విజయ్ సీఎం అయ్యాక జరుగుతోన్న ఆయన తొలి బర్త్ డే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న విజయ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటించిన బ్లాక్బస్టర్ మూవీ రి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన మెర్సల్ రీ రిలీజ్ కానుంది. దీంతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా.. 2017లో విజయ్ నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ కథా చిత్రం ఇది కావడం విశేషం. అంతే కాదు తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన వందో సినిమా. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా మెప్పించగా.. వడివేలు,కోవై సరళ ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అప్పట్లో దీపావళికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రాన్ని సుమారు తొమ్మిది ఏళ్ల తరువాత కేపీ ఫిలింస్ సంస్థ అధినేత కెనడీ చెన్నై, సెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలో 100 థియేటర్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


