సింగరేణి కార్మీకుల సంక్షేమానికి, అభివృద్ధికి, వారి భద్రతకు చేపడతామన్న పటిష్టమైన చర్యలు తీసుకోలేదు, సింగరేణిలో ఆధునిక విద్యాలయాల ఏర్పాటుపై ఒక్క అడుగూ పడలేదు. -
కేంద్ర బడ్జెట్ పై రామచందర్ రావు రియాక్షన్
-
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. బీజేపీకి సంబంధం ఉంది..
-
ఏడు జిల్లాల్లో చొరబాటుదార్లదే మెజార్టీ
గౌహతి: అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చొరబాటుదార్లు విచ్చలవిడిగా ప్రవేశించారని, రాష్ట్రంలో జనాభా స్థితిగతుల్లో ప్రతికూల మార్పులు వచ్చాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. అస్సాం నుంచి చొరబాటుదార్లను బయటకు పంపించి, స్థానికులను రక్షించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. శుక్రవారం అస్సాం రాష్ట్రం ధెమాజీ జిల్లాలో మిసింగ్ తెగ ప్రజల యువజన వేడుక ముగింపు కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం దిబ్రూగఢ్లో పర్యటించారు. రూ.1,715 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు.చొరబాటుదార్ల నుంచి రాష్ట్రానికి పూర్తిస్థాయిలో విముక్తి లభించాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఇక్కడ చొరబాటుదార్ల సంఖ్య ఏకంగా 64 లక్షలకు చేరుకుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడు జిల్లాల్లో వారే మెజార్టీగా ఉన్నారని చెప్పారు. ఈ ధోరణి మారాలంటే బీజేపీని గెలిపించాలని స్పష్టంచేశారు. అస్సాంలో జనాభా స్థితిగతులను పూర్వస్థితికి తీసుకురావాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. చొరబాటుదార్ల నుంచి విముక్తి కల్పించడం బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి మరింత బలం ఇవ్వాలి ‘‘చొరబాట్లు ఆగాలని ప్రజలు నిజంగా కోరుకుంటే మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. చొరబాట్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు మరింత బలం ఇవ్వాలి. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 1.26 లక్షల ఎకరాల భూములను చొరబాటుదార్ల నుంచి కాపాడింది. మిసింగ్ తెగ ప్రజలు కష్టజీవులు. శ్రమించడం వారి సంస్కృతిలోనే ఉంది. ఎగువ అస్సాంలోకి చొరబాటుదార్లు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది.బ్రహ్మపుత్ర నదిపై బోగిబీల్ వంతెనను నిర్మించింది. దీనివల్ల దిబ్రూగఢ్, ధెమాజీ మధ్య అనుసంధానం పెరిగింది. భారతదేశ ప్రగతికి ఈ వంతెన ఒక ప్రతీకగా నిలుస్తోంది. దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. కానీ, బోగిబీల్ వంతెన నిర్మాణం పూర్తిచేయలేదు. నరేంద్ర మోదీ పట్ల రాష్ట్ర ప్రజలు విశ్వాసం కనబర్చారు. అందుకే వంతెన నిర్మాణం నాలుగేళ్లలో విజయవంతంగా పూర్తయ్యింది’’ అన్నారు.రాహుల్ అవమానించడం దారుణం ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అవమానించడం దారుణం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ‘ఎట్హోం’ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందజేసిన ‘గమోసా’ను ధరించడానికి రాహుల్ నిరాకరించారు. దేశ విదేశీ ప్రముఖులు ఆ కండువాను గౌరవపూర్వకంగా ధరిస్తే రాహుల్ మాత్రం ధరించకుండా అగౌరవపర్చారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని కించపరిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదు. అస్సాం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. తుపాకులు, తూటాలు, ఘర్షణలు, మరణాలు తప్ప అస్సాంకు కాంగ్రెస్ ఇచ్చిందేమిటో చెప్పాలి. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది. అందుకోసం చొరబాట్లను ఆయుధంగా ఉపయోగించుకుంది.బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాట్లకు అడ్డుకట్ట పడింది. చట్టవిరుద్ధంగా మనదేశంలోకి ప్రవేశించినవారిని గుర్తించి, కచ్చితంగా వెనక్కి పంపిస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోంది. యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో అస్సాం తేయాకు పరిశ్రమకు, కారి్మకులకు లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ నుంచి యూరప్ దేశాలకు తేయాకు ఎగుమతులు పెరుగుతాయి. అభివృద్ధి, శాంతి, రక్షణ, పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతి కావాలంటే మరోసారి బీజేపీకి పట్టం కట్టాలి. చొరబాట్లు, వరదల నుంచి అస్సాంను కాపాడే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది’’ అని అమిత్ షా తేలి్చచెప్పారు. అన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు సమానమే‘‘కాంగ్రెస్ పాలనలో గిరిజన తెగలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొన్నారు. సొంత గుర్తింపును కాపాడుకొనేందుకు పోరాడాల్సి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వారికి భద్రత లభిస్తోంది. పారామిలటరీ దళాల్లో నియామకాల విషయంలో గిరిజన యువతకు ప్రాధాన్యమిస్తాం. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలకు మరింత గుర్తింపు దక్కాల్సి ఉంది. వేర్వేరు సంస్కృతుల సమ్మేళనం వల్లనే భారతదేశ సంస్కృతి మరింత వికసిస్తుంది. దేశంలో అన్ని రకాల సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలకు సమాన హక్కులున్నాయి. అవన్నీ సమానమే’’ అని అమిత్ షా చెప్పారు. -
‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు’
నల్లగొండ: మార్పు కోసం కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. గతంలో బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందన్నారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 30వ తేదీ) నల్లగొండలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ గ్యారెంటీలు, హామీలు అమలు కావడం లేదు. యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయామన్న భావనలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35 శాతం ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు, స్మార్ట్ సిటీ, అమృత్, గృహ నిర్మాణం, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి పథకాలకు వేగంగా నిధులు వస్తాయి. తెలంగాణ భవిష్యత్తు బీజేపీతోనే సురక్షితం. నల్లగొండ కార్పొరేషన్ లో 48 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశాం. నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం మా పార్టీకే లభిస్తుంది’ ధీమా వ్యక్తం చేశారు. -
మరో మూడు రోజుల్లో...!! 2026-27 బడ్జెట్ పై పార్లమెంట్ సమావేశాలు
-
‘ఓన్లీ యాక్టింగ్.. నో యాక్షన్’
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల తప్పం ఏం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు. ఇక్కడ జరిగేది ఓన్లీ యాక్టింగ్ మాత్రమేనని, నో యాక్షన్ అంటూ చమత్కరించారు. ఇద్దరూ దోస్తులు కాబట్టి నటిస్తున్నారని,. బ్రేవరీస్ గతంలో వాళ్లు ఇచ్చినవే కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారన్నారు. ‘ రెండు పార్టీలు కలిసి ప్రజలతో ఆడుకుంటున్నారు. సిట్లతో పనికాదు. నోటుకు ఓటు కేసులో రేవంత్ను బీఆర్ఎస్ కాపాడింది. ఇప్పుడు రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ను కాపాడుతున్నారు. రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రో నడుస్తుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్ణయాలపై జుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. అన్ని నిర్ణయాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నం. సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తు జరగాలి. ఇక్కడ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే. నోటీసులు ఇస్తున్నారు తప్ప నేతలను అరెస్టు చేయడం లేదు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలి’ అని పేర్కొన్నారు. -
వివక్ష వద్దంటే ఆందోళనా!
ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష అంతం కావటానికీ, సమానత్వం సిద్ధించటానికీ అనుసరించాల్సిన విధానాలను సూచిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన మార్గదర్శకాలను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీల్లో విద్యార్థుల ఆందోళనలు సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో బరేలీ మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి కొలువుకు రాజీనామా చేయగా, దాన్ని నిరాకరించిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. బీజేపీ నాయకులు ఒకరిద్దరు యూజీసీ తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. విద్యార్థుల ఆందోళనకు ఆధిపత్య కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి.కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యూజీసీ (UGC) ఇటువంటి మార్గదర్శకాలు జారీచేయటాన్ని బీజేపీలోని ఆధిపత్య కులాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ వర్గాలను సైతం ఈ పరిధిలోకి తీసుకురావటం వారికి ఆగ్రహం కలిగిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలవుతున్నా కులాన్ని అంతం చేయటం సంగతలా ఉంచి, కుల వివక్షను రూపుమాపేందుకు జరిగే ప్రయత్నాలకు సైతం వ్యతిరేకత ఎదురు కావటం వర్తమాన స్థితిగతులకు అద్దం పడుతుంది. వివక్ష ఎంతగా బాధిస్తుందో, పర్యవసానాలెలా ఉంటాయో దాన్ని అనుభవించేవారికి తప్ప అన్యులకు తెలిసే అవకాశం లేదు. అందుకే కుల వివక్షయినా, లింగ వివక్షయినా అవేమంత పెద్ద విషయాలు కాదన్నట్టు వాదించేవారు కనబడతారు. చదువు సంస్కారాన్ని నేర్పుతుందనీ, జ్ఞానం పరిధి విస్తరించేకొద్దీ అందరూ కుల, మతాల పరిమితులు అధిగమిస్తారనీ సంస్కర్తలు ఆశించారు. విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లవలసిన ఉన్నత విద్యాసంస్థల్లో కులవివక్ష రూపుమాపటం సంగతలా ఉంచి, దాన్ని ప్రోత్సహించే ధోరణులు కనబడటం చేదు నిజం. యూజీసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే ఇటీవలి కాలంలో క్యాంపస్లలో కుల వివక్ష పెరిగింది. మొత్తంగా అయిదేళ్లలో 704 విశ్వవిద్యాలయాల నుంచి, 1,553 కళాశాలల నుంచి 1,160 ఫిర్యాదులు అందాయి. మొత్తంగా అంతక్రితం సంవత్సరాలతో పోలిస్తే అయిదేళ్లలో ఇలాంటి ఫిర్యాదుల శాతం 118.4 శాతం పెరిగింది. విద్యాసంస్థలు మాత్రమే కాదు, ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందని ఓబీసీ ఉద్యోగ సంఘాలు ఆరోపించటం కనబడుతూనే ఉంది. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కుల వివక్ష అవాస్తవమని వాదించటం ఆత్మవంచన.యూజీసీ తనకు తానుగా ఈ మార్గదర్శకాలు రూపొందించలేదు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2016 జనవరిలో ఆత్మహత్య చేసుకున్న యువ దళిత విద్యార్థి రోహిత్ వేముల (Rohith Vemula) తల్లి రాధిక, 2019లో ముంబైలో పీజీ చేస్తూ ప్రాణం తీసుకున్న డాక్టర్ పాయల్ తాడ్వీ అనే ఆదివాసీ యువతి తల్లి అబేదా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇవి వెలువడ్డాయి. వాస్తవానికి 2012లోనే ఇలాంటివి రూపొందినా, అవి సలహాపూర్వకమైనవి మాత్రమే! ఉల్లంఘనలకు ఎటువంటి చర్యలుండాలో అందులో లేదు. వివక్ష, వేధింపులకు దీటుగా శిక్ష ఉండాలని ఆ తల్లులిద్దరూ పిటిషన్లో అభ్యర్థించారు. తాజా మార్గదర్శకాలు పాటించని సంస్థలను యూజీసీ ప్రోగ్రాంల నుంచి దూరం పెట్టడం, కేంద్ర గ్రాంట్లు నిలిపేయటం వంటి చర్యలున్నాయి. ఫిర్యాదుల విషయంలో ఎలా వ్యవహరించాలో నిర్దేశించారు. వివిధ స్థాయుల్లో కమిటీల ఏర్పాటును సూచించారు. ఫిర్యాదులపై వెనువెంటనే దర్యాప్తు చేయటం తప్పనిసరి చేశారు.ఈ మార్గదర్శకాల వల్ల జనరల్ క్యాటగిరీ విద్యార్థులు వేధింపులకు గురవుతారన్నది ఆందోళన చేస్తున్నవారి వాదన. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే కావొచ్చు... ఆర్థికంగా బలహీన వర్గాలకూ, అంగవైకల్యం ఉన్నవారికీ కూడా వివక్ష, వేధింపుల నుంచి రక్షణ కల్పించారు. ఈ మార్గదర్శకాలపై ఉన్న అపోహల్ని తొలగిస్తామనీ, ఇవి దుర్వినియోగమయ్యే అవకాశమే లేదనీ కేంద్రం చెబుతోంది. ఏదేమైనా కుల, మత, లింగ వివక్షలు ఉండరాదంటున్న రాజ్యాంగ అధికరణం 15కు ఈ మార్గదర్శకాలు అనుగుణంగానే ఉన్నాయి. వివక్ష, దాని ఆధారంగా వేధింపులు కళ్లెదుట కనబడుతుండగా ఇలాంటి నిబంధనల్ని వ్యతిరేకించటం, దుర్వినియోగమవుతుందన్న సాకు చెప్పటం ధర్మం కాదు. ఆచరణలో లోటుపాట్లుంటే చక్కదిద్దటానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. -
బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
సాక్షి,తెలంగాణ భవన్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సొంత గూటికి చేరారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో కార్యకర్తల సమక్షంలో కేటీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి ఆరూరిని పార్టీలోకి ఆహ్వానించారు. గత సోమవారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రమేష్.. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వనం మేరకు త్వరలోనే పలువురు నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి గులాబీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగా ఇవాళ బీఆర్ఎస్లో చేరారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల వేళ అరూరి రమేశ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.2024, మార్చిలో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన రమేష్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవటం, పార్టీలో క్రియాశీలక ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్టు తెలుస్తోంది. -
పురపోరుకు బీజేపీ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. మంగళవారం షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో యావత్ పార్టీ యంత్రాంగం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మె జారిటీ స్థానాలు గెలిచేలా అన్నిస్థాయిల్లో సమన్వయంతో ముందుకెళ్లాలని తీర్మానించింది. బుధ, గురువారాల్లో నామినేషన్ల దాఖలు సమయం ముగియనున్నందున వెంటనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.తొలుత నోవాటెల్లో నిర్వహించిన సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, రాష్ట్రపార్టీ ఇన్చార్జి అభయ్ పాటిల్, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులతో జాతీయ నాయకత్వం నియమించిన ఇతర రాష్ట్రాలకు చెందిన మున్సిపల్ ఎన్నికల సహ ఇన్చార్జీలు సమావేశమయ్యారు. రాత్రి పొద్దుపోయేదాకా నోవాటెల్లోనే రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జీలతో పార్టీ నేతలు రాంచందర్ రావు, కిషన్రెడ్డి, అభయ్ పాటిల్, డీకే అరుణ, కె.లక్ష్మణ్ ఇతర ముఖ్యనేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ ముఖ్య నేతలతో రెండేసి ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున బహిరంగ సభ నిర్వహణ, తదితర అంశాలపై చర్చించారు. విజయసంకల్ప సమావేశాలు: రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళామోర్చా, ఎస్టీ మోర్చాల ఆధ్వర్యంలో విజయసంకల్ప సమావేశాలు జరిగాయి. మహిళా మోర్చా సన్నాహక సమావేశంలో రాంచందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వీరేందర్ గౌడ్తోపాటు ఎన్నికల కో ఇన్చార్జి, రాజస్థాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్ణామి, మరో కో–ఇన్చార్జి, ఎంపీ రేఖాశర్మ, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పాల్గొన్నారు. -
Mumbai: మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కొత్త మేయర్ను ఎప్పుడు ఎన్నుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా షెడ్యూల్ ఇంకా వెలువడనప్పటికీ, వచ్చే నెల ప్రారంభంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.ఇటీవలి పౌర ఎన్నికల్లో బీజేపీ- ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పటికే తమ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించినప్పటికీ, ముంబైలో మాత్రం జాప్యం కొనసాగుతోంది. ఈ జాప్యానికి ప్రధాన కారణం అధికార బీజేపీ- ఏక్నాథ్ షిండే శివసేన వర్గాలు కొంకణ్ డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో తమ గ్రూపు రిజిస్ట్రేషన్ను పూర్తి చేయకపోవడమేనని సమాచారం.ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ముంబై మున్సిపల్ సెక్రటేరియట్లో తదుపరి చర్యలు చేపడతారు. నిబంధనల ప్రకారం, గ్రూపు రిజిస్ట్రేషన్ పూర్తయిన ఏడు రోజుల్లోపు మేయర్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. గ్రూపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన వెంటనే, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సెక్రటరీ సమావేశమై ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. ఈ భేటీ అనంతరం మేయర్ పదవులకు నామినేషన్లను ఆహ్వానిస్తూ, పౌర యంత్రాంగం అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి మూడు రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు నామినేషన్ పత్రాలను పరిశీలించి, తుది జాబితాను ప్రకటిస్తారు. అనంతరం ఓటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.ఇటీవల నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రకారం, ఈసారి ముంబై మేయర్ పదవి జనరల్ కేటగిరీకి చెందిన మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో మేయర్ రేసులో నిలిచే అభ్యర్థులపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార కూటమి నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. రిజర్వేషన్ ఖరారు కావడంతో మహిళా కార్పొరేటర్లు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: రైల్వేకు షాక్.. విద్యార్ధినికి రూ. 9 లక్షల పరిహారం -
సొంతగూటికి అరూరి రమేశ్
సాక్షి, వరంగల్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసిన రమేశ్.. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వనం మేరకు త్వరలోనే పలువురు నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి గులాబీ పార్టీలో చేరనున్నారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల వేళ అరూరి రమేశ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.2024, మార్చిలో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన రమేశ్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవటం, పార్టీలో క్రియాశీలక ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్టు తెలుస్తోంది. -
ప్రతిపక్ష నేతకిచ్చే గౌరవం ఇదేనా?: కాంగ్రెస్
భారత 77వ గణతంత్ర వేడుకలు ఈ రోజు ఢిల్లీలోని కర్తవ్యపథ్లో ఘనంగా జరిగింది. అయితే ఈ సందర్భంగా ఓ వివాదం చెలరేగింది. లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి మూడో వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్సభ ప్రతిపక్ష నేతను గౌరవించే విధానం ఇదేనా అంటూ బీజేపీని ప్రశ్నించింది.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సుర్జీవాలా ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు" లోక్సభ ప్రతిపక్ష నేతను గౌరవించే విధానం ఇదేనా? ఇది సంప్రదాయాలు, మర్యాద, ప్రోటోకాల్కు అనుగుణంగా ఉందా? ఇది ప్రభుత్వం యెుక్క ఆత్మన్యూనత భావానికి నిదర్శనమనం అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ బీజేపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానించాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన చర్యలకు పాల్పడిందన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా అద్వానీ బీజేపీ నేత అయినప్పటికీ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చేదన్నారు. 2014లో అద్వానీ లోక్సభ ప్రతిపక్ష నేత కాదని అయినప్పటికీ కాంగ్రెస్ ఎంతో గౌరవంతో ఆయనకు ముందు వరసలో కూర్చొబెట్టి గౌరవం ఇచ్చిందన్నారు. ప్రస్తుతం మోదీ, అమిత్షాలు ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను అవమానిస్తున్నారని మాణిక్యం ఠాగూర్ అన్నారు.అయితే దీనిపై కాంగ్రెస్కు బీజేపీ కౌంటరిచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ రాహుల్గాంధీ మూడో వరుసలో కూర్చోవడంపై ఆందోళన చెందడం లేదు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన జరగుతున్నప్పుడు ఆయన తన మెుబైల్ చూస్తూ బిజీగా ఉన్నాడు. అని ఆయన అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలతో ఆటలాడుతున్నాయి: రామచందర్ రావు
-
మున్సిపాలిటీలకు బీజేపీ ఇన్చార్జ్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఎన్నికలు జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పార్టీపరంగా ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను ఇన్చార్జ్లుగా నియమించింది. వీరితోపాటు ఎన్నికలపై అనుభవమున్న వారిని, గత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను కూడా కొన్నిచోట్ల ఇన్చార్జ్లుగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరికొన్నిచోట్ల ఇన్చార్జ్లు, సహ ఇన్చార్జ్లకు సైతం బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. అన్నిచోట్లా ఎక్కడికక్కడే ఆయా వార్డులు, డివిజన్ల వారీగా బలమైన అభ్యర్థులను గుర్తించి ముగ్గురునలుగురు పేర్లతో జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి అభ్యర్థుల నుంచి సేకరించేందుకు ఓ నమూనా దరఖాస్తులను కూడా నేతలకు అందజేసినట్టు పార్టీవర్గాల సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థులకు బీఫామ్ అందజేయడంతోపాటు ఎక్కడికక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్లాన్ చేయాలని సూచించారు. ఆయా మున్సిపాలిటీల్లో సంబంధిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పర్యవేక్షణ జరిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.రాష్ట్ర కార్యాలయంలో ‘వార్రూమ్’ ఏర్పాటు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లోని నాయకులతో సమన్వ యానికి నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వార్రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వార్రూమ్లో పారీ్ట నేతలతోపాటు, మానిటరింగ్ టీమ్, లీగల్సెల్కు చెందిన న్యాయవాదులు కూడా అందుబాటులో ఉంటారు. గురువారం రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇన్చార్జ్లుగా ఆయా మున్సిపాలిటీల బాధ్యతలను చూసే నేతలు ఏదో మొక్కుబడిగా కాకుండా అంకితభావంతో పనిచేసి పూర్తి ఫలితాలు సాధించేలా పనిచేయాలని రాంచందర్రావు సూచించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధించినందున, మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా పారీ్టశ్రేణులు పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అనుబంధ విభాగాల పనితీరును గురించి కూడా తెలుసుకున్నారు. పార్టీ నేతలు డా.ఎన్.గౌతమ్రావు, టి.వీరేందర్గౌడ్, అశోక్ వేముల, డా.కాసం వెంకటేశ్వర్లు, డా. బూర నర్సయ్యగౌడ్, బండా కార్తీకరెడ్డి, జయశ్రీ, బండారు విజయలక్ష్మి, డా.శిల్పారెడ్డి, ఎన్వీ సుభాశ్ తదితరులు పాల్గొన్నారు. దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి తాజా దావోస్ పర్యటనతో పాటు గతేడాది వరల్డ్ ఎకనమిక్ ఫోరం పర్యటనలో భాగంగా ఎంతెంత పెట్టుబడులు వచ్చాయో తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. గతేడాది దావోస్ పర్యటన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ప్రజలకు తెలియజేయాలని సవాల్ విసిరారు. గత పన్నెండేళ్లలో...బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సింగరేణి సంస్థలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీపరంగా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నామన్నారు. రాష్ట్రంలోని రెండేసి ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున (మొత్తం అయిదు) నిర్వహించే బహిరంగ సభల్లో కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారని తెలిపారు. -
నారీ నారీ నడుమ మురారి.. పొలిటికల్ మూవీ
-
రాజ్యసభకు నితిన్ నబీన్?
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ మరికొద్ది నెలల్లో రాజ్యసభ సభ్యత్వం తీసుకోబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం బిహార్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నబీన్ను ఏప్రిల్లోనే రాజ్యసభకు ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన సొంత రాష్ట్రమైన బిహార్ నుంచే ఆయన ఎంపిక ఉండవచ్చని తెలుస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబీన్ ఇన్నాళ్లూ బిహార్లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన్ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ బంకీపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అసెంబ్లీకి హాజరవ్వడం అంత సులభమేమీ కాదు. అటు ఎమ్మెల్యేగా, ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ద్వంద్వ పాత్రలు పోషించడం కష్టమని భావిస్తున్నారు. ఆయనను రాజ్యసభకు పంపడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో ఇదే మాదిరిగా మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాజ్యసభకు పంపిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నాయి. వచ్చే ఏప్రిల్లో బిహార్లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఖాళీ అవుతున్న స్థానాల్లో రెండింటిని బీజేపీ తీసుకొని, మిగతా మూడింటిని కూటమి పార్టీలకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. తమ రెండింటిలో ఒక స్థానం నుంచి నబీన్ను రాజ్యసభకు పంపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో స్థానం నుంచి భోజ్పురి నటుడు పవన్ సింగ్కు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
బెంగళూరు ఎన్నికలపై బీజేపీ గురి.. కీలక నిర్ణయం
మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కాషాయ పార్టీ ఇప్పుడు కర్ణాటకపై గురి పెట్టింది. దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో 28 ఏళ్ల శివసేన ఆధిపత్యానికి ముగింపు పలికిన కమలం పార్టీ బెంగళూరులోనూ పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. మరో నాలుగైదు నెలల్లో జరగనున్న స్థానిక ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు కీలక నేతలకు బెంగళూరు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది.బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ను గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జిగా నియమించింది. రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీశ్ పూనియా, (Satish Poonia) మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయ్లను సహ-ఇంచార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తూ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటనను జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యాలయం ఇంచార్జి అర్జున్ సింగ్ మంగళవారం విడుదల చేశారు.అసెంబ్లీ సమరం లాంటిదే.. గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జిగా తనను నియమించినందుకు నితిన్ నబీన్కు 'ఎక్స్'లో రాంమాధవ్ ధన్యవాదాలు తెలిపారు. మే నెలలో జరగనున్న బృహద్ బెంగళూరు మహానగర్ పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. 90 లక్షల ఓటర్లు, 369 వార్డులు ఉన్న బీబీఎంపీ ఎన్నికలు.. అసెంబ్లీ సమరం కంటే తక్కువేమీ కాదన్నారు. కర్ణాటక బీజేపీ నాయకులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, బెంగళూరు నగర నేతలు, కార్యకర్తలతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు.ఎన్నికలకు సిద్ధం: సీఎంబెంగళూరు కార్పొరేషన్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంతకుముందే ప్రకటించారు. జూన్ 30లోపు బీబీఎంపీ ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తమదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ-జేడీఎస్ పొత్తు గురించి తమకు బెంగలేదని సిద్ధరామయ్య, శివకుమార్ అన్నారు. చదవండి: నితిన్ నబీన్కు తొలి అడుగే అగ్నిపరీక్ష! -
పార్టీ వ్యవహారాల్లో... నబీన్ నా బాస్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రస్థానంలో నూతన శకానికి తెర లేచింది. బిహార్కు చెందిన యువ నాయకుడు నితిన్ నబీన్ సిన్హా పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదికైంది. బీజేపీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో 45 ఏళ్ల నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు.ఈ మేరకు సర్టిఫికెట్ను ఆయనకు అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఐదో అంతస్తులోని చాంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నుంచి నబీన్ లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అతిరథ మహారథులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామి, నయాబ్ సింగ్ సైనీ, ప్రమోద్ సావంత్, ముఖ్యమంత్రి పేమా ఖండు తదితరులు వీరిలో ఉన్నారు. మోదీతో పాటు వారంతా నబీన్ను స్వయంగా అధ్యక్ష చాంబర్లోకి తోడ్కొని వెళ్లారు.బీజేపీ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షునిగా, బిహార్ నుంచి వచ్చిన తొలి సారథిగా నబీన్ నిలిచారు. బీజేపీకి ఆయన 12వ అధ్యక్షుడు. నబీన్ ఎన్నికను చరిత్రాత్మక ఘట్టంగా నడ్డా అభివర్ణించారు. ఇంతకాలం తనకు అన్నివిధాలా సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.నితిన్ వెన్నంటి సాగుతాం: మోదీబీజేపీ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన నబీన్కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను నవతరానికి ప్రతినిధి (మిలీనియల్)గా అభివర్ణించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ నేతగా, ప్రధానిగా ఎంత అనుభవమున్నా అన్నింటికంటే ముందు నేను బీజేపీ కార్యకర్తను. ఇకపై పార్టీపరమైన వ్యవహారాల్లో నితిన్ నాకు బాస్’’ అని చెప్పారు. ఆయన్ను పదేపదే ‘గౌరవనీ యులైన’ అంటూ సంబోధించారు.‘‘యువకుడైన నబీన్ శక్తియుక్తులు, వ్యవస్థాగత వ్యవహారాల్లో ఆయనకున్న అపార అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇకపై ఆయన నోట వచ్చే ప్రతి మాటా మాకందరికీ నూతన దిశానిర్దేశం చేస్తుంది. పార్టీ భావి కార్యాచరణకు నబీన్ మార్గదర్శకత్వం వెలకట్టలేని ఆస్తి కానుంది’’ అన్నారు. ‘‘పార్టీ కార్యకర్తగా నేను కూడా నా పనితీరును ఎప్పటికప్పుడు నూతన అధ్యక్షునికే నివేదిస్తాను. నా పనితీరుకు సంబంధించిన రహస్య నివేదికను రాసేది ఆయనే. కనుక నబీన్ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నా’’ అని మోదీ చెప్పుకొచ్చారు. బీజేపీ వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు ఎన్డీఏ భాగస్వాముల నడుమ సమన్వయం సజావుగా కొనసాగేలా చూ డాల్సిన బాధ్యత కూడా నబీన్దేనని గుర్తు చేశారు.కాంగ్రెస్ తప్పిదాలు మనం చేయొద్దుకాంగ్రెస్ తప్పిదాల నుంచి నేర్చుకోవాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు మోదీ సూచించారు. ‘‘1984 లో 50 శాతం పై చిలుకు ఓట్లతో 400కు పైగా లోక్సభ స్థానాలు సాధించిన కాంగ్రెస్ నేడు 100 సీట్లు కూడా నెగ్గలేక ఆపసోపాలు పడుతోంది. కనుక ఆ పార్టీ దుర్లక్షణాలన్నింటినీ నిశితంగా గమనించి మనం వాటికి దూరంగా ఉందాం. అప్పుడిక మనల్ని ఎవరూ ఓడించలేరు’’ అన్నారు. నిష్పాక్షిక ఆత్మవిమర్శే బీజేపీ బలమని గుర్తు చేశారు.‘‘బీజేపీ ఒక సంప్రదాయం. అది ఒక కుటుంబం. సభ్యత్వం కంటే సంబంధాలకు విలువనిచ్చే పార్టీ. పదవుల ద్వారా కాకుండా ప్రక్రియ ద్వారా పనిచేసే పార్టీ బీజేపీ. ఇక్కడ అధ్యక్షులు మారినా ఆదర్శాలు, దిశానిర్దేశాలు మారవు. వాజపేయీ, అడ్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి దిగ్గజాల సారథ్యంలో బీజేపీ సున్నా నుంచి శిఖరస్థాయికి ఎదిగింది. వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా సారథ్యంలో మరింత ఎదిగింది’’ అని గుర్తు చేసుకున్నారు.చొరబాట్లు, అర్బన్ నక్సల్స్తో... దేశ భద్రతకే ప్రమాదం!చొరబాటుదారులు, అర్బన్ నక్సల్స్ దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారారని మోదీ ఆందోళన వెలిబుచ్చారు. చొరబాటుదారులను గుర్తించి తిప్పి పంపడం చాలా ముఖ్యమన్నారు. అక్రమ వలసలతో సంపన్న దేశాలు కూడా సతమతమవు తున్నాయి. వారిని వెళ్లగొడుతున్నాయి. వారు ప్రజలను కొల్లగొట్టడాన్ని భారత్ ఎప్పటికీ అనుమతించబోదు. కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు దన్నుగా నిలుస్తున్నాయి. వాటి ముసుగు తొలగించి ప్రజల ముందు నిలబెడదాం’’ అని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.‘‘దేశం ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య అర్బన్ నక్సలిజం. ‘‘నా గురించి, ఎన్డీఏ ప్రభుత్వం గురించి సానుకూలంగా ఎవరు మాట్లాడినా లక్ష్యం చేసుకుని నోరు మూయించే కార్యక్రమం జరుగుతోంది. కొందరు జర్నలిస్టులు కూడా వారిని దారుణంగా హేళన చేసి అవమా నిస్తున్నారు. అంటరానివాళ్లుగా ముద్ర వేస్తున్నారు. ఇదంతా అర్బన్ నక్సల్స్ నూతన శైలి. వీరంతా కలిసి దేశానికి చేటు చేసేందుకు నిత్యం ప్రయత్ని స్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. వీరికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడం చాలా అవసరమన్నారు.అట్టహాసంగా కార్యక్రమంనబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆయనను మోదీ పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యాలయం కోలాహలంగా మారింది. జై శ్రీరాం, జై నితిన్ నబీన్ నినాదాలతో మార్మోగింది. ఆయన భార్య, పిల్లలు, కుటుంబీకులు, సన్నిహితులు కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగు నేతల సందడినబీన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు ఎన్.రాంచందర్రావు, పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, శ్రీనివాసవర్మ, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. వారంతా నబీన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.రాజకీయాల్లోకి యువతబీజేపీ నూతన సారథి నబీన్ పిలుపున్యూఢిల్లీ: రాజకీయాల్లోకి ప్రజలు మరింత చురుగ్గా రావాల్సిన అవస రముందని బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా అభిప్రా యపడ్డారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తద్వారా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని కలసికట్టుగా సాకారం చేసుకుందామని పేర్కొ న్నారు. ‘‘అయితే రాజకీయాలు 100 మీటర్ల రేసు కాదు. సుదీర్ఘంగా సాగే మారథాన్. అక్కడ పరీక్ష వేగానికి కాదని, శారీరక సామర్థ్యానికి. యువత దీన్ని గుర్తించాల్సిన అవసరముంది’’ అన్నారు.బీజేపీ సారథిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం పార్టీ ప్రధాన కార్యాల యంలో ఆయన నేతలు, కార్యక ర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీలో ప్రతి కార్యకర్తకూ పనికి తగిన గుర్తింపు ఎప్పుడూ లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరి కృషినీ గుర్తించేంత శక్తియుక్తులు బీజేపీ ‘వాచ్టవర్’కు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. కీలకమైన పశ్చిమ బెంగాల్తో పాటు రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బూత్ నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి దాకా పూర్తి చిత్తశుద్ధి, అంకితభావంతో పని చేయాలని సూచించారు. విపక్ష ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, డీఎంకేలపై నబీన్ ఈ సందర్భంగా ఘాటు విమర్శలు చేశారు. కార్తీక దీప సంప్రదాయాన్ని కూడా అడ్డుకునే కుయుక్తులకు డీఎంకే సర్కారు దిగిందన్నారు. ఇలాంటి శక్తులను ఓడించి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. -
బీజేపీతో పొత్తుపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల మహారాష్ట్రలో ఓ మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానం కోసం బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనపై తాజాగా అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎంఐఎం పార్టీ ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. సముద్రం లోని రెండు చివరలు ఎప్పటికీ కలవవు అని తెలిపారు.కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం జరిగింది. అక్కడి అకోట్ మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానం కోసం బద్రశత్రువులైన బీజేపీ, ఎంఐఎం పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. అధికారం కోసం ఉప్పునిప్పులా ఉన్న రెండు పార్టీలు కలవడమేంటని ముక్కున వేలేసుకున్నారు. అయితే దీనిని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. అది తనకు తెలియకుండా జరిగిందని అలా పొత్తు పెట్టుకున్న నాయకులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.తాజాగా ఈ అంశంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "అకోలాలో ఎంఐఎం కార్పొరేటర్లు ఐదుగురు గెలిచారు. అయితే అధికారం కోసం ఒక గ్రూపుకు మద్దతిస్తామన్నారు. అయితే ఆ గ్రూపు బీజేపీతో కలిసి ఉన్న సంగతి వారికి తెలియదు. అయితే ఆగ్రూపులో బీజేపీ ఉన్న సంగతి తెలిసిన తర్వాత సపోర్టును ఉపసంహరించుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు లేఖ రాయాలని కోరాం" అని ఒవైసీ అన్నారుబీజేపీ, ఎంఐఎం పార్టీలు విభిన్న ధృవాలని సముద్రానికి ఉన్న రెండు తీరాల్లాంటివారని అవి ఎప్పటికీ కలవవని ఒవైసీ తేల్చిచెప్పారు. అంతేకాకుండా తమ పార్టీకి చెందిన నెతలేవరైనా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పొత్తు పెట్టుకుంటే అధిష్ఠానం వారిపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇటీవల మహాయుతి కూటమి ఆఫర్ చేసిన కోఆప్షన్ మెంబర్ తీసుకున్న ఇంతియాజ్ జలీల్ అనే వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ఒవైసీ పేర్కొన్నారు.కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 125 సీట్లు గెలిచిన ఆపార్టీ గత నెలలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 85 సీట్లు సాధించింది. దీంతో మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు 200మంది ఉన్నట్లు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో81 కార్పొరేటర్ స్థానాలు సాధించిన ఎంఐఎం ఈ సారి వాటి సంఖ్య 200కు పెంచుకుంది. -
కమల దళపతిగా నితిన్ నబీన్
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్.. జెపీ నడ్డా నుంచి బాధ్యతలు స్పీకరించారు. ఇవాళ(జనవరి 20, మంగళవారం) ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజానాథ్ సింగ్, పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలడని.. ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. ‘‘నేను బీజేపీ కార్యకర్త.. నితిన్ నాకు బాస్. బీజేపీలో నిర్ణయాలు, ఎంపికలు అన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి. దేశసేవ, ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది’’ అని మోదీ పేర్కొన్నారు.‘‘ప్రభుత్వానికి అధిపతి అయినా... బీజేపీ కార్యకర్త కావడమే నాకు గర్వ కారణం. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నితిన్ నబీన్ విజయవంతంగా నిర్వహించారు. తనను తాను రుజువు చేసుకున్నారు. పార్టీ కంటే, దేశం ముఖ్యమనే నినాదంతో పనిచేస్తున్నాం. కుటుంబ రాజకీయ పార్టీలు యువకులకు తలుపులు మూసేస్తున్నాయి. ఇలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువకులను రాజకీయ నాయకులను తయారు చేయాలనుకుంటున్నాను..బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. మోదీకి అనుకూలంగా వార్తలు రాసినా, చెప్పినా వారిని అర్బన్ నక్సల్స్ టార్గెట్ చేస్తున్నారు. అర్బన్ నక్సలైట్ల ఆగడాలను అరికట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధోగతికి ఆ పార్టీ విధానాలు కారణం. కుటుంబ రాజకీయాలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచాయి. కాంగ్రెస్ లక్షణాలు మన పార్టీకి అంటకుండా జాగ్రత్తపడాలి’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు.కాగా, 26 ఏళ్లకే ఎమ్మెల్యే. 45వ ఏటే బీజేపీ వంటి అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కునిగా రికార్డు. నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం తొలినుంచీ ఆసక్తికరమే. ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది.నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. అలాంటి నేతలకు ఏకంగా అధ్యక్ష పగ్గాలు అందడం అనూహ్యమనే చెప్పాలి. నబీన్ జన్మించింది బీజేపీ పురుడు పోసుకున్న 1980లోనే కావడం విశేషం. ఆయన జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. ఆయన కాయస్థ కులస్తుడు.యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు తదితరాల్లో అపార అనుభవం ఆయన సొంతం. నబీన్ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాతో మొదలైంది. నబీన్ కుటుంబానికి ఆరెస్సెస్తో సన్నిహిత బంధముంది. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీ నాయకుడే. పట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ 2006లో మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో నబీన్ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు! 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ ఇన్చార్జిగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపి జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు.తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఛత్తీస్గఢ్లో 11 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లు నెగ్గేలా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నడ్డా వారసునిగా పలువురు ప్రముఖుల పేర్లు విన్పించినా, పార్టీ నాయకత్వం మాత్రం అనూహ్యంగా నబీన్ వైపు మొగ్గింది. గత డిసెంబర్ 16న ఆయనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించింది. మంగళవారం ఆయన నుంచి నబీన్ లాంఛనంగా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నారు. ఆయనకు భార్య దీప్మాలా శ్రీవాత్సవ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కీలకమైన పశ్చిమబెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపాల్సిన గురుతర బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది. -
కమల దళపతి నితిన్ నబీన్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నూతన అధ్యక్షునిగా బిహార్కు చెందిన పార్టీ యువ నేత నితిన్ నబీన్ సిన్హా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కునిగా 45 ఏళ్ల నబీన్ రికార్డు సృష్టించారు. అంతేగాక బిహార్ నుంచి వచి్చన తొలి బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనే కావడం విశేషం! మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ 12వ అధ్యక్షునిగా నబీన్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జగత్ప్రకాశ్ నడ్డా పదవీకాలం ముగియడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియలో భాగంగా కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ముగిసింది. నబీన్ ఒక్కరి తరఫునే నామినేషన్లు దాఖలవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మంగళవారం ఈ మేరకు లాంఛనంగా ప్రకటన వెలువడనుంది. నబీన్ ప్రస్తుతం బీజేపీ తాత్కాలిక అధ్యక్షునిగా ఉండటం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సంతకంతో కూడిన నబీన్ నామినేషన్ సెట్టును నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తదితరులు రిటరి్నంగ్ అధికారి కె.లక్ష్మణ్కు సమర్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నయాబ్సింగ్ సైనీ, ప్రమోద్ సావంత్, పెమా ఖండు, పుష్కర్సింగ్ ధామి, బీజేపీ అగ్ర నేతలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నబీన్ తరఫున బీజేపీ రాష్ట్ర శాఖలు కూడా ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశాయి. అలా మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలైనట్టు లక్ష్మణ్ వివరించారు. నబీన్కు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నబీన్కు రానున్న పశి్చమబెంగాల్ సహా పలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపడం అగి్నపరీక్షగా నిలవనుంది. తొలిసారి అడ్వాణీ, జోషీ లేకుండా! బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు పార్టీ కురువృద్ధులు లాల్కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ గైర్హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబతాలో కూడా వారి పేర్లు లేవు. ఇలా జరగడం బీజేపీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1980 నుంచీ ఇప్పటిదాకా జరిగిన 11 మంది అధ్యక్షుల ఎన్నికల్లో వారు భాగస్వాములుగా ఉంటూ వచ్చారు. అయితే అడ్వాణీ, జోషీ ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ శాఖ నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ శాఖకు సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉంది. దాంతో అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబితాలో వారి పేర్లు చేర్చేందుకు వీల్లేకుండా పోయిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. యంగెస్ట్ ప్రెసిడెంట్గా!న్యూఢిల్లీ: 26 ఏళ్లకే ఎమ్మెల్యే. 45వ ఏటే బీజేపీ వంటి అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కునిగా రికార్డు. నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం తొలినుంచీ ఆసక్తికరమే. ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది.నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. అలాంటి నేతలకు ఏకంగా అధ్యక్ష పగ్గాలు అందడం అనూహ్యమనే చెప్పాలి. నబీన్ జన్మించింది బీజేపీ పురుడు పోసుకున్న 1980లోనే కావడం విశేషం. ఆయన జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. ఆయన కాయస్థ కులస్తుడు. యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు తదితరాల్లో అపార అనుభవం ఆయన సొంతం. నబీన్ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాతో మొదలైంది. నబీన్ కుటుంబానికి ఆరెస్సెస్తో సన్నిహిత బంధముంది. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీ నాయకుడే. పట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ 2006లో మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో నబీన్ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు! 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ ఇన్చార్జిగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపి జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు. తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఛత్తీస్గఢ్లో 11 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లు నెగ్గేలా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నడ్డా వారసునిగా పలువురు ప్రముఖుల పేర్లు విన్పించినా, పార్టీ నాయకత్వం మాత్రం అనూహ్యంగా నబీన్ వైపు మొగ్గింది. గత డిసెంబర్ 16న ఆయనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించింది. మంగళవారం ఆయన నుంచి నబీన్ లాంఛనంగా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నారు. ఆయనకు భార్య దీప్మాలా శ్రీవాత్సవ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కీలకమైన పశ్చిమబెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపాల్సిన గురుతర బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది. -
మోదీపై అభిషేక్ బెనర్జీ విమర్శలు
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.అసెంబ్లీ ఎన్నికల తరుణంలో టీఎంసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకుంటోందని, బీజేపీ రాష్ట్ర ప్రజలపై కష్టాలు మోపుతోందని అన్నారు. నిధుల నిలిపివేత వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.కేంద్రం గ్రామీణ అభివృద్ధి, పథకాలు, మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదు. దీని వల్ల పేదలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రజలపై నేరుగా దాడి చేసినట్టే. బెంగాల్ ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అందుకే కేంద్రం ప్రతీకారంగా నిధులను నిలిపివేస్తోంది’ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. తృణమూల్ కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి పెంచుతుండగా, బీజేపీ మాత్రం నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయి. అందుకే విడుదల నిలిపివేశాం అని వాదిస్తోంది. ఈ వివాదం రాబోయే ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి, పశ్చిమ బెంగాల్కు నిధుల నిలిపివేతపై అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలు రాష్ట్ర కేంద్ర సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. -
Thousand Note: రూ.వెయ్యి నోటు రద్దుకు 48 ఏళ్లు!
రూ.వెయ్యి నోటు ఎప్పుడు రద్దయ్యిందంటే టక్కున 2016లో మోదీ ప్రభుత్వం రద్దుచేసిందని చెప్పేస్తారు. కానీ అంతకు ముందే కొన్నేళ్ల క్రితం చలామణిలో ఉన్న ఈ రూ.వెయ్యి నోటు రద్దయ్యి నేటి సరిగ్గా 48 ఏళ్లయ్యింది. 1978 జనవరి 15వ తేదీన అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిల హయాంలో కొన్ని ఆర్థిక కారణాల రీత్యా పెద్ద నోట్లను రద్దు చేశారు. 72 ఏళ్ల కిందట 1954లో భారత రిజర్వు బ్యాంక్ ఈ వెయ్యి నోట్లను విడుదల చేసింది. రిజర్వు బ్యాంక్ గవర్నర్ బి.రామారావు సంతకంతో మొదటిసారిగా ఈ నోటును ముద్రించారు. ఈ నోటును కాకినాడకు చెందిన ప్రముఖ నాణేల సేకరణకర్త మార్ని జానకిరామ చౌదరి సేకరించి భద్రపరిచారు. ఈ నోటు 20.3 సెంటీ మీటర్ల వెడల్పు, 12.7 సెంటీమీటర్ల ఎత్తుతో సుమారు పావుఠావు పరిమాణంతో చలామణీలో ఉండేది. జానకిరామ చౌదరి మాట్లాడుతూ నోటుకు ముందువైపు మూడు సింహాల చిత్రం, వెనుకవైపు తంజావూరు (తమిళనాడు) లో వెయ్యేళ్ల కిందట నిర్మించిన బృహదీశ్వరాలయం చిత్రాన్ని ముద్రించారని, దీనితో పాటు చలామణిలో ఉండే ఐదు వేలు, పది వేల రూపాయల నోట్లను కూడా నాటి ప్రభుత్వం 1978 జనవరి 15 తేదీన రద్దు చేసిందని తెలిపారు. -
ముంబైలో మళ్లీ పవర్ప్లే!
సుమారు పాతికేళ్లపాటు కొనసాగిన థాక్రే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ.. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. ఈ విజయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కే సింహ భాగం కట్టబెడుతున్నారంతా. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ముంబై మేయర్ పదవిని బీజేపీ తృటిలో చేజార్చుకుంది. ఆ టైంలో.. 82 స్థానాలు నెగ్గినప్పటికీ మిత్రపక్షంగా ఉన్న శివసేన కంటే కేవలం రెండే సీట్లు వెనకబడిపోయింది. అయితే.. ఈసారి మహాయుతికి స్పష్టమైన బలం ఉండడంతో ముంబై మేయర్ పీఠం బీజేపీదే అనుకుంటున్న టైంలో.. హైడ్రామా మొదలైంది. నిన్న బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాల్లో జోరు కొనసాగుతున్న టైంలోనే.. పదవిపై బీజేపీ, ఏకనాథ్ శిండే శివసేన మధ్య అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తం 227 స్థానాలున్న బీఎంసీలో మ్యాజిక్ ఫిగర్ 114. బీజేపీ 89 వార్డుల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. శిండే శివసేన కేవలం 29 స్థానాలు సాధించింది. అజిత్ పవార్ ఎన్సీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లెక్క ప్రకారం బీజేపీకి మేయర్ పదవి దక్కాలంటే శిండే వర్గం మద్దతు తప్పనిసరి. దీంతో.. షిండే వర్గానికి కింగ్మేకర్ స్థానం దక్కినట్లయ్యింది. శిండే వర్గంలోని కీలక నేతలు ఇప్పటికే “ముంబై మేయర్ శివసేన వర్గానిదే కావాలి. ఇది బాలాసాహెబ్ థాక్రే వారసత్వం” అని ప్రకటనలు చేసుకుంటూ వస్తోంది. అయితే షిండే మాత్రం “మహాయుతి కూటమిగా పోరాడాం. ముంబై అభివృద్ధి కోసం కలిసి నిర్ణయం తీసుకుంటాం” అని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఏం జరగొచ్చు!మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో 131 స్థానాలున్న థానేలో సీన్ రివర్స్గా ఉంది. అక్కడ షిండే శివసేన ఏకంగా 75 సీట్లు సాధించింది. బీజేపీ 28 స్థానాలు దక్కించుకుంది. దీంతో మిత్రపక్షం మద్దతు అవసరం లేకుండానే షిండే సేన మేయర్ పదవి దక్కించుకోబోతోంది. అయితే ముంబై విషయంలో అలా కాదు. అయితే మేయర్ పదవిని రెండు భాగాలుగా పంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే, 2.5 సంవత్సరాలకుగానూ(పవర్షేరింగ్ ఫార్ములా) షిండే వర్గం, మిగతా కాలం బీజేపీకి దక్కేలా ఒప్పందం కుదిరే అవకాశముందని ప్రచారం నడుస్తోంది. అలాగే మేయర్ పదవిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఉపమేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులు, కీలక వార్డులపై గట్టి చర్చలు జరగడం ఖాయమనే చెప్పొచ్చు. అయితే అంత మెజారిటీ సాధించిన బీజేపీ.. మేయర్ సీటును త్యాగం చేస్తుందా? అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. లేదంటే.. ఈ వంకతో బీఎంసీ ముఖ్య కమిటీలపై షిండే శివసేన ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మహా ధురంధర్ ఫడ్నవీస్
మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించగా, ఈ విజయానికి ప్రధాన శక్తిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రతిధ్వనిస్తోంది. ఎన్నికల ముందు ఆయన చేసిన ప్రకటన “మా గత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లను కైవసం చేసుకుంటాం” అనేది కేవలం నినాదంగా కాకుండా, ఫలితాల్లో నిజమైంది. ఈ విజయంతో ఆయనకు అట్టడుగు స్థాయి ప్రజల నుండి గట్టి ఆదరణ ఉందని స్పష్టమైంది.ముఖ్యంగా ముంబైలో తన పట్టును నిలుపుకోవడం ఫడ్నవీస్ కోసం కీలకంగా మారింది. ఠాక్రే సోదరులు ఉద్ధవ్, రాజ్ 20 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టి ఒకటయ్యే ప్రయత్నం చేసినా, ఫడ్నవీస్ వ్యూహాలు వారి ఆశలపై నీళ్లుజల్లాయి. ప్రచారంలో ఆయన స్వయంగా ముందుండి, ప్రతి కార్పొరేషన్లోనూ కలియదిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వయోజన ఓటర్లతో పాటు యువత, ముఖ్యంగా జెన్ జెడ్ తరాన్ని తన సూటి.. ఆధునిక ప్రచార శైలితో ఆకట్టుకున్నారు.దక్షిణ భారతీయులను ముంబై నుంచి వెళ్లగొడతామన్న ఠాక్రేల హెచ్చరికల నడుమ, ఫడ్నవీస్ వారిని అక్కున చేర్చుకోవడం ఆయనకు అదనపు మద్దతు తెచ్చింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఆ ప్రాంతీయులు ఆయనను తమవాడిగా భావించారు. అంతేకాకుండా, ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ధారావీ అభివృద్ధి ప్రాజెక్టును ప్రకటించడం.. ముంబై వాసుల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టడం ఆయనకు విశేష ఆదరణను తెచ్చింది.ఈ విజయంతో 54 ఏళ్ల ఫడ్నవీస్ మరాఠా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కేవలం ఒక నాయకుడిగానే కాకుండా, వ్యూహకర్తగా, ప్రజల మనసులను గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు. మహాయుతి కూటమి విజయాన్ని బ్లాక్బస్టర్గా మార్చిన హీరోగా ఆయన పేరు మరాఠా రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. -
ముంబై కోటపై బీజేపీ జెండా!
ముంబై: మహారాష్ట్రలో పురపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి మెరిసింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైపై కాషాయ జెండా ఎగరేసింది. తద్వారా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై దాదాపు మూడు దశాబ్దాల శివసేన ఆధిపత్యానికి ఎట్టకేలకు తెర దించింది. దేశంలోనే గాక ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న కార్పొరేషన్గా పేరొందిన బీఎంసీలో 227 కార్పొరేటర్ స్థానాలకు గాను అధికార మహాయుతి కూటమి భాగస్వాములు శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)తో కలిసి బీజేపీ ఇప్పటికే 116 సీట్లను కైవసం చేసుకుంది. తద్వారా 114 స్థానాల మెజారిటీ మార్కును దాటేసింది. కడపటి ఫలితాలు అందేసరికి కాషాయ పార్టీ సొంతంగానే 87 స్థానాలు సాధించింది. తద్వారా 2017లో 82 సీట్లు సాధించిన సొంత రికార్డును అధిగమించింది. ఇంకా పలుచోట్ల ముందంజలో ఉంది. శివసేన (షిండే) 27 స్థానాలను గెలుచుకుంది. మహాయుతి కూటమిలోని మరో పార్టీ ఎన్సీపీ (అజిత్) 2 సీట్లు గెలుచుకుంది. బీఎంసీపై పట్టును ఎలాగైనా నిలుపుకునేందుకు ఠాక్రే సోదరులు శివసేన (ఎంబీటీ) సారథి ఉద్ధవ్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ పరస్పర వైరానికి స్వస్తి పలికి ఎన్నికల ముంగిట చేతులు కలిపినా లాభం లేకపోయింది. వారి ఆశలపై ముంబై ఓటర్లు నీళ్లు చల్లారు. ఉద్ధవ్ సేన 64 సీట్లకు పరిమితం కాగా ఎంఎన్ఎస్ 6 చోట్ల మాత్రం నెగ్గింది. ఉద్ధవ్ పార్టీ కనీసం మరో 5 చోట్ల ముందంజలో ఉంది. బీఎంసీ సహా రాష్ట్రంలో 29 మున్సిపల్ కార్పొరేషన్లలో గురువారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో మహాయుతి ఆరంభం నుంచే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ముంబైతో పాటు అత్యధిక కార్పొరేషన్లను చేజిక్కించుకుంది. ఇక శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్లా ఘోర ఓటమే చవిచూసింది. భివండీ మినహా ఏ కార్పొరేషన్లోనూ కనీసం రెండంకెల స్కోరుకు కూడా చేరుకోలేక చతికిలపడింది. ముంబైలోనైతే ఒకే ఒక్క కార్పొరేటర్ స్థానానికి పరిమితమైంది! సొంత గడ్డ అయిన పుణెలో కూడా ఘోర పరాభవం పాలైంది. 165 స్థానాలకు గాను కేవలం నాలుగు సీట్లతో సరిపుచ్చుకుంది. అక్కడ బీజేపీ ఒంటరిగానే ఏకంగా 123 సీట్లు దక్కించుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అత్యధిక పురపాలికల్లో నేలచూపులే చూసింది. బీఎంసీలో హస్తం పార్టీకి కేవలం 24 స్థానాలు దక్కాయి. లాతూర్ కార్పొరేషన్లో సొంతంగా మెజారిటీ సాధించడం ఒక్కటే ఆ పార్టీకి ఊరటగా నిలిచింది. మొత్తం 29 కార్పొరేషన్లకు గాను మహాయుతి కూటమి 25 స్థానాలను చేజిక్కించుకోవడం ఇప్పటికే ఖాయమైంది. పురపాలికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హర్షం వెలిబుచ్చారు. 54 శాతం పోలింగ్ మహారాష్ట్రలో అన్ని పురపాలికల గడువూ మూడు నుంచి ఐదేళ్ల క్రితమే ముగిసింది. నాటినుంచీ అధికారుల పాలనలో ఉన్న ఆ కార్పొరేషన్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తమ్మీద 54.77 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కొత్తగా ఏర్పాటైన ఇచల్కరంజీ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికంగా 69.76 శాతం ఓటింగ్ జరిగింది. 66.53 శాతంతో కొల్హాపూర్ రెండో స్థానంలో నిలిచింది. మీరా–భయందర్లో అత్యల్పంగా 48.64 శాతం నమోదైంది. ముంబైలో 52.94 శాతం పోలింగ్ జరిగింది. ప్రతిష్టాత్మకమైన పుణెతో పాటు పంప్రీ–చించ్వాడ్, నాసిక్, ఛత్రపతి శంభాజీనగర్... ఇలా మెజారిటీ కార్పొరేషన్లలో బీజేపీ కూటమి హవాయే కొనసాగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయేసరికి మొత్తం 2,784 వార్డుల ఫలితాలు వెలువడగా వాటిలో బీజేపీ 1,372 చోట్ల గెలుపొందింది. లాతూర్ కార్పొరేషన్లో మాత్రం 70 స్థానాలకు గాను కాంగ్రెస్ 43 చోట్ల గెలిచింది. బీజేపీ 22 సీట్లకు పరిమితమైంది. చంద్రపూర్లో కూడా 66 స్థానాలకు గాను కాంగ్రెస్ 27 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. ఉద్ధవ్ శివసేనకు 6 స్థానాలు దక్కాయి. రెండు పార్టీలూ కలిసి మేయర్ పదవి దక్కించుకోవచ్చంటున్నారు. జనవికాస్ సేనకు 3 సీట్లు రాగా ఇద్దరు స్వతంత్రులు నెగ్గారు. వారి మద్దతూ తమకేనని కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీ 23 సీట్లకు పరిమితం కాగా మజ్లిస్, బీఎస్పీలకు ఒక్కో స్థానం దక్కాయి. వసై–వీరార్ కార్పొరేషన్లో స్థానిక పార్టీ బహుజన్ వికాస్ అగాఢీ విజయం సాధించడం విశేషం. 115కు గాను ఆ పార్టీ ఏకంగా 71 స్థానాలను చేజిక్కించుకోగా బీజేపీ 43 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక పర్బాణిలో 65 స్థానాలకు గాను శివసేన (యూబీటీ) 25, కాంగ్రెస్ 12 సీట్లలో నెగ్గాయి. బీజేపీకి 12, ఎన్సీపీ (అజిత్) వర్గానికి 11 సీట్లొచ్చాయి.అభివృద్ధికే ఓటేశారు: మోదీ న్యూఢిల్లీ: మహారాష్ట్ర మున్సిపల్ పోరులో బీజేపీ కూటమి విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ఎన్డీఏ కూటమి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో చెప్పేందుకు ఈ విజయమే తార్కాణమని ఆయన అన్నారు. అత్యధిక కార్పొరేషన్లలో ఘనవిజయం కట్టబెట్టడం ద్వారా తమ పనితీరును వారు మరోసారి ఆశీర్వదించారన్నారు. ‘థాంక్యూ మహారాష్ట్ర!’ అంటూ ఎక్స్ పోస్టులో రాష్ట్ర ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాల నేపథ్యంలో వారితో ఎన్డీఏ బంధం మరింత బలపడిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్డీఏకు ఇంతటి ఘనవిజయం సాధించిపెట్టిన కూటమి కార్యకర్తలను చూసి గరి్వస్తున్నా. మీ అవిశ్రాంత శ్రమే ఇందుకు కారణం’’ అన్నారు.బీజేపీ ఓట్ల చోరీ: రాహుల్ న్యూఢిల్లీ: ఎప్పట్లాగే మహారాష్ట్ర పురపాలికల ఎన్నికల్లో కూడా అధికార బీజేపీ కండబలంతో ఓట్ల చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఓటర్ల వేలిపై గుర్తు పెట్టేందుకు వాడిన మార్కర్ పెన్నుల్లో ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే నాసిరకం ఇంకు వాడిందని మరోసారి ఆరోపించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపనున్నట్టు ముంబై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. రానున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో మార్కర్ పెన్నులు వాడబోమని కూడా ఎస్ఈసీ దినేశ్ వాగ్మారే పేర్కొన్నారు. 2011 నుంచీ రాష్ట్రంలో అన్ని స్థానిక ఎన్నికల్లోనూ మార్కర్లనే వాడుతున్నట్టు ఆయన గుర్తు చేశారు.గౌరీ లంకేశ్ హత్య కేసునిందితుని గెలుపు జల్నా: జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పనగార్కర్ పురపాలిక ఎన్నికల్లో విజయం సాధించాడు. జల్నా కార్పొరేషన్లో స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగిన అతడు 13వ వార్డు కార్పొరేటర్గా నెగ్గాడు. సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన రావ్సాహెబ్ ధోబ్లేపై స్వల్ప మెజారిటీతో గెలుపొందాడు. లంకేశ్ 2017లో దారుణ హత్యకు గురవడం తెలిసిందే. ఆమెను బెంగళూరు నివాసం బయటే దారుణంగా కాల్చి చంపారు. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీకాంత్ను 2018 ఆగస్టులో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. 2024లో అతను బెయిల్పై బయటికొచ్చాడు.మజ్లిస్కు 114 స్థానాలు మహారాష్ట్ర పుర పోరులో ఆలిండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) 114 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంది. ఛత్రపతి శంభాజీనగర్లో అత్యధికంగా 33 సీట్లు నెగ్గడం విశేషం. మాలెగావ్ (21), అమరావతి (15), నాందేడ్ (13), ధులే (10) కార్పొరేషన్లలో పార్టీ రెండంకెల స్కోరు దాటింది. బీఎంసీలో కూడా ఖాతా తెరిచింది. 2017 నాటి కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ 80 స్థానాలు నెగ్గింది.చతికిలపడ్డ శివసేనశివసేన. మహారాష్ట్రలో ఈ పేరే ఓ సంచలనం. ముంబైలో శివసేన తిరుగులేని శక్తి. వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే రోజుల నుంచీ నగరంలో ఆ పార్టీ హవాయే సాగుతూ వచి్చంది. కొన్నేళ్లుగా కొడిగడుతూ వచి్చన ఆ ప్రభ తాజా బీఎంసీ ఎన్నికల ఫలితాలతో దాదాపుగా పరిసమా ప్తమైనట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. మూడు దశాబ్దాల శివసేన ఆధిపత్యానికి ఇక తెర పడ్డట్టేనని చెబుతున్నారు. ఉద్ధవ్ ఠాక్రే అధికార యావే ఇందుకు కారణమని, ఆయన అత్యాశ కారణంగా చిట్టచివరి దుర్గమైన ముంబై కూడా శాశ్వతంగా పార్టీ చేజారిందని ఆయన వర్గీయులే వాపోతున్న పరిస్థితి. ముంబైపై పట్టును సవతి సోదరుడు రాజ్ ఠాక్రేతో ఉద్ధవ్ చేతులు కలిపినా లాభం లేకపోయింది. -
ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ
-
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
ముంబై మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే బీజేపీ కూటమి బృహాత్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఠాక్రేల చేతిలో ఉన్న ముంబై మేయర్ పీఠం తొలిసారిగా వారి చేజారనున్నట్లు ఫలితాల ట్రెండ్ స్పష్టం చేస్తోంది.ముంబై మున్సిపల్ కార్పోరేషన్కు మెుత్తం 227 స్థానాలుండగా బీజేపీ 88 స్థానాలు, శివసేన శిండే(28 స్థానాల్లో అధిక్యంలో ఉంది. శివసేన (ఠాక్రే) 74 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో మహాయుతి కూటమి స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది. మెుత్తంగా మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగగా బీజేపీ 19 చోట్ల స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది. సాయంత్రం 5 గంటలకు అందిన నివేదికల ప్రకారం మెుత్తంగా 2,869 స్థానాలలో మహాయుతి కూటమి 1600 స్థానాల్లో అధిక్యం దూసుకపోతుంది.మెుత్తంగా పార్టీల వారిగాబీజేపీ:1304శివసేన (శిండే): 363కాంగ్రెస్ : 278 శివసేన (ఠాక్రే):151ఎన్సీపీ : 127ఎంఐఎం: 77ఇతరులు: 278అయితే ఈ ఫలితాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని మరాఠా ప్రజలు ఆశీర్వదించారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మహారాష్ట్రలో వచ్చే 20-25 ఏళ్ల పాటు బీజేపీ పాలిస్తుందని తెలిపారు. మహాయుతి కూటమిపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలు ఉదాహరణ అని ఆ రాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తెలిపారు. -
20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడి పేరును ఈ నెల 20వ తేదీన అధికారికంగా ప్రకటించనుంది. ఈ మేరకు శుక్రవారం ఎన్నిక షెడ్యూల్ను పార్టీ జాతీయ రిటర్నింగ్ అధికారి, ఎంపీ కె.లక్ష్మణ్ శుక్రవారం ప్రకటించారు. ‘సంఘటన్ పర్వ్–2024’లో భాగంగా దీన్దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఈనెల 19న నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. 20వ తేదీన ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించడం లేదా అవసరమైతే ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడిగాను బాధ్యతల్లో ఉన్నారు. ఈయన స్థానంలో ఇటీవలే బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ పార్టీ కొత్త బాస్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశముందని చెబుతు న్నారు. ఈ పదవి రేసులో మరొకరు ఉండేందుకు దాదాపు అవకాశాలు లేవంటున్నారు. -
మహారాష్ట్రలో సిరాకు బదులు మార్కర్.. థాక్రే ఆరోపణలు
Maharashtra Elections Updates..ఓటు వేసిన సీఎం ఫడ్నవీస్మున్సిపల్ ఎన్నికల్లో సీఎం ఫడ్నవీస్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. ఇప్పటి వరకు 14 శాతం పోలింగ్ నమోదుప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.#WATCH | Nagpur: Maharashtra CM Devendra Fadnavis and his family show their inked fingers after casting their vote for the Maharashtra local body elections. pic.twitter.com/ExLnWCm3xR— ANI (@ANI) January 15, 2026 ఎన్నికల నిర్వహణపై రాజ్ థాక్రే ఆరోపణలు..ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే ఆరోపణలు.తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు.చెరగని సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగించడాన్ని తప్పుబట్టారు.పోలింగ్ ప్రక్రియను తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాలు అంటూ విమర్శించారు.ఇది ఆమోదయోగ్యం కాదు.ఇటువంటి మోసపూరిత ఎన్నికల వల్ల ప్రయోజనం లేదు.పౌరులు అప్రమత్తంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను Raj Thackeray on Voting Booth Issue : सॅनिटायझरने पुसलं तर मार्करची शाई जातेय : राज ठाकरे#RajThackeray #MNS #voting #abpmajha pic.twitter.com/zKkLAVwC1h— ABP माझा (@abpmajhatv) January 15, 2026ఓటు వేసిన నితిన్ గడ్కరీ, థాక్రేనాగపూర్లో ఓటు వేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే.ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్ థాక్రే. #WATCH | Maharashtra: MNS chief Raj Thackeray, along with his family, arrives at a polling station in Mumbai to cast his vote for the BMC elections. pic.twitter.com/jEPhUXUbjm— ANI (@ANI) January 15, 2026#WATCH | Union Minister Nitin Gadkari shows his inked finger after casting his vote at a polling station in Nagpur for Maharashtra local body polls. pic.twitter.com/F5IRM0qgFb— ANI (@ANI) January 15, 2026ఓటు వేసిన ప్రముఖులు.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన సచిన్ముంబైలోని పోలింగ్ బూత్లో సచిన్ ఓటు వేశారు.సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. #WATCH | Mumbai: Legendary cricketer Sachin Tendulkar shows his inked finger after casting his vote for the BMC elections.He says, "This is a very important election. It gives us a chance where we can express our opinion through votes. Everyone should come out and cast their… https://t.co/a3GAx722A7 pic.twitter.com/dweQFzV796— ANI (@ANI) January 15, 2026 ఓటు వేసిన ప్రముఖులు వీరే.. #WATCH | Pune | After casting his vote in the 2026 Maharashtra municipal elections, Maharashtra Minister Chandrakant Patil says, "I exercised my right to vote... I fulfilled my duty this morning. I appeal to everyone to come out and vote... The BJP will bring development... and… pic.twitter.com/oq9JEKB8kA— ANI (@ANI) January 15, 2026 #WATCH | Mumbai: After casting his vote for the BMC elections, Musician Vishal Dadlani says, "...Hopefully, whoever wins will hold the elections on time. This is very important for the country, for democracy. But given the state of our city in the last few days, the hope is that… pic.twitter.com/v9vGyNuJ52— ANI (@ANI) January 15, 2026 ఓటు వేసిన మోహన్ భగవత్, అక్షయ్ కుమార్మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు.నాగపూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. #WATCH | Nagpur | RSS Chief Dr Mohan Bhagwat shows his inked finger after casting his vote for Maharashtra civic body elections pic.twitter.com/W3BZInWsDg— ANI (@ANI) January 15, 2026 మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం.. దశాబ్ద కాలం తర్వాత మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు.బృహన్ ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ ప్రారంభం.ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు.రేపు(శుక్రవారం) ఎన్నికలు ఫలితాలు.#WATCH | Mumbai: After casting his vote, Actor Akshay Kumar says, "Today, the voting for BMC is taking place. As Mumbaikars, we have the remote control with us today. I would request all the people of Mumbai to come out in large numbers and cast their votes. If we have to be the… https://t.co/AOlWRmnx1V pic.twitter.com/19RmBgMFB7— ANI (@ANI) January 15, 2026పోటీలో 1700 మంది అభ్యర్థులు.. మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో 227 వార్డుల్లో ఓటింగ్ జరుగుతుంది.సుమారు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.బీఎంసీ ఎన్నికల్లో 1,03,44,315 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.వీరిలో 55 లక్షలకు పైగా పురుషులు, 48 లక్షలకు పైగా మహిళలు, ఇతర ఓటర్లు 1,099 మంది ఉన్నారు. -
ముంబైని గెలిచేదెవరు?
దాదాపు దశాబ్ద కాలం తర్వాత బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి గురువారం ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు కోట్లమంది జనాభాతో, కోటి మూడు లక్షలమంది ఓటర్లతో ఉండే ఆ మహానగరం మొగ్గు ఎటువైపుందోనన్న ఉత్కంఠ సామాన్యుల్లో మాత్రమే కాదు... రాజకీయపక్షాల్లో సైతం నెలకొనివుంది. ఇన్నాళ్లూ కరోనా మహమ్మారి, ఓబీసీ కోటాపై నడిచిన కోర్టు కేసులు ఎన్నికలకు ఆటంకంగా నిలిచాయి. దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన కార్పొరేషన్గా, దాదాపు రూ. 60,000 కోట్ల బడ్జెట్తో ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాలను ముంబై మించిపోయింది. అధికార మహాయుతి కూటమిలో ఉంటూ కీచులాడుకుంటున్న పార్టీలను ఏకం చేయటంతోపాటు, రెండు దశాబ్దాల నుంచి దూరదూరంగా ఉంటున్న దాయాదులు ఠాక్రే సోదరుల్ని సైతం కలిపిన ఘనత ఈ ఎన్నికలదే. ఇంతవరకూ తనతో కలిసి నడిచిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు దూరం జరగటంతో గత్యంతరం లేని కాంగ్రెస్ ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ)తో పొత్తు పెట్టుకుంది. 1998 నాటి లోక్సభ ఎన్నికల్లో తమ రెండు పార్టీలూ మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలు గెల్చుకున్నాయని గుర్తుచేస్తోంది. బీఎంసీ అనగానే కాంట్రాక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మహానగర పాలనాధికారం వగైరాలుంటాయి గనుక ఈ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించే పార్టీ అదుపులో పుష్కలంగా నిధులు, దండిగా రాజకీయ పలుకుబడి, అస్మదీయులకు పంచి పెట్టేందుకు రకరకాల ప్రాజెక్టులు సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రాన్నేలుతున్న బీజేపీ–షిండే శివసేన–అజిత్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహాయుతి ఇప్పటికే బీఎంసీ తమ చేతి కొచ్చినంత ఆత్మవిశ్వాసంతో ఉంది. తమ రాజ్యాధికార శక్తి, సంస్థాగత నిర్మాణం అందుకు తోడ్పడగలవని భావిస్తున్నాయి. శివసేన పేరునూ, గుర్తునూ ఏక్నాథ్ షిండే కైంకర్యం చేయగా బలహీనపడిన ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన(యూబీటీ) గత్యంతరం లేక ఇరవయ్యేళ్ల క్రితం వేరుపడిన దాయాది రాజ్ ఠాక్రేకు సన్నిహితమై ఆయన పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)తో పొత్తు పెట్టుకుంది. ఎప్పటిలా ముంబైలో యూపీ, గుజరాత్, బిహార్ల నుంచి వలసొచ్చేవారితో మరాఠీలకు అన్యాయం జరుగుతున్నదంటూ ఆ సోదర ద్వయం నిప్పులు చెరుగుతోంది. త్రిభాషా సూత్రాన్ని మహాయుతి సర్కార్ ఆ మధ్య అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం మరాఠీ ప్రజల్ని దెబ్బతీయటానికేనన్నది వారి అభియోగం. అయితే బీఎంసీ పరిధిలో మరాఠీ మాట్లాడే వారు 30 శాతం మించరు. 1960ల్లో శివసేన ఎదుగుదలకు తోడ్పడిన ప్రాంతీయత, అస్తిత్వవాదం ఇప్పుడేమాత్రం పనికొస్తాయన్నది పెద్ద ప్రశ్న. అందుకే కావొచ్చు... ఇళ్లల్లో పనిచేసే మహిళలకు నెలకు రూ. 1,500; 700 చదరపు అడుగుల వరకూ ఉండే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు వగైరా హామీలిస్తున్నారు.ముంబైకి పెట్టుబడుల వరద పారించామంటూ ఎన్నికల ప్రచారం మొదలెట్టిన బీజేపీ ప్రత్యర్థుల దూకుడు చూసి పంథా మార్చుకుంది. నగరంలో ‘బెస్ట్’ బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ, వచ్చే అయిదేళ్లూ మున్సిపల్ చార్జీల పెంపుపై మారటోరియం, నిరుపేదలకు ఇళ్లు వగైరాలు మాట్లాడుతోంది. ఆ పార్టీ వలసొచ్చినవారి ప్రయోజనాలకే పాటుబడుతున్నదన్న అనుమానాలున్నా, మరాఠీ మధ్యతరగతి వర్గానికి దగ్గరయ్యామని బీజేపీ భావిస్తోంది. ఆ సంగతలా ఉంచి ఈ ఎన్నికల్లో కూడా ఉచితాలు వినబడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రభుత్వాలతో పోలిస్తే రుణ సేకరణకు పరిమితులుండే కార్పొరేషన్లలో ఇలాంటి రాయితీలు, వాగ్దానాలు ఆచరణ సాధ్యమేనా అని చూడటం లేదు. దేశంలో అన్ని కార్పొరేషన్ల మాదిరే బీఎంసీకి... ఆమాటకొస్తే దాంతోపాటే ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలోని మరో 28 కార్పొరేషన్లకూ ఎన్నో సమస్యలున్నాయి. ఉపాధి లేమి, ప్రాథమిక సదుపాయాల లేమి, అస్తవ్యస్త రహదారులు వగైరాలు అందులో కొన్ని. అయితే భావోద్వేగాలూ... లేకుంటే తాయిలాలూ తప్ప ఏ పార్టీ దగ్గరా భవిష్యత్తుకు పనికొచ్చే పథకాలున్నట్టు కనబడదు. దేశ ఆర్థిక రాజధానిగా ఉంటున్న ముంబై ఎటు మొగ్గినా దానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని ఎన్నికల ప్రచారం తంతు చూస్తే అనిపిస్తుంది. -
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక మార్పునకు ముహూర్తం ఖరారైంది. ఇటీవలే వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్ నబీన్ సిన్హా నూతన అధ్యక్షుడి పదవి కోసం ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదకుడిగా నామినేషన్ కార్యక్రమంలో హాజరయ్యే అవకాశముంది. బీజేపీ అంతర్గత వ్యవస్థలో భాగంగా జరిగే ఈ ఎన్నిక ప్రక్రియ పార్టీ క్యాలెండర్లో హైప్రొఫైల్ ఈవెంట్గా మారనుంది.ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ నేతలు, పార్టీలో కేంద్ర సభ్యులు, ముఖ్య పదాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన మరునాడే 20వ తేదీన బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించను న్నారు. ఈ ప్రకటనతో పార్టీ నాయకత్వ నిర్మాణంపై స్పష్టత రావడమే కాకుండా, రాబోయే ఎన్నికల సవాళ్లను దృష్టిలో ఉంచుకుని జాతీయ స్థాయిలో సంస్థాగత వ్యూహానికి బలమిచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. బిహార్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నితిన్ నబీన్ను డిసెంబర్ 14న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. -
కూటమిలో కొత్త కొట్లాట ఎంపీ సీట్ల కోసం లాబీయింగ్
-
కూటమిలో ‘పెద్ద’ లాబీయింగ్!
సాక్షి, అమరావతి: త్వరలో ఖాళీ కానున్న రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాల కోసం టీడీపీ కూటమిలో భారీ లాబీయింగ్ మొదలైంది. మూడు నెలల సమయం ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏపీ నుంచి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్చంద్రబోస్ పదవీకాలం ఈ ఏడాది జూన్లో ముగియనుంది. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్బాబు పదవీ కాలం కూడా జూన్ వరకే ఉంది. ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల కోసం మూడు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ఏడాది క్రితం రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో టీడీపీ, బీజేపీ చెరొకటి పంచుకున్నాయి. జనసేనకు మొండిచెయ్యి చూపించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా మంత్రివర్గంలోకి మాత్రం తీసుకోలేదు. టీడీపీ తరఫున రాజ్యసభ సీటు మరోసారి సానా సతీష్బాబుకే కేటాయించే అవకాశం ఉందన్న సంకేతాలు అందడంతో టీడీపీ సీనియర్లు యనమల తదితరులతోపాటు పెద్దల సభకు వెళ్లే యోచనలో ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. జనసేన కోటాలో లింగమనేని త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా జనసేనకు ఒక స్థానం కేటాయించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థానాన్ని అటు సీఎం చంద్రబాబు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సన్నిహితుడైన లింగమనేని రమేష్కి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఒక అంగీకారం జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.రెండు సీట్లకు బీజేపీ పట్టు ఏపీ కోటాలో ఈసారి తమకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఒక స్థానాన్ని బీజేపీ అధిష్టానం సూచించిన వారికి, రెండో సీటు రాష్ట్ర పార్టీ నేతల్లో ఒకరికి ఇప్పించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభలో తమకు సంఖ్యా బలం కీలకం కాబట్టి ఏపీ కోటాలో ఇవ్వాల్సిందేనని బీజేపీ తేల్చి చెబుతోంది. గతంలో నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్షా జోక్యం చేసుకోవడంతో చంద్రబాబుకు మరోమాటకు తావు లేకుండా ఒక సీటు కమలనాథులకు ఇచ్చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.సానాకే మరోసారి చాన్స్..!రెండు బీజేపీకి, ఒకటి జనసేనకు ఇస్తే ఇక టీడీపీకి మిగిలేది ఒకే ఒక స్థానం. దాన్ని సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడి సానా సతీష్బాబుకి రెన్యువల్ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు చినబాబు వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడంతో ఆ సీటు ఇతరులకు దక్కే ఛాన్స్ లేదని చెబుతున్నారు. మరోవైపు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తనను రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కలిసినప్పుడల్లా అడుగుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు తరపున వ్యవహారాలు నడిపే మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు కూడా తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిత్యం టీడీపీ సేవలో తరించే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. -
అన్నామలై రాజకీయం – ముంబైలో దక్షిణాది వారికి చిక్కులు
ముంబైలో బతుకుతున్న దక్షిణాది ప్రజలకు తమిళనాడు బీజేపీ నేత చేస్తున్న వ్యాఖ్యలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ముంబై వెళ్లినఅన్నామలై ముంబై కేవలం మహారాష్ట్రకు చెందిన నగరం మాత్రమే కాదని, అది ఒక అంతర్జాతీయ నగరమని అన్నారు. అక్కడితో ఆగకుండా బీజేపీ అభ్యర్థి మేయర్గా ఎన్నికైతేనే దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.దీంతో ఈ వ్యాఖ్యలు ముంబై అస్తిత్వాన్ని, మరాఠీ ప్రజల ప్రాముఖ్యతను తగ్గించేలా ఉన్నాయంటూ శివసేన , ఎంఎన్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం అన్నామలై చేస్తున్న ఈ ప్రయత్నం చివరకు ఇక్కడ దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంటున్న దక్షిణాది వారిని రిస్క్ లోకి నెట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాజ్ థాక్రే.. అన్నామలైను రసమలై అని ఎద్దేవా చేస్తూ.. శివసేన పాత నినాదం హటావో లుంగీ, బజావో పుంగీ ని మళ్ళీ గుర్తు చేస్తూ ప్రాంతీయ సెంటిమెంట్ను రగిల్చారు.ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా సహించేది లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు ముంబై గడ్డపై కాలు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. శివసేన పత్రిక సామ్నాలో అన్నామలై ముంబైలో అడుగు పెడితే కాళ్లు తీసేస్తామని హెచ్చిరంచారు. దీనికి అన్నామలై కూడా తగ్గకుండా సమాధానమిచ్చారు. తాను ముంబై వచ్చి తీరుతానని, దమ్ముంటే తన కాళ్లు నరకాలని సవాలు విసిరారు.ముంబై అభివృద్ధిలో దక్షిణాది వారి పాత్ర కూడా ఉందని ఆయనంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చివరకు ధారవి వంటి ప్రాంతాల్లో నివసించే వేలాది మంది దక్షిణాది కూలీలు, వ్యాపారుల భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్న ఆందోళన అక్కడి దక్షిణాదివారిలో వ్యక్తమవుతోంది. -
సీబీఐ ముందుకు టీవీకే విజయ్
అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇవాళ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముందు హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయన్ని దర్యాప్తు సంస్థ ప్రశ్నించనుంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విచారణ వేళ.. ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. తమిళనాడు చరిత్రలోనే కరూర్ తొక్కిసలాట ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే(Tamilaga Vettri Kazhagam) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఇరుకు సందులో ర్యాలీ నిర్వహించడం, ఆ ర్యాలీకి విజయ్ చాలా ఆలస్యంగా రావడం, అప్పటికే అక్కడికి జనం తండోప తండాలుగా చేరుకోవడం, ఎండలో తిండి, నీళ్ల లేకపోవడంతో సొమ్మసిల్లి పడిపోవడం.. వాళ్లకు సాయంగా విజయ్ వాటర్ బాటిళ్లు విసరడం.. ఆ గందరగోళంలోనే ఆంబులెన్స్ రాకతో జనం మధ్య తొక్కిసలాట జరిగిందని పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అయితే.. ఈ ఘటనపై అధికార డీఎంకే, టీవీకే పరస్పరం నిందించుకున్నాయి. కరూర్ ఘటన వెనుక కుట్ర దాగి ఉందని స్టాలిన్ సర్కార్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తోంది టీవీకే. దీని వెనుక కుట్ర దాగి ఉందని అంటోంది. అయితే విజయ్ నిర్లక్ష్య వైఖరి వల్లే ఘటన జరిగిందని డీఎంకే కౌంటర్ ఇస్తోంది కూడా. ఈ ఆరోపణ ప్రత్యారోపణల నడుమ.. దర్యాప్తు కూడా కీలక మలుపులు తిరిగింది. కరూర్ తొక్కిసలాటకు కారణాలు తేల్చాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు సిట్ను ఏర్పాటు చేసింది. అయితే దీనిని టీవీకే సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో.. కేసు సీబీఐని చేరింది. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ను సైతం సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. విజయ్ సీబీఐ విచారణకు హాజరవుతున్న వేళ.. అటు సెన్సార్బోర్డుతో మరో వివాదం నడుస్తోంది. పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆయన చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న జన నాయగన్పై రాజకీయ దుమారం రేగింది. పొంగల్ బరిలో ఉన్న ఈ చిత్రం.. చివరి నిమిషంలో అనూహ్యంగా సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణకు గురై సినీ ప్రియులకు పెద్ద షాకే ఇచ్చింది. ఆపై ఈ పంచాయితీ న్యాయస్థానాలకు చేరి.. అక్కడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వెరసి.. సినిమా విడుదల తేదీగా సంగ్దిగ్దం నెలకొంది. అయితే ఈ అంశంపై ఇటు విజయ్గానీ, అటు టీవీకేగానీ ఎక్కడా అధికారికంగా స్పందించడం లేదు. మరో మూడు, నాలుగు నెలలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీవీకే పోటీ చేయబోతోంది. ఇప్పటికే డీఎంకేను తన రాజకీయ శత్రువు.. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా విజయ్ ప్రకటించుకున్నారు. ఎవరితోనూ పొత్తులుండబోవని.. సింహం సింగిల్గానే వస్తుందంటూ పంచ్ లైన్లు విసిరారు. అయితే.. అధికార డీఎంకేను ఓట్లను చీల్చగలిగే సత్తా అన్నాడీఎంకే కంటే విజయ్ టీవీకే పార్టీకే ఎక్కువగా ఉందని జాతీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే కరూర్ ఘటన తర్వాత పోటాపోటీగా విజయ్కు సంఘీభావం ప్రకటించాయి. ఓవైపు హద్దులు దాటకుండా విజయ్పై విమర్శలు గప్పిస్తున్నాయి రెండు పార్టీలు. అదే సమయంలో రాహుల్ గాంధీకి విజయ్తో మంచి స్నేహం ఉందని కాంగ్రెస్, అమిత్ షాతోనూ విజయ్ టచ్లో ఉన్నారంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ, టీవీకే మాత్రం పొత్తులు ఉండవ్ అని లైన్ మీదే ప్రస్తుతానికి నిలబడింది.ఈ క్రమంలో.. సెన్సార్బోర్డు, సీబీఐలను బూచిగా చూపించి విజయ్ను తమ వైపు లాక్కునే కుట్ర జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంలో బీజేపీపై కాంగ్రెస్ నేరుగానే విమర్శల గుప్పిస్తోంది. సీబీఐ, ఈడీ, ఐటీ తరహాలోనే సెన్సార్బోర్డును అడ్డుపెట్టుకుని కేంద్రం రాజకీయాలు నడుపుతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరోక్షంగా జన నాయగన్ వివాదంపై స్పందించడం కొసమెరుపు. అయితే.. బీజేపీ, తమిళనాడు మిత్రపక్షం అన్నాడీఎంకే ఆ ఆరోపణలను ఖండిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ సీనియర్ నేత ఒకరు ఈ అంశంపై ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సీబీఐ, సెన్సార్బోర్డు రెండూ ప్రొఫెషనల్ సంస్థలు. ఆయన మా పార్టీతో పొత్తుకు రాడని తెలిశాక.. మేం ఆయనపై ఎందుకు దృష్టి పెడతాం?.. అది ఆయనకు ప్రచారం కల్పించడమే అవుతుంది కదా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇంకోవైపు.. ‘‘కరూర్ ఘటనలో మేం మొదటి నుంచి నిష్పపక్షపాత దర్యాప్తు డిమాండ్ చేస్తున్నాం. మా నాయకుడు సీబీఐకి సహకరిస్తారు. నిజాన్ని ఈ దర్యాప్తు వెలికితీస్తుందని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ దర్యాప్తు సంస్థల నుంచి ఏదైనా ఒత్తిళ్లు ఎదురైనట్లు అనిపిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం’’ అని టీవీకే ముఖ్యనేత ఒకరు ఓ జాతీయ మీడియా సంస్థ వద్ద పేర్కొన్నారు. -
వికసిత భారత నిర్మాణంలో ‘జెన్–జీ’
ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదం ‘జెన్–జీ’. 1995 నుంచి 2010 మధ్యలో జన్మించిన ఈ ‘జెన్–జీ’ గురించి 2025లో ప్రపంచమంతా మాట్లాడుకుంది. నగరాలు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ప్రతి ఇంటా చర్చ జరిగింది. వీరి ఉద్యమాన్ని కొందరు సానుకూలమైన అంశంగా గమనించారు. స్వాతంత్య్రం, స్పష్టత, మార్పు తదితర అంశాలపై యువత ఆలోచిస్తున్న తీరునూ, ఏకతాటిపైకి వచ్చి పోరాడిన తీరునూ అభినందించారు. మరికొందరు... యువతలో హఠాత్తుగా పెరుగు తున్న నిరాశ, నిస్పృహలకు కారణంగా నేపాల్, మడగాస్కర్ దేశాల ఘటనలను ఉదాహరణలుగా చెబుతున్నారు.ఇలాంటి భిన్నమైన వాదనలను పక్కనపెడితే... ప్రపంచ వ్యాప్తంగా యువశక్తి ఆశలు, ఆకాంక్షలతో పాటుగా వారి సామర్థ్యం పెరుగుతోంది. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవాలన్న పట్టుదల, అంకితభావం పెరుగుతోందనేది నిర్వివాదాంశం. భారత దేశంలోనూ విపక్ష పార్టీ సభ్యులు కొందరు... ఇక్కడి ‘జెన్–జీ’ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా తమ శక్తిసామర్థ్యాలను సమాజ పురోగతి కోసం, దేశాభివృద్ధి కోసం వినియోగిస్తూ... స్పష్టమైన ఆలోచనలతో ‘వికసిత భారత నిర్మాణం’లో భాగస్వాములవుతున్నారు.భారత యువత ‘వివేకం’నేటి ప్రపంచం ‘జెన్–జీ’ గురించి మాట్లాడుతోంది. కానీ,వందేళ్ల క్రితమే స్వామి వివేకానంద యువత సామర్థ్యం, వారికి సరైన మార్గదర్శనం చేయడం ద్వారా దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం ఎలా ఉండాలనేదానిపై ఆలోచించారు. భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యువత గురించి మాట్లాడినా... వివేకానందుడి బోధనల గురించి ప్రస్తావించకుండా ఆ సమావేశం సంపూర్ణం కాదు. అంతటి గొప్ప దీర్ఘదర్శి స్వామి వివేకానంద. ఇవాళ (జనవరి 12) వారి 164వ జయంతి. ‘జెన్–జీ’ సామర్థ్యానికి మరింత పదునుపెట్టి... వికసిత భారత నిర్మాణంలో వారిని భాగ స్వాములను చేసే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన సంద ర్భమిది. వ్యక్తిత్వం, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చు కోవడం, స్వీయ అవగాహన, సంస్కృతి–సంప్రదాయాలపై గౌరవం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశ నిర్మాణంలో మనం ఏం చేయాలనే అనేక అంశాలపై వివేకానందుని బోధనల ప్రభావం ఉంటుంది.వివేకానందుడు వందేళ్ల క్రితం ఉద్బోధించిన ఆధునిక దృక్పథం, నాగరికత విలువల పునాదులు మొదలైన విషయాలన్నీ... నేటి భారత యువతలో కనిపిస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాల్లోని యువత ప్రధాన స్రవంతి (మెయిన్ స్ట్రీమ్) నుంచి దూరంగా వెళ్తున్నప్పటికీ, వీరంతా భావిభారత నిర్మాణంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. స్వచ్ఛ భారత్, మేరీ మాటీ మేరా దేశ్ (మొక్కల పెంపకం), నషా ముక్త్ భారత్ (మాదక ద్రవ్యాల విని యోగ రహిత భారతం) వంటి ఎన్నో ప్రజాచైతన్య కార్యక్రమాలకు యువతే నేతృత్వం వహించి వాటిని విజయవంతం చేస్తోంది. నవీన సాంస్కృతిక సారథులుఆధునిక సాంకేతికత వినియోగంలోనూ, స్టార్టప్ల రూపకల్పన లోనూ మన యువత సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ), ‘ఇండియా స్టాక్’ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పరిజ్ఞానాన్ని కూడా యువత స్వీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా వినూత్న మార్కెట్ పరిష్కారాలకు బాటలు వేయడం, యూనికార్న్ (రూ.వందకోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టే స్టార్టప్)ల ఏర్పాటు వంటి వాటి ద్వారా ఉద్యోగాల సృష్టికర్తలుగా వారి పాత్రను మరింత బలోపేతం చేసుకుంటున్నారు.యువత సంస్కృతికి దూరంగా వెళ్తోందనే దుష్ప్రచారం జరుగు తోంది. కానీ ఆధ్యాత్మిక మూలాలను తెలుసుకోవడంపై, మన వైభవోపేతమైన చరిత్రను అధ్యయనం చేయడంపై యువత మక్కువ చూపుతోంది. 2022 ఆగస్టు 15 నాడు... దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా... ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. పంచ్ ప్రాణ్ (5 తీర్మాణాల) గురించి వివరించారు. ప్రతి భారతీయుడూ తన లోని బానిస మనస్తత్వపు ఆలోచనలను తొలగించుకుని... మన సంస్కృతీ సంప్రదాయాలు, ఘనమైన చరిత్ర పట్ల గర్వపడాలని సూచించారు. అందుకే యువత... ఓవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే... మరోవైపు భారతీయ నాగరి కత మూలాలను, మన విలువలతో కూడిన సంప్రదాయాల సారాన్ని గ్రహించి ఆచరణలో పెట్టే దిశగా కృషి చేస్తోంది.ఇవాళ యువత ఆధ్యాత్మిక పర్యాటకం, భారతీయ తాత్వికతపై ఆసక్తిని కనబరుస్తోంది. యోగా, శాస్త్రీయ సంగీతం, ఇతర సాంస్కృతిక పద్ధతులను అలవర్చుకుంటోంది. 2025లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరిగిన ‘కుంభమేళా’లో పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఈ ఏడాది కొత్త సంవత్సరాన్ని జరుపుకొనేందుకు వేలాదిమంది ‘కాశీ విశ్వనాథ మందిరాన్ని’ ఎంచుకోవడం... యువతలో వస్తున్న పరివర్తనకు ఉదాహరణలు.రాజకీయాల్లో యువశక్తిదీని కారణంగా యువత ఆలోచనల్లోనూ సానుకూలమైన మార్పు కనబడుతోంది. దేశ రాజకీయ, సంస్థాగత అంశాలపై దీని ప్రభావం స్పష్టంగా ఉంది. రాజకీయ పార్టీలు కూడా... యువత ఆకాంక్షలకు పెద్దపీట వేస్తున్నాయి. నాయకత్వంలోనూ యువ భారతానికి ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. 2024లో దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువత... రాజకీయాల్లోకి వచ్చి దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. దీన్ని ఆచరణలో పెడుతూ, ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమం ప్రారంభమైంది. దేశ యువత ఏమనుకుంటోందో తెలుసుకునేందుకు ప్రధానమంత్రి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. వారి ఆకాంక్షలను, వారి ఆలోచనలను, వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. ప్రధానమంత్రి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ కూడా... ఇటీవలి కాలంలో యువ నాయకులకు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పజెబుతోంది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యువకుడిని నియమించింది. రాజకీయంలో పెద్దలకు ఉండే అనుభవాన్ని యువత జోరు, వారి ఆవిష్కరణల సామర్థ్యంతో సమతుల్యం చేయాలన్న ప్రధాని ఆలోచనలకు కార్యరూపం ఇది.దేశ యువశక్తి బలం, క్రమశిక్షణ, నైతికతలోనే భారతదేశ పునరుజ్జీవనం ఉంటుందని స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇవాళ అక్షరసత్యాలుగా మనముందున్నాయి. ఈ ‘జెన్–జీ’పై, యువశక్తిపై ప్రబలమైన విశ్వాసంతోనే... 2047 నాటికి వికసిత భారత నిర్మాణం జరగాలనే సంకల్పాన్ని ప్రధాని దేశం ముందుంచారు. ప్రాచీన విజ్ఞానానికి, ఆధునిక సాంకేతికతకు వారథులుగా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ‘జెన్–జీ’ పాత్ర అత్యంత కీలకం. అందుకే స్వామి వివేకానందుడు చూపిన బాటలో నడుస్తూ, భారతదేశాన్ని మళ్లీ విశ్వగురువుగా నిలబెట్టుకునేందుకు... ఆధునిక, ఆధ్యాత్మిక భారతాన్ని తర్వాతి తరాలకు అందించేందుకు ప్రధాన మంత్రి సంకల్పించిన మహాయజ్ఞంలో మనమంతా భాగస్వాము లమవుదాం!జి. కిషన్ రెడ్డి వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి(నేడు స్వామి వివేకానంద జయంతి; జాతీయ యువజన దినోత్సవం) -
కేరళలో అమిత్ షా.. ‘స్వామి కార్యం.. స్వకార్యం’
తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అటు అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు పార్టీ (బీజేపీ) కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. నేడు (ఆదివారం) పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి కేరళ చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్ల్రాలు ధరించిన అమిత్ షాకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఆరేళ్లకు ఒకసారి జరిగే ‘లక్షదీపం’ ఉత్సవానికి ఆలయం సిద్ధమవుతున్న తరుణంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14న ఆలయంలో లక్ష దీపాలను వెలిగించే మహోత్సవం జరగనుంది.ఆలయ దర్శనం అనంతరం అమిత్ షా రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా గడపనున్నారు. ఇటీవల కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ప్రతినిధులతో ఆయన సమావేశమై, వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఒక ప్రత్యేక సదస్సులో పాల్గొన్న అనంతరం, సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ శ్రేణులకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.కేరళ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా ‘మిషన్ 2026’ను ఈ పర్యటన ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2025లో ఆయన ప్రారంభించిన ‘మిషన్ 2025’ వ్యూహం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో 2026 శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక మార్పు తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో అమిత్ షా జరిపే చర్చలు అత్యంత కీలకం కానున్నాయి. కేరళలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.ఇది కూడా చదవండి: ‘మకర జ్యోతి’కి సర్వం సిద్ధం.. భక్తుల నియంత్రణ ఇలా.. -
మంత్రిని తప్పించి తంత్రిని ఇరికించే కుట్ర!
శబరిమల ఆలయ బంగారు చోరీ కేసు మళ్లీ రాజకీయ వేడిని రాజేసింది. తంత్రి(ప్రధాన అర్చకుడు) కందరారు రాజీవరు అరెస్టును బీజేపీ ఖండిస్తోంది. అంతేకాదు.. ఈ కేసులో సిట్ దర్యాప్తు తీరుపై అనుమానాలు ఉన్నాయని ఆరోపణలకు దిగింది. కేసుతో సంబంధం ఉన్న మాజీ దేవాదాయ శాఖ(దేవస్వం) మంత్రి కడకంపల్లి సురేంద్రను వదిలేసి.. తంత్రిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకున్నారని అంటోంది. తంత్రిని అరెస్టు చేశారు, కానీ మంత్రిని విడుదల చేశారు. ఎందుకో చెప్పాలి? అంటూ కేరళ బీజేపీ ప్రశ్నిస్తోంది. ప్రధాన అర్చకుడి అరెస్ట్ త్వరగతిన జరిగిందని.. ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు కే సురేంద్రన్, బీడీజేఎస్ నేత తుషార్ వెల్లప్పల్లి తదితరులు రాజీవరు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ కేసులో నిజం నిగ్గుతేలాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని డిమాండ్ చేస్తోంది. సిట్ తన రిమాండ్ రిపోర్టులో కుట్ర ఆరోపణలకు ఆధారం లేదని కే సురేంద్రన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ వ్యవహారంలో తంత్రికి ఆర్థిక లాభం ఏమీ లేదని.. అయినప్పటికీ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆలయ వ్యవహారాలతో సంబంధం ఉన్న దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, సభ్యుడు కేపీ శంకర్దాస్, మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇది కేవలం మంత్రిని రక్షించే కుట్రేనని ఆరోపించారు. తంత్రి అరెస్టునకు నిరసనగా.. జనవరి 14న మకరవిళక్కు సందర్భంగా ఇళ్లలో ‘‘అయ్యప్ప జ్యోతి’’ వెలిగించి నిరసనలు తెలియజేస్తామన్నారు. శబరిమలలో (Sabarimala) గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని దాత అయిన బెంగళూరుకు చెందిన వ్యాపారి ఉన్ని కృష్ణన్ తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.100 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైందని సదరు కంపెనీ తెలిపింది. ఉన్నట్టుండి తాపడాల బరువు దాదాపు 4.524 కేజీలు తగ్గడంతో ఈ విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా ఉన్ని కృష్ణన్ సహా పలువురు ప్రధాన అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేపట్టింది. అయితే తదనంతర పరిణామాలతో హైకోర్టు సైతం ఈ దర్యాప్తున పర్యవేక్షిస్తోంది.చోరీ జరిగిన సమయంలో మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ దేవస్వం మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో నిందితుల వాంగ్మూలంతో డిసెంబర్ చివర్లో ఆయన్ని సిట్ విచారణ జరిపింది. అయితే.. ఆయన పాత్ర లేదని నిర్ధారణ రావడంతో ప్రశ్నించి వదిలేసింది.సిట్ ప్రకారం నిందితుల వాంగ్మూలంలో ఇలా ఉంది.. ప్రధాన అర్చకుడు రాజీవరుకు బంగారు పూత పనులు జరిగిన విషయం తెలుసు. ఇది ఆచార నియమాలకు విరుద్ధం. ఇది కూడా ఆయనకు తెలుసు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పొట్టిని శబరిమలకు తీసుకొచ్చింది కూడా రాజీవరేన. తాపడాల చోరీ కేసులో రాజీవరు పాత్ర కూడా ఉంది. శబరిమల గోల్డ్ చోరీ కేసులో రాజీవరుతో కలిపి 11 మందిని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆయన్ని అదుపులోకి తీసుకోగా.. ఇవాళ ఆయన నివాసాల్లో సిట్ సోదాలు జరిపింది. అయితే జైలులో అస్వస్థతతో బాధపడటంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. ప్రస్తుత సీజన్లో శబరిమల ఆలయానికి రాజీవరు ప్రధాన పూజారి కాదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు కె. జయకుమార్ నాయర్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. -
అమిత్ షా కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం దుమారం కొనసాగుతుంది. న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, డెరెక్ ఓ’బ్రయన్ సహా పలువురు నేతలు నిరసనకు దిగారు. ఈ నిరసనలో పోలీసులు వారిని బలవంతంగా లాగి అరెస్టు చేశారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అధికార టీఎంసీకి ఐపాక్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తోంది. ఈనేపథ్యంలో ఈడీ అధికారులు ఐపాక్ కార్యాలయంపై దాడులు జరిపారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.అయితే,ఈడీ దాడుల్ని టీఎంసీ ఎంపీలు ఖండిస్తున్నారు. ఎన్నికల ముందు ఈడీ దాడులు ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే ప్రయత్నం. తమ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని కేంద్రం చూస్తోంది’అని ఆరోపణలు గుప్పిస్తున్నారు.అందుకు బీజేపీ సైతం టీఎంసీ దాడుల్ని తిప్పికొడుతోంది. ఈడీ దాడులు చట్టుపరమైనవని, ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులు చట్టపరమైనవని, అవినీతి కేసులపై విచారణలో భాగమని స్పష్టం చేసింది. VIDEO | Delhi: TMC MPs protest outside Union Home Minister Amit Shah’s office with placards reading “Bengal rejects Modi-Shah’s dirty politics,” following the ED raids at I-PAC’s office in Kolkata yesterday.#TMC #AmitShah #Kolkata(Source - Third party)(Full VIDEO available… pic.twitter.com/7VyF2e7dfL— Press Trust of India (@PTI_News) January 9, 2026 -
కాంగ్రెస్, మజ్లిస్తో బీజేపీ దోస్తీ!
ముంబై: ఇదొక విచిత్రమైన పొత్తు. ఎవరూ ఊహించని పొత్తు. రాజకీయంగా బద్ధశత్రువులైన బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం)తో కూడా బీజేపీ జతకట్టింది. మహారాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈ విచిత్రం చోటుచేసుకుంది. మొత్తానికి ఈ వ్యవహారం సంచలనాత్మకంగా మారింది. అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా స్థానిక నాయకులే పొత్తులు కుదుర్చుకోవడం గమనార్హం. దీనిపై ఆయా పార్టీల అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు.మున్సిపల్ కౌన్నిళ్లకు డిసెంబర్ 20న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీ, కాంగ్రెస్ అకోట్ మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీ, ఎంఐఎం చేతులు కలిపాయి. మున్సిపాల్టీల్లో పాగా వేయడానికి భిన్నధ్రువాలు ఒక్కటయ్యాయి. అంబర్నాథ్ కౌన్సిల్ కుర్చీ కోసం ‘అంబర్నాథ్ వికాస్ అఘాడీ’ పేరిట బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ(అజిత్ పవార్) పొత్తు కుదుర్చుకున్నాయి. శివసేన(íÙండే)ను పక్కనపెట్టాయి. మొత్తం 60 సీట్లకు గాను శివసేన(షిండే) 27 సీట్లు గెల్చుకొని ఏకైక అతిపెద్ద పారీ్టగా అవతరించింది. బీజేపీ 14, కాంగ్రెస్ 12, ఎన్సీపీ(అజిత్ పవార్) 4, స్వతంత్రులు 2 సీట్లు గెల్చుకున్నారు. ఒక స్వతంత్ర కౌన్సిలర్ అఘాడీకి మద్దతు ప్రకటించడంతో కూటమి బలం 31కి చేరింది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే బలం చేకూరింది. మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్గా బీజేపీ సభ్యుడు తేజశ్రీ కరాంజులే పాటిల్ ఎన్నికయ్యారు. బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తమ పార్టీ కౌన్సిలర్లు బీజేపీకి మద్దతు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నాయకత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. నూతనంగా ఎన్నికైన 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు బ్లాక్ అధ్యక్షుడు ప్రదీప్ పాటిల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎలాంటి పొత్తు లేదని, రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా స్థానిక నేతలు నిర్ణయం తీసుకున్నారని, దీనికి తమ పార్టీ అధిష్టానం అనుమతి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ బుధవారం చెప్పారు. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు: ఒవైసీ అకోట్ మున్సిపల్ కౌన్సిల్లో ‘అకోట్ వికాస్ మంచ్’ పేరిట బీజేపీ, ఎంఐఎం, శివసేన(ఉద్ధవ్), శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్), ఎన్సీపీ(శరద్ పవార్), ప్రహర్ శక్తి పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. 35 సీట్లకుగాను రెండు స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. పొత్తుతో కూటమి బలం 25కు చేరింది. బీజేపీ కౌన్సిలర్ మాయ ధూలే మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. మజ్లిస్కు చెందిన నలుగురు సభ్యులు ఆ పార్టీని వదిలేసి తమ పారీ్టకి మద్దతు ఇచి్చనట్లు బీజేపీ ఎంపీ అనూప్ ధాత్రే తెలిపారు. ఈ పరిణామంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. బీజేపీతో ఎప్పటికీ పొత్తు ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి: ఫడ్నవీస్ అనైతిక పొత్తులను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇతర పారీ్టలతో చేయి కలిపిన బీజేపీ స్థానిక నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణకు, విధానాలకు కట్టుబడి ఉండాలన్నారు. మరోవైపు శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు బహిర్గతమయ్యాయని విమర్శించారు. -
కర్ణాటక పోలీసులపై బీజేపీ మహిళ సంచలన ఆరోపణలు
బెంగళూరు : ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో కర్ణాటకలోని బీజేపీ మహిళపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. తన ప్రాంతంలో ఓటర్ల జాబితా నిర్వహించడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు తన పట్ల దారుణంగా ప్రవర్తించారని వివస్త్రను చేశారని మహిళా కార్యకర్త ఆరోపించారు. సోమవారం తనను అరెస్టు చేసిన పోలీసు సిబ్బంది తనను కొట్టి, బలవంతంగా బట్టలు విప్పించారని ఆమె ఆరోపించారు. అయితే దీనిపై పోలీసల వాదన మరో ఉంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ వివాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే...బీజేపీ కార్యకర్త సుజాత హండి, చాలుక్య నగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఎస్ఐఆర్ సర్వే సందర్బంగా తలెత్తిన ఘర్షణ కారణంగా ఆమెను అరెస్టు చేస్తున్నప్పుడు, మగ పోలీసులు తనపైదాడిచేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ, అభ్యంతర కరంగా ప్రవర్తించారని బాధితురాలి ఆరోపణ. ఈ సంఘటనకు సంబంధించి రెండు వీడియోలు వైరల్ అయ్యాయి.వాటిలో ఒకదానిలో హండిని పోలీసు వ్యాన్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలకు సంబంధించింది.🚨BJP woman worker alleges assault and stripping during SIR protest in Karnataka, police DENY CLAIMS. The woman activist is identified as Sujata Handi Cops claim 'she stripped' pic.twitter.com/dL15PuB5hQ— The Tatva (@thetatvaindia) January 7, 2026 మరోవైపు సుజాత ఆరోపణలు పోలీసులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఆమెతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం అన్నారు. అయితే, సుజాత అరెస్టును ప్రతిఘటించి, అధికారులతో దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమే చింపేసుకుందిఅధికారులు నిర్వహిస్తున్న సర్వే సమయంలో స్థానికుల మధ్య విభేదాలు తలెత్తి, అది ఘర్షణకు దారితీసింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు, వాగ్వాదాలు జరిగాయి, భౌతిక దాడులకుదిగారని పోలీసులుత ఎలిపారు.దీనిపై స్థానికుడు ప్రశాంత్ బొమ్మాజీ ఫిర్యాదు ఆధారంగా ఆమెను అరెస్టు జరిగినట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, సోమవారం ఎనిమిది నుండి పది మంది మహిళా అధికారులతో కలిసి హండిని అరెస్టు చేయడానికి వెళ్లారని, ఈ క్రమంలో నిందితురాలు పోలీసు వ్యాన్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆమే తన బట్టలు తీసేసిందని శశికుమార్ చెప్పారు. అక్కడున్న మహిళా అధికారులు ఆమెకు మరో జత బట్టలు అందించడానికి స్థానికుల సహాయం కోరారని, ఆమెను బట్టలు వేసుకోమని పదేపదే కోరామని చెప్పారు. అలాగే నిందితురాలు సుజాతపై గత ఐదేళ్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయన్నారు. ఐదు గత ఐదేళ్లవి కాగా, నాలుగు ఈ సంవత్సరానికి చెందినవి. ఈ నాలుగింటిలో మూడు ప్రజలు దాఖలు చేసినవి, ఒకటి పోలీసు దాఖలు చేసినట్టు వివరించారు.#WATCH | Hubballi, Karnataka: BJP worker allegedly assaulted in Hubballi, sister of victim, Vijaylakshmi says, "... We were sitting outside our house when around 30 policemen arrived. They took Sujata and all of us inside. Sujata was brutally assaulted, and her clothes were torn.… pic.twitter.com/UQooQPrs7j— ANI (@ANI) January 7, 2026సుజాత అరెస్ట్పై కమిషనర్ స్పందిస్తూ, అరెస్టు సమయంలో, ఆమె తన అనుచరులతో కలిసి పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించి ఘర్షణకు దిగిందనీ, సబ్-ఇన్స్పెక్టర్, ముగ్గురు నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారనీ, విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆయన చెప్పారు.బాధితురాలి సోదరి"మా ఇంటి బయట కూర్చుని ఉండగా, సుమారు 30 మంది పోలీసులు వచ్చి సుజాతతో పాటు అందర్నీ లోపలికి తీసుకెళ్లారు. సుజాతపై దారుణంగా దాడి చేశారు, ఆమె బట్టలు చింపేశారు. మహిళా, పురుష పోలీసు అధికారుతొద్దరూ ఉన్నారు, మమ్మల్ని వదిలేయమని వేడుకున్నాం అయినా పోలీసులు సుజాతను ఈడ్చుకెళ్లారు." అని బాధితురాలి సోదరి విజయలక్ష్మి తెలిపింది. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా లోకానికే తీరని అవమానమని, సంబంధిత లీసులను వెంటనే సస్పెండ్ చేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి : 16 అంతస్తుల బిల్డింగ్పైనుంచి పడి టెకీ దుర్మరణం -
కాంగ్రెస్, ఏంఐఏంతో.. బీజేపీ పొత్తు..!
ముంబై: మహరాష్ట్రలో ఇటీవల మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానం కోసం బద్ధ శత్రువులైన కాంగ్రెస్-బీజేపీ పార్టీలు జతకట్టాయి. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అయితే తాజాగా ఆ పొత్తుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇటువంటి పొత్తులను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు.మహారాష్ట్రలోని కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అంబర్పేట్ మున్సిపల్ కౌన్సిల్కు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు దీనిలో షిండే నేతృత్వంలోనే శివసేనకు 27 స్థానాలు రాగా, బీజేపీ14, కాంగ్రెస్ 12, ఎన్సీపీకి నాలుగు స్థానాలు వచ్చాయి. దీంతో మున్సిపల్ పీఠం కోసం బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీలు జతకట్టాయి. దీంతో ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్, బీజేపీలు జతకట్టడం దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాయి. అంతేకాకుండా అకోలా జిల్లాలోని అకోట్ మున్సిపల్ స్థానం కోసం సైతం బీజేపీ పార్టీ తన బద్దశత్రువైన ఏంఐఏంతో పొత్తుపెట్టుకుంది. ఈ నేపథ్యంలో అనైతిక కలయికపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ "కాంగ్రెస్, ఎంఐఏం పార్టీలతో పొత్తును ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఎవరైనా గ్రామ స్థాయి నాయకులు ఇలా పొత్తు పెట్టుకుంటే వారిపై చర్యలు తీసుకోబడతాయి" అన్నారు. ఇటువంటి పొత్తులను పార్టీ అధిష్ఠానం ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని హెచ్చరించారు. పొత్తుల వ్యవహారంపై ఇదివరకే నాయకులకు ఆదేశాలు జారీ చేశాం అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ స్పందించారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ పొత్తు కాదని శివసేన( శిండే) అవినీతిని పారద్రోలడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు. దీనిని బీజేపీ, కాంగ్రెస్ పొత్తుగా పోల్చడం సరికాదన్నారు. -
చంద్రబాబు పై బీజేపీ, జనసేన సీరియస్... ప్రజల ప్రాణాలతో ఆటలు వద్దు....
-
రైలు థర్డ్ ఏసీ కోచ్ బెడీషీట్ తీసుకెళ్లిన బీజేపీ నేత
-
ఎనిమిదో వింత: కమలంతో కాంగ్రెస్ దోస్తీ!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో ఏ ఒక్కరూ నమ్మని విధంగా భారతీయ జనతా పార్టీ(జేబీజేపీ)- కాంగ్రెస్ జతకట్టాయి. అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ పీఠాన్ని దక్కించుకునేందుకు బద్దశత్రువులైన ఈ ఇరు పార్టీలు ఒక గూటికి చేరాయి. ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు గట్టి షాక్ ఇస్తూ, బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు ఇలా చేతులు కలపడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అంబర్నాథ్ ప్రాంతంలో శివసేనను అధికారానికి దూరం చేసేందుకు ‘అంబర్నాథ్ వికాస్ అఘాడీ’ పేరుతో కొత్త కూటమి ఏర్పడింది. గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ (31)కు నాలుగు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రత్యర్థి పార్టీలు ఏకమై శివసేన ఆధిపత్యానికి గండికొట్టాయి. 60 స్థానాలున్న అంబర్నాథ్ కౌన్సిల్లో బీజేపీ 14, కాంగ్రెస్ 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 4 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ మూడు పార్టీలు ఒకటికావడానికి తోడు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కూటమి బలం 32కు చేరింది.మంగళవారం జరిగిన మున్సిపల్ అధ్యక్ష ఎన్నికల్లో ‘కూటమి’ సమీకరణ అద్భుతంగా పనిచేసింది. శివసేన అభ్యర్థి మనీషా వాలేకర్పై బీజేపీకి చెందిన తేజశ్రీ కరంజులే పాటిల్ విజయం సాధించి, అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. బీజేపీ కార్పొరేటర్ అభిజీత్ కరంజులే పాటిల్ ఈ వికాస్ అఘాడీకి నాయకునిగా వ్యవహరించారు. కాగా ఈ విచిత్ర పొత్తుపై వస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలి భర్త, బీజేపీ నేత అభిజీత్ పాటిల్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అంబర్నాథ్లో వేళ్లూనుకున్న అవినీతి రాజకీయాల నుంచి ఇక్కడి ప్రజలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. బీజేపీ-కాంగ్రెస్ కలయికపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. దీనిని అనైతిక, అవకాశవాద రాజకీయానికి పరాకాష్టగా అభివర్ణించింది. అంబర్నాథ్ శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని నినదించిన బీజేపీ, అధికారం కోసం ఇలాంటి పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ తానుగా కాంగ్రెస్తో చేతులు కలిపిందని ఆయన ఆరోపించారు.ఇది కూడా చదవండి: సత్యసాయి బాటలో వెనెజువెలా నేతలు.. కారణం ఇదే.. -
కానివారికి కంచాల్లో వడ్డిస్తారా!
గుర్తుండే ఉంటుంది, 2022లో నిస్సాగు నిరసన చేపట్టారు కొందరు పెద్ద రైతులు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడం వల్ల పూర్వంలా కూలీలు తక్కువ దినవేతనాలకు దొరకడం లేదన్నది వారి అసంతృప్తికి కారణం. అందువల్ల తమ సాగు వ్యయ భారం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆసారి సాగు విరామాన్ని పాటించారు. ఉపాధి పథకం కార్మికుల చేత రైతుల వ్యక్తిగత వ్యవసాయ పనులు చేయించాలన్న డిమాండ్కు మద్దతుగానూ ఇది జరిగింది. ఈ పథకం వల్ల కూలీలు ప్రియ మైపోయారన్నదే నిజమైతే, రైతులు వారిని భరించలేకపోతున్నా రన్నదే వాస్తవమైతే ఆ మేరకు పంటల మద్దతు ధరను పెంచి ఆదు కోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి దానిని సాధించుకోవచ్చు. రైతుల సమస్య అదొక్కటే కాదు. ఉపాధి పథకం భూమిలేని నిరుపేద వ్యవసాయ కార్మికుల్లో కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంచినమాట నిజమే. వాస్తవానికి అదిఅంత గొప్ప పథకమేమీ కాదు. పేద కార్మికులకు తమ కాళ్ళ మీద తాము బతగ్గలిగే పూర్తి స్థాయి బలాన్ని అది కల్పించలేదు. వారి చేతిలోని ఊతకర్రకు కొంచెం అదనపు ఊతాన్ని మాత్రమే ఇచ్చింది. దానికే వారు తమను దాటిపోతున్నారని దేశమంతటా గల పెద్ద రైతులు భావించడం విడ్డూరం. దీని మూలాల్లో ఫ్యూడల్ శక్తుల అసహనం ఇమిడి ఉన్నదనే అభిప్రాయాన్ని తోసిపుచ్చలేము. ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు గాంధీ పేరు తీసేసి, ‘వీబీ జీ రామ్ జీ’ చట్టాన్ని తెచ్చింది. పేద వర్గాల పొట్ట కొట్టి...గత పథకంలో మాదిరిగా ఈ కొత్తది డిమాండ్ ఆధారంగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించబోవడం లేదు. పనిని హక్కుగా గుర్తించి దానిని కల్పించడం తన బాధ్యతగా ఎన్డీయే ప్రభుత్వం భావించడం లేదు. కేంద్రం తాను అనుకున్న చోట మాత్రమే ఈ పథకం కింద పనులు మంజూరు చేస్తుంది. డిమాండ్ ఆధారిత పని కల్పనకు తెర దించబోతున్నారు. పథకం మొత్తం ఖర్చులో పూర్వం మాదిరిగా 90 శాతానికి బదులు 60 శాతం నిధులనే కేంద్రం భరిస్తుంది. అందువల్ల రాష్ట్రాల వాటా 10 నుంచి 40 శాతానికి చేరుకుని భారీగా పెరిగిపోనున్నది. అన్నింటికీ మించి సాగు సీజన్లో 60 రోజులపాటు ఉపాధి పనులను నిలిపివేయడం కొత్త పథకంలోని ప్రధానమైన ప్రజావ్యతిరేక లక్షణం. మహాత్మా గాంధీ ‘నరేగా’ కార్మి కులకు ప్రసాదించిన ఉపాధి భరోసా ఈ విధంగా డొల్ల అయి పోతుందన్న మాట! దీనితో ముమ్మర సీజన్లో అధిక కూలీని సాధించుకునే హక్కును కార్మికులు కోల్పోనున్నారు. పేదలు, అణగారిన వర్గాలు పెత్తందారుల కింద బతకాలనే వ్యవస్థను పునరుద్ధరించాలని బీజేపీ కోరుకుంటున్నది. హిందూ సమాజ రక్షణే తమ విధి అని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవలే అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం దానిని చేసి చూపిస్తున్నది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భూస్థాపితం చేయా లని ప్రధాని మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న ఆ పథకాన్ని వదిలించుకోడం అంత తేలిక కాదని కూడా ఆయన గ్రహించారు. అందుకే అవసరమైన నిధులు విడుదల చేయకుండా దానికి నెమ్మది నెమ్మదిగా విషం ఇచ్చి చంపుతూ వచ్చారు. ఇప్పుడు పూర్తిగా తెర దించారు. కోవిడ్ కాలంలో నగరాలు, పట్టణాల నుంచి కాళ్లీడ్చుకుంటూ స్వస్థలాలకు చేరిన అసంఖ్యాక గ్రామీణ యువతకు పనులు కల్పించి ఆదుకున్న ‘నరేగా’ను అంతమొందిస్తున్నందుకు ఇప్పుడి ప్పుడే పల్లెల్లో నిరసన రూపుదిద్దుకుంటున్నది. మైనారిటీలను దూరం పెట్టి...స్వతంత్ర భారత రాజ్యాంగంలో బీజేపీకి బొత్తిగా గిట్టని పదాలు సోషలిస్టు, సెక్యులర్. ఈ రెండింటినీ 1976లో అప్పటికాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ‘ప్రవేశిక’లో చేర్చింది. వాటిని సుప్రీంకోర్టు ధ్రువపరిచింది. భావజాలపరంగా, సంకేతాత్మకంగా సోషలిస్టు పదానికి మహాత్మా గాంధీ ‘నరేగా’ ప్రాతినిధ్యం వహి స్తున్నది. దానిని కూల్చివేయడం ద్వారా సోషలిస్టు తరహా వ్యవస్థ మూలాలను బీజేపీ ఛేదించగలిగింది. సెక్యులర్ లక్షణానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న సర్వమత సమభావాన్ని నిర్మూలించాలని ఎదురు చూసిన ఆ పార్టీ అందుకోసం ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను (సర్) ఎంచుకున్నది. సరిహద్దు రాష్ట్రాల్లోకి పొరుగు దేశాల ముస్లింల వలస పరాకాష్ఠకు చేరుకున్నదనే నెపం ఇందు కోసమే దూసుకొచ్చింది. మొత్తం మీద మైనారిటీ ఓటర్లను భారీ ఎత్తున తొలగించడం ద్వారా దేశ లౌకిక లక్షణాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ సమకట్టిందనే అభిప్రాయం ధ్రువపడింది. ‘సర్’ మరో ఎన్ఆర్సి (జాతీయ పౌరసత్వ రిజిస్టర్) అనే విమర్శ బయలుదేరింది. దీని ద్వారా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన మైనారిటీలను విదేశీయులుగా ముద్రవేసి అస్సాంలో మాదిరిగా వెనక్కు పంపిస్తారనే భయాలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీ ఓటర్ల సంఖ్యను తగ్గించడం ద్వారా బీజేపీ తన గెలుపు అవకాశాలను గ్యారంటీ చేసుకుంటున్నది. బహుళత్వ రాజ్యాంగాన్ని హిందూత్వ పాలనాపత్రంగా మార్చివేసే తెగువకు పాల్పడు తున్నది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఉద్దేశించిన త్రిసభ్య కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించినప్పుడే ఎన్నికల యంత్రాంగాన్ని దుర్వినియోగానికి దారి ఏర్పడింది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ, ప్రాణప్రదం అయిన నిష్పాక్షిక ఎన్ని కల వ్యవస్థకు తూట్లుపొడవటం అందువల్లనే సాధ్యమవుతున్నది. దాని విష శిశువే ‘సర్’!జి. శ్రీరామ్మూర్తివ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మూడోసారి దొరికాడు... సుధీర్ రెడ్డి పనైపోయింది ఈసారి పడే శిక్ష..
-
ఏపీ అంటే అడ్డా ఫర్ పెడ్లర్స్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్ నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
అస్సాంలో హ్యాట్రిక్ విజయం దిశగా బీజేపీ
ఈ ఏడాది జరగబోయే అస్సాం శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించే దిశగా దూసుకెళ్తోందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన తాజా ట్రాకర్ పోల్ వెల్లడిరచింది. 2025 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, మొత్తం 126 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 69-74 సీట్లు గెలుచుకొని మెజారిటీ సాధించే అవకాశముంది. ఎన్డీఏ భాగస్వాములతో కలిపితే మొత్తం సీట్లు 90 మార్క్ను తాకే అవకాశం ఉందని తేలింది. ప్రతిపక్షంలో ఐక్యత లేని పరిస్థితుల్లో బీజేపీకి ఇది కలిసి వస్తోందని సర్వేలో వెల్లడయ్యింది.వ్యూహాత్మక పొత్తులు, సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల మద్దతుతో అస్సాంలో బీజేపీ పట్టు కొనసాగుతోంది. ఈ సర్వే పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్, పొలిటికల్ ఎనలిస్ట్ డా. రాజన్ పాండే నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ‘‘ఈ ట్రాకర్ పోల్ ప్రస్తుత సమయంలో అస్సాం ఓటర్ల మనోభావాలను ప్రతిబింబిస్తోంది. అధికార ప్రయోజనాలకే పరిమితం కాకుండా విభిన్న వర్గాలతో బీజేపీకి బలమైన అనుసంధానం ఏర్పడినట్లు ఈ సర్వే స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఏఐయుడీఎఫ్, యూపీపీఎల్ వంటి పార్టీలు మనుగడకే పోరాడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ విజయం నల్లేరు మీద నడకలా కనిపిస్తోంది’’.బీజేపీకి స్పష్టమైన ఆధిక్యంపీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ అంచనా ప్రకారం బీజేపీ 69-74 సీట్లతో అగ్రస్థానంలో నిలవనుంది. కాంగ్రెస్కు 25-29 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ)కు 8-11 సీట్లు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)కు 8-10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. చిన్న పార్టీలు చాలా వెనుకంజలో ఉన్నాయి. ఏఐయుడీఎఫ్ 0-2, యూపీపీఎల్ 0-2, రైజర్ దళ్ 1-2, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) 0-1, సీపీఐ(ఎం) 0-1, స్వతంత్రులు/ఇతరులు 0-1 గెలిచే అవకాశం ఉంది.మ్యాజిక్ ఫిగర్ 64 సీట్ల మెజారిటీకి ఎన్డీఏ చాలా ఆధిక్యంలో నిలుస్తోంది. బీజేపీ మూడోసారి ఏకపక్షంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ గతంలో సాధించిన మూడు వరుస విజయాల సరసన నిలుస్తుంది. బీజేపీ తన కోర్ ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటూనే కొత్త వర్గాల్లోకి విస్తరించగలగడమే దీనికి కారణమని ఈ ట్రాకర్ పోల్ సర్వేలో తేలింది.ఓట్ షేర్ విషయానికి వస్తే బీజేపీకి 39%, కాంగ్రెస్కు 37% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల శాతంలో తేడా తక్కువే ఉన్నప్పటికీ... అస్సాంలోని ఉత్కంఠ ఎన్నికల వాతావరణంలో ఇది సీట్ల పరంగా గణనీయమైన తేడాకు కారణం కావొచ్చు. ఇతర పార్టీల ఓట్ షేర్లు చూస్తే... ఏజీపీ 7%, బీపీఎఫ్ 5.5%, యూపీపీఎల్ 1.2%, ఏఐయుడీఎఫ్ 2.5%, రైజర్ దళ్ 0.9%, ఏజేపీ 0.7%, సీపీఐ(ఎం) 0.8%, ఇతరులు 5% ఓట్లు పొందే అవకాశం ఉంది. ఏఐయుడీఎఫ్ నుంచి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లడంతో కాంగ్రెస్ ఓట్ షేర్ పెరిగిందని, అయితే డీలిమిటేషన్, ఎన్డీఏ సామాజిక కూటములు, బలహీన ప్రతిపక్ష భాగస్వాములు కారణంగా తన ఓటు బ్యాంకును సీట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ వెనుకబడుతోందని ఈ సర్వేలో వెల్లడయ్యింది.కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?తదుపరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని అడిగినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు 30% మద్దతుతో స్వల్ప ముందంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్కు 28%, కాంగ్రెస్ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్కు 27% ఓటర్లు మద్దతిచ్చారు. దేబబ్రత సైకియా 3%, హగ్రామా మోహిలారి 1%, అతుల్ బోరా 1%, దిలీప్ సైకియా 1%, బద్రుద్దీన్ అజ్మల్ 1%, అఖిల్ గోగోయ్ 1% తో వెనకంజలో ఉన్నారు. 7% మంది ఓటర్లు తాము ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. గౌరవ్ గోగోయ్ వ్యక్తిగత ప్రజాదరణ, సీఎం రేసులో ముందంజలో ఉన్నప్పటికీ, అది కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మారలేదు. హిమంత బిశ్వ శర్మ స్వల్ప ఆధిక్యానికి మహిళా ఓటర్ల బలమైన మద్దతు తోడైంది. గిరిజనులు, పురుషులు ఎక్కువమంది సోనోవాల్ వైపు మొగ్గు చూపించారు.బీజేపీకే మద్దతుఅస్సాం రాష్ట్ర అభివ ృద్ధికి ఏ పార్టీ మంచిదన్న ప్రశ్నకు 48% బీజేపీకి, 38% కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అన్న ప్రశ్నకు 55% బీజేపీ గెలుస్తుందని భావించగా, కాంగ్రెస్కు 40% మంది మద్దతు తెలిపారు. మరోసారి అవకాశం ఇవ్వాలన్న ప్రశ్నకు 55% బీజేపీకి అనుకూలంగా, 45% వ్యతిరేకంగా స్పందించారు.అభివృద్ధి, సంక్షేమం, వివిధ వర్గాల మద్దతు, సీఎం ఎంపిక, పార్టీ ప్రదర్శన, వయస్సు, లింగ పరమైన అంశాల్లో బీజేపీ సమగ్ర ఆధిక్యం కనిపించింది. 2021 నుంచి జరిగిన మండలాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, వివిధ ఉపఎన్నికలతో పాటు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తూ రావడం ఆ పార్టీని మరింత బలోపేతం చేశాయి. గిరిజనులు, ఓబీసీల్లో కూడా మద్దతు సంపాదించి, ఎన్డీఏ తన పరిధిని మరింత విస్తరించింది.కాంగ్రెస్కు లభించిన స్వల్ప మద్దతు కూడా ప్రధానంగా బరాక్ వ్యాలీ, లోయర్ అస్సాంలో ఏఐయుడీఎఫ్ నుంచి ముస్లిం ఓటర్లు మారడం వల్లనే అని సర్వేలో తేలింది. వ్యాపార ప్రయోజనాలు, వివాదాస్పద కూటములపై అభిప్రాయాలతో ఏఐయుడీఎఫ్ రాజకీయంగా ఒంటరిగా మారింది. ఏజీపీ బీజేపీపై ఆధారపడుతోంది. కూటమి లేకుండా దాని పునాదులు క్షీణిస్తున్నాయి. యూపీపీఎల్ ఇటీవల బీటీఏడీ ఎన్నికల్లో బలహీన ప్రదర్శనతో మనుగడ సమస్యను ఎదుర్కొంటోంది. బోడో ఓటర్లు తిరిగి బీపీఎఫ్ వైపు మళ్లారు. బీజేపీ-బీపీఎఫ్ పునఃసమ్మేళనం బీటీఏడీ ప్రాంతాల్లో క్లీన్ స్వీప్కు దారులు వేస్తున్నాయి. రైజర్ దళ్, ఏజేపీ వంటి చిన్న పార్టీలు పరిమిత ప్రభావంతోనే ఉన్నాయి.ఏ కులం ఎటువైపు?కులాల పరంగా చూస్తే... అస్సామీలు ప్రధానంగా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలకు మద్దతిస్తున్నారు. అహోములు సివసాగర్, జోర్హాట్ వంటి కొద్ది ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఇతర ఓబీసీలు కూడా బీజేపీకే అనుకూలంగా ఉన్నారు. సీఏఏ తర్వాత హిందూ బెంగాలీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ముస్లింలు అధికంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తూ ఏఐయుడీఎఫ్ను తిరస్కరిస్తున్నారు. గిరిజనుల్లో ఎన్డీఏ పట్ల ఆకర్షణ రోజురోజుకు పెరుగుతుండగా... బోడోలు బీపీఎఫ్-బీజేపీకి, మిసింగ్స్, కార్బీలు, డిమాసాలు తదితరులు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. సంక్షేమ పథకాల వల్ల కొంతవరకు టీ తోటల సమూహాలు బీజేపీతోనే ఉన్నప్పటికీ, వారిలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది.ప్రాంతాల వారీ విశ్లేషణబరాక్ వ్యాలీ (13 సీట్లు): డీలిమిటేషన్ తర్వాత ముస్లిం ప్రభావం తగ్గడంతో ఎన్డీఏకు 8-10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అప్పర్ అస్సాం: ఎన్డీఏ ఆధిక్యంగా ఉండగా, ప్రతిపక్షానికి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. మిడిల్ అస్సాం: గిరిజన ప్రాంతాల్లో ఎన్డీఏ బలంగా ఉందిబీ కొన్ని జిల్లాల్లో ఇరు కూటములు పోటాపోటీగా తలపడుతున్నాయి. లోయర్ అస్సాం: డీలిమిటేషన్ ఎన్డీఏకు అనుకూలంగా మారడంతో బీజేపీ-బీపీఎఫ్ బీటీఏడీ కలిసి స్వీప్ చేసే అవకాశం ఉంది.డీలిమిటేషన్ ` ప్రతిపక్ష సమస్యలు2023 డీలిమిటేషన్ బీజేపీకి అనుకూలంగా మారింది. ఈ చర్యతో ముస్లిం ఓట్లను చీల్చడం సులభమైంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు, అభ్యర్థుల కొరతతో ఇబ్బంది పడుతోంది. ఏఐయుడీఎఫ్ పతనం కొనసాగుతోంది. బీజేపీ సంస్థాగత బలం, సంక్షేమ లబ్ధిదారుల వర్గం దాని స్థితిని మరింత బలపరుస్తున్నాయి. హింస, ప్రముఖుల మరణాలు, ఎస్టీ డిమాండ్లు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బీజేపీ నెరిటివ్ ని దెబ్బతీయలేకపోయాయి. సంక్షేమంపై ఉన్న భావనలే పైచేయిగా నిలిచాయి. బీజేపీ బలంగా పాతుకుపోవడంతో వరుసగా మూడో విజయాన్ని సాధించే అవకాశాలు సుగమయ్యాయి.సర్వే విధానంక్షేత్రస్థాయి రాజకీయ, ఎన్నికల పరిశోధనలో అనుభవం కలిగి ఉన్న పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, ‘‘పర్పసివ్ స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్’’ మోడల్తో 45 రోజులపాటు అస్సాం వ్యాప్తంగా విస్త ృతంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. అప్పర్ అస్సాం, బరాక్ వ్యాలీ, మధ్య అస్సాం, లోయర్ అస్సాం అనే నాలుగు ప్రధాన ప్రాంతాలు, రాష్ట్రంలోని ఐదు పరిపాలనా విభాగాలు, మొత్తం 35 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. రాబోయే శాసనసభ ఎన్నికలకు సుమారు నాలుగు నెలల ముందే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో పీపుల్స్ పల్స్ రీసర్చర్లు అస్సాంలో 5,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు.20 మందితో పీపుల్స్ పల్స్ బ ృందాన్ని ప్రతి గ్రూపులో నలుగురు రీసర్చర్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించాం. అదనంగా ఒక గ్రూపు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సమగ్ర వివరాలు సేకరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 నుంచి 4 రోజులు గడుపుతూ అన్ని వర్గాల ప్రజలను కలిశారు. 126 నియోజకవర్గాల్లో ప్రతి చోట 40-45 నమూనాలను ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా సేకరించారు. మొత్తం 5,000 మంది నుంచి సమాచారం సేకరించి, కులం, మతం, వయస్సును పరిగణలోకి తీసుకుంటూ పురుషులు-మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ క్షేత్రస్థాయి వాస్తవాలు ప్రతిబింబించేలా ఈ నమూనా రూపొందించాం.ప్రతి గ్రూపులో ఒకరు నియమిత ప్రశ్నావళితో ఇంటర్వ్యూలు నిర్వహించగా, మిగిలిన ముగ్గురు స్వేఛగాే సంభాషణలు సాగిస్తూ మూడ్ సర్వే నిర్వహించారు. రోజుకు సగటున 15-20 గ్రూపులను ఇంటర్వ్యూ చేయగా, ప్రతి సెషన్ 25-30 నిమిషాలు కొనసాగింది. ఎన్నికలను ప్రభావితం చేసే ప్రజా సమస్యలు, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేత ృత్వంలోని ఎన్డీఏ పాలనపై అభిప్రాయాలు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్పై ఉన్న అభిప్రాయాలు, అలాగే ఏజీపీ, బీపీఎఫ్, ఏఐయుడీఎఫ్, రైజర్ దళ్, ఏజేపీ, యూపీపీఎల్, సీపీఐ(ఎం) తదితర పార్టీలపై అభిప్రాయాలు సేకరించారు. రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు, సెఫాలిజిస్టుల సంప్రదించి ఈ సర్వే ఫలితాలను ధ ృవీకరించాం. ఇది మరికొన్ని నెలల్ల జరగబోయే 2026 ఎన్నికలకు ముందు తొలి ట్రాకర్ పోల్ కాగా, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత 2026 ఫిబ్రవరి లేదా మార్చిలో రెండో రౌండ్ నిర్వహిస్తాం.- దిలీప్రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్, పీపుల్స్పల్స్ రీసెర్చ్ సంస్థ. -
ఆ మాటలకు స్పీకర్ నవ్వడం మరింత బాధాకరం: బండి సంజయ్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్ వేదికగా బండి సంజయ్ మండిపడ్డారు. ‘దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణను కోల్పోయింది. ఇందుకు ఇలాంటి బాధ్యతలేని, అసభ్య భాషే ప్రధాన కారణం. తెలంగాణ అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలను అనుమతించడమే కాకుండా ఆ మాటలను ఆస్వాదిస్తూ స్పీకర్ నవ్వడం బాధాకరం. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. మిత్రపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ దూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. దేశ ప్రజలకూ, గౌరవ ప్రధానికీ నిస్సందేహంగా క్షమాపణ చెప్పాల్సిందే’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. Strongly condemn the offensive remarks made by a Communist Party MLA against Hon’ble Prime Minister Shri @narendramodi Ji.Communism has lost ground across the country, and this kind of reckless language explains why. Such language has no place in a democratic Assembly. By…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 2, 2026 -
ఆ సర్వేతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు
మెజారిటీ ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా లేరని.. పక్కాగా పని చేస్తాయని నమ్ముతున్నారని కర్ణాటక నుంచి ఒక సర్వే విడుదలైంది. అయితే.. ఈ ఫలితం ఆధారంగానే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయం ప్రజాభిప్రాయంతోనే బయటపడిందని ఎద్దేవా చేస్తోంది. ఈ తరుణంలో ఆ సర్వేకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది.2024 లోక్సభ ఎన్నికలపై నిర్వహించిన ఈ సర్వేలో.. 83.61 శాతం మంది ఈవీఎంలు విశ్వసించదగినవేనని వెల్లడించారు. కచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ దీనిని నిర్వహించింది. అయితే.. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అనుమతితో తాము సర్వే నిర్వహించినట్లు సదరు సంస్థ ప్రకటించుకుంది. అయితే..ఈ సర్వేతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ఐటీ మంత్రి ప్రిియాంక్ ఖర్గే తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదని, నిర్వహించాలని ఆదేశించమూ లేదని పేర్కొన్నారు. పైగా సర్వేపై ఆయన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ‘‘మొదటగా చెప్పేది ఏంటంటే.. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కాదు. రెండోది.. ఈ సర్వేను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ఎన్జీవో సమన్వయంతో నిర్వహించింది. అయితే..ఆ ఎన్జీవోను నడిపే వ్యక్తి.. ప్రధాని కార్యాలయానికి దగ్గరగా పనిచేసే వ్యక్తి. ప్రధాని కోసం అతగాడు ఓ పుస్తకం కూడా రాశాడు. వీటికి తోడు.. సుమారు 110కి పైగా నియోజకవర్గాల్లో కేవలం 5,000 మందిని మాత్రమే సర్వే చేసినట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ డేటాను ఎంత నమ్మొచ్చు?.. ఇంతకు మించి ఏం ఆశించొచ్చు’’ అని ప్రశ్నించారాయన. ఈ సర్వేను విశ్వసనీయంగా భావించడం లేదని.. దీని వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందని అన్నారాయన.ఈ ఫలితం ఆధారంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న బీజేపీ.. కలబుర్గి, అలంద్ ప్రాంతాల్లో జరిగిన ఓటు చోరీపై మాత్రం ఇప్పటిదాకా సమాధానం ఇవ్వలేదని ప్రియాంక్ ఖర్గే మండిపడ్డారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈసీ, బీజేపీలు కలిసి కలిసి పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపులు చేశారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఓట్చోరీ రాజకీయం ప్రదానంగా కర్ణాటక నుంచే నడుస్తోంది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ఎన్నికల సంఘంతో కలిసిపోయి ఎన్నికల్లో ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకుంటోందని విమర్శిస్తున్నాయి. అలాగే ఎన్నికల ముందు నిర్వహిస్తున్న సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈసీ పారదర్శకతను శంకించాల్సిన పని లేదని బీజేపీ.. కాంగ్రెస్ చేస్తున్నవి ఉత్త ఆరోపణలేనని ఈసీ ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తూ వస్తున్నాయి.ఒక్క ఓటు తొలగిస్తే రూ.80!కర్ణాటకలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై అక్కడి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో.. ఓ డేటా ఎంట్రీ టీమ్కు లక్షల్లో రూపాయలు చెల్లించి ఓటర్లను తొలగించే పని అప్పగించారని అనుమానాలు నెలకొన్నాయి. ఆరుగురు వ్యక్తుల ముఠా ఈ స్కామ్ నడిపించిందని.. ఒక్క ఓటర్ను తొలగించడానికి రూ.80 ఛార్జ్ చేశారని.. అలా 2023 రాష్ట్ర ఎన్నికల ముందు సుమారు 7,000 ఓటర్లను తొలగించమని అభ్యర్థనలు వచ్చాయని అక్టోబర్ నాటి దర్యాప్తులోనే వెల్లడైంది.తాజా ‘సర్వే లొల్లి’ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. మేము ఎప్పటినుంచో చెబుతున్నదే నిజమని తేలింది. 2023 ఎన్నికల ముందు అలంద్ నియోజకవర్గంలో 6,000కి పైగా నిజమైన ఓటర్లను డబ్బు చెల్లించి తొలగించారు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. -
బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత.. గాలి జనార్దన్పై కేసు నమోదు
బెంగళూరు: రాజకీయ ఘర్షణలు.. ఇరు వర్గాల గన్ ఫైట్తో కర్ణాటక బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి అనుచరులు, గంగావతి బీజేపీ ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. అది చినికి చినికి గాలివానగా మారి.. కాంగ్రెస్-గాలి వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. ఇది కాల్పులకు దారి తీయడంతో ఒకరు మృతి చెందారు. బళ్లారిలోని గాలి జనార్దన్రెడ్డి నివాసం వద్ద గురువారం రాత్రి కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అనంతరం జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది తనపై జరిగిన హత్యాయత్నమేనని, తాను తృటిలో తప్పించుకున్నానని గాలి జనార్దన్ అంటున్నారు. అయితే ఆ అవసరం తనకు లేదని.. గాలి జనార్దన్ జరిపిన కాల్పుల వల్లే కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడని భరత్రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారడంతో బళ్లారి సిటీలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గాలి జనార్దన్పై కేసుగొడవ జరిగినపుడు ఎమ్మెల్యే భరత్రెడ్డి ఊళ్లో లేరు. గొడవ గురించి తెలిశాకే బళ్లారి వచ్చారు. అనుచరులతో ఎస్పీ సర్కిల్కు చేరుకుని ఘటన గురించి ఆరా తీశారు. ఇరువర్గాలు మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్గా గుర్తించాారు. ఈ కాల్పుల్లో సతీష్రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో బళ్లారిలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి.. అదనపు బలగాలు మోహరించారు. కాల్పుల ఘటనపై బ్రూస్పేట పీఎస్లో కేసు నమోదు అయ్యింది. జనార్ధన్రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా 11మంది పేర్లను నిందితులుగా చేర్చారు.నారా వర్సెస్ గాలిగన్ఫైట్.. బళ్లారిలో హైటెన్షన్ వేళ నారా భరత్రెడ్డి, గాలి జనార్దన్రెడ్డి పరస్పరం మాటల తుటాలు పేల్చారు. ‘‘గురువారం ఉదయం ఇంటి ఆవరణలో బ్యానర్లు కట్టారని తమ సెక్యూరిటీ గార్డ్ మా దృష్టికి తీసుకొచ్చాడు. అనంతరం బ్యానర్ పడిపోయింది. దీనిపై క్షమాపణ చెప్పి బ్యానర్ కడుతామని చెప్పాం. అయినా వినకుండా నా ఇంటి ముందు రహదారిపై ఎమ్మెల్యే ఆప్తుడు సతీష్రెడ్డి, చానాళ్ శేఖర్ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. వారితో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఘర్షణలో ఇంటిపై రాళ్లు విసిరారు. సరిగ్గా నేను గంగావతి నుంచి వచ్చే సమయంలో సతీష్రెడ్డి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. బీజేపీ ప్రభుత్వంలోనే రూ.8 కోట్లతో వాల్మీకి భవనం నిర్మించాం. ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించినా మళ్లీ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదని, అభివృద్ధి చేయలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నార’’ని గాలి ఆరోపించారు. అయితే.. బళ్లారి నగరంలో వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠను శాంతియుతంగా నిర్వహించాలని చూస్తుంటే.. ఈ కార్యక్రమం జరగకుండా చూడాలని ఘర్షణకు పాల్పడుతున్నారని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆరోపించారు. ‘‘బ్యానర్ విషయంలో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాల్మీకి అజ్జ వారి పాపాలను చూసుకుంటారని తెలిపారు. నాకు 35 ఏళ్లు.. వాళ్లది నా కంటే డబుల్ వయసు. యువకులే శాంతియుతంగా ముందుకు వెళ్తుంటే వయస్సు మీదపడినా వారే రెచ్చగొట్ట్టేలా చేయడం సరికాదు’’ అని ఆయన అన్నారు. ఈఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్తామని భరత్ స్పష్టం చేశారు. ఫ్లెక్సీ వద్దని.. బళ్లారి సిటీ సెంటర్లో ఈ నెల 3న మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ఊరంతా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే హవ్వబావిలో గాలి జనార్దన్ ఇంటి గోడకు ఫ్లెక్సీ కట్టబోతుండగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే భరత్కి సన్నిహితుడైన సతీష్రెడ్డి అక్కడికి చేరుకుని వీరంగం సృష్టించారు. జనార్దన్ ఇంటి ముందు కుర్చీ వేసుకుని మరీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించే ప్రయత్నం చేయబోయారు. విషయం తెలుసుకుని గాలి అనుచరులు, బీజేపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుని ఆ ప్రయత్నాన్ని అడ్డుకోబోయారు. సరిగ్గా.. అదే సమయంలో గాలి జనార్దన్ అక్కడికి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకోవడంతో.. తోపులాట జరిగింది. అయితే గుంపును చెదరగొట్టేందుకు గాలి జనార్దన్ గన్మెన్, అటు సతీష్రెడ్డి గన్మెన్లు గాల్లోకి కాల్పలు జరిపారు. కోపంతో సతీష్రెడ్డి తన గన్మెన్ తుపాకీ లాక్కుని గాలి జనార్దన్రెడ్డి వైపు కాల్పులు జరిపాడు. ప్రతిగా.. గాలి కూడా కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల గురించి తెలుసుకున్న గాలి సన్నిహితుడు.. మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లి ఎమ్మెల్యే సురేశ్బాబు, గాలి సోమశేఖర్రెడ్డి అక్కడకు చేరుకున్నారు. అయితే లాఠీఛార్జి చేసి ఇరు వర్గాలనూ పోలీసులు చెదరగొట్టారు. నా మర్డర్కు స్కెచ్..ఘటన తర్వాత తనకు తప్పిన ప్రాణాయం గురించి బుల్లెట్ను చూపిస్తూ గాలి జనార్దన్ మీడియాతో మాట్లాడారు. తనను చంపేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్రెడ్డి స్కెచ్ వేశారని ఆరోపించారు. అయితే గాలి జనార్దన్ను చంపాల్సిన అవసరం తనకు లేదని భరత్ అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్త మృతికి, సతీష్రెడ్డి మీద హత్యాయత్నానికిగానూ గాలి జనార్దన్ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
మెరుగయ్యామా?
ఒక దేశం గడిచిపోయిన సంవత్సరాన్ని వెనుకకు తిరిగి సమీక్షించుకోవట మంటే, ఆ సంవత్సరంలోని పరిణామాలను తారీఖులు, దస్తావేజుల పద్ధతిలో నెమరు వేసుకోవటం కాదు. అంతకుముందటి సంవత్సరంతో పోల్చినప్పుడు ఏమైనా మెరుగుపడిందా అని సరిచూసుకోవటం. రాజకీయంగా, పరిపాలనాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, వాటితో పాటు బయటి దేశాలతో సంబంధాల రీత్యా! వీటికి సంబంధించిన అంశాలు అన్నింటికి అన్నీ మెరుగుపడి ఉండకపోవచ్చు. అది సాధ్యం కూడా కాదు. కొన్ని ఒడుదొడుకులు తప్పవు. కానీ, మొత్తం మీద సారాంశం ఏమిటన్న దానిని బట్టే ఒక దేశం ముందుకు పోవటం ఆధారపడి ఉంటుంది.పైన పేర్కొన్న అయిదు ప్రధాన రంగాలకు సంబంధించి, గడిచిపోయిన 2025వ సంవత్సరంలో అనేకానేకం జరిగాయి. వాటిలో ముఖ్యమైన వాటిని మాత్రం పేర్కొని ఆ ప్రభావాలను అంచనా వేసే ప్రయత్నం చేద్దాము. ముఖ్యమైనవి అనే మాటను ముందు నిర్వచించుకోవాలి. కొన్నింటికి తక్షణ ప్రాముఖ్యం ఉండి క్రమంగా తేలిపోతాయి. కొన్నింటికి తదనంతర కాలంలోనూ ప్రభావాలు కొనసాగుతాయి. ఇక్కడ చూసేందుకు ప్రయత్నిస్తున్నది ఈ రెండో తరహా వాటి గురించి.బలపడిన బీజేపీముందుగా రాజకీయాలను గమనిస్తే, 2025వ సంవత్సరం వచ్చే వేళకు దేశం ముందుండిన ప్రధానమైన ప్రశ్న, 2024లో వరుసగా కేంద్రంలో, రాష్ట్రాలలో పరాజయాల పాలైన ప్రతిపక్షాలు ఇప్పటికైనా కూడదీసుకోగలవా అన్నది. కాంగ్రెస్ను, దాని నాయకత్వాన గల యూపీఏను 2014లో వెనుకకు తోసిన బీజేపీ, క్రమంగా ప్రాంతీయ పార్టీలను కూడా బలహీనపరుస్తున్న క్రమం 2025లో, ఆ తర్వాత 2026లో ఆగగలదా? కాంగ్రెస్, దాని కూటమి పార్టీలు కలిసి 2027 కల్లా పుంజుకుని బీజేపీకి నిజమైన సవాలుగా నిలవగలవా అన్నది పెద్ద ప్రశ్న అయింది. అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరిగిన ఢిల్లీ, బిహార్, 2026లో జరగనున్న అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కలిపి మొత్తం ఆరు రాష్ట్రాలు. వీటిలో ప్రతిపక్ష రాష్ట్రం ఢిల్లీని బీజేపీ ఇప్పటికే గెలుచుకోగా, ప్రతిపక్షం ఎన్నో ఆశలు పెట్టు కున్న బిహార్, అంతకుముందటి కన్న భారీ ఆధిక్య తతో బీజేపీ వశమైంది. 2026లో జరిగే అస్సాంపై ప్రతిపక్షాలకు, కేరళపై బీజేపీకి అంచనాలు లేక పోవచ్చు గానీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు కోసం ఆ పార్టీ శతవిధాల ప్రయత్నిస్తున్నది. 2025 చివరన నికరంగా కనిపిస్తున్నదేమంటే, బీజేపీ 2024 కన్న ఇప్పుడు మరింత బలపడి, 2026లో ఇంకా బలపడే సూచనలు కనిపిస్తుండగా, ప్రతిపక్షాల పరిస్థితి అందుకు విరుద్ధ దిశలో సాగుతున్నది.ఆర్థికం యథాతథందేశం ఆర్థికంగా 2025లో మెరుగుపడిందా, క్షీణించిందా అన్న ప్రశ్నపై తీవ్రమైన చర్చలు సాగు తున్నాయి. అవి స్థూలంగా చూసినపుడు ఉత్తర – దక్షిణ ధ్రువాలన్నంత భిన్నంగా ఉన్నాయి. వాస్తవా నికి ఆర్థిక రంగం 2024తో పోల్చినప్పుడు కొద్దిపాటి తేడాలతో యథావిధిగానే సాగుతున్నది తప్ప భారీ మార్పులంటూ కనిపించవు. ఉత్పాదక రంగం, వాణిజ్యం, ఆదాయాలు, ధనిక పేద తారతమ్యాల పెరుగుదల, అదే సమయంలో మధ్యతరగతి పెరుగు దల, అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఆర్థిక – వాణిజ్య సవాళ్లు, రూపాయి విలువ ఆగకుండా పతనమవుతుండటం, వాణిజ్య లోటు పెరుగుతూనే ఉండటం, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగు దల, వ్యవసాయ రంగ సమస్యలు అన్నింటిదీ 2024 నాటి పరిస్థితే. అదే సమయంలో మరొకవైపు, పలు విధాలైన సక్రమ, అక్రమ రాయితీలతో కొందరి సంపదలు కొండలవలె పెరగటం కూడా 2025లో కొనసాగింది. మరొకవైపు వివిధ అంతర్జాతీయ సూచీలలో ఎందులోనూ భారతదేశపు ర్యాంకింగులు మెరుగుపడలేదు.ఆర్థిక రంగానికి సంబంధించి 2025వ సంవత్సరపు రెండు గమనార్హమైన విషయాలున్నాయి. ఒకటి – అమెరికా విధించిన భారీ సుంకాలు, ఇండియాను లొంగదీసేందుకు ప్రయత్నిస్తున్న కొత్త వాణిజ్య ఒప్పందం. రెండవది – అమెరికా ఒత్తిడిని సరకు చేయకుండా భారత ప్రభుత్వం ‘బ్రిక్స్’లో కొనసాగుతూ ఆ వ్యవస్థను శక్తిమంతం చేస్తుండటం. ఇవిగాక, అమెరికా కూటమి నుంచి వైవిధ్యంకోసం పలు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాని మోదీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధమైన పరిస్థితులు, పరిణామాలు 1991 నాటి ఆర్థిక సంస్కరణల సమయం నుంచి ఇదే మొదటిసారి. 2025లో ఎదురైన ఈ సవాళ్ల వంటివి లోగడ లేవు. వీటిని సానుకూలంగా ఎదుర్కొనగలగటంపై వర్తమానంతోపాటు దీర్ఘకాలిక భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. దెబ్బతిన్న సంబంధాలుబయటి ప్రపంచంతో ఆర్థిక సంబంధాల పరిస్థితి ఇది కాగా, రాజకీయ సంబంధాలు మాత్రం సంతోషకరంగా సాగలేదు. పాకిస్తాన్తో యుద్ధం, బంగ్లాదేశ్తో సంబంధాల క్షీణత, శ్రీలంకతో సత్సంబంధాల కోసం పడుతున్న శ్రమ ఇందుకు తార్కాణం. చైనా, రష్యాలకు, ఇండియాకు మధ్య సంబంధాల అభివృద్ధి ముఖ్యంగా అమెరికా తీరు కారణంగా ముగ్గురికీ అవసరమనే గుర్తింపు గతంలో కన్న ఎక్కువగా ఏర్పడటం, అందుకు తగిన వ్యవహరణ అన్నది 2025లో కనిపించిన కొత్త విశేషం. చివరగా సమాజం విషయానికి వస్తే, యథాతథంగానే పెరుగుతున్న ఆర్థిక అసంతృప్తికి తోడు, ఒకవైపు అల్పసంఖ్యాక వర్గాలు, మరొకవైపు దళితుల భద్రత 2024 కన్న స్పష్టమైన రీతిలో మరింత క్షీణించింది. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
డీఎన్ఏలో తేలినా పెళ్లికి నో!
క్రైమ్: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన బీజేపీ నాయకుడు జగన్నివాస్ రావ్ కొడుకు కృష్ణ జె.రావ్ ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి శిశువుకు జన్మనిచ్చి నెలలు గడుస్తున్న సమస్య పరిష్కారం కాలేదు. కోర్టు ఆదేశాల మేరకు డీఎన్ఏ పరీక్షలు చేయగా జన్మనిచ్చిన శిశువుకు కృష్ణ జె.రావ్ తండ్రిగా తేలింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోడానికి కృష్ణ నిరాకరించారు. ఇదే విషయంపై ఆర్ఎస్ఎస్ నాయకుడు కల్లడ్క ప్రభాకర్ భట్తో పాటు అనేక మంది బీజేపీ నాయకులు రాజీ పంచాయతీ చేయగా అదీ విఫలమైంది. ఇక న్యాయ పోరాటమే మార్గమని బాధిత యువతి కుటుంబం నిర్ణయించింది. న్యాయపోరాటానికే సిద్ధం కోర్టు ద్వారా శిశువుకు తండ్రి, తనకు భర్త కావాలనే ఉద్దేశంతో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. కృష్ణ జె.రావ్కు యువతితో పాఠశాల విద్యార్థి దశ నుంచీ పరిచయం. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గర్భవతిని చేసిన యువతినే పెళ్లి చేసుకోవాలని అనేక మంది కృష్ణ కుటుంబంపై ఒత్తిడి చేశారు. మొదట నిరాకరించినా కొద్ది రోజుల తరువాత ఒత్తిడికి తలొగ్గి పెళ్లి చేసుకోడానికి ఒప్పుకున్నారు. అయితే అతనికి 21 ఏళ్లు పూర్తి కాని కారణంగా, పూర్తికాగానే వివాహం చేస్తామని కృష్ణ తండ్రి జగన్నివాస రావ్ హామీనిచ్చారు. చేతులెత్తేసిన కృష్ణ శిశువు పుట్టగానే కృష్ణకు 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోడానికి నిరాకరించిన తరువాత విషయం పోలీసు స్టేషన్కు చేరింది. కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం బెయిల్పై విడుదలైన కృష్ణ ఆ శిశువుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు. దీంతో కోర్టు జోక్యం చేసుకొని డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించింది. బాధిత యువతి, శిశువు, కృష్ణల రక్త నమూనాలను బెంగళూరు ప్రయోగాలయానికి తరలించి పరీక్షించగా కృష్ణే తండ్రి అని తేలింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. బీజేపీ నుంచి జగన్నివాస్ రావ్ను బహిష్కరించింది. పలు సార్లు రాజీ ప్రయత్నాలు శిశువు డీఎన్ఏ పాజిటివ్గా వచ్చిన తరువాత కృష్ణ కుటుంబం వివాహం చేసుకోడానికి నిరాకరిస్తున్నట్లు యువతి కుటుంబం అరోపిస్తోంది. మూడు నెలల నుంచి ఆర్ఎస్ఎస్ నాయకులు కల్లడ్క ప్రభాకర్ భట్, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్, దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సతీశ్ కుంపల, విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కేపీ నంజుండి నేతృత్వంలో పలు మార్లు రాజీ ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. కోర్టు తీర్పుకే కట్టుబడతాం ఇలా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి. ఇక న్యాయ పోరాటం చేయటమే మేలని భావించాం. జైలుకెళ్లిన కృష్ణ బెయిల్పై బయటకు వచ్చారు. శిశువుకు తండ్రి, తనకు భర్త దొరికితే చాలు. రాజీ ప్రయత్నాలు విఫలం కావటంతో కోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు బాధిత యువతి చెబుతోంది. డబ్బు ఆశ చూపారు, న్యాయం దొరకలేదు. ఇప్పుడు న్యాయ పోరాటమే తమకు శరణ్యమని బాధిత యువతి కుటుంబం అంటోంది. -
కమలం.. మోదం.. ఖేదం..
