ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూట్ ప్రకటన వచ్చేసింది. సోమవారం(జనవరి 19వ తేదీ) బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం గం. 2 నుంచి గం. 4 వరకూ నామినేషన్ దాఖలు ఉంటుంది. సాయంత్రం గం. 4 నుంచి నామినేషన్ల పరిశీలన, సాయంత్రం గం 6 వరకూ ఉపసంహరణ గడువు ఉంటుంది.
అనంతరం తదుపరి మంగళవారం(జనవరి 20వ తేదీ) మధ్యాహ్నం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 మధ్య జాతీయ అధ్యక్షుడి ప్రక్రియ పూర్తి చేస్తారు. ఏకాభిప్రాయం కుదిరితే ఎంపిక, లేకపోతే ఎన్నిక ఉంటుందని బీజేపీ జాతీయ ఎన్నికల అధికారి డా.లక్ష్మణ్ ప్రకటించారు.


