Vijay
-
విజయ్- రష్మిక జంట.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్- రష్మిక. కొన్నేళ్లుగా డేటింగ్ ఉన్న వీరిద్దరు ఉదయ్పూర్ వేదికగా ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు.అయితే విరోష్ జంటగా క్రేజ్ తెచ్చుకున్న వీరిద్దరు ఓ యాడ్ ప్రమోట్ చేశారు. ప్రముఖ ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్లో పాల్గొన్నారు. దీనికి ఏకంగా 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్స్టాలో మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ జంటగా విరోష్ జోడీ నిలిచింది. ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్కు వరల్డ్ వైడ్గా వచ్చిన రెండో అత్యధిక లైక్స్ ఇవే కావడం విశేషం. దీంతో విజయ్- రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా రణబాలిలో కనిపించనున్నారు. మొదటి ప్లేస్ కూడా వీరిదే..ఈ జాబితాలో మొదటి స్థానం రికార్డ్ సైతం వీరిదే కావడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మాన్యవార్ అనే వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ప్రముఖ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్కు మించిన ఆదరణ విరోష్ జంటకు అందరినీ షాకింగ్కు గురి చేస్తోంది. -
తడబడని తొలి అడుగులు
తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి అంచనాలకూ దొరకని రీతిలో ప్రారంభమై రెండేళ్ల పాటు దాన్నే కొనసాగించి చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన టీవీకే ఏలుబడి మొదలైంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 144 మంది ఓటేయగా, వ్యతిరేకంగా 22 మంది, అయిదుగురు తటస్థంగా ఉండి పోయారు. డీఎంకే, డీఎండీకే, పీఎంకే, బీజేపీలు వాకౌట్ చేశాయి. సభ్యుల ప్రమాణ స్వీకారం మొదలుకొని సమావేశం పొడవునా విజయ్ వ్యవహరించిన తీరు, విశ్వాస తీర్మానంపై చర్చకు జవాబిస్తూ చేసిన ప్రసంగం విమర్శలకు తావీయకుండా ముగియటం గమనించదగ్గది. తమ ప్రభుత్వం సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పటం మద్దతుగా నిలిచిన వామపక్షాలకూ, వీసీకేకూ ఊరటనిచ్చివుంటుంది. విజయ్ అణుకువతో, ఆవేశానికి తావీయని రీతిలో ఉంటూనే చేయదల్చుకున్నది చేస్తారని ఈ సమావేశం రుజువుచేసింది. వ్యక్తిగత జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ను ఓఎస్డీగా నియమించటాన్ని మిత్రపక్షం వీసీకే విశ్వాస తీర్మానం సమయంలో నిలదీసి నప్పుడు విజయ్ భేషజానికి పోకుండా వెంటనే ఆ నియామకాన్ని పునస్సమీక్షిస్తానని ప్రకటించారు. ఆ వెంటనే దాన్ని రద్దుచేసినట్టు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ప్రార్థనాస్థలాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లు వగైరాలకు 50 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండొచ్చన్న నిబంధనను 500 మీటర్లకు సవరించటం, అది వెంటనే అమల్లో కొచ్చి పదులకొద్దీ దుకాణాలు మూతబడటం కూడా జనం మెచ్చే చర్య.విజయ్ రాక ఇప్పటికే ప్రధాన కూటములు, పార్టీల్లో ఊహించని ప్రకంపనలకు దారి తీసింది. దాదాపు ఆరు దశాబ్దాల చరిత్రగల ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు జనం ఆదరణ కరవై దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఎన్నో సంక్షోభాల్ని తట్టుకుని నిలబడ్డ డీఎంకే–కాంగ్రెస్ కూటమి చెల్లాచెదురైంది. అందలం కోసం ఆత్రపడి కాంగ్రెస్ డీఎంకే చెలిమిని వదులుకు పోయిందిగానీ సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలు అదే కూటమిలో కొనసాగుతూనే విజయ్కి మద్దతివ్వక తప్పని స్థితికి చేరుకున్నాయి. అన్నాడీఎంకే చీలి ఆ పార్టీకి చెందిన 47 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది మాజీ మంత్రి షణ్ముగం ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు, మాజీ సీఎం పళనిస్వామికి షాకిచ్చారు. దాంతో టీవీకేకు చిన్న పార్టీల అవసరం నిజానికి ఇప్పటికే తీరిపోయింది. ఎవరిది అసలైన అన్నాడీఎంకే అనే అంశం తేలేసరికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో ఎక్కడా టీవీకే లేదా వ్యక్తిగతంగా విజయ్ ఆరోపణలు ఎదుర్కొనలేదు. ఎవరూ ఎవరితోనూ మాట్లాడకుండానే, గట్టి హామీలు ఇవ్వకుండానే అన్నాడీఎంకే చీలిపోయిందంటే ఎవరూ నమ్మరు. కానీ అదెక్కడా ప్రచారంలోకి రాకపోవటం విజయ్ వ్యూహచతురతకు నిదర్శనం. ద్రవిడ పార్టీలను ఎలాగైనా బలహీనపరచాలని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదలుకొని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకూ చేయని ప్రయత్నమంటూ లేదు. కాంగ్రెస్, బీజేపీలతో అవసరార్థం పొత్తు కుదుర్చుకుంటూనే వాటిని జనానికి చేరువ కానీయకుండా చేయటంలో అన్నాడీఎంకే, డీఎంకేలు ఇన్నాళ్లూ విజయం సాధించాయి. కానీ పార్టీకి ద్రవిడ నామం లేకుండా వచ్చిన విజయ్ సునాయాసంగా ఆ రెండు పక్షాలనూ మట్టికరిపించారు. అలాగని పెరియార్ రామస్వామి వంటివారిని ఉపేక్షించ కుండా నివాళులర్పించారు. ఆయన ఒకరకంగా రాష్ట్ర రాజకీయాల్లో మూడోపక్షానికి అవకాశం ఉన్నదని నిరూపించారు. విజయ్ సినిమా ఇతివృత్తాలు కథానాయకుడు తనకెదురయ్యే అవరోధాలను ఎదుర్కొనటం అనే అంశం చుట్టూ తిరుగుతాయి. చివరగా హీరో విజయం సాధించటంతో అవి ముగుస్తాయి. గత వారం రోజుల పరిణామాలు సైతం అదే ఒరవడిలో వెళ్లాయి. నాటకీయత లేకుండా సాధ్యమైనంత తక్కువ మాట్లాడటం, చేయదల్చుకున్నది తక్షణం చేయటం ఆయనలో కనబడే ప్రత్యేక లక్షణం. దీన్నే కొనసాగిస్తే, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనబడిన జనాకర్షణ కాస్తా త్వరలోనే దృఢమైన పునాదిగా మారి, రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు దోహదపడుతుంది. -
అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
నా పార్టీ నేతలు తప్పు చేసినా సరే.. అసెంబ్లీ విజయ్ విశ్వరూపం
-
విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన అసెంబ్లీ
-
సీఎం కార్యాలయంలో రాథన్ పండిట్ కు కీలక హోదా
-
విజయ్ అన్న థాంక్స్..! మద్యం బంద్ పై విశాల్ రియాక్షన్
-
సీఎంగా విజయ్.. మరి కోలీవుడ్ దళపతి ఎవరు?
ఇన్నాళ్లు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దళపతిగా ఉన్న విజయ్.. ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కేశారు. సినిమాల్లో తన మార్క్ క్రియేట్ చేసిన విజయ్.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. పోటీ చేసిన తొలిసారే సీఎంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందే జన నాయగన్ తన చివరి చిత్రమని స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో కోలీవుడ్లో ఇకపై దళపతి అన్న పేరు వినిపించదు. మరి విజయ్ ప్లేస్ను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ మొదలైంది. విజయ్ సీఎం కావడంతో కోలీవుడ్లో తదుపరి దళపతి ఎవరన్న విషయం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ప్రస్తుత తమిళ హీరోల్లో ఎవరికీ అంతటి స్టార్డమ్ ఉందో మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.తదుపరి దళపతి ఎవరు?విజయ్ తర్వాత కోలీవుడ్లో అంతే రేంజ్లో క్రేజ్ ఉన్న హీరో అజిత్ కుమార్. గతేడాది రెండు సినిమాలతో అలరించిన అజిత్.. ప్రస్తుతం రేసింగ్లో బిజీగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతిగా నిలుస్తారేమో వేచి చూడాల్సిందే. ఇక అజిత్ తర్వాత వరుసలో ధనుశ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరికి విజయ్ రేంజ్లో మాస్ ఇమేజ్ దక్కడం కష్టంగానే అనిపిస్తోంది. శివ కార్తికేయన్ వరుస సినిమాలతో అలరిస్తున్నా.. ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా ముద్ర వేసుకున్నారు. దీంతో విజయ్లా మాస్ ఇమేజ్ దక్కడం అసాధ్యమేనని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతి ఎవరు అవుతారో వేచి చూడాల్సిందే. -
విజయ్ సీఎం.. జన నాయగన్కు ఫుల్ డిమాండ్..!
రాజకీయాల్లో ఎంట్రీకి ముందు దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యలతో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సినిమా త్వరలోనే విడుదల అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ గతంలో రద్దైనట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జన నాయగన్ డీల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలను సంప్రదించినట్లు లేటేస్ట్ టాక్. ఓటీటీ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్తో చర్చలు జరుపుతోందని కోలీవుడ్లో టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ డీల్పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. -
దుబాయ్ విడిచి.. విజయ్ వెంట నడిచి..
వెండితెరపై ‘దళపతి’గా వెలిగిన విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. అయితే ‘తమిళక వెట్రి కజగం’ (టీవీకే) సారథిగా రాజకీయ క్షేత్రంలో కదం తొక్కిన విజయ్ ఎక్కడికి వెళ్లినా, ఏ బహిరంగ సభలో పాల్గొన్నా ఆయన పక్కనే నలుపు రంగు దుస్తుల్లో నిశితంగా గమనిస్తూ కనిపించే ఒక ‘మిస్టరీ మ్యాన్’ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. ఆయనే నయీమ్ మూసా. దుబాయ్లో భారీ వ్యాపార సామ్రాజ్యం ఉన్నప్పటికీ, కేవలం స్నేహం కోసం విజయ్ రక్షణ వలయాన్ని పర్యవేక్షిస్తున్న ఈ మలయాళీ పారిశ్రామికవేత్త ప్రయాణం ఒక సినిమా కథను తలపిస్తోంది.మాహే నుంచి దుబాయ్ వరకు..పుదుచ్చేరి పరిధిలోని మాహేలో జన్మించిన నయీమ్ మూసాకు చిన్నప్పటి నుంచే ఫిట్నెస్, బాడీబిల్డింగ్పై మక్కువ ఎక్కువ. ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లిన ఆయన, అక్కడ కఠిన శ్రమతో తన శరీరాకృతిని మలచుకున్నారు. ఒక చిన్న సెక్యూరిటీ అసైన్మెంట్తో ప్రారంభమైన ఆయన ప్రస్థానం, నేడు గల్ఫ్ దేశాల్లోనే ప్రముఖ భద్రతా సంస్థ అయిన ‘జెండర్ సెక్యూరిటీ’ స్థాపనకు దారితీసింది.గ్లోబల్ స్టార్లకు రక్షణ కవచంనయీమ్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పాప్ సింగర్ జస్టిన్ బీబర్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వంటి హేమాహేమీలు దుబాయ్ వెళ్తే వారి భద్రత బాధ్యత నయీమ్దే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి భారీ క్రీడా వేడుకలకు యూఏఈ ప్రభుత్వం అధికారికంగా నయీమ్ ఏజెన్సీకే భద్రతా ఏర్పాట్లు అప్పగిస్తుంటుంది. ప్రస్తుతం తన వ్యాపారాన్ని భారత్కు విస్తరించి, చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆయన వ్యాపారం కోట్లలో విస్తరించి ఉన్నప్పటికీ, దాని ఖచ్చితమైన విలువ వివరాలు తెలియవు.రాజకీయాల్లోనూ విజయ్ ‘రైట్ హ్యాండ్’విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు కేవలం షూటింగ్లకే పరిమితమైన నయీమ్, టీవీకే స్థాపన తర్వాత విజయ్కు అనివార్య వ్యక్తిగా మారారు. ‘నయీమ్ నా వెంట ఉన్నంత కాలం నా భద్రత గురించి నాకు చింత లేదు’ అని విజయ్ స్వయంగా పేర్కొనడం వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం.ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వం విజయ్కు 'వై' కేటగిరీ భద్రత కల్పించిప్పటికీ, వ్యక్తిగతంగా నయీమ్ ఏర్పాటు చేసే రక్షణ వలయంపైనే దళపతికి గురి. తమిళనాడు రాజకీయ సభల కోసం కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులను నయీమ్ రప్పిస్తుంటారు. ఆధునిక సాంకేతికతను, కట్టుదిట్టమైన క్రమశిక్షణను కలగలిపి ఆయన రూపొందించే భద్రతా వ్యూహాలు అజేయమైనవి. ఆడంబరాలకు దూరంగా, మీడియా వెలుగులోకి రాకుండా కేవలం తన క్లయింట్ భద్రత, గోప్యతకే నయీమ్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. -
విజయ్ చూపగల తేడా ఏమిటి?
సుమారు ఆరు దశాబ్దాల పాటు అవిచ్ఛి న్నంగా సాగిన ద్రవిడ పార్టీల రాజకీయ పరంపరను భంగపరచటం వరకు విజయ్ ప్రతిభ, ప్రభావం కనిపిస్తున్నవే. భవిష్యత్తు వైపు చూసినపుడు ఒక ప్రశ్న ముందుకు వస్తున్నది. తమిళనాడులో సమ సమాజ భావనలు, సంక్షేమ రాజ్య భావనలు దేశ స్వాతంత్య్రానికన్నా ముప్పయి సంవత్సరాల ముందు నుంచే వ్యవస్థీకృత రూపంలో ఏర్పడ్డాయి. అవి కొనసాగుతూనే బలమైన తమిళ జాతీయవాదం కూడా ఇంచుమించు అప్పటినుంచే రూపు తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికారం స్వీకరించిన విజయ్– సమ సమాజం, సంక్షేమం, తమిళ జాతీయవాదం అనే మూడు అంశాలలో చూపగల తేడా ఏమైనా ఉండవచ్చునా?సారాంశంలో ద్రవిడవాదమే!ఇందుకు సమాధానం విజయ్ నాయకత్వాన తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పాలనలో మాత్రమే లభించగలదని వేరే చెప్పనక్కర లేదు. తమిళ సమాజంలో ఈ భావనలు విడదీయలేని అంశాలు. క్రీస్తు పూర్వం నుంచి గల తమ భాషా సాహిత్యాలు, మధ్య యుగాల నాటి వైభవోపేత రాజ్యాలు, వాటి పాలనలు అందుకు తోడై తమిళ జాతి, సంస్కృతులను తీర్చిదిద్దాయి. స్వాతంత్య్రానంతరం రాజకీయ క్రమంలో ద్రవిడ పదం వాడుకలోకి వచ్చి, ఉత్తరాది అనే ఒక ‘ప్రత్యర్థి’ని సృష్టించి ధిక్కారంగా నిలిచింది. ఇపుడు విజయ్ పార్టీ పేరును, చెదురుమదురు వ్యాఖ్యలను, పార్టీ మేనిఫెస్టోను, 10వ తేదీన ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించిన దానిని బట్టి, గతంకన్న తేడాలు ఏమైనా ఉన్నాయనిపిస్తున్నదా? డీఎంకే, అన్నాడీఎంకే అనే రెండు ‘ద్రవిడ’ పార్టీలు ఓడినందున, ద్రవిడ వాదం ఇక ముగిసిపోయిందని, విజయ్ ఆ వాదనకు ముగింపు పలికారనే వ్యాఖ్యలు వెంటనే మొదలయ్యాయి. అవి తొందరపాటు మాటలనాలి. విజయ్ పార్టీ పేరులో ద్రవిడ అనే పదం లేకున్నా తమిళ అనే పదం ఉంది. అక్కడి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రపంచంలో ద్రవిడ–తమిళ పర్యాయ భావనలు. ఒకటి లేక రెండవ దాని మనుగడ లేదు.ద్రవిడ వాదానికి ప్రాణప్రదమైన అంశాలు వేటినీ విజయ్ వదలలేదు. తన ఆరాధ్యులలో పెరియార్ రామస్వామిని చేర్చారు. ద్రవిడ భావజాలంలో సమసమాజం, సంక్షేమం మొదటి నుంచి ఉన్నవి గనుక, అందుకు స్వాతంత్య్రానంతర కాలంలో ప్రధాన ప్రతి నిధి అయిన అంబేడ్కర్ను స్వీకరించారు. తమ చరిత్రలో సమాజం కోసం పాటుపడిన ఇద్దరు మహిళలు వేలు నాచ్చియార్, అంజలై అమ్మాళ్లను ప్రముఖంగా నిలిపారు. దీనంతటి అర్థమేమిటో వేరే చెప్పనక్కర లేదు. పైగా, సంక్షేమ సంబంధమైన పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చిన ఆయన, ఆ విషయాలలో ‘ఎంత మాత్రం రాజీ పడబో’మని ప్రమాణ స్వీకార సందర్భంగా ప్రకటించారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆకలిదప్పుల బాధ తెలుసునని ముక్తాయించారు. సారాంశంలో ఇదంతా ద్రవిడవాదమే.సుపరిపాలన అందేనా?ఇది చాలదనుకుంటే, పెరియార్ రాజకీయ వైఖరిని, ద్రవిడ వాద రాజకీయ సంప్రదాయాన్ని విజయ్ స్పష్టంగానే కొనసాగిస్తు న్నారనుకోవాలి. నిజానికి డీఎంకే లోగడ (1999–2003) కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ భాగస్వామి కాగా, అన్నాడీఎంకే గురించి చెప్ప నక్కర లేదు. విజయ్ రాగల కాలంలో ఏమి చేసేదీ చెప్పలేముగానీ, ప్రచార సమయంలో మాత్రం బీజేపీ తన ‘సైద్ధాంతిక ప్రత్యర్థి’ అని ప్రకటించారు. సెక్యులరిజ విధానాన్ని నొక్కి చెప్పారు. ఇదంతా ఆధునిక పరిస్థితులకు వర్తించే పెరియారిజమే అవుతుంది. తన ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతుపై ఆధారపడి ఉన్నందుకు మాత్రమే విజయ్ ఇట్లా మాట్లాడుతున్నారనలేము. ఆయన మౌలిక విధానమే అదయినట్లు ఎన్నికల ప్రచారంలోనేగాక, రెండేళ్ల ముందు పార్టీని స్థాపించినప్పటినుంచే అర్థమైంది.పరిపాలనకు సంబంధించి విజయ్ చేసిన సూత్రీకరణలురెండున్నాయి. ఒకటి సమర్థమైన సుపరిపాలన, రెండు అన్ని వర్గాలకు మేలు కలిగే సంక్షేమం. ఈ రెండూ ద్రవిడ పార్టీల విధానాలలో ఉన్నవే. ఆచరణకు వచ్చే సరికి సుపరిపాలన క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. అవినీతి పెచ్చు పెరిగింది. డీఎంకే అయినా, అన్నాడీఎంకే అయినా. అన్ని వర్గాల మేలన్నది దళితులకు అంతగా వర్తించలేదన్న విమర్శ చాలా కాలం నుంచే ఉంది. విడుదలై చిరుతగళ్ కచ్చి (వీసీకే) కొంత కాలంగా డీఎంకే కూటమిలో ఉన్నా, ఇపుడు విజ య్కు మద్దతు ప్రకటించినా ఆ పార్టీ మూలాలు ఈ విమర్శలోనే ఉన్నాయి. అటువంటి వివక్ష తమ పాలనలో ఉండబోదన్నది కొత్త ముఖ్యమంత్రి ఇస్తున్న హామీ. ఈ వివక్షల మూలాలు తమిళ గ్రామీణ వ్యవసాయిక వ్యవస్థలో, కుల వ్యవస్థలో ఉన్నందున, ఈ సమస్యను గ్రామీణ నిర్మాణాలలో గానీ, పట్టణాలు కేంద్రంగా నడిచే ఆధునిక ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ వ్యవస్థలలో గానీ విజయ్ ఏ విధంగా సరిదిద్దవచ్చునన్నది ఆయన శ్రద్ధపై, చతురతపై ఆధార పడుతుంది.అసలు సవాళ్లు హామీలే!సుపరిపాలనకు గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ను (1954–63) విజయ్ చూపటంలో ధైర్యం ఉంది. ప్రశంసించదగ్గదే గానీ, ద్రవిడ ఉద్యమం అట్లుండగా సంక్షేమ విధానాలకు పేరుబడిన అణ్ణాదురైను ముందుకు తేకపోవటం ఆశ్చర్యకరం. పార్టీ ఏదైనా కామరాజ్ వలెనే అణ్ణాదురై తమిళనాడు చరిత్రలో మార్గదర్శ కుడయ్యారు. అక్కడ ఫెడరలిజాన్ని స్థిరపరచి దీర్ఘకాలికం చేసింది కూడా ఆయనే. ప్రగతిశీలం కాదనుకున్న అంశాలపై తన గురువు పెరియార్తో విభేదించి సాగారు. తర్వాత డీఎంకే చీలి అన్నాడీఎంకే ఏర్పడినా రెండు పార్టీలకూ ఆరాధ్యుడయ్యారన్నది విజయ్కు తెలియదనుకోలేము.మౌలిక సూత్రాలపై, సిద్ధాంతాలపై ఎంతమాత్రం రాజీపడబోనని, రాజకీయాల మౌలిక బలమే అదని ఆలోచింపజేసే విధంగా ప్రకటించిన తమిళ జెన్–జీ తార విజయ్కు పెద్ద పరీక్ష మాత్రం మేనిఫెస్టోలోని ఆర్థిక సంబంధమైన హామీల అమలులో ఎదురు కానున్నది. ఆ హామీలలో ఎన్నికలలో గెలిచేందుకు అవసరమైన పోటాపోటీ పాప్యులిజం తక్కువ లేదు. వాటి అమలుకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని గ్రహించినందువల్ల మొదటి రోజునే గత ప్రభుత్వం మిగిల్చిన రుణభారమంటూ మాట్లాడి, హామీలు క్రమక్రమంగా తప్పక అమలు చేయగలమనీ, తనను నమ్మాలనీ ప్రజలను కోరారు. అదే విషయమై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక హెచ్చరిక బాణాన్ని కూడా వెంటనే వదిలారు మరి.ఈ నిర్వచనాలు, సాధకబాధకాలు ఎట్లున్నా, ద్రవిడ వాదాన్ని లేదా తమిళవాదాన్ని వర్తమాన కాలానికి అవసరమనుకున్న రీతిలో మెరుగులు దిద్ది గత పరిపాలనలకు తన పాలనకు గల తేడా ఏమిటో విజయ్ నిరూపించగలరని ఆశించాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఒకప్పుడు ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు మారిపోయిన సీన్
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరం నాయకుల యుగం ప్రారంభమైంది. సినీ నటుడు విజయ్ తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయనకు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల మద్దతుతో సీఎం కుర్చీని అధిరోహించారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించనున్నారు. తొలుత సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెపాక్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయిదేళ్ళ క్రితం వరకూ చూస్తే సీఎంగా స్టాలిన్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా పళని స్వామి వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆ చాన్స్ పళనిస్వామికి లేకుండా పోయింది.ఎన్నికల్లో ఓడిపోయిన స్టాలిన్ స్థానంలో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. 74 సీట్లు గెలుచుకున్న డీఎంకే కూటమికి ఆయన నాయకత్వం వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు అదనపు బలం. విజయ్ 52 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. ఉదయనిధి 49 ఏళ్ల వయసులోనే ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఇద్దరూ యువకులే కావడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరాన్ని ప్రజలు చూడబోతున్నారు. కాగా ఉదయనిధి పలు సినిమాలకు నిర్మాతగా, హీరోగా సినీ రంగంలో గుర్తింపు పొందారు. 2008లో ఆయన నిర్మించిన 'కురువి' చిత్రంలో విజయ్ హీరోగా నటించారు. ఆ చిత్రంలో త్రిష కథానాయిక. ఆ రకంగా విజయ్, ఉదయనిధి మధ్య రెండు దశాబ్దాల క్రితమే స్నేహం ఉంది. అయితే ఇప్పుడు ఆ స్నేహం రాజకీయ వేదికపై ప్రత్యర్థిత్వంగా మారింది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. విజయ్ ప్రమాణం చేస్తున్నప్పుడు ఉదయనిధి ఆయన వైపు చూడలేదు. కానీ ఉదయనిధి ప్రమాణం చేస్తుండగా విజయ్ మాత్రం ఆయనను చూసి ఓ చిరునవ్వు నవ్వారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, విజయ్కు రాజకీయ అనుభవం లేకపోవడం ఒక సవాల్గా మారవచ్చు. కానీ ఉదయనిధి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రతిపక్షాన్ని బలంగా నడిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకపై అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి మధ్య ఢీ తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. -
ఒక్క సినిమాకు రూ.200 కోట్లు.. మరి సీఎంగా నెల జీతమెంత?
సినిమాల్లో సక్సెస్ అయిన హీరో విజయ్.. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించారు. పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం అయ్యారు. తమిళనాడు ఎన్నికల్లో మెజార్టీ మార్క్ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు ఆయన నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ చిత్రం సెన్సార్ వివాదాలతో రిలీజ్ కాలేదు. ఈ మూవీకి దళపతి ఏకంగా రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపించింది.కానీ ఇప్పుడు విజయ్ హీరో కాదు.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక్క సినిమాకు రూ.200 కోట్లు తీసుకునే విజయ్.. సీఎంగా ఎంత సంపాదిస్తారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రజల సొమ్మును తాను తినని స్పష్టం చేసిన విజయ్.. సీఎంగా తనకొచ్చే నెల జీతంతోనే సర్దుకుపోతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్కి నెలకు రూ.2,05,000 జీతం అందుకోనున్నారు. సినిమాల్లో ఒక్క సినిమాకే కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విజయ్.. ఇకపై ఏడాది కేవలం రూ. 34.2 లక్షల జీతం మాత్రమే ఆయనకు దక్కనుంది. అయితే వీటితో పాటు ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్, జెడ్ ప్లస్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన విజయ్.. ఇప్పటికే సినిమాలు చేయనని చెప్పేశారు. తన చివరి మూవీ జన నాయగన్ అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
తమిళనాడు సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అగ్రనటుడు విజయ్ ఆదివారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అదే ఊపులో మేనిఫెస్టోలో కీలక మూడు హామీల అమలును ప్రకటించారు. తొలి సంతకాన్ని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫైలుపై చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన దస్త్రాలపైనా సంతకాలు పెట్టారు. ఇక.. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసే టీంను తన పర్యవేక్షణలోనే ఉంచుకోనున్నట్లు విజయ్ ఇవాళ చెప్పారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసిన కాసేపటికే వరుస సమావేశాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యరుస్తూ ప్రతిపక్ష నేతల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో భేటీ అయ్యారు. స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే స్టాలిన్తో విజయ్ భేటీ అయ్యారని టీవీకే వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలోస్టాలిన్తో విజయ్ సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఎండీఎంకే నేత వైకో నివాసానికి వెళ్తారని సమాచారం. డీఎంకే కూటమిలో ఉన్న ఎండీఎంకే నాలుగు స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు నెగ్గలేకపోయింది. వీళ్లతో పాటు పలువురు నేతలను కలుస్తారని తెలుస్తోంది. అయితే.. ఇది మర్యాదపూర్వక భేటీనేనని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలను కలుస్తారా? ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పళని ఇంటికి వెళ్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇక.. తమిళనాడులో కొత్త అసెంబ్లీ ఇవాళ కొలువు దీరింది. నూతనంగా ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో శాసన సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ని డీఎంకే ప్రకటించింది. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 13న టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నీ సజావుగా సాగితే.. 17న అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. -
విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్
తమిళనాడు ముఖ్యమంత్రిగా హీరో విజయ్.. ఆదివారం ఉదయం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు విజయ్ భార్య పిల్లలు రాలేదు. తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. వీళ్లతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆకుపచ్చని చీరలో దర్శనమిచ్చింది. విజయ్ మాట్లాడుతున్నప్పుడు ఈమె ఎమోషనల్ అవుతూ కనిపించింది. ఇకపోతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్రిష పెట్టిన తొలి పోస్ట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది.విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పట్టుచీర కట్టుకొచ్చిన త్రిష.. ఈ చీరని ఎంతో ప్రేమతో డిజైన్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ ఫొటోలని షేర్ చేసి 'ప్రేమ ఎప్పుడూ గొప్పదే' అనే క్యాప్షన్ పెట్టింది. ఇది విజయ్ని ఉద్దేశించే పెట్టిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.స్టార్ హీరో విజయ్, త్రిష కలిసి తమిళంలో పలు సినిమాలు చేశారు. అయితే విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకోవడానికి త్రిషనే కారణమనే కామెంట్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే విజయ్-త్రిష కలిసి కనిపించడం, ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష.. విజయ్ ఇంటికి వెళ్లడం, తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవడం లాంటివి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan)🥺❤️🫂 @trishtrashers getting emotional during CM Joseph Vijay sir’s speech was truly a heart-touching moment ❤️🥹#trishakrishnan #Trisha #vijay #cmvijay #thalapathy #trishaforever #southqueentrisha #ladysuperstartrisha #wonderingwomen pic.twitter.com/3Ofr1zDl4P— Trisha😻Sushma (@Trishkrish_583) May 10, 2026 -
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్స్టాగ్రామ్లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
విజయ్ విజయానికి పనిచేసిన సీక్రెట్ టీమ్
-
ఐయామ్ హ్యాపీ.. నా మద్దతు ఎప్పటికీ విజయ్ కే
-
సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్
కోలీవుడ్ హీరో విజయ్కు హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలిపింది. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం స్వీకారం సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. విజయ్కు నా మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని త్రిష వెల్లడించింది. చెన్నైలోని నెహ్రు స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి హీరోయిన్ త్రిష కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది.విజయ్తో త్రిష రిలేషన్..ఎన్నికల ముందు నుంచే త్రిష- విజయ్ రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. విజయ్ భార్య సంగీత కూడా విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి జంటగా పెళ్లికి హాజరుకావడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే త్రిష బర్త్ డే రోజున ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్ అత్యధిక సీట్లు గెలవడంతో ఆనందం మరింత రెట్టింపైంది. త్రిషకు విజయ్ బర్త్ డే గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరింత కాలం వేచి చూడాల్సిందే. -
సీఎంగా విజయ్.. రజనీకాంత్-కమల్ సినిమా ఆగిపోతుందా?
ఏదైనా ఒక రంగంలో ఒక ఘటన జరిగితే దాన్ని ఇతర విషయాలకు ఆపాదిస్తూ సందేహాలను వ్యక్తం చేయటం జరుగుతుంటుంది. అలాంటి సందేహాలు ఇప్పుడు ఒక మల్టీ స్టార్ చిత్రం గురించి వ్యక్తం అవుతున్నాయి ఆ చిత్రం ఏమిటన్నది చాలామంది గెస్ చేసే ఉంటారు. కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించిన మల్టీ స్టార్ చిత్రం గురించి ప్రస్తుతం వ్యక్తం అవుతున్న ఆ సందేహాలు. వీరి కాంబినేషన్లో నెల్సన్ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఇన్బన్ ఉదయనిధి భారీ బడ్జెట్లో నిర్మించనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలుపడిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై చివరి వారిలో గానీ ఆగస్టు ప్రథమార్థంలో గానీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా ప్రస్తుత రాజకీయ రాజకీయ పరిస్థితులే ఈ చిత్రంపై సందేహాలు నెలకొనడానికి కారణం అనే భావన వ్యక్తమవుతోంది. తమిళనాడులో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. మరో విషయం ఏమిటంటే విజయ్ నటించిన జననాయకన్ చిత్రం విడుదలకు పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వారసుడు ఇన్బన్ ఉదయనిధి ఇప్పుడు కమలహాసన్, రజినీకాంత్ హీరోలుగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్కు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రసక్తే లేదని, ఇతరత్రా సహకారాలకు సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంటుందా అన్నదే ప్రశ్న. డీఎంకే పార్టీకి మద్దతు దారుడిగా నటుడు రజనీకాంత్, అదే పార్టీకి సానుకూలపరుడిగా కమల్ వ్యవహరిస్తుండటం ఇందుకు ఒక కారణం. అయితే వీరిద్దరూ టీవీకే పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారన్నది గమనార్హం. అంతేకాకుండా నటుడు, మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రజినీకాంత్ కమలహాసన్ కలిసి నటించిన చిత్రంపై రేకెత్తిస్తున్న సందేహాలు వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సీఎంగా విజయ్.. సందడి మొత్తం త్రిషదే
ఎట్టకేలకు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారరం చేశాడు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇందుకు వేడుకైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరికంటే స్పెషల్ అట్రాక్షన్గా మాత్రం త్రిష నిలిచింది.పద్దతిగా చీరలో.. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష కచ్చితంగా వస్తుందని అంతా భావించారు. అనుకున్నట్లే కాస్త ముందుగానే త్రిష తన తల్లితో కలిసి కార్యక్రమానికి హాజరైంది. పద్దతిగా చీరకట్టులో త్రిష వచ్చిన త్రిష.. పార్టీ కార్యకర్తలను, అభిమానులను నవ్వుతూ పలకరించింది. అప్పటికే వేదిక దగ్గరకు వచ్చిన విజయ్ తల్లిదండ్రులను కలిసింది. విజయ్ తల్లి..త్రిషను హత్తుకొని పలకరించింది. స్టేజ్ ముందు ఏర్పాటు చేసిన మొదటి వరుసలోని కుర్చీల్లో విజయ్ తల్లిదండ్రులతో కలిసి త్రిష కూర్చుంది. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో త్రిష ముఖం సంతోషంతో మరింత మెరిసిపోయింది.ಗ್ಯಾಂಡ್ ಲುಕ್ ನಲ್ಲಿ @actorvijay ಅವರ ಪ್ರಮಾಣವಚನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನಟಿ ತ್ರಿಷಾ#Trisha #Oath #Vijay #tamilnaduelectionresults2026 pic.twitter.com/jySoXvqb3d— Anand Hunashal (@ana_hunashal) May 10, 2026త్వరలోనే పెళ్లి?విజయ్-త్రిష రిలేషన్లో ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరు మాత్రం ఆ విషయాన్ని ఇప్పటివరకు అధికారింగా ప్రకటించలేదు. కానీ విజయ్ సతీమణి సంగీత విడాకులు కోరుతూ.. ఓ నటితో తన భర్త రిలేషన్లో ఉన్నారని ఆరోపణలు చేసినప్పటి నుంచి త్రిష పేరు బయటకు వచ్చింది. సంగీత ఆరోపణలను ఇద్దరూ స్పందించకపోవడం.. పైగా ఓ ఫంక్షన్కి కలిసి వెళ్లడంతో పరోక్షంగా రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాడు. ఇక త్వరలోనే త్రిషను పెళ్లి చేసుకొని తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించాలని విజయ్ భావిస్తున్నాడట. కొన్నాళ్ల పాటు పాలనపై దృష్టి పెట్టి.. అంతా సెట్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి వీరిద్దరు వివాహ బంధంలోకి ఎప్పుడు అడుగుపెడతారో చూడాలి. Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/VmvDUqIjIq— ANI (@ANI) May 10, 2026 -
ఎట్టకేలకు 'విజిల్' మోత
సాక్షి, చెన్నై: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్ధ నిశ్శబ్ద వాతావరణంలో విజయ్ విజిల్ ఎట్టకేలకు గట్టిగా మోగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఐదు పార్టీలు అందించిన మద్దతుతో చివరకు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తొలిసారిగా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీంతో నేటి(ఆదివారం) ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 234 మంది సభ్యులున్న శాసనసభలో కనీస మెజారిటీ(118)ని మించి ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో సఫలీ కృతుడుకావడంతో విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని శనివారం తమిళనాడు లోక్భవన్ ఒక అధికారిక ప్రకటన విడుదలచేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ను గవర్నర్ ఆహ్వానించారు. మే 13వ తేదీ లేదా అంతకన్నాముందే బలనిరూపణకు సిద్ధంగా ఉండాలని అధికారిక ఉత్తర్వులో విజయ్ పార్టీకి గవర్నర్ సూచించారు. అధికారిక ఉత్తర్వు వార్త తెలిసి తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. తమిళనాడు వ్యాప్తంగా టీవీకే మద్దతుదారులు పెద్దమొత్తంలో బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచి ఆనందాన్నీ పంచుకున్నారు. మద్దతుతో ముందుకు... తొలుత ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ మాత్రమే టీవీకే పార్టీకి మద్దతు పలకగా తర్వాత సీపీ(2)ఎం, సీపీఐ(2) వెంట నడిచాయి. శనివారం విదుథలై చిరుౖథెగల్ కట్చి(వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) సైతం కలిసివస్తామని హామీ ఇవ్వడంతో 107 ఎమ్మెల్యేలున్న టీవీకే పార్టీకి మొత్తం బలం ఒకేసారి 120కి పెరిగింది. వెనువెంటనే గవర్నర్కు మేజిక్ ఫిగర్ అంశాన్ని తెలియజేసేందుకు విజయ్ లోక్భవన్కు బయల్దేరగా అపాయింట్మెంట్ చివరినిమిషంలోనూ ఖరారుకాకపోవడంతో మార్గమధ్యంలోనే నిరాశగా వెనుతిరిగారు. పదేపదే తిప్పుతూ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా విజయ్ను వేధిస్తున్నారని వెంటనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్ అన్నారు. నిష్క్రమించిన కొద్దిసేపటికే సాయంత్రం ఆరుగంటల తర్వాత గవర్నర్ నుంచి విజయ్కు పిలుపు వచ్చింది. ఈసారి కాంగ్రెస్ తమిళనాడు రాష్ట్ర చీఫ్ కె.సెల్వపెరుంథగై, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం, సీపీఎం ముఖ్య నేత బాలకృష్ణన్, వీసీకే ముఖ్యనేతలతో కలిసి గవర్నర్తో సమావేశమయ్యారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని స్పష్టంచేస్తూ జాబితాను గవర్నర్కు విజయ్ బృందం అందజేసింది. గంటకుపైగా సుదీర్ఘ భేటీ తర్వాత విజయ్ మెజార్టీని అంగీకరిస్తూ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను గవర్నర్ తొలగించారు. తమిళనాడు తదుపరి సీఎంగా మీరే ఉండాలంటూ సంబంధిత లేఖను విజయ్కు గవర్నర్ అందజేశారు. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి శ్రీకారం చుట్టినట్లయింది. విజయ్ సారథ్యంలోని ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు వీసీకే, ఐఎంయూఎల్ తెలిపాయి. కానీ తాము ఇంకా డీఎంకే సారథ్యంలోని కూటమిలోని కొనసాగుతామని, టీవీకే సర్కార్కు బయటి నుంచి మద్దతు ఇస్తామని వీసీకే ప్రకటించడం గమనార్హం. వీసీకేతో మారిన పరిణామాలు సీపీఎం, సీపీఐలు అధికారికంగా మద్దతు ఇచ్చినా, వీసీకే నేత థోల్ తిరుమావళవన్ నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. కేరళకు గవర్నర్ వెళ్లిపోతున్నట్లు సమాచారం రావడంతో మెజార్టీ నిరూపణ, ఆదివారం ప్రమాణస్వీకారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే హఠాత్తుగా వీసీకే చీఫ్ వైఖరిలో మార్పువచ్చింది. రాష్ట్రపతిపాలన వంటి ప్రమాదంలేకుండా రాష్ట్రంలో స్థిరప్రభుత్వం ఏర్పడాలనే సుదుద్దేశంతో విజయ్కు మద్దతు ఇస్తానని తిరుమావళవన్ ప్రకటించడంతో పరిణామాలువేగంగా మారాయి. రెండు స్థానాలున్న వీసీకే మద్దతుతో టీవీకే బలం మరింత పెరిగింది. తర్వాత చిట్టచివరకు ఐయూఎంఎల్ సైతం తమ ఇద్దరు ఎమ్మెల్యేలు మీతోనడుస్తారని మాట ఇవ్వడంతో టీవీకే కీలక మేజిక్ ఫిగర్ను దాటింది. తర్వాత గవర్నర్ దగ్గరకు వెళ్లడం, ఇప్పటికే టీవీకే శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యానని విజయ్ చెప్పడం, గవర్నర్ ఆమోదం చకచకా జరిగిపోయాయి. అయితే మంత్రివర్గ కేటాయింపులో వీసీకే గట్టిగా పట్టుబట్టవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఐదు పార్టీల మద్దతుతో ఏర్పడుతున్న ప్రభుత్వంలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఏ పార్టీ నేతలకు కీలక శాఖలు అప్పగిస్తారనే ఇంకా చిక్కుముడిగానే ఉంది. ప్రమాణస్వీకారానికి రాహుల్గాంధీ రాక నేడు చెన్నైలో జరిగే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సీఎంగా ప్రమాణంచేయబోతున్న విజయ్కు రాష్ట్ర కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య నేతలకు మంత్రి పదవులు! టీవీకే ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్ద అట్టిపెట్టుకుని పార్టీ కచ్చినర్ సెంగొట్టయన్కు ప్రజా పనులు, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్కు మునిసిపల్ శాఖ, పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ, పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్కు విద్యుత్, పార్టీ ముఖ్య నేత అరుణ్ రాజ్కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు శాఖ, పార్టీ కోశాధికారి వెంకటరామన్కు పాఠశాల విద్యాశాఖ, రాజ మోహన్కు ఆది ద్రావిడ సంక్షేమం, ముస్తఫాకు మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే విధంగా తొలి జాబితా సిద్ధమైనట్టుగా తమిళనాడు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్కు ఒక మంత్రి పదవి అప్పగిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రోటెం స్పీకర్ నియామకం తర్వాత బల నిరూపణకు విజయ్ వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది. అంతకుముందు అమ్మ మక్కల్మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) ఏకైక ఎమ్మెల్యే ఎస్.కామరాజ్ సైతం తమకు మద్దతిస్తున్నారని టీవీకే తెలిపింది. ఆయన మద్దతిచ్చే లేఖ ఫోర్జరీది అని ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఈ మేరకు గుండీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దినకరన్ ఆరోపణలను టీవీకే కొట్టిపారేసింది. కామరాజ్ స్వయంగా రాసిన మద్దతు లేఖ వీడియోను టీవీకే బహిర్గతంచేసింది. -
విజయ్ కి అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్
-
సినిమాకు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు..!
విజయ్.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. అంటే ఇప్పుడు రియల్ హీరో. అంతుకుముందు రీల్ హీరో. సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు. ఇప్పుడు అదే ఆయన్ను సీఎం పీఠంవైపు నడిపించింది. రజినీకాంత్ లాంటి వారే రిస్క్ చేయలేని చోట.. విజయ్ ఒక అడుగు ముందుకేసి మరీ సక్సెస్ కొట్టాడు. ధైర్యమే సక్సెస్కు పునాది అనే విషయాన్ని విజయ్ నిరూపించారు. అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేలు మాత్రమే ఎప్పట్నుంచో రాజ్యమేలుతున్న చోట. ఒక గట్టిదెబ్బ కొట్టాడు. కొత్త పార్టీతో తొలి అడుగు వేసేటప్పుడు ప్రభుత్వ ఏర్పాటు వరకూ వెళ్లడం అంత చిన్న విషయం కాదు. అలాంటిది విజయ్ చేసి చూపించాడు. ఏదో 60 నుంచి 70 సీట్లు అని అంచనా వేసిన చోట విజయ్.. ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. మొత్తం 108 స్థానాల్లో విజయ్ భేరీ మోగించి తన సత్తా చూపెట్టాడు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్య్యే మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో విజయ్ ఆగిపోవడంతో తీవ్ర అనిశ్చిత నెలకొంది. ఫలితంగా రెండు, మూడు సీట్లు సాధించిన పార్టీలకు డిమాండ్ పెరిగిపోయింది. దీనిపై వరుసగా ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచీ హైడ్రామా నడుస్తూనే ఉంది. ఒకసారి చిన్న పార్టీల మద్దతు అని, కాసేపు కాదనే డ్రామానే నడిచింది. దాంతో వరుసగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం, అక్కడ పూర్తి సభ్యుల మద్దతు లేదనడం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మూడుసార్లు గవర్నర్ను విజయ్ కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడలేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు వీసీకే, ఐయూఎంలు తాము మద్దతు ఇస్తున్నట్లు లేఖలు ఇవ్వడంతో మరొకసారి గవర్నర్ను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు గవర్నర్ అపాయింట్మెంట్..అయితే నాల్గోసారి అపాయింట్మెంట్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. కాసేపు గవర్నర్ అపాయింట్ ఇవ్వలేదన్నారు. ఆయన కేరళ పర్యటనకు వెళుతున్నారనేది మొదటి సారాంశం. దాంతో విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి మరింత సమయం పడుతుందా? అని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నడుమ గవర్నర్ తన కేరళ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. విజయ్కు అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గవర్నర్ మనసు మార్చుకుని అపాయింట్మెంట్ ఇవ్వడంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లే. ఇన్ని టేకులు సినిమాల్లో కూడా తీసుకుని ఉండడు..తమిళనాడులో ప్రముఖ హీరోల్లో ఒకరైన విజయ్.. సినిమా చేసేటప్పుడు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా మనిషి కదా.. ఓపిక ఎక్కువే ఉంటుంది. టేకులు తీసుకోవడం విజయ్కు అలవాటే. అదే ఇప్పుడు జరుగుతుందని అనేవారు కూడా ఉన్నారు. రియల్ లైఫ్లో టేక్లు ఇలానే ఉంటాయని, ఇంత హైడ్రామా నడుమ విజయ్ కూడా మనసులో ఇదే అనుకుని ఉంటాడని అంటున్నారు. టేకాఫ్ అయ్యే ముందు ఈ టేకులను పెద్దగా పట్టించకోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.సినిమా పరంగా టేకులు అంటే ఒకే సందర్భాన్ని పదే పదే చేయడం. ఇప్పుడు అదే విజయ్ నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంది. విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నాటి నుండి ఇదే జరుగుతూ వస్తోంది. ఒకే సందర్భం.. గవర్నర్ను విజయ్ మళ్లీ మళ్లీ కలవడం. దీనికి ఎప్పటికి ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) ముగింపు పడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ కేరళ పర్యటన రద్దు నేపథ్యంలో ఆ టేక్కు కాస్త క్లియరెన్స్ వచ్చింది. ఫలితంగా విజయ్ సీఎం టేక్ రేపో, మాపో ఓకే అవ్చొచ్చు. -
విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ అన్నట్లు తయారైంది. లేటెస్ట్ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ 107 సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 11 సీట్లు అవసరమున్న నేపథ్యంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. విజయ్ పలుమార్లు గవర్నర్ని కలుస్తున్నా ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. మరోవైపు విజయ్-త్రిష బంధం గురించి సోషల్ మీడియాలోనూ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి రాఖీ సావంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్)'నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి త్రిష నాకు తెలుసు. ఎంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చింది. విజయ్తో కలిసి పనిచేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడితో ఒక్క పాటైనా చేయాలని కలలుకన్నాను. కానీ ఛాన్స్ రాలేదు. కనీసం విజయ్-త్రిష మెహందీ వేడుకలో అయినా డ్యాన్స్ చేస్తాను. పెళ్లి చేసుకుంటే ఇద్దరినీ ఒకేసారి కలిసి ఫొటో దిగుతాను' అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.ముఖ్యమంత్రి అయ్యే పనిలో విజయ్ కిందామీద పడుతుంటే రాఖీ సావంత్ మాత్రం త్రిషని అతడు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యే పనిలో ఉంది. ఇప్పుడే కాదు గతంలో బిగ్బాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే దానిపై కామెంట్ చేస్తూ ట్రెండ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా విజయ్-త్రిషపై అలానే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.(ఇదీ చదవండి: నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి) -
టీవీకే సర్కార్ ఏర్పాటుపై ట్విస్ట్.. పళనిస్వామి సంచలన పోస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్నాయి. ఇప్పటికి మద్దతు లెక్కలు తేలలేదు. విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామి పోస్ట్ వైరల్గా మారింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. పళనిస్వామి కీలక పోస్ట్తో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి అభినందనలు అంటూ ఎడప్పాడి పళనిస్వామి ట్వీట్ చేశారు. దీంతో విజయ్తో వీసీకే పొత్తు ఖాయమైందంటూ ప్రచారం జరుగుతోంది.తమిళనాడు ఎన్నికల తర్వాత ప్రతిష్టంభన ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్న తరుణంలో పళనిస్వామి వ్యూహాత్మక పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్కు అవసరమైన మద్దతు లభించిందా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఏ పార్టీ పేరునూ నేరుగా ప్రస్తావించకుండానే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న పార్టీకి పళనిస్వామి అభినందనలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి కొద్దిగా దూరంలో నిలిచింది. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో ఈపీఎస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నివారించడానికి.. అలాగే బీజేపీ పరోక్ష జోక్యాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, సీపీఐ, CPI(M) పార్టీలు ఇప్పటికే విజయ్కు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు అందరి దృష్టి తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే (విడుతలై చిరుతైగల్ కట్చి) పార్టీపై పడింది. ఆ పార్టీ తీసుకునే నిర్ణయమే విజయ్ మెజారిటీ మార్కును దాటడానికి అత్యంత కీలకం కానుంది.తెరవెనుక విజయ్కు అవసరమైన పూర్తి మద్దతు లభించిందనే బలమైన నమ్మకం విపక్ష కూటమిలో వ్యక్తమవుతోందని.. అందుకే పళనిస్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు రోజులుగా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతోంది. వీసీకే పార్టీ తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
కేవలం 2 సీట్ల కోసం విజయ్ ను.. రంగంలోకి దిగిన KA PAUL
-
తమిళనాడులో హై డ్రామా VCK చీఫ్ తో విజయ్ కీలక భేటీ
-
త్రిష ఆశలు గల్లంతేనా?
తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని సంచలనానికి తెర తీసినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం టీవీకే అధినేత విజయ్కు పూటకో తలనొప్పి ఎదురవుతోంది. ఫలితాలు వెల్లడై ఐదు రోజులు గడుస్తున్నా.. సీఎంగా ప్రమాణం చేయకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. పూర్తి బలం(118)తో రావాలంటూ గవర్నర్ తేల్చి చెప్పేయడంతో మద్దతు కూడగట్టే పనిలో మునిగిపోయారు. ఈలోపు.. మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. విజయ్కు గతంలో పలువురు నటీమణులతో సంబంధాలు ఉన్నట్లు ఉధృతంగా ప్రచారం జరిగింది. అయితే వాటిని ఆయనో, అవతలి తారలో కొట్టిపారేస్తూ వచ్చారు. ఎన్నికలకు కొద్దిరోజులు ముందు.. నటి త్రిషతో ఆయన ప్రైవేట్ టిప్కు వెళ్లడం.. చిన్న ‘క్లూ’తో ఆ విషయం బయటకు రావడంతో తమిళనాట సంచలన చర్చ నడిచింది. ఈలోపు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడంతో ఆ బంధం అఫీషియల్గానే బయటపడింది. ఆపై..విజయ్తో కలిసి ఓ వివాహ వేడుకకు త్రిష హాజరు కావడం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడే ఆమె పుట్టినరోజు కావడం.. ఫలితాల్లో విజయ్ విక్టరీ.. ఆమె స్వయంగా ఇంటికి వెళ్లి విజయ్ను అభినందించడం.. ఇటు త్రిషకు బర్త్డే విషెస్ చెప్పే క్రమంలో తారాలోకం విజయ్ ప్రస్తావన తేవడం.. వెనువెంట చర్చనీయాంశాలుగా మారాయి. ఒకవైపు వీళ్ల వ్యక్తిగత జీవితం గురించి చర్చ నడుస్తున్న వేళ.. అనూహ్యంగా త్రిష రాజకీయ అరంగేట్రం టాపిక్ తెరపైకి వచ్చింది.విజయ్ అత్యధిక మెజారిటీతో పెరంబూర్లో గెలిచారు. అదే సమయంలో తిరుచ్చి ఈస్ట్లోనూ విజయం సాధించారు. రెండింటిలో తిరుచ్చి ఈస్ట్కే ఆయన రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు వెల్లడించాయి. అయితే త్రిష టీవీకేలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని.. విజయ్ ఖాళీ చేసే స్థానంలో నటి త్రిషను పోటీ చేయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రతిపాదన టీవీకే పార్టీ సమావేశంలోనూ జరిగిందని.. ఆమెకు ఏకంగా డిప్యూటీ సీఎం చేయబోతున్నారనే మరో గాలి వార్త చక్కర్లు కొట్టింది.అయితే త్రిషకు రాజకీయాలంటే ఇష్టమే. గతంలో ఏకంగా సీఎం అవ్వాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రకటించారు. అందుకు సంబంధించిన క్లిప్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేకాదు.. విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఆయనకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. వీటికి తోడు నాలుగు పదుల వయసులో ఉన్న త్రిషకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె దాదాపుగా రాజకీయాల వైపు వెళ్లవచ్చని అంతా భావించారు.కానీ, ఆమెకు నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీకి సంఖ్యా బలం తక్కువగా ఉంది. దీంతో.. చిన్న పార్టీల మద్దతు కోరారు. దళిత వాదంతో పుట్టికొచ్చిన విడుదల చిరుతైగళ్ కట్చి పార్టీ ఈ ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గింది. వామపక్షాలకు దగ్గరగా ఉండడంతో.. ఈ పార్టీ కూడా విజయ్కు షరతుల్లేకుండా బయటి నుంచి మద్దతు ఇవ్వొచ్చని అంతా భావించారు. కానీ, ఆఖరి నిమిషంలో వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ పెద్ద మెలికే పెట్టారు.తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, తన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని, దళిత సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది వీసీకే. వీటితో పాటు విజయ్ వదిలేసే తిరుచ్చి ఈస్ట్ను కూడా తమకే వదిలేయాలని టీవీకే ముందు మొత్తం నాలుగు డిమాండ్లు ఉంచింది. వీటిలో మంత్రి పదవితో పాటు ప్రత్యేక చట్టం డిమాండ్లకు విజయ్ ఇప్పటికిప్పుడు సుముఖంగానే ఉన్నట్లు.. మిగతా రెండింటి విషయంలోనే ఆయన తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీసీకే మద్దతు టీవీకేకు ఎంతో కీలకం. ఒకవేళ.. మిగతా రెండు డిమాండ్లకు గనుక విజయ్ అంగీకరిస్తే త్రిష ఆశలు గల్లంతైనట్లేనన్న చర్చ ఇటు తమిళ రాజకీయాలు, అటు సినీ రంగంలోనూ జోరుగా నడుస్తోంది. -
టీవీకేకు VCK కండిషన్స్.. విజయ్ ప్రమాణంపై నేడు క్లారిటీ
-
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేసే చాన్స్ఎనిమిది మంత్రుల పేర్ల జాబితాను గవర్నర్కు అందజేసిన విజయ్ విజయ్తో పాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశంరేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంనెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి కోరిన విజయ్ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్కు అందజేతప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్అందుకు గవర్నర్ సమ్మతిప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమంఈ నెల 13లోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశం తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్లుకేరళం పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్సాయంత్రం 6.30 గంటలకు విజయ్కు గవర్నర్ అపాయింట్మెంట్తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్లోక్భవన్కు వచ్చిన విజయ్ మళ్లీ వెనుదిరిగారు.కేరళంకు వెళ్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్విజయ్కు సమయం ఇవ్వని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్గవర్నర్కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్కు సమయం ఇవ్వలేదు అన్నాడీఎంకేలో చీలిక సంకేతాలు?పీవీ షణ్ముగం నేతృత్వంలో రెబల్ ఎమ్మెల్యేలుఈపీఎస్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేల డుమ్మాసస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలురాత్రి 7.10 గంటలకు కేరళ వెళ్లనున్న గవర్నర్ రాజేంద్రగవర్నర్ వెళ్లిపోతే విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యంసస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలుఇప్పటికి తేలని మద్దతు లెక్కలువిజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సస్పెన్స్టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులుటీవీకేకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వీసీకేకాసేపట్లో వీసీకే మీడియా సమావేశంవీసీకే అధికారిక ప్రకటన తర్వాత గవర్నర్ను కలవనున్న విజయ్తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్వీసీకే చీఫ్ తిరుమావళవన్కు ముఖ్యమంత్రి పదవి?డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్డీఎంకే ప్రతిపాదన అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలుసాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ ప్రెస్మీట్తమిళనాడు సంక్షోభంపై సుప్రీం కోర్టులో పిటిషన్టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్కు ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్విజయ్ను ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాల్సి ఉందికానీ, అలా చేయలేదుసుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐపీఎస్ అధికారివిచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠమ్యాజిక్ ఫిగర్ దగ్గరే ఆగి.. తమిళనాట అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకే ప్రస్తుత బలం 108-1=107 (ఒక్క స్థానంలో విజయ్ తప్పుకోవాల్సిందే)కాంగ్రెస్ 5వామపక్షాలు 4ఏఎంఎంకే 1లోక్భవన్కు నిన్న సమర్పించిన మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య 117ఏఎంఎంకే ఎమ్మెల్యే విత్డ్రా అయితే 116వీసీకే కలిస్తే .. 118 మ్యాజిక్ ఫిగర్ పూర్తిసాయంత్రం దాకా ఆగాల్సిందే!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న సస్పెన్స్ఎటూ తేల్చని విడుదలై చిరుతైగల్ కట్చి(2 సీట్లు)విజయ్ను వెయిటింగ్లో పెట్టిన వీసీకేమద్దతు ఇస్తే తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్కు ఎండ్ కార్డ్కొనసాగుతున్న వీసీకే హైలెవల్ మీటింగ్సాయంత్రం దాకా జరగనున్న చర్చలుసాయంత్రం వీసీకే చీఫ్ తిరుమావళవన్ మీడియా సమావేశంకీలక ప్రకటన చేసే అవకాశం తమిళనాడు సంక్షోభంపై లెఫ్ట్ పార్టీల కీలక ప్రకటనవామపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని తమిళనాట ఆరోపణలుహార్స్ ట్రేడింగ్కు మేం వ్యతిరేకం: సీసీఐ,సీపీఎంబేరసారాలకు గవర్నరే అవకాశం ఇచ్చారు: సీసీఐ,సీపీఎంఢిల్లీ పెద్దల సూచనతోనే తమిళనాడు స్క్రీన్ప్లే నడుస్తోంది: సీసీఐ,సీపీఎంబీజేపీ బ్యాక్డోర్ పాలిటిక్స్ నడిపిస్తోంది: సీసీఐ,సీపీఎంఅతిపెద్ద పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి : సీసీఐ,సీపీఎంకానీ, ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు : సీసీఐ,సీపీఎంఅందుకే టీవీకేకు మద్దతు ఇచ్చాం: సీసీఐ,సీపీఎంమా రెండు పార్టీలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాయి : సీసీఐ,సీపీఎంఇదే విషయాన్ని డీఎంకేకు సమాచారం అందించాం : సీసీఐ,సీపీఎంఏ పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాం: సీసీఐ,సీపీఎంఆ తర్వాతే మేం మా మద్దతు లేఖను గవర్నర్కు పంపాం: సీసీఐ,సీపీఎంవీసీకే పార్టీ కొన్ని కారణాలతో ఇంకా లేఖ పంపలేదు: సీసీఐ,సీపీఎంసాయంత్రంకల్లా ఆ పార్టీ నుంచి స్పష్టత రావొచ్చు: సీసీఐ,సీపీఎంప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారనే ఆశిస్తున్నాం: సీసీఐ,సీపీఎంమద్దతిస్తారా? ప్రతిపక్షంలో కూర్చుంటారా?వీసీకే పార్టీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తుందా? లేదా? అనే చర్చచెన్నైలోని కార్యాలయంలో వీసీకే హైలెవల్ మీటింగ్ప్రతిపక్షంలో కొనసాగుతారా? అధికార పార్టీతో కలుస్తారా?బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశమూ!ఏ నిర్ణయం అనేది స్వేచ్ఛగా తీసుకోవాలని వీసీకే అధిష్టానానికి డీఎంకే అధినేత స్టాలిన్ సూచనడీఎంకే నేతృత్వం సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్లో భాగంగా పోటీ చేసి రెండు సీట్లు నెగ్గిన వీసీకేమరికాసేపట్లో స్పష్టమైన ప్రకటన వెలువడే చాన్స్వీసీకే చీఫ్ తిరుమావళవన్ నిర్ణయం ఎలా ఉండనుందో?గవర్నర్ తీరు వల్లే గందరగోళం: ముకుల్ రోహత్గీతమిళనాడు సంక్షోభంపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కీలక వ్యాఖ్యలుదేశం మొత్తం తమిళనాడు వైపే చూస్తోందిఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభంవారంరోజులైనా ఏ విషయం తేల్చలేకపోవడం దారుణంగవర్నర్ తీరు వల్లే ఈ గందరగోళంసింగిల్ లార్జెస్ట్ పార్టీకి గవర్నర్ అవకాశం ఇవ్వాలిఅత్యధిక సీట్లు నెగ్గిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాల్సిందిఅసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాల్సిందిబలనిరూపణ లోక్భవన్లో కాదు.. అసెంబ్లీలో జరిగాలిపీపీ నరసింహారావు ప్రభుత్వం చాన్నాళ్లు మైనారిటీలో నడిచిందిగవర్నర్ ఏదీ తేల్చకపోతే.. విజయ్ కోర్టును ఆశ్రయించొచ్చుగతంలో ఇలాంటి కేసులు చాలా కోర్టుకు వచ్చాయి.. నేనూ వాదించారాష్టపతి పాలన, మరోసారి ఎన్నికలు నిర్వహించాలనడం సరికాదు.. ఇది అప్రాజాస్వామికంఅది ఏఐ వీడియోనేమో!: దినకరన్టీవీకేపై ఏఎఎంకే చీఫ్ దినకరన్ ఆగ్రహంతమ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వనేలేదని మరోసారి వ్యాఖ్యఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసిన టీవీకేఆ వీడియోపై దినకరన్ అనుమానాలుఅది అసలు వీడియో కాదు : దినకరన్అందులో లేఖ.. మా పార్టీ నోట్ప్యాడ్ వేర్వేరుగా ఉన్నాయి : దినకరన్అది ఫేక్ లెటర్ : దినకరన్మా పార్టీ లేఖను ఫోర్జరీ చేశారు: దినకరన్పూర్తి వీడియోను టీవీకే ఎందుకు రిలీజ్ చేయడం లేదు?: దినకరన్అది ఏఐ వీడియో అయ్యి ఉండొచ్చు: దినకరన్ వీసీకే ఆఫీస్ వద్ద కోలాహలంచెన్నైలోని విడుదలై చిరుతైగల్ కట్చి ఆఫీస్ వద్దకు భారీగా చేరుకుంటున్న జనంకాసేపట్లో మీడియా ముందుకు వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై ఉత్కంఠమద్దతు ప్రకటిస్తే.. అనిశ్చితికి తెరపడే అవకాశంస్వయంగా వీకేసీ ఆఫీస్కు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేయనున్న విజయ్దాదాపుగా మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలుఇవ్వకుంటే.. కొనసాగనున్న సస్పెన్స్వీకేసీ మద్దతు ఇస్తే.. 119కి చేరనున్న టీవీకే బలంఏఎంఎంకే మద్దతు ఉపసంహరించుకున్నా.. టీవీకే మెజారిటీ 118మ్యాజిక్ ఫిగర్ (118) కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ అన్నాడీఎంకే కీలక భేటీపళనిస్వామి ఇంట్లో సమావేశమైన అన్నాడీఎంకే నేతలుప్రభుత్వ ఏర్పాటుపై చర్చ?టీవీకే మెజారిటీ చూపించుకోలేకపోతే.. ఏం చేయాలన్నదానిపై సీనియర్లతో పళని మంతనలుఅన్నాడీఎంకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు ఏఎంఎంకే చీఫ్ దినకరన్ లేఖమొన్నటిదాకా విజయ్కు మద్దతు ఇస్తారని ప్రచారంనిన్ననేమో బద్ధశత్రువు డీఎంకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రచారంఇవాళ.. తగిన సంఖ్యా బలం లేకున్నా అన్నాడీఎంకేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రచారం మరికాసేపట్లో కీలక ప్రకటనవిడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే) మద్దతుపై ఉత్కంఠమరికాసేపట్లో మీడియా ముందుకు వీసీకే చీఫ్ తిరుమావళవన్విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేది స్పష్టీకరణమద్దతు ఇస్తే.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ ఇవాళే సీఎంగా విజయ్ ప్రమాణం చేసే చాన్స్ఇవ్వకపోతే.. కొనసాగనున్న సస్పెన్స్దినకరన్పై డీఎంకే ఫైర్ఏఎంఎంకే అధినేత దినకరన్పై డీఎంకే ఆగ్రహంమిత్రపక్షం అన్నాడీఎంకే తరఫున ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వాన విజ్ఞప్తి గవర్నర్కు అందించిన దినకరన్ఏ ప్రతిపాదికన గవర్నర్కు ప్రభుత్వ ఏర్పాటు లేఖ అందించారని ప్రశ్నించిన డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్అన్నాడీఎంకేకు సంఖ్యా బలం ఎక్కడ ఉంది?: ఇళంగోవన్ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా.. సపోర్ట్ లెటర్ లేకుండా దినకనర్ డ్రామాలు చేస్తున్నారా?: ఇళంగోవన్త్రిషకు నిరాశ తప్పదా?తిరుచ్చి ఈస్ట్కు రాజీనామా చేయనున్న విజయ్ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందని ప్రచారండిప్యూటీ సీఎం చేస్తారనే ఊహాగానాలుతిరుచ్చి ఈస్ట్తో పాటు డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలంటున్న విడుదలై చిరుతైగల్ కట్చిఅలాగైతేనే విజయ్కు మద్దతు ఇస్తామని స్పష్టీకరణసంబంధిత కథనం: త్రిష ఆశలు గల్లంతు!116 కాదు.. 117!విజయ్ మద్దతుపై తమిళనాడు లోక్భవన్ క్లారిటీ117 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్కు లేఖ సమర్పించిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేవిజయ్ రెండు చోట్ల పోటీ చేసిన నెగ్గడంతోనే ఆ ఫిగర్ఒక సీటు మైనస్ చేసి 107 బలంగానే చూపించిన టీవీకేకాంగ్రెస్ సపోర్ట్తో 112బయటి నుంచి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీలు 4ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు కూడా చూపించిన విజయ్మొత్తం 117 మంది ఎమ్మెల్యేల సంతకాలుమెజారిటీకి తక్కువైన ఒక్క స్థానంవీసీకే పార్టీ(2) మద్దతుపై టీవీకేకు అందని లేఖఅది అంది ఉంటే.. 119కి పెరగనున్న బలంఏఎంఎంకే ఎమ్మెల్యే విషయంలో ఆ పార్టీ అధినేత దినకరన్ కిరికిరివీసీకే మద్దుతు ఇస్తే.. ఏఎంఎంకే ఎమ్మెల్యే వైదొలగినా 118 పూర్తి మెజారిటీనేడు వీసీకే ఆఫీస్కు విజయ్మద్దతుపై సాయంత్రంలోగా రానున్న స్పష్టతతమిళనాట జోరుగా క్యాంపు పాలిటిక్స్తమిళనాడులో మొదలైన నెంబర్ గేమ్మ్యాజిక్ ఫిగర్ 2 తక్కువైన టీవీకే విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న అనిశ్చితిటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు ససేమీరా అంటున్న గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్రేపటితో టీవీకేకు గవర్నర్ ఇచ్చిన గడువు పూర్తి?!పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీవీకేమహాబలిపురం రిసార్ట్కే పరిమితమైన టీవీకే ఎమ్మెల్యేలుచెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపునేడు ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిఅన్నాడీఎంకేకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు ఏఎంఎంకే లేఖఅన్నాడీఎంకే తరఫున లేఖ సమర్పించిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్పళనిస్వామి గవర్నర్ను కలిస్తే మారనున్న నెంబర్లుకాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అన్నాడీఎంకే దృష్టికాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న ఏఐసీసీ ఇంచార్జీ గిరీష్ చోడంకర్కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసులతో బెదిరింపులు.. డబ్బు ఆశ చూపిస్తున్నారని ఆరోపణలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయం మొదలుపెట్టిన కాంగ్రెస్రాత్రికి రాత్రే బెంగళూరు.. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలింపుహైదరాబాద్లోనే తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిబిరం మరో వివాదంలో టీవీకే అధినేత విజయ్నిన్న విజయ్తో జన నాయగన్ ప్రొడ్యూసర్ భేటీఅనంతరం లోక్భవన్కు విజయ్, మద్దతుదారు పార్టీల నేతలతో వెళ్లిన నిర్మాత లేఖ సమర్పించే సమయంలో గవర్నర్ పక్కనే నిల్చున్న నిర్మాత వెంకట్ కే నారాయణప్రొటోకాల్కు విరుద్ధంగా తీసుకెళ్లారని విజయ్పై రాజకీయ ప్రత్యర్థుల విమర్శలుప్రభుత్వ ఏర్పాటులో ప్రొడ్యూసర్కు ఏం పని అంటూ మండిపాటుప్రొడ్యూసర్ ద్వారా వామపక్షాలకు డబ్బులు పంచి ఉంటారని ఆరోపణలువిజయ్ హార్స్ట్రేడింగ్కు పాల్పడుతున్నారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేసే అవకాశంగవర్నర్కు(శాలువా కప్పుకున్న వ్యక్తి) ఎడమ వైపు ఉంది జన నాయగన్ నిర్మాత వెంకట్ కే నారాయణఆ ఇద్దరు ముందుకు వస్తే.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కంటిన్యూవిజయ్కు మద్దతిచ్చే విషయంలో పార్టీల హైడ్రామావీసీకే తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన జ్యోతిమణి, వన్నీరసు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల నెగ్గిన విజయ్ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితిడిప్యూటీ సీఎం పోస్టుతో పాటు విజయ్ వదులుకునే తిరుచ్చి ఈస్ట్ సీటును డిమాండ్ చేస్తున్న వీసీకేవీటితో పాటు మరో రెండు డిమాండ్లుచివరి నిమిషంలో మద్దతు లేఖ ఇవ్వకుండా హ్యాండిచ్చిన వీసీకేటీవీకే మద్దతు అంశం పక్కన పెట్టి.. డీఎంకే అధినేత స్టాలిన్తో వీసీకే చీఫ్ తిరుమావళవన్ భేటీఇవాళ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే చాన్స్మద్దతు ఇస్తే సీఎంగా విజయ్కు లైన్ క్లియర్ఇవ్వకుంటే.. కొనసాగనున్న ఉత్కంఠ ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది.. చిన్నతప్పిదంతో గవర్నర్ దగ్గర బుక్కైన టీవీకే అధినేత విజయ్6న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తొలిసారి కలిసిన విజయ్గవర్నర్కు సమర్పించిన జాబితాలో కాంగ్రెస్ మద్దతు ఎమ్మెల్యేల పేర్లు కూడాకూటమిగా.. టీవీకేను అతిపెద్ద పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయిన విజయ్అక్కడే గవర్నర్కు దొరికిపోయిన విజయ్ఆ మరుసటి రోజే.. మరోసారి గవర్నర్ను కలిసి విజ్ఞప్తినిన్న.. 116 ఎమ్మెల్యేల సంతకాలతో మూడోసారి గవర్నర్ను కలిసి విజ్ఞప్తి118 ఎమ్మెల్యేల సంతకాలే కావాలని పట్టుబడుతున్న గవర్నర్మొదటిసారి..రెండో‘సారీ’..మూడోసారి 116 వర్సెస్ 116తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులుక్షణక్షణానికి మారిపోతున్న లెక్కలునెంబర్ గేమ్తో టీవీకే చీఫ్ విజయ్ సతమతంతమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకేకు ప్రస్తుత బలం 116ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్కు అవకాశం ఇవ్వాలంటున్న డీఎంకే అధినేత స్టాలిన్ఇవాళ పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక భేటీవిజయ్ చేతులెత్తేస్తే.. డీఎంకే అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలు అన్నాడీఎంకేకు బయటి నుంచి డీఎంకే మద్దతు ఇస్తుందంటూ జోరుగా ప్రచారండీఎంకే-అన్నాడీఎంకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన బలం 116ఇరు వైపులా.. ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు అవసరంవీసీకే పార్టీ మద్దతు ఇస్తేనే విజయ్ పార్టీకి సంపూర్ణ బలంఇదే అదనుగా టీవీకేకు డిమాండ్లు చేస్తున్న వీసీకేకీలకమైన మంత్రిత్వ శాఖ, విజయ్ ఖాళీ చేసే స్థానంలో పోటీ, మరో రెండు డిమాండ్లు చేస్తున్న వీసీకేఇవాళ తమ నిర్ణయం ప్రకటిస్తామన్న వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ఇవాళ వీసీకే మద్దతు ఇస్తే విజయ్ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ఈరోజు ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠటీవీకేను టెన్షన్ పెడుతున్న పళనిస్వామిమరోవైపు.. టీవీకేకు గుబులు పుట్టిస్తున్న అన్నాడీఎంకేడీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ప్రచారంమరోవైపు.. అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు లేఖ ఇచ్చిన మిత్రపక్షం ఏఎంఎంకేగవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ను శుక్రవారం సాయంత్రం కలిసిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంసీనియర్ నేతలతో భేటీ కానున్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామిగవర్నర్ను కలిసి టీవీకేపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న పళని!విజయ్కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిందని మొన్నటిదాకా ప్రచారంతమ కూటమి ఎమ్మెల్యేలను విజయ్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్ ఆరోపణ.. గవర్నర్కు ఫిర్యాదుస్టాలిన్ పరోక్ష సాయం!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో తమ జోక్యం ఉండబోదన్న డీఎంకే చీఫ్ స్టాలిన్టీవీకే పార్టీకి ఎలాంటి అవాంతరం కలిగించబోమని వ్యాఖ్యప్రజా తీర్పును గౌరవిస్తామని ఇప్పటికే స్పష్టీకరణవిజయ్ పాలనను ఆరు నెలలపాటు గమనిస్తామని.. ఆ తర్వాతే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని ప్రకటనఅన్నాడీఎంకేతో కూటమి ప్రభుత్వం ఉండబోదన్న సంకేతాలిచ్చిన స్టాలిన్ విజయ్కు మద్దతు ఇచ్చే విషయంలో తన ఒత్తిడి ఏం ఉండదని.. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని మిత్రపక్షాలకు సూచనఆ సూచన తర్వాతే విజయ్కు మద్దతు విషయంలో ముందుకు వచ్చిన వామపక్షాలువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్కు చోటుతమకు చోటు అక్కర్లేదని.. బయటి నుంచే మద్దతు(డీఎంకేలో కొనసాగుతూ) ఇస్తామని స్పష్టం చేసిన లెఫ్ట్ పార్టీలువీసీకే కూడా తమ నిర్ణయాన్ని గౌరవించిందన్న సీపీఐ, సీపీఎంలుఅయితే.. కేబినెట్ బెర్త్తో పాటు విజయ్ వదులుకునే సీటు తమకు ఇవ్వాలంటున్న వీసీకే!ఈ క్రమంలోనే మద్దతుపై ఇంకా ఏదీ తేల్చని వీసీకే చీఫ్ తిరుమావళవన్తిరుమావళవన్ ఎక్కడ?క్షణక్షణానికి మారుతున్న తమిళనాడు రాజకీయంటీవీకేను టెన్షన్ పెడుతున్న వీసీకే అధినేత తిరుమావళవన్చివరి నిమిషంలో మద్దతుపై ట్విస్ట్ ఇచ్చిన విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)డీఎంకే సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమిలో ఉన్న వీసీకేమొన్నటిదాకా విజయ్కు మద్దతు ఇవ్వమంటు వ్యాఖ్యవిజయ్ విజ్ఞప్తి మేరకు ఆలోచన చేస్తామని ప్రకటనసాయంత్రానికి సానుకూలంగా స్పందించినట్లు ప్రచారంస్టాలిన్తో భేటీ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన తిరుమావళవన్అర్ధరాత్రి వరకు నిరీక్షించిన టీవీకేవీసీకే మద్దతు లేఖపై ఉత్కంఠనేడు అధికారిక ప్రకటన వెలువడే చాన్స్విజయ్ ఉక్కిరి బిక్కిరితమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠటీవీకేకు ఇంకా పూర్తిగా దక్కని మద్దతుప్రస్తుత బలం 116గా ఉందన్న గవర్నర్ కార్యాలయంఇంకా ఇద్దరు తక్కువడీఎంకే కూటమిలోని పార్టీలకు విజ్ఞప్తి చేసిన విజయ్టీవీకే విజయ్ పార్టీ బలం (108.. ఇందులో విజయ్ రెండు చోట్ల నెగ్గడంతో ఒక చోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి.. దీంతో 107కి పడిపోనున్న సంఖ్యడీఎంకేతో కటీఫ్ చెప్పి విజయ్కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్(5)డీఎంకే కూటమిలోనే ఉంటూ బయటి నుంచి విజయ్కు మద్దతు ప్రకటించిన లెఫ్ట్ పార్టీ(4)మద్దతు ఇవ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ((2))అన్నాడీఎంకే కూటమిలోని ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే మద్దతు కూడా!దినకరన్కు టీవీకే కౌంటర్మా ఎమ్మెల్యే విజయ్కు మద్దతు ఇవ్వలేదు: దినకరన్తమ ఏకైక ఎమ్మెల్యే సంతకం టీవీకే ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే చీఫ్ దినకరన్ ఆరోపణచెన్నై కమిషనర్కు ఫోర్జరీ కంప్లయింట్దినకరన్కు టీవీకే స్ట్రాంగ్ కౌంటర్ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా సంతకం చేస్తున్న వీడియోను విడుదల చేసిన టీవీకే గవర్నర్కు విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల్లో.. కామరాజ్ సంతకం కూడా!దినకరన్ ఎంట్రీతో మారిన సీన్తెరపైకి అమ్మ మక్కల్ మున్నేట్ర కగళం(AMMK) చీఫ్ దినకరన్జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్సొంత పార్టీతో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన దినకరన్ఒక్క స్థానంలో నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థిమన్నార్గుడి నుంచి నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థి కామరాజ్మొదటి నుంచి టీవీకే విజయ్కు మద్దతు ఇస్తారనే ప్రచారంఅందుకు తగ్గట్లే గవర్నర్కు సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతులో కామరాజ్ సంతకం కూడాదినకరన్ సంచలన ఆరోపణలుతమ ఏకైక ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేశారంటూ ఆరోపణనిన్న సాయంత్రం గవర్నర్ను కలిసిన దినకరన్అన్నాడీఎంకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలంటూ గవర్నర్కు విజ్ఞప్తితమిళ రాజకీయం.. హైదరాబాద్కు షిఫ్ట్తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠహైదరాబాద్కు మారిన తమిళనాడు రాజకీయంహైదరాబాద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుతమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్లోనే ఐదుగురు ఎమ్మెల్యేల మకాంఏర్పాట్లు చూసుకోనున్న టీపీసీసీ చీఫ్తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్లీ అవాంతరంగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను ముచ్చటగా మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్మ్యాజిక్ ఫిగర్ 118టీవీకే గెలిచిన స్థానాలు 108కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2.. మొత్తం మ్యాజిక్ ఫిగర్ గవర్నర్కు చూపించిన విజయ్ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారంవిజయ్కు సీఎం స్థాయి భద్రతను పునరుద్దరించాలని పోలీస్ శాఖను గవర్నర్ ఆదేశించినట్లు ప్రచారందీంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన టీవీకేఅయితే వీసీకే ఇద్దరు ఎమ్మెల్యేల సంతకం మిస్సింగ్!116 మంది మద్దతే ఉందని ప్రకటించిన లోక్భవన్వీసీకే నిర్ణయం వెలువడేది ఇవాళేనేటి విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్దత -
గవర్నర్తో విజయ్ భేటీ.. 'జన నాయగణ్' నిర్మాత ఎందుకున్నట్లు?
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం గవర్నర్ని కలిసిన విజయ్.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని చూపించారు. అయితే విజయ్తో పాటు టీవీకే నేతలు కనిపించారు. కాకపోతే 'జన నాయగణ్' నిర్మాత వెంకట్.కె.నారాయణ కూడా ఉండటం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన టాలీవుడ్ ప్రముఖులు)కెవిఎన్ ప్రొడక్షన్స్ పేరిట 2020లో నిర్మాణ సంస్థని స్థాపించిన వెంకట్ కె నారాయణ.. ప్రస్తుతం 'జన నాయగణ్'తో పాటు చిరంజీవి-బాబీ, టాక్సిక్ తదితర చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఈయనకు నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ తప్పితే రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు. అయినా సరే విజయ్తో పాటు తమిళనాడు గవర్నర్ని కలిసేందుకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.నిర్మాత వెంకట్ కె నారాయణ కూడా టీవీకే పార్టీలో ఏమైనా భాగమయ్యారా? లేదంటే సాధారణంగానే వెళ్లారా అనేది ప్రస్తుతం సస్పెన్స్. 'జన నాయగణ్' సినిమా లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రావాలి. ఇదే చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో దీనిపై బోలెడంత బజ్ నెలకొంది. కానీ సెన్సార్ బోర్డ్.. దీన్ని పలు కారణాలు చెప్పి అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడు విజయ్, ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఇక రిలీజ్కి ఎలాంటి అడ్డంకి ఉండకపోవచ్చనిపిస్తోంది. మరి ఈ నెలలోనే ఈ సినిమాని విడుదల చేస్తారా లేదంటే జూన్లో థియేటర్లలోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.తెలుగు సినిమా 'భగవంత్ కేసరి' రీమేకే జన నాయగణ్. హెచ్ వినోద్ దర్శకుడు కాగా పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. అనిరుధ్ సంగీతమందించాడు. అయితే ఇప్పటికే సినిమా పైరసీకి గురైంది. చాలామంది సదరు ప్రింట్ చూసేశారు కూడా. అయినా సరే కాస్తోకూస్తో బజ్ ఉందంటే దానికి కారణం విజయ్. ఇప్పుడు సీఎం కూడా అయ్యాడు కాబట్టి రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్ తీసిన సినిమాపై 'పెద్ది' ఎఫెక్ట్)#ThalapathyVijay's Latest video with Governor and He stakes claim to form Government in TN..🔥🤩 All is Well..🤝pic.twitter.com/kbYBy4TVMZ— Laxmi Kanth (@iammoviebuff007) May 8, 2026 -
అప్పుడేమో త్రిషపై వివాదాస్పద కామెంట్స్.. ఇప్పుడేమో ఇలా..!
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నోటిదూలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. గతంలో త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన మన్సూర్ ఎక్కువగా రేప్ సీన్స్లో నటించానని తెలిపారు. విడయ్ హీరోగా వచ్చిన లియో మూవీలో త్రిషతోను అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నానని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పలువురు సినీ ప్రముఖులు మండిపడ్డారు. చిరంజీవి, ఖుష్బూతో సహా పలువురు సినీతారలు త్రిషకు మద్దతుగా నిలబడ్డారు. ఆ తర్వాత ఈ వివాదంపై మన్సూర్ కోర్టుకు వెళ్లారు. త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేశాడు. అక్కడి అతనికే కోర్టు షాకిచ్చింది. లక్ష రూపాయలు జరిమానా కట్టాలంటూ పిటిషన్ కొట్టవేసింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. త్రిషను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని సమర్థించుకున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే ఎలక్షన్ టైమ్లో విజయ్కు మద్దతుగా మన్సూర్ నిలిచారు. తొక్కిసలాట టైమ్లో విజయ్ను వెనకొసుకొచ్చారు. ఇప్పుడు విజయ్ గెలిచాక మన్సూర్ స్పందించారు. వెంటనే విజయ్ను ఆహ్వానించి సీఎం చేయాలని గవర్నర్ను కోరారు. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయవద్దని విజయ్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొబెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించకండి.. రాష్ట్రంలో ఏదీ సక్రమంగా పనిచేయడం లేదు. వెంటనే విజయ్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టండని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. అప్పుడు త్రిషపై వ్యాఖ్యలతో వివాదానికి కారణమైన మన్సూర్.. ఇప్పుడు విజయ్కు మద్దతుగా నిలవడం విశేషం. Don’t create unrest in the state. Nothing is functioning properly in the state. Quickly invite @TVKVijayHQ and make him sit in the CM’s chair! 🙏— Actor Mansoor Ali Khan pic.twitter.com/oM5aRntwkB— Arun Vijay (@AVinthehousee) May 8, 2026 -
ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె?
తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. హీరో విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని చిన్నపాటి టెన్షన్. అన్నీ కలిసొస్తే ఇతడే సీఎం కావొచ్చు. అయితే విజయ్తోపాటు మరో ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన నటి మనోరమ గురించి మీలో ఎంతమందికి తెలుసు. ఇంతకీ ఎవరీ నటి? ఏ సీఎంలతో ఏయే సినిమాలు చేసిందంటే?నాటకాలతో మొదలుపెట్టి తెలుగు, తమిళంలో 1000కి పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మనోరమ.. 1950 నుంచి 2015 వరకు నటిస్తూనే ఉన్నారు. మూడు తరాల నటులతో కలిసి నటించిన ఈమె.. తమిళ ఇండస్ట్రీలో పోషించని పాత్ర లేదనే స్థాయికి ఎదిగారు. అసలు విషయానికొస్తే తమిళనాడు ముఖ్యమంత్రుల్లో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, స్టాలిన్తో పాటు దిగ్గజ హీరో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తోనూ నటించారు. విజయ్తోనూ తెరని పంచుకున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయితే ఏడుగురి సీఎంలతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతమవుతుంది.అన్నాదురైద్రవిడ ఉద్యమ సిద్ధాంతాలని నాటకాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన సీఎన్ అన్నాదురైతో మనోరమకు ప్రత్యేక అనుబంధముంది. ఈయన రచించి నటించిన వేలైక్కారి, శివాజీ కండ హిందూ సామ్రాజ్యం తదితర నాటకాల్లో ఈమె, అన్నాదురై కలిసి నటించారు.కరుణానిధినాటకాల్లో మనోరమ ప్రతిభని గుర్తించిన నటుడు ఎస్ఎస్ రాజేంద్రన్.. ఈమెని చెన్నై తీసుకెళ్లి, కరుణానిధి రచించిన 'మణిమగుడం' నాటకంలో నటించే అవకాశమిచ్చారు. 'ఉదయ సూరియన్' నాటకంలో కరుణానిధితో కలిసి మనోరమ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.ఎంజీఆర్నాటకాల నుంచి సినిమాలకు వచ్చిన మనోరమ.. ఎమ్జీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్తో పలు హిట్ సినిమాల్లో నటించారు. అన్బేవా, పదగొట్టి తదితర చిత్రాల్లో ఈమె కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది.జయలలితజయలలితతోనూ మనోరమ చాలా సినిమాల్లో నటించారు. కందన్ కరుణై, గలట్టా కల్యాణం, పట్టికాడ పట్టణమ చిత్రాల్లో వీరి నటన ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేదని చెబుతుంటారుస్టాలిన్తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అలా ఈయన విజయ్కాంత్ హీరోగా చేసిన 'మక్కళ్ అనైయిట్టల్' చిత్రంలో మనోరమతో కలిసి తెర పంచుకున్నారు.ఎన్టీఆర్తమిళంలో ఇలా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మనోరమ.. తెలుగులో ఎన్టీఆర్తోనూ కలిసి తెర పంచుకున్నారు. నర్తనశాల, పాతాళభైరవి, గుండమ్మ కథ, మాయా బజార్, ఛాలెంజ్ రాముడు తదితర చిత్రాల్లో కలిసి నటించారు.విజయ్(ఇంకా సీఎం కాలేదు)తమిళనాడులో ప్రస్తుతం విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతడితోనూ మనోరమ కలిసి నటించారు. రసిగన్, దేవా లాంటి సినిమాల్లో వీరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించింది.1937 మే 26న మన్నార్గుడిలో పుట్టిన మనోరమ అసలు పేరు గోవిందమ్మాళ్. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కారైకుడి ప్రాంతానికి వలస వెళ్లింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే 'యార్ మగన్' అనే నాటకంతో రంగస్థల నటిగా ప్రస్థానం మొదలుపెట్టింది. 1958లో వచ్చిన 'మళయిట్ట మాంగై' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందే తన డ్రామా ట్రూప్ మేనేజర్ ఎస్ఎమ్ రామనాథన్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీళ్లకు భూపతి అనే కొడుకు కూడా పుట్టాడు. తర్వాత కొన్నాళ్లకు ఈమెకు భర్త విడాకులు ఇచ్చేశాడు. 2015 అక్టోబరులో 78 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఈమె కన్నుమూసింది. -
విజయ్ ని సీఎంగా చూడడానికి సింగపూర్ నుంచి వచ్చాం
-
కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో TVK విజయ్ భేటీ
-
తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్
టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే అంగీకారం తెలిపింది. లెఫ్ట్, వీసీకే మద్దతుతో విజయ్కు పూర్తి మెజార్టీ దక్కింది. ఉదయం ఎమ్మెల్యేలతో చర్చించిన విజయ్ .. అనంతరం వీసీకేతో మద్దతు కోరగా అందుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ను విజయ్ మరోసారి కలిశారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉందన్న విజయ్.. అందుకు సంబంధించిన మద్దతు పత్రాలను గవర్నర్కు సమర్పించారు. ఈ క్రమంలో మరో బిగ్ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సిందిగ్ధంలోక్భవన్ కొత్త మెలికవిజయ్కు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందన్న లోక్భవన్వీసీకే, ఐయూఎంలు తమ మద్దతు లేఖలు ఇవ్వలేదన్న లోక్భవన్తద్వారా విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై టెన్షన్ వాతావారణంరేపే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 11గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారంరేపే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారంటీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతితమిళనాడు గవర్నర్తో ముగిసిన టీవీకే చీఫ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్ అనుమతి తమిళనాడులో కొలువు దీరనున్న విజయ్ సర్కార్గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్ మద్దతు లేఖను గవర్నర్కు అందజేత లోక్భవన్కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ లోక్భవన్కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మెజార్టీ ఉందని చెప్పనున్న విజయ్ సీపీఐ,సీపీఎం,వీసీకే మద్దతుతో 118కి చేరిన సంఖ్యాబలంలోక్భవన్లో గవర్నర్ రాజేంద్రకు 118 ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ ముగిసిన అనంతరం సీపీఎం,సీపీఐ,వీసీకే కార్యాలయాలకు వెళ్లనున్న విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకై మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు చెప్పనున్న టీవీకే అధినేత విజయ్ కోసం కాన్వాయ్ సిద్ధంలోక్భవన్కు చేరుకున్న ప్రభుత్వ కాన్వాయ్మొన్న విజయ్కు కాన్వాయ్ ఇవ్వడంపై గవర్నర్ ఆగ్రహంమద్దతు లేఖ ఇచ్చాక అదే కాన్వాయ్లో వెళ్లనున్న విజయ్టీవీకేకు కాంగ్రెస్ కండీషన్మతతత్వ పార్టీతో కలొద్దని కాంగ్రెస్ షరతుతిరుచ్చి ఈస్ట్ సీటు, మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే కండీషన్టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయంకేవలం మద్దతు మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయంటీవీకేకు వామపక్షాల మద్దతుమద్దతు లేఖను టీవీకేకు అందజేసిన వామపక్షాలువీసీకే, వామపక్షాలకు కేబినెట్ బెర్త్లువీసీకే, సీపీఎం, సీపీఐకి చెరో మంత్రి పదవి దక్కే చాన్స్కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశంటీవీకే ప్రధాన కార్యాలయం వద్ద సందడిమెజార్టీ మార్క్ దాటడంతో టీవీకే శ్రేణుల సంబరాలుచెన్నైలోని లెఫ్ట్ కార్యాలయానికి టీవీకే నేత నిర్మల్ కుమార్మద్దతు లేఖలను తీసుకోనున్న నిర్మల్కుమార్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్టీవీకే మద్దతుగా సీపీఎం, సీపీఐ, వీసీకేఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్కు చేరుకోనున్న టీవీకేకాంగ్రెస్-5, వామపక్షాలు-4, వీసీకే-2దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 118కి చేరనున్న టీవీకే సంఖ్యాబలంకాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్ మరోసారి గవర్నర్ను కలవనున్న విజయ్మరికాసేపట్లో లోక్భవన్కు వెళ్లనున్న విజయ్గవర్నర్తో భేటీకానున్న విజయ్ ఇదివరకే రెండుసార్లు గవర్నర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ఇళంగోవన్ ఆసక్తికర వ్యాఖ్యలుఅన్నాడీఎంకేతో జట్టు ప్రచారంపై స్పందించిన డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్డీఎంకే.. అన్నాడీఎంకే రెండు ప్రధాన ప్రత్యర్థులుఈ రెండు కలవడం అసాధ్యంఇంక కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుదిరే పని కాదులోక్భవన్.. మళ్లీ అదే ప్రకటనమ్యాజిక్ ఫిగర్తోనే ముందుకు రావాలని టీవీకే పార్టీకి లోక్భవన్ వర్గాల స్పష్టీకరణఎవరు ముందుకు వచ్చినా.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ సమ్మతిస్తారని వెల్లడిటీవీకే చేతులెత్తేస్తే.. డీఎంకే-అన్నాడీఎంకే కూటమికి చాన్స్?గవర్నర్ వ్యాఖ్యలు ఆ కోణంలోనే ఉన్నాయంటున్న టీవీకే-కాంగ్రెస్అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి అవకాశం ఇవ్వకపోవడమేంటని సూటి ప్రశ్నలోక్భవన్ ముట్టడికి యత్నం.. పలువురు కార్యాకర్తల అరెస్ట్మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో టీవీకే ఆఖరి అస్త్రంగా.. గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లే యోచన న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన టీవీకే అధినేత విజయ్మా మద్దతుపై రేపు ప్రకటన చేస్తాం: వీసీకేవిదుతలై చిరుతైగల్ కట్చి కీలక ప్రకటనతమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన వీసీకే పార్టీప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామిగా వీసీకేవిజయ్ పార్టీకి ప్రభుత్వ ఇచ్చే విషయంలో సస్పెన్స్ కంటిన్యూవీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్తో భేటీ అయిన టీవీకే నేత అధవ్ అర్జునఇవాళ సాయంత్రం వీసీకే పార్టీ హైలెవల్ సమావేశంమీటింగ్లో చర్చించి.. రేపు స్పష్టమైన ప్రకటన చేస్తామన్న తిరుమావళవన్ఇటు విజయ్.. అటు పళనితమిళనాడు రాజకీయాల్లో పూటకో ట్విస్టులుపార్టీ ముఖ్యనేతలతో భేటీ అయిన టీవీకే అధినేత విజయ్అటు పళనిస్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేతల మీటింగ్వామపక్షాలు, వీసీకే నిర్ణయం కోసం ఇరు పార్టీలు ఎదురు చూపులుఆరుగురు సభ్యుల మద్దతు దొరికితే విజయ్ ప్రభుత్వం ఏర్పడినట్లేమద్దతు ఇవ్వకుంటే అన్నాడీఎంకే రంగంలోకి దిగే చాన్స్విజయ్కు అన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా?.. లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు సొంతంగా చేస్తుందా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకేలో విజయ్కు మద్దుతు ఇచ్చే అంశంపై చర్చ.. చీలిక కూడాడీఎంకే-అన్నాడీఎంకే కలుస్తాయంటూ రెండ్రోజులుగా ఊహాగానాలుసాయంత్రంకల్లా తమిళనాడు సస్పెన్స్కు తెర పడే చాన్స్శత్రువులు మిత్రులవుతున్నారుకాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలుడీఎంకే, అన్నాడీఎంకేలు కలుస్తున్నాయంటూ వ్యాఖ్యశత్రువులు మిత్రులవుతున్నారువిజయ్ను అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నారుడీఎంకే, అన్నాడీఎంకేలు బీజేపీకి బీ టీంలుతమిళనాడు మరో బిగ్ ట్విస్ట్!తెరపైకి సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్డీఎంకే సపోర్ట్తో రజనీకాంత్ ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు...?అన్నాడీఎంకే కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు కాబోయే సీఎం ..?రహస్యంగా పావులు కదుపుతున్న డీఎంకే అధినేత స్టాలిన్రజనీకాంత్ సీఎం అయితే రాష్ట్రంలో అల్లర్లు ఉండవని అంచనాఎడపాటి పళనిస్వామిని స్పీకర్గా ఎన్నుకునే అవకాశంమొన్న స్టాలిన్ ఇంటికి రజనీకాంత్ వెళ్ళారు..నిన్న రజనీకాంత్ ఇంటికి వెళ్లిన డీఎంకే సీనియర్ నేత వేలునేడు మళ్లీ రజనీకాంత్ ను కలవనున్న ఇరు పార్టీ నేతలుటీవీకే కీలక భేటీటీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో కీలక సమావేశంసమావేశానికి హాజరైన నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు.. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై చర్చదేనికైనా సిద్ధంగా ఉండాలని పిలుపుఅన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందిఅన్నాడీఎంకే ఎంపీ తంబిదురై సంచలన వ్యాఖ్యలుతమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్ను కోరుకుంటున్నారు: తంబిదురైమేం అధికారంలోకి వస్తాం: తంబిదురైచెన్నైలో ఉద్రిక్తత!తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ తీరుపై టీవీకే అసహనంప్రజలు విజయ్కు పట్టం కడితే.. సీఎం కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలోక్భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన టీవీకే కార్యకర్తలుఅదుపులోకి తీసుకున్న పోలీసులులోక్భవన్తో పాటు చెన్నైలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణంపళని ఏం చేస్తారో?తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంనేడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో పళనిస్వామి భేటీనిన్ననే అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీఇవాళ్టి మీటింగ్పై సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలికబీజేపీ పొత్తు తెంచుకుని.. విజయ్కు మద్దతు ఇద్దామంటున్న షణ్ముగం నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గంవద్దని వారిస్తున్న పళనిస్వామిఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ జరిపిన పళనిస్వామిఎన్నికల్లో 47 సీట్లు నెగ్గిన అన్నాడీఎంకేతమ పార్టీ సభ్యుల సంతకాలను గవర్నర్కు సమర్పించే అవకాశంవిజయ్కు మద్దతు ఇస్తారా? ఎవరికీ మద్దతు ఉండదని చెబుతారా? లేదంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలేమైనా చేస్తారా? అనే ఉత్కంఠతమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై నేడు రానున్న స్పష్టతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 112 (107+కాంగ్రెస్ 5)కీలకంగా సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల నిర్ణయంతలో రెండేసి సీట్లు నెగ్గిన డీఎంకే కూటమి పార్టీలుస్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని కూటమి నేత స్టాలిన్ సూచనప్రభుత్వ ఏర్పాటునకు డీఎంకే అడ్డుపడబోదని స్టాలిన్ వ్యాఖ్యఇవాళ మూడు పార్టీల హైలెవల్ మీటింగ్లుమీటింగ్ల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై రానున్న స్పష్టతఇప్పటికే కమ్యూనిస్ట్ నేతలతో ఫోన్లో మాట్లాడిన విజయ్సానుకూలంగా స్పందించిన సీపీఐ!సాయంత్రం కల్లా రానున్న స్పష్టత118 మంది మద్దతుదారుల సంతకాలు చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతిస్తానని గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ స్పష్టీకరణఏం చేద్దాం?తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందిన టీవీకే108 స్థానాలతో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేప్రభుత్వ ఏర్పాటునకు 10 సీట్ల దూరంకాంగ్రెస్ మద్దతుతో కాస్త పెరిగిన బలంఅయినా ప్రభుత్వ ఏర్పాటునకు అంగీకరించని గవర్నర్113 సరిపోదని.. 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే ముందుకు రావాలని టీవీకేకు స్పష్టీకరణరెండు రోజుల్లో.. రెండుసార్లు కలిసినా ఇదే సమాధానంన్యాయనిపుణులతో చర్చించానని.. బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయమని విజయ్కు గవర్నర్ సమాధానంనెంబర్ ముఖ్యమని.. ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానిస్తానని వ్యాఖ్యరాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న విజయ్మరోవైపు.. నెగ్గిన ఎమ్మెల్యేలతోనూ వరుస భేటీలుమద్దతు ఉంటుందా? ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందా? అనే దానిపై నేడు రానున్న స్పష్టతసంబంధిత వార్త: విజయ్కి షాక్.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలునేడు లోక్భవన్ ముట్టడిటీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నోగవర్నర్ అడ్డం పడుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలువిజయ్కు తమ ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించిన కాంగ్రెస్గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీరుపై సీపీఐతో పాటు పలువురి ప్రముఖుల అసంతృప్తిగవర్నర్ తీరుకు నిరసనగా నేడు లోక్భవన్ ముట్టడికి పిలుపుచెన్నైలోని లోక్భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుఆ మూడు ముందుకు వస్తేనే.. లెఫ్ట్ పార్టీల మద్దతు కోసం విజయ్ తీవ్ర ప్రయత్నంవిజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నానికి మాత్రమే మద్దతు ఇచ్చిన సీపీఐ(2)ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తుందో లేదో లేని స్పష్టతమరోవైపు ఏ విషయం తేల్చని సీపీఎం(2)నేడు ఏ విషయం చెబుతామంటున్న వామపక్ష పార్టీలువీసీకే(2) పార్టీ నిర్ణయంపైనా ఉత్కంఠనేడు వీసీకే కీలక సమావేశం.. ఆ తర్వాతే మద్దతుపై స్పష్టత వచ్చే చాన్స్ఈ మూడు పార్టీలు మద్దతు ఇస్తే మద్దతు ఇస్తే.. విజయ్ సర్కార్కు లైన్ క్లియర్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనుతమిళ రాజకీయాలపై నటుడు విశాల్ ఆసక్తికర పోస్ట్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనంటూ ఎక్స్లో పోస్ట్డీఎంకే-అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయంటూ ఉధృతంగా జరుగుతున్న ప్రచారంప్రచారాన్ని ఇప్పటికే ఖండించిన డీఎంకేవిజయ్కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన విశాల్ If it’s not #Tvk and if it’s going to be anything else but the unimaginable/shellshocking combination of DMK/AIADMK alliance to form the next government , then I as a citizen and voter foresee a disastrous and catastrophic consequential turnout amidst common public. Will not go…— Vishal (@VishalKOfficial) May 7, 2026తమిళనాడు సస్పెన్స్ కంటిన్యూస్తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం108 స్థానాల్లో విజయ్ పార్టీ విజయంమ్యాజిక్ ఫిగర్కు 10 స్థానాలు తక్కువవామపక్షాలు, ఇతర చిన్న పార్టీల మద్దతు కోరిన విజయ్మద్దతుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోని డీఎంకే మిత్రపక్షాలుటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ససేమీరాతొలుత.. బలంతో వస్తే టీవీకేకే అవకాశం అంటూ గవర్నర్ వ్యాఖ్యానించినట్లు ప్రచారంకాసేపటికే.. పూర్తి మెజారిటీ వచ్చే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటునైనా అంగీకరిస్తానంటూ వ్యాఖ్యానించారని మరో ప్రచారండీఎంకే-అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలుతమిళనాట ఏం జరుగుతుందోననే ఉత్కంఠ -
అలా చేస్తే బేరసారాలకు అవకాశం.. తమిళనాడు గవర్నర్
చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా చూపించాల్సిందేనని ఆ రాష్ట్ర గవర్నర్ తేల్చిచెప్పడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎమ్మెల్యేల బేరసారలకు పరోక్షంగా అనుమతి ఇవ్వలేమన్నారు.తమిళనాడు గవర్నర్ తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆయన తీరును కాంగ్రెస్తో పాటు అక్కడి పలువురు నేతలు ఖండించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో E ఆ రాష్ట్రంలోని ఓ పత్రికకు గవర్నర్ ఇంటర్వూ ఇచ్చారు.విశ్వనాథ్ అర్లేకర్ మాట్లాడుతూ.."మెజారిటీ లేకపోవడం అన్నది ఒక్క విజయ్ సమస్య మాత్రమే కాదు. తమిళనాడు సమస్య మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బేరసారాలకు అనుమతించలేం. విజయ్ని మోజారిటీ నిరూపించమని మేము అనలేదు. మోజార్టీతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తాం అని తెలిపాం. కాని వారు అలా చేయలేదు. దీనికి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఎలా అడ్డుకుంటున్నట్లు. ఏఐడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎస్.ఆర్ బొమ్మై కేసులోని ఉత్తర్వు దీనికి వర్తించదు" అని అన్నారు. కాగా విజయ్కు జెడ్ప్లస్ సెక్యూరిటీ కల్పించడంపైనా ఆ రాష్ట్ర గవర్నర్ డీజీపీపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్కు డీజీపీ శాంతిభద్రతలపై నివేదిక అందించారు. మరోవైపు రేపు గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ రేవు రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. -
'విజయ్ గెలుపునకు.. త్రిషకు సంబంధమేంటి?..' నటి ఆగ్రహం
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే పోటీ చేసిన తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. ఇక విజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఓకే కానీ.. విజయ్ గెలిచిన తర్వాత త్రిష పేరు కూడా అదే రేంజ్లో వైరలవుతోంది. ఫలితాల రోజు త్రిష బర్త్ డే కావడంతో.. ఈ గెలుపును ఆమెకు పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చాడంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా వీరద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కూడా టాక్ వినిపిస్తోంది. విజయ్ విజయం తర్వాత సీఎం టాపిక్ కంటే..వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ ఫోకస్ నడుస్తోంది.విజయ్- త్రిష పర్సనల్ లైఫ్పై వస్తున్న వార్తలపై నటి గాయత్రి శంకర్ స్పందించారు. విజయ్ గెలవడానికి త్రిషనే కారణమని అభినందిస్తున్న వారిని విమర్శించింది. ఒకవేళ పురుషుడి స్థానంలో మహిళ ఉంటే సమాజం ఇలాగే స్పందిస్తుందా అని ప్రశ్నించారు. ఒక నటి తన సహనటుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినట్లయితే ఏ సమాజం ఇలాంటివీ సహించదని ఆమె తన ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చింది. త్రిష స్థానంలో పురుషుడు ఉంటే ఈ విషయాన్ని జోక్గా తీసుకునేవారు కాదని.. యావత్తు పురుష సమాజం ఆగ్రహంతో రగిలిపోయేదని అన్నారు. ఆమెను అంతులేకుండా దూషించేవారని గాయత్రి అభిప్రాయపడ్డారు. గెలవడం సంగతి అటుంచితే.. ఆమె తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికే భయపడిపోయేదని గాయత్రి విమర్శించారు. కాగా.. గాయత్రి శంకర్ 'సూపర్ డీలక్స్', 'విక్రమ్' వంటి చిత్రాలతో కోలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. -
'విజయ్కు అడ్డంకులు.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్'
తమిళ హీరో, దళపతి విజయ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ హీరోగా నిలిచాడు. పాలిటిక్స్లో అడుగుపెట్టి తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. సీఎం కావడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ద్రవిడ రాజకీయాలను షేక్ చేశాడు. అన్ని స్థానాల్లో సింగిల్గా పోటీ చేసి 108 సీట్లు గెలిచారు. అయితే అధికారం చేపట్టేందుకు మాత్రం ఇంకా సీట్లు కావాలి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ను కలిశారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లిస్ట్ అందజేశారు. ఇంకా ఆరుగురు సభ్యులు అవసరం కావడంతో గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.తమ హీరో, నాయకుడు అత్యధిక సీట్లు గెలిచినా కూడా సీఎం కావడానికి మరింత సమయం పట్టడంపై ఓ అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ చెన్నైలోని విజయ్ ఇంటి బయట పూజలు చేస్తూ కనిపించారు. తమ నాయకుడికి అడ్డంకులు రావడంతో అభిమాని ఆవేదనకు గురయ్యారు. చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. எவ்வளவு கஷ்டம் வந்தாலும் என் தலைவர் முதலமைச்சர் ஆகனும்.. சாமி நீ தான் காப்பாதனும். 🥺🥺🙏pic.twitter.com/7KBbMzgwXN— KERALA VIJAY FANS CLUB (@KVFC_Official) May 7, 2026 -
విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్
-
అలా ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో అవాంతరం ఎదురవుతోంది. మెజారిటీ బలంతో వస్తేనే అందుకు అనుమతిస్తానంటూ గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఇవాళైనా సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురు చూస్తున్న టీవీకే ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. బుధవారం లోక్భవన్లో టీవీకే అధినేత విజయ్కు చుక్కెదురైంది. ఆ పార్టీ సమర్పించిన మద్దతుదారుల లిస్ట్పై గవర్నర్ పెదవి విరిచారు. పూర్తి స్థాయి బలం లేదు కదా? అని ప్రశ్నించారు. దీంతో గురువారం ఉదయం మరోసారి లోక్భవన్కు వెళ్లి గవర్నర్తో చర్చలు జరిపారు. 113 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన సంతకాలతో పాటు 20 మంత్రుల జాబితాను సమర్పించారు. సుమారు 40 నిమిషాల పాటు ఇందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. అయితే.. 113 మందితోనే ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారని ఆ సందర్భంలో గవర్నర్ ఆర్లేకర్, టీవీకే అధినేతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి న్యాయ నిపుణులతో చర్చించాకే నిర్ణయం చెబుతానని విజయ్ను పంపించేశారు. ఆ వెంటనే సానుకూల ప్రకటన రావొచ్చంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ,లోక్భవన్ నుంచి టీవీకే పార్టీకి ఫోన్కాల్ వెళ్లింది. విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వ ఎలా ఏర్పాటు చేస్తారని.. 118 ఎమ్మెల్యేల మద్దతు సమర్పించాకే సీఎంగా ప్రమాణం చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ, సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొందిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. విజయ్ పార్టీకి బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు ప్రముఖులు సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని.. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, .. ప్రజల ఆకాంక్షలను అవమానిస్తున్నారని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ట్వీట్ చేశారు. రాజ్యంగబద్ధ హోదాలో ఉన్నవాళ్లు ప్రజా తీర్పును గౌరవించాలని..తమ విధుల్ని సరిగా నిర్వర్తించాలని హితవు పలికారు. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలోనని.. లోక్భవన్లో కాదని అన్నారాయన. ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికైనా విజయ్ని ఆహ్వానించాలని ఆయన అన్నారు. మరో నటుడు ప్రకాశ్రాజ్ సైతం విజయ్ మద్దతుగా పోస్ట్ చేశారు. విజయ్కు ప్రజలు పట్టం కట్టారు. బలనిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాల్సిందేనని ట్వీట్ చేశారు.తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ బలం 113కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటునకు మరో ఐదు స్థానాలు అవసరం. ఈ క్రమంలో డీఎంకే కూటమి పార్టీల మద్దతును విజయ్ కోరారు. అయితే అవి విజయ్కు మద్దతు ఇచ్చే అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. మరోవైపు అన్నాడీఎంకే లేదంటే దాని కూటమిలోని చిన్నపార్టీల తరఫు నుంచైనా విజయ్కు మద్దతు లభిస్తుందేమోనన్న చర్చ తమిళనాట జోరందుకుంది. -
తమిళ రాజకీయాల్లో మహిళల జోష్.. అసెంబ్లీలో కొత్త చరిత్ర
రెండు దశబ్దాల అనంతరం తమిళనాడు అసెంబ్లీలో మహిళా శక్తి గళం జ్వలించనుంది. ఈ సారి ఏకంగా 23 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిలో 13 మంది టీవీకే పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. సాక్షి, చెన్నై: 17వ తమిళనాడు శాసన సభకు ఎన్నికలు ముగిశాయి. సినీ నటుడు విజయ్ టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో సుమారు 3 కోట్ల మంది మహిళలే. అందుకే మహిళా ఓటు బ్యాంక్ను గురి పెట్టి ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ పారీ్టలు హామీల వరాలు కురిపించడం జరుగుతోంది. అయితే, చట్ట సభలలోకి అడుగు పెట్టే మహిళల సంఖ్య ఇది వరకు తక్కువగానే ఉంటూ వచ్చింది.1991లో 32 మంది మహిళలు సభలో అడుగు పెట్టారు. ఆ తదుపరి పది శాతంలోపే గెలిచే వారు. 2016లో దివంగత సీఎం జయలలితతో సహా 21 మంది మహిళలు అసెంబ్లీలో ఉన్నారు. రెండు దశాబ్దాల 1991,2016 తదుపరి తాజా ఎన్నికలలో 23 మంది మహిళలు గెలిచారు. వీరిలో అత్యధికంగా 13 మంది విజయ్ టీవీకే నుంచి గెలిచిన వారే. వీరితోపాటూ ధర్మపురి నుంచి పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమణి, టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు కృష్ణస్వామి కుమార్తె సౌమ్య అన్బుమణి, డీఎండీకే దివంగత అ«ధినేత, నటుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్లు ప్రపథమంగా సభలో అడుగు పెట్టనున్నడంతో నారీ శక్తి గళం తమిళ అసెంబ్లీలో జ్వలించనుంది. ఇక, అన్నాడీఎంకే నుంచి కోటీశ్వరు రాలైన లాటరీ మారి్టన్ సతీమని లీమా రోజ్తో పాటుగా ఆరుగురు మహిళలు, సీపీఎం నుంచి డి. లత వంటి నారీ లోకం అసెంబ్లీకి ఎన్నిక కావడంతో తమిళ సభ కళకళ లాడనుంది. అయితే డీఎంకే నుంచి మహిళలు ఎవరు విజయం సాధించక పోవడం గమనార్హం. 25 మంది మైనారిటీ ఎమ్మెల్యేలు మహిళా శక్తే కాదు, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారు 25 మంది ఈసారి ఏకంగా ఎన్నికయ్యారు. ఇందులో డీఎంకే నుంచి మనోజ్ పాండియన్, ఆస్టిన్ ఉన్నారు. ఈ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి ఇద్దరు, మనిదనేయ మక్కల్ కట్చి నుంచి మరో ఇద్దరు, మనిదనేయ జననాయగ కట్చి నుంచి మరొకరు గెలిచారు. వీరిలో 9 మంది ముస్లిం నేతలు ఉన్నారు. ఇందులోనూ టీవీకే నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలయ్యారు. ఇక, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి 49 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పదేళ్ల అనంతరం బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. వీరు టీవీకే నుంచి గెలిచిన మైలాపూర్ ఎమ్మెల్యే వెంకటరామన్, శ్రీరంగం నుంచి గెలిచిన రమేష్ ఉన్నారు. జస్ట్ మిస్ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ తమిళనాడులో 38 జిల్లాల ఉండగా, టీవీకే ప్రభంజనం మార్మోగింది. 108 స్థానాలలో గెలిచింది. గెలిచిన చోట్ల 10,20,30 అంటూ లక్ష ఓట్ల మెజారిటీతో మెజారిటీ శాతం అభ్యర్థులు గెలిచారు. అయితే, 12 స్థానాలలో జస్ట్ మిస్ కావడం ఆపార్టీవర్గాలను తాజాగా ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 16 స్థానాలు ఉండగా 14ను టీవీకే కైవసం చేసుకుంది. ఇదే విధంగా అనేక జిల్లాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ, కన్యాకుమారి, తెన్కాశి, విల్లుపురం, అరియలూర్, మైలాడుతురై, నాగపట్టణం, నీలగిరి, తిరువారూర్ జిల్లాలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానం గెలవక పోవడం గమనార్హం. ఈ జిల్లాలు పూర్తిగా డీఎంకే, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగిన ప్రాంతాలే. ఈ జిల్లాల పరిధిలోని తిరుక్కోవిలూరులో 285 ఓట్లతో, విక్రవాండిలో 1000, దిండిగల్, పాపనాశం, కరూర్, కిల్లియూరు, పుదుకోట్టై, తిరుమయం వంటి ఆరు చోట్ల 2 వేల ఓట్ల తేడాతో ఓటమి అంటూ మొత్తంగా 12 స్థానాలు టీవీకేకు జస్ట్ మిస్ అయ్యాయి. వీటిలో విజయకేతనం ఎగుర వేసి ఉన్నా, పైన పేర్కొన్న మరికొన్ని జిల్లాలో కనీసం ఒకటి రెండు స్థానాలు చేజిక్కించుకుని ఉన్నా, సంపూర్ణ మెజారిటీతో టీవీకే అధికార పగ్గాలు చేజిక్కించుకుని ఉండేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
విజయ్కి సెక్యూరిటీ తొలగింపు
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో బలం పెంచుకునే పనిలో విజయ్ పడ్డారు. అయితే.. ఈలోపు ఆయనకు ఝలక్ తగిలింది. ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలవడంతో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జరిగింది. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమై చెన్నైలోని ఆయన నివాసం ముందు భద్రతను పెంచింది. విజయ్ నివాసంతో పాటు టీవీకే కార్యాలయం, అలాగే టీవీకే ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు కనిపించారు. అయితే గవర్నర్ను కలిశాక పరిస్థితి మారిపోయింది. రాత్రి పట్టినపాకంలోని పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరే సమయంలో విజయ్ సింగిల్ వెహికిల్లోనే ఇంటికి బయల్దేరారు. గత రెండ్రోజులుగా హడావిడి చేసిన కాన్వాయ్ కనిపించలేదు. ఆ సమయంలో ఆయన డల్గా కనిపించారు. పార్టీ శ్రేణుల వాహనాలు కూడా పెద్దగా ఆయన వెంట లేవు. கான்வாய் பாதுகாப்பு வாகனங்கள் எதுவும் இல்லாமல் சென்ற விஜய்.. பட்டினப்பாக்கம் அலுவலகத்தில் இருந்து விஜய் வீட்டிற்கு புறப்படுவதற்கு முன்பே கான்வாய் வாகனங்கள் அங்கிருந்து எடுத்துச் செல்லப்பட்டன.. pic.twitter.com/LwjOMtpgsW— Doctor Ramadoss OG (@DoctorRamadoss) May 6, 2026సీఎం హోదాలో ఇచ్చే జెడ్ఫ్లస్ సెక్యూరిటీని విజయ్కు కేటాయించింది తమిళనాడు పోలీస్ శాఖ. అయితే తాజా పరిణామాలతో ఆ భద్రతను కనీసానికి కుదించినట్లు స్పష్టమవుతోంది. అలాగే నివాసం వద్ద నుంచి కూడా సిబ్బందిని బాగా తగ్గించినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం ఆర్బీ చౌదరికి నివాళులర్పించి.. ఆయన తనయుడు జీవా(కోలీవుడ్ హీరో)ను విజయ్ ఓదార్చారు. ఆ సమయంలోనూ విజయ్ వెంట పెద్దగా సెక్యూరిటీ లేదు.మరోవైపు.. గవర్నర్ విజయ్ను కలిశాక మరో పరిణామం చోటు చేసుకుంది. టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథర్వ్ అర్జున మరోసారి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని కోరారు. ముందుగా సీఎంగా విజయ్ ప్రమాణం చేస్తారని.. ఆ తర్వాత శాసనసభలో బలనిరూపణ చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. అయితే.. ముందు మ్యాజిక్ ఫిగర్ (118) చూపించాకే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తేల్చి చెప్పారు. దీంతో తమిళ రాజకీయం రసకందాయంలో పడింది. -
విజయ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్
-
'తమిళనాట' సస్పెన్స్ థ్రిల్లర్
సాక్షి, చెన్నై: వందకు పైగా స్థానాల్లో గెలిచిన టీవీకే చీఫ్ విజయ్ మరో డజనుమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఖచ్చితంగా సీఎం కుర్చీపై కూర్చుంటారని అంతా భావిస్తున్న వేళ తమిళనాట పెను సంచలనాల పర్వానికి తెరలేచింది. గంట గంటకూ ఊహించని మలుపులతో అధికార పీఠం చివరికి ఎవరి పరమవుతుందో ఎవరూ చెప్పలేని అనూహ్య పరిస్థితి ఏర్పడింది. కలలో కూడా ఊహించనట్లుగా బద్ధ వ్యతిరేక డీఎంకే, అన్నాడీఎంకేలు ఏకమైపోయి సీఎం కుర్చీని తన్నుకుపోతాయన్న వార్త ఇప్పుడు యావత్ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. బయటి ఎమ్మెల్యేల మద్దతుతో ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చని గవర్నర్ను కలిసిన విజయ్కు ఊహించని పరిణామాలు ఒకదాని వెంట మరోటి వచ్చిపడి ఊపిరాడనివ్వట్లేవు. అధికారమే పరమావధిగా మీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయా అన్న ప్రశ్నకు డీఎంకే, అన్నాడీఎంకేలు ‘లేదు’అనే సమాధానిస్తున్నాయి. కానీ రహస్యంగా రెండు పార్టీల మధ్య విస్తతస్థాయిలో మంతనాలు జరుగుతున్నాయని తమిళనాడు మీడియాలో వార్తలు షికార్లుచేస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే ఉమ్మడిగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటుచేస్తామంటే గవర్నర్ అర్లేకర్ సరేనంటారా లేదంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకే తొలి ప్రాధాన్యత ఇస్తానంటారా? అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఇలాంటి సందిగ్ధావస్థలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే అంశంపై స్పష్టత కోసం న్యాయ నిపుణులతో గవర్నర్ సమావేశమయ్యారు. న్యాయ నిపుణులను లోక్ భవన్కు పిలిపించి, సుదీర్ఘంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాత్రి పదిన్నరగంటలదాకా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ద్రవిడ పార్టీల మధ్య కుదరని సయోధ్య! విజయ్ పార్టీకి అధికారం దక్కకుండా చేయడమే లక్ష్యంగా ద్రవిడ పార్టీలు రహస్య చర్చలు జరిపాయని మీడియాలో వార్తలొచ్చాయి. డీఎంకే, అన్నాడీఎంకే ప్రతినిధుల బృందాలు లోతైన చర్చలు జరిపాయని తెలుస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని అన్నాడీఎంకే ఆఫర్ చేయగా అందుకు డీఎంకే సమ్మతి తెలిపిందని, కానీ బయటి నుంచి మద్దతు ఇస్తామని డీఎంకే వెల్లడించినట్లు వార్తలొచ్చాయి. ప్రభుత్వంలో చేరితే ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధికి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని అన్నాడీఎంకే ఆఫర్చేసినట్లు తెలుస్తోంది. అందుకే ససేమిరా ఒప్పుకోబోమని, తప్పదనుకుంటే ప్రతిపక్షంలోనే కూర్చుంటామని డీఎంకే తెగేసి చెప్పడంతో అర్ధంతరంగా చర్చలు ముగిశాయని వార్తలొచ్చాయి. 118 మంది మద్దతుతో వస్తే చూస్తాం: గవర్నర్ అంతకుముందు బుధవారం ఉదయం నుంచి తమిళనాట పలు నాటకీయ పరిణామాలు సంభవించాయి. మంగళవారం రాత్రే మీకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లను జతచేసి టీవీకే చీఫ్ విజయ్ తన కీలక పార్టీ నేతలతో కలిసి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్కుమార్ తదితరలు ఉన్నారు. టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది. వీళ్లకు కాంగ్రెస్లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్లజాబితాను గవర్నర్కు విజయ్ సమరి్పంచి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. అందుకు గవర్నర్ సమ్మతి తెలపలేదు. 118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్కు గవర్నర్ సూచించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. దీంతో నిరాశతో విజయ్ వెనుతిరిగారు. మొదలైన మలుపుల పర్వం ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించలేదన్న వార్త తెలీగానే అప్పటిదాకా ప్రమాణస్వీకారం కోసం స్టేడియంలో జరుగుతున్న సన్నాహక ఏర్పాట్లు హఠాత్తుగా ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్కుతోడుగా అన్నాడీఎంకే సైతం టీవీకేకు మద్దతు పలకనుందనే వార్త వెనువెంటనే చక్కర్లు కొట్టింది. దీనిని అన్నాడీఎంకే కొట్టిపారేసింది. ‘‘ఇది పూర్తిగా అబద్ధం. ఏ రకంగా చూసినా మేం విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వబోం. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి ఆదేశానుసారమే మా 47 మంది ఎమ్మెల్యేలు నడుచుకుంటారు’’అని పార్టీ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి స్పష్టంచేశారు. తాము సైతం డీఎంకే కూటమికే మద్దతు ఇస్తామని సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) ఎమ్మెల్యేలు బుధవారం స్పష్టంచేశారు. అంతకుముందు సీపీఐ(ఎం), సీపీఐ, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు డీఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి స్టాలిన్ను కలిశారు. మీ వెంటే ఉంటామని మాటిచ్చారు. అయితే గురువారం సమావేశమై టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని డీఎంకే మిత్రపక్షమైన విదుథలై ఛిరుథైగల్ కట్చి(వీసీకే) చీఫ్ థోల్ తిరుమవాలన్ ప్రకటించారు. ‘‘మద్దతు ఇవ్వాలని విజయ్ మమ్మల్ని కోరారు. పార్టీ ముఖ్యులతో మాట్లాడాక ఏ విషయమైనా చెప్పగలను’’అని తిరుమవాలన్ వ్యాఖ్యానించారు. వీసీకేకు ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారు. మద్దతిస్తూ ముందుకొచ్చిన కాంగ్రెస్ బుధవారం చెన్నై పనయూరులోని టీవీకే కార్యాలయానికి తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గిరీశ్ చోడంకర్, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవర్తి నేతృత్వంలోని బృందం వెళ్లింది. వీరికి పుష్పగుచ్చాలతో విజయ్ బృందం ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా తమ పార్టీ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో కూడిన లేఖను విజయ్కు కాంగ్రెస్ నేతలు అందజేశారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ ఎన్నికల దాకా తమ మధ్య పొత్తు కొనసాగాలని, మతతత్వ పార్టీలను చేర్చుకోవద్దని కాంగ్రెస్ షరతు విధించింది. కాంగ్రెస్ మహిళా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని కోరింది. నాన్చుడి ధోరణి మానుకోవాలి.. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ నాన్చడమేంటని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి మండిపడ్డారు. ‘‘బలనిరూపణ అనేది శాసనసభలో చేస్తారు. లోక్భవన్లో కాదు. లోక్భవన్లోనే 118 సంఖ్య చూపించాల్సిన అవసరం లేదు. ఇకనైనా గవర్నర్ మాటున బీజేపీ రాజకీయాలుచేయడం మానుకోవాలి. తక్షణం గవర్నర్ విజయ్ను మళ్లీ పిలిచి వెంటనే బలనిరూపణకు అవకాశమివ్వాలి’’అని జ్యోతిమణి డిమాండ్చేశారు. ఏం జరగొచ్చు!! టీవీకే, కాంగ్రెస్ కలిస్తే? కనీసం 118 మంది ఎమ్మెల్యేలున్న కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదు. ఇక్కడ టీవీకే పార్టీలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లకు కాంగ్రెస్లోని ఐదుగురు కలిస్తే బలం 112కు పెరుగుతుంది. వీసీకే, సీపీఐ, సీపీఎంలోని తలో ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఆరుగురు వీళ్లకు జతకలిస్తే మొత్తం బలం 118కి పెరుగుతుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. టీవీకే, అన్నాడీఎంకే కలిస్తే? అన్నాడీఎంకేలోని 47 మంది ఎమ్మెల్యేలు జతకూడితే టీవీకే బలం 154కు పెరుగుతుంది. ఇప్పటికే మద్దతిచ్చిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ లెక్కలోకి తీసుకుంటే మొత్తం బలం ఏకంగా 159కి పెరుగుతుంది. అప్పుడు సునాయసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. ద్రవిడ పార్టీలు దగ్గరైతే? డీఎంకే, అన్నాడీఎంకే కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. డీఎంకేలోని 59, అన్నాడీఎంకేలోని 47 మందికి తోడు ఇరుపార్టీల మిత్రపక్షాలు తోడు వస్తే ఇది సాధ్యం. పీఎంకే(4), ఐయూఎంఎల్(2), సీపీఐ(2), సీపీఎం(2), ఏఎంఎంకే(1),డీఎండీకే(1) ఎమ్మెల్యేలు కలిస్తే మొత్తం బలం 120కి పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మద్దతు లభిస్తుంది. మొదలైన రిసార్ట్ రాజకీయాలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకేలు తమ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో పాతిక మందిని పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్కు బుధవారం రాత్రి 11.30 గంటలకు తరలించారు. సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలు రిసార్ట్కు వెళ్లారు. సీ వీషణ్ముగం ఉదయం టీవీకేతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామిన అన్నాడీఎంకే అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావడం గమనార్హం. డీఎంకే ఎమ్మెల్యేలూ పుదుచ్చేరి సమీప రిసార్ట్కు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. విజయ్కు భద్రత మాయం! విజయ్కు మంగళవారం, బుధవారం తమిళనాడు పోలీసులు గట్టి భద్రత కల్పించారు. గవర్నర్ను ఆయన కలిసే సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం ఉపయోగించే కాన్వాయ్ వెంటరాగా సొంత వాహనంలోనే లోక్భవన్కు వెళ్లివచ్చారు. అయితే బుధవారం రాత్రి 11.15 గంటల సమయంలో మాత్రం విజయ్ పట్టినంబాక్కం నివాసం నుంచి నీలాంకరై ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఆయనకు ఉదయం కల్పించిన కాన్వాయ్ భద్రత లేదు. అదనపు భద్రతను తొలగించారని తెలుస్తోంది. తనకు అదనపు భద్రత అక్కర్లేదని విజయ్ చెప్పడంతోనే ప్రభుత్వం కాన్వాయ్ను ఉపసంహరించుకుందని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
నిర్మాత ఆర్బీ చౌదరి మృతి.. విజయ్ నివాళులు
ప్రముఖ నిర్మాత అధినేత ఆర్బీ చౌదరి భౌతికకాయానికి హీరో, టీవీకే అధినేత విజయ్ నివాళులర్పించారు. చెన్నైలోని నిర్మాత నివాసానికి వెళ్లిన విజయ్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నికల హడావుడిలో ఉన్నప్పటికీ విజయ్ స్వయంగా వెళ్లి నివాళులర్పించడం విశేషం.కాగా... ఆర్బీ చౌదరితో విజయ్కు ప్రత్యేక అనుబంధం ఉంది. విజయ్ హీరోగా నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు ఆర్బీ చౌదరి నిర్మాత వ్యహరించారు. ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారు.మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్బీ చౌదరి దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన మృతితో దక్షిణాది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్తో పాటు టాలీవుడ్ హీరోలంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించగా కోలీవుడ్ స్టార్స్ నివాళులర్పించారు. కాగా.. గురువారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. தயாரிப்பாளர் ஆர். பி. சௌத்ரி உடலுக்கு தலைவர் விஜய் நேரில் அஞ்சலி! pic.twitter.com/GmhMrE5ByT— Tamilaga Vettri Kazhagam (@TVKFor_TN) May 6, 2026 -
విజయ్ జన నాయగన్.. తొలి హీరోగా రికార్డ్
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి మెజారిటీ రాకపోయినా వందకు పైగా సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దీంతో హీరో విజయ్ తమిళనాడు సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దళపతిన నటించిన చివరి సినిమా గురించి చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది.ఇప్పుడు విజయ్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడంతో త్వరలోనే జననాయగన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. అభిమానుల కోసం జననాయగన్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జననాయగన్ టైటిల్ కార్డ్పై దళపతి విజయ్ బదులు.. సీఎం విజయ్ అని రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు కేకలు వేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.టీఎన్ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలవడంతో మూవీ టీమ్ అభినందిస్తూ పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్స్ టైటిల్ కార్డు మార్చాలని కోరారు. ఫ్యాన్స్ విజ్ఞప్తితో గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్.. అంటూ జననాయగన్ టైటిల్ కార్డు వేసింది. పోలీసు డ్రెస్లో నడుచుకుంటూ వస్తున్న విజయ్ను లుక్ అదిరిపోయింది. త్వరలో కలుద్దాం అంటూ ఈ వీడియోను థియేటర్లలో ప్రదర్శించారు. ఒక నటుడికి సీఎం టైటిల్ కార్డు వాడడం ఇదే తొలిసారి అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశముంది. India's first time CM title card for actor !pic.twitter.com/7xrz4QgbmO— ʲᵈᴀʟᴇxᴀɴᴅᴇʀᵗʷᵉᵉᵗˢ (@JDALEXtweets) May 6, 2026 -
అలా చేశాడంటే.. విజయ్ పతనం ఖాయం..!
సినిమాలు వేరు.. రాజకీయం వేరు.. అవును ఇది ముమ్మాటికీ నిజమే. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది కూడా. సినీ గ్లామర్తో పాలిటిక్స్లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టలేకపోయారు. తమిళనాడులోనూ కమల్ హాసన్, విజయ్ కాంత్ లాంటి వాళ్లు కూడా నెగ్గలేకపోయారు. కానీ ఊహించని విధంగా దళపతి విజయ్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా అత్యధిక సీట్లు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా విజయ్ పేరు మార్మోగిపోతోంది.ఈ నేపథ్యంలో త్రిష పేరు కూడా హాట్టాపిక్గా మారింది. ఎన్నికల ముందే వీరిద్దరిపై రూమర్స్ వచ్చాయి. విజయ్ భార్య సంగీత సైతం విడాకుల పిటిషన్ వేయడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని టాక్ వినిపించింది. విజయ్-త్రిష కలిసి పెళ్లికి హాజరు రావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా విజయ్ గెలిచాక త్రిష నేరుగా ఇంటికెళ్లి మరి అభినందనలు తెలిపింది. దీంతో త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన ఓ స్థానంలో నిలబడుతుందని తమిళనాట హల్చల్ చేస్తోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పాలిటిక్స్లోకి త్రిష ఎంట్రీ ఇస్తే విజయ్ పతన ఖాయమని అంటున్నారు. అదేలాగో తెలుసుకుందాం.త్రిష ఎంట్రీతో విజయ్కి దెబ్బ..రాజకీయాల్లో సీఎం కుర్చీ అనేది అంత ఈజీ కాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పాలిటిక్స్లో వ్యక్తిగత విషయాలను తీసుకురాకపోవడమే మంచింది. త్రిషతో రిలేషన్ ఉన్నంత మాత్రాన ఆమెను రాజకీయాల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అదే జరిగితే విజయ్పై చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఎందుకంటే విజయ్కు మాత్రమే తమిళ ప్రజలు ఓటేశారు. అంతేకానీ త్రిషను చూసి కాదు. ఆమెను తీసుకొస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఇదంతా పాలన ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. అప్పట్లో త్రిషకు మద్దతు లభించినా.. ఆమెను విజయ్ రాజకీయంగా ప్రమోట్ చేస్తే మాత్రం ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ విషయంలో విజయ్ చాలా అప్రమత్తంగా ఉండాలి.వ్యక్తిగతం వేరు.. రాజకీయ జీవితం వేరుతిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సిందే. ఆ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న ప్రాంతం కావడం విశేషం. అక్కడ విజయ్ను చూసి మాత్రమే ఓటేశారు. అదే స్థానంలో త్రిషను నిలబెడితే ఆదిలోనే విజయ్కు దెబ్బపడే అవకాశముంది. అధికారం చేపట్టిన పార్టీ తొలి ఉపఎన్నికలోనే ఓడిపోతే ఆ ప్రభావం పాలనపై పడుతుంది. ఈ ప్రయోగం విఫలమైతే.. అది కేవలం ఒక సీటు ఓటమి మాత్రమే కాదు.. విజయ్ రాజకీయ పతనానికి సంకేతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ద్రవిడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని విజయ్ ముందుకెళ్లాలి. రాజకీయాలతో పర్సనల్ లైఫ్ను ముడిపెట్టకుండా పాలన సాగిస్తే విజయ్కే మంచిదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
విజయ్ గెలిచాక అన్ఫాలో చేశాడా?.. అసలు నిజమేంటి?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దళపతిపై పడింది. ఈ ఎలక్షన్స్లో అత్యధిక సీట్లు సాధించాడు. పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే ఏకంగా 108 స్థానాలు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చిన టీవీకే అధినేత విజయ్ సీఎం పీఠ ఎక్కనున్నారు. ఈ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఫ్యామిలీ గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఎన్నికల ముందే ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. విజయ్ గెలుపుతో జేసన్ తన తండ్రిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశాడా లేదా అనే దానిపై నెట్టింట చర్చ నడుస్తోంది.ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేసన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రస్తుతం 38 మందిని ఫాలో అవుతున్నారు. ఇటీవల కొంతమంది నెటిజన్స్ జేసన్ విజయ్ను అన్ఫాలో చేశాడని చెబుతున్నారు. అయితే మరికొందరేమో అతను మొదటి నుంచే విజయ్ను ఫాలో అవ్వలేదని అంటున్నారు. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల ముందే ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా విజయ్- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్పై జూన్లో విచారణ జరగనుంది. -
విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే టీవీకే అధినేత విజయ్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే వస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా.. మొత్తం ఖర్చును పార్టీ నిధుల నుంచే భరించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలోనే ఈ తరహా నిర్ణయం ఇదే తొలి కావడం గమనార్హం!రేపో లేదంటే ఎల్లుండో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. ఐదు వేల మంది హాజరయ్యేలా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని టీవీకే భావిస్తోంది. తమిళనాడు లోక్భవన్ (గవర్నర్ కార్యాలయం) ప్రకటన ప్రకారం.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ సాయంత్రం ప్రకటించబడతాయి. అయితే ఈ ఏర్పాట్లను ప్రభుత్వం కాకుండా టీవీకే పార్టీ స్వయంగా నిర్వహిస్తోందని లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి.సీఎం ప్రమాణ స్వీకార వేడుక అంటే.. ముఖ్యమైన ప్రజాస్వామ్య కార్యక్రమం. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజల ముందు రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ సమక్షంలో ఈ వేడుక జరగుతుంది. కాబట్టి ప్రజలు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మునే ఖర్చు చేస్తారు. సాధారణ పరిపాలన శాఖ (General Administration Department) ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. టెంట్లు, స్టేజ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, అతిథుల స్వాగతం వంటి అన్ని అంశాలకు ఖర్చు లెక్కలు ఈ శాఖే చూసుకుంటుంది. అలాగే..ఖర్చు స్థాయి కార్యక్రమం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సాదాసీదా ప్రమాణ స్వీకారం రాజభవన్లో జరిగితే ఖర్చు తక్కువగా ఉంటుంది. కానీ భారీ సభలు స్టేడియం లేదంటే పెద్ద మైదానంలో నిర్వహిస్తే ఖర్చు కోట్లలోకి వెళ్తుంది. ప్రజలకు విస్తృతంగా హాజరు అవకాశం కల్పిస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. వీటికి తోడు.. ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కీలకం. వేలాది పోలీసు సిబ్బంది, ఇతర దళాలు నియమించబడతాయి. వాళ్ల ప్రయాణం, భోజనం, లాజిస్టిక్స్ అన్నీ ప్రభుత్వ నిధుల నుంచే వస్తాయి. అదనంగా, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు.. పెద్ద టెంట్లు, వేదికలు, కూర్చోవడానికి సౌకర్యాలు కూడా ఖర్చులో ప్రధాన భాగం. గవర్నర్, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు.. ముఖ్య అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఆ ఖర్చు మరింత పెరిగిపోతుంది కూడా. అధికారిక ప్రభుత్వ కార్యక్రమం కావడంతో.. ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ప్రైవేట్ డొనేషన్లు లేదంటే వ్యక్తిగత నిధులు ఇందులో భాగం కావు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా.. ప్రజల పన్నుల ద్వారా సమకూరిన నిధులు ఈ వేడుకకు వినియోగించబడతాయి. అయితే విజయ్ మాత్రం ప్రభుత్వ ఖర్చు లేకుండా.. టీవీకే పార్టీ నిధులతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. ఇందుకు గవర్నర్ కూడా అంగీకరించినట్లు లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రానికి ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానా మీద భారాన్ని తగ్గిస్తూ, పార్టీ నిధులతోనే ఈ వేడుకను నిర్వహించాలని విజయ్ భావించడం.. ప్రజాస్వామ్యానికి, ప్రజల పన్నుల వినియోగానికి గౌరవం చూపినట్టేనన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. -
విజయ్ పవర్ స్ట్రోక్.. తెర వెనుక ఐదుగురు!
తమిళనాట ఎన్నికల పర్వం ముగిసింది. భారీ మెజార్టీతో టీవీకే విజయం సాధించారు. ద్రవిడ దిగ్గజ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు విజయ్ చుక్కలు చూపించి అధికారం చేజిక్కించుకున్నారు. అయితే, టీవీకే సాధించిన ఆకస్మిక విజయం వెనుక ఐదుగురు సీక్రెట్ సభ్యులు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. దీంతో, వారి గురించే ఇప్పుడు ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే..తమిళనాడులో విజయ్కు ఇప్పటికే బలమైన అభిమానగనం ఉంది. అభిమానుల విధేయతను ఎన్నికల బలంగా మార్చగలిగే ఒక శక్తివంతమైన ఆన్లైన్ సైన్యం విజయ్ వద్ద అప్పటికే అందుబాటులో ఉంది. ఇక అవసరమైంది కేవలం ఒక పార్టీ నిర్మాణాన్ని రూపొందించుకోవడం మాత్రమే. అందులో భాగంగానే.. విజయ్ కోసం ఐదుగురు సభ్యుల సీక్రెట్ టీమ్.. ఎన్. ఆనంద్, అరుణ్రాజ్, CTR నిర్మల్ కుమార్, ఆధవ్ అర్జున, KA సెంగుట్టువన్ రంగంలోకి దిగారు. ఈ కీలక బృందం టీవీకే సందేశాన్ని రూపొందించడంలోనూ, క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వహించడంలోనూ కీలక పాత్ర పోషించింది. వీరందరూ కలిసి విజయ్ సినీ ప్రపంచంలో ఒక భాగంగా ఉంటూ టీవీకే విజయ రథాన్ని విజయం వైపు నడిపించారు.ఆనంద్ (Bussy ఆనంద్)ఆనంద్ 2006లో పుదుచ్చేరిలోని 'Bussy' నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి, ఈయన 'Bussy' ఆనంద్గా ప్రాచుర్యం పొందారు. విజయ్ తరపున క్షేత్రస్థాయిలో వ్యవహరించే ప్రధాన వ్యక్తి ఈయనే. విజయ్ను 'దళపతి' అని సంబోధించే ఆయన, విజయ్ అభిమాన సంఘమైన 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను నేటి టీవీకేగా తీర్చిదిద్దడంలో కేంద్ర బిందువుగా నిలిచారు. విజయ్ పార్టీ పేరును ప్రకటించి, పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన విధేయత స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత, కళ్లలో నీళ్లతో, భావోద్వేగానికి లోనైన ఆనంద్.. విజయ్ పక్కన కూర్చుని కనిపించారు. 2026 ఎన్నికల్లో టీనగర్ నియోజకవర్గం నుండి ఆనంద్ విజయం సాధించారు.అరుణ్రాజ్..ఎంబీబీఎస్ పట్టా కలిగి మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన అరుణ్రాజ్ తన పరిపాలనా నైపుణ్యాన్ని టీవీకే పార్టీకి అందించారు. పన్ను దాడులు, విచారణలను నిర్వహించడంలో విశేష అనుభవం ఉన్న అరుణ్రాజ్.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొద్ది కాలంలోనే ఆయన TVK అంతర్గత కోర్ కమిటీలో ఒక కీలక సభ్యుడిగా ఎదిగారు. విజయ్ అనుసరించే స్వతంత్ర రాజకీయ వైఖరి తనను ఆకర్షించిందని అరుణ్రాజ్ గతంలో పేర్కొన్నారు. డీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించే ఆయన, 2026 ఎన్నికల్లో తిరుచెంగోడ్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.CTR నిర్మల్ కుమార్నిర్మల్ కుమార్.. TVK పార్టీకి డేటా, సోషల్ మీడియా నిపుణుడిగా వ్యవహరించారు. 2025లో టీవీకేలో చేరడానికి ముందు బీజేపీలో పనిచేసి రాజకీయ మెలకువలను నేర్చుకున్నారు. వాస్తవానికి, తమిళనాడులో టీవీకే డిజిటల్ ఉనికిని పెంచడంలో నిర్మల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంగా ఆయన కాషాయ పార్టీని వీడి, అన్నాడీఎంకేలో చేరారని వార్తలు వచ్చాయి. కానీ, అన్యూహంగా ఆయన టీవీకే చేరారు. నిర్మల్.. టీవీకేలో చేరిన తర్వాత సర్వేలు, ఓటర్ల డేటా విశ్లేషణ, పోలింగ్ బూత్ స్థాయి విశ్లేషణలపై ప్రత్యేక దృష్టి సారించారు. టీవీకే పార్టీకి 30% ఓట్ల వాటా లభిస్తుందని ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంతిమంగా పార్టీ 35% ఓట్ల వాటాను సాధించింది. ఆయన అందించిన వ్యూహాత్మక సూచనలే విజయ్ ఎన్నికల ప్రచార నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆయన తిరుప్పరంకుండ్రం నియోజకవర్గం నుండి విజయం సాధించారు.ఆధవ్ అర్జునఆధవ్ అర్జున భారతదేశ లాటరీ రాజుగా ప్రసిద్ధి. శాంటియాగో మార్టిన్ అల్లుడైన ఆధవ్ రాజకీయ ప్రస్థానం పలు రాజకీయ పార్టీల గుండా సాగింది. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని 'Voice of Commons' అనే రాజకీయ సలహా సంస్థను స్థాపించడం ద్వారా ప్రారంభించారు. త్వరలోనే ఆయన పనితీరు డీఎంకే పార్టీ దృష్టిని ఆకర్షించింది. దాంతో 2021లో ఆయన డీఎంకేలో చేరారు. వాస్తవానికి డీఎంకే కోసం పనిచేసేలా ప్రశాంత్ కిషోర్ను ఒప్పించి తీసుకురావడంలో ఆధవ్ కీలక పాత్ర పోషించారని చెబుతారు. అయితే, డీఎంకేలో తనకు ఆశించిన కీలక పదవి లభించకపోవడంతో ఉదయనిధి స్టాలిన్తో ఆయనకు విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తిరుమావలవన్ నేతృత్వంలోని VCK పార్టీలో చేరారు, అక్కడ ఆయనకు ఉప ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. అనంతరం, టీవీకే గూటికి చేరారు. 2026 ఎన్నికల్లో ఆయన విల్లివాక్కం నుండి గెలుపొందారు.కేఏ సెంగోట్టయ్యన్సీనియర్ నాయకుడైన సెంగోట్టయ్యన్.. టీవీకేకి అత్యంత అపారమైన రాజకీయ అనుభవాన్ని అందించారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా (గోబిచెట్టిపాలయం నుండి) ఎన్నికైన ఆయన, ఎంజీ రామచంద్రన్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. అలాగే, జయలలితకు గట్టి మద్దతుదారుగా ఉండేవారు. నిజానికి, జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి పదవికి ఎడప్పాడి కే పళనిస్వామి మరియు సెంగోట్టయ్యన్ ఇద్దరూ పోటీదారులుగా ఉన్నారు. శశికళ, టీటీవీ దినకరన్, పన్నీర్సెల్వంలను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో ఈపీఎస్తో విభేదాల కారణంగా సెంగోట్టయ్యన్ అన్నాడీఎంకేను వీడారు. పార్టీ నుండి విడిపోయిన తర్వాత, ఆయన 2025లో టీవీకేలో చేరి విజయ్కు మార్గదర్శిగా మారారు. ఈ క్రమంలోనే గోబిచెట్టిపాలయంపై అతని విజయం ఆయన శాశ్వత ప్రభావాన్ని మరోసారి బలపరిచింది. -
విజయ్, సువేందు సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. తమిళనాడులో దళపతి విజయ్ (టీవీకే), పశ్చిమ బెంగాల్లో బీజేపీ అగ్రనేత సువేందు అధికారి.. ఇద్దరూ చెరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 14 రోజుల్లో వీరు ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండటంతో, ఏ సీటును అంటిపెట్టుకోనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వీరి భవిష్యత్ వ్యూహాలపై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.సువేందు సంచలనం.. సీఎం రేసులో..పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీని భవానీపూర్ నియోజకవర్గంలో ఏకంగా 15,105 ఓట్ల భారీ తేడాతో ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా నందిగ్రామ్లోనూ 9,665 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. అయితే, ఆయన భవానీపూర్ను వదులుకుని, తన సొంత జిల్లా తూర్పు మేదినీపూర్లోని నందిగ్రామ్ స్థానాన్నే అంటిపెట్టుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మమతను రెండుసార్లు ఓడించిన ఘనత దక్కించుకోవడంతో ఆయన తదుపరి సీఎం రేసులో ముందున్నారు. మే 9న జరగనున్న ప్రమాణస్వీకారానికి పరిశీలకునిగా అమిత్ షా వ్యవహరించనున్నారు.చెన్నైకే విజయ్ ఓటు.. పెరంబూర్ ఫిక్స్తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్.. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ రెండు చోట్లా ఘన విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి ఆర్డి శేఖర్పై పెరంబూర్లో 53,715 ఓట్ల మెజారిటీతో నెగ్గగా, తిరుచిరాపల్లిలో 27,416 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే విజయ్ తన సొంత ప్రాంతమైన చెన్నైలోని పెరంబూర్ స్థానాన్ని అంటిపెట్టుకుని, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.బైపోల్స్ కోసం దళపతి మాస్టర్ స్ట్రోక్మధ్య, దక్షిణ తమిళనాడులో పార్టీ ప్రభావాన్ని విస్తరించాలనే వ్యూహంతోనే విజయ్ తొలుత తిరుచిరాపల్లి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆ స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుండటంతో, త్వరలో జరిగే ఉపఎన్నికలో అక్కడ మాజీ ఐఏఎస్ అధికారి యు సహాయంను బరిలోకి దించే అవకాశాన్ని టీవీకే అధిష్టానం పరిశీలిస్తోంది. టీవీకే ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కొత్తవారు కావడంతో పరిపాలనా అనుభవం కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం విజయ్దేనని పార్టీ నేతలు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ‘కమల’ వ్యూహం: బెంగాల్ రిపీట్.. పంజాబ్ డిలీట్! -
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే పార్టీకి సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎంకే-అన్నాడీఎంకేల మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47సీట్లతో మొత్తం 106సీట్లు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ప్రయత్నాలు ముమ్మరం 1970ల నుంచి డీఎంకే ,అన్నా డీఎంకే మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా ఒక్కటి కానున్న బద్ధ శత్రువులు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని డీఎంకే, అన్నాడీఎంకే పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలువిజయ్కు మద్దతిచ్చేందుకు వామపక్షాల నిరాకరణమద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలుకూటమిలోనే ఉంటామని ప్రకటన ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని చెప్పిన ముస్లిం లీగ్టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్రేపు విజయ్ ప్రమాణస్వీకారం అనుమానమేప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు లభించని గవర్నర్ అనుమతిమెజార్టీపై గవర్నర్ను ఒప్పించలేకపోయిన విజయ్విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలన్న గవర్నర్ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదు : టీవీకే లోక్భవన్లో జరిగిన పరిణామాలు రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చరేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న విజయ్ తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అని అడిగిన గవర్నర్ రేపు ఉదయం 6గంటల సమయానికి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పిన టీవీకే నేతలు ప్రమాణ స్వీకారానికి అడ్డులేదని చెప్పిన టీవీకే ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?లోక్భవన్కు చేరుకున్న విజయ్ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించిన గవర్నర్ ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?గవర్నర్తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారంపై క్లారిటీ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు విజయ్కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్కాంగ్రెస్తో పాటు విజయ్కు మద్దతు ఇచ్చిన సీపీఐ,సీపీఎం గవర్నర్ ఆర్లేకర్తో భేటీ కానున్న విజయ్ కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో విజయ్ భేటీపార్టీ ఆఫీస్ నుంచి లోక్ భవన్కు బయల్దేరిన విజయ్ గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాలు వివరాల్ని అందిచనున్న విజయ్ అంతకంటే ముందే తమిళనాడు ఎన్నికల సంఘం గవర్నర్ ఆర్లేకర్తో భేటీ భేటీలో గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాల్ని అందించిన అధికారులు విజయ్ మరో సంచలనం?సాయంత్రం లోక్భవన్కు విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్మద్దతుదారుల లిస్ట్ను గవర్నర్ను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ తర్వాతే ప్రమాణస్వీకారంపై రానున్న స్పష్టతరేపు లేదా ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణం?విజయ్ మరో సంచలన నిర్ణయంప్రమాణ స్వీకార ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి కాకుండా టీవీకే తరఫున చేయాలని నిర్ణయంఖర్చంతా భరించనున్న టీవీకే పార్టీనెహ్రూ ఇండోర్ స్టేడియంలో 5 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లుసాయంత్రంకల్లా రానున్న క్లారిటీ ప్రొటెం స్పీకర్ ఎవరంటే..టీవీకే నుంచే ప్రొటెం స్పీకర్9వ సారి ఎమ్మెల్యేగా నెగ్గిన సెంగొట్టియాన్అన్నాడీఎంకేలో సుదీర్ఘ కాలం ఉన్న సెంగొట్టియాన్గతేడాది విజయ్ టీవీకేలో చేరికవిజయ్కు కుడి భుజంగా వ్యవహరిస్తున్న సెంగొట్టియాన్ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే కూటమి పార్టీలతో చర్చలు జరిపిన సెంగొట్టియాన్ఫలించిన సెంగొట్టియాన్ దౌత్యం.. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, ఇతర పార్టీలుపార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న విజయ్మహాబలిపురంలోని రిసార్ట్లో బస చేసిన ఎమ్మెల్యేలుప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సమయం ఉండడంతో జాగ్రత్త పడ్డ టీవీకే అధినేతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 123?తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే నెగ్గిన స్థానాల సంఖ్య 108రెండు చోట్ల విజయ్ గెలుపు.. ఒక చోట రాజీనామా చేస్తే 107కాంగ్రెస్ 5 (మద్దతు ప్రకటన)సీపీఐ, సీపీఎం 2+2 (చర్చలు జరగాల్సి ఉంది.. దాదాపుగా మద్దతు ఖరారైనట్లే) ఏఎంఎంకే 1 (మద్దతు ప్రకటన)వీసీకే 2 (మద్దతు ఇవ్వబోమని తొలుత ప్రకటించారు. అయితే విజయ్ లేఖ రాశారు.. ఇంకా బదులు రావాల్సి ఉంది)పీఎంకే 4 (బదులు రావాల్సి ఉంది)అంతా సవ్యంగా సాగితే.. విజయ్ పార్టీ బలం 123కి చేరే చాన్స్తమిళనాడు రాజకీయాల్లో మరో సర్ప్రైజ్?బయటకు నుంచి టీవీకేకు మద్దతు ఇచ్చే యోచనలో అన్నాడీఎంకేఇప్పటికే అన్నాడీఎంకేలో విజయ్కు మద్దతు ఇచ్చే అంశంపై ముసలంసపోర్ట్ ఇవ్వాలని ఒక వర్గం.. ఇవ్వొద్దని మరో వర్గంఅన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలిసిన టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథవ్ అర్జునాఎన్డీయే నుంచి బయటకు వచ్చి విజయ్ టీవీకేకు మద్దతు తెలిపే అవకాశంఅదే జరిగితే అమాంతం పెరగనున్న టీవీకే బలంవిజయ్కు గవర్నర్ ఆహ్వానంతమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ ఆహ్వానంసాయంత్రం గవర్నర్ను కలవనున్న విజయ్మద్దతుదారుల లిస్ట్ను గవర్నర్ను అందజేయనున్న విజయ్టీవీకే బలం 108 (విజయ్ రెండు చోట్లా పోటీ.. ఒక చోట రాజీనామా చేస్తే 107)మద్దతు ప్రకటించిన కాంగ్రెస్మద్దతు ఇచ్చిన ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యేవామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశంటీవీకేకు భేషరతుగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ముగిసిన తమిళనాడు కాంగ్రెస్ నేతల భేటీటీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు లేఖ విడుదల చేసిన కాంగ్రెస్తమిళనాడు ఎన్నికల్లో.. డీఎంకే కూటమి తరఫున 28 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ఐదు స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్టీవీకే మద్దతు విషయంలో డీఎంకేతో విబేధాలుపరస్పర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్-డీఎంకే నేతలుఇదీ చదవండి: డీఎంకేతో కటీఫ్.. విజయ్తో దోస్తీవిజయ్కు మద్దతు.. తప్పేంటి?: కాంగ్రెస్విజయ్కు మద్దతు విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం: మాణిక్యం ఠాగూర్ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు: మాణిక్యం ఠాగూర్ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి?: మాణిక్యం ఠాగూర్తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వం: మాణిక్యం ఠాగూర్టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది: కార్తీ చిదంబరంపార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం: కార్తీ చిదంబరంసెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది: కార్తీ చిదంబరంవిజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి: కార్తీ చిదంబరంఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం: ఎమ్మెల్యే రాజేష్కుమార్కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్తో ఏం గెలవలేదు: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు: ఎమ్మెల్యే రాజేష్కుమార్ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళనాట మరో ట్విస్ట్అన్నాడీఎంకే మద్దతు కోరే యోచనలో టీవీకే విజయ్?అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇంటికి టీవీకే కీలక నేత పళనిస్వామితో భేటీ కానున్న అథవ్ అర్జునాటీవీకేలో టాప్ 5 కీలక నేతల్లో అథవ్ అర్జునా ఒకరుఎన్నికల్లో పని చేసిన అథవ్ అర్జునా వ్యూహాలుమద్దతుపైనే చర్చిస్తారంటున్న అన్నాడీఎంకేలోని ఓ వర్గంవిజయ్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకేనంటున్న మరో వర్గంఅన్నాడీఎంకే నుంచి టీవీకేకు టచ్లో 10 మంది ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే అత్యవసర సమావేశంఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, వామపక్ష పార్టీల మద్దతు కోరుతూ విజయ్ లేఖసాయంత్రం మద్దతుదారుల లిస్ట్తో గవర్నర్ను కలవనున్న విజయ్?తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుప్రభుత్వ ఏర్పాటునకు విజయ్ ప్రయత్నాలుతమిళనాడు కాంగ్రెస్తో పాటు చిన్న పార్టీల మద్దతు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకేలకు లేఖ రాసిన విజయ్మద్దతు తెలిపేందుకు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్(5), ఏఎంఎంకే(1)మద్దతు కోసం విజయ్ వెయింటింగ్ఈలోపే.. లోక్భవన్ నుంచి టీవీకేకు కబురుసాయంత్రంలోగా మద్దతుదారుల జాబితాను లోక్భవన్కు పంపనున్న టీవీకేస్వయంగా వెళ్లి సమర్పించే యోచనలో విజయ్రేపు సీఎంగా ప్రమాణం చేసే చాన్స్బలనిరూపణకు ఇప్పటికే రెండు వారాల గడువు కోరిన విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారుమధ్యాహ్నాం చెన్నైకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్సాయంత్రం టీవీకే అధినేత విజయ్కు అపాయింట్మెంట్ ఖారారు చేసిన లోక్భవన్రేపు సీఎంగా విజయ్ ప్రమాణం చేసే ఛాన్స్గవర్నర్తో భేటీ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్న టీవీకేఅన్నీ కుదిరితే.. రేపు నెహ్రూ స్టేడియంలో 11.30గం.కి సీఎంగా విజయ్ ప్రమాణంవిజయ్ ఒక్కడే ప్రమాణం చేసే అవకాశంబలనిరూపణకు.. గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్విజయ్కు శ్రీలంక నేతల శుభాకాంక్షలుతమిళనాట టీవీకే ప్రభంజనంతొలి ఎన్నికల్లోనే 108 సీట్లు సాధించిన విజయ్పోటీ చేసిన రెండు చోట్లా విజయ్ విక్టరీఅభినందిస్తున్న శ్రీలంక నేతలువిజయ్ గెలుపుతో ఉత్తర ప్రావిన్స్లో తమిళ యువత సంబురాలువిజయ్కు విషెస్ తెలియజేసిన ప్రతిపక్ష నేత, ఎంపీ నమల్ రాజపక్సగతంలో.. శ్రీలంక విషయంలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుఎల్టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించిన విజయ్శ్రీలంక తమిళుల కోసం గొంతెత్తడం మన బాధ్యత అంటూ వ్యాఖ్యఖర్గేకు విజయ్ లేఖప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ మద్దతు కోరుతూ టీవీకే లేఖఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన విజయ్సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ యూనిట్కే వదిలేసిన హైకమాండ్విజయ్ను కలిసేందుకు సమయం కోరిన కాంగ్రెస్తన కేబినెట్లో రెండు మంత్రి పదవులు కాంగ్రెస్కు!వామపక్ష పార్టీలనూ మద్దతు కోరిన విజయ్ఎల్లుండి వామపక్ష పార్టీలతో విజయ్ సమావేశంపళనిస్వామికి చుక్కలుటీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో లుకలుకలుఅన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి చుక్కలు చూపిస్తున్న చీలికలుఒక వర్గం ఇద్దామని.. మరో వర్గం ఇవ్వొద్దని వాదనలువిజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి గెలుపొందిన లీమాపళనిస్వామి నేతృత్వంలో నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకేకూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ఇస్తారా? అనే చర్చసమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతుపై ఏమాత్రం ఆసక్తిగా లేని విజయ్గతంలో జయలలిత టైంలో విజయ్కు పలు చేదు అనుభవాలు!అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్లో ఉన్నట్లు ప్రచారంఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమైన పళనిస్వామి47 సీట్లతో మూడో స్థానంలో ఉన్న అన్నాడీఎంకే గవర్నర్.. చెన్నైకి వస్తారా?లోక్భవన్ పిలుపు కోసం టీవీకే ఎదురు చూపులుకేరళ, తమిళనాడుకు గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ప్రస్తుతం త్రివేండ్రంలో ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు లోక్భవన్కు సమాచారం అందించిన టీవీకే వర్గాలుఇప్పటికే బలనిరూపణకు రెండు వారాల గడువు కోరిన విజయ్మద్దతుదారుల జాబితాను లోక్భవన్కు పంపాలని ఇప్పటికే గవర్నర్ సూచనపూర్తి సమాచారం ఇచ్చాకే కమ్యూనికేట్ చేస్తామంటున్న లోక్భవన్ వర్గాలుగవర్నర్ వస్తే.. వెళ్లి కలిసే యోచనలో విజయ్ఐదు కోసం..తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే ప్రయత్నాలుమేజిక్ ఫిగర్ 118టీవీకే తరఫున నెగ్గింది 108తిరుచ్చి ఈస్ట్కి రాజీనామా చేసే యోచనలో విజయ్అదే జరిగితే 108 నుంచి 107కి పడిపోనున్న టీవీకే బలంకాంగ్రెస్, ఏఎంఎంకే సపోర్ట్తో 113కి పెరగనున్న టీవీకే బలంమరో ఐదుగురి కోసం టీవీకే ప్రయత్నాలుకాంగ్రెస్ నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీకాంగ్రెస్ వైఖరిపై డీఎంకే మండిపాటుకాంగ్రెస్ ఆ ఐదు స్థానాలు నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేసీట్ల పంపకం విషయంలో డీఎంకే తప్పు చేసింది.. మరిన్ని సీట్లు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు ఇచ్చేవాళ్లం: కాంగ్రెస్కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వస్తుందా? బయటి నుంచే టీవీకేకు మద్దతు ఇస్తుందా?డీఎంకే ఇందుకు ఒప్పుకుంటుందా?డీఎంకే-కాంగ్రెస్ బంధం ముగిసినట్లేనా?అదే జరిగితే.. జాతీయ రాజకీయాల్లోనూ బలహీనపడనున్న డీఎంకే!టీవీకే ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరంతమిళనాడులో ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసిన టీవీకేమహాబలిపురంలోని ఓ రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు బసడీఎంకే కూటమిలోని పార్టీలతో టీవీకే నేత సెంగొట్టాయాన్ మంతనాలుకాంగ్రెస్ మద్దతు దాదాపు ఖరారువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్కు రెండు మంత్రిత్వ శాఖలకు ఇచ్చే యోచనఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్కు టీవీకే గాలంమన్నార్గుడి నుంచి నెగ్గిన కామరాజ్రేపే విజయ్ ప్రమాణం?తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి టీవీకే ముహూర్తం ఫిక్స్రేపు 11.30 ని. నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణంముహూర్తం పెట్టిన రాధన్ పండిట్నాలుగేళ్ల కిందటే విజయ్ విజయాన్ని జోస్యం చెప్పిన రాధన్తమిళనాడు గవర్నర్ కోసం ఎదురు చూపులుప్రస్తుతం కేరళం త్రివేండ్రంలో ఉన్న గవర్నర్విజయ్కు మరో షాక్ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకేకు మద్దతు నిరాకరించిన ఐయూఎంఎల్తమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన పార్టీడీఎంకే నాయకత్వానికే కట్టుబడి ఉంటామని వ్యాఖ్యఇప్పటికే మద్దతు ఇవ్వబోమని వీసీకే పార్టీ స్పష్టీకరణపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉: సారీ.. సపోర్ట్ ఇవ్వలేం!కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఫైర్విజయ్ టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయంతీవ్రంగా తప్పుబడుతున్న డీఎంకేసెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్గా డీఎంకే కూటమిలో కాంగ్రెస్వెన్నుపోటు కిందకే వస్తుందంటున్న డీఎంకేఇవాళ తమిళనాడు కాంగ్రెస్ సమావేశంస్టాలిన్ నేతృత్వంలో జరిగిన నిన్నటి కూటమి మీటింగ్కు కాంగ్రెస్ డుమ్మా విజయ్ మద్దతు అంశంపై విడిగా సమావేశమైన కాంగ్రెస్నేడు మరోసారి సమావేశమై మద్దతు ప్రకటన చేసే చాన్స్సంబంధిత వార్త: కాంగ్రెస్-డీఎంకే బంధం ముగిసినట్లేనా?టచ్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు?టీవీకేకు టచ్లో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుTVKకు మద్దతు ఇస్తామంటున్న పలువురు ఎమ్మెల్యేలుఅప్రమత్తమైన అన్నాడీఎంకే అధిష్టానంనేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంచెన్నైలోని AIADMK కార్యాలయంలో సమావేశంఅన్నాడీఎంకే తరపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలుగెలిచిన ఎమ్మెల్యేలందరూ రావాలని పళనిస్వామి ఆదేశంఅవసరమైతే రిసార్ట్కు తరలించే యత్నంఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలుతమిళనాడులలో ఏ పార్టీకి దక్కని మెజారిటీ(118)అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (108)ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకేమహాబలిపురం రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇతర పార్టీల ప్రయత్నాలుచెన్నైలోనే ఉన్న 59 మంది డీఎంకే, 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే కీలక సమావేశంనేడు గవర్నర్ను కలవనున్న విజయ్?నేడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలవనున్న టీవీకే అధినేత విజయ్ప్రస్తుతం కేరళం పర్యటనలో ఉన్న గవర్నర్నేడు మధ్యాహ్నాం చెన్నైకి చేరుకునే చాన్స్సాయంత్రంలోపు అపాయింట్మెంట్ కోరిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వివరించే అవకాశంఇప్పటికే రెండు వారాల గడువు కోరుతూ లేఖరేపు సీఎంగా నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణం?ఒకటి తక్కువైంది!ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకు వచ్చిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన తమిళగ వెట్రి కగళంమ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్ల దూరంవిజయ్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్విజయ్ కోరితే మద్దతు అంశం పరిశీలిస్తామన్న వామపక్షాలురెండు కలిపినా.. 9 స్థానాలేప్రభుత్వ ఏర్పాటునకు మరో సీటు తక్కువ -
విజయ్ గెలుపు.. బుట్టబొమ్మకు ముందే తెలుసా?
తమిళనాట ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్. అయితే ఈ సినిమా సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఎలక్షన్ ముందు అడ్డంకులు రావడంతో జన నాయగన్ వివాదం కోర్టుకు చేరింది. ఎన్నికల ముందు రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ మూవీలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది.ఈ సినిమా సంగతి పక్కన పెడితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ.. విజయ్ను చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో జన నాయగన్ మూవీ షూటింగ్ టైమ్లో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో విజయ్ సిగ్గుపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ గెలుస్తాడని బుట్టబొమ్మకు ముందే తెలుసా అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పూజా హెగ్డే కాన్ఫిడెన్స్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. BREAKING: Pooja Hegde points at Thalapathy Vijay as the election winner and he responds with a shy blush. pic.twitter.com/aUdvjB7Odx— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026 -
'గెలిచినందుకు కంగ్రాట్స్.. ఆ మాట తప్పకూడదు'.. విజయ్కు సత్యరాజ్ చురకలు
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయంపై నటుడు సత్యరాజు స్పందించారు. ఈ గెలుపు పట్ల విజయ్కు అభినందనలు తెలిపారు. అదే సందర్భంలో మీరు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. మీరు పెరియార్, అంబేద్కర్ను తనకు ఆదర్శమని ప్రకటించారని గుర్తు చేశారు. మీరు వారి విలువలను నిలబెట్టి, సామాజిక న్యాయాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. డీఎంకే స్టాలిన్ ఓటమి పట్ల బాధగా ఉందన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో తన సపోర్ట్ డీఎంకేకే ఉంటుందని సత్యరాజ్ స్పష్టం చేశారు.కాగా.. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే చీఫ్, హీరో విజయ్ ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ్ గెలుపొందారు. తొలిసారి ఎన్నికల్లో నిలిచిన విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లు సాధించింది. ఇంకా అధికారం చేపట్టాలంటే మరో పది సీట్లు కావాలి. ఇతర పార్టీల సహకారంతో విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. దీంతో సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. Congratulations #ThalapathyVijay & #TVK on your victory. You’ve cited Periyar & Ambedkar as your ideological leaders—hope you uphold their values and ensure social justice. Saddened by #MKStalin’s defeat, but I’ll continue supporting #DMK.– #Sathyaraj pic.twitter.com/c5Q7ikwpBo— Movies Singapore (@MoviesSingapore) May 5, 2026 -
విజయ్ గెలుపు వెనక.. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ముద్ర..!
ప్రస్తుతం ఎక్కడా చూసిన విజయ్ పేరే వినిపిస్తోంది. తమిళనాట మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ గెలుపు గురించి చర్చించుకుంటున్నారు. ఈ అసాధారణ విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు సైతం దళపతికి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రవితేజ, నాని లాంటి స్టార్స్ కూడా విజయ్పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో గెలుపు వెనక ఎవరెవరు కృషి చేశారా అన్న విషయాలంపై చర్చ నడుస్తోంది.ఈ విజయంలో ముఖ్యంగా విజయ్కు ఉన్న క్రేజ్ ఒక కారణం అయినప్పటికీ.. మరెన్నో సానుకూల అంశాలున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంగ్స్ కూడా ప్రత్యేక పాత్ర పోషించనట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో పాటలు కూడా గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయి. పొలిటికల్ సాంగ్స్కు మ్యూజిక్ కంపోజ్ చేయడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.అయితే విజయ్ అరంగేట్ర ప్రచారంలో వచ్చిన సాంగ్స్ అభిమానులను, ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్స్కు టాలీవుడ్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించడం మరో విశేషం. టాలీవుడ్లో బీజీఎం కింగ్ పేరున్న తమన్యువతను ఆకట్టుకునేలా రూపొందించిన మూడు ప్రచార పాటలను కంపోజ్ చేశారు. అప్పట్లో ఈ సాంగ్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. విజయ్ కోసం తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేలా చేశాయి. దీంతో విజయ్ విజయం వెనక తమన్ మ్యూజిక్ పాత్ర కూడా ఉందని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
'వాట్ ఏ గిఫ్ట్'.. త్రిషకు రాధికా, ఛార్మి బర్త్ డే విషెస్..!
తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఆమెపైనే అందరి దృష్టి పడింది. ఎన్నికల ముందు నుంచే ఆమెపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. విజయ్తో రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయినా తాను ఎక్కడా స్పందించకుండా సైలెంట్గానే ఉండిపోయింది. తాజాగా ఎన్నికల్లో విజయ్ విజయంతో అందరు త్రిష పేరునే జపిస్తున్నారు. ఫలితాల రోజే త్రిష బర్త్ డే కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విజయం త్రిషకు విజయ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ సైతం విజయ్- త్రిష రిలేషన్ కన్ఫామ్ చేసింది. త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. వాట్ ఏ గిఫ్ట్ అంటూ రాసుకొచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి సైతం త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. దర్శకుడు పూరి జగన్నాధ్, త్రిషతో దిగిన ఫోటోను షేర్ చేసింది. మీ ప్రత్యేకమైన రోజున ప్రత్యేక వేడుక.. మీరు మా అదృష్ట దేవత.. ఈ పుట్టినరోజు చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి పోస్ట్ చేసింది. టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. డబుల్ సెలబ్రేషన్ అంటూ పోస్ట్ చేసింది.కాగా.. త్రిష తన పుట్టినరోజు ఉదయాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆమె చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు. టీవీకే విజయం సాధించడంతో విజయ్ను ప్రత్యేకంగా కలిశారు. దీంతో విజయ్-త్రిష రిలేషన్పై అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే విజయ్ సతీమణి విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో జూన్ 15న విచారణకు రానుంది. కాగా.. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ స్థాపించిన టీవీకే 108 స్థానాలను గెలిచింది. -
‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం
ఏది జరిగినా మన మంచికే అనుకునే మనసు ఉంటే…ప్రతి కష్టం ఒక పాఠం అవుతుంది… ప్రతి ఓటమి ఒక అవకాశంగా మారుతుంది. ఇప్పుడు దళపతి విజయ్ విషయంలో ఇదే జరిగింది. ఎన్నికల ముందు ఆయనకు వరుస ఇబ్బందులు ఎదురయ్యాయి. భార్య సంగీతతో విడాకులు వివాదం.. మరోవైపు ప్రచారంలో తొక్కిసలాటలు, ఇంకోవైపు తన చివరి చిత్రం విడుదల వాయిదా పడడం.. ఇవన్నీ తట్టుకొని అలుపెరగకుండా ప్రచారం చేసి.. చివరకు రాజకీయ ప్రభంజనం సృష్టించాడు. తమిళనాడు రాష్ట్రానికి ఆయన సీఎం అయ్యే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న ఏకైక సినిమా ‘జన నాయగన్’ కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం కూడా ఖాయమే.ఆలస్యమే ఆమృతం..ఆలస్యం అయితే అమృతం కూడా విషం అవుతుందంటారు. నిజమే కానీ ‘జన నాయగన్’ విషయంలో మాత్రం ఆలస్యమే అమృతం అయ్యేలా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడింది. ఎన్నికల ముందు రిలీజ్ అయితే.. కొంతవరకు పొలిటికల్ కెరీర్కి కూడా ప్లస్ అవుతుందని విజయ్ భావించాడు. కానీ అది జరగలేదు. వాయిదా పడడమే కాదు.. అందులోని కొన్ని సన్నివేశాలు కూడా లీకయ్యాయి. ఓటీటీ బిజినెస్ కూడా చేజారిపోయింది. ఇక జన నాయగన్ రిలీజ్ అవుతుందో లేదో అని చాలా మంది అనుకున్నారు. కానీ నిన్నటి ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేసింది. 108 స్థానాల్లో టీవీకే పార్టీ గెలిచి.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. విజయ్ సీఎం అయిన తర్వాత జననాయగన్ విడుదల అవ్వడం ఖాయం. అప్పుడు ఈ సినిమాకు వచ్చే హైప్, క్రేజ్ వేరే లెవెల్ ఉంటుంది.బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..ఎన్నికల ముందు రిలీజ్ అయి ఉంటే..టాక్ని బట్టి కలెక్షన్స్ ఉండేవి. హిట్ టాక్ వస్తే కానీ ఈ సినిమా భారీ కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు టాక్తో సంబంధం లేదు. సినిమా ఎలా ఉన్నా.. తొలి మూడు రోజులు థియేటర్స్ కిక్కిరిసిపోతాయి. సీఎం సినిమా కాబట్టి.. ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేస్తాయి. ఎన్నికల ముందు ఎలా ఉండేదో కానీ..ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఈ సినిమాతో భారీగా నష్టాలు తప్పవని భావించిన కెవీఎన్ సంస్థ ఇప్పుడు ఊపిరిపీల్చుకుంది. మొన్నటిదాక జన నాయగన్కి శాపంగా మారినవన్నీ ఇప్పుడు వరంగా మారాయి. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. -
తమిళనాడు సీఎంగా విజయ్.. రెండేళ్ల క్రితమే చెప్పేశాడుగా..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ విజయకేతనం ఎగరేశాడు. పోటీ చేసిన తొలిసారే అత్యధిక సీట్లు సాధించిన సినీ గ్లామర్ పర్సన్గా చరిత్ర సృష్టించాడు. సింగిల్గా పోటీ చేసి.. గత 50 ఏళ్లుగా ద్రవిడ రాజకీయాలకు కంచుకోటగా మారిన పార్టీలకు చెక్ పెట్టాడు. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను ఓడించి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా.. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే వందకు పైగా సీట్లు సాధించి తానేంటో నిరూపించాడు. ఇక మిగిలింది సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే.అయితే విజయ్ సీఎం అవుతాడాని ముందే చాలాసార్లు హింట్ ఇచ్చారు. గతంలో విజయ్ సహనటుడు ప్రేమ్జీ అమరన్ కూడా విజయ్ సీఎం అవుతాడని చెప్పారు. 2026లో నేను అతనికే ఓటు వేస్తాను.. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాడని నేను మీకు హామీ ఇస్తున్నానని మాట్లాడారు. అతను అన్నట్లుగానే విజయ్ ఇప్పుడు సీఎం పీఠం ఎక్కనున్నారు.విజయ్ కూడా ముందే హింట్..టీవీకే అధినేత, హీరో విజయ్ సైతం తాను సీఎం అవుతానని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరలవుతోంది. తాను హీరోగా నటించిన గోట్ మూవీలో TN 07 CM 2026 అనే నంబర్ ఉన్న కారును నడుపుతూ కనిపించారు. టీఎన్ అంటే తమిళనాడు.. 2026లో సీఎం అంటూ కారు నంబర్తోనే ముందే చెప్పేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని విజయ్ ముందే ఫిక్సయ్యారు. తాజా ఎన్నికల్లో అదే చేసి చూపించాడు. ఈ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఆ కారు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.కాగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. 108 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ పార్టీకి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకి కేవలం 10 స్థానాలు మాత్రమే కావాలి. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. తిరుచ్చి (తూర్పు), పెరంబూరులో గెలిచారు. TVK formed in Feb 2024The Greatest of All Time release Sep 2024Look at the Car number.TN 07 CM 2026 ❤️❤️❤️The Election Results came out First in Theatre Screens 🔔Peak Detailing by @vp_offl Venkat Prabhu in Thalapathy Vijay movie GOAT 🔥🔥🔥#FI pic.twitter.com/Uv5M7RZR5A— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) May 4, 2026 -
విజయే సీఎం.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్!
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ తమిళ వెట్రి కళగం(టీవీకే)పార్టీ విజయ ఢంకా మోగించింది. విజయ్ ‘విజిల్’ మోతకు రాష్ట్రమే కాదు దేశమంతా షాకయింది. ఒంటరిగానే బరిలోకి దిగి 234 స్థానాలకు గాను 108 చోట్ల విజయం సాధించాడు. పార్టీ ఏర్పాటైన రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగి..సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే విజయ్ విక్టరీని ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేకపోయాయి. కానీ ఓ నటుడు ఎన్నికల రోజే విజయ్ విజయాన్ని ఖాయం చేశాడు. తమిళనాడుకు కాబోయే సీఎం విజయే అని ఓటేసిన రోజే చెప్పాడు. అతనెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన తమిళ నటుడు వీటీవీ గణేష్.విజయే సీఎం..ఏప్రిల్ 23న తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న గణేష్.. అనంతరం మీడయాతో మాట్లాడుతూ.. తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్గ్రేడ్ చేయడానికి విజయ్ పర్ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను.టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్..వీటీవీ గణేష్ చెప్పినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది. విజయ్ పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించాడు. దీంతో గణేష్ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్గా మారాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేదు కానీ.. సినీ నటుడు ముందే చెప్పాడని నెట్జిన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్’ అంటూ ఓ సినిమాలో గణేష్ చెప్పిన డైలాగ్స్ని కోట్ చేస్తూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. This Actor Confidence on #Vijay's Victory before result... ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ #TVKVijay #TVKVijayHQ pic.twitter.com/jlueARDA12— Rajesh Manne (@rajeshmanne1) May 4, 2026 -
విజయ్ వ్యూహం.. డీఎంకే, అన్నాడీఎంకే విలవిల
టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీని వెనక మరో వ్యూహం ఉండొచ్చనే చర్చా జోరందుకుంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 సీట్ల విక్టరీతో సంచలన విజయం నమోదు చేసింది తెలిసిందే. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీకి టీవీకే దగ్గర్లోనే ఆగిపోయింది. అయినప్పటికీ తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని.. ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు ఇవ్వాలని విజయ్ తమిళనాడు గవర్నర్ను కోరారు. ఆ వెంటనే.. నెగ్గిన వాళ్లందరినీ పార్టీ ప్రధాన కార్యాలయానికి రప్పించిన ఆయన.. అటు నుంచి అటే పూంజేరీలోని ఓ స్టార్ హోటల్కు తరలించాలని నిర్ణయించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే వాళ్లకు బస ఏర్పాటు చేయాలని పార్టీ కీలక నేతలను ఆయన ఆదేశించారు. అయితే..విజయ్ మాస్టర్ ప్లాన్?టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 సీట్లు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఒకట్రెండు సీట్లు నెగ్గిన పార్టీలు విజయ్ పార్టీతో అధికారంలో భాగమయ్యేందుకు ముందుకు వచ్చాయి. మద్దతు అంశం పరిశీలిస్తామని బహిరంగంగా ప్రకటనలు సైతం చేస్తున్నాయి. అయితే ఆయన ఈ విషయంలో ఆచితూచీ అడుగేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే పూర్తిగా ఆయన నిర్ణయమేనని.. అందులో తమ పాత్ర ఏదీ ఉండబోదని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. ఈ తరుణంలో.. రెండు వారాల గడువు కోరడం వెనుక వేరే ఉద్దేశం ఉండొచ్చన్న విశ్లేషణ నడుస్తోంది. ఈలోపు సమీకరణాలు ఎలాగైనా మారొచ్చని ఆయన లెక్కేస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. చిన్న చిన్న పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎప్పటికైనా రిస్క్ ఉండొచ్చు. అందుకే పెద్ద చేపలకే ఆయన గాలం వేసి ఉంటారనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్యాప్లో డీఎంకే లేదంటే అన్నాడీఎంకే నుంచి పలువురు బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించే అవకాశం లేకపోలేదు(అసలే అన్నాడీఎంకేలో ఆ అసంతృప్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది). ఇందుకు అవకాశం ఉండడంతోనే.. డీఎంకే, అన్నాడీఎంకేలు అప్రమత్తం అయ్యాయి. ఇవాళ చెన్నైలో ఆ పార్టీలు కీలక సమావేశాలు పెట్టుకున్నాయి. ఎమ్మెల్యేలంతా చెన్నైకు తరలి రావాలని ఆదేశించాయి. అటు నుంచి అటే వాళ్లను కూడా రిసార్ట్లకు తరలించవచ్చనే చర్చా అక్కడ జోరందుకుంది. మొత్తానికి విజయ్ మాస్టర్ స్ట్రోక్కు తమిళనాట దిగ్గజ పార్టీలు విలవిలలాడిపోతున్నాయి. -
ఒక్క ఓటు.. ఎంత పని చేసింది?
టీవీకే అధినేత విజయ్ ఒక పొలిటీషియన్గా కంటే నటుడిగా సందేశాత్మక చిత్రాల ద్వారానే తమిళ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తమిళన్, తుపాకీ, సర్కార్, మెర్సల్, బిగిల్ ఇలా.. ఆయన చిత్రాల్లో ఏదో ఒక మెసేజ్ కనిపిస్తుంటుంది. అయితే ఇందులో మురగదాస్ డైరెక్షన్లో వచ్చిన సర్కార్లో ఓటు అనేది ఎంత పవర్ఫుల్ ఆయుధమో అనేది చూపించారు. ఆ చిత్రంలో ఓటు హక్కు దుర్వినియోగం అయిన బాధితుడిగా కోర్టులో తన కేసు తానే వాదించుకుంటారు విజయ్. వాజ్పేయి సర్కార్ కూలిపోవడం దగ్గరి నుంచి.. ఒక్క ఓటు ప్రాధాన్యం కూడా ఆయన ఆ సీన్లో వివరిస్తారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపట్టూరు(185వ) నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే అభ్యర్థి.. మంత్రి పెరియాకరుప్పన్పై ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఈ విజయం ఈ ఎన్నికల ఫలితాల్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. అయితే.. ఈ ఒక్క చోటుకి కారణమైన వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. విజయ్ వీరాభిమాని అయిన మణికందన్ ఒమన్(మస్కట్)లో పని చేస్తున్నాడు. సుమారు 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చి టీవీకే అభ్యర్థికి ఓటేశాడు. ఈ విషయాన్నే నిన్న ఎన్నికల ఫలితం తర్వాత తన సోషల్ మీడియాలో అతను షేర్ చేసుకుని మురిసిపోయాడు. అంతేకాదు.. ఓటేయడానికి వచ్చే విషయాన్ని కూడా అతను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. అంతే.. ఒక్క ఓటు పవర్ ఏంటో తెలిసిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. Booked my flight ticket to vote for TVK. Awake and hopeful — lots of prayers that the survey turns true on May 4th— Manikandan Sivanantham (@mkxuv700) April 15, 2026 -
అటు మోదీ, ఇటు విజయ్.. ప్రపంచ మీడియా ఫిదా
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యూయార్క్ నుంచి లండన్ వరకు, ఇస్లామాబాద్ నుంచి ఢాకా వరకు అంతర్జాతీయ మీడియా పత్రికలన్నీ భారత్లో చోటుచేసుకున్న ఈ రాజకీయ పెనుమార్పులనే పతాక శీర్షికలుగా ప్రచురించాయి. తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ‘టీవీకే’ సృష్టించిన రాజకీయ సునామీ సైతం పాశ్చాత్య పత్రికల దృష్టిని ఆకర్షించింది.బెంగాల్లో కమల వికాసం.. బ్రిటన్ మీడియా ఆశ్చర్యంప్రతిపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ను మోదీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకోవడంపై బీబీసీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మోదీ 12 ఏళ్ల పాలనలో తూర్పు భారతావనిలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటని ఆ పత్రిక కొనియాడింది. మరోవైపు ‘ది గార్డియన్’ పత్రిక సైతం ఈ పరిణామం భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషించింది. ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని పేర్కొంది.అమెరికా పత్రికల్లో మోదీ, విజయ్ సంచలనాలుఅమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక బీజేపీ బెంగాల్ గెలుపును ‘చరిత్రాత్మకం’గా అభివర్ణించింది. హిందూ జాతీయవాదులు ప్రతిపక్షాల ప్రధాన కోటను బద్దలు కొట్టారని పేర్కొంది. తమిళనాడులో రాజకీయ ఓనమాలు కూడా తెలియని సినీ నటుడు జోసెఫ్ విజయ్ (టీవీకే).. డీఎంకే లాంటి బలమైన పార్టీలను మట్టికరిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మోదీ మూడో విడత పాలనలో ఈ ఘన విజయాలు ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో విశ్లేషించింది.పాక్, బంగ్లాదేశ్ మీడియాలోనూ..భారత ఎన్నికల ఫలితాల ప్రకంపనలు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీడియాలోనూ కనిపించాయి. పాక్ పత్రిక ‘డాన్’.. ప్రతిపక్షాల కోటను జాతీయవాద పార్టీ కైవసం చేసుకుందని పేర్కొంది. ఈ గెలుపు 2029 ఎన్నికల నాటికి మోదీని మరింత శక్తివంతంగా మారుస్తుందని తెలిపింది. అటు బంగ్లాదేశ్ పత్రిక ‘ఢాకా ట్రిబ్యూన్’ సైతం బెంగాల్ ఫలితాలతో పాటు, తమిళనాడులో రాజకీయ ఉద్ధండుడు ఎంకే స్టాలిన్ను వెనక్కి నెట్టి, విజయ్ పార్టీ అఖండ విజయం సాధించడాన్ని రాజకీయ సంచలనంగా వర్ణించింది.ఇది కూడా చదవండి: లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి.. -
గవర్నర్కు టీవీకే విజయ్ లేఖ
చెన్నై: తమిళనాడు గవర్నర్కు టీవీకే చీఫ్ విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని.. అవకాశం ఇవ్వాలంటూ విజయ్ కోరారు. లోక్భవన్కు ఈ-మెయిల్ ద్వారా ఆయన లేఖ పంపినట్లు సమాచారం. విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ మార్క్) 118. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలను గెలుచుకుంది.స్వతంత్ర అభ్యర్థులు, ఒకట్రెండు సీట్లు గెలుచుకున్న చిన్న పార్టీలపై విజయ్ దృష్టి సారించారు. సంఖ్యా బలం పరంగా చూస్తే.. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు అవసరమైనందున.. ఇతర పార్టీల నుంచి చీలిక తీసుకురావడం కంటే స్వతంత్రుల మద్దతు కూడగట్టడం సులభంగా టీవీకే భావిస్తోంది. వీరికి మంత్రి పదవులు, ప్రత్యేక నిధుల హామీ ఇవ్వడం ద్వారా మద్దతు పొందవచ్చని టీవీకే ప్లాన్ చేసినట్లు సమాచారం.ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అనే నినాదంతో విజయ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. ప్రతిపక్ష కూటముల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలు విజయ్ వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్.. గవర్నర్కు లేఖ రాయగా.. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ 14 రోజుల సమయం.. ఇతర పార్టీలతో చర్చలు జరపడానికి పొత్తులు కుదుర్చుకోవడానికి చాలా కీలకం. -
TVK ఘన విజయం విజయ్ ఇంటికి పోటెత్తిన అభిమానులు
-
అందరి నోర్లు మూయించిన విజయ్
-
BIG QUESTION: బెంగాలీ గడ్డపై కాషాయ జెండా పెద్దోళ్ళకు షాకిచ్చిన విజయ్
-
టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నిక
తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది విజయ్ టీవీకే. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అడుగు దూరంలోనే ఆగిపోయింది. సరిపడా మెజారిటీ లేకపోవడంతో.. ఏం జరగనుంది? అనే ఉత్కంఠ నెలకొంది. తమిళనాట టీవీకే విజయ్ ప్రభంజనం.. లైవ్ అప్డేట్స్టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్తమిళనాడులో కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఐదు ప్రభు త్వ ఏర్పాటుకు మద్దతు కోరిన టీవీకేఅందుకు చర్చలు జరిపి ఓకే తెలిపిన కాంగ్రెస్మోదీ ట్వీట్కు దన్యవాదాలు తెలిపిన విజయ్ఇతర పార్టీలతో టీవీకే చర్చలురేపు గవర్నర్ను కలవనున్న టీవీకే చీఫ్ విజయ్మద్దతు కోసం ఇతర పార్టీలతో టీవీకే చర్చలుతమ పార్టీ నుంచి గెలిచిన వారిని రిసార్టుకు తరలింపు7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?టీవీకే తరఫున ఎన్నికైన నేతలతో ముగిసిన విజయ్ భేటీ ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం? టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నికఎన్నికైన నేతలతో చర్చించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు స్టాలిన్ రాజీనామాను ఆమోదించిన తమిళనాడు గవర్నర్ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా స్టాలిన్తెరపైకి రిసార్ట్ రాజకీయంతమిళనాడులో మరోసారి తెర మీదకు రిసార్ట్ రాజకీయంమల్లాపురంలోకి రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేల తరలింపుప్రభుత్వ ఏర్పాటునకు సమయం పట్టేలా ఉండడంతో ఈ నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే బసమరోవైపు.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్అప్రమత్తమైన డీఎంకే, అన్నాడీఎంకేవెంటనే చెన్నైకి రావాలంటూ ఇరు పార్టీల నెగ్గిన అభ్యర్థులకు పిలుపుసమావేశాల తర్వాత.. రిసార్టులకు వాళ్లనూ తరలించే చాన్స్విజయ్ విక్టరీపై ప్రేమలత విజయ్కాంత్ ఆసక్తికర వ్యాఖ్యలువిజయ్ మా బిడ్డలాంటోడుఅందుకే ఆయన్ని ఏనాడూ విమర్శించలేదుమొదటి నుంచి ఆయన కెప్టెన్(విజయ్కాంత్)తో ఉన్నారువిజయ్ చక్కగా పాలించాలితమిళనాడు ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచిన డీఎండీకేటీవీకే ఫ్లోర్ లీడర్గా విజయ్!టీవీకే ఎమ్మెల్యేలతో కొనసాగుతున్న విజయ్ భేటీఫ్లోర్ లీడర్గా విజయ్ ఎన్నికఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన స్థానాలపై చర్చతమిళనాట ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేకీలకంగా మారిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇతర చిన్న పార్టీలువిజయ్ వదులుకునేది ఆ స్థానాన్నే?తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయంపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్పెరంబూర్ (Perambur)లో 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించిన విజయ్తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) నియోజకవర్గంలో 27,416 ఓట్ల మెజారిటీతో విజయంరెండింటిలో ఏదో ఒకదానిని వదులుకోవాల్సిన పరిస్థితితిరుచ్చి ఈస్ట్ను వదులుకునే యోచనలో విజయ్?విజయ్ వదులుకుంటే ఎవరు పోటీ చేస్తారా? అనే ఉత్కంఠటీవీకే ఆఫీస్లో విజయ్తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే108 స్థానాల్లో విజయ్ పార్టీ విక్టరీపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్నెగ్గిన ఎమ్మెల్యేలతో టీవీకే ఆఫీస్లో విజయ్ భేటీ (106+విజయ్+విజయ్)ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభంఇవాళ అన్నాడీంకే కీలక సమావేశంతమిళనాడు ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకేనేడు పళనిస్వామి నేతృత్వంలో ఆ పార్టీ కీలక సమావేశంగెలిచిన ఎమ్మెల్యేలు చెన్నైకి రావాలని పళని పిలుపుటీవీకే కీలక ప్రకటనప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై వస్తున్న రూమర్లకు టీవీకే చెక్నిన్న.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న టీవీకేఇవాళ.. జట్టు కట్టవచ్చనే సంకేతాలుఏ పార్టీతో జత కట్టాలనేది అధినేత విజయే నిర్ణయిస్తారని టీవీకే కీలక నేతల వ్యాఖ్యఇప్పటికే సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలుప్రభుత్వ ఏర్పాటులో.. ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2లు కూడా కలిసొచ్చే అవకాశంకొనసాగుతున్న టీవీకే కీలక సమావేశంఎమ్మెల్యేలతో విజయ్ భేటీమరికాసేపట్లో స్పష్టత వచ్చే చాన్స్ఇప్పటికే.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్స్టాలిన్ రాజీనామాతమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామారాజీనామా లేఖను గవర్నర్కు పంపిన డీఎంకే అధినేతఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్కు లేఖ రాసిన టీవీకే అధినేత విజయ్ పూర్తి మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరిన విజయ్ఓటమిపై స్పందిస్తూ ప్రజా తీర్పును శిరసావహిస్తానని స్టాలిన్ ప్రకటనప్రధాన ప్రతిపక్షం బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని వెల్లడితమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికొలతూర్లో ఓడిన ఎంకే స్టాలిన్కాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ను ఎన్నుకునే అవకాశం టీవీకే ఆఫీస్కు విజయ్టీవీకే ప్రదాన కార్యాలయానికి చేరుకున్న అధినేత విజయ్మరికాసేపట్లో గెలిచిన 108 ఎమ్మెల్యేలతో సమావేశంశాసనసభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశంప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలుకాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకునే చాన్స్?ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడుపు కోరిన విజయ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్ల దూరంవిజయ్ ఆహ్వానిస్తే మద్దతిస్తాంతమిళనాట శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుతమిళనాడు ఎన్నికల్లో చెరో రెండు సీట్లు నెగ్గిన వామపక్ష పార్టీలుసీపీఐ రెండు, సీపీఎం 2ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యానికి లెఫ్ట్ పార్టీల ఆసక్తివిజయ్ ఆహ్వానిస్తే మద్దతు గురించి చర్చిస్తామంటున్న వామపక్షాలుఇప్పటికే టీవీకేతో కాంగ్రెస్ సంప్రదింపులుడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ!తమిళనాట 108 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేఅధికారానికి మరో 10 సీట్ల దూరంలో విజయ్ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న చిన్నపార్టీల లెక్కలుకీలకంగా ఆ పార్టీలు?తమిళనాడు లో సంకీర్ణ ప్రభుత్వం, ఏ పార్టీ కు పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వని తమిళ ప్రజలు108 అసెంబ్లీ స్థానాలు గెలిచిన టీవీకే డీఎంకే 59, ఏ. ఐ.డి.ఏం కే 47 సీట్లు లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు గాను 10 సీట్లు దూరంలో టివికేరెండు వారాల్లో ప్రభుత్వం ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరిన విజయ్ గడువులోగా మెజారిటీ నిరూపించుకునేందుకు సిద్ధం అంటూ లేఖకీలకంగా మారిన తమిళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుతమినాడు లో కాంగ్రెస్ 5 స్థానాలు, పి.ఏం.కే 4, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలుఇవిగాక.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2, డీఎండీకే 1, అమ్మ మక్కల్ పార్టీ 1 స్థానాలుఒకే ఒక్క స్థానంలో నెగ్గిన బీజేపీ 1కీలకంగా మారిన కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్, వామపక్ష పార్టీలుఏం తేలుస్తారో?టీవీకే ప్రధాన కార్యాలయం పనయూరు వద్ద విజయ్ అభిమానులు సందడితమిళనాడు నలుమూలలా నుంచి తరలి వస్తున్న టీవీకే నాయకులు, కార్యకర్తలు, విజయ్ వీరాభిమానులుఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయం కు రానున్న టివికే అధినేత విజయ్టివికే గెలుపొందిన ఎమ్మెల్యేలు తో భేటీ కానున్న విజయ్విజయ్ వెంట ఎవరెవరు?ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయంలార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేమ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంవిజయ్ వెంట కలిసొచ్చేది ఎవరనే ఉత్కంఠఅన్నాడీఎంకేనా?.. కాంగ్రెస్సా? చిన్నపార్టీల కూటమా? అనే విశ్లేషణలునేడు గవర్నర్ను కలవనున్న విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరే అవకాశం!ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి!తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనున్న డీఎంకేమరికాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంకొళత్తూర్లో ఓటమి పాలైన ఎంకే స్టాలిన్చెపాక్లో తనయుడు ఉదయ్నిధి స్టాలిన్ విజయంప్రజా తీర్పును శిరసావహిస్తామని.. ప్రతిపక్షంగా పోరాడతామని ప్రకటించిన స్టాలిన్కాంగ్రెస్తో సెంగోట్టయన్ చర్చలు!తమిళనాట మారుతున్న రాజకీయ సమీకరణాలువిజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు?ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన హస్తం పార్టీకాంగ్రెస్తో టీవీకే నేత, మాజీ మంత్రి సెంగోటియన్ చర్చలుఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన విజయ్లోక్భవన్కు విజయ్?తమిళనాడు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన టీవీకే అధినేత విజయ్టీవీకే ప్రధాన కార్యాలయంలో నెగ్గిన ఎమ్మెల్యేలతో మీటింగ్శాసనసభ పక్ష నేతను ఎనుకోనున్న టీవీకేసమావేశం తర్వాత నేరుగా లోక్భవన్కు దళపతి?ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసే అవకాశంతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన టీవీకేతమిళనాడులో హంగ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తక్కువ!ఇప్పటికే మద్దతు కూడకట్టుకున్న విజయ్?మరికొద్ది గంటల్లో వీడనున్న ఉత్కంఠనేడు టీవీకే కీలక సమావేశంవిజయ్ నేతృత్వంలో టీవీకే కీలక సమావేశంనెగ్గిన 108 మంది ఎమ్మెల్యేలను మీటింగ్కు ఆహ్వానించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై చర్చించే అవకాశంఈ సమావేశం తర్వాతే కీలక నిర్ణయం ప్రకటించనున్న విజయ్విజయ్ నివాసం వద్ద కోలాహలంచెన్నైలోని విజయ్ నివాసం వద్ద కోలాహలంభారీగా పోలీసు భద్రత ఏర్పాటువిజయ్ నివాసం బయట భారీగా చేరిన టీవీకే శ్రేణులు, ఆయన అభిమానులుమరోవైపు.. విజయ్ ఇంటికి క్యూ కడుతున్న ప్రముఖులువిజయ్కు రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువటీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న పలు పార్టీలుమొదలైన సంప్రదింపులుతమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలుఇప్పటికే అత్యధిక సీట్లు నెగ్గిన టీవీకే పార్టీతో మొదలైన సంప్రదింపులుఅందరినీ కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు?ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపుపీఎంకే నుంచి మరో నలుగురువామపక్షాల సంఖ్య 2,ఐయూఎంఎల్ 2విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటాడా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా? అనే చర్చమరో 10 సీట్ల దూరంలో.. ఉత్కంఠగా తమిళనాడు రాజకీయంసింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే234 స్థానాల్లో 108 స్థానాల్లో టీవీకే విజయండీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాల్లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో 10 మంది సభ్యులు అవసరంపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉.. విజయ్ ముందు ఆరు ఆప్షన్లు! ఇవిగో..ఓటమిపై స్పందించిన స్టాలిన్ప్రజల తీర్పును శిరసావహిస్తాం: స్టాలిన్ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడతాం: స్టాలిన్ఫలితాల వేళ.. అభివాదం చేసే టైంలో భావోద్వేగానికి గురైన స్టాలిన్దాదాపుగా కంటతడి పెట్టినంత పని చేసిన డీఎంకే అధినేతకొలతూర్లో స్టాలిన్ ఓటమిస్టాలిన్ను 7 వేల ఓట్ల మెజారిటీతో ఓడించిన టీవీకే అభ్యర్థి బాబు విక్టరీ అనంతరం ‘ఫినిష్’ సంజ్ఞతో స్టాలిన్ను ఎద్దేవా చేసిన బాబువిజయహో..మార్పు నినాదంతో.. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను చావు దెబ్బ కొట్టిన విజయ్తమిళనాట అత్యధిక సీట్లు నెగ్గిన పార్టీగా తమిళగ వెట్రి కగళండీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించిన టీవీకేతొలి ఎన్నికల్లోనే తమిళనాడులో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా రికార్డు234 స్థానాల్లో పోటీ చేసి.. 108 స్థానాల్లో నెగ్గిన టీవీకే పోటీ చేసిన రెండు చోట్ల నెగ్గిన టీవీకే అధినేత విజయ్డీఎంకే కూటమి దారుణ ఓటమిడీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ఓటమిమొత్తం మంత్రులంతా ఓటమిమూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే కూటమిమ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో తమిళనాడు అసెంబ్లీలో హంగ్తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో విజయ్ -
ఆరు ఆప్షన్లు.. ఏది జరిగినా విజయ్ సర్కార్కు లైన్క్లియర్!
తమిళనాట దళపతి విజయ్ అపూర్వ విజయం గురించి దేశం మొత్తం చర్చ నడుస్తోంది. ఒక నటుడిగా రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అత్యధిక సీట్లు నెగ్గి ప్రభంజం సృష్టించారాయన. అలాగే ఒంటరి పోరుతోనే అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఫలితాల్లో హంగ్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ తమిళగ వెట్రి కగళం పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమి 74, అన్నాడీఎంకే కూటమి 52 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమిలో డీఎంకే 59, కాంగ్రెస్ 5, వామపక్షాలు 2, వీసీకే 2, ఇతర మిత్రపక్షాలు 4 ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిలో అన్నాడీఎంకే 47, పీఎంకే 4, బీజేపీ 2 నెగ్గారు. మొత్తం 234 సీట్లు ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే మరో 10 సీట్ల దూరంలో టీవీకే నిలిచింది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు ఎలా చేయనుందా? అనే చర్చ మొదలైంది. విజయ్ ముందు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. మొదటి మార్గం.. ఎన్డీయే కూటమితో చేతులు కలపడం. సంఖ్యాపరంగా ఇది సులభమైనది, ఎందుకంటే రెండు పార్టీల కలయికతో మెజారిటీ వెంటనే వస్తుంది. కానీ బీజేపీతో అన్నాడీఎంకేకు ఉన్న సంబంధం విజయ్కు ఇమేజ్ సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఆయన బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించారు కాబట్టి. రెండో మార్గం.. అన్నాడీఎంకేతోనే జట్టు కట్టడం. కానీ బీజేపీని వదిలేసి!. ఇది విజయ్కు క్లీన్ రూట్ ఇస్తుంది. యాంటీ-బీజేపీ వైఖరిని కొనసాగిస్తూనే.. ఇటు అన్నాడీఎంకే బేస్ను విజయ్ పొందగలరు. అయితే, ఎన్డీయే నుంచి బయటకు రావడం అన్నాడీఎంకేకు జాతీయ స్థాయిలో ప్రభావం చూపే కఠిన నిర్ణయం అవుతుంది.మూడో మార్గం.. చిన్న పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడడం. తద్వారా విజయ్ తన స్వతంత్రతను నిలబెట్టుకుంటారు. “క్లీన్ బ్రేక్” ఇమేజ్ కొనసాగుతుంది. అయితే ఇలాంటి ప్రభుత్వం బలహీనంగా ఉంటుంది. చిన్న పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉండి.. స్థిరత్వం ప్రశ్నార్థకమవుతుంది.నాలుగో మార్గం.. కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇవ్వడం. కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇవ్వడం. తద్వారా విజయ్కు మెజారిటీ వస్తుంది. అలాగే బీజేపీతోనూ విజయ్కు దూరం కొనసాగుతుంది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి రావొచ్చు.ఐదవ మార్గం.. రెయిన్బో కూటమి. చిన్న పార్టీలతో కలసి, అన్నాడీఎంకే లేదంటే కాంగ్రెస్ బయట మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది విజయ్ స్వతంత్రతను నిలబెట్టుకునే మార్గం. కానీ ఇది కూడా సంక్లిష్టమైన కూటమి అవుతుంది, ఇలాంటి ప్రభుత్వ నిర్వహణ కష్టతరంగా మారుతుంది.ఆరో మార్గం.. డీఎంకే మద్దతు పొందడం. ఇది అక్కడి రాజకీయాల్లో కలలో కూడా జరగని పరిణామమే అవుతుంది. విజయ్ మొదటి నుంచి డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించారు. కాబట్టి డీఎంకే మద్ధతు ప్రజల్లో ఆయన విశ్వసనీయతను దెబ్బ తీసే చాన్స్ ఉంది. అయినప్పటికీ హంగ్ అసెంబ్లీ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యమైన కలయికలు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విజయ్ నేతృత్వంలో టీవీకే నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. నెగ్గిన అభ్యర్థులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారాయన. పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశం తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
విజయ్ విక్టరీ.. కొత్త పేరుతో ‘జననాయగన్’ రిలీజ్?
నటుడు విజయ్ కధానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయకన్. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. గత జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పుటికీ తెరపైకి రాలేదు. అసలు ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. మరో పక్క ఓటీటీ హక్కులను పొందిన నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని వదిలేసిందనే ప్రచారం జోరందుకుంది. సోమవారం తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయఢంకా మోగించడంతో పలువురు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిమాంటీ కాలనీ, కోబ్రా చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తన ఇస్టాలో ఒక ట్వీట్ చేశారు. అందులో మాంభూమికి ముదల్వర్(గౌరవనీయులైన ముఖ్యమంత్రి) అనే పేరుతో జననాయకన్ చిత్రాన్ని త్వరగా విడుదల చేయండి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని మిస్ అయిన సెలబ్రేషన్ను ఈ ఏడాదంతా జరుపుకుంటామని పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజయ్ ఫొటో కింద మాంభూమికి ముదల్వర్ అనే పేరుతో పోస్టర్ను కూడా పోస్ట్ చేశారు. నిజమే జననాయకన్ చిత్రం ఇంటర్నెట్లో లీక్ అయినా, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి అభిమానులతోపాటు, చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి దీనికి మోక్షం ఎప్పుడు వస్తుందో చూడాలి. Maanbumigu Thamizhaga Mudhalvar Dr. C. Joseph Vijay Nu title card pottu andha #Jananayagan ah release panni vidunga.. Pongalukku miss aana celebration ah indha varsham full ah pannidrom 🔥🔥🔥 #ThalapathyVijay— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) May 4, 2026 -
‘దళపతి’ దండయాత్ర.. అధికారానికి అడుగు దూరంలో..
సాక్షి, చెన్నై: అంచనాలకు ఏమాత్రం అందని విజయం..! ఒంటరి పోరులో ‘దళపతి’ విజయ విహారం..! పెరంబూర్, తిరుచిరాపల్లి (ట్రిచీ) ఈస్ట్ రెండు చోట్లా ‘విజిల్’మోత! చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్గా విజయ్.. రెండేళ్లలోనే బలమైన రెండు ద్రవిడ పార్టీలను మట్టి కరిపించారు.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించారు.. తమిళనాట సరికొత్త చరిత్ర సృష్టించారు.. అధికార పీఠానికి అడుగు దూరంలో నిలిచారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. అధికార పీఠానికి మరొక్క అడుగు దూరంలో నిలిచింది. టీవీకే 107 స్థానాలలో విజయం వైపుగా దూసుకెళ్లి ద్రవిడ పార్టీల శకానికి ముగింపు పలికింది. రెండు చోట్లా గెలిచిన ‘దళపతి’ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. డీఎంకే అధికారాన్ని కోల్పోగా ఈ కూటమి 74 స్థానాలకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కూటమి 53 స్థానాలను దక్కించుకుంది. తమిళనాడు ఎన్నికలలో మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ చేయగా రికార్డు స్థాయిలో 85.15 శాతం ఓటింగ్ నమోదైంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు డీఎంకే వైపు మొగ్గుచూపగా మరికొన్ని అన్నాడీఎంకేకు అనుకూలంగా వచ్చాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రం అధికారం విజయ్దే అని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా సోమవారం ఉదయం కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. ఉత్కంఠ పోరులో.. తమిళనాడులోని 234 అసెంబ్లీ సీట్లకు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపులో డీఎంకే తొలుత ఆధిపత్యాన్ని ప్రదర్శించినా క్రమంగా టీవీకే పుంజుకోవడ ం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు, వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు టీవీకే ఖాతాలో పడ్డాయి. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అతి స్వల్ప మెజారిటీతో డీఎంకే, టీవీకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ నెలకొంది. రెండు ద్రవిడ పార్టీ లను వెనక్కి నెట్టి ఈవీకే క్రమంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మధ్యాహ్నం సమయానికి డీఎంకే మూడో స్థానంలో నిలవగా అన్నాడీఎంకే రెండో స్థానంలో ఉంది. అనంతరం 1,000 నుంచి 2 వేల ఓట్ల ఆధిక్యంతో టీవీకే, డీఎంకే మధ్య నువ్వా..నేనా అన్నట్లుగా కౌంటింగ్ ఫలితాలు వెలువడ్డాయి. వంద నియోజక వర్గాలు దాటిన తదుపరి టీవీకే తన ఆధిపత్యం చాటుకుంది. మధ్యాహ్నం సమయానికి పలు నియోజకవర్గాలలో తుది ఫలితం వెలువడాల్సి ఉండగా కొద్దిగా జాప్యమైంది. సాయంత్రం మదురై దక్షిణం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి గోపీషన్ తొలుత విజయకేతనం ఎగుర వేశారు. అనంతరం అదే పార్టీకి చెందిన సీనియర్ నేత సెంగోట్టయన్ గోబి చెట్టి పాళయంలో విజయం సాధించారు. క్రమంగా టీవీకే అభ్యర్థుల విజయ పర్వం కొనసాగడం మొదలైంది. గెలిచిన వారిలో అత్యధిక శాతం మంది రెండు వేలు, ఐదు వేలు, పది వేలలోపు మెజారిటీకే పరిమితమయ్యారు. అధికారానికి అడుగు దూరంలో..తమిళనాడులో అధికార పగ్గాలు చేపట్టేందుకు 118 స్థానాలు అవసరం. ఇప్పటివరకు ద్రవిడ పార్టీలు సంపూర్ణ మెజారిటీతో సంకీర్ణానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చాయి. తాజాగా టీవీకే సునామీ సృష్టించినా అధికారానికి స్పల్ప దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేనా? అనే చర్చ సాగుతోంది. ఫలితాలలో టీవీకేకు నగర ఓటర్లు అండగా నిలిచారు. నగరాలలో 69 నియోజకవర్గాలు ఉండగా 60 స్థానాలను టీవీకే కైవసం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాలలో 165 స్థానాలు ఉండగా, టీవీకే 47 స్థానాలలో ఆధిక్యం ప్రదర్శించడం విశేషం. ఇక, డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుపొందిన చాలా చోట్ల టీవీకే అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. డీఎంకేకు కంచుకోటగా ఉన్న చెన్నైలో 16 నియోజకవర్గాలు ఉండగా కేవలం రెండు చోట్లే ఆ పార్టీ గెలిచింది. మిగిలినవన్నీ టీవీకే ఖాతాలో చేరాయి. సంకీర్ణం దిశగా.. ⇒ విజయ్ అధికార పగ్గాలు చేపట్టేందుకు మరో పదికిపైగా స్థానాలు అవసరం అవుతున్న నేపథ్యంలో డీఎంకేతో సీట్ల పంచాయతీ వివాదాలను ఎదు ర్కొన్న ఆ కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే సైతం మద్దతుగా నిలిచే అవ కాశాలు ఉండడంతో తమిళనాట ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తోంది. విజయ్ సైతం తన తొలి మహానాడులో సంకీర్ణ ప్రభుత్వానికి రెడీ అని స్పష్టంగా ప్రకటన చేయడం గమనార్హం. ⇒ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఉన్న కాంగ్రెస్ 28 చోట్ల, దివంగత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకే 10 చోట్ల, ఎంపీ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే 8 చోట్ల, సీపీఎం, సీపీఐ చెరో ఐదు చోట్ల, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ రెండు స్థానాల్లో పోటీ చేశాయి. 58 స్థానాలు పైన పేర్కొన్న మిత్రులకు పోగా మిగిలిన 176 స్థానాలలో డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంతో అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో డీఎంకే అభ్యర్థులు 164 మంది బరిలో నిలవగా 12 మంది చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులున్నారు. ⇒ అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఉన్న బీజేపీ 27 చోట్ల, పీఎంకే 18 చోట్ల, ఏఎంఎంకే 11 చోట్ల, టీఎంసీ 5 చోట్ల, ఏజేకే 2 చోట్ల, టీఎంఎంకే, పురట్చి భారతం, పుదియ నిధి కట్చిలు తలా ఒకచోట పోటీ చేశాయి. ఇందులో టీఎంసీ బీజేపీ కమలం చిహ్నంతో పోటీ చేసింది. అన్నాడీఎంకే 168 చోట్ల బరిలో నిలిచింది. ⇒ ఎన్నికలలో మార్పు నినాదంతో తొలిసారిగా, ఒంటరిగా బరిలో దిగిన సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ 233 స్థానాలలో పోటీ చేసింది. (సేలం ఎడప్పాడిలో పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది). మరో నటుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి 234 స్థానాలలో పోటీ చేసింది. ఇందులో 50 శాతం మంది మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. విజయ్.. విన్నింగ్ షాట్సాక్షి, అమరావతి: 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలు... పోలింగ్ రోజు విజయ్ చెన్నైలోని తన ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసి వచ్చారు. రాజకీయాల్లోకి వస్తానని తొలిసారిగా సంకేతం ఇచ్చారు.. ఐదేళ్ల తర్వాత ఆయన రాజకీయ తొలి ఇన్నింగ్స్లోనే అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తొక్కేస్తారని ఎవరూ ఊహించలేదు.. 50 ఏళ్లుగా బలంగా పాతుకు పోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల కూకటి వేళ్లను పెకలిస్తారని దిగ్గజ విశ్లేషకులు కూడా అంచనా వేయలేదు.. అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి ఇన్నింగ్స్లోనే విన్నింగ్ షాట్ కొట్టిన సరికొత్త రాజకీయ సూపర్స్టార్గా విజయ్ నిలిచారు. తల్లిదండ్రులను కలసి ఆశీర్వాదం..విజయ్ రాత్రి 7 గంటలకు చెన్నై అడయార్లోని నివాసంలో తల్లిదండ్రులను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నుంగంబాకంలోని కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఎన్నికల ధృవీకరణ పత్రం తీసుకున్నారు. దారి పొడవునా నీరాజనం పలికిన అభిమానులకు విజయ్ అభివాదం చేశారు. -
ఓటర్లు చాటుతున్నదేమిటి?
ప్రజలేమనుకుంటున్నారో పట్టకుండా స్వోత్కర్షలతో, ప్రచారార్భాటాలతో పొద్దుపుచ్చే అధికార పార్టీలకు ఓటర్లు గుణపాఠం నేర్పారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు బెంగాల్లో బీజేపీ అప్రహతిహతంగా దూసుకెళ్లి, డబుల్ సెంచరీ ఖాయం చేసుకుంది. ఆ పార్టీకి 208 రాగా, టీఎంసీ 79 దగ్గర ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో మూడు దఫాలు విజయకేతనం ఎగరేసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీ పూర్లో గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపారు. మెజారిటీ క్రమేపీ కోల్పోతూ చివరకు ఓడారు. అటు తమిళనాడులో వరసగా రెండుసార్లు అధికార పీఠం కైవసం చేసుకున్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తమిళ హీరో విజయ్ కొత్తగా స్థాపించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ప్రభంజనం ముందు నిలబడ లేకపోయారు. బెంగాల్లో మమత మాదిరే ఓటమిపాలయ్యారు. ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి గెలుపు ఉన్నంతలో ఊరట. కేరళలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతి రేకతను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ సొమ్ముచేసుకోగలిగింది. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజేతలుగా నిలిచాయి. అయితే కర్ణాటక మినహా దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ పాగావేయని బీజేపీని కేరళ, తమినాడు మళ్లీ నిరాశ పరిచాయని చెప్పాలి. తృణమూల్ పాలన అధ్వాన్నంగా ఉన్నదని సంకేతాలు వస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా... అంతకుమించి అవినీతి, దౌర్జన్యం కట్టుదాటాయి. జనంనుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము తక్షణమే వెనక్కివ్వాలంటూ 2019లో మమత సొంత పార్టీ నేతలకు బహిరంగంగా అల్టిమేటం ఇవ్వటం పెను సంచలనం. ఆ పిలుపు ఫలించింది. జనం సైతం పార్టీలో అవినీతిపరులకూ, ఆమెకూ మధ్య విభజన రేఖ గీసుకున్నారు. కానీ ఆపై అవినీతిని ఆమె చూసీచూడనట్టు వదిలేశారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు. బెంగాల్లో ఎన్నికల సంఘం(ఈసీ) ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓవరాక్షన్ చేయపోయినా కొంత అటూ ఇటూగా ఇవే ఫలితాలొచ్చేవి. జాబితాలకు కోతలు పెట్టడం లేదా కొత్త పేర్లు చేర్చడం అనే రెండు ప్రక్రియల్లోనూ తనది అసమర్థతే నని ఈసీ నిరూపించుకుంది. ఏదో యుద్ధం జరుగుతున్నదన్న స్థాయిలో రెండున్నర లక్షలమంది భద్రతా బలగాలను దించటంవల్లా, 91 లక్షలమంది ఓట్ల తొలగింపువల్లా దేశానికి అప్రతిష్ఠ మిగిలింది. కేరళలో యూడీఎఫ్ 100కు పైగా స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. 44 యేళ్ల తర్వాత అధికారంలోవున్న పార్టీ తొలిసారి వరసగా రెండుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకుని గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుశా పార్టీలో అసమ్మతి లేనట్టయితే, అవినీతి ఆరోపణలు రానట్టయితే ఈ రికార్డు కూడా బద్దలయ్యేది. కానీ రెబెల్స్ బెడదతో సీపీఎం ఆ అదృష్టాన్ని చేజార్చుకుంది. స్వతంత్రులుగా బరిలోకి దిగి యూడీఎఫ్ మద్దతుపొంది గెలిచిన ముగ్గురూ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి అద్దంపట్టారు. రెబెల్స్ లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ పని తీరును ప్రశ్నార్థకం చేశాయి. 1957లో దేశంలోనే తొలిసారి వామపక్ష ప్రభుత్వం ఆవిర్భ వించటానికి దోహద పడిన రాష్ట్రమే దానికి చరమగీతం పాడటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మరెక్కడా వామపక్షాలు అధికారంలో లేవు సరిగదా... అత్తెసరు స్థానాలతో అవి వెలవెలబోతు న్నాయి. వచ్చేసారైనా కేరళ మళ్లీ ఆదరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.అయితే ఎన్నికల్లో గెలుపు వేరు, పాలన వేరు. భావోద్వేగాల ఆసరాతోనో, ఆల్ ఫ్రీ వాగ్దానాలతోనో అధికారం దక్కించుకోవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు తీర్చటం, సమర్థవంతమైన పాలన అందించటం ఆ గెలుపంత సులభం కాదు. ఈ సంగతిని కొత్తగా పార్టీ పెట్టి అధికారానికి చేరువలో ఉన్న విజయ్ అయినా, బెంగాల్లో బీజేపీ అయినా తెలుసుకోవాలి. స్థానికంగా మమతకు దీటైన నాయకులు లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వ్యూహం, వారి ప్రచార హోరు పనికొచ్చాయి. ఈ గెలుపు నిరంతరం కావాలంటే స్థానికంగా నాయకత్వం ఎదగాలి. ఇచ్చిన హామీలు తీర్చాలి. విద్వేషపూరిత వాతావరణం అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. -
విప్లవాల నేల మీద వినూత్న తీర్పు
నాలుగు రాష్ట్రాలు (కేరళం, తమిళ నాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్), కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగిన వేసవి ఎన్నికల్లో తమిళ శాసనసభ ఫలితాలు చాలావరకు అనూహ్యంగా వచ్చాయి. సినీ నటుడు ‘దళపతి’ విజయ్ (జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్) పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) సాధారణ మెజారిటీకి సమీపంలోకి రావడం నిజంగా రాజకీయ పండితుల అంచనాలకు అందని విషయం. అలాగే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పదిహేనేళ్లుగా పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ను కేంద్రంలో పాలకపక్షం బీజేపీ ఓడించి 200కు పైగా సీట్లు సాధించి తొలిసారి అధికారంలోకి రావడం కూడా అత్యధిక ఎన్నికల విశ్లేషకుల లెక్కలకు చిక్కని వాస్తవం. 1989 జనవరి అసెంబ్లీ ఎన్నికల నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే (ఏఐడీఎంకే)లు ప్రతి ఐదేళ్లకూ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత జీవించి ఉండగా జరిగిన 2016 ఎన్నికల్లో మాత్రం ఈ సాంప్రదాయం మారింది. 2011 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఆమె పార్టీ వరుసగా రెండోసారి గెలిచింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు ఊహించని సంచలనానికి దారితీశాయి. ప్రత్యేక రాజకీయ సిద్ధాంతం లేని మూడో పెద్ద రాజకీయ పక్షం టీవీకే 107 సీట్లు గెలుచుకుని తమిళ రాజకీయ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసింది. పార్టీ నిర్మాణం, తెలివైన రాజకీయ వ్యూహం, రాజకీయ అనుభవం లేకుండానే విజయ్ పార్టీ అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించడం తమిళ ప్రజల కొత్త ఆలోచనా ధోరణికి అద్దం పడు తోంది. జనాకర్షక పథకాలు, ప్రజలు ఉపయోగించే అనేక వస్తువు లను ఉచితంగా ఇవ్వడం, ఇంకా చాలా సౌకర్యాలు, పథకాల పేరిట సొమ్మును ఉచితంగా పంపిణీ చేస్తామనే హామీలు గుప్పించే తమిళ ఎన్నికల్లో ఇలాంటివి ఏవీ లేకుండా టీవీకే విజయం సాధించడం అంత తేలికగా బయటివారికి అర్థంకాని అంశమే.ద్రవిడ సిద్ధాంత పునాది లేకుండా గెలుపెలా?తమిళనాడులో (పాత పేరు మద్రాస్) 1952 ముందు నుంచీ సాగిన కాంగ్రెస్ ఆధిపత్యానికి ముగింపు పలికాయి 1967 శాసనసభ ఎన్నికలు. దశాబ్దాలుగా తమిళ నేలలో ప్రజలను ఆకట్టుకుని వేళ్లూ నిన ద్రవిడ సిద్ధాంతం పునాదిగా (బ్రాహ్మణేత వర్గాల సంక్షేమం, తమిళ భాషకు గౌరవం) ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) ఈ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ప్రాంతీయపక్షంగా రికార్డు నమోదు చేసుకుంది. సీఎం అణ్ణాదురై నాయకత్వంలో ఎం.కరుణానిధి వంటి పలువురు హేమాహేమీలైన నేతల ఉమ్మడి కృషితో నాడు డీఎంకే విజయం కాంగ్రెస్పై సాధ్యమైంది. అలాగే, డీఎంకే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ 1977 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సినీ నటుల జనాకర్షక రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్ పార్టీ అన్నాడీఎంకే విజయానికి ఆయన ఆకర్షణేగాక, ద్రవిడ సిద్ధాంత బలం ఉన్న డీఎంకేతో ఆయన దశా బ్దాల అనుబంధం కూడా ఉపయోగపడింది. అయితే, విజయ్ పార్టీ టీవీకేకు ఎంజీఆర్ పార్టీకి ఉన్న నేపథ్యం లేదు. యువతలో విపరీ తమైన ‘క్రేజ్’ ఆయనకు ఉందిగానీ ఎంజీఆర్లా విస్తృత రాజకీయ అనుభవం లేదు. సిద్ధాంతాలు అసలు లేకపోలేదు...2024 అక్టోబర్లో విక్రవండిలో జరిగిన టీవీకే తొలి రాజకీయ మహాసభలో ‘‘బీజేపీ మితవాద పోకడల కారణంగా ఇది టీవీకేకు ‘సైద్ధాంతిక ప్రత్యర్ధి’; డీఎంకే అనుసరించే అవినీతి, వారసత్వ రాజకీయాల వల్ల అది మాకు ‘రాజకీయ శత్రువు’ అని విజయ్ తేల్చి చెప్పారు. ఈ లెక్కన మతతత్వ వ్యతిరేక ధోరణి, లౌకిక విశ్వాసాల కారణంగా బీజేపీని తన రాజకీయ శత్రువుగా ప్రకటించడం టీవీకే మౌలిక సిద్ధాంతాలపై స్పష్టత ఇవ్వడమే అవుతుంది. అందుకే, ఫలితాలు ప్రకటించిన రోజున డీఎంకే నేతృత్వంలోని తన ప్రత్యర్థి శిబిరంలో ఉన్న కాంగ్రెస్తో కొత్తగా కూటమి కట్టడానికి విజయ్ పార్టీ సిద్ధమని ప్రకటించింది. పూర్వ పాలకపక్షం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే బదులు కేవలం ఐదారు సీట్లు ఉన్న కాంగ్రెస్తో దోస్తీ తన పార్టీకి క్షేమమేగాక, సైద్ధాంతిక అనుకూల అంశమని విజయ్ గుర్తించినట్టు కనిపిస్తోంది. అత్యధిక సర్వేలకు, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా టీవీకే గెలుపునకు కారణాలు ఏమిటనే విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 1977లో ఎంజీఆర్ మొదటిసారి సీఎం అయి నప్పటి నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలదే రాజకీయ పెత్తనం. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సాగిన ఈ రెండు పార్టీల వ్యవస్థ తమిళులకు విసుగు పుట్టించినట్టు కనిపిస్తోంది. పార్టీ పెట్టే ఆలోచన విరమించుకున్న సూపర్స్టార్ రజనీకాంత్, సొంత పార్టీ పెట్టి బోల్తాపడిన మరో స్టార్ హీరో కమల్హాసన్ అనుభవాలు గమ నించిన తమిళ ప్రజానీకం కొత్త తరం హీరో 51 ఏళ్ల విజయ్ పార్టీ టీవీకేను ఈసారి ఆదరించాలని నిర్ణయించుకున్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న యువత, దళితులు పార్టీ పెట్టినప్పటి నుంచీ విజయ్కు అనుకూలంగా మారారు. యువతరంలో విజయ్పై ఉన్న మోజు గట్టి పునాదులు లేని ఆయన పార్టీకి ఏకంగా దాదాపు 110 సీట్లు వచ్చేలా చూడటం రాజకీయ విప్లవం కింద పరిగణించాలి. టీవీకే పుట్టినప్పటి నుంచీ దానికి జనంలో పెరిగిన ఆదరణ చూసిన కాంగ్రెస్ ఎన్నికలకు కొన్ని మాసాల ముందు దానితో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ, ఒంటరి పోరుకే సిద్ధం కావడంతో ‘దళపతి’తో ఎన్నికల స్నేహానికి హస్తం పార్టీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పుడు ఫలితాలు వెలువడిన తర్వాత టీవీకేకు కొద్దిలో మెజారిటీ మార్క్ (మొత్తం 234 సీట్లకుగాను 118) దక్కకపోవడం, ‘సెక్యులరిజం’ అనే సిద్ధాంతం టీవీకేతో చేతులు కలిపే అవకాశం కాంగ్రెస్కు లభించింది. తమిళ ఓటర్లు టీవీకేను ఆదరించడం ద్వారా రెండు పాత ద్రవిడ పార్టీలు మాత్రమే పాలక పక్షాలుగా దిక్కయిన పరిస్థితి నుంచి బయట పడ్డారు.విజయ్ క్రైస్తవ కుటుంబంలో జన్మించడం (తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ పుట్టుకతో క్రిస్టియన్, తల్లి హిందువు) టీవీకేకు అనుకూల లేదా ప్రతికూల అంశం కాలేదు. రాష్టంలో కులం ప్రభావం అధికంగా ఉన్న కారణంగా తన కులం తమిళ్ అని ప్రకటించుకోవడం తమిళ జనానికి బాగా నచ్చినట్టుంది. కేవలం రెండు సంవత్సరాల క్రితం పుట్టిన విజయ్ పార్టీకి దాని కొత్తదనం, నాయకుడికి రాజకీయ నేపథ్యం లేకపోవడం సానుకూల అంశా లుగా మారాయి. దాదాపు 8 లక్షల మంది అభిమానులతో టీవీకే మొదటి రాజకీయ మహాసభ జరిగిందంటే జనంలో విజయ్పై ఉన్న తీవ్ర అభిమానం, మోజు మీడియాకు, ఎన్నికల విశ్లేషకులకు అర్థం కాలేదని అనుకోవాలి. నేటి తమిళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులకు ఉన్న పరిమితులను చెబుతున్నాయి. ఏమైనా విజయ్కు తమిళనాడు ‘దళపతి’ అయ్యే అవకాశం ఇవ్వడం ద్వారా తమిళ సోదరులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి సామాజిక విప్లవాల వరకూ ఆధునిక భారతంలో ముందుండి నడిచిన బెంగాలీలు, తమిళులు ఎట్టకేలకు తమ పాలకపక్షాలను, పాలకులను మార్చేలా తీర్పు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏ మాత్రం కాదు.కమ్యూనిస్టులకు 34, తృణమూల్కు 15 ఏళ్లు అవకాశం!పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి అధికారం వస్తుందని ఎక్కువ సర్వేలు సూచించలేదు. 200కు పైగా సీట్లను కైవసం చేసుకుని బీజేపీ పశ్చిమ బెంగాల్లో మొదటిసారి గద్దెనెక్కే అవకాశం దక్కించుకోవడం కూడా అత్యధిక మీడియా, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని వాస్తవం. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు గెల్చుకున్న బీజేపీ 2021లో తన బలాన్ని వంగ శాసనసభలో 77 స్థానాలు పెంచుకోవడం కొత్త రికార్డు. ఈ ఎన్నికల్లోనే బీజేపీకి మెజారిటీ సీట్లు (294 సీట్లున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 148 అవసరం) వస్తాయని కొందరు ఎన్నికల పండితులు వేసిన అంచనాలు నిజం కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ‘దీదీ’ మమతా బెనర్జీ వరుసగా మూడోసారి తన పార్టీని విజయపథంలో నడిపించారు. బెంగాల్ బెబ్బులిగా పొగడ్తలు అందుకున్నారు. గత 15 ఏళ్లుగా అవాంఛనీయ పోకడలనే తృణమూల్ అప్రకటిత పాలనా విధానంగా ఎంచుకోవడం ‘దీదీ’ పతనానికి దారితీసింది. సీపీఎం, సీపీఐ నాయకత్వంలోని కమ్యూనిస్టుల ఐక్య సంఘటన (లెఫ్ట్ ఫ్రంట్) సర్కారు 34 సంవత్సరాల పాలనలో బెంగాల్ ప్రజల జీవితాలను పాలక కూటమికి విధే యులైన అసాంఘిక శక్తులే ఒక పద్ధతి ప్రకారం నిర్ణయించడం తెలిసిన విషయమే. ‘పార్టీ సొసైటీ’గా పిలిచే అవాంఛనీయ ధోర ణిని దశాబ్దపున్నర పాటు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అను సరించింది. అంతేగాక, బెంగాల్లో 30 శాతం వరకూ ఉన్న మైనారిటీలకు మమత పెద్ద పీట వేస్తున్నారనీ, మెజారిటీ మతస్తుల బాగోగులు ఆమెకు పట్ట వనే ప్రచారం బూటకం కాదు, నిజమనీ అత్యధిక బెంగాలీలు నమ్మారు. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థిని రేప్, హత్య వంటి కొన్ని ఘటనలు మహిళా సీఎం పాలనలో స్త్రీలకు అసలు రక్షణ లేదనే బీజేపీ ప్రచారానికి బలం ఇచ్చాయి. ‘మార్క్సిస్టుల అరాచక పాలనకు స్వస్తి పలికి సుపరిపాలన అందిస్తాన’ని సీఎం పీఠమెక్కిన మమత ఏలుబడిలో పాలన బాగా దిగజారడం, నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడం బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీతో గెలవడానికి దోహదం చేశాయి. 2000 నవంబర్ నుంచి 2026 మే వరకూ పాతిక సంవ త్సరాలకు పైగా ఇద్దరే ఇద్దరు సీఎంలు మార్క్సిస్టు బుద్ధదేవ్ భట్టాచార్య, మమతా బెనర్జీలను చూసిన బెంగాలీ జనం పలు కారణాల వల్ల కొత్త ముఖం కావాలని కోరుకున్నారు. వారి ఈ ఆకాంక్ష సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ తిరుగులేని మెజారిటీ ఈ ఎన్నికల్లో సాధించడానికి ఒక ప్రధాన కారణమైంది. నాంచారయ్య మెరుగుమాలవ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
దళపతి విజయ్కు రజనీ, కమల్ అభినందనలు
సాక్షి,చెన్నై: విజయ్ను అభినందిస్తూ తమిళ సూపర్స్టార్ రజనీకాంత్,నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్కి,ఆయన పార్టీ సభ్యులకు నా అభినందనలు అంటూ రజనీకాంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు.நடந்து முடிந்த தமிழக சட்டமன்றத் தேர்தலில் பெரும் வெற்றி பெற்ற தமிழக வெற்றிக் கழகத் தலைவர் திரு விஜய் அவர்களுக்கும், அவர் கட்சியினருக்கும் என்னுடைய வாழ்த்துகள். @TVKVijayHQ— Rajinikanth (@rajinikanth) May 4, 2026తమ మొట్టమొదటి ఎన్నికలోనే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, గొప్ప విజయాన్ని సాధించిన తమిళగ వెట్రి కజగం నాయకుడు విజయ్ కి, వారి పార్టీ సభ్యులకు నా అభినందనలు. వారి ప్రజా సేవ వర్ధిల్లాలని నా శుభాకాంక్షలంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.தங்களுடைய முதல் தேர்தலிலேயே மக்களுடைய நம்பிக்கையைப் பெற்று பெருவெற்றி பெற்றிருக்கும் தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் திரு. விஜய் @TVKVijayHQ அவர்களுக்கும், அவரது கட்சியினருக்கும் என்னுடைய பாராட்டுகள். மக்கள் பணி சிறக்க என்னுடைய வாழ்த்துகள்.— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన టీవీకే 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాల్లో గెలుపొందింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీకి 118 సీట్లు అవసరం. విజయ్ అధికార పగ్గాలు చేపట్టేందుకు మరో పదికిపైగా స్థానాలు అవసరం అవుతున్న నేపథ్యంలో డీఎంకేతో సీట్ల పంచాయతీ వివాదాలను ఎదుర్కొన్న ఆ కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే సైతం మద్దతుగా నిలిచే అవకాశాలు ఉండడంతో తమిళనాట ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తోంది. విజయ్ సైతం తన తొలి మహానాడులో సంకీర్ణ ప్రభుత్వానికి రెడీ అని స్పష్టంగా ప్రకటన చేయడం గమనార్హం. -
విజయ్ విన్.. మెగాస్టార్, మహేశ్ బాబు ప్రశంసలు
విజయ్ గెలుపుతో కోలీవుడ్లో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని కోలీవుడ్ నటీనటులు చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నటుడు జీవా విజిల్స్ వేస్తూ కనిపించారు. ఆయనతో మరో కమెడియన్ సైతం విజిల్స్తో సందడి చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు విజయ్కు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా తమిళ హీరో, నిర్మాత విశాల్, నటి ఖుష్బు సుందర్, కమల్ హాసన్, జీవీ ప్రకాశ్ కుమార్ విజయ్ను అభినందించారు. టాలీవుడ్ హీరోల ప్రశంసలు..దళపతి విజయ్కు టాలీవుడ్ స్టార్స్ సైతం అభినందనలు చెబుతున్నారు. విజయ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మొదటి ఎన్నికలోనే అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు. మీ లక్ష్యం, నాయకత్వంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని ప్రశంసించారు. ఈ పాలనలో తమిళనాడు మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్బాబుతో పాటు టాలీవుడ్ హీరోలు రవితేజ, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాని, శర్వానంద్, సాయితేజ్, శ్రీవిష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం విజయ్ విజయంపై ట్వీట్ చేశారు.కాజల్ అగర్వాల్ ట్వీట్..తమిళనాడులో విజయ్ గెలుపుపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన విజయంపై హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనమని కొనియాడింది. తమిళనాడు ప్రజలు తమ తీర్పునుస్పష్టంగా చెప్పారని ప్రశంసించింది. ఇది కేవలం ఒక విజయం కాదు.. లక్షలాది మందితో అనుబంధానికి జరుపుకునే వేడుకని అభినందించారు. కాగా.. తుపాకీ, మెర్సల్, జిల్లా చిత్రాల్లో విజయ్ సరసన కాజల్ నటించారు. தங்களுடைய முதல் தேர்தலிலேயே மக்களுடைய நம்பிக்கையைப் பெற்று பெருவெற்றி பெற்றிருக்கும் தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் திரு. விஜய் @TVKVijayHQ அவர்களுக்கும், அவரது கட்சியினருக்கும் என்னுடைய பாராட்டுகள். மக்கள் பணி சிறக்க என்னுடைய வாழ்த்துகள்.— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026 Heartiest congratulations to @actorvijay on this spectacular and resounding victory! This moment is a true testament to your vision, your perseverance, and the unwavering love people have for you.The people of Tamil Nadu have spoken—loud, clear, and with immense pride. This… pic.twitter.com/XVhg0aYt1r— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 4, 2026 Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2026 Dear @actorvijay,Hearty congratulations on this outstanding and well-deserved victory in your first election 💐💐💐May you continue to inspire, lead, and serve with unwavering passion and purpose. My best wishes to you for your public service to the state of Tamil Nadu and…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2026 -
విజయ్ గెలుపును ముందే ఊహించిన స్టార్ క్రికెటర్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీహీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా విజయ్ టీవీకే పార్టీ తమిళనాట వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ కింగ్ మేకర్గా నిలిచారు. అయితే డీఎంకే లేదా అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకొని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ తమిళనాట విజయ్ గెలుపు గురించి ముందే ఊహించాడంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చక్కర్లు కొడుతుంది. 2015 ఏప్రిల్ 25న ఆర్చర్ తన ‘ఎక్స్’ (అప్పటి ట్విటర్) వేదికగా ‘విజయ్ డబ్ల్యూటీఎఫ్’ అని పోస్టు పెట్టాడు. నిజానికి ఆర్చర్ ఆ ట్వీట్ పెట్టింది క్రికెటర్ మురళీ విజయ్ను ఉద్దేశించి అని తెలుస్తోంది. అంతకుముందు 2014, డిసెంబర్ 27న ‘లవ్ టు వాచ్ విజయ్’ అంటూ మరో ట్వీట్ చేశాడు. దానికి ముందు 2013, మార్చి 4న ‘M.Vijay 140*’ అంటూ ట్వీట్ చేశాడు జోఫ్రా ఆర్చర్. ఈ ట్వీట్స్ అన్నీ కూడా క్రికెటర్ మురళీ విజయ్కి సంబంధించినవి మాత్రమే. అయితే తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో విజయ్ విజయదుందుబి మోగించడంతో ఆయన అభిమానులు ఆర్చర్ ట్వీట్ను తమ హీరో విజయ్ కోసం చేసినట్లుగా రీట్వీట్ చేశారు. ‘మా విజయ్ ముందే గెలుస్తాడని ఊహించిన ఆర్చర్కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కామెంట్లు కూడా పెడుతున్నారు.అయితే ఆర్చర్ నిజంగా ఆ ట్వీట్ చేశాడా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలని మరికొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఎందు కంటే గతంలో మురళీ విజయ్తో విభేదాల సమయంలో క్రికెటర్ దినేశ్ కార్తిక్ కూడా ఇలాంటి ట్వీట్ చేసినట్లు గుర్తు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో జోఫ్రా ఆర్చర్ రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్లాడిన ఆర్చర్ 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. ఇక సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో వరుస ఓటములు చవిచూస్తోంది. అయితే ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.pic.twitter.com/hoSIATmltw— Out Of Context Cricket (@GemsOfCricket) May 4, 2026 చదవండి: పాక్ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్మనీనా! -
విజయ్ విజయం.. పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు..!
విజయ్.. విజిల్.. విజయం.. ఇప్పడంతా ఎక్కడ చూసినా ఈ మూడు పదాలే వినిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే సెంచరీ కొట్టిన హీరో విజయ్పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్కు అభినందనలు తెలిపారు. మొదటిసారి పోటీ చేసిన విజయ్ ఏకంగా సీఎం రేసులో దూసుకెళ్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించనుంది.అయితే తమిళనాడులో విజయ్ విజయాన్ని ఏపీ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. విజయ్ గెలుపుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. తొలిసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో(పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) గెలుపొందారు. అంతేకాకుండా మొదటిసారే సీఎం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనానిపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.ఏపీలో వచ్చే ఎన్నికల్లోనైనా సింగిల్గా పోటీ చేయాలని పవన్ కల్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్లాగే సింగిల్గా బరిలోకి దిగాలన్న డిమాండ్ పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ గెలుపు కాస్తా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలోనూ ఎవరితోనూ పొత్తులు లేకుండా బరిలోకి దిగాలనే డిమాండ్ వస్తే జనసేనాని ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. సింగిల్గా పోటీ చేస్తేనే గుర్తింపు ఉంటుందని సగటు అభిమానులు, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
విజయ్ కార్ కలెక్షన్: లెక్సస్ నుంచి స్విఫ్ట్ వరకు..
నటుడుగా, రాజకీయ నాయకుడుగా మాత్రమే తెలిసిన విజయ్.. ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగా ఆయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి చిన్న కారు కూడా ఉంది. ఈ కథనంలో విజయ్ కాల్ కలెక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం.లెక్సస్ ఎల్ఏం 350హెచ్విజయ్ ఉపయోగించే కార్ల జాబితాలో లెక్సస్ ఎల్ఏం 350హెచ్ ఒకటి. దీని ధర సుమారు రూ.2.20 కోట్లు. మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. 48 అంగుళాల డిస్ప్లే, అల్ట్రా-ప్రీమియం సీటింగ్ వంటి ఫీచర్ల కారణంగా ఇదొక ప్రైవేట్ లాంజ్ మాదిరిగా అనిపిస్తుంది.బీఎండబ్ల్యూ 5 సిరీస్బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 5 సిరీస్ కూడా విజయ్ గ్యారేజిలో ఉంది. రూ.74.80 లక్షల ధర వద్ద లభించే ఈ కారు 2.0 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, అత్యుత్తమ సౌండ్ సిస్టమ్తో సహా ప్రీమియం ఇంటీరియర్ ఇందులో చూడవచ్చు. ఇది రోజువారీ వినియోగం కోసం ఉపయోగపడే లగ్జరీ సెడాన్.బీఎండబ్ల్యూ ఐ7విజయ్ గ్యారేజిలోని ఎలక్ట్రిక్ సెడాన్ బీఎండబ్ల్యూ ఐ7. దీని ధర రూ.2.5 కోట్లు. ఇది 449 హార్స్ పవర్ అందిస్తుంది. థియేటర్ స్క్రీన్, యాంబియంట్ లైటింగ్ వంటివి ఈ కారులో ఉన్నాయి. ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.టయోటా వెల్ఫైర్రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ టయోటా వెల్ఫైర్ కారును ఎంచుకున్నట్లు సమాచారం. సుమారు రూ. 1.19 కోట్ల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారును ఎక్కువ మంది సెలబ్రిటీలు, రాజకీయంగా నాయకులు ఉపయోగిస్తున్నారు. సౌకర్యవంతమైన సీట్లు, 2.5-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండటం వల్ల ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.మారుతి సుజుకి స్విఫ్ట్టీవీకే అధినేత విజయ్ వద్ద మారుతి స్విఫ్ట్ కూడా ఉంది. ఎన్నికల సమయంలో దీనిని ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారు సరసమైనది మాత్రమే కాదు, ఆచరణాత్మకమైనది.. భారతదేశంలో అత్యంత ఇష్టపడే హ్యాచ్బ్యాక్లలో ఒకటి. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో నడిచే ఈ కారు రోజువారీ వినియోగానికి ఉపయోగకరంగా ఉంటుంది.రోల్స్ రాయ్స్ ఘోస్ట్విజయ్ గతంలో రోల్స్-రాయ్స్ ఘోస్ట్ సిరీస్ I కారును కలిగి ఉండేవారు, దానిని విక్రయించినట్లు సమాచారం. ఈ లగ్జరీ సెడాన్లో 6.6 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ ఉండేది. ఇది 563 Bhp పవర్, 780 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, రియర్-వీల్ డ్రైవ్తో ఉంటుంది. దీని ధర రూ. 2 కోట్ల ధరకు అందుబాటులో ఉండేది. -
విజయ్ సీఎం.. డిప్యూటీ సీఎంగా త్రిష..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్గా బరిలోకి దిగి మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తున్నారు. ఊహించని విధంగా అధికార డీఎంకేతో పాటు ఏఐడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. ద్రవిడ రాజకీయాల్లో పోటీ చేసిన తొలిసారే సంచలనం సృష్టించిన విజయ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్కు అభినందనలు చెబుతున్నారు. హీరోయిన్ త్రిష సైతం ఇంటికి వెళ్లి విజయ్కు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే త్రిష గురించి నెట్టింట చర్చ మొదలైంది. త్రిష సైతం రాజకీయాల్లో అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం కానుందని మరో టాక్ వైరలవుతోంది. విజయ్ పోటీచేసిన రెండు స్థానాల్లో గెలిస్తే.. ఒక్కచోట రాజీనామా చేయాల్సిందే. అదే సమయంలో విజయ్ రాజీనామా చేసిన స్థానంలో త్రిష పోటీ చేస్తారని లేటేస్ట్ టాక్. అలా ఎన్నికల్లో గెలిచి హీరోయిన్ త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం అవుతారని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. హీరో విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు ఎన్నికల ముందు త్రిష- విజయ్పై రూమర్స్ పెద్దఎత్తున వైరలయ్యాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. విజయ్- త్రిష ఓ పెళ్లికి హాజరు కావడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఏదేమైనా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపుతో ఒక్కసారిగా అందరి దృష్టి త్రిషపై పడింది. తమిళనాట త్రిష ప్రయాణం ఎలా ఉండనుందో మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.ఇక త్రిష సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభరలో కనిపించనుంది. -
విజయ్ విక్టరీ వెనుక ఆ ఒక్కడు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పార్టీ పెట్టి రెండేళ్లే అవుతున్నా.. తమిళ రాజకీయాల్లో వేళ్లూనుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను మట్టికరిపించింది. అయితే.. ఈ విజయ్ విజయం వెనుక ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ విక్టరీ వెనుక ఉన్న కపిల్ సాహు. ఎన్నికల వ్యూహంలో ఆయనకు పదేళ్ల అనుభవం ఉంది. 2019 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్డీఎఫ్ ప్రచారానికి నాయకత్వం వహించారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్లో రాఘవ్ చద్దా నియోజకవర్గ స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో ఆప్ విస్తరణలో కీలక పాత పోషించారు. కాంగ్రెస్ పార్టీతోనూ జాతీయ స్థాయిలో పని చేసిన అనుభవం ఉంది ఈయనకు.గతంలో ఐప్యాక్(Indian Political Action Committee)లో పని చేసిన ఆయన.. ఆ అనుభవంతో 12 మంది బృందంతో సొంత టీం ఏర్పాటు చేసుకుని స్వతంత్ర కన్సల్టెంట్గా మారారు. ఆ తర్వాత విజయ్ టీవీకేకు వ్యూహాలు అందించారు. డీఎంకే, అన్నాడీఎంకేలను ఢీకొట్టే విధంగా టీవీకే వ్యూహాలు రచించారు. టీవీకేకు ప్రచార సందేశాలను రూపొందించడం.. గ్రామీణ స్థాయి కార్యకలాపాలను సమన్వయం చేయడం.. ఓటర్ల డేటాను విశ్లేషించి చేరువ వ్యూహాలను మెరుగుపరచడం చేశాడాయన. సాహు రూపొందించిన వ్యూహం పార్టీకి 100+ సీట్లలో ఆధిక్యం సాధించడానికి తోడ్పడింది. -
హీరో విజయ్ గెలుపు.. పవన్ కల్యాణ్పై ట్రోల్స్..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్గా బరిలోకి దిగిన విజయ్ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్ విజయంపై అభినందనలు చెబుతున్నారు.అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ట్రోల్స్ మొదలయ్యాయి. విజయ్ విజయాన్ని కొందరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలి ఎన్నికల్లో సాధించిన ఫలితాలను ప్రస్తావిస్తున్నారు. విజయ్లా పవన్ కల్యాణ్ తొలిసారి విజయం సాధించలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు. విజయ్ పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఏకంగా సీఎం కాబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో తొలిసారి పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.అయితే తమిళనాడు, ఏపీ రాజకీయాలను ముడిపెట్టొద్దని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో తమిళనాడు రాజకీయాల్లో విజయవంతమైన ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్లను పేర్లను ప్రస్తావిస్తున్నారు. అక్కడ ప్రజలు సినీ నేపథ్యం ఉన్న నాయకులను సులభంగా అంగీకరిస్తారని చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం ప్రాంతీయ రాజకీయాలు, బలమైన పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. -
విజయం తర్వాత తన ఇంట్లో TVK విజయ్
-
ఎన్నికల ఫలితాల్లో సూపర్ హిట్.. 'జన నాయగన్' సంగతేంటి?
ఎవరూ ఊహించలేదు. తమిళ హీరో విజయ్.. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఈ రేంజ్ ఆధిక్యం సాధిస్తాడని. ఎందుకంటే ఎన్నికల ముందు విజయ్కి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యక్తిగత విషయాలు పక్కనబెడితే ఇతడు నటించిన చివరి సినిమా 'జన నాయగన్'ని కూడా విడుదల కాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో విజయ్ అద్భుతం చేయడంతో ఈ మూవీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిషలెక్క ప్రకారం 'జన నాయగన్' సినిమా ఈ ఏడాది జనవరి 9న తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల వల్ల అది వారం వారం ఆలస్యమవుతూ వస్తోంది. అలాంటిది కొన్నాళ్ల క్రితం ఏకంగా పూర్తి మూవీ పైరసీకి గురవడం ఇండస్ట్రీని షాక్కి గురిచేసింది. దీంతో మూవీ త్వరగా రిలీజ్ అయిపోతే బాగుండు అని అభిమానులు అనుకునే పరిస్థితి ఏర్పడింది.ఇప్పుడు తమిళనాడులో విజయ్.. అధికారం చేజిక్కుంచుకుని ముఖ్యమంత్రి అయితే మాత్రం 'జన నాయగన్'కి మార్కెట్లో కచ్చితంగా క్రేజ్ పెరుగుతుంది. అటు ఆడియెన్స్ కూడా విజయ్ని చివరిసారి వెండితెరపై చూడాలనే ఆసక్తి కనబరచొచ్చు. తద్వారా టాక్తో సంబంధం లేకుండా వంద రెండొందల కోట్ల కలెక్షన్స్ రావొచ్చేమో అనిపిస్తుంది. మరి సమస్యలని దాటి 'జన నాయగన్'.. ఈ నెలలోనే రిలీజ్ అవుతందా? లేదంటే జూన్లో వస్తుందా అనేది చూడాలి?తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాకు రీమేకే 'జన నాయగన్'. విజయ్ లీడ్ రోల్ చేయగా పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్. వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతదర్శకుడు. ఇప్పటికే రిలీజైన కొన్ని పాటలు శ్రోతల్ని అలరించాయి కూడా.ఇదీ చదవండి: త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా? -
దళపతి విజయ్ ఇంటికి చేరుకున్న హీరోయిన్
-
ఏం చేస్తాడులే అన్నారు... ఇప్పుడు చరిత్రను తిరగరాశాడు
-
గెలిచిన ఆనందం... TVK విజయ్ ఇంట్లో సంబరాలు..
-
విజయ్ గెలుపు వెనుక రహస్యం? టీవీకే సక్సెస్ పై అనలిస్ట్ కామెంట్స్
-
విజయ్ అనే నేను!
-
తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష
తమిళనాడులో ఊహించని అధికార మార్పు దాదాపు ఖాయంలానే కనిపిస్తుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్లోనూ డీఎంకే పార్టీకే మరోసారి అధికారం దక్కొచ్చని చాలామంది అంచనా వేశారు. విజయ్ టీవీకే పార్టీ కొన్ని సీట్లు గెలుచుకోవచ్చని భావించారు. కానీ ప్రస్తుతం ఊహించనవి జరుగుతున్నాయి. టీవీకే పార్టీ ఈ స్టోరీ రాసే సమయానికి 100 సీట్లకు మించి ఆధిక్యంలో కొనసాగుతోంది. కానీ ట్రెండింగ్లో మాత్రం త్రిష ఉంది.(ఇదీ చదవండి: విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)విజయ్, త్రిష కలిసి పలు సినిమాలు చేశారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ విడాకుల వ్యవహారం బయటకు రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. విజయ్-త్రిష రిలేషన్లో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. సరిగ్గా ఆ టైంలో ఓ పెళ్లికి వీళ్లిద్దరూ కలిసి వెళ్లడం హాట్ టాపిక్ అయిపోయింది.నేడు(మే 04) ఎన్నికల ఫలితాల లెక్కింపు మాత్రమే కాదు. త్రిష పుట్టినరోజు కూడా. ఈ క్రమంలోనే ఆమె తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అయితే విజయ్ కోసమే ఆమె తిరుపతి వెళ్లిందని మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేయించిందని అంటున్నారు. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. త్రిష గురించి చేసి ట్వీట్ వైరల్ అవుతోంది.'ఆ తిరుమల వేంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది. కంగ్రాట్స్ త్రిష' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. విజయ్ని ఉద్దేశించే ఇతడు ఈ ట్వీట్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఏకంగా సీఎం కావాలని ఉందని చెప్పింది. అప్పుడు సరదాగానే అని ఉండొచ్చు. కానీ వినిపిస్తున్న రూమర్స్, విజయ్ అధికారం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుండటంతో త్రిష కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏమైనా ఎంట్రీ ఇస్తుందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఇదేం చిత్రం.. ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నాడు!) -
ఎవరి జెండా మోయకుండా.. ఏ పొత్తు లేకుండా!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే ‘విజిల్’ మోత దేశం మొత్తం మారుమోగుతోంది. విజయ్ మేనియా ధాటికి అధికార ప్రతిపక్ష పార్టీల కూటములు విలవిలలాడిపోయాయి. గత ఐదు దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను.. వాటి కూటముల్ని వెనక్కి నెట్టేసి రెండేళ్ల పసికూన పార్టీ టీవీకే అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది.తమిళనాట టీవీకే ప్రభంజనం కొనసాగుతోంది. ప్రధానంగా ఆ పార్టీ దెబ్బకు అధికార డీఎంకేకు మాస్టర్ స్ట్రోక్ తగిలింది. డీఎంకే ప్రధాన అభ్యర్థులంతా ఓటమి దిశగా పయనిస్తున్నారు. సంబురాల కోసం వేసిన టెంట్లు కూడా తీసేసి వెళ్లిపోయారంటే ఏ రేంజ్లో నైరాశ్యంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే రెండో స్థానానికి పరిమితమయ్యే చాన్స్ కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో ద్రవిడ సిద్ధాంతాన్ని తిరస్కరించిన తమిళ ఓటర్లు విజయ్ పార్టీ టీవీకే ఇచ్చిన ‘మార్పు’ అనే నినాదానికి పట్టం కట్టారు.తమిళనాట అగ్రనటుడిగా విజయ్ తెలుగువాళ్లకూ సుపరిచితుడే. 2009లో ఏర్పడిన తన విజయ్ మక్కల్ ఇయ్యక్కం అనే ఫ్యాన్స్ అసోషియేషన్ను.. 2014లో ఫిబ్రవరి 2వ తేదీన తమిళగ వెట్రి కగళం అనే పార్టీగా ఏర్పాటు చేశారు విజయ్. 2026 ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యమని ఆనాడే ఆయన ప్రకటించారు. జట్టుగా వచ్చే పార్టీలకు అధికారంలో వాటా సైతం ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారాయన. ఈ ప్రకటనలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. రెండేళ్లలో ఈ పవర్ మ్యాజిక్ సాధ్యమయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. దానికి తగ్గట్లే తాను ఏ పార్టీ జెండా మోయబోమని.. సింహం సింగిల్గానే పోటీ చేస్తుందని ప్రకటనలు ఇచ్చుకుంటూ వచ్చారాయన. ఈ ప్రకటన రాజకీయ వర్గాలను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఒంటరి పోరుతో విజయ్ ఏం సాధించలేడని తేల్చి చెప్పాయి. అదే సమయంలో విజయ్ మీద ఆన్లైన్లో ట్రోలింగ్ కూడా పెరిగింది. ఈలోపు విజయ్ ఎన్నికల ర్యాలీలో భాగంగా కరూర్లో జరిగిన తొక్కిసలాట.. ఆపై సీబీఐ దర్యాప్తు.. దీనిని ఆసరగా చేసుకుని తమ కూటముల్లో చేరాలని జాతీయపార్టీల నుంచి ఒత్తిళ్లు.. చివరి సినిమా జన నాయగన్ రిలీజ్ ఆగిపోవడం(సెన్సార్ ఇబ్బందులు).. వ్యక్తిగత జీవితం రచ్చకెక్కడం.. ఇవన్నీ దళపతిని కుంగదీయడం ఖాయమని అంతా భావించారు. అయితే.. విజయ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొన్నారు. విమర్శలు, ఒత్తిళ్లు తాను చూసుకుంటానని.. మీరు గెలుపు మీదే దృష్టి సారించాలని కేడర్కు బలం అందించారు. యువత, మహిళలను ఎక్కువగా ఆకట్టకునేలా ఎన్నికల హామీలిచ్చారు. ఫలితంగా.. ఏ కూటమితో జట్టు కట్టకుండా.. ఒంటరిగా అన్నీ స్థానాల్లోనూ పోటీ చేసిన విజయ్కు అత్యధిక స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టారు తమిళనాడు ఓటర్లు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయ్ జైత్రయాత్ర.. టెంట్లు పీకేసిన డీఎంకే
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. అయితే, అందరి దృష్టి తమిళనాడుపైనే కేంద్రీకృతమైంది. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే సంచలన ఫలితాల దిశగా టీవీకే దూకుడు ప్రదర్శిస్తోంది. తమిళనాడులో 100 స్థానాల్లో టీవీకే ఆధిక్యంతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో విజయ్ నివాసానికి నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో టీవీకే చీఫ్ విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. జెండాలు పట్టుకుని టీవీకే అభిమానులు సందడి చేస్తున్నారు. కేంద్ర బలగాలతో విజయ్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, చెన్నైలో డీఎంకే కార్యాలయం బోసిపోయింది. ఆఫీస్ దగ్గర డీఎంకే శ్రేణులు కనిపించడం లేదు. టెంట్లు తీసేసి కుర్చీలు తీసుకెళ్తున్న డీఎంకే కార్యకర్తలు.. ఎన్నికల ఫలితాల షాక్తో బోరున విలపిస్తున్నారు. టీవీకే ఆధిక్యం పెరుగుతుండటంతో విజయ్ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎక్కువ శాతం సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమిళనాడులో ఓటర్లు మార్పుకోరుకున్నారు. విజయ్కు యూత్, దళిత్ ఓటు బ్యాంకు కలిసొచ్చింది. హిందూవ్యతిరేక ముద్రతో డీఎంకే నష్టపోయిందని రాజకీయ వర్గాల అంచనా వేశాయి.#WATCH | Tamil Nadu Assembly Elections | Tents are being removed from Anna Arivalayam, the DMK headquarters in Chennai, as the early trends show DMK at a distant third position.TVK is leading on 45, AIADMK on 41 and DMK on 19 seats, as per early trends. pic.twitter.com/7xPojVMKcQ— ANI (@ANI) May 4, 2026డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో తమిళనాడు దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన రాజకీయ చదరంగంలో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోందని యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని ఎగ్జిట్పోల్ పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్ మై తెలిపింది. ఎన్నికల తర్వాత తమిళనాడులో ఎంజీఆర్లా, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్లా విజయ్ సినీరంగం నుంచి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోబోతున్నారని ఎగ్జిట్ పోల్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
విజయ్ విజిల్ మోత.. రీసౌండ్ ఓ రేంజ్లోనే.. (ఫొటోలు)
-
విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడనే విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇతడి చివరి సినిమాకు కష్టాలు మాత్రం తప్పట్లేదు. నాలుగు నెలల క్రితమే రిలీజ్ కావాల్సిన మూవీ.. సెన్సార్ సమస్యలతో అలా ఉండిపోయింది. కొన్నిరోజుల క్రితం లీక్ కావడం సంచలనం రేపింది. ఇప్పుడు 'జన నాయగణ్'కి మరో కష్టం వచ్చిపడింది.(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)లెక్క ప్రకారం జనవరి 9న విజయ్ 'జన నాయగణ్' సినిమాని థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో రెండు మూడు వారాలు ఆలస్యంగా తీసుకొస్తారులే అని అంతా భావించారు. కానీ నెలలు గడుస్తున్నా రాకపోవడంతో సగటు ప్రేక్షకుడి ఈ మూవీపై ఆసక్తి సన్నగిల్లుతూ వస్తోంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్కి కూడా ఆసక్తి పోయినట్లు ఉంది. అందుకే రూ.120 కోట్ల డీల్ నుంచి తప్పుకొన్నట్లు వార్తలొస్తున్నాయి.అమెజాన్ సంస్థ తప్పుకోవడంతో రేసులోకి వచ్చిన జీ5 సంస్థ.. రూ.50 కోట్ల ఆఫర్ చేసిందట. ఒకవేళ దీనికి టీమ్ ఒప్పుకొంటే రూ.70 కోట్ల నష్టానికి అమ్ముకున్నట్లే అవుతుంది. చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ లీకై, థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని మూవీ విషయంలో అమెజాన్ రిస్క్ చేయలేకపోతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది.తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రాన్ని రీమేక్ చేసే 'జన నాయగణ్' తీశారు. కాకపోతే విజయ్ రాజకీయ అవసరాలకు తగ్గట్లు పొలిటికల్ డైలాగ్స్, ఎపిసోడ్స్ పెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. కెవిఎన్ నిర్మాణ సంస్థపై వెంకట్ కె నారాయణ నిర్మించారు. ఈ చిత్రం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన.. 'టాక్సిక్' కూడా రిలీజ్ కాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.(ఇదీ చదవండి: తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా?) -
స్టాలిన్కు షాకిస్తూ.. విజయ్పై పొగడ్తల వర్షం!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డీఎంకే, అన్నాడీఎంకే, ఈ మధ్యలో టీవీకే.. ఎవరికి వారే అధికారం తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ముందస్తుగా క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.విజయ్ టీవీకే పార్టీపై స్టాలిన్ మిత్రుడు, ఎండీఎంకే(Marumalarchi Dravida Munnetra Kazhagam) అధినేత వైకో ప్రశంసలు గుప్పించారు. విజయ్ ఈ ఎన్నికల్లో మ్యాజిక్ చేసే అవకాశం లేకపోలేదని అన్నారాయన. ‘‘టీవీకే తమిళ రాజకీయాల్లో ఓ శక్తిగా అవతరించింది. రాబోయే రోజుల్లో ఇక్కడి రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపగలదు. ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం లేకపోలేదు’’ అని వైకో అభిప్రాయపడ్డారు.ఈ సందర్భగా విజయ్కు ఉన్న ప్రజాదరణను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. యువత, మహిళలు, ముఖ్యంగా ఫస్ట్టైమ్ ఓటర్లలో విజయ్కి అశేష అభిమానులు ఉన్నారని చెప్పారు. అదే సమయంలో.. ద్రవిడ ఉద్యమం తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత శక్తిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.1994లో డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించారు వైకో. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్తో చేతులు కలిపి పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు సీట్లు కేటాయించగా.. అందులో మూడు సీట్లను డీఎంకే గుర్తు(ఉదయించే సూర్యుడు), మరో అభ్యర్థిని స్వంత గుర్తుతో వైకో బరిలోకి దించారు. ఇదిలా ఉంటే..ఎన్నికల అరంగేట్రంలోనే టీవీకే గణనీయమైన ప్రభావం చూపవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మిగతా సర్వేలు డబుల్ డిజిట్ రావొచ్చని అంచనా వేస్తుంటే.. యాక్సిస్ మై ఇండియా (Axis My India) ఎగ్జిట్ పోల్స్ మాత్రం 98–120 సీట్లు గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంటుందని తెలిపింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇప్పుడు అధికార మిత్రకూటమి సీనియర్ నేత వైకో ప్రశంసలు గుప్పించడంతో విజయ్ అభిమానులు ఉబ్బితబ్బిబైపోతున్నారు.ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు పోలింగ్లో 85.1% ఓటింగ్ నమోదైంది. అయితే.. యువత, కొత్త ఓటర్ల భాగస్వామ్యం పెరగడం TVKకి అనుకూలంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.తమిళనాడులో విజయ్కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ పీక్స్లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, యువతను ఆకర్షించే వాగ్దానాలు చేయడం ఆయనకు అదనపు బలం ఇస్తున్నాయి. విద్యార్థులకు స్టైపెండ్లు, స్టార్టప్ రుణాలు, మత్తు పదార్థాల రహిత రాష్ట్రం వంటి హామీలు ఆయన ప్రచారంలో ప్రధానంగా నిలిచాయి.డీఎంకే ఆధ్వర్యంలోని కూటమి రెండోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఇదే ఖరారు చేశాయి. మరోవైపు అన్నాడీఎంకే వరుస ఓటముల తర్వాత తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ తన తొలి ఎన్నికలోనే అన్నాదురై, ఎంజీఆర్ల విజయదుందుభి మోగించవచ్చనే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
అంచనాలు నిజమయ్యేనా?
సాక్షి, చెన్నై: అధికారం తమదే, విజయ్ సీఎం కావడం తథ్యమని ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించిన యాక్సిస్ మై ఇండియా గత అంచనాలు నిజమయ్యాయా అనే కోణంలో టీవీకే వర్గాలు అన్వేషణలో నిమగ్నమ్యాయి. మెజారిటీ సర్వే సంస్థలు అధికార డీఎంకే కూటమికే మళ్లీ పట్టం అని ప్రకటిస్తే, యాక్సిస్మై ఇండియా మాత్రం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు స్పష్టమైన విజయ అవకాశాలు ఉన్నాయని అంచనా వేయడం టీవీకే వర్గాల్లో జోష్ను నింపింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం. యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం విజయ్ నేతృత్వంలోని టీవీకే 98 నుంచి 120 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పారీ్టగా లేదా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి?, ఏయే ఎన్నికల్లో వీరి అంచనాలు తప్పాయో అనే అంశంపై టీవీకే వర్గాలు సమీక్షించే పనిలో నిమగ్నం కావడం విశేషం.నిజమైన సందర్భాలెన్నో యాక్సిస్ మై ఇండియా గతంలో నిర్వహించిన పలు సర్వేలు ఎన్నికల ఫలితాలను చాలా ఖచ్చితంగా అంచనా వేశాయన్న చర్చ జరుగుతోంది. ఆ మేరకు 2019 లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 339 నుంచి 365 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకుంటుందని ఈ సంస్థ అంచనా వేసిందని చెప్పవచ్చు. ఇందులో 353 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం గమనార్హం. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 76 నుంచి 90 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పి ఓటరు నాడిని స్పష్టంగా ముందే గ్రహించారని చెప్పవచ్చు. ఈ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2023లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందని చాలా సర్వేలు చెప్పగా.. యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీ 140 నుంచి 162 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఫలితం బీజేపీ వైపు ఉండడం గమనార్హం. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ కూటమి 178 నుంచి 200 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేయగా, ఈ కూటమి 235 స్థానాలలో విజయంతో అధికారం కైవశం చేసుకుంది. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో తీవ్రమైన పోటీ ఉంటుందని ఇతర సర్వేలు చెప్పగా.. యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీ 45 నుంచి 55 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఇందుక అనుగుణంగా బీజేపీ 48 స్థానాలలో విజయం సాధించడం గమనార్హం. అదే సమయంలో అంచనాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 360 నుంచి 390 సీట్లు వస్తాయని అంచనా వేయడం ఫలితం 293 సీట్ల వద్దే ఆగింది. ఇప్పుడు తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మిగతా సర్వేలకు భిన్నంగా విజయ్ టీవీకే పారీ్టకి 98–120 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఈ అంచనా నిజమై విజయ్ సరికొత్త చరిత్ర çసృష్టిస్తారా అనే ఎదురు చూపులలో టీవీకే వర్గాలు, అభిమానులు ఉన్నారు. ఈసర్వేనే కాదు, సామాజిక మాధ్యమాలలో సాగుతున్న సర్వేలన్నీ విజయ్కు అనుకూలంగా ఉండడంతో తుది తీర్పు మే 4వ తేదీ కోసం వేచి చూడక తప్పలేదు. ప్రజా మద్దతకు దైవబలం సైతం తోడు కావాలన్న కాంక్షతో విజయ్ తాజాగా ఆధ్యాతి్మక యాత్రలో ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శనివారం విజయ్ నాగపట్నం జిల్లాలో వేలాంకన్ని మాత ఆలయం, నాగూర్ దర్గాను సందర్శించేందుకు సిద్ధం కావడం విశేషం. -
హాట్ న్యూస్: ఎన్డీయే కూటమితో విజయ్ పొత్తు!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ.. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే-అన్నాడీఎంకే-టీవీకే పార్టీలు ఇవాళ వరుస మీటింగ్లు పెట్టుకున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత సమీకరణాలు మారుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించిన టీవీకే అధినేత విజయ్.. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమితో పొత్తుకు చేయి చాస్తాడా? అనే చర్చ జోరుందుకుంది. తమిళనాడులో డీఎంకే పార్టీదే మళ్లీ అధికారమని ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ సర్వేలు తేల్చి చెప్పాయి. ఒకటి రెండు మాత్రం అన్నాడీఎంకేకు అధికారం దక్కవచ్చని చెప్పాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం తప్పదని.. ఆ పార్టీ ఏకంగా అధికారం కైవసం చేసుకుంటుందని చెప్పింది. అయితే మిగతా సర్వేలు మాత్రం విజయ్ పార్టీ డబుల్ డిజిట్ను కైవసం చేసుకోవచ్చని అంచనా వేశాయి. ఈ తరుణంలో.. విజయ్ పార్టీలో జోష్ కనబడుతోంది. సర్వేలు అంచనా వేసినట్లు.. నిజంగానే ఫలితాల్లో టీవీకే జోరు కొనసాగుతుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే పొత్తుల సమీకరణాలు తెర మీదకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేతో పవర్షేరింగ్ కోసం విజయ్ చేతులు కలపబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే.. తమిళ రాజకీయాల్లో విజయ్ నిర్ణయం సంచలనమనే చెప్పొచ్చు.వాస్తవానికి ఎన్నికలకు ముందు విజయ్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారంలో భాగం కోరుకునే పార్టీలను తాము ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో చిన్నచిన్న పార్టీల నేతలతో పాటు అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న కీలక నేతలు కూడా టీవీకే వైపు మొగ్గు చూపించారు. చివరకు అధిష్టానం జోక్యంతో వాళ్లంతా మెత్తబడ్డారు. మరోవైపు టీవీకే కూడా అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలు ఏనాడూ చేసింది లేదు. అయినప్పటికీ.. బీజేపీ, కాంగ్రెస్లు విజయ్తో పొత్తు కోసం ఉవ్విళ్లూరాయి. సరిగ్గా అదే టైంలో TVK–AIADMK కలిసి పని చేస్తాయంటూ ఓ ప్రచారం ఉధృతంగా జరిగింది. ఇది ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళానికి దారి తీయడంతో.. అలాంటిదేం ఉండబోదని కీలక నేతలు స్పష్టత ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా అలాంటిదేం ఉండబోదని.. ఎగ్జిట్పోల్స్ తర్వాత మీడియా అత్యుత్సాహం, టీఆర్పీ మోజుతోనే కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో విజయ్ పొత్తుకు వెళ్తారా? అనేది ఇప్పటికైతే అనుమానామే. -
రూ.30 లక్షలు పెట్టి కొన్నారు.. ఒక్క చాన్స్ ఇవ్వట్లేదు!
శ్రీకాకుళం: జిల్లాకు చెందిన స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్లో అడుగుపెట్టినప్పటికీ.. మైదానంలో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) తరఫున విజయ్ వరుసగా రెండో ఏడాది ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రిజర్వ్బెంచ్కే పరిమితమవుతున్నాడు. ఒకే ఒక్క ఛాన్స్..! అన్నట్టుగా ఒక్క మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యువ ఆల్రౌండర్.. అవకాశం లభించిన మ్యాచ్లో ఆకట్టుకునేందుకు నిరీక్షిస్తున్నాడు. డీసీ ఆడే తన తదుపరి మ్యాచ్లో అవకాశం లభించవచ్చని భావిస్తున్నాడు. రూ.30 లక్షలకు కొనుగోలు.. పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతునప్పటికీ.. గత మూడేళ్లగా నిలకడైన ఆటతీరుతో ఆల్రౌండర్గా రాణింపుతో అందరి దృష్టిని ఆకర్షించిన త్రిపురాన విజయ్.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సెలక్షన్స్ ట్రయల్స్లో పాల్గొని రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్తోపాటు మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేయడం విజయ్లోని అదనపు క్వాలిటీ. వీటికి ముందు కుచ్బిహార్ ట్రోఫీ, విజయ్హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ క్రికెట్ టోరీ్నలు, ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)లు, రంజీల్లో రాణించడంతో బీసీసీఐ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో ఐపీఎల్లో ఛాన్స్ వచ్చింది. ఇటీవల ముగిసిన టోర్నీల్లో రాణించడంతో డీసీ విజయ్ను అట్టిపెట్టుకుంది. నిరూపించుకుంటాడు: జెడ్సీఎస్ ఒక్క అవకాశం వస్తే.. విజయ్ నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని జిల్లా క్రికెట్ సంఘం (జెడ్సీఎస్) ప్రతినిధులు, జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షులు పెద్దలు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, డాక్టర్ రవికుమార్, కోచ్లు, సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు. విజయ్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాదికి మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లు ఐపీఎల్ రేసులో నిలిచేందుకు ఉవి్వల్లూరుతున్నారని అంటున్నారు. జిల్లా నుంచి ఒకే ఒక్కడు.. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్కు ఎంపికైన మొదటి క్రికెటర్గా త్రిపురాన విజయ్ ఇప్పటికే గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్లో నివాసం ఉంటున్న త్రిపురాణ వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. నిరూపించుకుంటా.. ఐపీఎల్కు ఎంపిక కావడం గర్వకారణంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్కు వరుసగా రెండో ఏడాది ఆడుతుండటం, కేఎల్, అక్షర్, కుల్దీప్, వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లతో కలిసి ట్రావెల్ చేస్తుండటం కొత్తగా ఉంది. ఐపీఎల్కు ఇప్పటి వరకు డీసీ 8 మ్యాచ్లు ఆడింది. ఫైనల్ లెవన్ ఛాన్స్ రాలేదు. డీసీ మ్యాచ్లు ఇంకా చాలా ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది. మున్ముందు మ్యాచ్ల్లో రిజర్వ్బెంచ్లను కూడా పరీక్షించాలనే ఆలోచన మేనేజ్మెంట్, కోచ్లు ఆలోచన చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో కఠోర సాధన చేస్తున్నాను. అవకాశం వచ్చిన మ్యాచ్ల్లో నన్ను నేను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. – త్రిపురాణ విజయ్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, ఆంధ్రా రంజీ ఆటగాడు -
ఆ సినిమా సీన్ను రిపీట్ చేస్తున్న విజయ్!
కొన్ని దశాబ్దాల తమిళనాడు రాజకీయలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ద్విముఖ పోరాటంగా కొనసాగుతూ వచ్చాయి. మధ్యలో ప్రత్యామ్నాయంగా పార్టీలు పుట్టుకొచ్చినా.. అవి దీర్ఘకాలం ప్రభావం చూపెట్టలేకపోయాయి. కానీ ఈసారి ఆ సీన్లోకి అగ్రనటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఈలోపు.. ఎగ్జిట్పోల్ ఫలితాలు ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. మెజారిటీ డీఎంకేకే తమిళ ఓటర్లు మళ్లీ పట్టం కడతారని తేల్చేశాయి. ఒకట్రెండు మాత్రం ప్రతిపక్ష అన్నాడీఎంకేకు అధికారం ఖాయమన్నాయి. అయితే ఆ సర్వేలే విజయ్ టీవీకే పార్టీ రెండంకెల ఫిగర్కు పరిమితం కావొచ్చని చెబుతూనే.. ఓటింగ్ శాతంపరంగా ఇంపాక్ట్ చూపించవచ్చని అంచనా వేశాయి. అయితే.. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం అనూహ్యంగా విజయ్ టీవీకే అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోందని పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ 98-120 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సంఖ్య సాధారణ మెజారిటీకి మించి ఉండటంతో.. విజయ్ ముఖ్యమంత్రి పదవి వైపు దూసుకెళ్తున్నారని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా వ్యాఖ్యానించారు.దీంతో విజయ్ అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. అయితే విజయ్ మాత్రం తొందరపాటు వద్దని.. సంయమనం పాటించాలని కేడర్కు, అభిమానులకు సూచిస్తున్నారు. పోలింగ్ తర్వాత ఇంటికే పరిమితమైన ఆయన.. ఫలితాలు దగ్గర పడుతున్నా కొద్దీ వరుసగా ప్రముఖ ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవాళ టీవీకే తరఫున పోటీ చేసిన 234 మంది అభ్యర్థులతోనూ ఆయన భేటీ కానున్నారు. మురుగదాస్ డైరెక్షన్లో విజయ్ హీరోగా సర్కార్ అనే పొలిటికల్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఓటు వాల్యూ ఏంటో చెప్పే మెసేజ్తో తెరకెక్కిందా చిత్రం. సినిమా క్లైమాక్స్లో.. తన తరఫున గెలిచిన వాళ్లతో ఓ మీటింగ్ పెట్టి సీఎం క్యాండిడేట్ను అనౌన్స్ చేస్తాడు విజయ్. ఈ నేపథ్యంలో నెట్టింట ఇవాళ్టి టీవీకే మీటింగ్పైనా అలాంటి పోలికతో చర్చ నడుస్తోంది. అయితే.. ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలన్నదానిపై అభ్యర్థులకు విజయ్ దిశానిర్దేశం చేస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు ఈ మీటింగ్పై సెటైర్లు పేలుస్తున్నారు. టీవీకే ఇప్పటికే విజయ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం కేండిడేట్ను కొంపదీసి విజయ్ మారుస్తారా? ఏంటి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. తమిళ దర్శకనిర్మాత ఎస్ఏ చంద్రశేఖర్ తనయుడిగా వెట్రి(1984) అనే మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా జోసెఫ్ విజయ్ వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆపై 18 ఏళ్ల వయసులో నాళఇయా తీర్పు(1992)తో హీరోగా మారాడు. రొమాంటిక్, మాస్ ఇమేజ్లతో అగ్రతారగా ఎదిగారు. ఒక పక్క మెసేజ్ ఓరియెంటల్ సినిమాలు వరుసగా తీస్తూనే.. మరోవైపు తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవతో గుర్తింపు దక్కించుకున్నారు. ఈ మధ్యలో తమిళనాడులో జరిగిన ప్రతీ పోరాటానికి, ఉద్యమానికి పార్టీలకతీతంగా ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అటుపై ఏకంగా తమిళగ వెట్రి కగళం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం దాకా.. విజయ్ అనుసరించిన వ్యూహం తమిళ ప్రజలను మరీ ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఎవరితోనూ పొత్తు ఉండదని.. ఒంటరి పోరుకే సై అంటూ హాట్ చర్చకు దారి తీశారాయన. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా.. డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించుకుంటూ మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగారు. ఒకానొక దశలో.. తమిళనాట మార్పు టీవీకేతోనే సాధ్యం అనే పిలుపుపై జోరుగా చర్చ నడిచింది. అయితే ఎంజీఆర్, జయలలితలా.. విజయ్ మరో తమిళ రాజకీయాలను శాసించే సినీ తార అవుతారా? లేదా? అనేది ఫలితాలు వెల్లడయ్యేదాకా సస్పెన్స్గానే భావించాలి. -
అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటా: త్రిష
ఇటీవల సెంటర్ ఆఫ్ ది మీడియాగా మారిన నటి త్రిష.. చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ హాట్టాపిక్గా మారారు. దీంతో ఆమె సోషల్మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతుంది. రెండు దశాబ్దాలకు పైగా దక్షిణాది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న త్రిష.. కోలీవుడ్లోని అతి కొద్దిమంది మోస్టెస్ట్ బ్యాచిలర్ నటీమణుల్లో ఒకరు. ఈ విషయం కూడా ఈమెను వార్తల్లో నిలబెట్టడానికి ఒక కారణం కావచ్చు. నటుడు, తమిళగ వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఫ్రెండ్ కావడంతో ఈమె రాజకీయాల్లోనూ ఎక్కువగా నానుతున్నారు. దీంతో త్రిష రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారని, సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. అయితే నటనకు స్వస్తి చెప్పడం లేదని చెప్పే విధంగా ఇటీవలే ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈమె మిత్రులతో కలిసి ఎంజాయ్ చేసే ఫొటోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. త్రిష రాత్రి వేళ మేలుకుని ఉంటారనే ప్రచారం ఉంది. ఇటీవల త్రిష తన ఇన్స్ట్రాగామ్లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో గంట నిద్ర కోల్పోతే, దాని నుంచి రికవరీ అవడానికి 4 రోజులు పడుతుంది. ఈ ప్రకారం లెక్కలు కడితే 2062 సంవత్సరంలోనే నేను ప్రశాంతంగా జీవిస్తాననే భావన కలుగుతోంది అని పేర్కొన్నారు. దీంతో త్రిష మాటల్లో అర్థం ఏమిటి ? అనే చర్చ జరుగుతోంది. త్రిషకు సరిగా నిద్ర పట్టడం లేదా, ఆమె మానసిక రుగ్మతకు లోనౌతున్నారా..? వంటి ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తున్నారు. -
హీరో విజయ్ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్
గతవారమే తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. ఈసారి స్టార్ హీరో దళపతి విజయ్ తొలిసారి పోటీలో నిలిచాడు. అయితే ఇతడిని టార్గెట్ చేస్తూ తీసిన ఓ సినిమాని ఎలక్షన్ ముందు థియేటర్లలో రిలీజ్ చేశారు. అదేమంత ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఇప్పుడు ఫలితాలు రాకముందే ఆ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా ఐదింటిలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్.. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే ఇతడి టార్గెట్ చేసేలా 'టీఎన్ 2026' పేరిట ఓ సినిమా తీశారు. తమిళ కమెడియన్ తంబి రామయ్య స్టోరీ అందించగా.. ఇతడి కొడుకు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించాడు. సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్.. ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కాగా కేవలం మూడు వారాల్లోనే అంటే రేపటి(ఏప్రిల్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.'టీఎన్ 2026' విషయానికొస్తే.. ప్రముఖ సినిమా హీరో, రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్తగా పార్టీ స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశంతో పొలిటికల్ సెటైరికల్గా ఈ సినిమా తీశారు. అయితే విజయ్ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు. థియేటర్లలో ఏ మాత్రం అలరించలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీల్లో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి? తెలుగులోకి వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..) -
మహిమాన్వితమైన గుడికి విజయ్.. వీడియో వైరల్
తిరుచెందూర్ మురుగన్ (సుబ్రమణ్య స్వామి ఆలయం)ను నటుడు, టీవీకే అధినేత విజయ్ దర్శించుకున్నారు. కొద్దిరోజులుగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయ్ 4న విడుదల కానున్న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తిరుచెందూర్ మురుగన్ను విజయ్ దర్శించుకున్నారు. స్వామి ఆయుధం "వేల్" (శక్త్యాయుధము) చేత అందుకున్న విజయ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతారు. అందుకే స్వామి ఆశీస్సుల కోసం విజయ్ వచ్చినట్లు తెలుస్తోంది.తమిళనాడులో ఉన్న మురుగన్ ఆరు నివాసాలలో ఇది రెండవది. తమిళనాడులో అత్యధికంగా సందర్శించే మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ఆలయం ఉంది. సుబ్రహ్మణేశ్వర స్వామికి చెందిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపైనే ఉన్నాయి. కానీ, తిరుచెందూర్ మాత్రం సముద్ర తీరంలో కొలువై ఉంటుంది. ఇక్కడి సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని భక్తులు చెబుతారు. తిరుచెందూర్ మురుగన్కు అభిషేకం చేసిన విభూతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే, గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవని నమ్ముతారు. తమిళనాడు నలుమూలల నుంచి తిరుచెందూర్కు చేరుకోవచ్చు. తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మధురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నిరంతరం రైలు, బస్సు రవాణా సౌకర్యం ఉంది. #TVKVijay at Tiruchendur Murugan Temple for Vishwaroopa Darshan ❤️🔥💥pic.twitter.com/204nfbypKs— Troll Cinema ( TC ) (@Troll_Cinema) April 28, 2026 -
విజయ్ని ఎలా మోసం చేశావ్.. ఫ్యాన్స్ ఫైర్
నటుడు, తమిళ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం జన నాయకన్. పూజాహెగ్డే కథానాయకిగా నటించిన చిత్రంలో మమతా బైజు కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని గత జనవరి 9న తెరపైకి రావాల్సి ఉంది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జననాయకన్ విడుదలవుతుందని అందరూ ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రం ఇటీవల పూర్తిగా ఇంటర్నెట్లో లీకై యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాత ఫిర్యాదు మేరకు చెన్నై సైబర్ క్రైమ్శాఖ అధికారులు విచారణ చేపట్టి ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఉన్న మరికొందరిని కనిపెట్టే పనిలో ఉన్నారు. కాగా జననాయకన్ చిత్రం ఎడిటింగ్ నుంచి లీక్ అయినట్లు దర్యాప్తులో తేలింది. ఈ చిత్రానికి ప్రదీప్ కె రాఘవ్ పనిచేశారు. ఆయన వద్ద పనిచేసిన సహాయ ఎడిటర్ జననాయకన్ చిత్రాన్ని ఇంటర్నెట్లో లీక్ చేసినట్లు తేలింది. దీంతో చిత్ర ఎడిటర్ ప్రదీప్ కె రాఘవ్కు చిత్ర లీకేజ్తో సంబంధం లేకపోయినా ఆయన దక్షిణ భారత సినీ ఎడిటర్ అసోసియేషన్లో సభ్యత్వం లేని సహాయ ఎడిటర్లతో పనిచేయించినందుకుగాను ప్రదీప్ కె రాఘవ్ను సస్పెండ్ చేసినట్లు ఎడిటర్ అసోసియేషన్ నిర్వాహకులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. విజయ్ ఫ్యాన్స్ ఫైర్జన నాయగన్ ఎడిటర్ ప్రదీప్ కె రాఘవ్పై విజయ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా విజయ్ శత్రువులతో ఎడిటర్ ప్రదీప్ చేతులు కలిపాడంటూ పోస్టులు పెడుతున్నారు. డబ్బుకు అమ్ముడుపోయి ఇలాంటి పనిచేసి వుంటాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎంతగానో నమ్మిన విజయ్ని ఎలా మోసం చేశావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, అసలు వాస్తవం ఎడిటర్ ప్రదీప్కు ఈ లీక్ వ్యవహారంలో సంబంధం లేదు. సినీ ఎడిటర్ అసోసియేషన్లో సభ్యత్వం లేని సహాయ ఎడిటర్లతో జన నాయగన్ మూవీ కోసం ఆయన పనిచేయించుకోవడంతో సమస్య వచ్చింది. వారి వల్లే ఈ మూవీ లీక్ అయిందని పోలీసులు తెలిపారు. -
విజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓటర్లకు, తన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లో తమను తక్కువ అంచనా వేసిన వారికి ప్రజలు చేతలతో సమాధానం చెప్పారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు అంటే కేవలం అనుభవం ఉన్న వారికి లేదా పదవులను అనుభవించే వారికి మాత్రమే పరిమితం అని భావించే వారి అంచనాలను సామాన్య ప్రజలు చిత్తు చేశారని విజయ్ వ్యాఖ్యానించారు. చారిత్రాత్మక పోలింగ్ తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85 శాతం పోలింగ్ నమోదు కావడం ఒక గొప్ప మైలురాయి అని, ఇది నిజమైన ప్రజాస్వామ్య పండుగ అని ఆయన అభివర్ణించారు. రాజకీయాలకు దూరంగా ఉంటారని భావించే యువత, మహిళలు ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేయడం ఒక చారిత్రాత్మక మార్పు అని పేర్కొన్నారు. కేవలం ఓటు వేయడం కోసం విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఖర్చుతో వచ్చిన వారి ప్రజాస్వామ్య స్ఫూర్తికి శిరస్సు వంచి తాను నమస్కరిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు స్పెషల్ థ్యాంక్స్ కుటుంబసభ్యులను పోలింగ్ కేంద్రాలకు నడిపించిన తన ‘కుట్టి ఫ్రెండ్స్’ (పిల్లలకు) ‘విజయ్ మామ’ ప్రత్యేక ధన్యవాదాలు అని వ్యాఖ్యలు చేశారు. విమర్శకులకు గట్టి కౌంటర్గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి విజయ్ వ్యాఖ్యలు చేస్తూ, “వీరికి రాజకీయాల గురించి ఏం తెలుసు? ఎలా తట్టుకోగలరు? అని ఎగతాళి చేసిన వారికి, పోలింగ్ రోజున క్రమశిక్షణతో పని చేసి తమ చేతలతోనే సమాధానం చెప్పారని విజయ్ ప్రశంసించారు. బూత్ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లు కష్టపడి పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన కొనియాడారు. “రాజకీయాలను ఒక నిర్దిష్ట పరిధిలో ఉంచాలనుకున్న వారి అంచనాలు సామాన్య ప్రజల దెబ్బకు చెల్లాచెదురయ్యాయని, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే అని ముగించారు. -
అజిత్పై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం.. వివరణ ఇచ్చిన టీమ్
ఓట్లు వేసిన సెలబ్రటీలు అందరూ మీడియా ముందుకు వచ్చి ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. కొందరు అయితే, తాజాగా ఓటర్లలో చైతన్యం వచ్చిందని, ఎవరికి వారు వారికి నచ్చిన వారికి ఓట్లు వేసుకోవాలని సూచించారు. అదే సమయంలో అజిత్ చేసిన ఓ వ్యాఖ్య చర్చకు దారి తీసింది. ఆయన్ని తమిళనాడులో మార్పు తథ్యమా..? అని ఓ మీడియా ప్రశ్నించగా, ఆయన నో నెవర్ అని వ్యాఖ్యలు చేసి వెళ్లి పోయారు.అయితే, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తమిళానాడులో మార్పు అవశ్యం లేదంటూ అజిత్ వ్యాఖ్యలు చేశారంటూ మీడియా హల్ చల్చేయడంతో టీవీకే విజయ్ అభిమానులలో ఆగ్రహం రేగినట్టైంది. దీంతో మేల్కొన్న అజిత్ తన మేనేజర్ సురేష్ చంద్ర ద్వారా వివరణ ఇచ్చారు. నో నెవర్ అని అజిత్ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని, ఇప్పుడు వద్దు అని వారిస్తూ ఆంగ్లంలో చేసిన వ్యాఖ్యలు మరో విధంగా అర్థానికి దారి తీసినట్టు ప్రకటించారు. -
ఓటేసిన తర్వాత త్రిష చేసిన తొలి పోస్ట్ ఇదే!
తమిళనాడు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసారి రాష్ట్రంలో ముక్కోనపు పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం(టీవీకే)’ పార్టీ కూడా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది.దీంతో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీవీకే అధినేత హీరో విజయ్, రజనీకాంత్, అజిత్, ధనుష్, శ్రుతి హాసన్, కమల్ హాసన్, త్రిష, ఖుష్బూ, శివ కార్తికేయన్, డైరెక్టర్ అట్లీ తదితర ప్రముఖులు తమకు కేటాయించిన పోలీంగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష అని చెప్పొచ్చు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయ్తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ రావడం.. అవి నిజమే అన్నట్లుగా ఇద్దరూ కలిసి ఓ ఫంక్షన్కి హాజరకావడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు ఓటు వేయడానికి వచ్చిన త్రిషపై మీడియా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అయితే త్రిష మాత్రం సింపుల్గా వచ్చి ఓటు వేసి వెళ్లింది. విజయ్కి మద్దతుగా ఒక్క మాట మాట్లాడలేదు కానీ.. తాను టీవీకే పార్టీకే ఓటు వేశానని పరోక్షంగా చెప్పేసింది.ఇన్స్టాలో తొలి పోస్ట్.. చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో తన తల్లి ఉమతో కలిసి ఓటు వేసిన త్రిష, ఆ తర్వాత తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ ఫోటో దిగి వెళ్లిపోయారు. కాసేపటికే ఆ ఫోటోని తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ ఫోటోకు ఆమె జోడించిన పాట ఇప్పుడు అసలైన రచ్చకు కారణమైంది.పాటతో ఇలా చెప్పేసిందిత్రిష షేర్ చేసిన పోటోకి బ్యాగ్రౌండ్లో ఓ పాటను జోడించింది. అది విజయ్తో కలిసి త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'గిల్లి'లోని 'అర్జునర్ విల్లు' అనే పాట. కేవలం పాటను ఎంచుకోవడమే కాదు, అందులో కేవలం 'విజిల్స్'వినిపించే భాగాన్ని మాత్రమే ఆమె తన పోస్ట్కి జత చేసింది. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. విజయ్ పార్టీ గుర్తు విజిల్. అందుకే త్రిష ఆ పాటతో షేర్ చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. విజయ్కు మద్దతు తెలపడానికే త్రిష ఈ పాటను వాడారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక విజయ్ అభిమానులు అయితే త్రిషను ఏకంగా ‘వదినమ్మ’అని సంభోదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ -త్రిషలు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ఓటర్ల ఉత్సాహంపై నీళ్లు చల్లొద్దు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ అత్యవసరంగా ఓ లేఖ రాశారు. ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూనే.. పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.ఎలక్షన్ టైంలో తమిళనాడులో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సొంతూళ్లకు వెళ్లి ఓటేయాలనుకుంటున్నవాళ్లు బస్సుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు పట్టణ, నగరాల్లోనూ బస్టాండులలో పడిగాపులు పడుతున్నారు. కొయంబత్తూరులో జనం ఏకంగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఈ పరిస్థితులన్నింటినీ విజయ్ తన లేఖలో ప్రస్తావించారు. ‘‘ఓటు వేసేందుకు తమిళనాడు ఓటర్లు పోటెత్తుతున్నారు. గంట గంటకు పెరుగుతున్న ఓటింగ్ శాతమే ఇందుకు నిదర్శనం. అయితే.. పూర్తిస్థాయిలో ఓటు వేయకుండా అడ్డుకునే కుట్ర కనిపిస్తోంది. సరిపడా బస్సులు లేక ఓటర్లు అవస్థలు పడుతున్నారు. చెన్నైలోని ప్రధాన టెర్మినల్స్ అని ప్రజలతో నిండిపోయాయి. పోలింగ్ బూత్లకు ఓటర్లు చేరుకోలేకపోతున్నారు. వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి. ఓటు వేయాలన్న ఓటర్ల ఉత్సామంపై నీళ్లు చల్లొద్దు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ను మరో రెండు గంటలు పొడిగించండి’’ అని ఈసీని లేఖలో కోరారాయన. pic.twitter.com/Y7Q3Gn1mKY— TVK Party HQ (@TVKPartyHQ) April 23, 2026తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6గం.తో పోలింగ్ ముగియనుంది. అప్పటిదాకా క్యూ లైన్లో ఉన్న వాళ్లను మాత్రమే ఓటింగ్కు అనుమతించనున్నారు. అయితే బస్సుల కొరత కారణంగా విజయ్ ఆ సమయాన్ని 8గం. దాకా పొడిగించాలని ఈసీని కోరుతున్నారు.తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు విజయ్. మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది ఆ పార్టీ. విజయ్ కూడా తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఇదీ చదవండి: విజయ్.. ఆ సింప్లిసిటీ ఏమైంది? -
ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్
-
ఫస్ట్ టైం.. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన విజయ్
తమిళనాట అగ్రనటుడు విజయ్ది ఒక ప్రత్యేక శైలి. నటుడిగానే కాదు.. యువతకు ఆయనో రోల్ మోడల్. ముసుగులేసుకుని ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు మద్దతు ప్రకటించడం, అభిమానులను పరామర్శించేందుకు మారువేషంలో వెళ్లడం.. ఇలా చాలాసార్లు జరిగిందే. అలాగే ఓటు వేసే టైంలోనూ ఆయన ఓ ప్రత్యేకతను ప్రదర్శించేవారు. పోలింగ్ కేంద్రానికి కాన్వాయ్ లాంటి హడావిడి లేకుండా.. సింపుల్గా సైకిల్ మీద వచ్చి ఓటేయడం ఆయనకు అలవాటుగా ఉండేది. ఎందుకని అడిగితే.. ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణహితం, ప్రజాస్వామ్యానికి అంకితభావం అంటూ యువతకు మంచి మేసేజ్ ఇచ్చేవారు. అంతేకాదు.. ఎంత ఆలస్యమైనా సరే క్యూ లైన్లో నిల్చుని ఓటేసి వెళ్లిపోయేవారు. 2021 అసెంబ్లీ ఎన్నికల టైంలోనే కాదు.. అంతకు ముందు కూడా ఆయన సింప్లిసిటీ గురించి నెట్టింట జోరుగా చర్చ నడిచేది. అయితే.. మొదటిసారి రాజకీయ నాయకుడిగా ఆ సంప్రదాయానికి ఆయన బ్రేకులు వేశారు. ఈసారి భారీగా టీవీకే శ్రేణులు, అభిమానుల కోలాహలం నడుమ కాన్వాయ్లో చెన్నైలోని నీలంకరైలో ఉన్న పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. ఆ సమయంలో క్రౌడ్కంట్రోల్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో క్యూ లైన్లో కాకుండా ఆయన్ని పక్క నుంచి లోపలికి పంపి ఓటేసేందుకు అనుమతించారు పోలింగ్ సిబ్బంది.విజయ్ ఈసారి తన టీవీకే పార్టీతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే. మొత్తం 234 స్థానాల్లోనూ ఆయన అభ్యర్థులను నిలిపారు. ఆయన కూడా పెరంబూర్, తిరుచురాపల్లి ఈస్ట్.. రెండు చోట్లా పోటీ చేస్తున్నారు. టీవీకే పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా విజయ్ పేరునే ఖరారు చేశారు. #WATCH | Tamil Nadu Elections 2026 | Vijay, TVK chief and candidate from Tiruchirappalli East and Perambur constituencies, at a polling station in Chennai after casting his vote. pic.twitter.com/yCXPjQyJEh— ANI (@ANI) April 23, 2026#WATCH | Tamil Nadu Elections 2026 | Vijay, TVK chief and candidate from Tiruchirappalli East and Perambur constituencies, leaves after casting his vote at a polling station in Chennai. pic.twitter.com/lvVizuciek— ANI (@ANI) April 23, 2026 -
‘టీవీకే’ రోబోను చూశారా? సందడి మాములుగా లేదుగా!
చెన్నై: కోయంబత్తూరులో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. రోబోతో ఓట్ల వేట మొదలుపెట్టింది. టీవీకే కండువా ధరించిన ఒక రోబోను రంగంలోకి దించారు. సౌత్ చెన్నై అభ్యర్థి సెంథిల్ కుమార్కు మద్దతుగా రోబో ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో కరచాలనం చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత విజయ్ క్షేత్రస్థాయి ప్రచారంలో తక్కువగా పాల్గొంటుండటంతో అభ్యర్థులు వినూత్న పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు తిరువెరుంబూర్లో అభ్యర్థి విజయ్ కార్డ్బోర్డ్ కటౌట్ను ఉపయోగించారు. కుంభకోణంలో హోలోగ్రామ్ ఏఐ సాంకేతికతతో ప్రచారం నిర్వహించారు. కొలత్తూరులో విజయ్ పోలికలతో ఉన్న వ్యక్తితో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరు సౌత్లో ఇప్పుడు రోబో ప్రచారం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి విజయ్ కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే పర్యటించడంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విమర్శలపై విజయ్ స్పందిస్తూ.. పోలీసులు, కొందరు అధికారులు చివరి నిమిషంలో టీవీకే కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్నారంటూ ఆరోపించారు. కేవలం సంప్రదాయ ప్రచార పద్ధతులపైనే తాము ఆధారపడలేదని, ఇప్పటికే తమిళనాడులోని ప్రతి ఇంటిలోనూ సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. నేటితో(ఏప్రిల్ 21, మంగళవారం) ప్రచార గడువు ముగియనుంది.ఈ చివరి రోజున విజయ్ సౌత్ చెన్నైలో రోడ్షో నిర్వహించడంతో పాటు చెన్నైలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పోలింగ్ ఏప్రిల్ 23 (గురువారం) ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరగనుంది. ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సంగీత కచేరీలు, థియేటర్ ప్రదర్శనలు లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయకూడదన్నారు. ఎన్నికల అంశాలను టీవీలు, సినిమాలు, ఎఫ్.ఎమ్. రేడియోలు, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) వంటి ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేయకూడదన్నారు. ఎల్రక్టానిక్ రూపంలో వచ్చే సంక్షిప్త సందేశాల, ఇంటర్నెట్ ప్రచారాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. गजब,अभिनेता विजय चुनाव प्रचार में एडवांस टेक्नोलॉजी का बखूबी इस्तेमाल कर रहे है....अब चुनाव प्रचार में रोबोट को उतार दिया है....यह शायद भारत में संभवत पहला चुनाव होगा, जिसमें रोबोट वोट मांग रहा है....कोयंबटूर साउथ सीट में यह रोबोट विजय की पार्टी के लिए कैंपेन कर रहा है... pic.twitter.com/UmSmlk1Vh9— Dinesh Dangi (@dineshdangi84) April 20, 2026 -
విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తమిళ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ విడాకుల కేసుని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు.. సోమవారం విచారణ చేపట్టింది. ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా విజయ్ పర్యటిస్తున్నారని, భద్రతా కారణాలు, ఇతర కార్యక్రమాల వల్ల కోర్టుకు రాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు వివరించారు. మరోవైపు సంగీత కూడా కోర్టుకు రాలేదు. ఈ క్రమంలోనే ఇరువర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కేసు విచారణని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)గతంలోనే ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వాలని విజయ్కి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కానీ సోమవారం.. ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేసి విచారణని వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలోనే ఇరుపక్షాల అభ్యర్థన మేరకు ఈ విడాకుల కేసు విచారణని జూన్ 15వ తేదీకి వాయిదా వేశారు.27 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్న విజయ్-సంగీత.. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు ఇదివరకే తెలియజేశారు. విడాకులకు సంబంధించిన కీలక అంశాలైన భరణం, ఆస్తుల పంపకంపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్, భద్రతకు సంబంధించిన విషయాలపై స్పష్టమైన ఒప్పందానికి వచ్చారట. అయితే ఆర్థికపరమైన వివరాలు ఏవి కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పొందుపరచలేదు.(ఇదీ చదవండి: నేను అడిగాను.. కానీ వాళ్లు ఛాన్స్ ఇవ్వలేదు: 'రాకా' గురించి ఆర్య) -
విజయ్.. ఇక ఆరంభిద్దామా!
తమిళనాడులో సినీ తారల రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంజీఆర్, జయలలిత, సినీ నేపథ్యం ఉన్న కరుణానిధిలు సూపర్ సక్సెస్ అయ్యారు. శివాజీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి కొందరు మాత్రం ఒక స్థాయి వరకే పరిమితం అయ్యారు. రజనీ కాంత్ లాంటి బడా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండానే వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో మరో అగ్రనటుడు విజయ్ ఎంట్రీ ‘మార్పు’ తేవొచ్చనే అంచనాలను రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయ వాతావరణానికి మళ్లీ సినిమా రంగు పులుముకుంది. అధికార పార్టీ డీఎంకే పశ్చిమ తమిళనాడు నిజయోకవర్గాల ప్రచారానికి తన మిత్రుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ను రంగంలోకి దించింది. అయితే ఇది విజయ్కు చెక్ పెట్టే వ్యూహంలో భాగమేనన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఆదివారం రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ కోయంబత్తూరులో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ తరఫున ప్రచారం చేశారు. మన నియోజకవర్గం అంటూ ఉద్వేగంగా మాట్లాడిన ఆయన.. మెట్రో ప్రాజెక్టును నిరాకరించిన కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో టీవీకే అనేది అక్కడ పోటీలోనే లేదన్నట్లు కమల్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కోయంబత్తూరు ప్రతిపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా దానిని చేజక్కించుకునేందుకు కమల్ను ముందు ఉంచింది. కమల్కు ఈ నియోజకవర్గంతో వ్యక్తిగతంగా అలాగే రాజకీయంగానూ అనుబంధం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన ప్రచారంలో ఆ విషయాన్ని ప్రస్తావించిన కమల్.. బాలాజీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత తనదేనని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తమిళనాట టీవీకే అధినేత విజయ్కి యువత, మహిళలు, జెన్జీ ఓటర్లలో విపరీతమైన ఆదరణ ఉంది. అందుకు తగ్గట్లే.. హోలోగ్రామ్లు, కటౌట్లు, సోషల్ మీడియా ద్వారా ఆయన తన ప్రచారాన్ని విస్తృతస్థాయిలో ఉధృతం చేశారు. పైకి పట్టనట్లే కనిపిస్తున్నప్పటికీ.. విజయ్ ప్రచారాన్ని డీఎంకే సీరియస్గానే తీసుకుంది. విజయ్ ఈ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం, త్రిచీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్లో డీంఎకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య ప్రధాన పోటీ ఉంది. త్రిచీ ఈస్ట్ డీఎంకేకు బలమైన స్థానమే అయినా టీవీకే ఎంట్రీతో పోటీ ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో.. కమల్ను ‘స్టార్’ క్యాంపెయినర్గా సీన్లో ఉంచింది. కమల్ ఇప్పటికే చెపాక్–తిరువల్లిక్కేని నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కోసం ప్రచారం చేశారు. మరో 15 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం బ్యాలెన్స్ ఉంది. ఇందులో పెరంబూర్, త్రిచీ ఈస్ట్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్ను కమల్ హాసన్ నేరుగా టార్గెట్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. కరూర్ తొక్కిసలాట, జన నాయగన్ చిత్రానికి సెన్సార్ నిరాకరణ అంశాల్లో విజయ్కు కమల్ హాసన్ నేరుగా మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు డీఎంకే కోసం ఆయన దళపతిని విమర్శించాల్సిన పరిస్థితి. అదే జరిగితే.. విజయ్ కూడా లోకనాయకుడి(ఉళగ నాయగన్)పై ఎదురు దాడి చేయాల్సి వస్తుంది. అంటే.. ఇదంతా తమిళనాడులో స్టార్ల మధ్య నేరుగా రాజకీయ పోరాటాన్ని ఆసక్తికరంగా మార్చుబోతోందన్నమాట. -
విజయ్-సంగీత విడాకులు.. రూ. 250 కోట్లు అడిగారా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీనీ స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవ్వగానే.. సతీమణి సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ విడాకుల కేసు నేడు (ఏప్రిల్ 20) చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని.. ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరవుతానంటూ విజయ్ తన లాయర్తో పిటిషన్ దాఖలు చేయించాడు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.ఇదిలా ఉంటే.. విజయ్-సంగీత జంట పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం చెన్నైలో ఇరువురి లాయర్లు కలిసి చర్చలు జరిపారు. విడిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని..సెటిట్మెంట్ కింద సుమారు రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ ఇవ్వాలని సంగీత కోరుతుందట. అయితే విజయ్ మాత్రం రూ.35 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కుమారుడు, కుమార్తెల బాగోగులు తాను చూసుకుంటానని అంటున్నాడట. అయితే ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కోర్టు విచారణలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. -
నటుడికి దేశాన్ని అప్పగించలేం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పళనిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్, ప్రస్తుత ఎన్నికలను మూడు రకాల రాజకీయ నమూనాలుగా అభివర్ణిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిండుగల్ జిల్లా పళనిలో సీపీఐ అభ్యర్థి పాండికి మద్దతుగా ప్రచార సభలో ప్రకాష్రాజ్ మాట్లాడుతూ ద్రావిడ మోడల్ అన్నది విద్యను అందించే, భాషను రక్షించే, గౌరవాన్ని కాపాడే మోడల్ అని ఆయన కొనియాడారు. అడిమై(బానిస) మోడల్ అన్నది తమిళుల ఆత్మగౌరవాన్ని మోదీ పాదాల చెంత పెట్టే మోడల్ అని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వస్తే తమిళనాడుకు తీరని అన్యాయం జరుగుతుందని, దానికి ఈ బానిస మోడల్ మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. మరొకటి సినిమా మోడల్ అంటూ నటుడు విజయ్ పార్టీని ఉద్దేశిస్తూ.. వ్యాఖ్యలు చేశారు. సినిమాలో ఒకే పాటలో డాక్టర్, ఇంజినీర్ లేదా ముఖ్యమంత్రి అయిపోవచ్చని, అయితే నిజ జీవితం వేరు అని ఎద్దేవా చేశారు.విజయ్పై నేరుగా విమర్శలు నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రకాష్ రాజ్ కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. ‘భాషకు లేదా ప్రజల ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు ఆ నటుడు (విజయ్) ఎప్పుడైనా వచ్చి నిలబడ్డారా అంటూ, నటుడి కోసం థియేటర్లో ఈలలు వేయడం వేరు, కానీ దేశ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టడం వేరు. అని వ్యాఖ్యలు చేశారు. విభజన రాజకీయాలపై హెచ్చరిక మణిపూర్ తరహాలో మధురైను మార్చాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మధురై తర్వాత వారి కన్ను పళనిపైనే ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికలు కేవలం పారీ్టల మధ్య పోరాటం కాదని, ఐక్యతకు, విభజనవాదానికి మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తుండడం గమనార్హం. -
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్జెండర్కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
'జన నాయగన్' లీక్ కేసులో అసలు దొంగ ఎవరంటే..
విజయ్ నటించిన 'జననాయగన్' మూవీ లీక్తో సంబంధం ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. మరో సినిమాకు ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్గా పని చేస్తున్న వ్యక్తే ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో తేలింది. ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్న సదరు వ్యక్తి తరచుగా ‘జన నాయగన్’ మూవీ ఎడిటింగ్ జరిగే స్టూడియోలోకి వెళ్లేవాడు. ఆ సమయంలో సినిమాకు సంబంధించిన కొంత డేటాను దొంగలించి.. దానినే సినిమాగా మార్చాడు. ఆపై తనకు తెలిసిన వారితో ఆ పుటేజీని పంచుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్ ఆన్లైన్లో కనిపించాయి. పూర్తి ఆధారాలతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వారికి రిమాండ్ విధించింది.'జననాయగన్' మూవీ లీక్ కేసులో గతంలోనే ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆపై కోయంబత్తూర్ లోకల్ ఛానల్లో మూవీ ప్రసారం కావడంతో ఆ ఛానల్ యజమానిని కూడా పోలీసులు అరెస్టు అయ్యారు. ఈ క్రమంలో చెన్నై సైబర్ క్రైమ్ విభాగం ప్రేక్షకులకు ఒ క విజ్ఞప్తి చేసింది. అనధికారికంగా ఇలాంటి వీడియోలను ఎవరితోనైనా షేర్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది.జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, మూవీ లీక్ కావడం ఆపై సెన్సార్ చిక్కుల వల్ల విడదల అంశంలో జాప్యం ఏర్పడటంతో భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. -
విజయ్కి వ్యతిరేకంగా బీచ్లో నటి పోరాటం
తమిళనాడులో జల్లికట్టు ఆందోళన ద్వారా ప్రసిద్ధి చెందిన బుల్లి తెర నటి జూలీ, తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్కి వ్యతిరేకంగా చెన్నై మెరీనా బీచ్లో అనుమతి లేకుండా నిరసన తెలిపిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే పెరంబూరు నియోజకవర్గంలో విజయ్ను విమర్శిస్తూ ప్రచారం చేసిన జూలీ తాజాగా మెరీనా ఔవయ్యార్ విగ్రహం వద్ద తన మద్దతుదారులతో కలిసి ఆకస్మికంగా నిరసనలో పాల్గొన్నారు. ఒక చేతిలో డీఎంకేకు ఓటు వేయండి అనే బ్యానర్ను, మరో చేతిలో విజయ్ను ఉద్దేశించి ఉడుత బొమ్మ వేసి దానిపై ’ఎక్స్’ గుర్తు వేసిన బ్యానర్ను పట్టుకుని నినాదాలు చేశారు. ముఖ్యంగా, తమిళగ వెట్రికళగం ద్వారా మహిళలకు రక్షణ లేదు అనే వాక్యం ఉన్న ప్లకార్డును జూలీ పట్టుకోవడం విజయ్ అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న మెరీనా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో నిరసన తెలిపిన జూలీతో సహా నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల సమయంలో సరైన అనుమతి లేకుండా ప్రచారం చేయకూడదని సూచించిన పోలీసులు, ఆమె నుంచి క్షమాపణ లేఖ రాయించుకుని విడుదల చేశారు. View this post on Instagram A post shared by Julie (@mariajuliana_official) -
విజయ్కి బిగ్ షాక్.. లోకల్ ఛానల్లో ‘జననాయగన్’
తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్కు నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సుమారు ఐదు నిమిషాల నిడివి గల కీలక దృశ్యాలు, పాటలు ఇంటర్నెట్లో లీక్ కాగా, తాజాగా ఓ లోకల్ ఛానల్ ఏకంగా సినిమా మొత్తాన్ని ప్రసారం చేసింది. ఇంకా థియేటర్స్లో కూడా విడుదల కానీ ఈ సినిమా.. టీవీలో ప్రసారం చేయడం చిత్రబృందాన్ని షాక్కు గురి చేసింది.కోయంబత్తూరు సమీపంలోని కరుమత్తంపట్టిలో ‘రాశి కేబుల్ టీవీ’ నెట్వర్క్ను నిర్వహిస్తున్న పళనిసామి అనే వ్యక్తి తన లోకల్ ఛానెల్లో ఏప్రిల్ 11 రాత్రి ఈ చిత్రాన్ని ప్రసారం చేశారు. ఇంకా థియేటర్స్లో విడుదల కాని సినిమా ఏకంగా టీవీలో ప్రసారం కావడాన్ని చూసి విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు షాకయ్యారు. ఈ సినిమా ప్రసారాన్ని నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పళనిసామిని అరెస్ట్ చేసి ప్రసారానికి వాడిన కంప్యూటర్, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే సినిమా మొత్తం సదరు ఛానల్లో ప్రసారం అయిందని టీవీకే నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమా ఆన్లైన్ లీకేజీకి సంబధించిన కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. -
'జన నాయగన్' సినిమా లీక్.. ఆరుగురి అరెస్ట్
విజయ్ నటించిన 'జననాయగన్' మూవీ ఆన్లైన్లో లీక్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. సెన్సార్కు ముందే ఇలా సినిమా లీక్ కావడంతో చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. జననాయగన్ మూవీ లీక్ కారణమైన ఆరుగురిని తమిళనాడు సైబర్ క్రైమ్ అదుపులోకి తీసుకుంది. ఈ అంశంపై చిత్ర యూనిట్కు సంబంధించిన లాయర్ ఒక పోస్ట్ షేర్ చేశారు.జననాయగన్ సినిమా నుంచి లీకైన సీన్లను ఎవరైనా డౌన్లోడ్ చేసినా, షేర్ చేసినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సినిమాను లీక్ చేసిన ఆరుగురిని సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే అరెస్టు చేసిందని లాయర్ పేర్కొన్నారు. క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫారమ్లతో పాటు టెలిగ్రామ్ ద్వారా హై డెఫినిషన్ ప్రింట్ను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసి, పంపిణీ చేసిన ఒక సమన్వయ పైరసీ నెట్వర్క్లో ఈ అనుమానితులు భాగమని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందో లేదో నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
సినిమా లీక్పై జన నాయగన్ హీరోయిన్ల కామెంట్స్
నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా, చివరి చిత్రం జన నాయకన్. పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమిత బైజు, ప్రియమణి తదితరులు నటించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కెవిఎన్ పిక్చర్స్ సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్తో నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సి ఉంది. అయితే, సెన్సార్ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయిన ఈ చిత్రం ఇటీవల ఇంటర్నెట్లో లీక్ కావడం యావత్ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర కథానాయకుడు విజయ్ మాత్రం ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా మౌనం వహిస్తున్నారు. అయితే చిత్ర కథానాయకి పూజహెగ్డే, మమిత బైజు జననాయకన్ చిత్రం ఇంటర్నెట్ లో లీక్ అయిన ఘటన గురించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పూజా హెగ్డే సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ “ ప్రియమైన అభిమానులారా ఒక చిత్ర నిర్మాణం అనేది ఎంతోమంది ఎన్నో రోజుల శ్రమ. ధైర్యంతో కూడిన ప్రయత్నాలు, వ్యక్తిగత త్యాగాలు. అదే విధంగా మీకు మంచి అనుభవాన్ని అందించాలన్న నమ్మకంతో ప్రతిరోజూ క్రమం తప్పకుండా షూటింగ్లో పాల్గొనే యూనిట్ సభ్యుల సమష్టి ప్రయత్న ఫలితం. అలాంటి మా జననాయక్ చిత్రం ఇంటర్నెట్లో రావడం నాకు మాత్రమే కాకుండా ఈ చిత్రంలో పనిచేసిన యూనిట్ సభ్యులు అందరికీ తీవ్ర మనోవేదనను కలిగించింది. ఈ చిత్రాన్ని మనందరం థియేటర్లో చూడటానికి కొంచెం వేచి చూద్దాం. జననాయకన్ చిత్రం కచ్చితంగా థియేటర్లో సరైన సమయంలో విడుదలవుతుంది. పైరసీని ఎప్పటికీ ప్రోత్సహించవద్దు ‘‘ అని పేర్కొన్నారు. నటి మమిత బైజు కూడా ఇలాంటి అభిప్రాయానే వ్యక్తం చేశారు. ’’ పలువురి శ్రమ, కృషితో రూపొందిన చిత్రాన్ని చట్టవిరుద్ధంగా చూడటం వేదనను కలిగిస్తోంది. కాబట్టి జననాయకన్ చిత్రాన్ని అధికారిక పూర్వంగా విడుదలయ్యే వరకు వేచి చూద్దాం “ అని నటి మమిత బైజు పేర్కొన్నారు. కాగా జననాయకన్ చిత్రం ఇంటర్నెట్లో లీక్ కావడానికి సెన్సార్ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఇకపోతే ఈ విషయం గురించి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారులు తీవ్రం విచారణను చేపట్టారు. -
విజయ్ జననాయగన్ లీక్ సీన్స్ కలకలం
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన భారీ చిత్రం 'జననాయగన్' పైరసీ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి దాదాపు గంటకు పైగా కంటెంట్ లీక్ కావడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఫుల్ సినిమానే లీక్ అయినప్పటికీ వెంటనే దానిని అడ్డుకోవడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని క్లిప్పులు మాత్రం వాట్సాప్ ఫార్వార్డుల రూపంలో విస్తృతంగా వ్యాపించాయి. కాగా లీక్ అయిన వీడియోలు చూసి కొంతమంది సోషల్మీడియా జనాలు రివ్యూలు చెబుతున్నారు. అయితే లీక్ సీన్స్లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. తమిళ దర్శకుడు-నటుడు అమీర్ తమను ఉగ్రవాదులుగా చూపించారు. ఇదేనా మీ రాజకీయం?.. అంటూ ప్రశ్నించారు. సినిమాలో ఇలాంటి రాజకీయ కోణం ఎక్కువగా ఉండటంతోనే ఇంతకాలం సెన్సార్ క్లియర్ కాలేకపోయిందని అమీర్ అనుమానం వ్యక్తం చేశారు. కానీ సగటు సినీ అభిమానులు మాత్రం లీక్ సీన్స్లను ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో రాజకీయంగా ఈ లీకేజీ వ్యవహారం విజయ్ పాపులారిటీని మరింత పెంచుతుందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే విజయ్ స్టార్ పవర్ వల్ల లీక్ క్లిప్పులు పాపులారిటీని పెంచినా, నిర్మాతలు మాత్రం భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. -
జననాయగన్ కు దెబ్బ మీద దెబ్బ
-
'జననాయగన్' కు చిరంజీవి సపోర్ట్
విజయ్ నటించిన 'జననాయగన్' విడుదల కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తుండగా ఆన్లైన్లో పలు సీన్లు ప్రత్యక్షం కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ చర్యపై చిరంజీవితో పాటు చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్, నటుడు శివకార్తికేయన్ ఫైర్ అయ్యారు. సెన్సార్ సర్టిఫికెట్ కూడా రాని ఈ చిత్రం నుంచి సుమారు 5 నిమిషాల సీన్తో పాటు ఒక సాంగ్ను లీక్ చేశారు. తమ అనుమతి లేకుండా కొందరు ఇలాంటి పనిచేయడంపై మేకర్స్ ఆగ్రహించారు. మూవీ వీడియోలను షేర్ చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే న్యాయవాదులు నోటీసులు జారీ చేశారు.విజయ్ సినిమాకు అండగా చిరంజీవి జననాయగన్కు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. సినిమా లీక్ కావడం తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఇలాంటి చర్యలు ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. క్రియేటివ్ వర్క్కు రక్షణ అవసరమన్నారు. జననాయగన్కు తన మద్ధతు ఉంటుందని చిరు భరోసా కల్పించారు. పైరసీని అరికడదాం.. సినిమా పరిశ్రమను కాపాడుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. జననాయగన్ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తన్న విషయం తెలిసిందే. అయితే, చిరంజీవి-బాబీ సినిమాను కూడా ఇదే సంస్థ నిర్మిస్తుండటం విశేషం.జననాయగన్ మూవీకి సంబంధించిన వీడియోలు లీక్ కావడంపై నటుడు శివకార్తీకేయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను నిర్మించేందుకు వేలాదిమంది రక్తం, చెమట చిందిస్తారని గుర్తుపెట్టుకోవాలి. దయచేసి పైరసీకి పాల్పడకండి. సినిమాను థియేటర్లలోనే చూసి మా కష్టాన్ని గౌరవించండి. సినిమా పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అని ఆయన కోరారు. -
5 నిమిషాల క్లిప్ కాదు.. మొత్తం సినిమానే లీక్!
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న స్టార్ హీరో, దళపతి విజయ్కి లీకువీరులు పెద్ద షాకిచ్చారు. రిలీజ్కు రెడీగా ఉన్న 'జన నాయగణ్' సినిమా మొత్తాన్ని సోషల్ మీడియాలో లీక్ చేశారు. తొలుత 5 నిమిషాల సీన్స్ అని అంతా అనుకున్నారు. అయితే.. టోటల్గా మూవీ మొత్తం పార్టు పార్టులుగా సోషల్ మీడియాలో కనిపించేసరికి అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ట్విటర్, ఇన్ స్టా, ఫేస్బుక్ ఈ చిత్రం గురించే పెద్ద చర్చ నడుస్తోంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విజయ్, 'జన నాయగణ్' తన చివరి సినిమా అని ప్రకటించారు. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సమస్యల కారణంగా, కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికీ అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు తమిళనాడు ఎన్నికలు జరిగిన తర్వాత రిలీజ్ చేస్తారని నిర్మాతలు అనుకుంటున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. ఇంతలోనే నష్టం జరిగిపోయింది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న మూవీ మొత్తం పైరసీకి గురైనట్లు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.'జన నాయగణ్' సినిమా.. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి రీమేక్గా తెరకెక్కించారు. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. అయితే సినిమాని లీక్ చేసింది ఎవరా అని ప్రస్తుతం డిస్కషన్ నడుస్తోంది. మూవీ టీమ్ నుంచి ఎవరైనా లీక్ చేశారా? లేదంటే ప్రత్యర్థి పార్టీలు విజయ్పై ఇలా కుట్ర చేస్తోందా? అని అనుకుంటున్నారు. -
హీరో విజయ్ ర్యాలీలో ప్రమాదాలు.. యువతను హెచ్చరించిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్–2 మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్హాసన్తో కలిసి రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ బుధవారం ఉదయం చైన్నె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. విజయ్ నటించిన జననాయకన్ చిత్ర విడుదలకు ఆటంకాలు కలగజేయడం, విజయ్ కారు వెంటపడి యువత ప్రమాదాలకు గురవడం, కమల్హాసన్తో నటించడం వంటి పలు విషయాల గురించి విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు.చదువుకోండికాగా విజయ్ నటించిన జననాయకన్ సినిమాపై స్పందించేందుకు రజనీకాంత్ ఇష్టపడలేదు. అయితే నటుల వాహనాల వెనక పడి యువత ప్రమాదాలకు గురవుతున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. చదువుకునే వయసులో విద్యపైనే పూర్తిగా శ్రద్ధ పెట్టాలని, చదువుకునే సమయాన్ని అశ్రద్ధ చేస్తే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. దూరంగా ఉండండిఅదేవిధంగా యువత మద్యానికి, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదన్నారు. అలాంటి దురలవాట్లు కలిగిన ఫ్రెండ్స్ను దూరం పెట్టాలన్నారు. ఇకపోతే తాను, కమల్ హాసన్ కలిసి నటించనున్న చిత్రం ఆగస్టులో ప్రారంభం అవుతుందని రజనీకాంత్ తెలిపారు. విజయ్ ప్రచార కార్యక్రమాలకు యువత భారీ సంఖ్యలో హాజరవుతున్న తరుణంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. -
లీమా రోజ్ ఆస్తి రూ.1000 కోట్లు
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో అత్యంత ధనికులుగా కొందరు జాబితాలో చేరారు. వీరిలో నంబర్ ఒన్ కోటీశ్వరరాలుగా లీమా రోజ్ ముందంజలో ఉన్నారు. ఆమె ఆస్తి రూ. 1049 కోట్లుగా తేలింది. వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లోని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో కోటీశ్వరుల వివరాలు కొందరివి బయట పడ్డాయి. ఇందులో అత్యంత ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో తొలి స్థానాన్ని లాల్గుడిలో పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి లీమా రోజ్ దక్కించుకున్నారు. ఆమె ఆస్తి రూ. 1,049 కోట్లు. లాటరీ కింగ్ఙ్గా పిలవబడే శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ కావడం గమనార్హం. ఈమె కేవలం 6వ తరగతి వరకే చదువుకున్నట్టు సమాచారం. ఇందులో రూ. 909 కోట్లు స్థిరాస్తులుగా ఉన్నాయి. కుటుంబ ఆస్తి అయితే, ఆమె భర్త శాంటియాగో మార్టిన్ ఆస్తుల విలువ సుమారు రూ. 4,149 కోట్లుగా పేర్కొన్నారు. తర్వాతి స్థానంలో విజయ్ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ తన రాజకీయ అరంగేట్రంలోనే భారీ ఆస్తులను ప్రకటించారు. ఆయన పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్లో పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తి రూ. 603.20 కోట్లుగా తేలింది. వివిధ బ్యాంకుల్లో రూ. 213 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ జీ7, టయోటా వెల్ఫైర్, లెక్సస్ వంటి అత్యాధునిక విలాసవంతమైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. ఆతదుపరి టీవీకేకు చెందిన ఆధవ్ అర్జున ఉన్నారు. ఆయన ఆస్థి రూ. 197 కోట్లు. జాబితాలో తొలి స్థానంలో ఉన్న లీమా రోజ్ కుటుంబానికి చెందిన వ్యక్తే ఈ ఆధవ్ అర్జున కావడం గమనార్హం. ఆయన విల్లివాక్కంలో పోటీ చేస్తున్నారు. ఇక, డిప్యూటీ సీఎం ఉదయ నిధికి రూ. 20.64 కోట్లు ఆస్తులు ఉండటం విశేషం. ఆయన తండ్రి, సీఎం స్టాలిన్ కంటే ఉదయ నిధి ఆస్తులు సుమారు మూడు రెట్లు ఎక్కువ ఉండటం ఆలోచించదగిన విషయమే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆస్తి రూ. 10 కోట్లు కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆస్తి రూ. 34 కోట్లుగా పేర్కొన్నారు. కొంతమంది అభ్యర్థులు కిలోల కొద్దీ వెండి, కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని కలిగి ఉన్నట్లు ప్రకటించారు. ప్రధానంగా కన్యాకుమారి, దక్షిణ తమిళనాడు అభ్యర్థులు అనేక మంది వద్ద తమ వద్ద వందల సవరల బంగారం ఉన్నట్లు ప్రకటించి ఉండడం గమనార్హం. -
ఈ సినిమాలో విజయ్ను ఢీ ఫేమ్ చేయలేదు!
ఇటీవల టీఎన్ 2026 చిత్రం గురించి చాలా వివాదాస్పద చర్చ జరుగుతున్న విషయం తెలిసింది. కారణం ఈ చిత్రంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ను వ్యంగ్యాస్త్రాలతో విమర్శించే సన్నివేశాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల వచ్చాయి. ఇటీవల ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. అందులో హీరోగా నటించిన నట్టి గెటప్ విజయ్ను పోలి ఉంది. దీంతో టీవీకే పార్టీ చెన్నై విల్లివాక్కం నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అధవ్అర్జున్ టీఎన్–2026 చిత్రంపై విమర్శలు చేశారు. విజయ్ను పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించడానికి ఈ చిత్రాన్ని ఎన్నికలకు కొద్ది వారాల ముందే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అయితే ఈ చిత్రాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కన్నన్ గ్రూప్ పతాకంపై కన్నన్రవి, కందన్రవి, దీపక్ రవి నిర్మించిన చిత్రం టీఎన్ 2026. తంబిరామయ్య కథను సమకూర్చిన ఈ చిత్రానికి ఆయన వారసుడు, అర్జున్ సర్జా అల్లుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించారు. నట్టి కథానాయకుడిగా నటించిన ఇందులో శ్రితరావు నాయకిగా నటించారు తంబిరామయ్య, ఎంఎస్ భాస్కర్, ఇళవరసు, చాందిని తమిళరసన్, యాషిక ఆనంద్, విజీ చంద్రశేఖర్ ముఖ్యపాత్రలు పోషించారు. తర్బకా శివ సంగీతాన్ని, ముత్తయ్య చాయాగ్రహణం అందించారు. ఈనెల 10న తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ఏఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తంబిరామయ్య మాట్లాడుతూ టీఎన్ 2026 చిత్రం ఏ రాజకీయ పార్టీని విమర్శించే విధంగా ఉండదని పేర్కొన్నారు. అధవ్ అర్జున తమ చిత్రం గురించి తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన చిత్రం చూడాలని అన్నారు. విజయ్ సింహం అని, ఆయన్ని ఎవరూ విమర్శించలేరని తంబిరామయ్య పేర్కొన్నారు. ఈ చిత్రంలో విజయ్ను ఢీ ఫేమ్ చేయలేదని నట్టి పేర్కొన్నారు. -
విజయ్ని, అతడి పార్టీని విమర్శించను.. ఎందుకంటే?
తమిళనాడులో ప్రస్తుతం హడావుడి నెలకొంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రజల మనసు గెలుచుకుని అధికారం దక్కించుకునేందుకు బోలెడన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. హీరో దళపతి విజయ్ కూడా టీవీకే పార్టీ తరఫున బరిలో నిలిచాడు. మరోవైపు తమిళ దర్శకుడు సుందర్.సి కూడా ఇదే ఎలెక్షన్స్లో మధురై సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. తాను బరిలో ఉన్నప్పటికీ విజయ్ని, అతడి పార్టీని విమర్శించనని చెబుతూ అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్బాస్ ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా)హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడంపై స్పందించిన సుందర్.. తమ ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉందని, తన భార్య ఖుష్బూ.. విజయ్ని తమ్ముడిలా భావిస్తుందని అందుకే విజయ్ లేదా అతడి పార్టీపై విమర్శలు చేయనని స్పష్టం చేశాడు. ఇప్పటివరకు సినిమాలతో ప్రేక్షకులని అలరించిన తాను.. రాజకీయాల్లో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నానని అన్నాడు. తన సినీ ప్రయాణంలో ఎలా ఆదరించారో, ఇక్కడ కూడా అలాగే మద్ధతు ఇవ్వాలని ప్రజలని కోరాడు.ఎన్డీఏ కూటమిలో భాగంగా సుందర్.. పుతియ నీది కచ్చి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే మధురై సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధాన పోటీ ఏఐఏడీఎంకే, డీఎంకే మధ్యనే ఉంటుందని.. ఇక్కడ విజయ్ పార్టీ ప్రభావం తక్కువగా ఉంటుందని సుందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కెరీర్ విషయానికొస్తే.. గతేడాది 'గ్యాంగర్స్' సినిమాలో నటించి దర్శకత్వం వహించిన సుందర్, ప్రస్తుతం విశాల్ హీరోగా 'మగాడు' అనే మూవీ చేస్తున్నారు. నయనతారతో 'ముక్తి అమ్మన్ 2' కూడా తీస్తున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' విడుదలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్) -
హీరో విజయ్కి వేల కోట్ల ఆస్తులు.. అప్పులు ఎంతంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు రాజకీయాలలో ఫుల్ బిజీ అయిపోయాడు. సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పోటీ చేస్తోంది. ఇందులో విజయ్ చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన విజయ్.. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశాడు.రూ.600 కోట్లు..ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరిచిన విషయం తెలిసిందే . అయితే ఇక్కడ తన భార్య సంగీత ఆస్తులను కూడా ఆయన జమ చేయడం గమనార్హం. విజయ్ తన స్థిర, చరాస్తుల విలువలను దాదాపు రూ.600 కోట్లుగా అఫిడవిట్లో వెల్లడించాడు. అందులో నగదు రూపంలో తన వద్ద రూ.2 లక్షలు, తన భార్య సంగీత వద్ద లక్ష రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నాడు. విధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.388 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఆయన పేరుమీద రూపాయి అప్పు కూడా లేదని అఫిడవిట్లో వెల్లడించాడు.లగ్జరీ కార్లు.. ఫ్యామిలీకి అప్పుఇక తన వాహనాల వివరాలను కూడా అఫిడవిట్లో పొందుపరిచాడు. తన వద్ద బిఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫేర్ వంటి ఖరీదైన కార్లతో పాటు మారుతి సుజుకి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ వంటి వాహనాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఇక వాహనాల మొత్తం విలువ రూ.14.35 కోట్లు అని వెల్లడించారు. అలాగే తన వద్ద 883 గ్రాముల బంగారం, 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులకు కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడట. తన సతీమణి సంగీతకు రూ. 12.60 కోట్లు, తండ్రి చంద్రశేఖర్కి రూ.3.02 కోట్లు, తల్లికి రూ. 87.12 లక్షలు, కొడుకుకి రూ. 8.78 లక్షలు, కూతురు దివ్యకి రూ. 4.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపాడు.దీంతో పాటు తన టీవీకే పార్టీలో కీలక నేత అయిన ఎన్ ఆనంద్కి రూ. 3 కోట్లు ఇచ్చినట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నాడు. సంగీత పేరుపై కూడా భారీ ఆస్తులువిజయ్ అఫిడవిట్లో తన భార్య సంగీత ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాడు. తన భార్య వద్ద రూ. 4.07 కోట్ల విలువైన బంగారం, రెండు కేజీల వెండితో పాటు కోటి రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయి. సంగీత మొత్తం చరాస్తుల విలువ రూ.15.51 కోట్లు , స్థిరాస్తుల విలువ 25 లక్షలుగా వెల్లడించారు . తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. -
ఒకవైపు నామినేషన్లు మరోవైపు ప్రచారాలు
-
తమిళనాట ఎన్నికల హీట్.. విజయ్కే నా ఓటు అంటోన్న హీరోయిన్..!
ఈ మండు వేసవిలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల హీట్ నడుస్తోంది. సినిమా రంగంలోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. సినీ తారలు తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి వాణిభోజన్ తన మద్దతు టీవీకే ఛీఫ్ విజయ్కే అని ప్రకటించారు. బుల్లితెర నుంచి వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఓమై కడవుల్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత మహాన్, మిరన్ వంటి పలు చిత్రాల్లో వాణి భోజన్ నటించారు. కొన్ని వెబ్ సిరీస్ల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ హీరోయిన్గా ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. కాగా ఇటీవల తమిళనాడులోని కుంభకోణంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వాణి భోజన్ పలు విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు తాను నటుడు విజయ్కు వీరాభిమానినని.. ఆయనకు జంటగా నటించాలన్న కోరిక ఉందని తెలిపింది. అయితే విజయ్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగప్రవేశం చేయడంతో ఆ కోరిక నెరవేరే అవకాశం లేదని పేర్కొంది. అయితే విజయ్ రాజకీయ రంగప్రవేశం చేయడాన్ని తాను స్వాగతిస్తున్నాని వెల్లడించింది.విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించడం సంతోషమని అన్నారు. మీకు ఆ పార్టీలో చేరే ఆలోచన ఉందా ? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. ఈ విషయం గురించి చాలా మంది అడుగుతున్నారని, అయితే దాని గురించి తరువాత చెబుతానని అన్నారు. ఈ ఎన్నికల్లో తన మద్దతు మాత్రం విజయ్కే నని తెలిపింది. కాగా ప్రస్తుతం తాను ఈ భామ ప్రస్తుతం వలై అనే చిత్రంలో అధర్వకు జంటగా నటిస్తున్నట్లు వెల్లడించారు. -
అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్’ పొలిటికల్ సునామీ!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించేందుకు ‘దళపతి’ పూర్తి స్థాయిలో విజయ్ సిద్ధమయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన అడుగు వేస్తూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 29వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం స్థానాల్లో బరిలో దిగనున్న అభ్యర్థులను విజయ్ స్వయంగా పరిచయం చేయనున్నారు.తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ లోతుగా కసరత్తు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆదివారం (మార్చి 29) చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్లో రాష్ట్ర స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఈ వేదిక నుంచే విజయ్ అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు.ఎన్నికల బరిలో 264 స్థానాలుతమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పుదుచ్చేరికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా, తమిళనాడు అభ్యర్థుల తుది జాబితాను ఆదివారం నాటి సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు.ఏప్రిల్లో పోలింగ్ సందడిఎన్నికల షెడ్యూల్ ప్రకారం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్వల్ప సమయంలోనే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఆదివారం జరిగే ఈ సమావేశం టీవీకే ఎన్నికల వ్యూహాన్ని, ప్రచార పంథాను స్పష్టం చేయనుంది.నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ నేతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుండగా, విజయ్ తన అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ సమీకరణలను ఎలా మారుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళపతి అభిమానులు ఈ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మార్చి 29.. తమిళ రాజకీయాల్లో కొత్త మలుపునకు నాంది కాబోతున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: West Bengal: 57 సీట్లు.. నరాలు తెగే ఉత్కంఠ! -
పొసగని పొత్తులతోనే పోరాటం
తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగనున్నాయి. కొన్ని దశాబ్దా లుగా రాష్ట్రం ద్విముఖ పోటీలనే చవి చూస్తూ వచ్చింది. ఇపుడు మూడవ గణనీయమైన పార్టీ ప్రవేశంతో ఎన్నికలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. సినీ నటుడు విజయ్ రాజకీయ బరిలోకి దిగడంతో ఆయనకు విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయన్న దానిపై ఎక్కువగా చర్చలు సాగుతున్నాయి. రాజకీయ అనుభవం సంపాదించడానికి కాక, ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకే బరిలోకి దిగుతున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం (టీవీకే)ను జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అన్నా డీఎంకే ఆయన డిమాండ్లు చూసి ఖంగుతింది. జన నాయకుడు కాగలడా?బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికలలో కన్నా మెరుగైన ఫలితాలను కోరుకుంటోంది. అన్నా డీఎంకేతో పొత్తు ఏదో ఒరగబెట్టగలదనే ఆశ బీజేపీకే లేదు. కానీ టీవీకే ఆగమనం ఈ కూటమికి ఇపుడు లేని ఆధి క్యాన్ని తెచ్చిపెట్టగలదు. ఎన్నికల ప్రచార ఖర్చులు రూ. 40 లక్షలు మించకూడదని ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తోంది. వాస్తవంలో, రూ. 5 కోట్లు అవసరమవుతాయని అంచనా. టీవీకే అభ్యర్థులలో కొందరికి అంత స్తోమత లేదని ఇటీవల జరిగిన ఆ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఫలితంగా, ఏదైనా పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, దాని పైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు. విజయ్ గతంలో బీజేపీని తన ‘సైద్ధాంతిక శత్రువు’గా అభివర్ణించారు. హిందుత్వ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, క్రైస్తవ, ముస్లిం మైనా రిటీల ఓట్లకు గండిపడవచ్చని ఆయన సందేహిస్తున్నారు. ఆయన అనుయాయుల్లో ఆ రెండు వర్గాలవారే ఎక్కువగా ఉన్నట్లు చెబు తున్నారు. టీవీకే వచ్చి చేరడం పట్ల అన్నా డీఎంకేకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అది చీలుస్తుందని దానికి తెలుసు. అయినా టీవీకే తనకు కూడా గ్రహణం పట్టిస్తుందే మోనని అన్నా డీఎంకే లోలోపల ఆందోళన చెందుతోంది. సినిమాలలో మాదిరిగానే ప్రత్యర్థుల దుమ్ము దులిపి ‘జన నాయగన్’ అనిపించుకోవాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. ఎన్ని కల బరిలో నిలిచిన అభ్యర్థి హీరోగా నటించిన సినిమా విడుదల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం అవుతుందా? ఇది ఎన్నికల కమిషన్కు ఎదురవుతున్న ప్రశ్న. రెండు ద్రవిడ కూట ములలో విజయ్ దేనిని దెబ్బతీస్తారనే దానిపైనే దాని జవాబు ఆధారపడి ఉంటుందని గత కొద్ది ఏళ్ళ చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. చిత్ర దర్శకుడు సీమాన్ కూడా నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పేరుతో ఒక చిన్న తమిళ జాతీయవాద పార్టీని ఇదివరకే ప్రారంభించారు. దాని ఓట్ల శాతం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తోంది. విజయ్ రాకతో ఎక్కువ దెబ్బతినేది ఆ పార్టీయేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యుద్ధం స్టాలిన్తోనే!అభిమానులు దళపతిగా పిలుచుకునే విజయ్ తన విమర్శ నాస్త్రాలన్నింటినీ పాలక డీఎంకే పైన, దాని నాయకుడు, ముఖ్య మంత్రి ఎం.కె. స్టాలిన్ పైన మాత్రమే ఎక్కుపెడుతున్నారు. విజయ్ 2025 సెప్టెంబర్లో కరూర్లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఆ ఘటన తర్వాత ఆయన కొద్ది బహిరంగ సభలలోనే పాల్గొన్నారు. కానీ, ఆ తర్వాత, ఏ బహిరంగ సభలో మాట్లాడినా ఆయన ఎన్నికల ‘యుద్ధం’ తనకూ, స్టాలిన్కూ మధ్యనేనని చెబుతూ వస్తున్నారు. పాలకడీఎంకే పాల్పడినట్లు చెబుతున్న అవినీతి, దుష్పరిపాలనను తొల గించగల వ్యక్తిగా విజయ్ తనను తాను చాటుకుంటున్నారు. పెరి యార్, కె. కామరాజ్, సి.ఎన్. అన్నాదురై, ఎమ్జీఆర్ల సిసలైన వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. ఆయన అన్నా డీఎంకే ప్రస్తావనే తీసుకురావటం లేదు. తన ‘సైద్దాంతిక శత్రువు’ను కూడా విమర్శించడం లేదు. తమిళ నాడు నాయకత్వాన్ని కోరుకుంటున్నా, ఇంతకూ రాష్ట్రానికి సంబంధించి విజయ్ ప్రణాళికలేమిటో స్పష్టం కాలేదు. మీడియా ఇంటర్వ్యూలకు కూడా ఆయన దూరంగాఉంటున్నారు. స్టాలిన్ మాత్రం తన వంతుగా, అభివృద్ధికి సంబంధించి ‘ద్రావిడ నమూనా’ను పరిరక్షించుకునేందుకు సాగుతున్న నిర్ణయా త్మక పోరాటంగా ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. కేంద్రం నుంచి ఒత్తిడులను ఎదుర్కొంటూ కూడా, ‘డబుల్ ఇంజిన్’ సర్కారు ఉన్న రాష్ట్రాలకన్నా తమిళనాడు మెరుగైన పనితీరును కనబరచిందని ఆయన చెబుతున్నారు. అయినా ఆయన దేనినీ తేలికగా తీసు కోవడం లేదు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి కాకుండా, తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి ఐదేళ్ళ కొకసారి పొడసూపుతూఉంటుంది. జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే మాత్రమే గత దశాబ్దంలో ఒకేసారి 2016లో వరుసగా రెండవ విడత విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. అన్నా డీఎంకే గురించి విజయ్ ఎలా ప్రస్తావించడం లేదో, అలాగే స్టాలిన్ కూడా విజయ్ పేరును ఎత్తడం లేదు. విజయ్పై ధ్వజమెత్తే పనిని ఆయన పార్టీలోని ఇతరులకు వదిలేశారు. కానీ, కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత కూడా, ఆయన జన సమ్మోహక శక్తి తరగక పోవడంతో డీఎంకే ఆందోళనకు లోనవుతోంది. పైగా, ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్తో డీఎంకే సంబంధాలు గత ఎన్నిక లప్పుడున్నంత బలంగా లేవు. సీట్ల పంపంకంపై అవి బాహాటంగానే కీచులాడుకున్నాయి.అన్నా డీఎంకే అంతంతే!ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే పాత్ర కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తోంది. దాని కూటమిలో బీజేపీతో పాటు టి.టి.వి. దినకరన్ కూడా ఉన్నారు. జయలలితకు సన్నిహితురాలైన శశికళకు ఆయన మేనల్లుడు. కాగా, శశికళ సొంత కుంపటి ఉండనే ఉంది. ఆమె పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అన్నా డీఎంకేను చికాకు పరచగలదని భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, అంతో ఇంతో పలుకుబడి కలిగిన ఒ.పన్నీర్ సెల్వం కూడా అన్నా డీఎంకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర, బిహార్ వంటి రాష్ట్రాల్లో కాషాయ పార్టీతో జత కట్టిన ప్రాంతీయ పార్టీలు ఎటువంటి ఫలితాలు సాధించిందీ పార్టీ నాయకుడు ఎళప్పాడి పళనిస్వామి గమనించకపోలేదు. అన్నా డీఎంకే కూటమిలో కెమిస్ట్రీ లోపించిందని తెలుస్తూనే ఉంది. మొత్తం 234 మంది సభ్యులు గల అసెంబ్లీలో 2021 ఎన్నికల్లోడీఎంకే 133 సీట్లు సాధించింది. డీఎంకేను ఎన్డీయే ఓడించలేక పోయినా, మహా అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడే విధంగా, డీఎంకే కూటమికి చిల్లు పెట్టవచ్చు. ఎన్డీయేతో కలిసో లేదా కలవకుండానో విజయ్ తన వంతు పాత్ర తాను పోషిస్తారు. విజయ్ ‘రాజు కాలేరు. రాజుగా ఎవరినో కూర్చోపెట్టనూ లేరు. ఓట్లను చీలుస్తారంతే’ అని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్ అందుకే వ్యాఖ్యానించినట్లుంది!-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-నిరుపమా సుబ్రమణియన్ -
పెయిన్తోనే విజయ్, త్రిషలపై కామెంట్ చేశా: సముద్రఖని
టీవీకే అధినేత విజయ్, త్రిష వివాదానికి సంబంధించి వైరల్ అయిన తన వ్యాఖ్యల వివాదంపై నటుడు, దర్శకుడు సముద్రఖని తాజాగా స్పందించారు. తాను నటించిన ‘కార్మేని సెల్వం’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. విజయ్పై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సందర్భానికి సంబంధం లేకుండా వాటికి వక్రీకరణలు చేశారని ఆయన అన్నారు. తాను నిజాయితీగా మాట్లాడానని, ఎవరినీ అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన ఆలోచనలను వ్యక్తం చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేశారని క్లారిటీ ఇచ్చారు. 'పాత వీడియోలో నేను మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి మొదటి నుంచి కాకుండా మధ్యలో వీడియో రికార్డ్ చేశారు. అయితే, తను రికార్డ్ చేస్తున్నాడు కదా అని నేను మాట్లాడటం ఆపలేదు. విజయ్ మొదట సపోర్ట్ ఇచ్చింది నేనే.. కాబట్టే కాస్త నాకు పెయిన్గానే ఉంటుంది.' అని వివరించారు.ఏం జరిగిందంటే..?విజయ్, త్రిష ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇదే అంశం గురించి సముద్రఖని కొందరితో చర్చిస్తన్న వీడియో వైరల్ అయింది. వారిద్దరి తీరుపై సముద్రఖని తన అసంతృప్తిని బయటపెట్టారు. 'ఇదేమైనా ఆటా..? వ్యక్తిగత విషయాలను ఇలా బయటపెట్టాలా..? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు..? అంతా సవ్యంగ జరుగుతున్న సమయంలో ఇలాంటివి అవసరమా..? ఈ కారణంతో పార్టీలోని కొందరు సపోర్టర్స్ వెళ్లిపోతున్నారు' అని ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ వీడియో కాస్త వైరల్ అయింది. -
కరుప్పు ఫస్ట్ విజయ్కే చెప్పా.. ఆయనకు నచ్చింది.. కానీ!
స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో కరుప్పు ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ సూర్య కంటే ముందు దళపతి విజయ్ చేతికి వెళ్లిందట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీకాంత్ కెరీర్లో భాష, ముత్తు, పడయప్ప (నరసింహ) వంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ చాలామంది జనాలు వీటిని మళ్లీ మళ్లీ చూస్తుంటారు. 2023లోనే..అలాంటి ఒక ఫుల్ ఎంటర్టైనర్ సినిమాని తీయాలని నా కోరిక. యాక్టింగ్ అంటే గట్టిగా అరవడం, ఏడవడం కాదు. అన్ని రకాల ఎమోషన్స్ను సమపాళ్లలో పండించాలి. అది సూర్యకు వెన్నతో పెట్టిన విద్య.. తను బాగా డ్యాన్స్ చేస్తాడు, అద్భుతంగా నటిస్తాడు, ఏదైనా సింపుల్గా చేసేస్తాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. నిజానికి 2023లో కరుప్పు కథ రాయడం మొదలుపెట్టాను. విజయ్కు కథ చెప్పా..ఈ కథకు బలమైన స్టార్ ఉంటే బాగుంటుందనిపించింది. అలా హీరో విజయ్ను కలిశాను.. పైగా ఆయన 2021లోనే ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగాడు. ఈ రెండు కారణాల వల్ల తనను కలిశాను. కరుప్పు విజయ్కు చాలా బాగా నచ్చింది. ఇది భారీ సినిమా.. వెంటనే మొదలుపెడదాం అన్నారు. కానీ విజయ్ వంటి స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే పెద్ద బాధ్యత.. నచ్చింది కానీ..అలా హడావుడిగా మొదలుపెట్టలేనని చెప్పాను. తర్వాత కొన్నిసార్లు కలిశాం, మాట్లాడుకున్నాం.. కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆయన నా నుంచి కుటుంబ కథా చిత్రం ఆశించాడు. అయినప్పటికీ ఈ కథ తనకెంతో నచ్చింది.. అదే సంతోషం అని ఊరుకున్నాను. తర్వాత సూర్యను సంప్రదించగా ఆయన ఓకే చెప్పాడు అని తెలిపాడు.సినిమాకరుప్పు విషయానికి వస్తే.. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది. స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్. ప్రకాశ్బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.చదవండి: ధురంధర్ 2 ప్రభంజనం.. 28 ఏళ్ల కిందటి లేఖ వైరల్ -
సీఎం ఆఫర్ కు నో చెప్పిన విజయ్.. దూకుడు పెంచిన ముగ్గురు
-
విజయ్కు సీఎం పదవి, పార్టీకి 50 శాతం సీట్లు ఆఫర్ చేశారు
చెన్నై: రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అధినేత విజయ్కు ముఖ్యమంత్రి పదవితో పాటు ఏకంగా 50 శాతం అసెంబ్లీ సీట్లను ఒక పార్టీ ఆఫర్ చేసిందని తమిళిగ వెట్రి కళగం (టీవీకే) ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్లపాటు పంచుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారని, కానీ తమ అధ్యక్షుడు విజయ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని అర్జున వెల్లడించారు. ‘పదవి కోసం ఢిల్లీ పెద్దల ముందు తలవంచే వ్యక్తి విజయ్ కాదు. వారు మాకు 50 నుంచి 90 సీట్ల వరకు రకరకాల ఆఫర్లు ఇచ్చారు. అయితే విజయ్ మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవి కాదు, తమిళనాడు ప్రజల నమ్మకం మాత్రమే కావాలని స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు. అయితే ఆఫర్ ఇచ్చిన పార్టీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని, రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో టీవీకే ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. పొత్తులపై ఇటీవల మీడియాతో మాట్లాడిన ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పొత్తుల కోసం తమ పార్టీ టీవీకేతో చర్చలు జరపలేదన్నారు. టీవీకేతో పొత్తు కోసం బీజేపీ సన్నిహితుల ద్వారా ప్రయత్నం చేసిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్పై చేసిన వ్యాఖ్యలకు అధవ్ అర్జున క్షమాపణలు చెప్పారు. -
ఎన్నికల వేళ పొత్తులపై కుండబద్దలు కొట్టిన విజయ్
చెన్నై: పొత్తులపై టీవీకే చీఫ్, సినీనటుడు విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. తనను అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు.తమిళనాడులోని మహాబలిపురంలో విజయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "మేము ప్రజల టీమ్. కొందరు మమ్మల్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించారు... కానీ, అది పని చేయలేదు. మేము ఏదో ఒక కూటమిలో చేరతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఎప్పుడూ లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని స్పష్టంగా చెబుతున్నాను. దానిపై రాజీ పడము. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే నమ్మవద్దు. మన లక్ష్యాన్ని కచ్చితంగా సాధించగలం" అని అన్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్నాయి. టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.కాగా, దీనిపై ఇప్పటికే టీవీకే నేత ఆధవ్ అర్జునా మాట్లాడుతూ.. అలాంటి వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. -
'అలా చేయడం చాలా అసహ్యాంగా ఉంది'.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. పాలిటిక్స్లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంటుందని అన్నారు. ఇది కేవలం తమిళనాడులో మాత్రమే కాదని.. ఎక్కడ జరిగినా సమంజసం కాదన్నారు. నటులు ఉంటే కేవలం రాజకీయాల్లో పావుగా వాడుకునే వస్తువులు కాదని ట్వీట్ చేశారు. వారికి కుటుంబం, గౌరవం, పర్సనల్ లైఫ్ అనేవి కూడా ఉంటాయన్నారు. ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని సూచించారు. మన భారతీయ సంస్కృతి, దాని మూలాల్లోనే మహిళలను శక్తిగా గౌరవిస్తామని రాసుకొచ్చారు. అలాంటి శక్తిగా భావించే మహిళలను వారిని వార్తా శీర్షికల కోసం అవమానించేలా ఉండకూడదని పోస్ట్ చేశారు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దామని హితవు పలికారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.విజయ్- త్రిష ఎపిసోడ్పైనే..ఇటీవల కోలీవుడ్లో విజయ్-త్రిష వ్యవహారం అనూహ్యంగా తెరపైకొచ్చింది. విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో త్రిష గురించి చర్చ నడుస్తోంది. త్రిష- విజయ్ల మధ్య రిలేషన్ ఉందని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిషకు అండగా పలువురు కోలీవుడ్ నటీనటులు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. అది వారి వ్యక్తిగత జీవితమని.. మనం కేవలం సినిమాల గురించి మాత్రమే చర్చించాలని ఓ సీనియర్ నటుడు అన్నారు. తాజాగా మంచు విష్ణు సైతం ఈ విషయంతో త్రిషకు మద్దతుగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. Reading about the political campaigns in my Tamil Nadu. Felt It’s in extremely poor taste to drag actresses into political narratives. Not just in TN but anywhere. Actors are not political punching bags. They are individuals with families, dignity, and a life beyond the…— Vishnu Manchu (@iVishnuManchu) March 17, 2026 -
త్వరలోనే విజయ్తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!
టీవీకే పార్టీని స్థాపించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్కి ఆయన సతీమణి సంగీత భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. విజయ్తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం.. ఒక నటితో ఆయన సహజీవనం చేస్తున్నాడని ఆరోపించడంతో త్రిష పేరు బయటకు వచ్చింది. విజయ్ సహజీవనం చేస్తున్నది త్రిషతోనే అని తమిళ మీడియా కోడై కూసింది. అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు. అప్పటి నుంచి విజయ్, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇదంతా పుకార్లే అని అంతా భావిస్తున్న తరుణంలో త్రిష తల్లి చేసిన ఓ పని.. మరోసారి వీరిద్దరి పెళ్లిపై చర్చకు దారి తీసింది.అలా హింట్ ఇచ్చిందా?త్రిష,విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైనప్పటి నుంచి వీరిద్దరి పెళ్లిపై నెట్టింట రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కొంతమంది అయితే ఏఐని ఉపయోగించి పెళ్లి వీడియో క్రియేట్ చేసి..సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలా విజయ్ అభిమాని ఒకరు ఏఐ టెక్నాలజీతో విజయ్, త్రిషల పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులంతా హాజరైనట్లు వీడియో క్రియేట్ చేశాడు. అది నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ వీడియోకి త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టారు. దీంతో విజయ్తో పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ..ఆమె లైక్ కొట్టిన పోస్ట్ని వైరల్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత పెళ్లివిజయ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా తమిళనాడు ఎన్నికలపైనే పెట్టాడు. పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపుతున్నా.. ఈ సారి ఒంటరిగానే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత త్రిషను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై ఇరు కుటుంబాలలో చర్చలు కూడా జరిగాయట. ఇక సంగీత విషయానికొస్తే.. ఓ అభిమానిగా పరిచయం అయితే ఈమెను.. విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1999లో వీరిద్ద వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే గత కొంతకాలంగా విజయ్, సంగీత వేరు వేరుగా ఉంటున్నారు. -
విజయ్- త్రిష ఎపిసోడ్పై మరో కొత్త పుకారు!
కోలీవుడ్లో విజయ్- త్రిష ఎపిసోడ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్ ఉమా కృష్ణన్ ఆ వీడియోను లైక్ కొట్టింది.ఈ రీల్కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్కు లైక్స్ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. -
'ఇతరుల జీవితాల్లోకి చూడడమే వారి పని'.. త్రిష వ్యవహారంపై ఖుష్బు కామెంట్స్
కోలీవుడ్లో విజయ్- త్రిష వ్యవహారం హాట్టాపిక్గా మారింది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత అందరి దృష్టి ఒక్కసారిగా త్రిషపై పడింది. అంతేకాకుండా వీరిద్దరు జంటగా ఓ వివాహా వేడుకకు హాజరు కావడంతో మరించ చర్చకు దారితీసింది. ఆ తర్వాత తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ త్రిషను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేశారు. అతని కామెంట్స్పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత క్షమాపణలు కోరాడు. అయితే తాజాగా విజయ్, త్రిషలపై వస్తోన్న వార్తలపై నటి ఖుష్బూ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె త్రిష గురించి మాట్లాడారు. ఆమె చాలా హుందాగా ఉంటుందని తెలిపారు. త్రిష గురించి తెలియనివారు చేసే కామెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారికి మనం స్పందించాల్సిన పనిలేదని తెలిపారు. నాకు త్రిష గురించి బాగా తెలుసని.. తను చాలా సెన్సిటివ్ పర్సన్ అని ఖుష్బూ వెల్లడించారు. దురదృష్టవశాత్తూ మనం తుమ్మినా కూడా నిందించే రోజుల్లో ఉన్నామని అన్నారు. తనకు తెలిసిన వారిలో త్రిష అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి అని ఖుష్బూ తెలిపారు. పెళ్లికి కలిసి వెళ్లడం అనేది వారి వ్యక్తిగతమని.. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఆమె అన్నారు.ఖుష్బూ మాట్లాడుతూ.. 'దురదృష్టవశాత్తు మనం తుమ్మినా కూడా నిందను మరొకరిపై వేయాలనుకునే కాలంలో ఉన్నాం. నాకు తెలిసినంత వరకు త్రిష అత్యంత హుందాగా ఉండే మహిళ. అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి. కొందరు తమ సమస్యలను పట్టించుకోకుండా.. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి ఆనందించే వ్యక్తులు ఉంటారు. ఇతరులపై కామెంట్స్ చేస్తూ ఒక రకమైన వికృత ఆనందాన్ని పొందుతారు. వారిలో 99.9 శాతం మంది ఎవరో కూడా మనకు తెలియదు. ఎవరైనా సరే ఇతరులు చేసే వ్యాఖ్యలకు మనం బాధ్యులు కాదు. వాటికి స్పందిస్తూ మన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఎయిర్పోర్టుల్లో ఫోటోగ్రాఫర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కల్చర్ ముంబయిలో మాత్రమే ఉండేదని.. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు చెన్నైకి కూడా పాకిపోయింది" అని అన్నారు.Trisha is most DIGNIFIED WOMEN I've ever met & most GENTLEST SOUL:- Actress #Kushboo #Trisha #Trishakrishnan pic.twitter.com/BVZHqZPYJK— Milagro Movies (@MilagroMovies) March 17, 2026 -
విజయ్ జన నాయగన్.. ఈ సారైనా మోక్షం లభించేనా?
కోలీవుడ్ స్టార్ దళపతి హీరోగా నటించిన చిత్రం జన నాయగన్. రాజకీయల్లో ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. దీంతో ఈ మూవీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా వ్యవహారం కోర్టుకు చేరడంతో రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.ఈ మూవీని సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ రివ్యూ చేయాల్సి ఉంది. ఈనెల 9న జరగాల్సిన రివైజింగ్ కమిటీ ప్రదర్శన వాయిదా పడింది. బోర్డ్ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాను మార్చి 17న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం తప్పకుండా స్క్రీనింగ్ జరుగుతుందని సీబీఎఫ్సీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడం జరగనుంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్కు స్క్రీనింగ్కు సంబంధించి అధికారిక మెయిల్ అందినట్లు తెలుస్తోంది.జన నాయగన్ను జనవరి 9న గ్రాండ్గా విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. కానీ ఈ చిత్రం ఒక వర్గం ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ను నిలిపివేసింది. దీంతో సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని చూసిన ఒక సభ్యుడు సైన్యానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆ తర్వాత, జన నాయగన్ నిర్మాతలు జనవరి 6న కోర్టును ఆశ్రయించారు. సెన్సార్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ చర్యలతో జన నాయగన్ మేకర్స్, సెన్సార్ బోర్డ్కు మధ్య నెల రోజుల పాటు వివాదం కొనసాగింది. అయితే మూవీ టీమ్ తమ కేసును ఉపసంహరించుకోవడంతో ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపడానికి సెన్సార్ బోర్డ్ అంగీకరించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని రాజకీయ సందేశాలు ఉన్నందున.. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతిస్తుందో లేదో చూడాల్సిందే. -
సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష
నటి త్రిష పేరు వార్తల్లో మారుమోగుతోంది. ఏ న్యూస్ పేపర్ చూసిన, ఏ సామాజిక మాధ్యమాలు చూసిన త్రిష గురించే పోస్టులు కనిపిస్తున్నాయి. చివరికి రాజకీయ వర్గాల్లోనూ త్రిష సెంటర్ పాయింట్గా మారారు. ఆ మధ్య నటుడు విజయ్, త్రిష గురించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్రిషకు క్షమాపణ కూడా చెప్పారు. ఆ తర్వాత అనూహ్యంగా నటుడు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు ఎక్కడం తీవ్ర సంచలనానికి గురిచేసింది. అందులో తన భర్త ఒక నటితో సంబంధం పెట్టుకోవడమే తను విడాకులు కోరడానికి కారణం అని కూడా సంగీత పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో పాల్గొనడం పెద్ద చర్చకు దారి తీసింది.అలాంటి పరిస్థితుల్లో మరో సీనియర్ నటుడు పార్థిబన్ కూడా నటి త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఆయన వ్యాఖ్యలను నటి త్రిష తీవ్రంగా ఖండించింది. దీంతో పార్థిబన్ కూడా ఆమెకు క్షమాపణలు చెప్పడం ఆపై పొరపాటు అని మరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా ఈ చర్చ జరుగుతున్న తరుణంలో నటి త్రిష గురించి మరో ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. నిజం చెప్పాలంటే ఆమె ఇటీవల నటించిన విడాముయర్చి, థక్ లైఫ్ చిత్రాలు పూర్తిగా నిరాశ పరచడంతో పాటు త్రిష నటనను ఆమె ఎంచుకున్న పాత్రల గురించి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఈమె కొత్తగా చిత్రాలను అంగీకరించలేదు. రాజకీయాల వైపు త్రిషతెలుగులో చిరంజీవితో జంటగా నటించిన విశ్వంభర చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. మలయాళంలోనూ ఇదే పరిస్థితి. ఇక తమిళంలో సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో త్రిష కొత్తగా చిత్రాలను ఒప్పుకోవడం లేదని దానికి కారణం నటనకు స్వస్తి పలికి ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంతో తెలియదు గానీ, ఆమధ్య తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, అసలు రాజకీయాలు తనకు తెలియదని నటి త్రిష పేర్కొన్నారు. అయితే, అది అప్పటి పరిస్థితిని బట్టి ఆమె అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారని కొందరు అంటున్నారు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే త్రిష రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపుతున్నట్లు ఒక వర్గం పేర్కొంటుంది. ఇప్పటికే ప్రముఖ స్టార్గా వెలుగొందిన నటుడు విజయ్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీలోనే త్రిష చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. -
'జన నాయగన్' రూ. 120 కోట్ల ఢీల్ రద్దు
విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’కు సెన్సార్ చిక్కులు చిక్కులు తప్పడం లేదు. ముందుగా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో వడ్డీల రూపంలో నిర్మాత వెంకట్ కె.నారాయణకు భారీ నష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు ఓటీటీ ఢీల్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో చట్టపరమైన సమస్యలు రావడంతో ఈ సినిమా గత మూడు నెలలుగా ల్యాబ్కే పరిమితమైంది.జన నాయగన్ సెన్సార్ సర్టిఫికెట్ కోసం సీబీఎఫ్సీ రివైజ్ కమిటీ మరోసారి సినిమా చూడాల్సి ఉంది. అయితే, ఈ కమిటీలో ఓ సభ్యుడి అనారోగ్య కారణంగా చివరి నిమిషంలో స్క్రీనింగ్ వాయిదా పడిన విషయం తెలిసింది. ఇలా పలు కారణాలతో రివైజ్ కమిటీ దాటవేస్తుండటంతో వ్యాపారం పరంగా భారీ నష్టం తప్పడం లేదు. కనీసం ఎప్పుడు చూస్తారో కూడా వారు చెప్పకపోవడంతో విడుదలపై అనిశ్చిత నెలకొంది. దీంతో అమెజాన్తో కుదుర్చకున్న ఓటీటీ ఢీల్ రూ. 120 కోట్లు రద్దు అయినట్లు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో జన నాయగన్ చివరి సినిమా అని ప్రకటించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి. -
ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు
నటుడు, తమిళ వెట్రి కళగం(టీవీకే) అధినేత కుమారుడు జాసన్ సంజయ్ తన తండ్రి ఇంటి పేరు తొలగించుకున్నాడు. ఇప్పుడు ఈ అంశం తమిళనాట హాట్ టాపిక్గా మారింది. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి విజయ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ ఇటీవల చెంగలపట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు పిల్లలకు జీవన భృతి చెల్లించేలా విజయ్ను ఆదేశించాలని కోరారు. కాగా విజయ్, సంగీత దంపతులకు జాసన్ సంజయ్, దివ్యషా పిల్లలు ఉన్నారనే విషయం తెలిసిందే.జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సిగ్మా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం టైటిల్ కార్డులో తన తండ్రి విజయ్ ఇన్షియల్( ఇంటి పేరు)ను తొలగించడంతో పాటూ తన తల్లి పేరు సంగీత ఇన్షియల్ వచ్చే విధంగా ఎస్ను చేర్చుకున్నారు. ఇంతకు ముందే తన ఇన్ స్ట్రాగామ్లో తండ్రి విజయ్ ఫాలోవర్స్ నుంచి వైదొలిగారు. ఇప్పుడీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
విజయ్ వైపు.. ఆ ముగ్గురి చూపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో చేరే పార్టీల జాబితా దాదాపుగా ఖరారైంది. అయితే టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన పిలుపునకు ఎట్టకేలకు ముగ్గురు స్పందించారు. ఈ ముగ్గురి విజయ్తో కలిసి మెగా కూటమి దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. డీఎంకే మెగా కూటమి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇందులో ఏఏ పారీ్టలు ఉన్నాయో దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే. ఇక, అన్నాడీఎంకే– బీజేపీ కూటమిలోనూ అదే పరిస్థితి. కాగా సంకీర్ణ ధర్మం మేరకు పాలనలోనూ భాగస్వామ్యం అన్న నినాదంతో తనతో కలిసి వచ్చేవారికి అధికారంలో వాటా ఇస్తానన్న విజయ్ వైపుగా ఇంత వరకు ఎవ్వరూ దృష్టి పెట్ట లేదు. చివరకు ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్కు మరింత బలాన్ని ఇచ్చేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఓ వైపు ,దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ మరోవైపు సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్బుమణి పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో చేరిన దృష్ట్యా, డీఎంకేలో తమకు అవకాశం లేక పోవడంతో ఇక విజయ్ పక్షాన నిలబడేందుకు రాజకీయ అనుభవజు్ఞడైన రాందాసు నిర్ణయించి, అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ సైతం రాందాసు పిలుపునకు స్పందించినట్టు ప్రచారం. రహస్యంగా చర్చలు.. ఈ ప్రచారానికి అద్దం పట్టే విధంగా ఆమె మంగళవారం రాత్రి తైలాపురంలో రాందాసుతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. తనకు వెన్నుపోటు పొడిచిన పళణిస్వామి, టీటీవీ దినకరన్కు గట్టిగా బుద్ది చెప్పే రీతిలో అన్నాడీఎంకే కేడర్ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా చిన్నమ్మవ్యూహాలకు పదును పెట్టనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్, ముక్కళత్తోర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా ఆయనకు దన్నుగా నిలబడేందుకు సన్నద్ధమవుతున్నట్టు చర్చలు జోరందుకున్నాయి. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో వెనుకబడిన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ను కలిగిన పుదియ తమిళగం నేత కృష్ణస్వామి సైతం విజయ్కు దన్నుగా నిలబడే రీతిలో సిద్ధమైనట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. అయితే సజావుగా వ్యవహారాలన్నీ సాగి, వ్యూహాలు ఫలించిన పక్షంలో విజయ్ నేతృత్వంలోమెగా కూటమి తథ్యమని రాందాసు ,చిన్నమ్మ శశికళ శిబిరంలోని కొందరు నేతలు పేర్కొంటుండటం గమనార్హం. -
టీవీకే చీఫ్ విజయ్కు మళ్లీ సీబీఐ నోటీసులు
న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్ను మార్చి 15న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు మంగళవారం సమన్లు పంపారు.విజయ్ను సీబీఐ జనవరిలో రెండు సార్లు విచారించింది. మరోసారి మార్చి 9న హాజరుకావాలని చెప్పింది. అయితే, 15 రోజుల పాటు తన విచారణను వాయిదా వేయాలని ఆయన అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయని చెబుతూ విచారణ చెన్నైలో లేదా తమిళనాడులోని ఇతర ఏ కార్యాలయంలోనైనా నిర్వహించాలని విజయ్ కోరినట్లు అధికారులు తెలిపారు. అయితే, సీబీఐ మాత్రం తమ ప్రధాన కార్యాలయం ఉన్న ఢిల్లీలో మార్చి 15న హాజరుకావాలని సూచించింది.కరూర్ నుంచి ద్రావిడ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని కూడా మార్చి 17న విచారణకు హాజరుకావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీనిపై ‘ఎక్స్’ వేదికగా బాలాజీ స్పందిస్తూ.. మార్చి 17న సీబీఐ ముందు హాజరై కరూర్ తొక్కిసలాట ఘటనపై వివరణ ఇస్తానని పేర్కొన్నారు.కాగా, 2025 సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్ జిల్లాలో విజయ్ ర్యాలీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో సీబీఐ నిమగ్నమైంది. సుప్రీంకోర్టు ఆదేశంతో ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి ఈ కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది.గత సంవత్సరం అక్టోబరులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. అదే సమయంలో దర్యాప్తు బాధ్యతలు స్వీకరించేలా సీనియర్ అధికారిని నియమించాలని సీబీఐ డైరెక్టర్కు ఆదేశించింది.న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ తొక్కిసలాట దేశవ్యాప్తంగా ప్రజలను కలిచివేసిందని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా సాగితేనే న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం తిరిగి ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంది. -
విజయ్-త్రిష వ్యవహారం.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు
గతకొన్ని రోజులుగా నటుడు, టీవీకే అధినేత విజయ్ , నటి త్రిషకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లడంతో ఆ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ అంశంపై సీనియర్ నటి,రాజకీయ నాయకురాలు ఖుష్భూ సుందర్ స్పందించారు. అది వాళ్ల పర్సనల్ విషయం అని, అది ప్రజలను ప్రభావితం చేయనంతవరకు ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా ఆమె ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘ఈ అంశం(త్రిష-విజయ్ల రిలేషన్)తో ప్రజలకు ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. అది ప్రభావితం చేస్తే, మనం దాని గురించి మాట్లాడవచ్చు. వారి వ్యక్తిగత జీవితానికి ప్రజలతో సంబంధం లేదు. ప్రజలు దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారు? వారు తమకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు. దాని వల్ల ప్రజలు ఏ విధంగానూ ప్రభావితం కారు’ అని ఖుష్భూ అన్నారు.త్రిష అంశం విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావితం చూసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు బదులుగా.. ‘ప్రజలు తెలివైన వాళ్లు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో వాళ్లకు బాగా తెలుసు. పర్సనల్ లైఫ్ దానిని ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. ఆయన నాయకుడైనా కాకపోయినా.. మనలాగే ఒక మనిషి. ప్రజల వ్యక్తిగత జీవితంతో అతనికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు’ అని ఖుష్భూ చెపుకోచ్చింది. -
పర్సనల్ లైఫ్ జడ్జ్ చేయడానికి మీరెవరు?.. విజయ్- త్రిష వివాదంపై స్టార్ డైరెక్టర్
కోలీవుడ్లో విజయ్- త్రిష పేర్లే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా త్రిష పేరు తెరపైకొచ్చింది. ఇటీవల వీరిద్దరు జంటగా ఓ వివాహానికి కూడా హాజరు కావడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే త్రిషపై కోలీవుడ్ దర్శకుడు పార్తిబన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత దర్శకుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.తాజాగా విజయ్- త్రిష వివాదంపై ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ స్పందించారు. మనం కేవలం నటీనటుల సినిమాల గురించి మాత్రమే చర్చించాలని సూచించారు. వారి వ్యక్తిగత జీవితాలపై చర్చించే హక్కు.. వారిని జడ్జ్ చేసే రైట్ మనకు లేదన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వివాదం కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హాట్ టాపిక్గా మారింది..విక్రమ్ భట్ తన పోస్ట్లో రాస్తూ.. ' విజయ్- త్రిషల వ్యక్తిగత జీవితాలపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ నిజమో, కాదో నాకు తెలియదు. ఒకవేళ అవి నిజమైతే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. వారిద్దరూ ఎంతో హుందాగా ఉన్నారు. ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదు. ఇప్పుడు వాళ్లను ఎంతోమంది జడ్జ్ చేస్తున్నారు. ఆ ఇద్దరి గురించి మాట్లాడేవారంతా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. నటీనటుల సినిమాలు మాత్రమే మనం చూడాలి. వారి పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు' అని రాసుకొచ్చారు.కాగా.. ఇటీవల రూ.30కోట్ల చీటింగ్ కేసు విషయంలో విక్రమ్ భట్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విక్రమ్, అతడి భార్య శ్వేతాంబరి భట్లకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ దంపతులు దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


