breaking news
birthday
-
మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఈ ఏడాది కూడా అక్కడేనా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈనెల 22న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే రెడీ అయిపోయారు. దీంతో ఒక్కరోజు ముందుగానే అభిమానులకు విశ్వంభర బిగ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ చిరు 70వ బర్త్డే మరింత గ్రాండ్గా జరుపుకోనున్నారు.తన 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం చిరంజీవి ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. తన ఫ్యామిలీతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఎప్పటిలాగే బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో శ్రీజ కూతురు, తన మనవరాలితో మెగాస్టార్ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. చిరువెంట ఆయన భార్య సురేఖతో పాటు చిన్నకూరుతు శ్రీజ సైతం విమానాశ్రయంలో కనిపించారు. ఈ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసనతో పాటు.. వీరి కుమార్తె క్లీంకారా కూడా పాల్గొననున్నారు.ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
పుట్టినరోజునే నూరేళ్లు
సిరిసిల్లటౌన్: పుట్టినరోజున ఇంట్లో అమ్మ ఆశీస్సులు పొంది, దోస్తులతో ఆనందంగా గడుపొచ్చన్న యువకుడిని విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబళిచింది. స్థానికులు తెలిపిన వివరాలు..తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్కు చెందిన కొమ్ము మైసయ్య–నవీన దంపతులు సిరిసిల్ల నెహ్రూనగర్లో నివాసం ఉంటున్నారు. మైసయ్య ఉపాధి కోసం గల్ఫ్లో ఉండగా..భార్య నవీన ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. వీరికి లక్ష్మీనారాయణ ఉరఫ్ లక్కీ(20), నిఖిల్, శ్వేత సంతానం. కొద్దిరోజులు హైదరాబాద్లో పనిచేసిన లక్ష్మీనారాయణ ఇటీవలే సిరిసిల్లకు వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు గణేశ్ ప్రతిమను తీసుకురావడానికి లక్ష్మీనారాయణ సోమవారం ఫ్రెండ్స్తో ఆర్మూర్ వెళ్లాడు.పుట్టినరోజే కానరాని లోకాలకు..మంగళవారం తన పుట్టినరోజు కావడంతో దోస్తులతో కలిసి అప్పటికే ఆర్డర్ ఇచ్చిన 15 అడుగుల వినాయక ప్రతిమను తీసుకొచ్చి వేడుకలు జరుపుకోవాలని లక్కీ, ఫ్రెండ్స్ నిశ్చయించుకున్నారు. సోమవారం రాత్రి వర్షంలో ఇబ్బందులు ఎందుకని ఫ్రెండ్స్ అందరూ ఆర్మూర్లోనే పడుకున్నారు. మంగళవారం ఉదయం సిరిసిల్లకు వినాయక విగ్రహంతో ప్రయాణమయ్యారు. కామారెడ్డి జిల్లా ఆరెపల్లి గ్రామ స్టేజీ వద్ద హైటెన్షన్ కరెంటు తీగలకు గణపతి విగ్రహానికి అమర్చిన ఇనుప పైపులు తగిలి లక్ష్మీనారాయణ, సాయి అనే ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే షాక్తో పడిపోయారు. స్నేహితులు, స్థానికులు వెంటనే వారికి సీపీఆర్ చేయగా, సాయి మెలకువలోకి రాగా, లక్ష్మీనారాయణ అలానే పడిపోయాడు. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మరో గంట సమయం గడిస్తే సిరిసిల్లకు చేరేవారు. కాగా, లక్కీ, సాయిలకు కాళ్లకు చెప్పులు లేకపోవడంతో షాకు తగిలినట్లు ఫ్రెండ్స్ చర్చించుకుంటున్నారు. పుట్టినరోజునే లక్కి జీవితం విషాదాంతంగా ముగియడం సిరిసిల్లలో తీరని విషాదం నింపింది. -
తల్లి 84వ బర్త్ డే.. సుమ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)
-
మెగాస్టార్తో అనిల్ రావిపూడి.. టైటిల్ రివీల్ డేట్ ఫిక్స్
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న చిత్రంపై టాలీవుడ్ ఫ్యాన్స్తో పాటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ కోసం సినీ ప్రియులు ఎప్పుడెప్పుడొస్తుందా అనుకుంటున్నారు. ఈనెలలోనే మెగాస్టార్ బర్త్ డే రానుండడంతో ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాకు టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు.అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ మూవీ టైటిల్ ఈనెల 21 రివీల్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా లిటిల్ హార్ట్స్ మూవీ ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడి మెగా మూవీ టైటిల్ అప్డేట్ గురించి ప్రశ్నించగా.. నిజమేనని స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ టైటిల్లో సంక్రాంతి అనే పదం లేదని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే 157వ చిత్రంగా నిలవనుంది. -
పసి మొగ్గల.. బర్త్డే గార్డెన్
సాక్షి, సిద్దిపేట: పుట్టినరోజు వస్తుందంటేనే పిల్లలు ఎక్కడ లేని సంతోషంలో మునిగిపోతారు. బర్త్డే రోజు ఒక మంచిపని చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ ఆలోచనలోంచి అందమైన బర్త్ డే గార్డెన్లు పురుడు పోసుకున్నాయి. సిద్దిపేట జిల్లా బక్రి చేప్యాల జెడ్పీఉన్నత పాఠశాలతోపాటు దుబ్బాకలోని లచ్చపేట మోడల్ స్కూల్లోని విద్యార్థుల బర్త్ డే గార్డెన్లు (Birthday Garden) అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బక్రి చేప్యాల పాఠశాల ఉపాధ్యాయులు, లచ్చపేట మోడల్ స్కూల్ సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్, రిసోర్స్ అండ్ ట్రైనింగ్) క్లబ్ ఈ ఏడాది జూన్ 16న బర్త్ డే గార్డెన్లు ఏర్పాటు చేశాయి.పాఠశాలల్లో ఎవరి పుట్టిన రోజు ఎప్పుడు అనేది తెలుసుకునేందుకు ప్రత్యేక రికార్డు బుక్ను ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి పుట్టిన రోజు నాడు వారిచేత టీచర్ల గార్డెన్లో మొక్కను నాటిస్తున్నారు. ప్రతీ రోజు బ్రేక్ సమయంలో ఎవరి మొక్కకు ఆ విద్యార్థి నీళ్లు పోసేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి టీచర్లు కూడా తమ పుట్టిన రోజు సందర్భంగా గార్డెన్లో మొక్కలు నాటుతున్నారు. గార్డెన్ల పర్య వేక్షణ బాధ్యతను ప్రత్యేకంగా ఎంపిక చేసిన టీచర్లకు అప్పగించారు.పర్యావరణ పరిరక్షణపై బాధ్యత పెంచాలని..బర్త్ డే అంటే కేక్ కట్ చేయటం, చాక్లెట్లు పంచటమే కాదు... మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో బర్త్డే గార్డెన్ను ఏర్పాటు చేశాం. విద్యార్థుల్లో పర్యావరణం పట్ల బాధ్యత, ప్రేమ పెంచాలనే దీనిని ప్రారంభించాం. విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేలా ప్రయత్నిస్తున్నాం. గ్రామ పంచాయతీ నర్సరీ నుంచి మొక్కలు (Plants) తెప్పించి నాటిస్తున్నాం. – నాగేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, బక్రి చేప్యాలపుట్టినరోజు సందర్భంగా మొక్క నాటానుమా పాఠశాలలో ఏర్పాటుచేసిన బర్త్ డే గార్డెన్లో నా 14వ బర్త్డే సందర్భంగా గులాబీ మొక్కను నాటాను. రోజూ బ్రేక్ సమయంలో మొక్కకు నీళ్లు పోస్తున్నా. బర్త్ డే రోజు మొక్క నాటడం ఎంతో సంతోషంగా ఉంది. – రక్షిత, 9వ తరగతి, బక్రి చేప్యాల చదవండి: యస్.. ఇది గణేష్ బండి.. ఏం చేశాడో చూడండి! -
టీడీపీ ఎమ్మెల్యే బర్త్డే.. డబ్బులిస్తేనే కోప‘రేషన్’
అనంతపురం అర్బన్: అధికార పార్టీ నాయకుల్లో కొందరి ‘రూటే’ సెప‘రేటు’! డబ్బులు దండుకునే విషయంలో వారికి తరతమ భేదం ఉండదు. తాజాగా ఇలాంటి తంతు రేషన్ డీలర్ల విషయంలో చోటు చేసుకుంది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజును పురస్కరించుకుని రేషన్ డీలర్ల సంఘం నాయకులు వసూళ్లకు తెరలేపారు. డీలర్ల తరఫున ఎమ్మెల్యేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదామని, ఇందులో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటుకు ఒక్కొక్క డీలర్ రూ.5 వేల చొప్పున ఇవ్వాలని డీలర్ల సంఘానికి చెందిన కొందరు నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం అర్బన్ పరిధిలో మొత్తం 136 చౌక డిపోలు ఉన్నాయి. ఇందులో కనీసం వంద షాపుల నుంచి రూ.5 లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. తాము చెప్పినంత ఇవ్వకపోతే ఎమ్మెల్యేకు చెప్పి దుకాణం తీయించేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు పలువురు డీలర్లు ఆవేదన చెందుతున్నారు. దుకాణం ఉండాలంటే రూ.లక్ష! ఎమ్మెల్యే బర్త్డే పేరిట వసూళ్ల సంగతి ఒక ఎత్తయితే... డీలర్షిప్ మీకే కొనసాగాలంటే రూ.లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూండడం మరొక ఎత్తు. లేదంటే ఎమ్మెల్యేకు చెబుతామని, స్టోరు వేరే వారికి ఇప్పిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో భయపడిన కొందరు డీలర్లు ఇప్పటికే రూ.లక్ష చొప్పున, మరికొందరు రూ.50 వేలు, రూ.60 వేలు, రూ.75 వేలు..ఇలా చెల్లించుకున్నట్లు తెలిసింది. స్వయాన డీలర్ల సంఘం నాయకులే కొందరు దళారుల అవతారమెత్తి ఎమ్మెల్యే పేరిట వసూళ్లకు తెగబడడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. ముడుపుల రూపంలో సమర్పించుకున్న డబ్బును సర్దుబాటు చేసుకునేందుకు బియ్యం, ఇతర సరుకులను ‘పక్కదారి’ పట్టించక తప్పడం లేదని కొందరు డీలర్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే పేరిట సదరు నాయకులు ఇప్పటికే పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశారని, తాము ఏమి చేసినా ఎమ్మెల్యేకు చెప్పే చేస్తామంటుండడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదని వాపోతున్నారు. బయటికు చెబితే ఏ సమస్యల్లో ఇరికిస్తారోనని పలువురు డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నా బలం, నా సర్వస్వం.. మహేశ్కి నమ్రత స్పెషల్ విషెస్
తెలుగు హీరో మహేశ్ బాబు.. 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు మహేశ్ భార్య నమ్రత కూడా క్యూట్ అండ్ లవ్లీ విషెస్ చెప్పింది. తనకు బలం, సర్వస్వం నువ్వే అని చెబుతూ ఫ్యామిలీ ఫొటోని పంచుకుంది. ఈ పోస్ట్కి మహేశ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.(ఇదీ చదవండి: తెలుగు సినిమాకు గర్వకారణం.. మహేశ్ బాబుకు 'మెగా' శుభాకాంక్షలు)దాదాపు 25 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న మహేశ్ బాబు.. తన నటనతో పాటు వ్యక్తిగతంగానూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ క్రమంలో చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే థియేటర్లలో రీ రిలీజ్ అయిన 'అతడు' చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా వాళ్లు విషెస్ చెప్పడం సంగతి చెప్పడం కంటే మహేశ్కి భార్య నమ్రత తన విషెస్ చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది.'నా జీవితాన్ని ఓ అందమైన కలలా మార్చిన మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా లవ్, నా బలం, నా సర్వస్వం. ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తుంటా మహేశ్' అని నమ్రత తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరోవైపు మహేశ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి మూవీ నుంచి చిన్న అప్డేట్ కూడా వచ్చింది. నవంబర్లోనే సినిమా నుంచి కీలక అప్డేట్ ఇస్తామని, అప్పటివరకు వెయిటింగ్ తప్పదు అని ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'చిట్టి' గుండెల కోసం మహేశ్ బాబు.. సాయం కోసం ఇలా సంప్రదించండి) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్ బాబు 50వ పుట్టినరోజు.. గోల్డెన్ పిరియడ్ (ఫోటోలు)
-
12th ఫెయిల్ హీరోయిన్ మేధా శంకర్ బర్త్ డే స్పెషల్ (ఫోటోలు)
-
కాజోల్ బర్త్ డే.. ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ హీరోయిన్ (ఫొటోలు)
-
ఈ బామ్మ రూటే సెపరేటు..! వందో పుట్టినరోజుని అందరిలా కాకుండా..
60 ఏళ్లు దాటిని సీనియర్ సిటీజన్లంతా జీవిత చరమాంకంలో తమ జీవితాన్ని ఎలా గడుపుతారో తెలిసిందే. రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ బామ్మ మాత్రం ఈ జనరేషన్ అవాక్యయ్యేలా జీవిస్తోంది. ఈ ఏజ్లో యువత మాదిరిగా చురుగ్గా ఉంటూ అన్ని వ్యాయమాలు చేస్తోంది. జిమ్లో ఆమే చేసే వ్యాయామాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇటీవలే వందేళ్ల వయసుకుకి చేరుకుంది. అయితే ఆమె అందరిలో కాకుండా విభిన్నంగా తన పుట్టినరోజుని చేసుకుంది. ఆఖరికి తన జీవన విధానం సైతం అందరి వృద్ధుల్లా కాకుండా..యంగ్ ఏజ్లో ఉండే వ్యక్తుల్లా అత్యంత యాక్టివ్గా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పైగా 120 ఏళ్లు జీవించాలనుకుంటున్నా అని అత్యంత ధీమాగా చెబుతోంది ఈ బామ్మ. ఇంతకీ ఆమె ఎవరంటే..యునైటెడ్ స్టేట్స్ కనెక్టికట్లోని నార్వాక్కు చెందిన మేరీ కరోనియోస్ అనే బామ్మ ఇటీవలే సెంచరీ వయసులోకి చేరుకుంది. అయితే ఆమె తన వందో పుట్టిన రోజుని అందరిలా కేకులు, చాక్లెట్లు, మిఠాయిలతో కాకుండా జిమ్లో చేసుకుంది. జిమ్లో చేసుకోవడం ఏంటి అనుకోకండి. ఈ బామ్మ స్పెషాలిటీ అందులోనే కాదు ఆమె జీవిన విధానంలోనూ ఉంది. ఎందుకంటే అందరి వృద్ధుల్లా కాకుండా డైనమిక్గా ఉంటుంది ఈ బామ్మ. ఆమె జిమ్లో హుషారుగా బరువులు ఎత్తుతు..తన వందో పుట్టిన రోజుని జరుపుకుంది. తానింకా వృద్ధురాలిని కాదు యంగ్ అని చెప్పేందుకే ఇలా విభిన్నంగా తన పుట్టినరోజుని జరుపుకుందామె. అంతా ఆ బామ్మను జిమ్ మేయర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. దీర్ఘాయువుతో ఉండాలని, తన వృద్ధాప్యం భారంగా సాగకూడదనే మంచి ఆహారపు అలవాట్లను అనుసరిస్తోందట. వ్యక్తిగత ట్రైనర్లతో కలిసి జిమ్లో ఇతరులకు శిక్షణ కూడా ఇస్తుందట కూడా. అంతేగాదు అక్కడకు వచ్చే వారు ఈ వందేళ్ల బామ్మ ట్రైనింగ్ చూసి స్ఫూర్తి పొందుతారట. జీవతాన్ని ఆస్వాదించడం అంటే ఇదే కదా అని ఆ బామ్మని చూసి అనుకుంటుంటారట. ఆ బామ్మ కూతురు ఎథీనా సైతం ఆమె దినచర్య, ఆహరపు అవాట్లకు ఫిదా అవుతుంటుందట. తనకు దీర్ఘాయువుతో రికార్డులు బ్రేక్ చేయడమ తన లక్ష్యం కాదని, మానసిక పరిమితులను బద్దలు కొట్టేలా జీవించడమే తన ధ్యేయం అని ఆమె కూతురు ఎథీనా చెబుతోంది. ఈ బామ్మ నేపథ్యం..లైఫ్స్టైల్..మాజీ ఉపాధ్యాయురాలైన కరోనియోస్ వృద్ధుల సంప్రదాయ జీవన విధానాన్ని విడిచిపెట్టి ఆధునిక జీవిన విధానానికి అడాప్ట్ అయ్యింది. సీనియర్ కేంద్రాల కంటే జిమ్కు వెళ్లేవారితో కలిసే యత్నం చేసేది. ఆమె ఈ ఏజ్లోనూ యువకులతో వేళాకోలం ఆడుతూ..హుషారుగా ఉంటుందట. ఆమె వయసుకి జిమ్ అనేది అతిపెద్ద శారీరక శ్రమ అయినా..ఆ అనితర సాధ్యమైన వర్కౌట్లు, బరువుల ఎత్తడం అంటేనే ఆమెకు ఇష్టమట. ఆరోగ్యానికి మదద్దుతి ఇచ్చే వ్యాయామాలన్నింటిని అలవోకగా చేసేస్తుందట. అలాగే సమాజంతో మంచి సత్సంబంధాలను నెరుపుతుందట. బంధువులు, కుటుంబ సభ్యుల అందరితోనూ సానూకూల దృక్పథంలో వ్యవహరిస్తుందట. ఇవే తన ధీర్ఘాయువుకి కారణమని నమ్మకంగా చెబుతోంది కరోనియస్ బామ్మ. హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. దీర్ఘాయువుకి సంబంధించి.. నిపుణులు సైతం..ఆమె ఆహారపు అలవాట్లను ప్రశంసిస్తున్నారు. ఆమె అత్యంత మితంగా భోజనం, మొక్కల ఆధారిత పోషకాహారం, బాడీకి సరైన కదలికలు ఉండేలా చేసే వ్యాయామాలు తదితరాలన్నీ మంచి అలవాట్లకు దగ్గరగా ఉండే సూత్రాలుగా పేర్కొన్నారు పోషకాహార నిపుణులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా పర్లేదు కానీ 120 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నానని ఆ బామ్మ చెబుతుండటం విశేషం. ప్రస్తుతం ఆమె హైపర్ ధైరాయిడిజంకి సంబంధించిన మందులు ఒక్కటే తీసుకుంటున్నారు. ఈ విధమైన మంచి జీవన విధానానికి కీలకం తన గ్రామీణ నేపథ్యమేనని అంటోందామె. పెన్సిల్వేనియా గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె తన తోబుట్టువులు ఐదుగురిలో ఈ బామ్మే పెద్దదట. ఈత నుంచి చెట్లు ఎక్కడం, బాస్కెట్బాల్, వాలీబాల్ వంటి అన్ని ఆటలను హాయిగా ఆడేదాన్ని అని చెబుతోంది. అంతేగాదు తనలా జీవితానికి పరమార్థం ఉండేలా ఏదో ఒకటి సాధించేలా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని సూచిస్తోంది ఈ కరోనియోస్ బామ్మ.(చదవండి: Weight Loss: బరువు తగ్గాలనుకుంటే.. ఇవిగో ఐదు చిట్కాలు!: ఫిట్నెస్ కోచ్) -
రాజాసాబ్ బ్యూటీ 'మాళవిక మోహనన్'కు మరో పేరు ఉంది తెలుసా (ఫోటోలు)
-
మృణాల్ ఠాకూర్ బర్త్డే స్పెషల్.. రెమ్యునరేషన్తో తెలివైన నిర్ణయం (ఫోటోలు)
-
లిటిల్ బడ్స్ బర్త్డే.. ట్రెండీగా!
రాజమహేంద్రవరం రూరల్: ఏ ఇంట అయినా క్యార్మని శబ్దం ఎప్పుడు వినిపిస్తుందా అని ఎదురుచూడని దంపతులు ఉండరు. ఆ రోజు కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ. అది ఫలించిన నాడు ఆ ఇంట అంతకు మించిన పండగ ఏముంటుంది. ఆ బిడ్డ పెరుగుదలలో ప్రతి అంకం ఆ ఇంట ఓ ఉత్సవమై అలరారుతుంది. గత తరాల అమ్మమ్మల సంప్రదాయం.. నేటి అమ్మల ట్రెండీనెస్ కలగలసి బుజ్జాయిల పుట్టిన రోజులు థీమ్లుగా రూపాంతరం చెందుతున్నాయి.గత తరాల అమ్మమ్మలు శిశువు రెండో నెలలో నవి్వతే నువ్వుండలు చేసి పంచడం.. మూడో నెలలో బోర్లా పడితే బొబ్బట్లు చేసి సందడి చేయడం.. ఆరో నెలలో పాకడం మొదలుపెట్టగానే పరమాన్నం వండి నోరు తీపిచేయడం.. ఏడో నెల గడప దాటితే గారెలు వంటి సరదాగా దండ వేసి పంచడం.. పదో నెలలో అడుగులేస్తుంటే అరిసెలు వండడం.. అందరికీ తెలిసిందే. నేటికీ చాలా ఇళ్లలో ఈ సందడి కనిపిస్తున్నా వీటికి అదనంగా ప్రతి నెలా పుట్టినరోజు చేస్తూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అదికూడా ట్రెండీగా.ఏడాది పాటు ప్రతి నెలా ఒక్కో థీమ్తో పుట్టిన రోజును చేస్తున్నారు. ఆ పన్నెండు నెలల జ్ఞాపకాలను ఫొటో ఫ్రేమ్లు, వీడియోల రూపంలో క్రోడీకరించి మొదటి ఏడాది పుట్టినరోజును వైభవంగా నిర్వహిస్తూ బంధుమిత్రులకు చూపి, సోషల్ మీడియాలో పోస్టుచేసి లైక్లకు, కామెంట్లకు మురిసిపోతున్నారు. నయా బర్త్డే సెలబ్రేషన్స్పై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.ప్రతి నెలా పండగే మా గారాలపట్టి యశశ్వి పుట్టినరోజును ప్రతి నెలా ఓ వేడుకలా చేసుకుంటున్నాం. కుటుంబసభ్యులంతా కలిసి సందడి చేస్తాం. పిల్లల చిన్నప్పటి ఫొటోలు భద్రంగా ఉంచితే పెద్దయ్యాక చూసి మురిసిపోతారు. ప్రతినెల కొత్త బట్టలు వేసి ఒక్కో రకమైన వస్తువులు, ఇతర పండ్లతో నెలల నంబర్లు వేసి ఫొటోలు తీసుకుంటాం. ఏడాది పాటు ఈ ఫొటోలను భద్రపరచి ప్రదర్శిస్తాం. – సుకీర్తి, సచివాలయ ఉద్యోగి, నగరంఒక మధుర జ్ఞాపకం ప్రస్తుతం పిల్లల పుట్టిన రోజులు నెలవారీగా చేస్తూ ఫొటోలు తీయడం సంప్రదాయంగా మారింది. ఈ ఫోటోలు వారి శారీరక వృద్ధి, హావభావాలు, వ్యక్తిత్వ వికాసాలను నెలనెలా చిత్రీకరిస్తూ.. వా ప్రగతిని కళ్లకు కడతాయి. ఇది కేవలం వయసు పెరిగిన రోజు కాదని, వారి బాల్యంలో అమూల్యమైన క్షణాలను పదిలం చేస్తాయి. – బి.హేమ, సైంటిస్ట్, రాజమహేంద్రవరంకలకాలం గుర్తుండాలని... బర్త్డేకి ఏడాది వరకు ఎదురు చూడడం ఎందుకని.. నెలనెలా ఒక్కో థీమ్తో మా పాపను రెడీ చేశా. ఫొటోలు తీసి భద్రంగా ఉంచా. పెద్దయ్యాక చూపిస్తే తను కూడా సంబరపడుతుంది. ఒకప్పుడంటే కెమెరామన్ వచ్చి ఫొటోలు తీసేవాడు. ఇప్పుడు ఫోన్లోనే ఫొటోలు తీసి ఎడిటింగ్ చేస్తున్నా. మంచి పాటను యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే చాలా లైక్లు, కామెంటు వస్తున్నాయి. – వలవల దేదీప్య, గృహిణి, మోరంపూడి -
కేటీఆర్ జన్మదినం.. తల్లులకు కేసీఆర్ కిట్లు పంపిణీ (ఫోటోలు)
-
చాహల్కు ప్రియురాలి బర్త్ డే విషెస్.. అవీ ఇంకా దారుణమంటూ ఆర్జే మహ్వశ్ పోస్ట్!
ప్రముఖ ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇటీవల లండన్ వెకేషన్లో ఉన్న చిత్రాలను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది. అయితే ఈ ముద్దుగుమ్మ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో డేటింగ్లో ఉందంటూ గతంలోనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.లండన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాహల్తో డేటింగ్పై చర్చ మొదలైంది. అదే లోకేషన్లో చాహల్ కూడా ఫోటోలు పోస్ట్ చేయడం ఈ జంట డేటింగ్ నిజమేనని అందరూ ఫిక్సయిపోయారు. తరచుగా వీరిద్దరు పార్టీల్లో కనిపించడం ప్రేమలో మునిగి తేలుతున్నారని అర్థమవుతోంది. చాహల్ విడాకుల తర్వాత మహ్వశ్ మరింత దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఐపీఎల్లోనూ పంజాబ్ మ్యాచ్ల్లో సందడి చేసింది.తాజాగా చాహల్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో విషెస్ తెలిపింది. జూలై 23న చాహల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. లండన్లోని ఓ రెస్టారెంట్లో చాహల్ కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.మహ్వశ్ తన క్యాప్షన్లో.. "పుట్టినరోజు శుభాకాంక్షలు యుజీ! వయసు పెరగడం అనేది మన జీవితంలో ఒక భాగం. అలాగే జీవితంలో మిగిలిన భాగాలు మరింత దారుణంగా ఉంటాయి. అందుకే ఆల్ ది బెస్ట్" అంటూ ఫన్నీ ఎమోజీతో పోస్ట్ చేసింది. ఇప్పటికే వీరిద్దరి డేటింగ్లో ఉన్నారని టాక్ వినిపిస్తున్నప్పటికీ.. ఈ పోస్ట్తో మరింత క్లారిటీ వచ్చేసింది. ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన చాహల్ డేటింగ్పై ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. అయితే జీవితంలో మిగతావన్నీ కూడా దారుణంగా ఉంటాయని రాయడం చర్చనీయాంశంగా మారింది. చాహల్- ధనశ్రీ వర్మ విడాకులను ఉద్దేశించి చేసినట్లు అర్థమవుతోంది. కాగా.. చాహల్ ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకున్నారు. -
కొడుకు ఫన్నీ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ (ఫోటోలు)
-
ఇదెక్కడి విడ్డూరం.. బిర్యానీ కట్ చేసి.. ఇలా కూడా చేస్తారా?
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవలే మార్గన్ మూవీతో ప్రేక్షకులను అలరించిన విజయ్.. మరో మూవీతో వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న భద్రకాళి. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇది విజయ్ ఆంటోనీ కెరీర్లో 25వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా భద్రకాళి మూవీ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్లో విజయ్ ఆంటోని బర్త్ డే వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈవెంట్లో కేక్కు బదులు బిర్యానీని కట్ చేసి రోటీన్కు భిన్నంగా బర్త్ డే జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు కేక్ ప్లేస్లో బిర్యానీ ఏంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. 'అరువి', 'వాళ్' లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన అరుణ్ ప్రభు.. విజయ్ ఆంటోనితో 'భద్రకాళి' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోట్ల స్కామ్ చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
సూర్య అంటే చేయూత!
సాక్షి, చెన్నై: సేవా గుణం కలిగిన అతి తక్కువ మంది తమిళ నటుల్లో సూర్య ముందుంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. ఈ నటుడిలో ఎంత పెద్ద కథానాయకుడు ఉన్నాడో అంత మంచి విద్యాదాత ఉన్నారు. విద్యాదానంలో తన తండ్రి నటుడు శివకుమార్ను స్ఫూర్తిగా తీసుకొని సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా అనేక మందిని చదివిస్తూ వారి ఉన్నత కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిభ ఉండి చదువుకునే స్థోమత లేని పేద విద్యార్థులకు ప్రతి ఏడాది ఆర్థికసాయం, ప్రశంసా పత్రాలతో ప్రోత్సహిస్తున్నారు. ఈయన సేవా దాతృత్వం గురించి ఇటీవల స్టంట్ మాస్టర్ సెల్వ చెబుతూ గత పదేళ్లుగా సూర్య తమిళ సినిమాకు సంబంధించిన స్టంట్ మాస్టర్లకు ఏడాదికి అందరికి కలిపి రూ.10లక్షలు ఇన్సూరెన్స్ కడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ఎవరితోనూ చెప్పలేదని పేర్కొన్నారు. అంతటి మానవత్వం కలిగిన సూర్య బుధవారం 50 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో నాలుగు రోజుల నుంచే ఆయన అభిమానులు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు. అలా సూర్య సేవా సంఘం తరఫున ఉత్తర చెన్నై ప్రాంతంలో రూ.2లక్షల విలువైన సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కుట్టుమిషన్లు, 150 మంది మహిళలకు చీరలు, 50 మంది పురుషులకు పంచెలు, 150 మంది విద్యార్థులకు చదువు ఉపకరణాలు, 150 మంచి నీటి బిందెలు, పదిమంది వృద్ధులకు ఆర్థికసాయం అందించారు. ఈసేవా కార్యక్రమంలో 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ నిర్మాత రాజశేఖర్ పాండియన్ పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 45వ చిత్రం కడుప్పు. ఈ చిత్రం దీపావళికి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తన 46 వ చిత్రాన్ని టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. -
హీరో సూర్య బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
వరుణ్ సందేశ్ బర్త్ డే.. సతీమణి సర్ప్రైజ్ గిఫ్ట్ చూశారా..!
టాలీవుడ్ ప్రముఖ జంటల్లో వరుణ్ సందేశ్- వితికా శేరు ఒకరు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు చేరుకుంది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆగస్టు 19, 2016న వీరిద్దరు ఏడడుగులు వేశారు. అయితే ఈ జంట పెళ్లి తర్వాత బిగ్బాస్ మూడో సీజన్లో కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు.అయితే వరుణ్ సందేశ్కు ఆయన సతీమణి వితికా శేరు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఈనెల 21న వరుణ్ పుట్టిన రోజు కావడంతో జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ను ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. భర్త వరుణ్ బర్త్డే సందర్భంగా కొత్త ఇంటిని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ స్వయంగా వెల్లడించారు. ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భార్యతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.వరుణ్ తన ఇన్స్టాలో రాస్తూ..'నా పుట్టినరోజుకి నువ్వు ఇల్లు కొని ఇచ్చినప్పుడే నేను ధన్యుడిని అయిపోయా. ఈ వాస్తవమైన ఊహించలేని ఆశ్చర్యాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా. ఇది కేవలం బహుమతి కాదు.. ఇది పూర్తిగా కొత్త అధ్యాయానికి నాంది. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా. నన్ను నిరంతరం ఆశ్చర్య పరుస్తూ.. నాకు మద్దతుగా నిలుస్తూ.. ఇప్పుడు నా ఇంటి యజమానిగా ఉన్నందుకు ధన్యవాదాలు. నా సూపర్ ఉమెన్ను హద్దుల్లేని ప్రేమకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా.. హ్యాపీ డేస్ చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ సందేశ్.. కొత్త బంగారులోకం, ఎవరైనా ఎప్పుడైనా, ప్రియుడు లాంటి చిత్రాల్లో కనిపించారు. View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) -
సతీమణి పుట్టినరోజు స్పెషల్.. రచ్చ రవి ఎమోషనల్ పోస్ట్
-
ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్
మెగా కోడలు ఉపాసన మరో వసంతంలోకి అడుగుపెట్టింది. భర్త రామ్ చరణ్తో కలిసి తన 37వ పుట్టినరోజుని ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోని చరణ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్లో చరణ్-ఉపాసనతో పాటు కూతురు క్లీంకార కూడా కనిపించింది. ఆమె ఫేస్ కూడా కాస్త రివీల్ అయింది.(ఇదీ చదవండి: నా జీవితానికి వెలుగు నీవే.. సితారకు మహేశ్ బర్త్డే విషెస్)సెలబ్రిటీలు చాలావరకు తమ తమ పుట్టినరోజుని విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చరణ్-ఉపాసన కూడా గతంలో వెళ్లారు. అయితే ఈసారి మరి చరణ్ షూటింగ్ షెడ్యూల్స్ వల్లనో ఏమో గానీ ఇంట్లోనే సింపుల్గా పుట్టినరోజు జరుపుకొన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ పోస్ట్ దిగువన మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఉపాసనకు విషెస్ చెబుతున్నారు.చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. కొన్నిరోజుల ముందు వరకు ఢిల్లీ షూటింగ్ చేసొచ్చారు. ప్రస్తుతం ఎక్కడ జరుగుతుందనేది క్లారిటీ లేదు. ఈ మూవీ నుంచి ఇదివరకే రిలీజైన గ్లింప్స్ మంచి రెస్పాన్ అందుకుంది. వచ్చే ఏడాది మార్చి 27న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
మెగా కోడలు ఉపాసన బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
కిరణ్ అబ్బవరం బర్త్డే.. లైఫ్లో ప్రత్యేకమైన క్షణాలు (ఫోటోలు)
-
వైతాళికుని జననం
మహాత్ముల జననం కూడా మామూలుగానే ఉంటుంది. కానీ వారి జీవన ప్రయాణంలో వారు ఎదుగుతూ మానవాళిని తమ వెంట తీసుకువెళతారు. తెలుగు రాష్ట్రాలు మరువ లేని, మరచిపోని మహానాయకులలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి అతి ముఖ్యులు.గంభీరమైన రూపం, ఆయన మనసులా తెల్లని దుస్తులు, ముఖం మీద చెరగని చిరు నవ్వు, ఆప్యాయమైన పలకరింపు, అందరితో కలసిపోయే తత్త్వం, మృదుభాషణం, నిగర్వం, సహనం, సమయ స్ఫూర్తి ఇలా అన్నీ కలిపితే ఆయనే పులివెందుల డాక్టరు, రాష్ట్ర ప్రజల జీవన విధానాన్ని సంస్కరించిన సామాజిక వైద్యుడు, ప్రజల రాజన్న, రైతుల హృదయ మెరిగిన రైతన్న.1949 జూలై 8న వై.ఎస్. జన్మించాడు. చారిత్రక మలుపునకు ఆరంభం ఆ రోజు. ఆ బాలుడు అజేయుడు, అనితర సాధ్యుడు అవు తాడనీ, ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు ఎదుగుతాడనీ, రాష్ట్రాన్ని, ప్రజల మనసులను ఏలుతాడనీ ఎవరు ఊహించారో గానీ రాజులలో శేఖరుడు కావాలని ‘రాజశేఖరు’డని నామకరణం చేశారు. సాధనతో సార్థకనామధేయుడే అయ్యాడు.రూపాయి డాక్టర్కర్ణాటకలోని గుల్బర్గాలో వైద్య విద్యను పూర్తి చేసుకుని, 1972లో తిరుపతి రుయా ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా చేరారు. అప్పట్లో ‘రుయా‘ కన్నా పెద్ద ఆసుపత్రి రాయలసీమలో లేదు. అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే సీమవాసులందరినీ చూసే అవ కాశం ఆయనకు లభించింది. ఆయన నిత్య విద్యార్థి. ఆ గుణం వల్ల ప్రజల సమస్యలు, పేదరికం మరింతగా అర్థమయ్యాయి.పులివెందులలో ఆసుపత్రి ప్రారంభించాడు. ఉన్న ఊరు, కన్న తల్లి రుణం తీర్చుకోలేమని కేవలం ఒక్క రూపాయికి వైద్యం చేసే వాడు. రూపాయి డాక్టరుగా ఆయన పేరు మారు మోగిపోయింది.వైద్యుడిగా రాత్రింబవళ్లు సేవ చేస్తున్నా ఆయనలో ఏదో అసంతృప్తి. సమాజానికి వైద్యం చేయాలి, తన పరిధి మరింత పెంచు కోవాలి, అపుడే అందరికీ అన్ని సౌకర్యాలు అందించగలం అని భావించిన రాజశేఖర రెడ్డి రాజకీయాలలోకి అడుగు పెట్టాడు. రాజకీయాలు ఈనాడే కాదు, ఆనాడు కూడా అంత స్వచ్ఛంగా ఏమీ లేవు. అవినీతి, బంధు ప్రీతి, అహంకారం, స్వార్థం– ఇవే రాజ్య మేలుతున్నాయి. కానీ నిజాయితీ గెలుస్తుందనీ, ప్రజల ప్రేమ గెలిపిస్తుందనీ భావించాడు.రాజీలేని పోరాటం చేయడం, విమర్శలను నవ్వుతూ ఎదుర్కొ నడం, అందర్నీ కలుపుకొనిపోవడం, స్థిరంగా నిలబడటం ఆయన నైజం. అందుకే ఆరుసార్లు శాసనసభ్యుడిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నాయకుడిగా శాసనసభలోనూ, పార్లమెంటులోనూ తన గళం వినిపించారు.క్షమించడం నేర్చుకున్నాడు!ముక్కుసూటితనం ఆయన తత్త్వం. బెదరడం, పదవి కోసం తలదించుకుని ఒదిగి ఒదిగి వుండటం ఆయనకు రాదు. అందుకే సొంత పార్టీలో కూడా ఆయనను కొందరు కంటకులు ఇబ్బందులకు గురి చేశారు. వారిపై తిరగబడ్డాడు, వారే తోక ముడిచేలా చేశాడు. అయితే ఆయన శత్రువులను క్షమించడం నేర్చుకున్నాడు.ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన తండ్రి వై.ఎస్. రాజారెడ్డిని చంపిన హంతకులపై ప్రతీకారం తీర్చుకోలేదు. హత్యానంతరం వారికి ఆశ్రయం కల్పించింది చంద్రబాబు అని ఆయనకు స్పష్టంగా తెలుసు. అలాంటిది 2003 అలిపిరి వద్ద చంద్రబాబుపై హత్యా ప్రయత్నం జరిగితే వెంటనే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చిచంద్రబాబును పరామర్శించాడు. అంతేకాదు, తిరుపతి గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై కూర్చుని నిరసన తెలియచేశాడు.సహృదయత, సచ్ఛీలత, సంస్కారం, క్షమాగుణం, కార్యదక్షత, పట్టుదల ఇవన్నీ ఆయనలోని అంతర్లీన గుణాలు. విమానం ఎక్క గలడు, అవసరమైతే రిక్షాలోనూ కూర్చోగలడు. అధికార దండాన్నే కాదు, కార్యకర్త చేతిజెండాను కూడా మోయగలడు. అందుకే 33 ఏళ్ల చిన్న వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. 1985 నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉప నాయకుడుగా ఉన్నాడు.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావును ఓ సందర్భంలో సెక్రటేరియట్ ముందు నడిరోడ్డులో నిలువరించాడు. ఆ ధైర్యం, ఆ తెగువ చూసి దేశమే ఆశ్చర్యపోయింది. చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకు గుత్తేదారుడనీ, జన క్షేమంకన్నా తన వారి క్షేమం గురించి ఆలోచిస్తాడనీ ఆనాడే గ్రహించాడు. ఆనాడు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ 9 మంది శాసన సభ్యులతో 9 రోజులు నిరాహార దీక్ష చేయించాడు.రాయలసీమ ప్రజలకు సాగునీరు, తాగునీరు అందాలనీ, కరువునేల సస్యశ్యామలం కావాలనీ ఎంతో తపించాడు. రాయల సీమకు ప్రధానంగా నీరు అందించేది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెనాల్. అప్పట్లో దాని సామర్థ్యం 1,105 క్యూసెక్కులు మాత్రమే. దాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలని పోరాటం చేసిన ముఖ్యుడు రాజశేఖర రెడ్డి. 1986లో లేపాక్షి నుండి 22 రోజులు పాదయాత్ర చేశాడు. ఈ పోతిరెడ్డిపాడు కోసం ఎం.వి. రమణా రెడ్డి, మైసూరా రెడ్డి, భూమన్, శ్రీధర్ ఇంకా అనేకమంది ఇతర నాయకులు ఆయనను అనుసరించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరు వాతనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 43 వేల క్యూసెక్కులకుపెంచాడు. నేడు రాయలసీమ మీద కపట ప్రేమ ఒలకబోస్తున్నచంద్రబాబు ఆనాడు ఈ పెంచడాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. అందరివాడునిస్సత్తువతో కుళ్లి కునారిల్లిన కాంగ్రెస్ పార్టీని ఆయన ఒక్కడే భుజం మీదికి ఎత్తుకున్నాడు. తన పోరాట పటిమతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోశాడు. తాను నాయకుడిననీ, అధికారంలో ఉన్నాననీ ఏనాడూ భావించలేదు. కడప జిల్లాలోని ఓ మారుమూల పంచా యితీ ఎన్నికలలో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న తన అనుచరునికి ఇబ్బంది కలిగింది. రిగ్గింగ్ ద్వారా అతడిని ఓడించాలని ప్రత్యర్థులు ప్రయత్నించారు. అది తెలిసిన రాజశేఖర రెడ్డి స్వయంగా వెళ్ళి ఎన్నికల బూత్లో ఏజెంటుగా కూర్చున్నాడు. సింహం ఎదురుగాఉంటే చిట్టెలుకల సమూహాలు ఏం చేస్తాయి! తన వారిని కాపాడు కోవటానికి ఆయన ‘సిరికిం జెప్పడు, శంఖ చక్ర యుగముం జేదోయి సంధింప’ అన్నట్లు దిగివస్తాడు.తానే ఎదగాలని ఆయన ఎన్నడూ అనుకోలేదు. తన వారి చేయిని ఎన్నడూ వదలలేదు. తనను నమ్మినవారిని, వెంట ఉన్న వారిని అందరినీ భుజాలమీద ఎత్తుకుని ఉన్నత స్థానాల్లో కూర్చో బెట్టాడు. నాతోపాటు ఉండవల్లి అరుణ్కుమార్, బొత్స సత్యనారా యణ, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, అంబటి రాంబాబు, జక్కంపూడి రామ్మోహనరావు, కోమటిరెడ్డివెంకటరెడ్డి, దానం నాగేందర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మా రెడ్డి, ఉదయభాను, వట్టి వసంతకుమార్, రఘువీరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సబితా ఇంద్రారెడ్డి – ఇలా ఇంకాఎందరినో ఎదిగేలా చేశాడు. ఎదుగుతూ వుంటే మురిసిపోయాడు.తనకు అపకారం చేసిన వారిని, తాను ఓడిపోవాలి అని కోరు కున్న వారికి కూడా సహాయం చేశాడు. రాజకీయ ప్రత్యర్థులను ఓడించాలనుకున్నాడు తప్ప, వారి నాశనం కోరుకోలేదు. ‘పగవారు శరణు జొచ్చిన – మగ తనములు నెరుప, తగునె మగవారలకున్’ అని మహాకవి పోతన అన్నట్లు పగవాడిని కూడా ప్రేమించిన మగవాడు వైఎస్. అలాంటి నాయకుడు ‘న భూతో న భవిష్యతి’.2003 – రాష్ట్ర రాజకీయాలలో పెద్ద మలుపు, చరిత్రలో ఓ కుదుపు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవాలని, కష్టసుఖాలుతెలుసుకోవాలని పాదయాత్రకు నడుము కట్టాడు. నిలువునా కాల్చే స్తున్న 50 డిగ్రీల ఎండ, వేడిగాలులు, ఏమాత్రం సహకరించని వాతా వరణం. అయినా సరే కదిలాడు, పేదల కన్నీళ్లను చదవటానికి. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 67 రోజులు 1,673 కిలోమీటర్లు అవిశ్రాంతంగా, మధ్యలో ఆరోగ్యం క్షీణించినా పట్టుదలతో నడిచాడు. ఎన్నో అనుభవాలు, ఎన్నో వినతులు, ఎన్నో వేదనలు విన్నాడు. నీళ్లు, కన్నీళ్లు ఎండిన ప్రాంతాలు చూశాడు.నడిచే చరిత్ర!2004లో అఖండ మెజారిటీతో ఆయనను గెలిపించుకున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు రహస్యం అందరికీ తెలుసు, జనం గెలిపించింది రాజన్నను అని. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణం చేసిన క్షణం నేను ఆయన పక్కనే ఉన్నాను. ఆయనలో ఏదో మార్పు గమ నించాను. అధికారంలోకి వస్తే అహంకారం తలకెక్కుతుంది చాలా మందికి. కానీ వైఎస్ ముఖంలో అది లేదు. దైవదర్శనం లభించిన మహర్షి ముఖంలోని ప్రశాంతత, పరిపక్వత కనిపించాయి.ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచన, నమ్మిన ప్రజలకు అన్నీ తాను కావాలన్న అభిలాష. ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ లాంటి పథకా లను రూపకల్పన చేశాడు, జలయజ్ఞం చేశాడు. పేరుకే ప్రారంభమై ఆగిపోయిన ఎన్నో ప్రాజెక్టులను పరుగెత్తించాడు. ఆయన అందలం ఎక్కినందువల్లనేమో వరుణ దేవుడు ఆనందపడి కావాల్సినన్ని వర్షాలు కురిపించాడు. రైతుల్లో ఆనందం, రాష్ట్రంలో ఆనందం.ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రతి పని ఓ చరిత్ర. ఎన్నోసంవత్సరాలుగా రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్య నక్సలిజం. ఎప్పుడూ ఎక్కడో ఒకచోట కాల్పులు, మరణాలు. మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, పౌర హక్కుల నేతలు చేసిన విజ్ఞప్తిని ఆయన విన్నారు. నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున ఏర్పాటైన సంఘంలో ఇతర పెద్దలతో పాటు నేనూ ఒక సభ్యుడిని. అధికారంతో కాల్చి చంపడం కాదు, అనురాగంతో నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకువద్దాం అని ఆయన కోరుకున్నాడు.2009 ఎన్నికలలో అధిష్టానం భయపడింది ఏమవుతుందోనని. వారికి భరోసా ఇచ్చి ఒంటి చేత్తో తిరిగి అధికారంలోకి వచ్చాడు. ప్రజల పట్ల ఆయన నమ్మకం అది. ప్రజలకు ఆయన చేసిన మేలు పట్ల ఉన్న విశ్వాసం అది. అంత గొప్పవ్యక్తి సాహచర్య, స్నేహం, ఆత్మీయత, అభిమానం నాకు లభించాయి అంటే అది నా అదృష్టం. ఆయన చిరునవ్వు నా ఆస్తి. నా భుజం మీద ఆయన చేయి వేసి ‘కర్ణా’ అని పిలవడమే నా ధైర్యం. ఆయన గురించి ఎంత చెప్పినా నాకుఇంకా ఏదో మిగిలే ఉంటుంది. మంచితనం కలకాలం నిలిచిఉంటుంది అన్న అక్షరాలకు ఆయన మూలధనం. మానవుల కన్నీరు మాన్పగా కదిలిన ఆ మహా మనిషికి నేడు జన్మదినం.-వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్-భూమన కరుణాకర రెడ్డి -
పుట్టినరోజు సందేశంలో.. దలైలామా నోటి వెంట ఘన భారతం
న్యూఢిల్లీ: నేడు(జూలై 6) ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనను అనుసరించే టిబెటన్ కమ్యూనిటీలకు చెందినవారు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిని అభినందిస్తూ, దలైలామా ఒక సందేశాన్ని అందించారు.దలైలామా మాటల్లో..‘నేను ఒక సాధారణ బౌద్ధ సన్యాసిని. నేను సాధారణంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనను. అయితే మీరంతా నా పుట్టినరోజును దృష్టిలో ఉంచుకుని, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున, నేను కొన్ని ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.. మనిషి తన భౌతిక అభివృద్ధి కోసం పనిచేయడం ముఖ్యమే! అయినప్పటికీ, సత్ హృదయాన్ని పెంపొందించుకోవడం ద్వారా, ప్రియమైన వారితోనే కాకుండా అందరితో ప్రేమగా ప్రవర్తిస్తూ, ప్రతి ఒక్కరి పట్ల కరుణ చూపడం ద్వారా మనశ్శాంతిని సాధించడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. తద్వారా మనమంతా ప్రపంచాన్ని మరింత మెరుగైన శాంతియుత ప్రదేశంగా మార్చడానికి అవకాశం కలుగుతుంది. 90th Birthday MessageOn the occasion of my 90th birthday, I understand that well-wishers and friends in many places, including Tibetan communities, are gathering for celebrations. I particularly appreciate the fact that many of you are using the occasion to engage in… pic.twitter.com/bfWjAZ18BO— Dalai Lama (@DalaiLama) July 5, 2025ఇక నా విషయానికొస్తే, మానవతా విలువలను, మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, మనస్సు, భావోద్వేగాల పనితీరును వివరించే ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి తెలియజేయడం, మనశ్శాంతి, కరుణ మొదలైన అంశాలను వివరించడంపై నిబద్ధత కలిగివున్నాను. అలాగే టిబెటన్ సంస్కృతి, వారసత్వంపై దృష్టి పెట్టడాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాను. బుద్ధుని బోధనలు, ప్రపంచశాంతి సందేశంతోపాటు భారతీయ గురువులు అందించిన విలువలతో నా దైనందిన జీవితంలో నేను దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని పెంపొందించుకుంటాను. అంతరిక్షం ఉన్నంత వరకు, జీవాత్మ ఉన్నంత వరకు, ప్రపంచంలోని దుఃఖాన్ని తొలగించాలనే కట్టుబాటుతో ఉంటాను. మనశ్శాంతి, కరుణను పొందించుకునేందుకు నా పుట్టినరోజును ఒక అవకాశంగా స్వీకరిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని దలైలామా తన పుట్టినరోజు సందేశంలో పేర్కొన్నారు. -
ప్రియాంక బర్త్డే.. కాలి చెప్పుపై కేక్.. 'తిండితో ఆటలా?'
ఏ డైలాగ్స్ చెప్పకుండా, కేవలం హావభావాలతోనే ఎమోషన్స్ పలికించడం చాలా కష్టం. అయినా సరే అదెంత పని అన్నట్లుగా కళ్లతోనే నటించేసింది ప్రియాంక జైన్ (Priyanka M Jain). మౌనరాగం సీరియల్తో బోలెడంత పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాదు, ఈ సీరియల్ హీరో శివకుమార్తో ఆఫ్స్క్రీన్లోనూ ప్రేమాయణం నడిపింది. 2018లో ఈ సీరియల్ రాగా.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో అన్యోన్యంగా కలిసుంటున్నారీ లవ్ బర్డ్స్. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. బిగ్బాస్ షోతో పాపులర్జానకలి కలగనలేదు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ప్రియాంక.. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్తో అందరికీ సుపరిచితురాలైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టీవీ షోలలో కనిపిస్తోంది. తాజాగా పరి (శివకుమార్ ప్రియాంకను ముద్దుగా పిల్చుకునే పేరు) 27వ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీ అభిమానం వల్లే..ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీరే కారణం. అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు చప్పట్లు కొట్టి తీరాల్సిందే! మీరు నన్ను ఎంతగానో నమ్మారు. నేను పోషించిన ప్రతి పాత్రకు, తీసుకున్న ప్రతి నిర్ణయాలకు మీ ఆశీర్వాదాలే కారణం. నా ప్రయాణంలో భాగమైనందుకు థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఓ ఫోటో తన కాలి చెప్పుపై బర్త్డే కేక్ను పెట్టింది. తర్వాత అదే కేక్ను ఆరగించింది. తిండితో ఆటలా?ఇది చూసిన సెలబ్రిటీలు.. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం.. తినే ఆహారాన్ని అలా కాళ్లపై పెట్టి కించపరిస్తే తిండి దొరకదు, ఎంత వయసు వస్తే ఏంటి? సంస్కారం ఉండొద్దా? అన్నం కూడా అలాగే చెప్పులతో తింటావా? తిండితో ఆటలొద్దు, తినేదాన్ని కాలుమీద పెట్టినందుకు సిగ్గనిపించట్లేదా? అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు మాత్రం బ్యూటిఫుల్ పరికి హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్తున్నారు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
చిరకాల స్నేహితుల బర్త్డే పార్టీలో తమన్నా (ఫోటోలు)
-
చిరంజీవి బర్త్డే స్పెషల్.. 19 ఏళ్ల తర్వాత అవార్డ్ సినిమా రీరిలీజ్
చిరంజీవి- త్రిష కలిసి నటించిన ‘స్టాలిన్’ సినిమా రీరిలీజ్ కానుంది. 2006లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఖుష్బూ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, ప్రదీప్ రావత్ వంటి స్టార్స్ నటించారు. ఉత్తమ సందేశాత్మక చిత్రంగా (స్పెషల్ జ్యూరీ అవార్డు) నంది పురస్కారం కూడా స్టాలిన్ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీని చిరు సోదరుడు నాగబాబు నిర్మించగా గీతా ఆర్ట్స్ పంపిణీ చేసింది. ప్రస్తుతం స్టాలిన్ ఏకంగా మూడు (ఆహా, అమెజాన్, జియోహాట్స్టార్) ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ అనుష్క కూడా ఒక స్పెషల్ సాంగ్లో సందడి చేసింది.ఆగష్టు 22న మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా స్టాలిన్ చిత్రాన్ని 4K వర్షన్లో విడుదల చేయబోతున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ స్వామి నాయుడు ఒక పోస్టర్ను తాజాగా లాంచ్ చేశారు. ఈ సినిమా చాలామంది యూత్ను ఆలోచించేలా చేసిందని చెప్పవచ్చు. సుమారు 19 ఏళ్ల తర్వాత స్టాలిన్ రీరిలీజ్ కానున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మళ్లీ త్రిష- చిరు కలిసి విశ్వంభరలో నటిస్తున్న విషయం తెలిసిందే. -
ఆరేళ్లపాటు డేటింగ్.. మాజీ ప్రియుడిని మరవలేకపోతున్న బ్యూటీ!
బాలీవుడ్ భామ మలైకా అరోరా పేరు చెప్పగానే ఐటమ్ సాంగ్సే గుర్తొస్తాయి. ఆ తర్వాత ఆమె డేటింగ్ వ్యవహారం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఈమె.. దాదాపు 19 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్తో ప్రేమాయణం నడిపించింది. అయితే వీరి ప్రేమబంధం ఎక్కువ రోజులు నిలవలేదు. దాదాపు ఆరేళ్ల డేటింగ్ అనంతరం బ్రేకప్ చెప్పేసుకుని అభిమానులకు షాకిచ్చారు. అయితే కొన్నినెలల క్రితం ఐపీఎల్ మ్యాచ్లో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర పక్కన మలైకా కనిపించడంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా? అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే దీనిపై ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా తన మాజీ భాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ బర్త్ డే కావడంతో విషెస్ తెలిపింది ముద్దుగుమ్మ. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్డే, అర్జున్ కపూర్' మాజీ ప్రియుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న మలైకా అరోరా మాజీ లవర్కు విషెస్ చెప్పడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అయితే గతేడాది బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట మాత్రం సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా.. అర్జున్ కపూర్ ఇటీవలే తెరపైకి వచ్చిన 'మేరే హస్బెండ్ కి బివి' అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం 'నో ఎంట్రీ 2' అనే మూవీలో నటించనున్నారు. -
ఈ ఫోటోలోని చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్... ఎవరో గుర్తుపట్టారా?
ఎంత స్టార్ హీరోయిన్లు అయినా ఏదో ఒక సందర్భంలో అదే రేంజ్ ఛాన్స్లు రావడం అంటే కాస్తా కష్టమే. అలాంటి వారి జాబితాలో ఈ హీరోయిన్ పేరు కచ్చితంగా ఉంటుంది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్ నుంచి ఐటమ్ సాంగ్స్ మాత్రమే చేసుకునే స్థాయికి వచ్చేసింది. అప్పుడప్పుడు ఒకటి, రెండు సినిమా ఛాన్సులు వచ్చిన అవీ కూడా పెద్దగా వర్కవుట్ కావడం లేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన మెప్పించిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.మిల్కీ బ్యూటీగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తమన్నా.. తెలుగులో స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఆ తర్వాత అవకాశాల్లేక బాలీవుడ్కు మారిపోయింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపిన తమన్నా.. ప్రస్తుతం హీరోయిన్గా మాత్రం ఛాన్స్లు రావట్లేదు. గతేడాది రజినీకాంత్ జైలర్, స్త్రీ-2 చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్లో మెరిసింది మిల్కీ బ్యూటీ. ఇక ఈ ఏడాదిలో ఓదెల-2 మూవీతో ప్రేక్షకులను అలరించింది.అయితే తాజాగా తన సోదరుడి బర్త్ డే సందర్భంగా చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసింది. బాల్యంలో తన సోదరుడితో సంతోషంగా జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా సోదరుడు ఆనంద్ భాటియాకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. అందులోనూ చాలా క్యూట్గా ఉన్న తమన్నాను చూసి ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ చిన్నప్పటి ఫోటో చూసిన వారు తమన్నా సో క్యూట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
బర్త్ డే వెకేషన్.. ఫ్యామిలీతో కలిసి కాజల్ ఎంజాయ్ (ఫొటోలు)
-
బర్త్ డే స్పెషల్.. 'జన నాయగణ్' వీడియో రిలీజ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా అతడి చివరి సినిమా నుంచి సర్ప్రైజ్ వచ్చింది. అర్థరాత్రి 12 గంటలకు ఫస్ట్ రోర్ పేరిట 'జన నాయగణ్' నుంచి వీడియో రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ పోలీస్గా కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియోకు ఇతడి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎప్పటిలానే అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు!)బయటకు చెప్పలేదు గానీ 'జన నాయగణ్' సినిమా 'భగవంత్ కేసరి' అనే తెలుగు సినిమాకు రీమేక్. గతంలో పలు అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు పోలీస్ గెటప్లో ఉన్న వీడియో రిలీజ్ చేయడంతో కొంతవరకు క్లారిటీ వచ్చేసింది. ఇక ట్రైలర్, మిగతా కంటెంట్ వస్తే గనుక రీమేక్ కాదా అనేది కన్ఫర్మ్ అయిపోతుంది.హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె షూటింగ్ రీసెంట్గానే పూర్తయింది. మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే రాజకీయాల్లకి అడుగుపెట్టిన విజయ్కి ఇదే చివరి చిత్రం కావడంతో అటు అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు) -
అమ్మ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్!
గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీతో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో రానున్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కనిపించనుంది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.అయితే తాజాగా ఇవాళ తన తల్లి బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ స్పెషల్ ఫోటోను పంచుకున్నారు. అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మామ్ అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం నిర్మలమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.అవార్డుల అల్లు అర్జున్..పుష్ప-2 సినిమాకు గానూ 'అల్లు అర్జున్' ఉత్తమ నటుడిగా 'గద్దర్' అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని చరిత్ర పుటల్లోకి అల్లు అర్జున్ పేరు చేరింది. అదే విధంగా 69వ జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటింది. అక్కడ కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప) నిలిచారు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. కాగా.. బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 21.. అయితే ఉత్తమ నటుడిగా 11సార్లు నామినేట్ అయ్యాడు. ఏడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా అత్యుత్తమ అవార్డ్స్ అందుకున్నాడు. మొత్తంగా దేశంలో పేరు పొందిన 18 అవార్డ్స్ను ఆయన సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
చిన్నారుల పాటకు రాష్ట్రపతి ముర్ము కంటతడి
న్యూఢిల్లీ: చిన్నారుల పాట విని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కరిగిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ముర్ము శుక్రవారం 67వ బర్త్డే జరుపుకున్నారు. డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్కు వెళ్లిన ఆమెకు చిన్నారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అంధులైన చిన్నారులు రాష్ట్రపతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పాట ఆలపించారు. ‘ఈ రోజులు మళ్లీ మళ్లీ రావాలి, నా హృదయం మళ్లీ మళ్లీ పాడాలి, మీరు వెయ్యేళ్లు జీవించాలి, ఇదే నా కోరిక, హ్యాపీ బర్త్ డే టూ యూ.. (బార్ బార్ దిన్ ఏ ఆయే, బార్ బార్ దిల్ యే గాయే, తు జియో హజారోం సాల్, యే మేరీ హై ఆర్జూ...)అంటూ సాగిన పాట విని ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయారు. ‘వాళ్లెంతో అందంగా, హృద్యంగా పాడారు. నేనెంతో ఉద్వేగానికి లోనయ్యా. వారి పాటవిని సంతోషంతో ఉప్పొంగిపోయా. నా కళ్ల వెంట నీళ్లు ఆగకుండా వచ్చేస్తూనే ఉన్నాయి’అని ఆమె పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి ముర్ముకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రశంసించారు. ఒడిశాలోని మయూర్భంజ్లో 1958 జూన్ 20వ తేదీన ముర్ము జన్మించారు. దేశానికి 15వ రాష్ట్రపతిగా 2022 జూలై 25న బాధ్యతలు చేపట్టారు. -
హీరోయిన్ శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వారం రోజులుగా షూట్లో ఉన్నా.. ఆ పార్టీ గురించే తెల్వదు: రచ్చ రవి
టాలీవుడ్ నటుడు, కమెడియన్ రచ్చ రవి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మంగ్లీ బర్త్ డే పార్టీకి తాను వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో నువ్వు వైరలవుతున్నావని చాలామంది నాకు ఫోన్ చేశారని అన్నారు. నేను ప్రస్తుతం నా షూట్లతో బిజీగా ఉన్నానని తెలిపారు.బర్త్ డే పార్టీలో రచ్చరవి అని ఉన్నారని మీరంతా అనుకుంటున్నారు.. కానీ ఇండస్ట్రీలో నేనొక్కడినే రచ్చరవి అని.. అక్కడున్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు. ఆ పార్టీ గురించి కూడా నాకు తెల్వదు.. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈ విషయం చెప్పాలనుకున్నా.. అందుకోసమే దయచేసి అర్థం చేసుకోండి.. అపార్థం చేసుకోవద్దని రచ్చరవి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. నేను తాగను... తాగబోను... నాకు తెలవదు దయచేసి అర్ధం చేసుకోండి.. అంటూ రాసుకొచ్చారు. కాగా.. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులు ఉన్నారని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే రచ్చరవి క్లారిటీ ఇచ్చారు.కాగా.. ఇవాళ ఉదయం టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer Mangli) బర్త్డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్ డే సందర్భంగా మంగ్లీ నిన్న(జూన్ 10)హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రిసార్ట్పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi) -
Lalu: అట్లుంటది మరి లాలూతోని!