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి 2025 తీపి, చేదుల మిశ్రమ కలయికగా నిలిచింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లకు ధీటుగా.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కమలదళం ఉవ్విళ్లూరు తున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్యసాధన దిశలో ఏ మేరకు సఫలీకృతమైందని పరిశీలిస్తే మాత్రం..ఆ పార్టీకి ఈ ఏడాది కొంత మోదంతో పాటు కొంత ఖేదాన్ని కూడా మిగిల్చినట్టు కన్పిస్తోంది. మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని కైవసం చేసుకున్న బీజేపీ ప్రధాన పక్షాలను కంగుతినిపించింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం ఆ పార్టీకి చేదు అనుభవాన్ని రుచి చూపించింది. ఈ ఏడాది లోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు రావడం గమనార్హం.ఏడాదంతా ఎత్తు,పల్లాల పయనంఈ ఏడాదంతా కూడాకాషాయదళం ప్రయాణం ..ఎత్తును అధిరోహించడం ఆ వెంటనే పల్లంలోకి పడిపోవడం అన్నట్టుగా సాగింది. ఈ ఏడాది మొదట్లోనే ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో పట్టభద్రులు, టీచర్స్ శాసనమండలి స్థానాల్లో విజయం సాధించి..ఉద్యోగులు, విద్యావంతుల్లోనూ పార్టీకి పట్టు ఉందని చాటుకోగలిగింది. కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్– మెదక్ పట్టభద్రుల సీటు నుంచి బీజేపీ బీఫారమ్పై పోటీ చేసిన అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు. అదేవిధంగా ఇదే ప్రాంత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన మల్కా కొమరయ్య గెలుపొందారు. ఈ విజయాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచాయి.సమన్వయ లేమి..అంతర్గత విభేదాలుఅయితే వరుసగా మూడుసార్లు గెలిచి హైదరాబాద్లో హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్ అని పిలిపించుకున్న టి.రాజాసింగ్.. చివరకు రాజీనామా వరకు వెళ్లేలా పార్టీలో పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నాయకత్వంపై, కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై నేరుగా విమ ర్శలు, ఆరోపణలతో రాజాసింగ్ బీజేపీలో కొనసాగలేని పరిస్థితికి చేరుకున్నారు. పార్టీ ముఖ్యనేతల మధ్య సమన్వయ లేమి, అంతర్గత విభేదాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి వారే అన్నట్టుగా సొంత ప్రతిష్టను, సత్తాను చాటుకునే ప్రయత్నంలో పార్టీ సమష్టి బాధ్యత, కలిసికట్టుగా ముందుకెళ్లడం అనేది విస్మరించారనే విమర్శలు వచ్చాయి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘోరఓటమి పార్టీకి, నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందికర పరిణామంగా మారింది. అయితే ఈ ఏడాది చివర్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో 1,000 మంది దాకా (స్వతంత్రుల్ని కూడా కలుపుకొని) సర్పంచ్లు గెలిచారని పార్టీ ప్రకటించింది. 2019లో గెలిచిన సర్పంచ్ స్థానాలతో పోల్చితే ఇవి సంఖ్యాపరంగా ఎక్కువైనా రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలం పెరిగిందని చెబుతున్న స్థాయిలో ఇవి లేవనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం. ఈ ఏడాది కూడా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగాయి. ముఖ్యనేతలు సైతం బహిరంగ విమర్శలు చేసుకున్నారు.అధ్యక్షుడిగా రాంచందర్రావురాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం పెద్దసంఖ్యలో ముఖ్యనేతలంతా పోటీపడగా.. చివరకు మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు ఎంపికయ్యారు. ఈ అధ్యక్ష ఎన్నిక పూర్తయిన క్రమంలోనే పార్టీకి, సభ్యత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడం జాతీయ పార్టీ ఆమోదించడం జరిగిపోయాయి. అయితే మళ్లీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు రాజాసింగ్ చేస్తుండటం గమనార్హం. -
ఎవరు ప్రజాసేవకుడు?
కాలం మారుతుందనీ, రేగిన గాయాన్ని మాన్పుతుందనీ అనుకుంటాం. కానీ, అన్ని సార్లూ అది నిజం కాదు. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ ప్రాంత అత్యాచార కేసులో తాజా పరిణామాలు పాత గాయాన్ని మళ్ళీ రేపి, బాధితుల గుండెల్లో బడబాగ్నిని రగిలించాయి. సదరు కేసులో దోషి అని తేల్చి, మాజీ ఎమ్మెల్యే – బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్సింగ్ సెంగార్కు ఆరేళ్ళ క్రితం 2019లో ఢిల్లీలోని ఓ కోర్టు జీవిత ఖైదు విధిస్తే, వారం రోజుల క్రితం ఢిల్లీ హైకోర్ట్ ఆ శిక్షను సస్పెండ్ చేయడం గగ్గోలు రేపింది. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కుల్దీప్ ‘ప్రజా సేవకుడు’ కిందకు రారనీ, కాబట్టి చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడినవారిపై ప్రయోగించే ‘పోక్సో’ చట్టంలోని కఠిన అంశాల కింద గతంలో ఆయనకు శిక్ష వేయడం సరికాదనీ హైకోర్ట్ మాట. ఇది అన్యాయ మంటూ నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో, సీబీఐ అప్పీలు చేయడం, హైకోర్ట్ ఉత్తర్వును డిసెంబర్ 29న సుప్రీంకోర్ట్ పక్కనపెట్టడం ఇప్పుడు ఒకింత ఊరట. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో జరిగిన 17 ఏళ్ళ మైనర్, దళిత బాలిక అత్యాచారం, ఆ తదుపరి సంఘటనలు తలుచుకుంటే ఇవాళ్టికీ గుండె బద్దలవుతుంది. ఉద్యోగం మిషతో రప్పించిన మైనర్ బాలికపై కుల్దీప్ తన నివాసంలో 2017 జూన్లో అత్యాచారం జరి పారు. బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించినా, కొన్ని నెలల పాటు అతీగతీ లేదు. పోరాటం చేసిన బాలిక తండ్రిని సైతం తప్పుడు కేసులో ఇరికించి, చావచితక కొట్టారు. ఆఖరికి 2018 ఏప్రిల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట బాలిక ఆత్మాహుతి యత్నానికి దిగేసరికి, ఉన్నావ్ కేసు జాతీయస్థాయి సంచలనమైంది. కనపడని పోలీసు దెబ్బలతో కన్నతండ్రి కస్టడీలోనే మరణించడం రచ్చ రేపేసరికి, కేసు సీబీఐకి చేరింది. అయినా తిప్పలు తప్పలేదు. కేసులో పోరాడుతున్న బాధిత కుటుంబం, లాయరుతో సహా వెళుతున్న కారును గుర్తు తెలియని వాహనం గుద్ది, బాధితురాలి కుటుంబసభ్యులిద్దరిని 2019 జూలైలో పొట్టనబెట్టుకుంది. బెదిరింపులకు తాళలేక ఆఖరికి భారత ప్రధాన న్యాయమూర్తిని రక్షణ కోరేసరికి, విషయం సుప్రీం దృష్టికి వెళ్ళింది. 2019 డిసెంబర్లో కుల్దీప్ను దోషిగా తేల్చి, శిక్ష వేసినా, చట్టంలోని లోటుపాట్లు ఆసరాగా బయటకు వచ్చే ప్రయత్నం హైకోర్ట్లో సాగింది. భారత ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురు సభ్యుల తాజా మధ్యంతర ఉత్తర్వుల ఫలితంగా... ఇప్పటికైతే కుల్దీప్ను కస్టడీ నుంచి విడుదల చేయరు. కానీ ఆయన అప్పీలు పెండింగ్లో ఉంటుంది. బాధితులను కాపాడేందుకు ఉద్దేశించిన చట్టంలోని అసలు స్ఫూర్తిని అర్థం చేసు కోకుండా, కేవలం అందులోని మాటలను అడ్డం పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే కష్టమే నని తాజా ఘటనలో హైకోర్ట్ వ్యవహారశైలి రుజువు చేసింది. అదే సందర్భంలో రకరకాల ఆరోపణలతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ మసకబారుతున్న వేళ హైకోర్ట్ జడ్జీల నిబద్ధతను సమర్థిస్తూనే, సుప్రీం ఇచ్చిన తీర్పు కొత్త ఆశలు రేపుతోంది. బాలికపై అత్యాచారం, ఆ పైన ఆమె తండ్రి మరణంలో దోషి అయిన మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకొస్తే, ప్రాణాపాయం తప్పదని బాధిత కుటుంబం బెంబేలెత్తుతున్న సమయంలో సుప్రీం తీర్పు మళ్ళీ ధైర్యం ఇచ్చింది. పైపెచ్చు, ఈ వ్యవహారంలో చట్టంతో ముడిపడిన అనేక కీలక ప్రశ్నలు ముందుకు వచ్చాయనీ, వాటిపై పూర్తిస్థాయిలో ఆలోచన జరపడం అవసరమనీ సుప్రీంకోర్ట్ పేర్కొనడం గమనార్హం. అంటే, రాబోయే రోజుల్లో పలు అంశాల్లో ఈ కేసులో కోర్ట్ ఇచ్చే స్పష్టత, దాని పర్యవసానాల ప్రభావం దీర్ఘకాలం ఉండనుంది. ‘ప్రజా సేవకుడు’ ఎవరనే అంశంలో హైకోర్ట్ చెప్పిన భాష్యం లోపభూయిష్ఠం. ఒక వేళ ఆ భాష్యాన్నే అనుసరిస్తే, తీవ్రమైన లైంగిక నేరాల పరిధి నుంచి చట్టసభల సభ్యులు ఇట్టే తప్పించుకొనే ప్రమాదం ఉంది. ‘ఈ లెక్కన పోక్సో చట్టం కింద కానిస్టేబులేమో పబ్లిక్ సర్వెంట్ కానీ, ఎమ్మెల్యే మాత్రం కాదన్నమాట’ అని సుప్రీం చేసిన వ్యాఖ్య చిన్నది గానే కనిపించినా, లోతుగా ఆలోచన రేపే చురకత్తి. దోషిగా తేలిన వ్యక్తిని సైతం సాంకేతిక కారణాలతో రక్షించాలనుకోవడం వకీళ్ళకు చెల్లుతుందేమో కానీ, చేసిన నేరాన్నీ, దాని తీవ్రతనూ వదిలేసి వ్యవహరించడం న్యాయమూర్తులకు పాడి కాదు. ఒకవేళ చేసిన చట్టంలోనూ, దానిలో ప్రొవిజన్లలోనూ స్పష్టత లోపిస్తే, వాటిని సరిదిద్దేలా కోర్టులు వివరణ ఇస్తేనే ధర్మం నిలబడుతుంది. దోషులకు శిక్ష పడి, బాధితులకు న్యాయం జరుగుతుంది. ఉన్నావ్ కేసులో తాజా సుప్రీం జోక్యం ఆ దిశగా అడుగులేయడమే ఇప్పుడు అవసరం. -
వాళ్లను తరిమేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
బోర్డోవా/గువాహటి: అస్సాం అభివృద్ధి, సంస్కృతికి ప్రతిబంధకంగా మారిన బంగ్లాదేశ్ చొరబాటుదారులను తరిమికొట్టే ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఎన్నుకోవాలని అస్సాం ఓటర్లకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సోమవారం అస్సాంలో సుడిగాలి పర్యటన చేసిన అమిత్ షా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గువాహటిలో నూతన పోలీస్ కమీషనరేట్, నిఘా కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. చొరబాటుదారులతో పోరాటంతో ప్రాణత్యాగంచేసిన వీరులకు ‘స్వాహిద్ స్మారక్ క్షేత్ర’లో నివాళులరి్పంచారు. 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సాధువు, సంఘ సంస్కర్త శ్రీమంత శంకర్దేవ్ ‘బతద్రవ థాన్’పుణ్యక్షేత్రంలో రూ.227 కోట్లతో పునరుద్ధరణ పనులను షా ప్రారంభించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గోపినాధ్ బోర్దోలాయ్, సంగీత సామ్రాట్ భూపెన్ హజారికా, యువ సంగీత తరంగం, దివంగత జుబెన్ గార్గ్, దిగ్గజ అహోం జనరల్ లాచిత్ బోర్ఫుకన్లకు షా నివాళులరి్పంచారు. తర్వాత బోర్డోవా పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో మీ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రం నుంచి విదేశీ చొరబాటుదారులందరినీ మూకుమ్మడిగా తరిమికొట్టే సత్తా ఉన్న ప్రభుత్వాన్నే ఎన్నుకోండి. చొరబాటుదారులను అనుమతించని సర్కార్ను ఎన్నుకోండి. అస్సాం అభివృద్ధికి పాటుపడే నేతలకే పట్టంకట్టండి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి కాంగ్రెస్ రాష్ట్రంలోకి విదేశీయుల చొరబాట్లను ప్రోత్సహించింది. ఇప్పుడది అస్సాం అస్థిత్వం, గుర్తింపునకు ముప్పుగా పరిణమించింది’’అని షా అన్నారు. మరో ఛాన్స్ ఇవ్వండి ‘‘అస్సాంలో బీజేపీ ప్రభుత్వాల హయంలో గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధ్యమైంది. ఆ అభివృద్ధి సరిపోదు. శ్రీమంత సాధువు జని్మంచిన పుణ్యస్థలి నుంచి మీకు వాగ్దానం చేస్తున్నా. మరో ఐదేళ్లు పరిపాలించే అవకాశం ఇవ్వండి. అస్సాం నుంచి చొరబాటుదారులందరినీ వెనక్కి పంపేస్తాం. ఈ రాష్ట్రమేకాదు ప్రతి రాష్ట్రం నుంచి చొరబాటుదారులను తరిమేస్తాం. ప్రధాని మోదీ మీ సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించమేకాదు మీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతారు’’అని షా అన్నారు. -
ఎన్నికల రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇటీవల నియమితులైన నితిన్ నబిన్ అప్పుడే కార్యరంగంలోకి దూకారు. వచ్చే ఏడాదిలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రా పార్టీ ఇన్ఛార్జీలు, కీలక నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని తిరిగి నిలబెట్టడం, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘జాతీయ పార్టీ అయినా, స్థానికంగానే ఆలోచించాలి’అన్న విధానంతో రాష్ట్రానికో ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో పట్టుకోసం.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నబిన్ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఇందులో ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంగా అధికారం అందుకోలేకపోతున్న బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయడం అంత సులభమయ్యేది కాదు. దీనికి తోడు ఇప్పటికే రెండుమార్లు అధికారంలో ఉన్న అస్సాంలో పార్టీని తిరిగి నిలబెట్టడం కత్తిమీద సాములాంటిదే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను నబిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయన ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్, వినోద్ తావ్డే, అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్ తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగానే ప్రతి బూత్కు ఒక ఇన్ఛార్జి, ఒక డేటా వలంటీర్, ఒక సోషల్ మీడియా వలంటీర్లను సిధ్దం చేయాలనే సూచనలు వచ్చాయి. ‘ఎన్నికలను స్టేజ్ మీద కాదు..బూత్ వద్ద గెలుస్తాం’అన్న విధానాన్ని అవలంబిస్తూనే..యువత, మహిళలను క్రియాశీలకం చేయాలని నిర్ణయించారు. స్థానిక సామాజిక సమీకరణలపై సర్వేలు, ప్రాంతాల వారీగా అధికంగా ఉండే వర్గాల మ్యాపింగ్, చిన్నచిన్న సమావేశాలు, స్థానిక భాషల్లో పార్టీ కంటెంట్ ప్రచారం వంటి దృష్టి సారించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని నబిన్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న బన్సల్ నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. కాయస్థ కులస్థుడైన నబిన్ సామాజిక వర్గానికి చెందిన జనాభా పశి్చమ బెంగాల్లో గణనీయమైన రాజకీయ, సామాజిక ప్రభావాన్ని కలిగి ఉంది. కోల్కతా, అసన్సోల్, సిలిగురి వంటి నగరాల్లోని బిహారీ వలసదారుల జనాభా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచే తన తొలి రాష్ట్ర పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు వంటి అంశాలతో రాష్ట్రంలోకి చొచ్చుకెళ్లేలా, టీఎంసీకి బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచేలా, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లతో పార్టీకి అనుబంధం పెంచేలా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే రోడ్మ్యాప్ ఖరారైనట్లు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత నబిన్ బెంగాల్ పర్యటన ఉంటుందని అంటున్నారు. ఇక తమిళనాడులో బలమైన ప్రాంతీయ పార్టీలతో కూటమి..స్థానిక భాష, సంస్కృతి మీద గౌరం చూపేలా ప్రచారం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలతో బూత్ స్థాయి వరకు పార్టీని చేర్చాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. జనవరి తొలి వారంలో నబిన్ ఇక్కడ పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. ఇక కేరళలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పాగా వేయడాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నబిన్ భావిస్తున్నారు. తిరువనంతపురం మున్సిపల్ మేయర్ పీఠాన్ని కైవసం అంశాన్ని భవిష్యత్ ఎన్నికలకు పునాదిగా మలుచుకోవాలని నిర్ణయించారు. తొలిసారి ఓటువేసే యువతకు తమ వైపు తిప్పుకోవడంతో పాటు..ఉద్యోగాలు, విద్య అంశాలపై ప్రచారం చేస్తూ ఓటు శాతాన్ని గణనీయంగా పెంచితే గెలుపు సాధ్యమన్నది నబిన్ ఆలోచనగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అస్సాంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పనితీరును హైలెట్ చేయడం, స్థానిక నాయకులను అప్రమత్తం చేయడం, కాంగ్రెస్పై మరింత పదునుగా విమర్శలకు దిగేలా ఇప్పటికే రాష్ట్ర పర్యటన సందర్భంగా నేతలకు నబిన్ మార్గదర్శనం చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలోనూ పర్యటించిన నబిన్, పారీ్టకి ఉన్న బలాన్ని నిలుపుకునే అంశాలపై నేతలకు కీలక సూచనలు చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని నిలబెడుతూనే, కొరగరానికొయ్యగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే బలమైన పట్టుదలతో నబిన్ ముందుకెళ్తున్నారు. -
జైల్లోనే సెంగార్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడికి బెయిల్ మంజూరు చేయడంతోపాటు కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దని అధికారులకు తేలి్చచెప్పింది. ఐపీసీ ప్రకారం ఎమ్మెల్యేను ‘ప్రజాసేవకుడి’గా పరిగణించలేమన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పు బట్టింది. ఇది చట్టసభ సభ్యులకు మినహాయింపు ఇచ్చినట్లు అవుతుందన్నది.ఎమ్మెల్యే ప్రజాసేవకుడు కాదా? ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తోపాటు బాధితురాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సిందే. హైకోర్టు న్యాయమూర్తులు ఎంతో అనుభవజు్ఞలు, కానీ ఎవరైనా పొరపాట్లు చేస్తారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) నిర్వచనం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. చట్టం ప్రకారం ఒక కానిస్టేబుల్ ‘పబ్లిక్ సర్వెంట్’ అవుతారు. అలాంటప్పుడు ఒక శాసనసభ్యుడు మాత్రం ప్రజా సేవకుడు కాదా? ఎమ్మెల్యేను మినహాయించడం సరైందేనా? చట్టసభ సభ్యులను దీని నుంచి మినహాయించడం సరైన ది కాకపోవచ్చు’ అని ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా ఒక దోషి లేదా అండర్ ట్రయల్ ఖైదీకి బెయిల్ ఇస్తూ కింది కోర్టు లేదా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పుడు అతడి వాదన వినకుండా ఆ ఉత్తర్వుపై స్టే విధించలేమని తెలియజేసింది. మరో కేసులో సెంగార్ దోషిగా తేలి, ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నాడని పేర్కొంది. ఈ నెల 23న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఉన్నావ్ కేసుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులను, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని నిలిపివేస్తున్నామని స్పష్టంచేసింది. బాధితురాలికి ప్రాణహాని ఉంది: తుషార్ సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘ఇది అత్యంత పాశవికమైన నేరం. ఘటన జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్ల కంటే తక్కువ (15 ఏళ్ల 10 నెలలు). కేవలం ఏడేళ్ల జైలుశిక్ష పూర్తయిందన్న కారణంతో దోషికి బెయిల్ ఇవ్వడం సరికాదు. సవరించిన చట్టం ప్రకారం ఇలాంటి నేరాలకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘నేరం జరిగిన సమయానికి ఈ చట్ట సవరణ రాలేదు కదా! ఆ తర్వాత వచ్చిన సవరణలను పాత కేసులకు ఎలా వర్తింపజేస్తాం?’ అని ప్రశ్నించింది. దీనికి తుషార్ బదులిస్తూ.. ‘మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు పబ్లిక్ సర్వెంట్ నిర్వచనంతో పనిలేదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజల దృష్టిలో బలమైన స్థానంలో ఉంటారు. ఎవరైనా సాయం కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తారు. అలాంటి నమ్మకమైన స్థానంలో ఉండి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే నేరం కచ్చితంగా తీవ్రమైన లైంగిక దాడి కిందకే వస్తుంది. ఆర్మీ ఆఫీసర్ విధుల్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎలా శిక్షార్హుడో, ఎమ్మెల్యే కూడా అంతే’ అని వాదించారు. సెంగార్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ‘సెంగార్ ఇప్పటికే బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులోనూ దోషిగా తేలారు. ఈ హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. పలుకుబడి ఉన్న వ్యక్తి సెంగార్ బయటకొస్తే బాధితురాలికి, ఆమె కుటుంబానికి తీరని అన్యాయం జరు గుతుంది. ఆ బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బెయిల్ రద్దు చేయాలి’ అని కోర్టును కోరారు. ఎల్.కె. అద్వానీ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఎంపీలు లేదా ఎమ్మె ల్యేలుగా పదవిలో ఉన్న వాళ్లను ప్రజా ప్రతినిధులుగానే పరిగణిస్తూ అప్పట్లో న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేశారు. సెంగార్ తరఫు న్యాయవాదుల వాదన సెంగార్ తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, ఎన్.హరిహరన్ వాదనలు వినిపించారు. ‘ట్రయల్ కోర్టు సెంగార్ను పబ్లిక్ సర్వెంట్గా పరిగణించడం వల్లనే జీవిత ఖైదు విధించింది. ఐపీసీలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనాన్ని తీసుకొచ్చి పోక్సో చట్టానికి ఆపాదించడం న్యాయం కాదు. ఒక చట్టంలోని నిర్వచనాన్ని మరో చట్టానికి వర్తింపజేయకూడదు’ అని సాంకేతిక అంశాన్ని లేవనెత్తారు. అలాగే సెంగార్కు బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఆరోపణలు వస్తున్నాయని, టీవీల్లో కొందరు చర్చలు సాగిస్తున్నారని సెంగార్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి ఇరుపక్షాల వాదనలు తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎమ్మెల్యేను పబ్లిక్ సర్వెంట్ కాదనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ను నిలిపివేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని వెల్లడించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్కు నోటీసులు జారీ చేసింది.అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ ఓ మైనర్ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో 2019 డిసెంబర్లో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు(మరణించేదాకా జైలులోనే) విధించింది. మరోవైపు బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించాడు. ఈ కేసులోనూ సెంగాల్ దోషిగా తేలడంతో పదేళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నావ్ అత్యాచారం కేసుతోపాటు సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్ ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఉన్నావ్ రేప్ కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల విచారించింది. సెంగార్ చేసిన నేరం పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) కింద ‘తీవ్రమైన లైంగిక దాడి’ పరిధిలోనికి రాదని అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్ 21 ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధి ‘పబ్లిక్ సర్వెంట్’ నిర్వచనం పరిధిలోకి రారని పేర్కొంది. సెంగార్ ఇప్పటికే ఏడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు, జీవిత ఖైదును కూడా రద్దు చేస్తున్నట్లు ఈ నెల 23వ తేదీన తీర్పునిచ్చింది.


