breaking news
Jana Nayagan Movie
-
'జన నాయగన్' రిలీజ్కు గ్రీన్ సిగ్నల్..?
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ విడుదల కానుంది. ఈమేరకు కోలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దేశ రక్షణకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయని, వాటిని తొలగిస్తేనే సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పేర్కొంది.జన నాయగన్ సెన్సార్ విషయంలో నెలల తరబడి కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే దిశగా చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు చిత్ర నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.కోలీవుడ్లో వచ్చిన కథనాల ప్రకారం. సెన్సార్ బోర్డు అభ్యంతరం సూచించిన సుమారు 20 నిమిషాల నిడివి గల సీన్స్ను తొలగించడంతో పాటు కొన్ని డైలాగ్స్ను కూడా మ్యూట్ చేయడానికి నిర్మాతలు అంగీకరించారని సమాచారం. తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డ్కి కొత్త వర్షెన్ సమర్పించి కోర్టు కేసులని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్కేలు నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, రేవతి తదితరులు నటించారు. -
'జన నాయగన్' సెన్సార్పై తొలిసారి స్పందించిన విజయ్
విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో తెలీదు. ఈ అంశంపై ఆయన అభిమానులు భగ్గుమంటున్నారు. నిర్మాతకు కోట్లలో నష్టం వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే దర్శక నిర్మాతలు స్పందించారు. అయితే, తాజాగా విజయ్ తొలిసారి జన నాయగన్ వాయిదాపై మాట్లాడారు.ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ పలు వ్యాఖ్యలు చేశారు. సినిమాను ఇలా అడ్డుకోవడం చాలా బాధ అనిపించిందని పేర్కొన్నారు. ఈ మూవీ నిర్మాతను తలుచుకుంటేనే తనకు బాధ కలుగుతోందని పేర్కొన్నారు. తాను రాజకీయ ప్రవేశం చేయడం వల్ల తనకు ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించానన్నారు. అందుకు తాను మెంటల్గా సిద్ధం అయినట్లు నటుడు విజయ్ పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాత వెంకట్ కె.నారాయణ కూడా పలుమార్లు విడుదల ఆలస్యంపై బాధపడ్డారనేది తెలిసిందే.సెన్సార్ చిక్కువల వల్ల జనవరి 9న విడుదల కావాల్సిన ‘జన నాయగన్’ వాయిదా పడింది. కనీసం విడుదల ఎప్పుడు అనేది కూడా క్లారిటీ లేదు. దర్శకుడుహెచ్ .వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయ్ కెరీర్లో చివరిది కావడం విశేషం. ఇందులో పూజా హెగ్డే కథానాయకిగా నటించగా మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్ర పోషించారు. -
'జన నాయగన్'ను ఇబ్బంది పెడుతున్న సీన్స్ ఏంటి..?
జన నాయగన్ చిత్రం ఇప్పుడు మరింత వివాదాంశంగా మారుతోంది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీని హెచ్.వినోద్ దర్శకత్వలో కేవీఎన్ సంస్థ భారీ బడ్జెట్తో తెరకెక్కించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సెన్సార్ సమస్యలు తలెత్తడంతో సెన్సార్బోర్డు, కోర్టుల్లో ఈ చిత్రం నానుతోంది. చిత్రంలో పలు వివాదాస్పద సన్నివేశాలు చోటు చేసుకోవడంతో చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపినట్లు సెన్సార్బోర్డు అధికారులు పేర్కొన్నారు. దీంతో చిత్ర నిర్మాత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఆషా.. జననాయగన్ చిత్రానికి వెంటనే సర్టిఫికెట్ అందించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులను వ్యతికేకిస్తూ సెన్సార్బోర్డు అధికారులు మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే చిత్ర నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ కేసును విచారించడంలో తమకు ఆసక్తిలేదని, మద్రాసు హైకోర్టులోనే తేల్చుకోవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.జన నాయగన్లో ఉన్న అభ్యంతరాలు ఇవేజన నాయగన్ చిత్ర వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ఆసక్తికరమైన ఆదేశాలను జారీ చేసింది. జన నాయగన్ చిత్రంలో మత విభేదాలకు ఆస్కారం కలిగించే సన్నివేశాలు చోటు చేసుకున్నాయని, కొన్ని విదేశీ శక్తులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసినట్లు చిత్రీకరించిన సన్నివేశాలను అంగీకరించబోమని సెన్సార్ బోర్డు సభ్యులు తెలిపారు. అందుకే 9 మంది సభ్యుల రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. భద్రతా దళాలకు సంబంధించిన చాలా సీన్లు ఉండడం ఒక కారణమైతే.. మొదట ఈ సినిమాను చూసిన కమిటీలో నిపుణులు లేకపోవడం వల్ల మరో సమస్యకు దారి తీసింది. దీంతో మరోసారి రివైజింగ్కు పంపేందుకు సెన్సార్ నిర్ణయం తీసుకుంది. రివైజింగ్ కమిటీ తర్వాత సెన్సార్ వస్తుందని ప్రకటించారు. కానీ, ఇక్కడే ఆలస్యం జరుగుతుంది. చిత్ర నిర్మాతలకు సరైన తేదీ వారు చెప్పకపోవడంతో సినిమా ఎప్పుడు విడుదల కానుందో ఎవరికీ సరైన క్లారిటీ లేదు. సెన్సార్ బోర్డు అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉండగానే చిత్ర నిర్మాతలు ఎలాంటి వివరణ ఇవ్వకుండా సెన్సార్ సర్టిఫికెట్ను కోరడం సముచితం కాదని మద్రాస్ కోర్టు సూచించింది.సెన్సార్ బోర్డే అవసరం లేదు నటుడు మన్సూర్ అలీఖాన్ సెన్సార్ బోర్డుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన చెన్నైలో జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ నటించిన జననాయగన్ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. సెన్సార్ బోర్డు వివక్షత ధోరణికి పాల్పడుతోందని విమర్శించారు. కాశ్మీర్ ఫైల్స్, కేరళా స్టోరీ వంటి వివాదాస్పద చిత్రాలకు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్బోర్డు జననాయగన్ చిత్రానికి ఇవ్వడానికి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నంచారు. ఈ విషయంలో సెన్సార్ బోర్డే అవసరం లేదని అన్నారు. సెన్సార్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో కాకుండా,సినిమాకు చెందిన మధ్యవర్తులతో కూడిన కమిటీగా ఉండాలన్నారు. -
విజయ్ భయపడే రకం కాదు.. 'జన నాయగన్'పై తండ్రి కామెంట్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’పై రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ పేరుతో విజయ్ని ఇబ్బంది పెడుతున్నారంటూ స్టాలిన్ ప్రభుత్వంతో పాటు బీజేపీపై మండిపడుతున్నారు. దశాబ్దాల పాటు అభిమానులను మెప్పించిన విజయ్కు సినిమాల నుంచి మంచి వీడ్కోలు దక్కాలని తాము ఆశించామని అభిమానులు ఆకాంక్షించారు. తాజాగా మూవీ విడుదల జాప్యంపై విజయ్ తండ్రి, దర్శక, నిర్మాత ఎస్.ఎ.చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు.జన నాయగన్ సినిమాతో విజయ్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే ప్రశ్నకు ఆయన తండ్రి చంద్రశేఖర్ ఇలా అన్నారు. 'విజయ్ చాలా ధైర్యవంతుడు.. మొండోడు కూడా.. ఇలాంటి సవాళ్లకు భయపడే రకం కాదు. తన ప్రయాణంలో చాలా అడ్డంకులను దాటుకొని వచ్చాడు. భవిష్యత్లో ఇంతకుమించిన చిక్కులు వస్తాయని విజయ్కు తెలుసు. ప్రతి అడ్డంకిని ఎదుర్కొనేందుకు సిద్దంగానే ఉన్నాడు. కరూర్ ఘటనతో విజయ్ను ఆపాలని చూశారు. అక్కడ ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అందులో భాగమే జన నాయగన్ సినిమా అంశం కూడా ఉంది. సినిమా ఎందుకు విడుదల కాలేదనేది తమిళ ప్రజలందరికీ తెలుసు. విజయ్ ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేశాడో యువత కూడా పాలిటిక్స్ గుర్చి మాట్లాడుతుంది. ఇప్పుడు వారికే అన్ని విషయాలు బాగా తెలుసు.' అని ఆయన అన్నారు.విజయ్-హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘జన నాయగన్’ విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ మూవీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కన పెట్టింది. దీనితో విడుదల మరింత ఆలస్యం అయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి జన నాయగన్కు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేంత వరకు ఆగాల్సిందేనని హైకోర్టు తెలిపింది. -
విజయ్ సినిమాకు హైకోర్టు షాక్ జననాయగన్ విడుదల డౌటే..!