పాట్నా: తాను చేసే ఏ పనిలోనైనా వైవిధ్యం వెతుక్కునే వ్యక్తి ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. ఆయనకు తగ్గట్లే ఆయన అభిమాన గణం ఉంటుంది కూడా!. ఇవాళ 78వ పుట్టిరోజు. కార్యకర్తల కోలాహలం.. లాలూ యాదవ్ జిందాబాద్ నినాదాల నడుమ తన నివాసంలో 78 కేజీల లడ్డూను తల్వార్తో కోశారాయన.లాలూ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్జేడీ చీఫ్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తమది రాజకీయేతర సంబంధం కూడా అని పేర్కొన్నారు. Video | RJD chief Lalu Prasad Yadav celebrates 78th birthday at his residence in Patna by cutting a 78-kg laddu cake with a sword. Large number of party workers gathered to extend wishes. pic.twitter.com/1ZIhrQuv9g— NDTV (@ndtv) June 11, 2025VIDEO Source: NDTVమరోవైపు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వైవిధ్యంగా శుభాకాంక్షలు తెలియజేశారు. లాలూ చిత్రాన్ని కౌగిలించుకుని ‘‘రాత్రి చిమ్మచీకట్లు అలుముకున్నాయంటే.. కాసేపట్లో తెల్లవారబోతోందని అర్థం’’ అంటూ ఓ సందేశం ఉంచారు. “अंधेरा जितना गहरा होगा, सुबह उतनी ही नजदीक होगी।” #TejPratapYadav #Bihar #India pic.twitter.com/gAdlvZFtlb— Tej Pratap Yadav (@TejYadav14) June 9, 2025తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ తేజ్ ప్రతాప్ ఓ యువతితో ఉన్న ఓ పోస్ట్ చేసి పెను దుమారం రేపారు. పార్టీ ఆయనపై క్రమశిక్షణా చర్యల కింద ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. అయితే తన అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ ఆయన ఇచ్చుకున్న వివరణలను లాలూ పరిగణనలోకి తీసుకోలేదు. -
'చిన్ననాటి కల నెరవేరింది.. అత్తారింటికి దారేది నటుడు పోస్ట్'!
అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న స్టార్ నటుడు బోమన్ ఇరానీ. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కొత్త ఏడాదిలో ది మెహతా బాయ్స్ సినిమాతో డైరెక్టర్గా మారిన ఆయన.. తాజాగా నటిస్తోన్న చిత్రం 'తన్వి ది గ్రేట్'. అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఆయన కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో నటి శుభంగి దత్ టైటిల్ రోల్లో నటించింది. ఈ చిత్రాన్ని ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 18న థియేటర్లో సందడి చేయనుంది.ఇక బోమన్ ఇరానీ సినిమాల సంగతి పక్కనపడితే.. ఆయన వ్యక్తిగతంగానూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా తన చిన్ననాటి కల నేరిందని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ప్రత్యేక పుట్టినరోజున నా కలను సాకారం చేసిన తన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెంచ్ ఓపెన్ చూడాలనుకున్న తన కలను నేరవేర్చినందుకు తన భార్య జెనోబియా, కుమారులు దనేశ్, కయోజ్ ఇరానీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సర్ప్రైజ్ను వారంతా కలిసి తన పుట్టినరోజుకు ప్లాన్ చేసి మరి బహుమతిగా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Boman Irani (@boman_irani) -
వెండితెరపై మెప్పించిన అందాల ఊర్వశి రంభ.. ఆమె అసలు పేరేంటో తెలుసా? (ఫొటోలు)
-
బాయ్ఫ్రెండ్ బర్త్ డే వేడుకల్లో జాన్వీకపూర్ సిస్టర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ తన ప్రియుడి బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. బాలీవుడ్ నటుడు వేదాంగ్ రైనాతో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ జూన్ 2న అతని పుట్టినరోజును కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలను వీరి స్నేహితురాలు కరీమా బారీ ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ బర్త్ డే పార్టీలో అనురాగ్ కశ్యప్ కుమార్తె, యూట్యూబర్ ఆలియా కశ్యప్ కూడా పాల్గొన్నారు.కాగా.. వేదాంగ్ రైనా రెండేళ్ల క్రితం ది ఆర్చీస్ (2023)తో హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గతేడాది ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన జిగ్రా (2024) మూవీలో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె తమ్ముడిగా ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వేదాంగ్ రైనా తన రాబోయే చిత్రంలో అనన్య పాండేతో స్క్రీన్ను పంచుకోనున్నారు. -
ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు (ఫోటోలు)
-
నాగచైతన్య కౌగిలిలో శోభిత.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
-
భర్త బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)
-
అమ్మ బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్ లయ.. ఫోటోలు
-
ట్రంప్ గారి మనవరాలు... మస్తు హుషార్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. తన గోల్ఫ్ ఆటకు సంబంధించిన ఫోటోలు, వైట్హౌజ్లో తాతతో గడిపిన ఫోటోలు ఇందులో ఉన్నాయి. ‘17... నువ్వు నాకు జీవితం గురించి ఎంతో చె΄్పావు. 18... నువ్వు కూడా అలాగే చేస్తావని ఆశిస్తున్నాను’ అని తన పోస్ట్లో రాసింది కై ట్రంప్.‘లాస్ట్ డే బీయింగ్ 17’ కాప్షన్తో పోస్ట్ చేసిన వీడియోలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది కై. తాత కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆకట్టుకునే ఉపన్యాసాలు ఇచ్చింది. రాజకీయ ఉపన్యాసాల సంగతి ఎలా ఉన్నా గోల్ఫ్ ఆటలో చక్కని ప్రతిభ చూపుతోంది. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే ‘సోషల్ మీడియా సెన్సేషన్’ అయింది. -
'ఇది చాలా ప్రత్యేకం.. నా అభిమానులకు అంకితమిస్తున్నా': మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న తాజా చిత్రం వృషభ. ఎంపురాన్-2, తుడురుమ్ సూపర్ హిట్స్ తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. యోధుడి లుక్లో ఉన్న పోస్టర్ మోహన్ లాల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెద్ద కత్తిని చేతిలో పట్టుకుని కనిపిస్తోన్న ఈ పోస్టర్ చూస్తుంటే పౌరాణిక చిత్రంగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని మోహన్ లాల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'ఇది చాలా ప్రత్యేకమైనది.. నా అభిమానులందరికీ దీన్ని అంకితం చేస్తున్నా.. మీ నిరీక్షణ ఇక్కడితో ముగుస్తుంది. తుఫాను మేల్కోనుంది. గర్వం, శక్తితో వృషభ ఫస్ట్ లుక్ను ఆవిష్కరిస్తున్నా. ఇది మీ ఆత్మను మండించే కథగా కాలక్రమేణా ప్రతిధ్వనిస్తుంది. నా పుట్టినరోజున ఈ పోస్టర్ ఆవిష్కరించడం మరింత అర్థవంతంగా ఉండనుంది. మీ ప్రేమ ఎల్లప్పుడూ నాకు గొప్ప బలం' అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమాను అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మోహన్ లాల్ వెల్లడించారు. This one is special — dedicating it to all my fans.The wait ends. The storm awakens.With pride and power, I unveil the first look of VRUSSHABHA – a tale that will ignite your souland echo through time.Unveiling this on my birthday makes it all the more meaningful - your love… pic.twitter.com/vBl1atqY3Z— Mohanlal (@Mohanlal) May 21, 2025 -
మోహన్ లాల్ బర్త్ డే.. అలాంటి పిల్లల కోసం కీలక నిర్ణయం!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ రోజుతో 65 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మలయాళంలో మాత్రమే కాదు.. టాలీవుడ్లోనూ ఫ్యాన్స్ను సొంతం చేసుకున్న హీరో మోహన్ లాల్ ప్రస్తుతం కన్నప్ప మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఆయన బర్త్ డే కావడంతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టాలీవుడ్ హీరో మంచు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. సూపర్ స్టార్ మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, నివిన్ పౌలీ, నిర్మాత ఆంటోనీ సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మే 21, 1960న జన్మించిన మోహన్లాల్ నాలుగు దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 400 కి పైగా చిత్రాలలో నటించారు. ఐదుసార్లు జాతీయ అవార్డు పొందిన మోహన్లాల్కు 2019లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ను ప్రదానం చేసింది.తాజాగా ఇవాళ తన బర్త్డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రెండు గొప్ప కార్యక్రమాలను ప్రకటించారు. బేబీ మెమోరియల్ హాస్పిటల్తో కలిసి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అర్హులైన పిల్లలకు తక్కువ ధరకే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. కేరళలో చాలా మంది పిల్లలు కాలేయ వ్యాధులతో బాధపడుతున్నారని.. వారికి కాలేయ మార్పిడి అవసరమని తెలిపారు. ఈ ప్రకటనతో అలాంటి కుటుంబాలకు సహాయం చేయడమే లక్ష్యమని మోహన్ లాల్ అన్నారు. అంతేకాకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'బి ఎ హీరో' అనే పేరుతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కాగా.. 2015లో మోహన్లాల్ విశ్వశాంతి ఫౌండేషన్ స్థాపించారు. పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. -
మోహన్ లాల్ బర్త్డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
తమ్ముడి బర్త్ డే.. వెరైటీగా విషెస్ చెప్పిన మంచు లక్ష్మీ!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో అభిమానుల ముందుకు రానున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో ఫ్యాన్స్తో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయనకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా ఇప్పటి వరకు మంచు విష్ణు కానీ, మోహన్ బాబు కానీ మనోజ్కు విష్ చేయలేదు.కానీ మంచు మనోజ్ అంటే అక్క మంచు లక్ష్మీకి విపరీతమైన ప్రేమ. గతంలో తానే పక్కనుండి మనోజ్- మౌనికల పెళ్లిని జరిపించింది. ఇవాళ తమ్ముడి పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. భైరవం మూవీలోని ధమ్ ధమారే అంటూ సాగే పాటకు పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ.. అందరికంటే కాస్తా వెరైటీగా విష్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ కావడంతో సూపర్బ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియో చూసిన మంచు మనోజ్ ఫుల్ ఖుషీ అయ్యారు. లవ్ సింబల్స్తో వీడియోకు రిప్లై కూడా ఇచ్చారు. థ్యాంక్యూ యూ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా.. మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ ఈనెల 30న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మలయాళ సూపర్ స్టార్ బర్త్ డే.. జాక్ ఫ్రూట్తో ప్రేమ చాటుకున్న అభిమాని!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాలీవుడ్లో మాత్రమే కాదు.. టాలీవుడ్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఓ అభిమాని ఆయనపై ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. ఈనెల 21న మోహన్ లాల్ పుట్టినరోజు కావడంతో ఒక రోజు ముందుగానే ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. జాక్ ఫ్రూట్స్తో ఆయన చిత్రపటాన్ని రూపొందించాడు.జాక్ ఫ్రూట్ భాగాలను ఉపయోగించి డా విన్సీ సురేశ్ అనే ఆర్టిస్ట్ మోహన్ లాల్ చిత్రపటాన్ని రూపొందించాడు. దాదాపు 65 రకాల జాక్ ఫ్రూట్లతో ఈ చిత్రపటాన్ని తయారు చేశారు. ఆకుపచ్చ, పసుపు, నారింజ షేడ్స్ లో జాక్ ఫ్రూట్ ఆకులతో మోహన్ లాల్ ఫోటోను అలంకరించారు. ఈ చిత్రపటాన్ని త్రిస్సూర్ వేలూర్లోని ఆయుర్ జాక్ ఫ్రూట్ ఫామ్లో రూపొందించారు. దాదాపు ఎనిమిది అడుగుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తుతో ఈ చిత్రపటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీని కోసం దాదాపు ఐదు గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది.కాగా.. ఈ ఏడాది మోహన్ లాల్ ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మోహన్ లాల్, శోభన జంటగా తుడురుమ్ అనే మూవీ కూడా విడుదలైంది. ఈ సినిమాకు సైతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. -
మంచు మనోజ్ బర్త్ డే.. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన హీరో
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన 42వ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన పిల్లలతో కలిసి ఈ పుట్టినరోజును ఆస్వాదించారు. కాగా.. మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య మౌనిక ఇప్పటికే శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. తన భర్త ప్రేమను తలచుకుంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.కాగా.. మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చాలా రోజుల విరామం తర్వాత బిగ్ స్క్రీన్పై మంచు మనోజ్ సందడి చేయనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మే 30న ప్రేక్షకుల థియేటర్లలో సందడి చేయనుంది. #TFNExclusive: Some lovely visuals of Rocking Star @HeroManoj1 celebrating his birthday with his kids and fans!!😍📸#ManchuManoj #Bhairavam #TeluguFilmNagar pic.twitter.com/bgEMWTV8Sp— Telugu FilmNagar (@telugufilmnagar) May 20, 2025 -
మరో జన్మ ఉంటే నువ్వే నా భర్తగా రావాలని కోరుకుంటా: మంచు మనోజ్ భార్య ఎమోషనల్ పోస్ట్
చాలా రోజుల విరామం తర్వాత మంచు మనోజ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భైరవం. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్తో యూట్యూబ్లో దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇటీవల ట్రైలర్ ఈవెంట్లో సందడి చేసిన మంచు మనోజ్ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య భూమా మౌనిక తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు మనోజ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.మౌనిక తన ఇన్స్టాలో రాస్తూ..'నేను ప్రేమించే నా సోల్మేట్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా జీవితాల్లో వచ్చి.. మీ జీవిత ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఈ ప్రపంచాన్ని మధురమైన ప్రదేశంగా మార్చారు. మీ చేయబోయే అన్ని మంచి పనులను బాగా జరగాలి. మీ ప్రేమ, ఆనందాన్ని పంచడానికి మీ హృదయం వెయ్యేళ్లు బతకాలి. ఈ ఏడాది మాత్రమే అన్ని సంవత్సరాలు మీరు గొప్పగా ఉండాలి. మేము నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాం.. మీరు జీవితం మరింత ఎదగాలని కోరుకుంటున్నాం. మా ముగ్గురి ప్రేమ మీ కోసం మాత్రమే. మీరు నిజంగా మా రాకింగ్ స్టార్. ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రతి పునర్జన్మలో నా స్నేహితుడిగా, భర్తగా మిమ్మల్నే ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Mounika Bhuma Manchu (@mounikabhumamanchu) -
ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం.. అందుకే ఆల్రౌండర్ అయ్యాడు
జూనియర్ ఎన్టీఆర్కు ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంశ ఈ తారకరాముడు. నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు.. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్కు తారక్ ఒక ఐకాన్ అని చెప్పవచ్చు. బాల నటుడిగా తెరంగేట్రం చేసి, నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్లను దాటుకుంటూ విరుచుకపడ్డాడు. ఇండస్ట్రీలో అందరూ తారక్ను ఆల్రౌండర్ అంటారు.. దానికి కారణం భారీ డైలాగ్స్, కళ్లు చెదిరే డ్యాన్స్, దుమ్మురేపే యాక్షన్ సీన్స్, కంటతడి పెట్టించే నటన ఇలా అన్నింటిలోనూ ఆయన అగ్రగామి. క్లాస్, మాస్ అంటూ తేడా ఉండదు. సినీ అభిమానులు అందరూ ఆయనకు ఫ్యాన్సే.. నటనలో తారక్ తర్వాతే ఎవరైనా.. అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చిత్రపరిశ్రమలో సెట్ చేశాడు. నేడు ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు (1983 మే 20).. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విషయాలపై ఓ లుక్కేద్దాం (Happy Birthday NTR)..తారక్ @ 'మ్యాన్ ఆఫ్ మాసెస్'ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్ స్టార్స్ ఉన్నారు కానీ యంగ్ టైగర్కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు 'మ్యాన్ ఆఫ్ మాసెస్'. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్తో తిరిగొచ్చాడు.తారక్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం🎥 తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.🎥 పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు.🎥ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.🎥 యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు.🎥 జపాన్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్కు ఎంపికైంది.🎥 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.🎥 నంబర్ 9 అంటే తారక్కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.🎥 మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్కు చాలా ఇష్టం.🎥 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్లో రెండు సార్లు నిలిచాడు.🎥 పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.🎥సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.🎥 2016లో వచ్చిన జనతా గ్యారేజ్తో కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డును IIFA నుంచి అందుకున్నాడు🎥కంత్రి, అదుర్స్,బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డులను అందకున్న తారక్🎥 బాల రామాయణము,ఆది నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందకున్నాడు 🎥తారక్కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట🎥 తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు.🎥 జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర అయనకున్న పేర్లు🎥అమ్మ (శాలనీ) చిరకాల కలను తీర్చిన తారక్.. ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేసుకోవాలనే ఆమె కోరికను కొడుకుగా తీర్చాడు. -
జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)
-
కాజల్ బర్త్డే స్పెషల్.. ఆ సినిమాతోనే స్టార్డమ్ (ఫొటోలు)
-
బర్త్డే స్పెషల్: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?
-
డ్యాన్సింగ్ క్వీన్ 'మాధురీ దీక్షిత్' బర్త్డే.. ఈ విషయాలు తెలుసా?
-
ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్.. జూనియర్ ఎన్టీఆర్కు రామ్ చరణ్ సర్ప్రైజ్.. అదేంటంటే?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా మెప్పించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్గా కనిపించింది. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్లో సందడి చేసింది. లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా స్క్రీనింగ్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఓకే వేదికపై మెరిశారు.ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కు రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా జూనియర్ బర్త్ డేకు పది రోజుల ముందే చెర్రీ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ చెంపపై ముద్దు కూడా పెట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్ చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఆదివారం ఆర్ఆర్ఆర్ మూవీని లండన్లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్ వేడుకలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లతో కలిసి సందడి చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత మొదటిసారి వేదికపైకి కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. కాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవ్గన్, అలియా భట్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో నటించారు. 2023లో 'నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. -
బర్త్ డే స్పెషల్.. సాయిపల్లవి గురించి ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)
-
బర్త్డే స్పెషల్.. విజయ్ దేవరకొండ గురించి 10 ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
-
భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?
-
బొమ్మను చూస్తే నీలా ఉంది! అమ్మాయికి సంబరమంట!
సాక్షి, వరంగల్: పుట్టినరోజు కోసం ప్రత్యేకమైన చాక్లెట్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఎవరైనా పుట్టినరోజు స్నేహితులకు చాక్లెట్లు ఇవ్వడం సాధారణమే. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? నిజంగానే ఈ చాక్లెట్లలో ప్రత్యేకత ఉంది. పుట్టినరోజు చేసుకుంటున్న వారి ఫొటోలను చాక్లెట్ కవర్పై ముద్రిస్తున్నారు. వాటిని స్నేహితులు, తోటి విద్యార్థులకు ఇస్తూ తెగ ఆనందపడుతున్నారు. ఇప్పుడు ఈ సంస్కృతి వరంగల్ నగరంలో రోజురోజుకూ విస్తరిస్తోంది. వీటిని ఇక్కడ తయారు చేస్తున్న సంస్థ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారి నుంచి ఆర్డర్ తీసుకుంటూ.. పిల్లలకు మరిచిపోలేని జ్ఞాపకాలను అందిస్తోంది. దీంతో పాఠశాల విద్యార్థులు తమ ఫొటోతో ముద్రించిన చాక్లెట్లు మిత్రులకు ఇస్తూ సంబర పడిపోతున్నారు. అందరికీ నచ్చేలా.. టేస్టీగా.. ఈ చాక్లెట్లు పిల్లల్నే కాదు.. పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి. కొబ్బరిపొడి, కొబ్బరి నూనె, తేనె కలిపి వివిధ పద్ధతుల్లో తయారు చేసే ఈ చాక్లెట్ల రుచికి అందరూ ఫిదా అవుతుండటంతో వీటికి మార్కెట్లో యమ డిమాండ్ పెరుగుతోంది. వరంగల్ కేంద్రంగా ప్రారంభమైన ఓరుగల్లు హోంమేడ్ చాక్లెట్ల (ఓరుగల్లు ఫొటోస్ ర్యాపర్ హోంమేడ్ చాక్లెట్లు) గురించి సామాజిక మాధ్యమాలు ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్న ప్రజలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. తమ పిల్లల పుట్టినరోజుల్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వెనుకాడడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ పట్టణాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని ఈ స్చంస్థ నిర్వాహకులు కరుణాకర్, సందీప్ చెబుతున్నారు.చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! మా అమ్మాయి సంబరపడిందిపరకాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మా కుమార్తె ఆరుషి ఒకటో తరగతి చదువుతోంది. ఓరుగల్లు హోంమేడ్ చాక్లెట్ల గురించి ఇన్స్ట్రాగామ్ ద్వారా తెలుసుకొని ఆర్డర్ ఇచ్చాం. పాప ఆరుషి ఫొటో చాక్లెట్ల కవర్పై ఉండటంతో తెగ సంబరపడిపోయింది. వారి పాఠశాలల్లోని ఇతర పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ చాక్లెట్ల గురించి వాకబు చేశారు. – డి.రవళి, పరకాల -
పూర్ణ కుమారుడి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
'మ్యాడ్ స్క్వేర్' స్వాతిరెడ్డికి పెళ్లయిపోయిందా? భర్త ఇతడే (ఫొటోలు)
-
అమ్మకు మీ అందరి ఆశీస్సులు కావాలి: రాఘవ లారెన్స్
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి పరిచయం అక్కర్లేదు. కేవలం సినిమాలే కాదు.. సమాజ సేవలోనూ రాఘవ లారెన్స్ ముందుంటారు. తన వంతుసాయంగా రైతులు, పేదలకు ఆర్థికంగా నిలబడేందుకు ఫౌండేషన్ ద్వారా సహాయ, సహకారాలు అందిస్తుంటారు. అలా రీల్ హీరోగా రాణిస్తూనే.. రియల్ లైఫ్లోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాఘవ లారెన్స్. ఇవాళ తన మాతృమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేశారు. అమ్మ పుట్టినరోజు శుభవేళ మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ట్విటర్లో ఫోటోలు పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు లారెన్స్ మదర్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే రాఘవ లారెన్స్ చివరిసారిగా జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించారు. 2023లో బాక్సాఫీస్ వద్ద రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. Hi Everyone, Today is my mother’s birthday. I need all your wishes and blessings 💐 pic.twitter.com/3QAWRisjvD— Raghava Lawrence (@offl_Lawrence) May 2, 2025 -
అనుష్క శర్మ బర్త్ డే.. విరాట్ కోహ్లీ స్పెషల్ విషెస్!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ తెలిపారు. తన భార్య అనుష్క శర్మ 37వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేశారు. నా ప్రాణ స్నేహితుడు, నా జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. నిన్ను ప్రతి రోజు ప్రేమిస్తూనే ఉంటాము అంటూ అనుష్కపై తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. అనుష్క శర్మ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన పలు సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత క్రికెటర్ కోహ్లీతో డేటింగ్ చేసిన ముద్దుగుమ్మ డిసెంబర్ 2017లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరూ ఇటలీలోని టస్కానీలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జనవరి 2021లో తమ కుమార్తె వామిక జన్మించింది. గతేడాది ఫిబ్రవరి 2024లో బాబు పుట్టగా అకాయ్ అని పేరు పెట్టారు. ఇక పెళ్లి తర్వాత అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
అజిత్ కుమార్ బర్త్ డే.. భార్య షాలిని పోస్ట్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవలే పద్మభూషణ్ పురస్కారం అందుకున్న అజిత్ ఇవాళ తన 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య షాలిని బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.గతేడాది సెలబ్రేట్ చేసుకున్న బర్త్ డే వేడుక ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇలాంటి రోజులు ఎప్పటికీ గుర్తుంటాయని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఫోటోల్లో అజిత్, షాలిని కుమార్తె అనౌష్క, కుమారుడు ఆద్విక్ థీమ్ కూడా ఉన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అంతకుముందు విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను అలరించాడు. పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న అజిత్కు చెన్నై ఎయిర్పోర్ట్లో స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే ఆస్పత్రిలో చేరిన అజిత్.. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
హ్యాపీ బర్త్డే హిట్మ్యాన్... రోహిత్ శర్మ అరుదైన ఫొటోలు
-
'అలా చేయకపోతే అస్సలు జీవితమే కాదు'.. గొప్ప మనసు చాటుకున్న బిగ్బాస్ బ్యూటీ!
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలా క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లోనూ ఛాన్స్లు కొట్టేశారు. అలాంటి వారిలో అశ్విని శ్రీ కూడా ఒకరు. బిగ్బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది.అయితే ఇటీవల తన బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది అశ్విని శ్రీ. ఈ సందర్భంగా తనలో అందమే కాదు.. మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంది ముద్దుగుమ్మ. తన పుట్టిన రోజు వేడుకను ఓ అనాథాశ్రమంలో జరుపుకుంది. అక్కడే ఉన్న పిల్లలకు నాన్ వెజ్ వంటకాలు తానే స్వయంగా వడ్డించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతరుల కోసం జీవించకపోతే.. అసలు అది జీవితమే కాదు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు అశ్విని శ్రీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని బిగ్బాస్ బ్యూటీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
విజయ్ దేవరకొండ నాన్న వర్ధన్ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన టీమ్ (ఫోటోలు)
-
అల్లు అర్జున్ బర్త్డే: 'ఎదురు నీకు లేదులే.. అడ్డు నీకు రాదులే'
స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. ‘ఆర్య’ సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు.. పొరుగు ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ అని పిలుచుకునే బన్ని మలయాళంలో మల్లు అర్జున్ అయ్యారు. బాలీవుడ్ వాల్లకు పుష్పరాజ్గా స్థిరపడిపోయారు. హిందీలో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్కు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో అత్యంత శక్తివంతమైన హీరోగా ఆయన టాప్లో ఉన్నారు. నేడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని రికార్డ్స్ రప్పా రప్పా అంటూ.. కొట్టేయాలని కొన్ని విషయాలు తెలుసుకుందాం.అల్లు అర్జున్లో ఇవన్నీ ప్రత్యేకమే..🎥 దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డ్🎥 రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్🎥 'పుష్ప' సినిమాతో తన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు.🎥 టాలీవుడ్లో 'దేశ ముదురు' సినిమాతో సిక్స్ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జున్నే🎥 అల్లు అర్జున్కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర.. ఇప్పటికే చాలాసార్లు ఆ సినిమాలు చూశారట🎥 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా పుష్ప: ది రైజ్ రికార్డ్ క్రియేట్ చేసింది.🎥 2025 పుష్ప2తో తొలిరోజు రూ. 294 కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ తొలి చిత్రంగా రికార్డ్🎥 100 ఏళ్ల హిందీ చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో రూ. 1000 కోట్లు సాధించిన ఏకైక చిత్రంగా పుష్ప2 రికార్డ్🎥 అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ జాబితాలో పుష్ప2కు రెండో స్థానం, ఫస్ట్ దంగల్ 🎥 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్కు గుర్తింపు🎥 ప్రముఖ సినిమా మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ కవర్పై అల్లు అర్జున్ ఫోటో 🎥 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్న బన్నీ 🎥 'రుద్రమదేవి' సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అర్జున్.. ఆ ప్రాజెక్ట్కు తనలాంటి స్టార్ అవసరమనుకున్నాడు. అందుకే పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించాడు.🎥 బన్నీకి నటి ఐశ్వర్యరాయ్ అంటే అభిమానం. ఆవిడకు పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డాడట🎥 ఇన్స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా 28 మిలియన్లు ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ కావడం విశేషం -
Allu Arjun: ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' పుట్టినరోజు.. మధురమైన జ్ఞాపకాలు (ఫోటోలు)
-
'రామ్ గోపాల్ వర్మ'.. బర్త్డే స్పెషల్ ఫోటోలు చూశారా..?
-
రష్మిక మందన్నా పుట్టినరోజు స్పెషల్.. ఎన్నో బర్త్డేనో తెలుసా (ఫోటోలు)
-
ద్వారకకు కాలినడకన అనంత్ అంబానీ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ద్వారకకు పాదయాత్ర చేపట్టారు. ఆధ్యాత్మిక భావాలు కలిగిన అనంత్ తన 30వ పుట్టినరోజును దేశంలోని పవిత్ర నగరాల్లో ఒకటైన ద్వారకలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి కాలినడకన చేరుకోనున్నారు. తమ పూర్వీకుల స్వస్థలమైన గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకకు 170 కి.మీ. మేర ఆయన పాదయాత్రగా వెళ్తున్నారు. మార్చి 29న అనంత్ పాదయాత్రను ప్రారంభించారు. రోజూ 20 కి.మీ. మేర 7 గంటల పాటు నడక సాగిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన తన పుట్టినరోజుకు ముందు అనంత్ ద్వారకకు చేరుకుని ద్వారకాదీశుడి ఆశీస్సులు అందుకుంటారు. ఈ పాదయాత్రలో పలువురు ఆయనకు సంఘీభావంగా కొంతదూరం పాటు నడిచారు. ఈ సందర్భంగా కొంతమంది ద్వారకాదీశుడి చిత్రాలను అనంత్కు బహూకరించారు. అనంత్ పాదయాత్ర పొడవునా హనుమాన్ చాలీసా, సుందరకాండ, దేవీ స్తోత్రం పఠిస్తూనే ఉన్నారు. కుషింగ్ సిండ్రోమ్ అనే అరుదైన హార్మోన్ల రుగ్మత, స్థూలకాయం, ఉబ్బసం తదితరాలతో బాధపడుతున్నా.. 170 కి. మీ. దూరం నడుస్తుండటం విశేషంగా నిలిచింది. సనాతన భక్తుడైన అనంత్.. బద్రీనాథ్, కేదార్నాథ్, కామాఖ్య, నాథ్ద్వారా, కాళీ ఘాట్ వంటి ప్రఖ్యాత ఆధ్మాత్మిక క్షేత్రాలను తరచూ సందర్శిస్తుంటారు. గుజరాత్లోని జామ్నగర్లో వన్తారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని కూడా అనంత్ అంబానీ నిర్మించడం తెలిసిందే. ప్రధాని మోదీ దాన్ని ఇటీవలే ప్రారంభించారు. -
ఐకాన్ స్టార్ వారసుడి బర్త్ డే.. బన్నీ దంపతుల స్పెషల్ విషెస్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు అని ముద్దుగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సైతం అయాన్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.అయాన్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ప్రత్యేకంగా వీడియోను షేర్ చేసింది. అయాన్తో సంతోషంగా ఉన్న క్షణాలను వీడియో రూపంలో పంచుకుంది. నువ్వు మా జీవితంలో భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ స్నేహా రెడ్డి పోస్ట్ చేసింది. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. పుష్పకు సీక్వెల్గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) Many many happy returns of the day to the love of my life … Happy Birthday my Chinni Babu #AlluAyaan 😘😘😘 pic.twitter.com/1r6fn7xXdc— Allu Arjun (@alluarjun) April 3, 2025 -
దేవసేన తొలి పుట్టినరోజు.. మంచు మనోజ్ దంపతుల ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడైన భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను పెళ్లాడారు. 2023లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. భూమా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం వల్లే మంచు మనోజ్ ఆమెను పెళ్లాడారు. హైదరాబాద్లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరిద్దరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. గతేడాది ఈ జంట ముద్దుల కూతురిని తమ జీవితంలోకి ఆహ్వానించారు. అంతే కాకుండా తమ గారాలపట్టికి దేవసేన శోభ అని శోభనాగిరెడ్డి పేరు కలిసేలా నామకరణం చేశారు. ఈ జంటకు ఏప్రిల్ 2, 2024లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇవాళ తమ కూతురి మొదటి పుట్టినరోజు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ సైతం చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. తనతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమను వ్యక్తం చేసింది.ఇక మనోజ్, మౌనిక దంపతులు తమ ముద్దుల కూతురి దేవసేన తొలి పుట్టినరోజు ఫోటోలను షేర్ చేశారు. ఓ పురాతన కట్టడంలో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమ కూతురిపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.మనోజ్ తన ఇన్స్టాలో రాస్తూ..'ఏడాది క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా మారింది. ముగ్గురిగా ఉన్న మేము నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు. నాలుగు ఆత్మలు. ఒక తిరుగులేని బంధం. ఈ నాలుగు పిల్లర్స్ ప్రేమ, బలంతో నిర్మించిన కుటుంబం. మా ఎంఎం పులి.. దేవసేన శోభ. నువ్వు మా జీవితాల్లో వెలుగు, ధైర్యంతో పాటు అనంతమైన ఆనందాన్ని తెచ్చావు. అమ్మా, నేనూ, ధైరవ్ అన్నా నికు ఎప్పటికీ రక్షణగా ఉంటాం. అద్భుతం, ఆరోగ్యం, అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. నీకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాం.' అంటూ కూతురిపై ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు మనోజ్ దంపతుల ముద్దుల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఆధ్యాత్మికకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా తన 30వ పుట్టినరోజు సందర్భంగా మరో ఆధ్మాత్మికకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్లోని ద్వారకాధీష్ ఆలయానికి కాలినడకన వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు 141 కిలోమీటర్లమేర కాలినడకన ద్వారకకు చేరుకుని అక్కడ శ్రీ కృష్ణుడి పాదాలకు నమస్కరించనున్నారు. రోజుకు 15-20 కిలోమీటర్ల చొప్పున ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగియనుంది.జామ్నగర్ నుండి ద్వారకకుఎపుడూ భక్తిని చాటుకునే అనంత్ అంబానీ, జామ్నగర్ నుండి శ్రీకృష్ణ నగరం ద్వారకకు ఆధ్యాత్మిక యాత్ర (పాదయాత్ర)గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారక వరకు మార్చి 27న ప్రారంభించారు. ద్వారకలో ద్వారకాధీశుని దర్శనంతో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించు కున్నారు. 140 కిలోమీటర్ల ప్రయాణం ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, అనంత్ అంబానీ ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ ద్వారకాధీశుని దర్శించుకుంటాననీ, దీంతో ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు.#WATCH | Devbhumi Dwarka, Gujarat: Anant Ambani, Director, Reliance Industries Limited, is on a 'Padyatra' from Jamnagar to Dwarkadhish TempleHe says, "The padyatra is from our house in Jamnagar to Dwarka... It has been going on for the last 5 days and we will reach in another… pic.twitter.com/aujJyKYJDN— ANI (@ANI) April 1, 2025 > "జామ్నగర్లోని మా ఇంటి నుండి ద్వారక వరకు పాదయాత్ర గత ఐదు రోజులుగా కొనసాగుతోంది, మరో రెండు నాలుగు రోజుల్లో ద్వారక చేరుకుంటాము.ద్వారకాధీశుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడుపై విశ్వాసం ఉంచి, ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని నేను యువతకు చెప్పాలనుకుంటున్నాను. ఆ పని ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. దేవుడు ఉన్నప్పుడు, చింతించాల్సిన పని లేదు" అని ఆయన అన్నారు.Anant Ambani’s decision to walk on foot speaks volumes about his dedication to faith. pic.twitter.com/3XHK4BWMBa— Amrish Kumar (@theamrishkumar) March 31, 2025 ఏప్రిల్ 10న పుట్టినరోజుకృష్ణ భక్తుడైన అనంత్ అంబానీ జై ద్వారకాదీష్ అంటూ నినదిస్తూ ఎంతో ఉత్సాహంగా నడుస్తున్నారు. అనేక మంది భక్తులను ఆకట్టుకుంటున్నారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. అంబానీ కుటుంబానికి చెందిన వ్యక్తి పాదయాత్ర చేయడం ఇదే తొలిసారి. దీంతో అనంత్ అంబానీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ పాదయాత్ర ద్వారా ద్వారక శ్రీ కృష్ణ మందిరానికిచేరుకుంటారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 8 నాటికి అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ ద్వారక చేరుకుంటే. తరువాత, ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఇటీవల ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాలో భార్య రాధికతోపాటు అనంత్ అంబానీ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసిన సంగతి తెలిసిందే. -
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్( Harish Shankar) పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. నేడు ఆయన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, మీకు ఆయన కుటుంబ నేపథ్యంతో పాటు పిలల్లను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా..? కరీంనగర్లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాలపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నాన్న శ్యాంసుందర్ తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో హరీశ్కు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడే సినిమాకు సహాయకుడుగా హరీశ్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత రామ్గోపాల్ వర్మ అతనికి రవితేజ హీరోగా షాక్ సినిమాకు దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం వంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చాడు.దర్శకులు హరీశ్ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. తన భార్య పేరు స్నిగ్ధ అని ఆమెకు పెద్దగా సినిమాలంటే ఇష్టం ఉండదని ఆయన చెప్పారు. చివరకు ఒక సినిమా కోసం పనిచేసినందుకు వచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా ఆమెకు తెలియదని ఆయన అన్నారు. ఈ క్రమంలో తమకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో హరీశ్ ఇలా చెప్పారు. నా భార్య స్నిగ్ధతో చాలా స్పష్టతతో ఉంటాం. మాది మధ్యతరగతి కుటుంబం. బడ్జెట్ విషయంలో ప్రతిదానికి లెక్కలు వేసుకునే ముందుకు సాగుతాం. కుటుంబంలో నేనే పెద్దవాడిని కావడంతో బాధ్యతలు తీసుకోవాల్సిందే.. నా చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడంతో పాటు తమ్ముడిని సెటిల్ చేయడం నా ప్రధాన కర్తవ్యం. అమ్మానాన్నలకు కూడా మంచి ఇల్లు నిర్మించాలి. ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసే పనిలో ఉన్న నాకు స్నిగ్ధ కూడా మద్దతుగా నిలవడం మరింత బలాన్ని ఇచ్చింది. ఇంతకుమించి జీవితంలో ఎలాంటి బాధ్యతలూ వద్దనుకున్నాం. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫీష్గా తయారవుతాం అనిపించింది. దీంతో వారి ప్రపంచం కుదించుకుపోతుంది అనేది నా అభిప్రాయం.' అని ఆయన అన్నారు.హరీశ్ శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, కేవీఎన్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్స్లో ఆయన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్తో ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి. త్వరలో వారిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. -
హీరో రామ్చరణ్ 40వ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
నా కోసం ఆ దేవుడే నిన్ను పంపాడు: షోయబ్ మాలిక్పై భార్య పోస్ట్ (ఫొటోలు)
-
హ్యాపీ బర్త్డే అమ్మలూ.. ఎన్టీర్ స్పెషల్ విషెస్ (ఫోటోలు)
-
రామ్ చరణ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. బర్త్ డే స్పెషల్ అప్డేట్ వచ్చేసింది!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16 మూవీతో బిజీగా ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆర్సీ16 సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. చెర్రీ బర్త్ డే స్పెషల్గా ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేస్తామని ప్రకటించారు. గురువారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. దీంతో చెర్రీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. Grit, power, and an untamed spirit from the rural lands ❤️🔥#RC16 TITLE & FIRST LOOK out tomorrow at 9.09 AM 💥💥#RamCharanRevoltsGlobal Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @IamJagguBhai @divyenndu… pic.twitter.com/ZvwUrN7fNl— Vriddhi Cinemas (@vriddhicinemas) March 26, 2025 -
భార్యకు బర్త్ డే విషెస్ చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో.. నుదుటన బొట్టు పెట్టి!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే దిల్రుబాతో ప్రేక్షకులను అలరించారు. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా కనిపించింది.అయితే మన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే తాను గర్భంతో ఉన్నట్లు ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఇవాళ తన సతీమణి బర్త్ డే కావడంతో కిరణ్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్య నుదుటన బొట్టు పెడుతున్న ఫోటోలను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మా.. అంటూ సతీమణికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం కిరణ్ అబ్బవరం భార్యకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. గత ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. 2024 ఆగష్టు నెలలో పెళ్లితో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
భార్యపై ఎంత ప్రేమో.. రహస్యతో హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
అమ్మలు హ్యాపీ బర్త్ డే.. భార్యపై ఎన్టీఆర్ పోస్ట్
జూ.ఎన్టీఆర్ (Ntr) ప్రస్తుతం జపాన్ లో ఉన్నాడు. గతేడాది మన దగ్గర రిలీజైన దేవర (Devara Movie).. ఈ 28న జపాన్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదివరకే ప్రీమియర్స్ పడగా.. వాటికి తారక్ తోపాటు దర్శకుడు కొరటాల శివ కూడా హాజరవడం విశేషం.సతీసమేతంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్.. తన భార్య ప్రణతి పుట్టినరోజు (Birthday) వేడుకల్ని మంగళవారం రాత్రి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన రెండు ఫొటోలని షేర్ చేసుకోవడంతో పాటు క్యూట్ క్యాప్షన్ కూడా పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా)'అమ్మలు.. హ్యాపీ బర్త్ డే' అని తారక్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. దీనికి నెటిజన్ల లైకులు కొట్టేస్తున్నారు. 2011లో తారక్-ప్రణతికి పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.సినిమాల విషయానికొస్తే జపాన్ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. తర్వాత షెడ్యూల్ బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
వాల్గో ఇన్ఫ్రా సీఎండీ శ్రీధర్ రావు కుమారుడి బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్న ప్రముఖులు (ఫోటోలు)
-
రామ్ చరణ్- అల్లు అర్జున్.. ఈ సారికి లేనట్టే!
ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun).. పాన్ ఇండియా హీరోలుగా పుల్ క్రేజ్ సంపాదించారు. చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్నాడు. మరో మూవీ లైనులో ఉంది. బన్నీ కూడా రెండు సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ బ్యాడ్ న్యూస్ అభిమానుల మధ్య చర్చకు కారణమవుతోంది.హీరోలన్నాక సినిమాలు చేస్తుంటారు. మంచి రోజులు చూసుకుని అప్డేట్స్ ఇస్తుంటారు. ఇక పుట్టినరోజున గ్లింప్స్, పోస్టర్స్ లాంటివి రిలీజ్ చేస్తుంటారు. త్వరలో చరణ్ (మార్చి 27), బన్నీ (ఏప్రిల్ 8) బర్త్ డేలు రాబోతున్నాయి. దీంతో కొత్త మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఈసారి అలాంటివేం ఉండవని తెలుస్తోంది.(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)చరణ్-బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ (Ar Rahman) సంగీత దర్శకుడు. కొన్నిరోజుల క్రితం ఈయన గుండెల్లో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. డిశ్చార్జ్ కూడా అయిపోయి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే గ్లింప్స్ విజువల్స్ రెడీ అయిపోయినా సరే మ్యూజిక్ బాకీ ఉండటంతో చరణ్ పుట్టినరోజు దీన్ని రిలీజ్ చేయడం కష్టమేనని మాట్లాడుకుంటున్నారు.మరోవైపు అల్లు అర్జున్ కొత్త మూవీస్ కి సంబంధించి పుట్టినరోజున అనౌన్స్ మెంట్స్ ఉండొచ్చని అనుకున్నారు. కానీ బన్నీ నానమ్మ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సినిమాల ప్రకటన సరికాదని, వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ రూమర్స్ బట్టి చూస్తే త్వరలో మంచి రోజు చూసుకుని చరణ్, బన్నీ మూవీస్ అప్డేట్స్ రిలీజ్ చేస్తారనిపిస్తుంది.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ.. ఇప్పుడు ఎలా ఉందంటే?) -
'నా సూర్యుడివి.. నా చంద్రుడివి నువ్వే'.. తండ్రికి మంచు మనోజ్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు విషెస్ చెప్పారు. తన తండ్రితో సినిమాల్లో నటించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడియోను కూడా పంచుకున్నారు. ఈ వీడియోను 'నా సూర్యుడివి.. చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే' అంటూ యానిమల్ సాంగ్తో తండ్రి తన ప్రేమను చాటుకున్నారు.మంచు మనోజ్ తన ఇన్స్టాలో రాస్తూ..'హ్యాపీ బర్త్ డే నాన్న.. ఈ రోజు నీ పక్కన ఉండి సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని మిస్సవుతున్నా.. నీ వెంట నడిచేందుకు ఎంతో ఆసక్తిగా వేచి ఉన్నా. నీతో ఉన్న ప్రతి క్షణాలను ప్రేమిస్తా నాన్న' అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి లైక్ కొట్టింది. ఇది చూసిన అభిమానులు తండ్రిపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారని ప్రశంసిస్తున్నారు. మీరిద్దరు త్వరలోనే కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.మంచు ఫ్యామిలీలో గొడవలు..గత కొద్ది నెలలుగా మంచు వారి ఫ్యామిలీలో గొడవలు జరుతుగున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు జల్పల్లిలోని నివాసం వద్ద మొదలైన ఈ వివాదం.. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు కూడా చేరింది. మంచు విష్ణు- మనోజ్కు మధ్య మొదలైన గొడవే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. ఈ గొడవల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వీరంతా తమ పనులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మోహన్ బాబు కన్నప్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
బాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్.. స్పెషల్ అట్రాక్షన్గా తమన్నా!
-
Birthday Special: అలియా భట్ 32వ బర్త్డే వేడుకలో స్పెషల్ ఫొటోస్
-
మనవడి పుట్టిన రోజు నాడే తాత బలవన్మరణం
మియాపూర్: మనవడి పుట్టిన రోజు నాడే అతడి తాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాధవనగర్కు చెందిన రాఘవేందర్ రావు(60) భార్య విజయలక్ష్మితో కలిసి మియాపూర్లోని దీప్తిశ్రీనగర్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాఘవేందర్రావు కాలనీలో విజయ స్వగృహ ఫుడ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాఘవేందర్రావు మనవడు అర్జున్ పుట్టిన రోజు కావడంతో సాయంత్రం వేడుకలు నిర్వహించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కలిసి షాపింగ్కు వెళ్లారు. రాఘవేందర్ రావును కూడా రావాలని కోరగా.. తాను ఇంట్లోనే ఉంటానని, మీరు వెళ్లి రండి అని చెప్పారు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా బెడ్రూం లోపలి నుంచి డోర్ వేసి ఉంది. రాఘవేందర్రావును ఎంత పిలిచినా సమాధానం రాకపోవడంతో.. కిటికిలోంచి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపు బద్దలు కొట్టి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా రాఘవేందర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, దీంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మనవడి పుట్టిన రోజు నాడే రాఘవేందర్ రావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. -
సతీమణి బర్త్ డే.. భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన కేజీఎఫ్ స్టార్
కేజీఎఫ్ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ఈ మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు గీతు మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో యశ్ మెప్పించనున్నారు.అయితే నటి రాధిక పండిట్ను యశ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2016లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఇటీవల మార్చి 7న యశ్ భార్య రాధిక పండిట్ బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో హీరో యశ్ సతీమణికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో రొమాంటిక్ సాంగ్ను ఆలపించాడు. 1981లో వచ్చిన కన్నడ మూవీలోని పాటను పాడి సతీమణికి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను రాధిక తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే కేజీఎఫ్ స్టార్ యశ్ చివరిసారిగా కేజీఎఫ్-2లో కనిపించారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
Birthday special: జాన్వీ కపూర్ క్యూట్ ఫొటోస్
-
డెంటిస్ట్ నుంచి రూ.300 కోట్ల హీరోయిన్ వరకు.. మీనాక్షి గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
మంచి మనసు చాటుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ (ఫొటోలు)
-
హనుమాన్ నటి బర్త్ డే.. గొప్ప మనసు చాటుకున్న వరలక్ష్మి శరత్కుమార్
హనుమాన్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో చోటు సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్కుమార్. టాలీవుడ్లో బాలయ్య మూవీ వీరసింహారెడ్డిలోనూ తనదైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ నెల 5న ఆమె పుట్టినరోజు కావడంతో తన గొప్ప మనసును చాటుకున్నారు.వరలక్ష్మి తన బర్త్ డే సందర్భంగా అనాథ చిన్నారుల్లో సంతోషం నింపారు. హైదరాబాద్లోని లెప్రా సోసైటీ అనాథాశ్రమానికి వెళ్లిన వరలక్ష్మీ తన భర్త నికోలయ్ సచ్దేవ్తో పాటు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందించారు. అంతేకాకుండా ఆశ్రమానికి తనవంతుగా ఆర్థికసాయం అందజేశారు. సెలబ్రిటీలు వస్తే అనాథాశ్రమం గురించి ప్రజలకు తెలుస్తుందనే మంచి ఉద్దేశంతోనే వచ్చానని వరలక్ష్మీ శరత్కుమార్ అన్నారు. -
హీరోయినే కానీ ఎప్పుడూ రూమర్స్, వివాదాలతోనే సావాసం (ఫొటోలు)
-
భారత్- పాక్ మ్యాచ్.. ఊర్వశి రౌతేలా క్రేజీ రికార్డ్!
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఐదేళ్ల కుర్రాడి నుంచి డెబ్బై ఏళ్ల ముసలోళ్లు కూడా వదిలిపెట్టరు. మ్యాచ్ ఎప్పుడు మొదలతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రపంచ క్రికెట్లోనే అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ఏదైనా ఉందంటే ఇండియా- పాకిస్తాన్ పోరు మాత్రమే. ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్లు లేనందువల్ల అప్పుడప్పుడు వచ్చే ఐసీసీ ఈవెంట్స్లో మాత్రమే తలపడుతున్నారు దాయాది జట్లు. మరి ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చే ఈ మ్యాచ్ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు క్రీడా అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక మ్యాచ్ లైవ్లో చూసేవారికి ఆ థ్రిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ను మరింత స్పెషల్గా మార్చుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? ఏంటా స్పెషల్? అనేది తెలియాలంటే మీరు లుక్కేసేయండి మరి.తాజాగా ఆదివారం దుబాయ్లో జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. ఇటీవల డాకు మహారాజ్తో ఫ్యాన్స్ను అలరించిన ముద్దుగుమ్మ సడన్గా మ్యాచ్లో దర్శనమిచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవితో సహా డైరెక్టర్ సుకుమార్, పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ మ్యాచ్ లైవ్లో అభిమానులు వీక్షించారు.అయితే చాలా మంది సెలబ్రిటీలు ఈ మ్యాచ్కు హాజరైనప్పటికీ అందరి కళ్లు ఊర్వశి రౌతేలాపైనే ఉన్నాయి. ఈ బాలీవుడ్ భామ దుబాయ్లో జరిగిన మ్యాచ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. టీమిండియా- పాక్ మ్యాచ్లో ఏకంగా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫిల్మ్ ఫేర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తొలి సెలబ్రిటీ అంటూ..భారత్- పాక్ మ్యాచ్లో పుట్టినరోజు జరుపుకున్న తొలి సెలబ్రిటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో రికార్డ్ సృష్టిస్తే.. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఊర్వశి తొలిసారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని అంటున్నారు. మరికొందరైతే ఊర్వశి రౌతేలాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆఖరికి ఫిల్మ్ ఫేర్ వాళ్లు కూడా ఊర్వశిపై జోకులు వేస్తున్నారని మరికొందరు రాసుకొచ్చారు. కొందరు రిషబ్ పంత్ పేరును కూడా కామెంట్స్లో ప్రస్తావిస్తున్నారు. అయితే ఆమెపై ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ.. చివరికీ బాలీవుడ్ భామ మాత్రం ప్రతిష్టాత్మక మ్యాచ్లో అందర దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఇటీవల టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఊర్వశి రౌతేలా బర్త్ డే ఈనెల 25న కాగా.. ముందుగానే స్టేడియంలో సెలబ్రేట్ చేసుకుని హైలెట్గా నిలిచింది. #ViratKohli broke several records during the India vs Pakistan match yesterday but #UrvashiRautela became the first actress to celebrate her birthday during an #IndvsPak cricket match. 🤣#Trending #indvspak #indiavspakistan #iccchampionstrophy pic.twitter.com/OLjHILtvgh— Filmfare (@filmfare) February 24, 2025 -
ఉద్యోగి బర్త్డే సెలబ్రేట్ చేసిన అనంత్, రాధికా అంబానీ (ఫోటోలు)
-
అనుపమ బర్త్ డే.. పరదా టీమ్ స్పెషల్ విషెస్
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.(ఇది చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్)ఇవాళ అనుపమ బర్త్ డే కావడంతో ఓ వీడియోను విడుదల చేశారు. దాదాపు 20 సెకన్లపాటు ఉన్న మూవీ క్లిప్ను షేర్ చేస్తూ అనుపమకు పుట్టినరోజ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నమైన సోషియో ఫాంటసీ కథగా రానున్న ఈ చిత్రంలో అనుపమ సుబ్బు అనే పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'అమరన్' హీరో శివ కార్తీకేయన్ బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
-
పెళ్లైన తర్వాత బ్యాడ్మింటన్ స్టార్ తొలి బర్త్డే.. ఫొటోలు చూశారా?
-
జేడీ వాన్స్ కుమారుని బర్త్డే వేడుకలకు ప్రధాని మోదీ
పారిస్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుమారుని పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జేడీ వాన్స్, భారత సంతతికి చెందిన అతని భార్య ఉషలతో సమావేశమయ్యారు. జేడీ వాన్స్ కుమారుడు వివేక్కు మోదీ పుట్టినరోజు బహుమతులను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో వాన్స్తో పాటు అతని భార్య ఉష, కుమారులు ఇవాన్, వివేక్లు కూడా ఉన్నారు.ప్రధాని మోదీ తన ట్వీట్లో.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను, ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్నాను. వివిధ అంశాలపై మేము మాట్లాడుకున్నాం. వాన్స్ కుమారుడు వివేక్ పుట్టినరోజు వేడుకకు హాజరు కావడం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. కాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ చాలా మంచి మనసు కలిగిన వ్యక్తి అని, ఆయన మా పిల్లలకు ఇచ్చిన బహుమతులను చూసి వారు చాలా ఆనందించారన్నారు. ఆయనకు కృతజ్ఞతలు అని జేడీ వాన్స్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. Had a wonderful meeting with US @VP @JDVance and his family. We had a great conversation on various subjects. Delighted to join them in celebrating the joyous birthday of their son, Vivek! pic.twitter.com/gZpmt1jg5M— Narendra Modi (@narendramodi) February 11, 2025కాగా ప్రధాని మోదీ, జేడీ వాన్స్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) షేర్ చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు తన ప్రసంగంలో సమ్మిట్కు సహ అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ కృత్రిమ మేధస్సుపై చూపిన సానుకూల వైఖరిని స్వాగతించారు. ఏఐ ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందిస్తుందని, ఉత్పాదకతను మరింతగా పెంచుతుందన్నారు. అయితే ఇది మనుషుల మేథను ఎప్పటికీ భర్తీ చేయలేదని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నేడు రాష్ట్రపతి భవన్లో తొలి పెళ్లి బాజాలు.. వివాహం ఎవరికంటే.. -
ప్రియుడికి బర్త్ డే విషెస్ చెప్పిన మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్.. ఫోటోలు
-
బాయ్ఫ్రెండ్కు బర్త్ డే విషెస్.. పాయల్ రాజ్పుత్ పోస్ట్!
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు.'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరినీ తన గ్లామర్తో అలరించిన ఈ బ్యూటీ.. 'మంగళవారం' సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాతో విభిన్నమైన పాత్రలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. తన బాయ్ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ చేసింది. అతనితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది మంగళవారం భామ.పాయల్ రాజ్పుత్ తన ఇన్స్టాలో రాస్తూ..'నన్ను అర్థం చేసుకునే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ దయ, మద్దతు నా జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు. అన్ని వేళల్లో మీ మార్గదర్శకత్వం, ప్రేమను అందిస్తూ మీరు నా కోసం ఉన్నందుకు చాలా కృతజ్ఞతతో ఉన్నా. ఈ ప్రత్యేకమైన రోజున ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో కనిపించనుంది. ఈ చిత్రానికిముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభమైంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయమని డైరెక్టర్ ముని అన్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మహేశ్బాబుతో చివరి సినిమా..'లండన్ బ్యూటీ' బర్త్డే వేడుకలు (ఫోటోలు)
-
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
భర్తకు విషెస్ చెప్పిన ఐశ్వర్య రాయ్.. ఎప్పటిలాగే ఆలస్యంగా!
బాలీవుడ్ అత్యంత క్రేజ్ ఉన్న జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇవాళ అభిషేక్ తన 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తాజాగా తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. అభిషేక్ బచ్చన్ చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. మీకు ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యం, ప్రేమతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే అభిషేక్ బచ్చన్.. గతేడాది ఐ వాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. షూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో అభిషేక్ విభిన్నమైన పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది.ఐశ్వర్య రాయ్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో నటించింది. ఇందులో చియాన్ విక్రమ్, రవి మోహన్, శోభితా ధూళిపాల, త్రిష కృష్ణన్, కార్తీ, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.ఐశ్వర్య- అభిషేక్పై రూమర్స్..కాగా.. గతేడాది అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహ వేడుకల్లో జంటగా కనిపించారు. ఇద్దరూ విడివిడిగా వేడుకలో కనిపించడంతో ఈ జంట విడిపోతున్నారంటూ పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతకుముందు కూతురు ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లో అభిషేక్ కనిపించకపోవడంతో డివోర్స్ తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ఈ జంట ఈ వార్తలపై స్పందించలేదు.జంటగా పార్టీకి హాజరుబాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతేడాదిలో మరింత బలపడ్డాయి. కానీ వీరిద్దరు ఓ పార్టీలో ఫ్రెండ్స్తో కలిసి సెల్ఫీలు దిగారు. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. దీంతో విడాకుల రూమర్స్కు చెక్ పడింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
బర్త్డే స్పెషల్..అభిషేక్ బచ్చన్ గురించి ఈ విషయాలు తెలుసా?
-
రామ్ లక్ష్మణ్.. హ్యాపీ బర్త్ డే
కవలలుగా పుట్టిన రామ్ లక్ష్మణ్ లకు ఆ గ్రామంలో గురువారం మొదటి పుట్టిన రోజు (Birthday) వేడుక ఘనంగా జరిపారు. చప్పట్ల మధ్య పెద్ద కేక్ కట్ చేసి తినిపించారు. బంధుమిత్ర సపరివారంగా ఆ చిన్నారులను ఆశీర్వదించి, చివరిగా విందారగించారు. ఈ హడావుడి చూసి ఇదేదో చిన్న పిల్లల జన్మదిన వేడుక అనుకుంటున్నారేమో! ఇదంతా ఓ కుటుంబం సొంత బిడ్డల్లా సాకుతున్న దూడల జన్మదిన వేడుక. కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామంలోని మిరియాల వెంకట్రాజు ఇల్లు ఈ వేడుకకు వేదిక అయ్యింది. వెంకట్రాజుకు చెందిన ఆవు (Cow) ఏడాది కిందట సరిగ్గా ఇదే తేదీన రెండు కవల దూడలకు జన్మనిచ్చింది. వాటికి రామ్, లక్ష్మణ్ (Ram Laxman) అని పేర్లు పెట్టారు. అవి పుట్టి ఏడాది పూర్తి కావడంతో ఘనంగా జన్మదిన వేడుక జరిపారు. – ప్రత్తిపాడుకిలో మీటరు మేర డోలీ మోత గిరిజన ప్రాంతంలో గర్భిణులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేక గిరి బిడ్డలు నానా అవస్థలు పడుతున్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి కిలోమీటరు వరకు రహదారి సౌకర్యం లేదు. ఎటువంటి వాహనాలు రాలేని పరిస్థితి. దీంతో చేసేదేమీ లేక వనిత భర్త మోహన్రావు, కుటుంబ సభ్యుల సహాయంతో డోలీ కట్టి రహదారి సౌకర్యం ఉన్న బొడ్డగొంది గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్లో ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు. వైద్యాధికారి సంతోష్, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా చెరువువీధి గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామానికి రహదారి ఉండేదని, భూ సమస్య కారణంగా ఒక వ్యక్తి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రహదారి సమస్య పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితంలేకుండాపోతోందని వాపోయారు. – ముంచంగిపుట్టుచివరి మజిలీలో ‘దారి’ చిక్కులుతిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, జింగిలిపాళెం దళితవాడకు చెందిన వెంకటేశ్ (34) మృతి చెందడంతో గురువారం ఆయన అంతిమ యాత్రకు చిక్కులు ఎదురయ్యాయి. రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్ మృతి చెందడంతో బంధువులు పాడె ఎత్తుకుని శ్మశానానికి బయల్దేరారు. అయితే దారి లేకపోవడంతో నానా అగచాట్లు పడుతూ పంట పొలాల గట్లు మీద నడుచుకుంటూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. దీంతో ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియలు అవస్థల మధ్య జరగడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. – రేణిగుంటవిశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో రెండు ఎద్దులు అధిపత్యం కోసం పోరాడాయి. వీటి మధ్య జరిగిన పోరును స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఓ దశలో ఇవి వారివైపునకు రాగా... స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఒకవైపు పెట్రోలింగ్కు వాహనాలు లేవని చెబుతున్న పోలీసులు..చిన్న మరమ్మతులైన వాటినీ రిపేర్ చేయించకుండా మూలన పడేస్తున్నారు. దానికి ఈ చిత్రమే నిదర్శనం. విశాఖలోని మద్దిలపాలెం అవుట్పోస్ట్ వద్ద మరమ్మతులకు గురైన పోలీస్ పెట్రోలింగ్ బైక్ను నెలల తరబడి ఇలాగే వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఇది తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్. లడ్డూలు లేకపోవడంతో ఇలా నో స్టాక్ బోర్డును టీటీడీ ఏర్పాటు చేసింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు లడ్డు ప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరిగారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, తిరుపతిచదవండి: సర్పమా.. మేఘమా! -
హీరోయిన్ శృతి హాసన్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అంజనమ్మ బర్త్ డే వేడుక.. మెగాస్టార్ ఎమోషనల్ నోట్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన మాతృమూర్తి అంజనమ్మకు (Anjana Devi) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన, రామ్ చరణ్, మెగాస్టార్ దగ్గరుండి అంజనమ్మతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరంజీవి.చిరు తన ఇన్స్టాలో రాస్తూ..'అమ్మా! ఈ ప్రత్యేకమైన రోజున మాటల్లో చెప్పలేనంతగా ప్రేమను అందుకున్నారు. మీరు ఊహించలేనంతగా గౌరవం అందించిన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. మా ప్రియమైన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. మా కుటుంబానికి హృదయం లాంటి మీ స్వచ్ఛమైన, నిస్వార్థ ప్రేమకు కృతజ్ఞతలు. నీ పాదాలకి నమస్కరిస్తూ.. పుణ్యం చేసుకొన్న నీ సంతతి.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. అంతకుముందే ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. అంజనమ్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నాయనమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఇన్స్టా వేదికగా విషెస్ తెలిపింది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రావడంతో వాయిదా వేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
'ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం'.. ఉపాసన స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి మెగా కోడలు శుభాకాంక్షలు తెలిపింది. ఇవాళ ఆమె పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పింది. అంజనా దేవితో ఉన్న ఫోటోను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా అభిమానులు సైతం అంజనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఉపాసన తన ఇన్స్టాలో రాస్తూ..'అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ కలిగిన నాయనమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో పాటు కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం. మా యోగా క్లాస్ పూర్తయ్యాక మా ఫేస్లో ఆనందం చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్సవదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తిదాయకం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ పోస్టులు పెడుతున్నారు.(ఇది చదవండి: అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్)ఇక ఉపాసన విషయానికొస్తే వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, దేవరభామ జాన్వీ కపూర్ చెర్రీ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆర్సీ16 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
పుట్టిన రోజే కబళించిన మృత్యువు
ఆరిలోవ: ఉద్యోగ సాధనలో విజయం సాధించి సాయంత్రం పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్న ఆ యువకుడి జీవనయానం హఠాత్తుగా ముగిసింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం జరిగిన పరుగు పోటీలో పాల్గొన్న ఆ యవకుడు అనూహ్యంగా తనువు చాలించాడు. ఓ దశ పరుగు పందెం నెగ్గి, రెండో దశ కోసం వేచి ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విశాఖ నగరంలోని కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. గురువారమే అతని పుట్టిన రోజు కూడా. కానిస్టేబుల్ నియామక పరీక్షలకు వెళ్లి వచ్చి సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న యువకుడి ఆశల్ని మృత్యువు చిదిమేసింది. పోలీసులు, బంధువు కథనం ప్రకారం.. విశాఖ నగరం పదో వార్డు రవీంద్రనగర్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కె.ఎ.శ్రావణ్కుమార్ (24) పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో జరుగుతన్న దేహదారుఢ్య పరీక్షలకు శ్రావణ్కుమార్ గురువారం హాజరయ్యాడు. మొదట జరిగిన 1,600 మీటర్ల పరుగులో పాల్గొన్నాడు. 8 నిమిషాలలో పూర్తి చేయాల్సిన పరుగును 7.1 నిముషాల్లోనే పూర్తి చేసి తదుపరి పరీక్షలకు అర్హత సాధించాడు. మరికొద్ది సమయంలో తదుపరి పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంది. ఇంతలో కూర్చున్న చోటే అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి, అపస్మారకస్థితికి చేరాడు. దీన్ని గమనించిన పోలీసులు అంబులెన్స్లో విమ్స్కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అపోలో అస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న శ్రావణ్కుమార్ తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు అస్పత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. శ్రావణ్కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 8 నెలల క్రితం తండ్రి మృతి శ్రావణ్కుమార్ తండ్రి కె.అర్జునరావు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఆయన 8 నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ కుటుంబానికి ఇంజినీరింగ్ చదువుతున్న శ్రవణ్కుమారే పెద్దదిక్కుగా నిలుస్తాడని తల్లి కనకమహాలక్ష్మి ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు అతను కూడా మరణించడంతో తల్లి, చెల్లికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. -
పార్టీ ఇచ్చిన ఖుష్బూ.. హాజరైన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే.. పవిత్రా లోకేశ్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ మరో ఏడాది పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆయన 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదారాబాద్లో ఆయన జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డేను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ సందర్భంగా నరేశ్పై ప్రశంసలు కురిపించారు పవిత్రా లోకేశ్.పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' నరేశ్ గారి బర్త్ డేను అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం శుభ పరిణామం. ఆయన వేసుకున్న షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను. పెద్దల ఆశీర్వాదం ఆయనకు ఎప్పుడు ఉంటుంది. నరేశ్ గారికి ఇద్దరు గురువులు. వారిలో ఒకరు జంధ్యాల అయితే.. మరొకరు విజయనిర్మల. ప్రతి రోజు గురువుగారిని తలచుకుంటారు. తన కుటుంబాన్ని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. దాదాపు 10 మందికి ఉండే ఎనర్జీ నరేశ్ గారికి ఉంటుంది. ఏపని చేసినా చాలా సిస్టమాటిక్గా చేస్తారు. యంగ్ డైరెక్టర్స్కు చాలా టైమ్ ఇస్తారు. వాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. గతంలో వీరిద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీ చాలా వివాదానికి దారి తీసింది. అప్పట్లో నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం టాలీవుడ్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.Latest Visuals of Actor #VKNaresh along with #PavitraLokesh pic.twitter.com/39UnKTPV4e— Telugu Film Producers Council (@tfpcin) January 19, 2025#TFNExclusive: Visuals of Actor @ItsActorNaresh's birthday celebrations in Hyderabad!!🎊#Naresh #PavitraLokesh #TeluguFilmNagar pic.twitter.com/2kXbVEmaWr— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
బోల్డ్ కన్నన్
బోల్డ్ కన్నన్గా మారిపోయారు హీరో విజయ్ సేతుపతి. ఆయన హీరోగా నటిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘ఏస్’. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మూవీ ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో యోగిబాబు, బీఎస్ అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ ఇతర లీడ్ రోల్స్æచేస్తున్నారు. జనవరి 16న విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇంకా విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న మరో మూవీ ‘ట్రైన్’ గ్లింప్స్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మిస్కిన్ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కేఎస్ రవికుమార్, శ్రుతీహాసన్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇలా బర్త్ డేకి డబుల్ ధమాకా ఇచ్చారు విజయ్ సేతుపతి. -
Rakesh Sharma Birthday: రాకేష్శర్మ అంతరిక్షంలో ఎన్ని రోజులున్నారు?
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పుట్టినరోజు నేడు(జనవరి 13). ఆయన 1949 జనవరి 13న జన్మించారు. భారతదేశ చరిత్రలో తొలి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సాగించిన అంతరిక్ష ప్రయాణం దేశానికి గర్వకారణంగా నిలిచింది.1949, జనవరి 13న పంజాబ్లోని పటియాలాలో జన్మించిన రాకేష్ శర్మ(Rakesh Sharma), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)మాజీ పైలట్, వ్యోమగామి. రాకేశ్శర్మ 1984లో 7 రోజుల, 21 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్ష యాత్ర చేశారు. 1984లో సోవియట్ అంతరిక్ష నౌక సోయుజ్ టీ-11లో ఆయన చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఆయనను జాతీయ హీరోగా చేయడమే కాకుండా, అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ వేదికపై భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది.నాటి అంతరిక్ష మిషన్ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉందని శర్మను అడిగినప్పుడు ఆయన ‘సారే జహాన్ సే అచ్ఛా" (ప్రపంచమంతటి కంటే మెరుగ్గా) అని సమాధానమిచ్చారు. ఈ దేశభక్తి భావన లక్షలాది మంది భారతీయులతో ప్రతిధ్వనించింది.దేశ సమిష్టి జ్ఞాపకంలో శాశ్వతంగా నిలిచిపోయింది.రాకేష్ శర్మ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత, శర్మ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ఏరోస్పేస్ అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేశారు. రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్ తరాల కలలను సాకారం చేసేందుకు, సైన్స్, అంతరిక్ష పరిశోధనలలో మరింత ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలిచింది.ఇది కూడా చదవండి: కెనడా అమ్మకానికేం లేదు!.. ట్రంప్కు ఘాటు హెచ్చరిక -
చిరంజీవితో తొలి సినిమా.. సుకుమార్ బర్త్డే విశేషాలు (ఫోటోలు)
-
పుష్ప స్టైల్లో తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పిన ఐకాన్ స్టార్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. నాన్న అల్లు అరవింద్తో బన్నీ స్వయంగా కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలో బన్నీ భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా పాల్గొన్నారు. అల్లు అరవింద్ కేక్ కట్ చేసిన ఫోటోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు బన్నీ. తాజాగా అలలు అర్జున్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.పుష్ప కా బాప్ అంటూ..ఈ పోస్ట్లో పుష్ప కా బాప్ అని రాసిన ఉన్న కేక్ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ కేక్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ అల్లు అరవింద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 జోరు..గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, బాహుబలి-2 రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ చిత్రం దంగల్ వసూళ్ల రికార్డ్పై పుష్పరాజ్ కన్నుపడింది. రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో దంగల్ కొనసాగుతోంది. ఆ రికార్డ్ను బద్దలు కొట్టేందుకు పుష్ప మేకర్స్ సరికొత్త ప్లాన్తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈనెల 17 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు అదనంగా సీన్స్ జోడించనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.బన్నీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..అయితే తాజాగా ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పుష్ప-2 ది రూల్ రీ లోడింగ్ వర్షన్ తేదీని మార్చారు. ముందుగా ఈనెల 11 నుంచే వస్తుందని ప్రకటించారు. కానీ ఆ డేట్ కాకుండా జనవరి 17న తీసుకు రానున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల 11న పుష్ప-2 ఎక్స్ట్రా ఫైర్ చూడాలనుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్కు నిరాశ ఎదురైంది. దంగల్ రికార్డ్పై గురి..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2', కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. ఈ లెక్కన చూస్కతే అమిర్ ఖాన్ దంగల్ మూవీ మాత్రమే పుష్ప-2 కంటే ముందుంది. ఈ మూవీ అదనపు సీన్స్ యాడ్ చేయడం చూస్తే దంగల్ రికార్డ్పైనే గురి పెట్టినట్లు తెలుస్తోంది.ప్రీ రిలీజ్ బిజినెస్లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్టైమ్ రికార్డులు సృష్టించింది. కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. Happy Birthday Dad . Thank you for making our lives soo special with your gracious presence . pic.twitter.com/CgWYsbk2eF— Allu Arjun (@alluarjun) January 10, 2025 -
దీప్తి సునయన బర్త్డే స్పెషల్... (ఫోటోలు)
-
నవిష్క బర్త్డే.. కూతురి కోసం కల్యాణ్ దేవ్ సర్ప్రైజ్(ఫోటోలు)
-
మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్గా ఉంటూ..
కొందరిని చూస్తుంటే వారేవా అని అనకుండా ఉండలేం. దానికి వారిలోని గొప్పదనం, వారు చేసే పనులు కారణమై ఉంటాయి. దీనికితోడు వారి క్రమశిక్షణ, దైనందిన జీవితం కూడా తోడయివుంటుంది. 107 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉంటూ, అందరికీ స్ఫూర్తినిస్తున్న రోమెల్ సింగ్ పఠానియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దేశంలో సైనికరంగం ఏర్పడక ముందే ఆజాద్ హింద్ ఫౌజ్(Azad Hind Fauj)లో సభ్యునిగా చేరి, దేశం కోసం మూడు యుద్ధాలు చేసిన కెప్టెన్ రోమెల్ సింగ్ పఠానీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వయసులో కూడా కళ్లద్దాలు పెట్టుకోకుండా న్యూస్ పేపర్లు చదివే సామర్థ్యం కలిగిన రోమెల్ సింగ్ పఠానియా ఎవరి సాయం లేకుండా తానే స్వయంగా స్కూటర్ నడుపుతుంటారు. కెప్టెన్ పఠానియా హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాకు చెందిన ఫతేపూర్లోని బరోహ్ గ్రామ నివాసి.ఆజాద్ హింద్ ఫౌజ్లో సభ్యుడైన రోమెల్ సింగ్ పఠానియా(Romel Singh Pathania) 1939-45లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటీష్ పాలనలో పఠానియా 1945లో బజిరెస్తాన్ యుద్ధంలో కూడా భాగస్వామ్యం వహించారు. దేశ విభజన సమయంలో పలువురి ప్రాణాలు కాపాడారు. 1962 నాటి చైనా యుద్ధం, 1965, 1971లలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొని దేశ సేవ చేశారు. తాను భారత సైన్యంలోని 16వ డోగ్రా రెజిమెంట్లో సుమారు 31 ఏళ్లపాటు పనిచేశానని రోమెల్ సింగ్ పఠానియా తెలిపారు.పాష్టో, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో తనకు పూర్తి పరిజ్ఞానం ఉందని రోమెల్ సింగ్ మీడియాకు చెప్పారు. తాను శాకాహారం మాత్రమే తీసుకుంటానని, తన జీవితంలో ఏనాడూ బీడీ, సిగరెట్, మద్యం, మాంసం, చేపలు ముట్టలేదని పేర్కొన్నారు. శారీరకంగా తాను ఇప్పటికీ ఫిట్గా ఉన్నానని, మోకాళ్ల నొప్పులు కూడా లేవని తెలిపారు.కంటి చూపు, జ్ఞాపకశక్తి కోల్పోలేదని చెప్పారు. ఉదయం 4 గంటలకే నిద్ర నుంచి లేస్తానని, భగవంతుని ప్రార్థనతో తనకు రోజు ప్రారంభమవుతుందన్నారు. ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న రోమెల్ సింగ్ పఠానియాకు శుభాకాంక్షలు(Greetings) చెబుతూ, మీ వయస్సు ఎంత అని మీడియా అడిగిప్పుడు నవ్వుతూ తనకు ఏడేళ్లు అని చెప్పారు. తరువాత తన వయసు 107 అని తెలిపారు. ఇది కూడా చదవండి: మద్యపానం క్యాన్సర్కు కారకం: అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి హెచ్చరిక -
మహామేధావికి రెండు జననమరణాలు!
ఐజాక్ న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళశాస్త్రాల్లో మహనీయునిగా పేరొందారు. ఆయన ప్రపంచానికి అందించిన పలు ఆవిష్కరణలు కొత్తదారులను చూపాయి. న్యూటన్ జననమరణాలకు సంబంధించిన అంశాలు ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తాయి.బహుముఖ ప్రజ్ఞాశీలిగా..ఐజాక్ న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. యాపిల్ కిందనే పడటానికి న్యూటన్ చెప్పిన కారణం, ఆయన అందించిన చలన నియమాల గురించి చాలా మందికి తెలుసు. కానీ న్యూటన్ ప్రపంచానికి అనేక ఇతర ఆవిష్కరణలను కూడా అందించారు. గణిత శాస్త్రజ్ఞునిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా న్యూటన్ ప్రపంచానికి సుపరిచితమే. న్యూటన్ అందించిన ఆవిష్కరణలు కొన్నిరంగాల్లో సమూల మార్పులను తీసుకువచ్చాయి.రెండు పుట్టినరోజులున్యూటన్కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, అతనికి రెండు పుట్టినరోజులున్నాయి. న్యూటన్ జీవించివున్న కాలంలో వినియోగంలో ఉన్న క్యాలెండర్ల కారణంగా అతని పుట్టిన తేదీలలో పది రోజుల వ్యత్యాసం కనిపిస్తుంది. న్యూటన్ పుట్టినరోజు జనవరి 4 అని కొందరు పరిణిస్తుండగా, డిసెంబర్ 25న అతని పుట్టినరోజును జరుపుకునేవారున్నారు. నిజానికి న్యూటన్ తన పుట్టినరోజును డిసెంబర్ 25న ఇంగ్లాండ్లో జరుపుకున్నారు. అయితే ఇంగ్లాండ్ వెలుపల అతని పుట్టినరోజు జనవరి 4న చేసుకుంటారు.అధికారిక జన్మదినంన్యూటన్ ఇంగ్లాండ్లోని వూల్స్టోర్ప్లోని మనోర్ హౌస్లో జన్మించారు. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్ను ఇంగ్లాండ్లో ఉపయోగించేవారు. ఇది యూరప్కు భిన్నంగా ఉండేది. దీని ప్రకారం చూస్తే న్యూటన్ 1642, డిసెంబర్ 25న జన్మించారు. అయితే అదే కాలంలో ఐరోపాలో గ్రెగోరియన్ క్యాలెండర్కు ఆమోదం లభించింది. ఇదే నేడు అందరూ ఉపయోగిస్తున్న క్యాలెండర్. దీని ప్రకారం చూసుకుంటే న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. ఇదే తరువాతి కాలంలో న్యూటన్ అధికారిక పుట్టిన తేదీగా పరిగణించారు.కెమిస్ట్రీలో అమితమైన ఆసక్తిగురుత్వాకర్షణ భావన న్యూటన్ సిద్ధాంతానికి ముందే ఉన్నప్పటికీ, న్యూటన్ అందించిన సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపధ్యంలో న్యూటన్ సైన్స్లో కొత్త శకాన్ని ప్రారంభించారని అంటారు. ఆయన కాలిక్యులస్ని కనిపెట్టడం ద్వారా గణితానికి కొత్త శాఖను అందించారు. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ను తయారు చేసిన మహనీయునిగానూ న్యూటన్ పేరొందారు. ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది అయిన ప్రిజం ద్వారా తెల్లని కాంతితో కూడిన రంగుల వర్ణపటాన్ని మొదటిసారి న్యూటన్ ప్రపంచానికి చూపించారు. న్యూటన్కు కెమిస్ట్రీలో ఎంతో ఆసక్తి ఉంది. ఆయన రసాయన శాస్త్రంపై పలు రచనలను సాగించారు. రచయితగానూ పేరొందారు.ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలుజూలియన్ క్యాలెండర్ క్యాలెండర్ ప్రకారం న్యూటన్ 1727, మార్చి 20న మరణించారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అదే ఏడాది మార్చి 31న న్యూటన్ కన్నుమూశారు. న్యూటన్ నిద్రలో మరణించారని చెబుతారు. అతని మరణం తరువాత అతని శరీరంలో పెద్దమొత్తంలో పాదరసం కనుగొన్నారని అంటారు. న్యూటన్ తన జీవితంలోని తుదిదశలో మానసిక ఆరోగ్యంతో బాధపడ్డారు. నిరాశా నిస్పృహలకు గురయ్యారు. చుట్టుపక్కలవారిని కలుసుకోవడం మానేశారు. న్యూటన్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగాయి.ఇది కూడా చదవండి: టెన్త్ అర్హతతో 10 మెడికల్ కోర్సులు.. తక్షణ ఉపాధి.. అధిక జీతం -
మంచు విష్ణు ముద్దుల తనయుడు.. బాల కన్నప్ప బర్త్డే (ఫోటోలు)
-
బర్త్ డే వేడుకల్లో విషాదం.. అభిమానులకు కేజీఎఫ్ హీరో విజ్ఞప్తి
కేజీఎఫ్ హీరో, కన్నడ సూపర్ స్టార్ యశ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తన బర్త్ డే వేడుకల కోసం ఎవరూ కూడా హోమ్టౌన్కు రావద్దని కోరారు. ఎన్నో ఏళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ కొత్త ఆశయాలతో ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్కు సూచించారు. గతంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయని ఫ్యాన్స్ను ఉద్దేశించి యశ్ పోస్ట్ చేశారు.కాగా.. యశ్ తన పుట్టిన రోజును జవనరి 8న సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని.. పుట్టిన రోజు అందుబాటులో ఉండనని తెలిపారు. అయినప్పటికీ మీ ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉంటాయని ఎక్స్ వేదికగా యశ్ లేఖను విడుదల చేశారు. మీరు సురక్షితంగా ఉండడమే నాకు ఇచ్చే గొప్ప బహుమతి అని.. మీ అందరికీ 2025 శుభాకాంక్షలు అంటూ యశ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఈ ఏడాది విషాదం..ఈ ఏడాది జనవరి 8న యశ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా విషాద ఘటన జరిగింది. ఆయన బ్యానర్ను కడుతూ ముగ్గురు అభిమానులు విద్యాదాఘాతంలో మృతిచెందారు. కర్ణాటకలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 8న 38వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) ఉన్నారు.మరో ముగ్గురికి గాయాలు..ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వారిని తరలించారు. యశ్ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అర్ధరాత్రే భారీగా అభిమానులు తరలివచ్చారు. గత నాలుగేళ్లుగా యష్ తన పుట్టినరోజును అభిమానులతో జరుపుకోలేదు. కరోనా సంక్షోభానికి ముందు, అతను ఒకప్పుడు తన అభిమానులతో చాలా గ్రాండ్గా జరుపుకున్నాడు. ఈ ఏడాది కూడా అభిమానులతో కలిసి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని లేఖ ద్వారా అభిమానులకు తెలియజేశారు. 🙏 pic.twitter.com/lmTH0lqiDx— Yash (@TheNameIsYash) December 30, 2024 -
రాజకీయ కవిసార్వభౌముడు
అది 1984 డిసెంబర్ 30. ముంబైలోని శివాజీ పార్కు. బీజేపీ సదస్సులో అటల్ ప్రసంగిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా విని్పంచేంతటి నిశ్శబ్దం నడుమ అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ‘‘చీకట్లు విడిపోతాయి. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారాయన. అప్పట్లో అంతా పెదవి విరిచినా, మరో పుష్కరం తిరక్కుండానే హస్తిన కోటపై కాషాయ జెండా ఎగరేసి చూపించారు. ప్రాణమిత్రుడు ఆడ్వాణీతో కలిసి బీజేపీని కేవలం రెండు లోక్సభ సీట్ల స్థాయి నుంచి కేంద్రంలో అధికార పీఠం దాకా ఒక్కొక్క మెట్టూ ఎక్కించారు. ఒకప్పుడు రాజకీయాల్లో అంటరానిదిగా పరిగణన పొందిన బీజేపీని వాజ్పేయీ ప్రబల శక్తిగా తీర్చిదిద్దారు. ఆ క్రమంలో ఎదురైన ఆటుపోట్లను ఏమాత్రమూ చలించని నిబ్బరంతో, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసి ఆ పదవికే వన్నె తెచ్చారు. అంతకుముందు లోక్సభలో విపక్ష నేతగానూ పార్టీలకతీతంగా మన్ననలూ అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పొరుగు దేశం కుట్రలను పటాపంచలు చేసి దేశ వైఖరిని ప్రస్ఫుటంగా చాటారు. నెహ్రూ తనకిష్టమైన నేత అని చెప్పినా, పాక్ పీచమణిచి బంగ్లాను విముక్తం చేసిన ఇందిరను విజయేందిరగా కొనియాడినా వాజ్పేయికే చెల్లింది. తర్వాత కొన్నేళ్లకే ఎమర్జెన్సీ వేళ అదే ఇందరి నియంతృత్వాన్ని ఆయన అంతే నిస్సంకోచంగా కడిగిపారేశారు. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాల కంటే దేశమే ముందని, ముఖ్యమని త్రికరణ శుద్ధిగా నమ్మడమే గాక దాన్ని ఆచరణలోనూ చూపారు. పలు సందర్భాల్లో మాతృ సంస్థ ఆరెస్సెస్ విధానాలతోనే విభేదించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై పార్టీ వైఖరికి భిన్న స్వరం వినిపించేందుకు కూడా వెనకాడలేదు. అంతేనా...? తొలిసారి ప్రధాని పదవి తనకు 13 రోజుల ముచ్చటగానే ముగిశాక నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర దించేందుకు ఏకంగా కాంగ్రెస్కు బయటి నుంచి మద్దతిచ్చేందుకు కూడా ముందుకొచి్చన దేశ ప్రేమికుడు వాజ్పేయి. ఇలా బహుముఖీనమైన వ్యక్తిత్వంతో పార్టీలకతీతంగా చెరగని అభిమానం సంపాదించుకున్నారు వాజ్పేయి. రాజనీతిజ్ఞుడనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయారు. ఆయన జయంతి డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవంగా ప్రకటిస్తూ కేంద్రం సముచిత నిర్ణయమే తీసుకుంది. ఆదర్శ నాయకుడు 1984 సార్వత్రిక ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా బీజేపీ గుర్తింపు తెచ్చుకుంది. వాజ్పేయి నేతృత్వంలో 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాల సాయంతో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ రూపంలో జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ ప్రయోగాలకు వాజ్పేయి ఆద్యునిగా నిలిచారు. పదో ప్రధానిగా ప్రమాణం చేశారు. 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చినా 1998లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 13 నెలల అనంతరం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయినా చలించలేదు. ఆ వెంటనే వచి్చన ఎన్నికల్లో నెగ్గి ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి పూర్తికాలం పదవిలో కొనసాగారు. ఆ ఘనత సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచిపోయారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో దశాబ్దాల విభేదాలకు, ఉద్రిక్తతలకు శాంతిచర్చలే విరుగుడంటూ సాహసోపేతంగా సంప్రదింపులకు తెర తీశారు. నాటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్ ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సరీ్వసును ప్రారంభించారు. పాక్ కపట బుద్ధి కార్గిల్ యుద్ధానికి దారి తీసినా ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పారు. 2003లో ఇరాక్పై యుద్ధంలో అమెరికా సైనిక సాయం కోరితే నిష్కర్షగా తిరస్కరించిన ధీశాలి వాజ్పేయి. డజన్ల కొద్దీ దేశాలు అమెరికా పక్షం వహించినా, అదే బాటన నడుద్దామని సొంత మంత్రివర్గ సభ్యులే ఒత్తిడి తెచి్చనా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అదే మేలని మీడియా సలహాలిచి్చనా ససేమిరా అన్నారు. ఇరాక్పై అమెరికా యుద్ధంలో పాల్గొనేది లేదని పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన కీలక ఘట్టంగా మిగిలిపోయింది.కీలక సంస్కరణలు మూడోసారి ప్రధానిగా కీలక ఆర్థిక సంస్కరణలకు వాజ్పేయి బాటలు వేశారు. పీవీ బాటన సాగుతూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని, సరళీకృత విధానాలను, విదేశీ పెట్టుబడులను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. హైవేల అభివృద్ధి, ప్రధాని గ్రామసడక్ పథకాలతో దేశ రవాణా రూపురేఖలనే మార్చేశారు. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేశారు. నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1998లో పోఖ్రాన్లో రెండో అణు పరీక్షల ద్వారా భారత అణ్వస్త్ర పాటవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలో టెలికాం విప్లవానికి బాటలు పరిచిందీ వాజ్పేయే. ఆయన హయాం సుపరిపాలనకు పర్యాయపదంగా నిలిచిపోయింది. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనంతరం వాజ్పేయీ క్రమంగా రాజకీయ రంగం నుంచి తప్పుకున్నారు. 2006లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ తర్వాత చివరిసారిగా మీడియాతో మాట్లాడారు వాజ్పేయి. ఈ సందర్భంగానే నాయకత్వ బాధ్యతలను ఆడ్వాణీకి అప్పగించారు. క్షీణించిన ఆరోగ్యానికి నిదర్శనంగా అప్పటికే చేతికర్ర సాయం తీసుకున్నారు. 2007లో చివరిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత 2018 ఆగస్టు 16న కన్నుమూసేదాకా దాదాపు పుష్కర కాలం వాజ్పేయి ఏకాంత జీవితమే గడిపారని చెప్పాలి. ఆ గళం.. అనితరసాధ్యంవాజ్పేయి అద్భుత వక్త. హిందీ, ఇంగ్లీష్ ల్లో తిరుగులేని వాగ్ధాటి ఆయన సొంతం. 1957లో పార్లమెంటేరియన్గా తొలి ప్రసంగంతోనే నాటి ప్రధాని నెహ్రూతో సహా అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో గొప్పగా రాణించి ప్రధాని అవుతాడంటూ నెహ్రూ ప్రశంసలు అందుకున్నారు. విపక్ష నేతగా అయినా, ప్రధానిగా హోదాలోనూ ఆయన మాట్లాడేందుకు లేచారంటే సభ్యులంతా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యం, చమత్కారాలు, అక్కడక్కడా అవసరమైన మేరకు వ్యంగ్యం మేళవిస్తూ కవితాత్మకంగా సాగే వాజ్పేయి ప్రసంగాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి. హిందీ అంతగా అర్థం కాని తమిళ దిగ్గజం సీఎన్ అన్నాదురైని కూడా ఆకట్టుకున్న ఘనత ఆయన ప్రసంగాలకు దక్కింది! 1994లో జెనీవా వేదికపై కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రించేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఏరికోరి వాజ్పేయినే ఎంచుకున్నారు. ఏ అంశంపై అయినా సమగ్ర కసరత్తు చేశాకే మాట్లాడేవారు. గణాంకాలు తదితరాలను తప్పకుండా ప్రస్తావించేవారు. అందుకే పార్లమెంటులో ఆయన వాదనలను తిప్పికొట్టలేక ప్రత్యర్థి పక్షాల్లోని మహామహులైన నేతలు కూడా చేష్టలుడిగేవారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన క్షణాలు తనకు మరపురానివని గుర్తు చేసుకునేవారు. వాజ్పేయి కొంతకాలం జర్నలిస్టుగా కూడా రాణించారు.సినీ ప్రియుడు వాజ్పేయి సినీ ప్రియుడు. పాత హిందీ సినిమాలు బాగా చూసేవారు. తీస్రీ కసమ్, దేవదాస్, బందినీ వంటివి ఆయన ఆల్టైం ఫేవరెట్ హిందీ సినిమాల్లో కొన్ని. లతా మంగేష్కర్, ముకేశ్, ఆయన అభిమాన గాయనీ గాయకులు. ‘మీకూ నాకూ ఎన్నో పోలికలు. ఇద్దరమూ ఒంటరితనమే. ఇంగ్లీష్ లో నా పేరు (అటల్)ను తిరగేస్తే మీ పేరు (లత) వస్తుంది’ అంటూ ఓసారి లతా మంగేష్కర్తో చమత్కరించారట! అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా బాగా ఇష్టపడేవారు. ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వై తనకిష్టమైన సినిమా అని తరచూ చెప్పేవారు. అలాగే బార్న్ ఫ్రీ, గాంధీ సినిమాలు కూడా. వాజ్పేయి కవితలకు పలువురు గాయకులు ప్రాణం పోయడం మరో విశేషం. ఆయన రాసిన ‘క్యా ఖోయా, క్యా పాయా’, ‘దూర్ కహీ కోయీ రోతా హై’, ‘ఝుకీ న ఆంఖే’ వంటి వేదనాభరిత కవితలను గజల్ సమ్రాట్ జగ్జీత్సింగ్ తన గళంతో అజరామరం చేశారు. శరత్, ప్రేమ్చంద్ సాహిత్యమన్నా వాజ్పేయికి ప్రాణం. ఎమర్జెన్సీ వేళ జైల్లోనూ కవితా రచన చేసిన కళాపిపాసి వాజ్పేయీ. అడ్వాణీ ఆయనకు ఆజన్మాంతం ప్రియమిత్రుడు. తనతో కలిసి ఢిల్లీ వీధుల్లో స్కూటర్పై చక్కర్లు కొట్టేవారు. పానీపూరీ, చాట్ వాజ్పేయి ఎంతో ఇష్టంగా తినేవారని అడ్వాణీ చెబుతారు. ఆయన చేయి తిరిగిన వంటగాడే గాక మంచి భోజనప్రియుడు కూడా.చావు అయుష్షెంత, రెండు క్షణాలేగా! మరి జీవితమేమో ప్రగతిశీలం, ఒకటీ రెండు నాళ్లలో ముగిసేది కాదు ప్రధానిగా ఒకనాటికి మాజీని అవుతానేమో. మాజీ కవిని మాత్రం ఎప్పటికీ కాలేను మిత్రులను మార్చగలం గానీ పొరుగువారిని మార్చుకోలేం భారతీయులుగా మనమంతా ఉత్కృష్ట నాగరికతకు వారసులం. శాంతే మన జీవిత గీతిక అధికారం కోసం పార్టీని చీల్చాల్సి, కొత్త గ్రూపులు కట్టాల్సే వస్తే అలాంటి అధికారాన్ని తాకనైనా తాకను పేదరికం బహుముఖీనం. దాన్ని కేవలం డబ్బు, ఆదాయం, విద్య, ఆరోగ్య పరామితుల్లో కొలవలేం పుడమి వయసు లక్షల ఏళ్లు. మనిషివి అంతులేని జీవన గాథలు. కానీ మన దేహానికి హద్దులున్నాయి.శత శరత్కాలాల వాణిని విన్నాం. అది చిట్టచివరిసారి తట్టినపుడైనా మనసు తలుపు తెరుద్దాంపాలిటిక్స్తో విసిగిపోయా. వాటిని వదిలేద్దామనుకుంటున్నాను. కానీ అవి నన్ను వదిలేలా లేవుస్వేచ్ఛకు సంకెళ్లు వేద్దామనుకునేవాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. నిప్పుతో చెలగాటాలొద్దు. పక్కింటికి నిప్పుపెడితే ఆ దావాగ్ని మీ ఇంటినీ కాల్చేస్తుంది–వాజ్పేయి -
పుట్టిన రోజు వేడుకలకని పిలిచి... అవమానించడంతో బాలుడి ఆత్మహత్య
బస్తీ (యూపీ): పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించారు. వచ్చిన బాలుడి బట్టలిప్పించారు. మీద మూత్ర విసర్జన చేశారు. ఆ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. వీడియోను ఫోన్ నుంచి తీసేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా వినిపించుకోలేదు. ఫిర్యాదు చేస్తే పోలీసులూ పట్టించుకోలేదు. అవమానం భరించలేక 17ఏళ్ల దళిత బాలుడు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో జరిగింది. సంత్ కబీర్నగర్ జిల్లాకు చెందిన బాలుడు బస్తీ జిల్లాలోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ రాత్రి గ్రామస్తులు కొందరు బర్త్ డే పారీ్టకి బాలుడిని ఆహా్వనించారు. అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు అతడిని బట్టలు విప్పి, చితకబాదారు. మూత్ర విసర్జన చేసి అవమానించారు. అంతేకాదు ఉమ్మివేసి నాకాలని బలవంతం చేశారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియోలో బంధించారు. జరిగిన అవమానాన్ని బాలుడు ఇంట్లో చెప్పాడు. వీడియోను డిలీట్ చేయాలని కుటుంబ సభ్యులు వారిని కోరినా వినలేదు. దీంతో వారిపై కెపె్టన్గంజ్ పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎస్హెచ్ఓ నిరాకరించారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అవమానాన్ని భరించలేక సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాధితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతో ఎస్పీ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కెపె్టన్గంజ్ ఎస్హెచ్ఓ దీపక్కుమార్ దూబేను సస్పెండ్ చేశారు. బాలుడి మేనమామ ఫిర్యాదు మేరకు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. -
సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!
-
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
పులివెందులలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
నగరిలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
-
జిల్లాల వారీగా ఘనంగా YS జగన్ పుట్టినరోజు వేడుకలు
-
వైఎస్ జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
-
కర్నూలులో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
#HBDYSJAGAN ఎన్ఆర్ఐల గ్రాండ్ సెలబ్రేషన్స్
-
HBDYSJAGAN: వైఎస్ జగన్ బర్త్డే వేడుక ఫొటోలు
-
సిస్టర్కు విషెస్ తెలిపిన గ్లోబల్ స్టార్.. సోషల్ మీడియాలో పోస్ట్!
మెగా హీరో రామ్ చరణ్ తన చెల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మెగా డాటర్ నిహారిక కొణిదెల బర్త్ డే కావడంతో ప్రత్యేకంగా విష్ చేశారు. హ్యాపీ బర్త్ డే నిహారిక.. వచ్చే ఏడాదిలో నువ్వు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ చెర్రీ ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. తనతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు.కాగా.. మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పని చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కనుంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. Happy birthday to dearest Niharika. Wishing you more success in the coming year.!! pic.twitter.com/IxfMfmf1kr— Ram Charan (@AlwaysRamCharan) December 18, 2024 -
నీలి కళ్ల పోలిక.. ఈ హీరోయిన్ కెరీర్ కొంపముంచింది! (ఫొటోలు)
-
మెగా కోడలు లావణ్య త్రిపాఠి బర్త్ డే.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? (ఫొటోలు)
-
వివాదాలకు దూరం.. విక్టరీ వెంకటేశ్ ఎందుకంత స్పెషల్? (ఫొటోలు)
-
హీరోలతో రిలేషన్ రూమర్స్.. 'మ్యాగీ' కాంట్రవర్సీ.. రెజీనా ఇప్పుడేం చేస్తోంది? (ఫొటోలు)
-
స్టయిలిష్గా...
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా గురువారం (డిసెంబరు 12) వెంకటేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఆయన స్టయిలిష్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలోని రెండో పాట ‘మీనూ... ప్రోమోను నేడు రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. -
15 ఏళ్లకే పెళ్లి.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు.. సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న నటి!
-
Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ నేటితో (2024 డిసెంబర్ 12) 84 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శరద్ పవార్ 1940, డిసెంబర్ 12న జన్మించారు. ఆయన తన రాజీకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అయితే కాంగ్రెస్ను వీడి సొంతంగా పార్టీ వ్యవస్థాపించడం ఆయన జీవితంలో మైలురాయిగా నిలుస్తుంది. ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే పుస్తకంలో ఆయన జీవితానికి సంబంధించిన పలు అంశాలు కనిపిస్తాయి. నాడు 12వ లోక్సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఫ్రంట్లో గందరగోళం ఏర్పడిందని ప్రముఖ రచయిత రాజ్కమల్ ప్రకాశన్ ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆ పుస్తకంలోని వివరాల ప్రకారం.. అప్పటికేప్పటికే పవార్, సోనియా గాంధీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పవార్ లోక్సభలో పార్టీ నేతగా ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కోసం పవార్ స్వయంగా సోనియా గాంధీతో చర్చించి, ఆమె ఆమోదం తీసుకున్నారు. జాబితాను లోక్సభ స్పీకర్కు పంపారు. మర్నాడు నాటి స్పీకర్ జిఎంసీ బాలయోగి.. పవార్కు ఫోన్ చేసి.. ‘నాకు ఇప్పుడొక సమస్య ఏర్పడింది. మీ పార్టీ నుంచి నాకు రెండు జాబితాలు అందాయి. కాంగ్రెస్ చీఫ్ డైరెక్టర్ పీజే కురియన్ నాకు మరో జాబితా పంపారు. ఈ రెండు జాబితాల్లోనూ పేర్లు వేర్వేరుగా ఉన్నాయి’ అని అన్నారు.లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకునిగా ఉన్నందున, కమిటీ సభ్యుల జాబితాను స్పీకర్కు సమర్పించడంపై శరద్ పవార్కు హక్కు ఉంది. అయితే దీనిని అతిక్రమిస్తూ మరో జాబితా విడుదలైంది. రెండో జాబితా ఫోటోకాపీ అందిన తర్వాత పవార్ వివరాలు తెలుసుకునేందుకు కురియన్ను సంప్రదించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి సూచనల మేరకే రెండో జాబితాను సిద్ధం చేసినట్లు వారి మాటల్లో వెల్లడైంది. వెంటనే పవార్ స్వయంగా సోనియాను కలిశారు. సోనియాతో మీరు రూపొందించిన జాబితాను ఉపసంహరించుకోవాలని పవార్ను కోరారు.1999 మే 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆమె విదేశీయురాలనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమావేశంలో అర్జున్ సింగ్, ఏకే ఆంటోనీ, గులామ్నబీ ఆజాద్, అంబికా సోనీ తదితరులు సోనియాపట్ల తమ విధేయతను ప్రకటించారు. అయితే పీఏ సంగ్మా ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. సంగ్మాకు శరద్ పవార్, తారిఖ్ అన్వర్ మద్దతు పలికారు. కొద్దిరోజుల తరువాత పార్టీ ఈ ముగ్గురినీ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. అనంతరం ఈ ముగ్గురూ మరికొందరు నేతల సహాయంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు.ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి -
ఎవర్గ్రీన్ స్టైలిష్ స్టార్.. తలైవా రజినీని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)