మోదీపై అభిషేక్‌ బెనర్జీ విమర్శలు | Abhishek Banerjee Slams PM Modi For Vendetta Politics Over Funds To West Bengal, More Details Inside | Sakshi
Sakshi News home page

మోదీపై అభిషేక్‌ బెనర్జీ విమర్శలు

Jan 18 2026 8:16 PM | Updated on Jan 19 2026 4:12 PM

Abhishek Banerjee Slams Pm Modi

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల తరుణంలో టీఎంసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకుంటోందని, బీజేపీ రాష్ట్ర ప్రజలపై కష్టాలు మోపుతోందని అన్నారు. నిధుల నిలిపివేత వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం గ్రామీణ అభివృద్ధి, పథకాలు, మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదు. దీని వల్ల పేదలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రజలపై నేరుగా దాడి చేసినట్టే. బెంగాల్ ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అందుకే కేంద్రం ప్రతీకారంగా నిధులను నిలిపివేస్తోంది’ అని ఆరోపించారు. 

ఈ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. తృణమూల్ కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి పెంచుతుండగా, బీజేపీ మాత్రం నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయి. అందుకే విడుదల నిలిపివేశాం  అని వాదిస్తోంది. ఈ వివాదం రాబోయే ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి, పశ్చిమ బెంగాల్‌కు నిధుల నిలిపివేతపై అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలు రాష్ట్ర కేంద్ర సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement