'చాలా బాధగా ఉంది'.. జన నాయగన్‌పై త్రిష మదర్ రివ్యూ | Trisha Mother Review on Vijay Jana Nayagan Movie after watching | Sakshi
Sakshi News home page

Jana Nayagan Movie: 'విజయ్‌ను చాలా మిస్సవుతాం'.. త్రిష మదర్ ఉమా కృష్ణన్

Jul 23 2026 7:43 PM | Updated on Jul 23 2026 7:56 PM

Trisha Mother Review on Vijay Jana Nayagan Movie after watching

రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఆ వివాదం ముగియడంతో దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జన నాయకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీని థియేటర్లలో చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీని హీరోయిన్ త్రిష కూడా వీక్షించారు. చెన్నైలోని రోహిణి థియేటర్‌కు వెళ్లిన ఆమె జన నాయగన్‌ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అంతేకాకుండా ఈ మూవీని త్రిష మదర్‌ కూడా జన నాయగన్ చూశారు. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

విజయ్ జన నాయగన్ సినిమా చూసి మేము చాలా ఆనందించామని నటి త్రిష తల్లి ఉమా కృష్ణన్ అన్నారు. ఈ మూవీని ఎంతో ఆస్వాదించామని తెలిపారు. ఇది ఆయన చివరి చిత్రం కావడం నాకు బాధగా ఉందన్నారు.  మేము ఆయనను చాలా మిస్ అవుతామని ఉమా కృష్ణన్ నిరాశ వ్యక్తం చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement