జన నాయగన్‌.. మూడు రోజులైనా ఆ మార్క్ దాటలే..! | Vijay's Jana Nayagan final film nears 200 crore mark worldwide in 3 days | Sakshi
Sakshi News home page

Jana Nayagan Collections: జన నాయగన్‌.. మూడు రోజులైనా అంతేనా?

Jul 26 2026 12:35 PM | Updated on Jul 26 2026 12:59 PM

Vijay's Jana Nayagan final film nears 200 crore mark worldwide in 3 days

దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 23న రిలీజైన ఈ చిత్రం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కు దాటిన జన నాయగన్.. మూడో రోజు కూడా అదే జోరు కనిపించింది.

ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల మార్కుకు చేరువగా వచ్చేసింది. ఇప్పటి వరకు వరల్డ్‌ వైడ్‌గా రూ. 171.84 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాకుండా కేవలం ఇండియాలోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను అధిగమించింది. అయినప్పటికీ విజయ్  నటించిన 'లియో' (2023), 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (2024) సాధించిన వసూళ్ల కంటే వెనకంజలోనే ఉంది. గతంలో 'లియో' చిత్రం మూడో రోజు ఇండియాలో రూ. 38.30 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. గోట్ మూవీ సైతం రూ. 33.50 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ ప్రకారం జన నాయగన్' ఇండియాలో మూడో రోజు రూ. 28.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఓవర్‌సీస్‌లో మరో రూ. 20 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 108.34 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. రూ. 92.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. విదేశాల్లో రూ. 63.50 కోట్ల  గ్రాస్ వసూళ్లు రాగా.. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా రూ. 171.84 కోట్లకు చేరుకున్నాయి.

కాగా.. ఈ చిత్రంలో విజయ్ 'వెట్రి కొండన్' అనే మాజీ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఆయన తన దత్తపుత్రికగా 'విజి' పాత్రలో మమితా బైజు కనిపించింది. ఈ మూవీ పూజా హెగ్డే హీరోయిన్‌గా మెప్పించగా.. బాబీ డియోల్  'జాన్ హిమ్లర్' అనే విలన్ పాత్రను పోషించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement