దళపతి విజయ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ జన నాయగన్(తెలుగులో జన నాయకుడు). పొలిటికల్ ఎంట్రీ ముందు నటించిన చివరి సినిమా ఇదే. రాజకీయాల్లోకి వచ్చేముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఎట్టకేలకు విజయ్ సీఎం అయ్యాక ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
జూలైలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. విజయ్ ఫ్యాన్స్లో క్రేజ్ ఉండడంతో కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. దీంతో థియేటర్లలో ఓ మాదిరిగా ఆకట్టుకున్న జన నాయగన్ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జన నాయగన్ ఓటీటీ రిలీజ్కు సంబంధించి క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు నెల రోజుల్లోపే రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ జీ5 సొంతం చేసుకుంది. ఈ నెల 21 నుంచి తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కాగా.. ఈ మూవీకి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియమణి, రేవతి, సునీల్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.