-
'జన నాయగన్' విడుదలపై హైకోర్టు కీలక తీర్పు
విజయ్-హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘జన నాయగన్’ విడుదల మరింత ఆలస్యం కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఇప్పట్లో జన నాయగన్ విడుల లేనట్లేనని తెలుస్తోంది.విజయ్ సినిమా జన నాయగన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కన పెట్టింది. దీనితో విడుదల మరింత ఆలస్యం అయింది. సినిమా సెన్సార్ విషయంలో బోర్డుకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని సింగిల్ బెంచ్ జడ్జిని హైకోర్టు సూచించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి జన నాయగన్కు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేంత వరకు ఆగాల్సిందేనని హైకోర్టు తెలిపింది. కొత్తగా మళ్లీ విచారణకు ఆదేశించి సినిమాను రీవైజ్ కమిటీ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టు తెలిపింది. దీంతో విడుదల మరింత ఆలస్యం కానుంది. -
'జన నాయగన్' ప్రభావం చిరంజీవి మూవీపై పడనుందా..?
మన శంకర వరప్రసాద్గారు మూవీ భారీ హిట్ కొట్టేసింది.. ఇదే ఊపులో చిరంజీవి- దర్శకుడు బాబీ కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది. 'మెగా 158' వర్కింగ్ టైటిల్తో ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో మొదలు కానుందని సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. అయితే, విజయ్ నటించిన జన నాయగన్ వాయిదా ఎఫెక్ట్ చిరు మూవీపై పడనుందా అంటూ నెట్టింట అనేక ప్రశ్నలు కనిపిస్తున్నాయి.జన నాయగన్ సినిమాను కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో చిరంజీవి మూవీతో ఎంట్రీ ఇవ్వాలని ఆ సంస్థ ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే మెగా 158 ప్రాజెక్ట్తో నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, నిషా వెంకట్ కొనంకి ఢీల్ కుదుర్చుకున్నారు. అయితే జన నాయగన్ సెన్సార్ గొడవ కారణంగా ఆ సంస్థ కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో చిరు- బాబీ సినిమా మరింత ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సిన చిరంజీవి మూవీ.. జన నాయగన్ ఎఫెక్ట్ వల్ల మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. అయితే, అంత వరకు చిరు, బాబీ వేచి చూస్తారా..? అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. ఇదే సమయంలో మరికొందరు అదంతా రూమర్స్ మాత్రమేనని తెలుపుతున్నారు. జన నాయగన్ వివాదం ఉన్నప్పటికీ చిరు వంటి స్టార్ హీరోతో వచ్చిన ఛాన్స్ను ఆ సంస్థ వదులుకోదని చెబుతున్నారు. అనుకున్న సమయానికే షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని ఫ్యాన్స్ తెలుపుతున్నారు.‘వాల్తేరు వీరయ్య’ విజయం తర్వాత చిరు- బాబీ కాంబోలో ఈ మూవీ రానున్నడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా యాక్షన్ మోడ్లో ఉంటుందని తెలుస్తోంది. మెగాస్టార్ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో తెరపై కనిపిస్తారని టాక్.. ఇందులో చిరుతో పాటు మరో స్టార్ కూడా తెర పంచుకునే అవకాశమున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం కోర్టులో విజయ్ సినిమాకు భారీ ఎదురు దెబ్బ
తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’(Jana nayagan) కి సుప్రీం కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ని విచారించకుండానే హైకోర్టు డివిజన్ బెంచ్కు తిరిగి పంపింది. ఈ నెల 20వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని మద్రాసు హైకోర్టుకు సూచించింది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఆలస్యమైంది. సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో, నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాకు వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ను ఇవ్వాల్సిందిగా 9వ తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సీబీఎఫ్సీని ఆదేశించింది. అనంతరం, కొద్ది గంటల్లోనే సీబీఎఫ్సీ వినతిపై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాతలు ఈ నెల 12న సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటిషన్ను ఎంటర్టైన్ చేయకుండా, హైకోర్టు డివిజన్ బెంచ్కు తిరిగి పంపింది. హైకోర్టు జనవరి 20లోపు ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. -
జన నాయగన్పై సుప్రీం విచారణ ఎప్పుడంటే..
తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ నటించిన ‘జన నాయగన్’సినిమా విడుదల విషయంలో తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు ఈ నెల 19వ తేదీన విచారణ చేపట్టనుంది. సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) క్లియరెన్స్పై మద్రాస్ హైకోర్టు స్టే విధించడాన్ని నిర్మాత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే, కేసు విచారణ చేపట్టే సుప్రీం ధర్మాసనం ఖరారు కావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో దిగేందుకు, విజయ్ నటించిన చిట్ట చివరి సినిమాగా జన నాయగన్ను భావిస్తున్నారు. ఈ మేరకు 9వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో, నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాకు వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ను ఇవ్వాల్సిందిగా 9వ తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సీబీఎఫ్సీని ఆదేశించింది. అనంతరం, కొద్ది గంటల్లోనే సీబీఎఫ్సీ వినతిపై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. సీబీఎఫ్సీకి వాదనను వినిపించుకునే అవకాశం ఏకసభ్య ధర్మాసనం ఇవ్వలేదని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రమే అడ్డుకుంటోంది: రాహుల్టీవీకే చీఫ్ విజయ్ నటించిన జన నాయగన్ సినిమా విడుదలను కేంద్రమే అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిని ఆయన తమిళ సంస్కృతిపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. తమిళ వాణిని అణచివేయాలని చూస్తే ప్రధాని మోదీ ఎన్నటికీ విజయం సాధించలేరన్నారు. విజయ్ నటించిన జన నాయగన్ సినిమాపై వివాదం తలెత్తిన వేళ ఎక్స్లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘జన నాయగన్ సినిమాను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడ్డుకోజూడటం తమిళ సంస్కృతిపై దాడే. మిస్టర్ మోదీ, తమిళుల గొంతు నొక్కాలని చూస్తే ఎన్నటికీ విజయం సాధించలేరు’అని రాహుల్ పేర్కొన్నారు. -
విజయ్ ఫ్యాన్స్పై 'సుధా కొంగర' సంచలన కామెంట్స్
తమిళనాడులో శివకార్తికేయన్, విజయ్ దళపతి ఫ్యాన్స్ వార్ పెద్ద ఎత్తున జరుగుతుంది. తాజాగా విడుదలైన ‘పరాశక్తి’పై విజయ్ అభిమానులు దుష్ప్రచారం చేస్తున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవ్ రామ్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బుక్ మై షోలో నెగెటివ్ రివ్యూలు ఇవ్వడమే కాకుండా మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొన్ని ఆధారాలను సోషల్మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ విజయ్ ఫ్యాన్స్పై ఫైర్ అయ్యారు.రౌడీయిజంతో పోరాడుతున్నాంది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సుధా కొంగర ఇలా అన్నారు. 'ప్రస్తుత కాలంలో సినిమాను ప్రేక్షకులకు చేర్చడంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ మార్కెటింగ్ యుగంలో ఎన్నో సవాళ్లను దాటుకోవాలి. సినిమా బాగున్నా సరే తప్పుడు ప్రచారంలో ఇబ్బందులు తప్పవు. పొంగల్ వారాంతంలో మా సినిమా (పరాశక్తి) మరింత మందికి చేరువవుతుందని నేను ఆశిస్తున్నాను. ఒక నటుడి అభిమానుల వల్ల మేము చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫేక్ ఐడీలతో మాపై చాలా దారుణమైన పోస్టులు చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. విజయ్ ఫ్యాన్స్ పేరుతో కొన్ని ఖాతాల నుంచి షేర్ చేసిన పోస్టులు మరింత నీచంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం ఏంటి.. తమ హీరో సినిమా విడుదల కాలేదని ఆయన ఫ్యాన్స్ చేసే హెచ్చరికలు ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. మేము రౌడీయిజం, గూనిజంతో పోరాడుతున్నాం.' అంటూ ఆమె అన్నారు.జన నాయగన్, పరాశక్తి రెండు సినిమాలకు సెన్సార్ చిక్కులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పరాశక్తి మూవీకి 25 కట్స్ సూచించి విడుదలకు 4గంటల ముందు సెన్సార్ ఇచ్చారు. కానీ, జన నాయగన్కు అనుమతి ఇవ్వలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. పరాశక్తి సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా ఉదయ్నిధి స్టాలిన్ పంపిణీ చేశారు. దీంతో జన నాయగన్పై రాజకీయ కుట్ర జరిగిందని విజయ్ ఫ్యాన్స్ భావించారు. అందుకే పరాశక్తి సినిమా పట్ల వారు నెగటివ్ రివ్యూలు ప్రారంభించారని తెలుస్తోంది. -
పరిస్థితి మా చేయి దాటిపోయింది: నిర్మాత భావోద్వేగం
తన సినిమాలతో దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్నాడు హీరో విజయ్. ఇకపై ప్రజాసేవకే పరిమితం అవాలనుకున్న ఆయన జన నాయగణ్తో సినిమాలకు వీడ్కోలు పలకాలని భావించాడు. ఇదే తన చివరి చిత్రం అని ప్రకటించాడు. అభిమాన హీరోని చివరిసారి థియేటర్లో చూసుకుని సెలబ్రేట్ చేసుకునే రోజు కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. చివరి నిమిషంలో వాయిదాకానీ సెన్సార్ సమస్య కారణంగా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో జన నాయగణ్ నిర్మాత వెంకట్ కె నారాయణ భావోద్వేగానికి లోనయ్యాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ.. జన నాగయణ్ సినిమాను 2025 డిసెంబర్ 18న సీబీఎఫ్సీకి పంపించాం. డిసెంబర్ 22న యూఏ 16+ సర్టిఫికెట్ ఇస్తామంటూ మాకు మెయిల్ చేశారు. సడన్గా ఓ ఫిర్యాదుఅలాగే కొన్ని మార్పులు చేయాలన్నారు. వాళ్లు సూచించినట్లుగా ఆ మార్పులు చేసి సినిమాను మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాం. సినిమా రిలీజ్కు మేమన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇంతలో సినిమాపై ఒక ఫిర్యాదు వచ్చిందని, దీన్ని రివైజింగ్ కమిటీకి పంపుతున్నామంటూ జనవరి 5న సెన్సార్ బోర్డు మెయిల్ చేసింది. ఆ ఫిర్యాదు ఏంటో? ఎవరు చేశారో? మాకు స్పష్టత లేదు. పరిస్థితి చేయిదాటిందిపైగా రివైజింగ్ కమిటీని సంప్రదించేందుకు సమయం మించిపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఏదేమైనా పరిస్థితి మా చేయిదాటిపోయింది. సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. అందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా అభిమానులను అలరించిన హీరో విజయ్కు మంచి వీడ్కోలు దక్కాల్సింది! అని విచారం వ్యక్తం చేశాడు.అసలేంటి సమస్య?భగవంత్ కేసరి సినిమాను ఆధారంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం జన నాయగణ్. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సీబీఎఫ్సీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేసింది. దీంతో రిలీజ్కు మూడురోజుల ముందు చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో అటు చిత్రయూనిట్, ఇటు అభిమానులు సంతోషపడేలోపే మరో బాంబు పేలింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఎఫ్సీ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంన్ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. View this post on Instagram A post shared by KVN Productions (@kvn.productions)చదవండి: రాజాసాబ్.. అందుకే ఎవరికీ మా సినిమా ఎక్కలేదు: మారుతి -
'జన నాయగన్'కు కమల్ సపోర్ట్.. సెన్సార్ మారాలి
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ విడుదలకు పలు ఇబ్బందులు రావడంతో ఆయన ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను సైతం తప్పుబడుతున్నారు. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులోని ప్రముఖ హీరోలతో పాటు రాజకీయ నేతలు కూడా విజయ్కు మద్ధతుగా నిలిచారు. అయితే, తాజాగా విజయ్ కోసం ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు కమల్హాసన్ ఒక ట్వీట్ చేశారు.కళకు, కళాకారులకు, రాజ్యాంగానికి మద్దతుగా అంటూ అధికారిక ప్రకటనను కమల్హాసన్ విడుదల చేశారు. కమల్ హాసన్ ప్రకటనలో పలు అంశాలను లేవనెత్తారు. 'భారతదేశ రాజ్యాంగం మనందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. కానీ, దానిని నేడు కొందరు అంధకారంలోకి నెట్టివేస్తున్నారు. ఇది ఒక్క సినిమాకు సంబంధించిన విషయం కాదు.., కళాకారులకు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇచ్చే స్థానం గురించి కూడా ప్రతిబింబిస్తుంది. సినిమా అనేది కేవలం ఒక వ్యక్తి కృషి మాత్రమే కాదు.. ఇందులో రచయితలు, సాంకేతిక నిపుణులు, నటులు, చిన్న వ్యాపారాలు కూడా భాగస్వామ్యంగా కలిసి నిర్మించే సమిష్టి శ్రమ. వీరి జీవనాధారం ఇందులో భాగమై ఉంటుంది.సమాజంలో ఇలాంటి అంశాల్లో స్పష్టత లేకపోతే సృజనాత్మకత కుంటు పడుతుంది. ఆపై ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి. ప్రభుత్వ తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజల నమ్మకం తగ్గుతుంది. తమిళనాడుతో పాటు భారతదేశం సినీ ప్రేమికులు కళల పట్ల ఎంతో ప్రేమను, పరిపక్వతను చూపుతారు. వారికి పారదర్శకతతో పాటు గౌరవం ఇవ్వండి. సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియను మరోసారి పునఃపరిశీలించాలి. ఒక సినిమాకు ఇవ్వాల్సిన అనుమతులకు నిర్దిష్ట సమయ పరిమితులు ఉండాలి. అందులో పారదర్శకంగా అధికారులు పనిచేయాలి. సినిమా నుంచి ఏదైనా సీన్కు అభ్యంతరం ఉంటే అందుకు సంబంధించిన మార్పులను వ్రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. సినిమా పరిశ్రమ మొత్తం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వాలతో చర్చించాల్సిన సమయం ఇదే. ' అని విజయ్కు మద్ధతుగా కమల్ ట్వీట్ చేశారు.For Art, For Artists, For the Constitution pic.twitter.com/sOrlOOLFtv— Kamal Haasan (@ikamalhaasan) January 10, 2026 -
దళపతి విజయ్.. గతంలోనూ ఇలాంటి అనుభవాలే
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్' వాయిదా పడింది. లెక్క ప్రకారం ఈరోజే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే కొత్త తేదీని ప్రకటించలేదు. 21వ తేదీన తర్వాత హియరింగ్ ఉంది. చూస్తుంటే ఈనెల రావడమే కష్టమే. దీని వెనక రాజకీయ కారణాలున్నాయని అభిమానులు, విజయ్ టీవీకే పార్టీ ఆరోపిస్తోంది. ఇదే కాదు గతంలోనూ విజయ్ చిత్రాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి ఆ మూవీస్ ఏంటి?(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)2023లో రిలీజైన 'లియో'కు చాలానే సమస్యలు ఏర్పడ్డాయి. తమిళనాడు వ్యాప్తంగా మార్నింగ్ షోలు వేయనివ్వలేదు. రోజుకి ఇన్ని షోలు మాత్రమే వేయాలని కఠినంగా వ్యవహరించారు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశమివ్వలేదు. ఇలా పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. ఓవరాల్ రన్ ముగిసేసరికి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ మూవీగా నిలిచింది.2017లో రిలీజైన 'మెర్సల్'(అదిరింది).. రిలీజ్ తర్వాత రాజకీయ ఇబ్బందుల్లో ఎదుర్కొంది. జీఎస్టీ, నోట్ల రద్దు గురించి ఉన్న డైలాగ్స్ విమర్శలకు కారణమయ్యాయి. కొందరు నాయకులు.. ఏకంగా మూవీలో సీన్స్ తీసేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే మేకర్స్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు నమోదు చేసింది.2021లో రిలీజైన 'మాస్టర్'కు కొవిడ్ వల్ల సమస్యలు ఎదురయ్యాయి. అనుకున్న టైంకి విడుదల కాలేకపోయింది. థియేటర్ల కేటాయింపు, స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వకపోవడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. అలానే ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి ఇవ్వడంపై పలువురు పిటీషన్లు వేశారు. తర్వాత కోర్టు నుంచి ఆదేశాల వచ్చిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు నమోదు చేసింది. విజయ్ స్టామినా ఏంటనేది మరోసారి నిరూపించింది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)2018లో 'సర్కార్' విడుదలకు ముందే అడ్డంకులు ఎదుర్కొంది. ఓటింగ్ సరళి, రాజకీయ పార్టీ గుర్తులు ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. వాటిని మ్యూట్ లేదా పూర్తిగా తీసేయమనే డిమాండ్స్ వినిపించాయి. కానీ కొన్ని మార్పులు చేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేశారు. ప్రారంభంలో బాగానే ఆడింది కానీ లాంగ్ రన్లో ఓకే ఓకే అనిపించుకుంది.2015లో రిలీజైన 'పులి'కి అయితే పైన చెప్పినట్లు కాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. విడుదలయ్యే కొన్నిరోజుల ముందు వరకు సమస్యలు తప్పలేదు. కొన్నిచోట్ల షోలు రద్దయ్యాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓపెనింగ్స్ బాగానే తెచ్చుకుంది. తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.2012లో వచ్చిన 'తుపాకీ'కి అయితే విడుదలకు ముందే ఇబ్బందులు. టైటిల్, అలానే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ, సామాజిక అంశాల దృష్ట్యా కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో చిన్న చిన్న మార్పులు చేసి పలు విషయాల్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. విజయ్ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.2014లో వచ్చిన 'కత్తి' చిత్రానికి తిప్పలు తప్పలేదు. విడుదలకు ముందే నిర్మాతలపై విమర్శలు వచ్చాయి. శ్రీలంక తమిళ సెంటిమెంట్స్ అనుకూలంగా తీశారని రాజకీయ ఆరోపణలు చేశారు. బెదిరింపులు, చివరి నిమిషాల్లో హడావుడి వల్ల తమిళనాడు అంతటా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతటా క్లియరెన్స్ తెచ్చుకుని అనుకున్న తేదీనే థియేటర్లలోకి వచ్చింది. విమర్శలు, ఆరోపణలు తట్టుకుని నిలబడింది. కమర్షియల్ సక్సెస్ అందుకుని విజయ్ ఇమేజ్ మరింత పెంచింది.(ఇదీ చదవండి: విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!) -
విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!
దళపతి విజయ్ 'జన నాయగణ్' చిత్రాన్ని కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు. లెక్క ప్రకారం ఈ రోజే (జనవరి 09) థియేటర్లలోకి రావాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల ఆలస్యమైంది. ఈ మేరకు మొన్ననే నిర్మాతలు.. వాయిదా ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమైపోతుందిలే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పట్లో ఇది తీరేలా కనిపించట్లేదు. తాజాగా అప్డేట్ ఏంటంటే?సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న 'జన నాయగణ్' సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని ఈరోజు మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు దాఖలు చేసిన అప్పీల్పై డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు కోర్టుపై ఒత్తిడి చేశారని డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు చిత్ర నిర్మాతలు, సోమవారం(జనవరి 11) నాడు సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. -
జననాయగన్ మధ్యాహ్నం రిలీజ్! మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
-
మద్రాస్ హైకోర్టులో హీరో విజయ్ ‘జన నాయగన్’కు భారీ ఊరట
సాక్షి,చెన్నై: తమిళ హీరో విజయ్కు మద్రాస్ హైకోర్టు నుండి భారీ ఊరట లభించింది. ఆయన నటించిన జన నాయగన్ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రివ్యూ కమిటీకి పంపకుండానే హైకోర్టు నేరుగా అనుమతి ఇచ్చింది. కోర్టు స్పష్టంగా జన నాయగన్ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో జన నాయగన్ విడుదలకు మార్గం సుగమమైంది. సంక్రాంతి రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతేడాది డిసెంబర్లో జన నాయగన్ నిర్మాతలు సినిమా విడుదల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డును ఆశ్రయించారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడంలో ఆలస్యం చేసింది. ఈ ఆలస్యంపై జననాయగన్ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.ఇదే అంశంపై ఈ బుధవారం విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తాజా విచారణలో సింగిల్ బెంచ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఫిర్యాదు దారుడి గోడు విన్న తర్వాత కూడా సెన్సార్ ఇవ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లుగా ఉంది. అంటే, సీబీఎస్ఈ మొదట్లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా దరఖాస్తును స్వీకరించింది. కానీ తరువాత, విడుదలకు దగ్గరగా వచ్చేసరికి కొత్తగా అభ్యంతరాలు పెట్టింది. ఇది ముందే ఉన్న అసలు సమస్య కాకుండా, తరువాత కల్పించిన సమస్యలా ఉందని కోర్టు భావించింది. అంతేకాదు, సర్టిఫికేషన్ ప్రక్రియలో అనవసరమైన ఆటంకాలు సృష్టించడం తగదని కోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది. అనంతరం, సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సీబీఎస్ బోర్డుకు సూచించింది. దీంతో జన నాయగన్ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. విజయ్ నటించిన చిత్రాలు తరచుగా రాజకీయ చర్చలకు దారితీస్తాయి. జన నాయగన్ కూడా సమాజంలోని సమస్యలను ప్రతిబింబించేలా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో సీబీఎఫ్సీ ఆలస్యం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి.ఈ తీర్పు సినీ పరిశ్రమలో సెన్సార్ బోర్డు పాత్రపై పెద్ద చర్చకు దారితీస్తోంది. ఒకవైపు సృజనాత్మక స్వేచ్ఛను కాపాడే ప్రయత్నంగా కోర్టు నిర్ణయం కనిపిస్తుండగా, మరోవైపు సర్టిఫికేషన్ ప్రక్రియలో పారదర్శకత అవసరం ఉందని స్పష్టమవుతోంది. -
హీరో విజయ్కు అండగా ప్రముఖ లాయర్
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్ విడుదల అనూహ్యంగా వాయిదా పడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) నుంచి సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. మద్రాస్ హైకోర్టు నిర్ణయంపై ఈ సినిమా విడుదల ఆధారపడి ఉంది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం జనవరి 9న జన నాయగన్ రిలీజ్ కావాల్సివుంది. అయితే మద్రాస్ హైకోర్టు తమ నిర్ణయాన్ని అదేరోజు ప్రకటిస్తామని చెప్పడంతో సినిమా విడుదల పోస్ట్పోన్ అయింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు కోసం విజయ్ అభిమానులు, మద్దతుదారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.జన నాయగన్ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో నిశితంగా గమనిస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఈ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తరపున హైకోర్టులో వాదనలు విన్పిస్తున్న ప్రముఖ న్యాయవాది సతీశ్ పరాశరణ్ (Satish Parasaran) గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళ చిత్ర పరిశ్రమతో ఆయన దగ్గర సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. విలక్షణ నటుడు కమల్హాసన్ మేనల్లుడైన సతీశ్.. కోర్టులో పదునైన వాదనలతో సీబీఎఫ్సీ ప్రతినిధులకు దీటుగా కౌంటర్ ఇస్తున్నారని అభిమానులు అంటున్నారు.ఎవరీ సతీశ్ పరాశరణ్?కమలహాసన్ సోదరి సరోజ కుమారుడే సతీశ్ పరాశరణ్. ఈయన తండ్రి కె. పరాశరణ్ 1983-89 వరకు భారత అటార్నీ జనరల్గా పనిచేశారు. ఢిల్లీలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి సతీశ్ న్యాయవిద్య పూర్తి చేశారు. తర్వాత తమిళనాడు బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు.కమల్ హాసన్ (Kamal Haasan) సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ తరపున కూడా పలు సందర్భాల్లో కోర్టుల్లో వాదనలు వినిపించారు. కమల్ సినిమాలకు అడ్డంకులు ఎదుర్కొన్నప్పుడల్లా ఆయన కోర్టులో ప్రత్యక్షమయ్యేవారు. గత ఏడాది థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో నిషేధించినప్పుడు సతీశ్ పరాశరణే వాదించారు.చదవండి: 'జన నాయగన్' వాయిదా.. భారీగా రీఫండ్సతీశ్ పరాశరణ్పైనే ఆశలుఇండియన్ 2 సెట్ ప్రమాదం విషయంలో కమల్హాసన్కు మద్రాస్ హైకోర్టు సమన్లు జారీ చేసినప్పుడు కూడా ఆయన తరపున కేసు వాదించారు. 2020లో ఇండియన్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదం సంభవించడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా జన నాయగన్ సినిమా విడుదల విషయంలో విజయ్ అభిమానులు సతీశ్ పరాశరణ్ వాదనలపై ఆశలు పెట్టుకున్నారు. మద్రాస్ హైకోర్టు రేపు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
జన నాయగన్ 'బుక్ మై షో' రీఫండ్.. చరిత్రలో ఇదే తొలిసారి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. సెన్సార్ బోర్డ్ నుంచి ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే, ఇందులో రాజకీయ కోణం ఉన్నట్లు విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే 'బుక్ మై షో'(BookMyShow) ద్వారా లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్లో అయితే ఈ సంక్రాంతికి ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా 'జన నాయగన్'(Jana Nayagan) రికార్డ్ క్రియేట్ చేసింది.బుక్ మై షోలో రికార్డ్'జన నాయగన్' వాయిదా పడటంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి 'బుక్మైషో' రీఫండ్ చేస్తుంది. టికెట్కు సంబంధించిన డబ్బులను ఎలా రీఫండ్ చేసుకోవాలో కూడా మెయిల్ ద్వారా పంపింది. భారతీయ సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద రీఫండ్ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ విషయంలో జన నాయగన్ కొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 5 లక్షలకు పైగా టిక్కెట్లను రీఫండ్ బుక్ మై షో చేస్తోంది. సుమారు రూ. 20 కోట్ల మేరకు ఆ సంస్ధ తిరిగి తన యూజర్స్కు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కోసం 'కమల్హాసన్' మేనల్లుడుజన నాయగన్ సెన్సార్ విషయంలో కమిటీలోని నలుగురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, కమిటీలోని ఒక సభ్యుడు భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు CBFC ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ జారీ ఆగిపోయింది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ను నిలిపివేయాలన్న సిబిఎఫ్సి నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే, విజయ్ సినిమా తరుఫున కమల్హాసన్ మేనల్లుడు సతీశ్ పరాశరణ్ వాదిస్తున్నారు. -
Thalapathy : జన నాయగన్ కు బిగ్ షాక్ విడుదల వాయిదా
-
'జన నాయగణ్' వాయిదా? 'రాజాసాబ్'కి లైన్ క్లియర్
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్'.. చెప్పిన తేదీకి థియేటర్లలో రిలీజ్ కావడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి కష్టాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ సమస్య తీరలేదు. నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈరోజు(జనవరి 07) వాదనలు జరిగాయి. తీర్పు రిజర్వ్లో పెట్టారు. 09వ తేదీన ఉదయం తుది ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ అసలేమైంది?(ఇదీ చదవండి: జీవో వచ్చేసింది.. 'రాజాసాబ్' టికెట్ ధర రూ.1000)రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు.. 'జన నాయగణ్' చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేశారు. వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేస్తుందనుకుంటే.. రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే జనవరి 05న సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్ని సంప్రదించాలని సెన్సార్ సభ్యులు.. మూవీ టీమ్కి చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో అత్యవసర పిటీషన్ వేసింది. త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పించేలా చూడాలని పేర్కొంది. తాజాగా ఈ విషయమై బుధవారం (జనవరి 07) ఇరువర్గాల మధ్య వాదనలు జరిగాయి.(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)'జన నాయగణ్ చూసిన సభ్యుల్లో ఒకరు.. సినిమాలోని కొన్ని సీన్స్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని రివిజన్ కమిటీ పరిశీలించాలి. తర్వాతే తదుపరి దశకు వెళ్తుంది. మరిన్ని మార్పులు చేయాల్సి వస్తే అది చట్ట ప్రకారం జరుగుతుంది. మూవీ చూసిన తర్వాత అప్పుడు సర్టిఫికెట్ మంజూరా చేస్తాం. మళ్లీ సమీక్షించాలని అవసరం లేదని మీరు(మూవీ టీమ్) కోర్టుకి వచ్చి చెప్పలేరు. చిత్రాన్ని ప్రస్తుతానికి నిలిపి ఉంచాలని సీబీఎఫ్సీ ఛైర్ పర్సన్ ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే సమాచారం అందించారు. నిర్మాతలకు కూడా జనవరి 05న ఇదే విషయాన్ని చెప్పారు. సినిమాని కొత్త కమిటీ మరోసారి సమీక్షిస్తుంది. అందుకు మరో 15 రోజులు పడుతుంది. దీనికి అంగీకారమైతే కొత్త కమిటీ ఏర్పాటుకు 20 రోజులు పడుతుంది' అని అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్.. కోర్టులో తన వాదనలు వినిపించారు.'మీరు చెప్పినట్లే ఇప్పటికే సినిమాలో మార్పులు చేశారు కదా' అని కోర్టు ప్రశ్నించగా.. సభ్యుల్లో ఒకరి నుంచి అభ్యంతరాలు వచ్చాయని, కమిటీ నిర్ణయానికి ఛైర్ పర్సన్ కట్టుబడి ఉంటారని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి విన్నవించారు. ఇకపోతే 'జన నాయగణ్' నిర్మాణ సంస్థ కేవీన్ ప్రొడక్షన్స్ తరఫు న్యాయవాది పరాశరన్ తన వాదనలు వినిపించారు.'మూవీకి సంబంధించిన ఏదైనా సరే 'ఈ-సినీ ప్రమాణ్' పోర్టల్ ద్వారా తెలియజేయాలి. కానీ సెన్సార్ వాళ్లు అలా వ్యవహరించలేదు. తమ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. సభ్యుల్లో ఒకరికి మాత్రమే అభ్యంతరాలున్నాయి. అంటే 4:1 నిష్పత్తిలో ఉంది. మెజార్టీ నిర్ణయం పాజిటివ్గానే ఉంది. అలాంటప్పుడు మరోసారి రివ్యూ కోసం ఎలా పంపుతారు? చట్టప్రకారం సెన్సార్ బోర్డ్ తమ విధులని పూర్తిగా విస్మరించింది' అని పరాశరన్ అన్నారు.ఈయన వాదనలపై స్పందించిన సొలిసిటర్ జనరల్.. సినిమాని మరోసారి సమీక్షించాలని తమకు ఎవరూ చెప్పలేదని, ఛైర్ పర్సన్కి నిర్ణయం తీసుకునే అధికారం ఉందని అన్నారు. వాదనలు విన్న జస్టిస్ ఆశా.. తీర్పుని రిజర్వ్ చేశారు. జనవరి 9న తుది ఉత్తర్వులు వెల్లడించనున్నారు. రిలీజ్ తేదీన తుది తీర్పు అంటే.. ఒకవేళ మూవీ టీమ్కి అనుకూలంగా వచ్చినా సరే అదే రోజున షోలు పడతాయా? లేదంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు 14వ తేదీకి మూవీ ఏమైనా వాయిదా పడుతుందా అనేది చూడాలి? ఒకవేళ విడుదల తేదీ మారితే మాత్రం 'రాజాసాబ్'కి పోటీ తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల విషయంలోనూ లైన్ క్లియర్ అయ్యే అవకాశముంటుంది.(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?) -
'జన నాయగణ్' సినిమాపై రాజకీయ కుట్ర?
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. మరో మూడు రోజుల్లో అంటే ఈ శుక్రవారమే తెలుగు, తమిళంలో విడుదల కానుంది. మన దగ్గర పెద్దగా బజ్ లేదు గానీ తమిళనాడులో మాత్రం మంచి హైప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ)విజయ్ 'జన నాయగణ్' సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కావాలి. కానీ ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాలేదు. దాదాపు రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీ చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇది జరిగి రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే నిన్న(జనవరి 05).. సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్ని సంప్రదించాలని చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో కేసు వేసింది. త్వరగా ఇది ఇప్పించాలని పేర్కొంది. అయితే సెన్సార్ ఫార్మాలిటీస్ అంతా పూర్తయినా సరే ఇలా జరగడం వెనక ఎవరున్నారు? చెప్పిన తేదీకి రిలీజ్ అవుతుందా లేదా అని విజయ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.(ఇదీ చదవండి: 'అఖండ-2' ఫ్యాన్స్కు ట్విస్ట్ ఇచ్చిన 'నెట్ఫ్లిక్స్')రాజకీయ కారణాలతోనే తమ సినిమాకు ఇబ్బందులు పెడుతున్నారని విజయ్ టీవీకే పార్టీ ఆరోపణలు చేస్తోంది. విజయ్ పిటిషన్పై ఈ రోజు మధ్యాహ్నమే విచారణ జరగనుంది. ఇందులో ఏం తీర్పు వస్తుందో చూడాలి? ఈ ఏడాదిలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయ్ సినిమాపై ఏమైనా రాజకీయ కుట్ర చేస్తున్నారా అనే సందేహం అభిమానులకు వస్తోంది.ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే హీరోయిన్గా, మమిత బైజు కీలక పాత్ర చేసింది. తెలుగులో గతంలో వచ్చిన 'భగవంత్ కేసరి' రీమేక్ చేసి ఈ మూవీ తీశారు. కొన్నిరోజుల ముందు వరకు ఈ విషయమై రూమర్స్ వచ్చాయి గానీ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్తో రీమేక్ అనే క్లారిటీ వచ్చేసింది. ట్రోల్స్ కూడా ఎక్కువగానే చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు) -
జన నాయగణ్ Vs పరాశక్తి.. విజయ్ రియాక్షన్ ఇదే..
శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ నిర్మించిన ఈ మూవీలో రవిమోహన్, అధర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 10న రిలీజవుతోంది. అయితే దీనికంటే ఒకరోజు ముందు జనవరి 9న విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ మూవీ విడుదలవుతోంది.పొంగల్కు సినిమా లేకపోవడంతో..దీని గురించి శివకార్తికేయన్ స్పందించాడు. శనివారం సాయంత్రం చెన్నైలో పరాశక్తి మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పరాశక్తి సినిమాను 2025 అక్టోబర్లో లేదా దీపావళికి విడుదల చేద్దామని నిర్మాత ఆకాశ్, నేను మాట్లాడుకున్నాం. అయితే విజయ్ మూవీ అక్టోబర్లో తెరపైకి రానుందని.. దీంతో పొంగల్కు వేరే సినిమా లేదని ప్రచారం జరగడంతో మనం పొంగల్కు వద్దామని ఆకాశ్ చెప్పారు.తీరా అదే సమయంలోఅయితే కొన్ని రోజుల తర్వాత విజయ్ నటిస్తున్న జన నాయగణ్ మూవీ పొంగల్కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే నిర్మాత ఆకాశ్కు ఫోన్ చేసి మనం రిలీజ్ పోస్ట్పోన్ చేద్దామా అని అడిగాను. కానీ, అప్పటికే సినిమా రైట్స్ అన్నీ అమ్ముడుపోవడంతో అది కష్టమన్నాడు. తర్వాత నేను విజయ్ మేనేజర్ జగదీష్కు ఫోన్ చేసి.. జననాయగణ్ రిలీజ్ను సంక్రాంతికి మార్చారా? అని అడిగాను. అందుకాయన.. అవును, మార్చాం. అయినా ఏం పర్లేదు, రెండు సినిమాలు విజయం సాధిస్తాయి. మీ సినిమా రిలీజ్ చేయండి అన్నారు. విజయ్తో మాట్లాడా..అప్పటికీ నాకు మనసు కుదుటపడక విజయ్తో అన్ని విషయాలు మాట్లాడాను. పొంగల్కు పదిరోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి రెండు సినిమాలు విడుదల చేయొచ్చని చెప్పారు. దీనివల్ల ఎవరి సినిమా ప్రభావితం కాదన్నారు. నాకు, విజయ్కు మధ్య మంచి స్నేహం ఉంది. ఎవరేమనుకున్నా ఈ పొంగల్ అన్నాతమ్ముళ్లది. జనవరి 9న జన నాయగణ్ మూవీ చూడండి. 33 ఏళ్లుగా మనల్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి చివరి సినిమాను ఆదరించండి. ఆ తర్వాతి రోజు విడుదలవుతున్న పరాశక్తిని సైతం ఆదరించండి అని పేర్కొన్నాడు. -
7 సినిమాలు.. రూ. 1000 కోట్ల బడ్జెట్.. నిర్మాతల ధైర్యం ఏంటి?
టాలీవుడ్కి సంక్రాంతి అతి పెద్ద సీజన్. ప్రతిసారి మూడు,నాలుగు సినిమాలు ఈ పండక్కి రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా 7 సినిమాలు(డబ్బింగ్ సినిమాలతో కలిసి) రిలీజ్ అవుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి లాంటి కుర్ర హీరోలు కూడా బాక్సాఫీస్ బరిలో ఉన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ..ఇలా మూడు రోజులకు మూడు సినిమాలతో పాటు ఆ ముందూ వెనుక కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకే సారి ఇన్ని సినిమాలు వస్తే... ప్రేక్షకుల అన్నీ చూడగల్గుతారా? అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి.ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఈ ఏడు సినిమాలు చూస్తే.. తక్కువలో తక్కువ 10-12 వేలు ఖర్చు అవుతుంది. పండగకు ఇంట్లో అయ్యే ఖర్చు అదనం. ఓ సగటు ప్రేక్షకుడు ఇంత భరించడం కష్టం. ఆ విషయం సినిమాలు రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు కూడా తెలుసు. కానీ పండక్కి క్లిక్ అయితే భారీగా రాబట్టుకోవచ్చనే ఆశతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొత్తం ఏడు సినిమాల బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల పైనే ఉంటుంది. వాటిల్లో అత్యధికంగా రాజాసాబ్కి రూ. 500 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమాకు కూడా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు అయిందట. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ ‘అనగనగ ఓ రాజు’, శర్వానంద్ నారీ నారి మురారి చిత్రాలన్నీ ఒక్కోటి రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కినవే. ఇక డబ్బింగ్ సినిమాలు జననాయక్, పరాశక్తి కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. మొత్తంగా ఈ చిత్రాల బడ్జెట్ మొత్తం రూ. 1000 కోట్లు దాటింది. నిర్మాతలకు సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే..కనీసం రూ. 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇది అసాధ్యం అనే చెప్పాలి. టాక్తో సంబంధం లేకుండా ప్రభాస్, చిరంజీవి సినిమాలకు తొలిరోజు భారీ కలెక్షన్సే వస్తాయి. హిట్ టాక్ వస్తే.. ఆ రెండు చిత్రాలు భారీగానే వసూలు చేస్తాయి. కానీ మిగిలిన సినిమాల పరిస్థితి అలా కాదు. సినిమా రిలీజ్ అయి.. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప.. ప్రేక్షకులకు థియేటర్స్కి వెళ్లరు. టాక్ని బట్టి వాటి కలెక్షన్స్ ఉంటాయి. మరి సంక్రాంతికి బాక్సాఫీస్ విన్నర్గా ఎవరు నిలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలివే‘ది రాజా సాబ్’ (జనవరి 9)జననాయకుడు(జనవరి 9)పరాశక్తి(జనవరి 10)మన శంకర్ వరప్రసాద్ గారు(జనవరి 12)భర్త మహాశయులకు విజ్ఞప్తి(జనవరి 13)అనగనగ ఓరాజు(జనవరి 14)నారి నారి నడుమ మురారి(జనవరి 14) -
అరె.. ఏంట్రా ఇది! జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ!
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ ఈ సంక్రాంతితో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టనున్నాడు. ఆయన నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్'. తెలుగులో 'జన నాయకుడు' పేరిట రిలీజవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నిన్న రిలీజైన ట్రైలర్తో ఇది నిజమేనని రుజువైంది.తెలుగు మూవీ రీమేక్భగవంత్ కేసరి సినిమాను, పాత్రలను ఇక్కడ మక్కీకి మక్కీ దింపినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని సీన్ల కోసం ఏఐని వాడారంటూ ప్రచారం మొదలైంది. ట్రైలర్లో ఓ చోట గూగుల్ జెమిని ఏఐ మార్క్ కనిపించగా దానికి సంబంధించిన స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సినిమావిజయ్ చిట్టచివరి సినిమాలో కూడా ఏఐని ఉపయోగించడం ఏంట్రా బాబూ.. పైగా రీమేక్ సినిమాకు ఏఐ అవసరం ఏమొచ్చింది? రూ.400 కోట్ల బడ్జెట్.. ఈ చిన్న మిస్టేక్ కూడా గమనించుకోకపోతే ఎలా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జన నాయగణ్ విషయానికి వస్తే.. ఇందులో మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 9న విడుదలవుతోంది. They used AI Gemini shot and didn't bother to remove the watermark 😭#JanaNayagan pic.twitter.com/voi66tbLg0— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) January 3, 2026 చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్నల చేతిలో చీవాట్లు -
'జన నాయకుడు' ట్రైలర్ రిలీజ్.. రీమేక్పై క్లారిటీ
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. తెలుగులో దీన్ని 'జన నాయకుడు' పేరుతో ఈ నెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చిత్రానికి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మొన్నీమధ్య డైరెక్టర్ హెచ్.వినోద్ మాట్లాడుతూ ఇది దళపతి మూవీ అని చెప్పాడు గానీ అసలు విషయం బయటపెట్టలేదు. ఇప్పుడు ట్రైలర్తో క్లారిటీ వచ్చేసింది.అంతా అనుకుంటున్నట్లు ఇది 'భగవంత్ కేసరి' రీమేకే. మెయిన్ పాయింట్ని ఉన్నది ఉన్నట్లు దింపేశారు. శ్రీలీల పాత్ర పేరునే ఇక్కడ మమిత బైజు పాత్రకు కూడా పెట్టేశారు. ట్రైలర్ అయితే సాలిడ్గా ఉంది. కాకపోతే చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అలానే విజయ్ రాజకీయ ఎంట్రీకి పనికొచ్చేలా కూడా ఈ మూవీ ఉండబోతుందని.. ట్రైలర్లో డైలాగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఒరిజినల్ సినిమాని చూసేశారు. మరి ఇప్పుడు రాబోతున్న 'జన నాయకుడు' తెలుగు డబ్బింగ్ వెర్షన్కి ఎలాంటి ఆదరణ దక్కనుందో చూడాలి? ఇదే రోజున ప్రభాస్ 'రాజాసాబ్' కూడా థియేటర్లలోకి రానుంది. -
Vijay Thalapathy: జన నాయగన్ రీమేక్ ...?
-
దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడ్డ హీరో విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్కు చేదు అనుభవం ఎదురైంది. తన చివరి సినిమా "జన నాయగణ్" మూవీ ఆడియోలాంచ్ ఈవెంట్ మలేషియాలో ఘనంగా నిర్వహించారు. భారీ స్టేజ్ సెటప్, లైటింగ్, సౌండ్ డిజైన్ ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్కు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. వారి కోసం విజయ్ స్టేజీపై స్టెప్పులేశాడు.కిందపడ్డ విజయ్మలేషియాలో అంతా అనుకున్నట్లుగానే ఈవెంట్ విజయవంతంగా జరిగింది. అయితే భారత్కు తిరిగొచ్చిన విజయ్కు చెన్నైలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చెన్నై ఎయిర్పోర్టులో హీరోను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అత్సుత్సాహంతో ఎగబడ్డారు. దీంతో తోపులాట కారణంగా విజయ్ కారు ఎక్కే సమయంలో తడబడి కిందపడిపోయాడు. వెంటనే సిబ్బంది ఆయన్ను పైకి లేపి క్షేమంగా కారు ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సినిమావిజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయగణ్. ఇదే విషయాన్ని ఆయన తాజాగా మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లోనూ స్పష్టం చేశాడు. ఈ మూవీ విషయానికి వస్తే.. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మమితా బైజు కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా కనిపించనున్నాడు. తెలుగులో వచ్చిన నేలకొండ భగవంత్ కేసరి సినిమానే కొన్ని మార్పులు చేర్పులు చేసి జననాయగణ్గా తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. రాజకీయాల కోసం ఆయన సినిమాలకు గుడ్బై చెప్పాడు.மலேசியாவில் இருந்து சென்னை திரும்பிய விஜய்க்கு உற்சாக வரவேற்பு அளித்த ரசிகர்கள்..! #Vijay #JanaNayaganAudioLaunch #PoojaHegde #Rollsroyce #NAnand #ThalapathyThiruvizha #ThalapathyKacheri #JanaNayagan #AudioLaunch #Malaysia #TamilNews #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/F1TIpaGjXR— KAVI (@tamiltechstar) December 29, 2025చదవండి: ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా -
'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)
-
'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్గా ప్రకటించిన విజయ్
కోలీవుడ్ స్టార్ దళపతి తన కెరీర్లో నటిస్తోన్న చివరి సినిమా జన నాయగణ్. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు ఈ విషయాన్ని ప్రకటించారు. తన కెరీర్లో ఇదే చివరి సినిమా కానుందని వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా పొంగల్ బరిలో నిలిచింది.తాజాగా మలేసియా నిర్వహించిన ఆడియో లాంఛ్ ఈవెంట్లో విజయ్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే తనకిదే చివరి సినిమా మరోసారి స్పష్టం చేశారు. కౌలాలంపూర్లో జరిగిన ఈవెంట్లో అఫీషియల్గా ప్రకటించారు. వేలాదిమంది అభిమానుల మధ్య తన నిర్ణయాన్ని వెల్లడించారు. విజయ్ మాట్లాడుతూ..'నా ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నేను నటించిన సినిమాలు చూసేవారు. ఎన్నో ఏళ్లుగా నన్ను సపోర్ట్ చేశారు. నా కెరీర్లో ఇంత మద్దతుగా నిలిచిన వారి కోసం నేను 30 ఏళ్లు నిలబడతా. నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్ బై చెబుతున్నా' అని అన్నారు. -
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమితా బైజు ముఖ్యభూమికలు పోషించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ పిక్చర్స్ భారీ బడ్జెట్లో నిర్మించింది. హెచ్.వినోద్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 జనవరి 9వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ప్రస్తుతం ఆయన తమిళగ వెట్రికళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీంతో జననాయకన్ చిత్రాన్ని తన రాజకీయ జీవితానికి తోడ్పడేలా రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. దీంతో జననాయకన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలు ఇప్పటికే విడుదలై విజయ్ అభిమానుల్లో జోష్ను నింపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 27న చెన్నైలో కాకుండా మలేషియాలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. విజయ్ సతీమణి పాల్గొంటారా? జననాయకన్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై నుంచి పలువురు సినీ ప్రముఖులు మలేషియాకు వరుస కట్టారు. ముఖ్యంగా దర్శకుడు అట్లి, నెల్సన్ తదితరులు మలేషియాకు మలేషియాకు వెళ్లారు. నటుడు విజయ్ కూడా తన తల్లి శోభ చంద్రశేఖర్, బంధువు, గాయని పల్లవి వినోద్ తదితరులు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి మలేషియాకు చేరుకున్నారు. అదేవిధంగా విజయ్ భార్య సంగీత, కొడుకు జెసన్ సంజయ్ కూడా మలేషియాకు వెళ్లారు. అయితే వీరు జననాయకన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నటుడు విజయ్ ఆయన భార్య సంగీత మధ్య సఖ్యత లేదంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాంటిది సంగీత ఆమె కొడుకు, కూతురు దివ్య సాషా జననాయక్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటే ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి తెరదించినట్లు అవుతుంది. -
'జన నాయగణ్'.. విజయ్ పాడిన మరో పాట రిలీజ్
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు రాగా తాజాగా మూడో పాటని విడుదల చేశారు. 'చెల్ల మగళే' అంటూ సాగే ఈ క్యూట్ గీతాన్ని విజయ్ పాడటం విశేషం. 'దళపతి కచేరీ' అంటూ సాగిన తొలి పాటలోని ఓ పోర్షన్ని విజయ్ గాత్రమందించాడు. ఈ పాట మాత్రం మొత్తంగా విజయ్ ఆలపించాడు.(ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్)ఈ సినిమా.. తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పాట చూస్తే అదే అనిపించింది. ఒరిజినల్ మూవీలోనూ హీరో బాలకృష్ణ-పాప శ్రీలీల మధ్య ఓ సాంగ్ ఉంటుంది. అది ఇది ఒకటేలా అనిపిస్తున్నాయి. తెలుగులోనూ ఈ మూవీ 'జన నాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు.విజయ్.. తనకు ఇది చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించాడు. వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఇతడి పార్టీ పోటీపడనుంది. అందులో విజయ్ ఏ మేరకు విజయాన్ని అందుకుంటాడో చూడాలి? ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. మమిత బైజు కూడా కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
స్టార్ హీరో సినిమా వేడుక.. మలేషియాకు ఫ్యాన్స్ క్యూ
చెన్నై ఎయిర్పోర్ట్ కిటకటిలాడుతుంది. మలేషియాకు వెళ్లే విమానాలు ఫుల్ అయిపోయాయి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? విజయ్ 'జన నాయగన్' కోసం. తమిళ టాప్ హీరో విజయ్ నటించిన ఈ మూవీ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌలాలంపూర్లోని బుకిట్ జలీల్ స్టేడియం (Bukit Jalil Stadium)లో డిసెంబరు 27న జన నాయగన్ మూవీ వేడుక నిర్వహించనున్నారు. దీంతో తమిళనాడు నుంచి ఆయన ఫ్యాన్స్ భారీగా మలేషియాకు ప్రయాణం అయ్యారు. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ కోసం భారీగా క్యూ కట్టేశారు.మలేషియాలో తమిళ సినిమాలకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా విజయ్కు, విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆడియో వేడుకను అక్కడ నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకర్షించవచ్చని మేకర్స్ ప్లాన్ చేశారు. బుకిట్ జలీల్ స్టేడియం దక్షిణాసియాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటి. ఇందులో 90వేల మందికి పైగా సీటింగ్ సామర్థ్యం ఉంది. ఈ కార్యక్రమంలో విజయ్తో పాటు చిత్ర యూనిట్, సంగీత దర్శకుడు అనిరుధ్ పాల్గొననున్నారు. దీంతో ఇప్పటికే టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. ఈ వేడుకను పూర్తిగా సినిమా, సంగీతానికే పరిమితం చేయాలని మలేషియా పోలీసులు ఇప్పటికే స్పష్టమైన నియమాలు పెట్టారు. రాజకీయ ప్రసంగాలు, చిహ్నాలు అక్కడ కనిపించకూడదని నిషేధించారు. Crowd at Chennai Airport Immigration 🤯 — Only for #JanaNayagan Audio Launch 🔥 pic.twitter.com/dtW5hlsvgO— VCD (@VCDtweets) December 26, 2025 -
జన నాయగణ్ భారీ ఈవెంట్.. మలేసియా పోలీసుల షాక్.!
పాలిటిక్స్ ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయ అరంగేట్రానికి ముందు ఇదే నా చివరి సినిమా అవుతుందని ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా పొంగల్ బరిలో నిలిచింది.ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే గ్రాండ్ ఆడియా లాంఛ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. తమిళులు ఎక్కువగా ఉండే మలేసియాలో ఈ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమందికి పైగా ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 27న జరగనున్న ఈవెంట్ ద్వారా గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.అయితే ఈ భారీ ఈవెంట్ నేపథ్యంలో మలేసియా పోలీసులు అలర్ట్ అయ్యారు. కౌలాలంపూర్లో జరగనున్న ఈ బిగ్ ఈవెంట్పై ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయవద్దని ముందస్తుగానే హెచ్చరించారు. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రసంగాలు చేయవద్దని మలేసియా పోలీసులు సూచించారు. రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయడం, బ్యానర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ బుకిట్ జలీల్ స్టేడియంలో జరగనుంది.కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
సంక్రాంతి బరిలో 'డబ్బింగ్' రిస్క్ అవసరమా?
సినిమా ఇండస్ట్రీలకు సంక్రాంతి సీజన్ బంగారు బాతులాంటిది. దీన్ని అందుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే ప్రతి పండక్కి ఒకటి రెండు లేదంటే మూడు మూవీస్ మాత్రమే వచ్చేవి. కానీ ఈసారి లిస్టు చాలా పెద్దగా ఉంది. తెలుగులోనే బోలెడు చిత్రాలు అనుకుంటే తమిళ డబ్బింగ్లు పోటీకి రెడీ అయిపోతున్నాయి. ఇలా జరగడం వల్ల ఎవరికీ రిస్క్?(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)ఈసారి సంక్రాంతికి మొదటగా థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమా 'రాజాసాబ్'. ప్రభాస్ నటించిన ఈ మూవీ.. లెక్క ప్రకారం డిసెంబరులో రానుందని ప్రకటించారు. కొన్నిరోజులకే ప్లాన్ మార్చేసి పండగ బరిలో దింపారు. జనవరి 9న థియేటర్లలో రిలీజ్. ముందురోజే ప్రీమియర్స్ కూడా వేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి పోటీగా తమిళ హీరో విజయ్ చివరి మూవీ 'జన నాయగణ్' ఉంది. ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ అనే టాక్ బలంగా ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తెలుగులో జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే విజయ్ లాస్ట్ సినిమా అంటే తమిళనాడులో భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయి. మరి తెలుగులో ఏ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తుందనేది చూడాలి?ఈ రెండొచ్చిన మరుసటి రోజు అంటే 10వ తేదీన 'పరాశక్తి' రాబోతుంది. శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. జయం రవి, అధర్వ కీలక పాత్రలు చేశారు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ తెలుగులో ఇప్పటివరకు అయితే ఎలాంటి బజ్ లేదు. తెలిసిన ముఖాలు ఉన్నాయి తప్పితే ఒకవేళ ఇది తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన ఎంతమేరకు ఆకట్టుకుంటుందో? ఈ రెండు మాత్రమ సంక్రాంతి బరిలో ఉన్న డబ్బింగ్ బొమ్మలు.(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)వీటి తర్వాత 12వ తేదీన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', 13వ తేదీన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15వ తేదీన శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతికి వస్తున్న వాటిలో ప్రభాస్ది తప్పితే మిగిలినవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్గా చేసుకుని తీసిన చిత్రాలే. కాబట్టి వీటిలో ఒకటి రెండయినా హిట్ అయ్యే అవకాశముంది. అన్ని సక్సెస్ అందుకున్న మంచిదే. ఒకవేళ అదే జరిగితే మాత్రం తమిళ డబ్బింగ్లని ఎవరూ ఆదరించారు.అయితే జన నాయగణ్, పరాశక్తి చిత్రాల్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. కాస్త ఆలస్యం రిలీజ్ చేయడం లాంటివి జరగకపోవచ్చు. కాబట్టి ఈసారి లిస్టు అయితే దాదాపు ఏడు సినిమాలతో చాలా పెద్దగా ఉంది. మరి వీటిలో ఎవరు ఎవరిని రిస్క్లో పెడతారు? ఎవరు పైచేయి సాధించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారనేది చూడాలి?(ఇదీ చదవండి: టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేస్తున్నారా?) -
60% భగవంత్ కేసరి కథే!
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ సినిమా. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి ముందు దర్శకుడు వినోద్.. కమల్ హాసన్ కోసం ఒక కథ సిద్ధం చేశారు. మొదట్లో కాదన్నారు.. కానీ!అయితే ఆ కథలో కమల్ నటించలేదు. దీంతో అదే కథతో విజయ్ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత.. బాలకృష్ణ తెలుగులో నటించిన భగవంత్ కేసరి కాపీనీ కొడుతున్నారని వార్తలు వైరలయ్యాయి. ఈ ప్రచారాన్ని దర్శకుడు ఖండించాడు. ఇదిలా ఉంటే జననాయకన్ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 2026 జనవరి 9న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో..ఈ క్రమంలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే.. నేలకొండ భగవంత్ కేసరి చిత్రానికి చెందిన 60 శాతం జననాయకన్ చిత్రంలో ఉంటుందని, మిగతా భాగాన్ని దర్శకుడు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారట. విజయ్ (Vijay) రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం అన్న విషయం తెలిసిందే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ ఇందులో నటించాడు. సమకాలీన రాజకీయ అంశాలు సినిమాలో ఉండబోతున్నాయి. -
జన నాయగణ్ భారీ ఈవెంట్.. ఒక్క టికెట్ అన్ని లక్షలా?
పొలిటికల్ ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయాల్లోకి వచ్చేముందు ఈ మూవీనే తన కెరీర్లో చివరి సినిమా అని ప్రకటించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ యాక్షన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ మూవీ కోసం మేకర్స్ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆడియో లాంఛ్ ఈవెంట్ను ఏకంగా విదేశాల్లో నిర్వహిస్తున్నారు. మలేసియాలో ఈ బిగ్ ఈవెంట్ జరగనుందని ఇప్పటికే వెల్లడించారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమంది ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా. ఈ భారీ ఈవెంట్లో గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లిడించారు.తమ అభిమాన హీరో బిగ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్కు భారీ డిమాండ్ ఉండడంతో టిక్కెట్ల కోసం తీవ్రంగా పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.2 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఉండనుందని సమాచారం. ఈ టికెట్ బుకింగ్స్ నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతాయని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మలేషియాలోని బుకిట్ జలీల్ స్టేడియంలో డిసెంబర్ 27న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్స్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్లో సైంధవి, టిప్పు, అనురాధ శ్రీరామ్, ఆండ్రియా జెరెమా ఎస్.పి.బి. చరణ్, హరిచరణ్, హరీష్ రాఘవేంద్ర, యోగి బి, విజయ్ యేసుదాస్ పాల్గొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
విజయ్ కచేరి సాంగ్.. ఫేక్ వ్యూస్పై స్పందించిన యూట్యూబ్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ'జన నాయగణ్'. పొలిటిక్స్లో అడుగుపెట్టిన తర్వాత విజయ్ కెరీర్లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇటీవలే 'దళపతి కచేరీ' అంటూ సాగే ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేశారు.అయితే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. యూట్యూబ్లో ఏకంగా 44 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. దీంతో ఇవన్నీ ఫేక్ వ్యూస్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బాట్స్ ద్వారా ఈ వ్యూస్ వచ్చాయని కొందరు నెటిజన్స్ ఆరోపించారు. రిలీజైన గంటలోనే ఏకంగా 3 మిలియన్స్ వ్యూస్ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు వ్యూస్ పెంచుకునేందుకు బాట్స్ ఉపయోగపడ్డాయా అంటూ ట్రోల్ చేశారు.కచేరీ సాంగ్పై వస్తున్న ఆరోపణలపై యూట్యూబ్ కూడా స్పందించింది. ఇలాంటి వాటిని గుర్తించడానికి(లైక్లు, వ్యూస్) తమ వద్ద ప్రత్యేక వ్యవస్థ ఉందని యూట్యూబ్ తెలిపింది. అవీ ఒరిజినల్ లేదా ఫేక్ అని ధృవీకరించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ కూడా ఉందని పేర్కొంది. కాగా.. దళపతి కచేరి' పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించగా.. అనిరుధ్, అరివు, విజయ్ ఆలపించారు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. To maintain a fair & positive experience across YouTube, we have systems that verify if views are valid & should be counted! more on that here: https://t.co/7ia2e2f2VE— TeamYouTube (@TeamYouTube) November 12, 2025 -
విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్
తమిళ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. దీంతో తన చివరిదైన 'జన నాయగణ్' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ చేసిన తొలి పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'తళపతి కచేరీ' అంటూ సాగే మూవీలోని తొలి పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)అనిరుధ్ ఎప్పటిలానే మరో మాస్ బీట్తో అలరించాడు. దానికి విజయ్, జనాలతో కలిసి వేసిన సింపుల్ స్టెప్పులు.. ఆయన అభిమానులకు కనువిందు చేసేలా ఉన్నాయి. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. (ఇదీ చదవండి: Dies Irae: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ) -
దళపతి చివరి సినిమాలో ముగ్గురు స్టార్ దర్శకులు?
తమిళ స్టార్ దళపతి విజయ్.. రీసెంట్గానే మధురైలో భారీ బహిరంగ సభ పెడితే ఏకంగా లక్షలాది మంది అభిమానులు వచ్చారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనున్న విజయ్.. మరోవైపు తన చివరి చిత్రాన్ని పూర్తి చేసే పనిలోనూ ఉన్నాడు. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే నటి పెళ్లి.. ఏడాది తిరిగేలోపు కూతురు)విజయ్ 'జన నాయగన్'... తెలుగు చిత్రం 'భగవంత్ కేసరి' రీమేక్ అని ప్రచారం అయితే ఉంది కానీ నిజమేంటి అనేది మూవీ రిలీజైతే తప్ప తెలియదు. అయితే ఇది విజయ్ చివరి చిత్రమని ప్రచారం నడుస్తోంది కాబట్టి ఇందులో పలు సర్ప్రైజులు ఉండబోతున్నాయట. తమిళ స్టార్ డైరెక్టర్స్ అట్లీ, నెల్సన్, లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారట. సోషల్ మీడియాలో ఈ రూమర్ గట్టిగానే వినిపిస్తుంది.ఈ ముగ్గురు దర్శకులు కూడా విజయ్తో సినిమాలు తీశారు. అట్లీ, లోకేశ్ తలో రెండేసి చిత్రాలు చేయగా.. నెల్సన్ ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. అలా విజయ్పై అభిమానం దృష్ట్యా.. ఇతడి చివరి చిత్రమైన 'జన నాయగన్'లో జర్నలిస్టులుగా చిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇకపోతే ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. 'ప్రేమలు' మమిత బైజు కీలక పాత్ర చేస్తోంది. హెచ్. వినోద్ దర్శకుడు కాగా అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే?
స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్ (Jana Nayagan Movie). ఇదే ఆయన చివరి చిత్రమని, దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అది అబద్ధమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జన నాయగన్.. విజయ్ ఆఖరి సినిమానా? అని అందరి మనసులో ఉన్న ప్రశ్నని హీరోయిన్ మమితా బైజు నేరుగా దళపతినే అడిగేసింది. భావోద్వేగం..అందుకాయన 2026లో జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పారంది. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచినా.. చిత్రీకరణ చివరి రోజు మాత్రం విజయ్ సహా అందరూ భావోద్వేగానికి లోనయ్యారట! అందుకనే విజయ్ టీమ్తో కలిసి సరిగా ఫోటోలు కూడా దిగలేకపోయారని చెప్తోంది మమితా (Mamitha Baiju). జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.చదవండి: మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
బర్త్ డే స్పెషల్.. 'జన నాయగణ్' వీడియో రిలీజ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా అతడి చివరి సినిమా నుంచి సర్ప్రైజ్ వచ్చింది. అర్థరాత్రి 12 గంటలకు ఫస్ట్ రోర్ పేరిట 'జన నాయగణ్' నుంచి వీడియో రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ పోలీస్గా కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియోకు ఇతడి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎప్పటిలానే అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు!)బయటకు చెప్పలేదు గానీ 'జన నాయగణ్' సినిమా 'భగవంత్ కేసరి' అనే తెలుగు సినిమాకు రీమేక్. గతంలో పలు అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు పోలీస్ గెటప్లో ఉన్న వీడియో రిలీజ్ చేయడంతో కొంతవరకు క్లారిటీ వచ్చేసింది. ఇక ట్రైలర్, మిగతా కంటెంట్ వస్తే గనుక రీమేక్ కాదా అనేది కన్ఫర్మ్ అయిపోతుంది.హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె షూటింగ్ రీసెంట్గానే పూర్తయింది. మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే రాజకీయాల్లకి అడుగుపెట్టిన విజయ్కి ఇదే చివరి చిత్రం కావడంతో అటు అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు)


