ప్రదీప్ రావత్ మరణం.. అసలు టాలీవుడ్‌కు ఏమైంది? | Tollywood Not responds on Pradeep Rawat Sudden Demise | Sakshi
Sakshi News home page

Pradeep Rawat: ప్రదీప్ రావత్ మరణం.. అసలు టాలీవుడ్‌కు ఏమైంది?

Aug 5 2026 10:28 PM | Updated on Aug 5 2026 10:29 PM

Tollywood Not responds on Pradeep Rawat Sudden Demise

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం చెందారు. గత ఐదేళ్లుగా బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్‌ సాయంత్రం కన్నుమూశారు ముంబయిలోని గోరెగావ్‌లో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, రాజ్ అర్జున్, కరణ్ వి గ్రోవర్, సురేంద్ర పాల్, రుహానికా ధావన్ తదితరులు ఉన్నారు. అంత్యక్రియల సమయంలో రావత్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

స్పందించని టాలీవుడ్..

బాలీవుడ్ కంటే తెలుగు సినిమాల్లో ఎక్కువగా మెప్పించిన ప్రదీప్ రావత్‌పై టాలీవుడ్ చిన్నచూపు చూసింది. ఆయన మరణం తర్వాత ఏ ఒక్క హీరో సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించలేదు. కేవలం మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రమే ఆయనను గుర్తు చేసుకున్నారు. ప్రదీప్ రావత్ లేరన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఆయనకు నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. 

మంచు విష్ణు సంతాపం.. 

మంచు విష్ణు తన ట్వీట్‌లో రాస్తూ..'ప్రదీప్ రావత్ మరణవార్త విని చాలా బాధపడ్డా. తెరపై, ఆయన పోషించిన ప్రతి పాత్రకు అపారమైన శక్తిని తీసుకొచ్చారు. కానీ తెర వెనుక, ఆయన దానికి పూర్తి విరుద్ధం. ఎంతో వినయశీలి, నిరాడంబరుడు, ఆప్యాయత గలవారు. ఎంతో ఒదిగి ఉండే వ్యక్తి. నేను ఆయనను ఎల్లప్పుడూ అలాగే గుర్తుంచుకుంటాను. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఇదే నా హృదయపూర్వక సంతాపం. ఈ కష్ట సమయంలో భగవంతుడు వారికి శక్తిని ప్రసాదించాలని, ఆయన పవిత్రాత్మ శాశ్వత శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి' అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. హిందీ మూవీ బాఘితో  సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత  నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్‌షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్‌, నాయక్‌, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు.  తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement