breaking news
Narendra Modi
-
తారిఖ్ రహ్మాన్ రాక.. భారత్కు బంగ్లా టెన్షన్!
తారిఖ్ రహ్మాన్.. బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ‘డార్క్ ప్రిన్స్’గా ఇంటాబయటా అప్రతిష్టపాలైన నేపథ్యం నుంచి ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకునే దాకా 60 ఏళ్ల రహ్మాన్ ప్రస్థానం బంగ్లాదేశ్ సరికొత్త రాజకీయానికి నాంది పలికింది. ఆయనపై లెక్కకు మించి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక కేసులో రహ్మాన్ అరెస్టయ్యారు. అమెరికా కూడా రహ్మాన్ను ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించింది. బెయిల్పై విడుదలైన అనంతరం వైద్యచికిత్స పేరుతో 2008లో లండన్ వెళ్లారు. నాటి నుంచీ కుటుంబంతో పాటు అక్కడే ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. లండన్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించారు.గతేడాది డిసెంబరులో తల్లి ఖాలిదా జియా అనారోగ్యానికి గురి కావడంతో 17 ఏళ్ల తర్వాత మళ్లీ సొంతగడ్డపై అడుగుపెట్టారు. తల్లి మరణానంతరం పార్టీ పగ్గాలు అందుకున్నారు. నిరసనలు, హింసాత్మక ఘటనలతో అస్థిరంగా మారిన దేశంలో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం చేపట్టారు. ‘బంగ్లా ఫస్ట్’ నినాదంతో యువతను ఆకర్షించారు. కట్ చేస్తే 2026 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మరి ఆయన గెలుపు భారత్కు లాభమేనా? రహ్మాన్ రాక మనకు ఏ మేరకు ఉపయోగపడనుంది?బంగ్లాదేశ్ ఎన్నికలను భారత్ ముందు నుంచీ నిశితంగా గమనించింది. ఇదే సమయంలో భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ‘రీసెట్’ కోరుకుంటున్నానని, అయితే, అది రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అలాగే, ఉగ్రవాదంపై భారత్ పోరుకు సహకరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తీస్థా నదీజలాల విషయంలో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. హిందూ మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు. భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడే దిశగా ఇవన్నీ సానుకూల సంకేతాలేనని భావిస్తున్నారు. దీనికితోడు 2001–06 మధ్య బీఎన్పీతో అధికారాన్ని పంచుకున్న రాడికల్ పార్టీ జమాతే ఇస్లామీని ఈసారి రహ్మాన్ దూరం పెట్టారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా భారత్కు కలిసొచ్చే అంశమే. ఆయన పగ్గాలు చేపట్టాక ఇరుదేశాల నడుమ వాణిజ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇరు దేశాల వాణిజ్యం ఇలా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏటా 14 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. అయితే, ఇందులో దాదాపు 10 బిలియన్ డాలర్ల వరకు మనకు వాణిజ్య మిగులే ఉంటోంది. మన దేశం నుంచి బంగ్లాదేశ్ టీ, కాఫీ, ఆటో విడిభాగాలు, విద్యుత్, ఉక్కు, స్టీల్, ప్లాస్టిక్, పత్తి వంటివి దిగుమతి చేసుకుంటోంది. బంగ్లా పత్తి దిగుమతుల్లో 80శాతం మన దేశం నుంచే వెళ్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కాబట్టి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్తో రహ్మాన్ దౌత్య సంబంధాలు నెరిపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సరిహద్దు భద్రత.. అయితే, సరిహద్దు నియంత్రణ విషయంలో రహ్మాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై భారత్ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, పశ్చిమబెంగాల్, అస్సాంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల అంశమే ఎన్నికల్లో కీలకంగా మారింది. భారత్, బంగ్లాదేశ్ 4,100 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. 2024 జూన్ తర్వాత నుంచి దాదాపు 1000కి పైగా చొరబాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు చొరబాట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.తీస్తా నది జలాల సమస్య.. తీస్తా నది సిక్కిం నుంచి ఉద్భవించి పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. మొత్తం పొడవు సుమారు 414 కిలోమీటర్లు. ఉత్తర బంగ్లాదేశ్లో వ్యవసాయం, సాగు నీటి అవసరాలకు ఇది కీలకంగా ఉంది. అయితే, తీస్తా నదీ జలాలను భారత్ ఎక్కువగా వినియోగిస్తోందని బంగ్లా ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్కి తక్కువ వాటా రావడం వల్ల అక్కడి రైతులు, పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎక్కువ వాటా కోరుతోంది. కానీ, భారత్ (ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం) దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.ఒప్పందం ఇలా.. 2011లో తీస్తా జలాలపై ఒప్పందం కుదరబోతుందని భావించారు. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించింది. అప్పటి నుంచి ఒప్పందం నిలిచిపోయింది. 2025లో నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన సందర్బంగా ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. భారత్ టెక్నికల్ టీమ్ను పంపి నది నిర్వహణపై చర్చిస్తామని తెలిపింది. కానీ, తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చర్చలు జరగలేదు. మరోవైపు.. తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఇలా పద్మానదిపై ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో పద్మానది ప్రాజెక్ట్పై రెహ్మాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కీలకంగా మారనుంది.భారత్ ముందున్న సవాళ్లు.. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్లో అధికారంలోకి రావడం భారత్కి కొత్త అవకాశాలు, అలాగే కొన్ని సవాళ్లను తెస్తోంది. రెహ్మాన్ ప్రభుత్వం కనుక చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటే భారత్ మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాబట్టి కొత్త ప్రభుత్వంతో భారత్ వెంటనే ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించడం మంచిదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, భారత్ విషయంలో చైనా ఎప్పుడూ కయ్యానికి దిగే తరహాలోనే వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో బంగ్లా ప్రభుత్వంతో చైనా వ్యూహరచన చేస్తుందోననే టెన్షన్ కూడా భారత్కు ఉన్నట్టు సమాచారం. -
అస్సాంలో మోదీ.. రోడ్డుపైనే ల్యాండయిన విమానం
ప్రధాని మోదీ అస్సాం చేరుకున్నారు. దిబ్రూగఢ్-మోరాన్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీ రోడ్డుపై.. మోదీ ప్రయాణించిన ప్రత్యేక విమానం ల్యాండయ్యింది. అనంతరం ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని తిలకించారు. ఇటీవల నిర్మించిన 4.2 కిలోమీటర్ల ఈ రహదారిపై రఫెల్, సుఖోయ్ వంటి యుద్ధ విమానాల ల్యాండింగ్ ప్రదర్శన చేయవచ్చు.దానితో పాటు, అత్యవసర పరిస్థితుల్లో సైనిక, పౌర విమానాల ల్యాండింగ్కు ఇది ఉపయోగపడుతుంది. ఈశాన్య భారతంలో ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈశాన్య ప్రాంతాలలో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అత్యవసర సమయాల్లో ఉపయోగించడానికి వీలుగా దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.అనంతరం బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భాస్కర వర్మ సేతు ప్రాజెక్టును మోదీ ప్రారంభించనున్నారు. దాని తర్వాత దాదాపు రూ. 5,450 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీకి హిమంత బిశ్వశర్మతో పాటు ఇతర నాయకులు స్వాగతం పలికారు. -
‘సేవా తీర్థ్’లోకి మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయ చిరునామా మారిపోయింది. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్ నుంచి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’లోకి ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. ఢిల్లీని దేశ ఆధునిక రాజధానిగా మార్చి 95 ఏళ్లయిన సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంఓ) నూతన భవనం సేవా తీర్థ్ను ప్రధాని మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ఇక్కడి నుంచే ఆయన అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. మోదీ పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో కలిసి సేవా తీర్థ్ కాంప్లెక్స్కు చేరుకున్నారు. సేవా తీర్థ్తోపాటు కర్తవ్య భవన్–1, 2లను ప్రారంభించారు. పీఎంఓలో గణేశుడి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. సేవా తీర్థ్ ఫలకాన్ని ఆవిష్కరించారు. ఫలకంపై దేవనాగరి లిపిలో సేవా తీర్థ్ అని లిఖించగా, దాని కింద నాగరిక్ దేవో భవ(పౌరుడే దేవుడు) అని లిఖించారు. సేవా తీర్థ్ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని రూ.100 ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్ సైతం ప్రధానమంత్రి విడుదల చేశారు. కొత్త భవనంలో మోదీ తొలి రోజు అధికారిక విధులు ప్రారంభించారు. మహిళలు, రైతులు, యువతతోపాటు వృద్ధుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి పౌరుడికి జీవన భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘పీఎం రాహత్’ పథకానికి అనుమతి ఇస్తూ ఫైల్కు సంతకం చేశారు. లఖ్పతీ దీదీల సంఖ్యను ఆరు కోట్లకు పెంచడానికి మరో ఫైల్పై సంతకం పెట్టారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాన కార్యదర్శులు పి.కె.మిశ్రా, శక్తికాంత దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఎం రాహత్ పథకం కింద.. ప్రమాదాలకు గురైనవారికి రూ.1.5 లక్షల దాకా నగదు రహిత చికిత్స అందిస్తారు. డబ్బు లేకపోయినా బాధితులకు అత్యవసర చికిత్స తప్పనిసరిగా అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. మూడు కోట్ల మంది మహిళలను 2027 మార్చి నెల నాటికి లఖ్పతీ దీదీలుగా తీర్చిదిద్దాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే అది పూర్తయ్యింది. ఒక ఏడాది ముందే మూడు కోట్ల మంది లఖ్పతీ దీదీలుగా మారారు. 2029 మార్చి నెల నాటికి మొత్తం ఆరుకోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. అధికారులకు టార్గెట్ విధించారు. మరోవైపు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ.2 లక్షల కోట్లకు పెంచారు. ఈ నిధికి గతంలో రూ.లక్ష కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు రెట్టింపు చేశారు. అలాగే రూ.10,000 కోట్లతో ‘స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్ఓఎఫ్) 2.0’కు మోదీ అనుమతి మంజూరు చేశారు. ఈ నిధితో నూతన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం అందించబోతున్నారు. బ్రిటిష్ ఆనవాళ్లకు మంగళం ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) సేవా తీర్థ్లో కొలువు దీరగా, కేబినెట్ సెక్రెటేరియట్ ఆఫీసు, జాతీయ భద్రతా మండలి సచివాలయ కార్యాలయంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ శాఖలను కర్తవ్య భవన్–1, 2లలోకి తరలిస్తున్నారు. ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆయా కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరబోతున్నాయి. బ్రిటిష్ వలస పాలకుల ఆనవాళ్లను క్రమంగా వదిలించుకొనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2014 నుంచే ఆరంభించారు. ఇందులో భాగంగా అత్యాధునిక వసతులతో నూతన పార్లమెంట్ భవనంతోపాటు సేవా తీర్థ్ భవనం నిర్మించారు. రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చారు. బ్రిటిష్ పాలకులు మన మనసును బానిస మనస్తత్వంతో నింపేశారని, దాన్ని తప్పనిసరిగా వదిలించుకోవాలని మోదీ తరచుగా చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇకపై సేవా తీర్థ్గా పిలవాలని అధికారులు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన రేస్ కోర్స్ రోడ్ను కూడా లోక్ కల్యాణ్ మార్గ్గా ప్రభుత్వం ఇప్పటికే మార్చింది. రాష్ట్రాల్లో గవర్నర్లు నివాసం ఉండే రాజ్ భవన్లను లోక్ భవన్లుగా, లోక్ నివాస్లుగా మార్చేసింది. వికసిత్ భారత్ ప్రయాణంలో మైలురాయి: మోదీసేవా తీర్థ్, కర్తవ్య భవనాలు వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణంలో కీలకమైన మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. దేశ ప్రగతితోపాటు ‘పౌరులే కేంద్రంగా ప్రభుత్వ పాలన’కు ఇవి ప్రతీకలు అని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్–1, 2ల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రిమాట్లాడారు. ఇప్పటిదాకా పీఎంఓగా, ప్రభుత్వ శాఖల కార్యాలయాలుగా సేవలందించిన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లు బ్రిటిష్ సామ్రాజ్య ఆలోచనలు, ఆశయాలను ప్రతిబింబించేలా నిర్మించినవేనని తెలిపారు. కానీ, నేడు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా సేవా తీర్థ్, కర్తవ్య భవనాలు నిర్మించామని చెప్పారు. ఇకపై ఇక్కడ తీసుకొనే నిర్ణయాలు 140 కోట్ల మంది భారతీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పునాదిగా తోడ్పడుతాయని పేర్కొన్నారు. -
PM RAHAT: ప్రమాద బాధితులకు వెంటనే 1.5 లక్షల క్యాష్లెస్ వైద్యం
ఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు గోల్డెన్ అవర్స్లో సకాలంలో చికిత్స అందించి వారి ప్రాణాల్ని కాపాడేందుకు కేంద్రం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పీఎం రాహత్ పేరుతో రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో రూ.1.5లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు మోదీ తెలిపారు. శుక్రవారం పీఎంవో నూతన కార్యాలయం సేవాతీర్థ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సేవాతీర్థ్ నుంచి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ‘సేవాతీర్థ్ కొత్త చరిత్రకు సాక్ష్యం. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం సేవాతీర్ధ్. స్టార్టప్ ఇండియా 2.0 కోసం 10 వేల కోట్లతో కార్పస్ ఫండ్. సకాలంలో వైద్యం అందక ప్రాణం పోకూడదన్న ఉద్దేశ్యంతో 1.5లక్షల వరకు నగదు రహిత వైద్యం. పీఎం రాహత్, లక్పక్ దీదీలకు 6 లక్షలు పెంచేందుకు యత్నం. ప్రారంభం వ్యవసాయ మౌలిక సదుపాలయ నిధి రెట్టింపు’ చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పీఎం రాహత్ ఎలా పని చేస్తోందిప్రధానమంత్రి రాహత్ (PM RAHAT) పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడానికి రూపొందించింది. ఈ పథకం ద్వారా బాధితులు డబ్బు కోసం ఆందోళన చెందకుండా, వెంటనే చికిత్స పొందే అవకాశం కలుగుతుంది. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు నగదు లేకుండా చికిత్స అందుతుంది. అంటే, ఆసుపత్రి బిల్లులు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వం నేరుగా ఖర్చును భరిస్తుంది.బాధితుడు ఏ ఆసుపత్రిలో చేరినా, పథకం కింద ఖర్చు నేరుగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇది చికిత్స ఆలస్యం కాకుండా, వెంటనే ప్రారంభం కావడానికి సహాయపడుతుంది. ప్రమాదం జరిగిన మొదటి గంటల్లోనే అవసరమైన చికిత్స (సర్జరీ, ICU, మెడికల్ కేర్) అందించడమే ఈ పథకం లక్ష్యం.‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందితే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులు డబ్బు కోసం పరుగులు తీయకుండా బాధితుడు వెంటనే చికిత్స పొందేలా ఈ పథకం సహాయపడుతుంది. ప్రమాదం తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి తగ్గుతుంది. ఈ పథకం వల్ల ‘డబ్బు లేకపోవడం వల్ల ప్రాణం కోల్పోవడం’ అనే పరిస్థితి తగ్గుతుంది. అంటే, ఆర్థిక స్థితి ఎలా ఉన్నా, ప్రతి ఒక్కరికీ సమానంగా వైద్య సహాయం అందుతుంది. -
సేవా తీర్థ్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సేవా తీర్థ్ ప్రారంభించారు. గణపతి పూజతో పీఎంవో కార్యాలయం ప్రారంభమైంది. మహిళా, యువత, రైతులకు సంబంధించిన ఫైళ్లపై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. యాక్సిడెంట్ల బాధితులకు లక్షన్నర వరకు నగదు రహిత చికిత్స పథకానికి ఆమోదం తెలిపారు. లక్పతి దీదీ పథకం లబ్ధిదారుల సంఖ్య ఆరు కోట్లకు పెంచారు. అగ్రికల్చర్ మౌలిక సదుపాయాల నిధి 2 లక్షల కోట్లకు పెంపు ఫైళ్లపై మోదీ సంతకాలు చేశారు.సౌత్ బ్లాక్ నుంచి నూతన చిరునామాకు పీఎంవో మారింది. పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సెక్రెటేరియట్ కూడా సేవా తీర్థ్లోనే కొలువుదీరాయి. సేవా తీర్థ్తో పాటు కర్తవ్య భవన్ 1,2ను మోదీ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్లో ప్రధాని కార్యాలయంలో కొనసాగుతుంది. కార్యాలయం పాతబడడం, మారుతున్న కాలానికి అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు.కర్తవ్య భవన్లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్పొరేట్ వ్యవహారాలు ,విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ, ఐఅండ్బి శాఖ, వ్యవసాయం, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ సహా పలు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అధునాతన సౌకర్యాలతో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. భవన సముదాయంలో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్, నిఘా నెట్వర్క్, అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాలు, సమగ్ర భద్రత సౌకర్యాలు ఏర్పాటు చేశారు. -
తారిఖ్ రెహ్మాన్కు ప్రధాని మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత రెహ్మాన్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన మోదీ.. ఈ విజయం తారిఖ్ రెహ్మాన్ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. పొరుగు దేశంతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ తన పోస్ట్లో స్పష్టం చేశారు. ‘ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది’ అని ఆయన తన సందేశంలో ఉద్ఘాటించారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం పతనమై, అనంతరం జరిగిన సాధారణ ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ చారిత్రాత్మక మార్పు నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బంగ్లాదేశ్లోని మొత్తం 299 నియోజకవర్గాలకు గాను, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీఎన్పీ, దాని మిత్రపక్షాలు 177 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతున్నాయి. మొత్తం 237 స్థానాల లెక్కింపు పూర్తి కాగా, మిగిలిన 62 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల ద్వారా 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తారిఖ్ రెహ్మాన్ తిరిగి అధికార పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమమైంది. బీఎన్పీకి ప్రధాన పోటీదారుగా భావించిన జమాతే ఇస్లామీ, దాని మిత్రపక్షాలు కేవలం 53 స్థానాలకే పరిమితమయ్యాయి. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీలో లేకపోవడంతో, ప్రధాన పోరు బీఎన్పీ, జమాతే ఇస్లామీ మధ్యే నెలకొంది. అయితే, బంగ్లాదేశ్ ఓటర్లు తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీకే పట్టం కట్టారు. I convey my warm congratulations to Mr. Tarique Rahman on leading BNP to a decisive victory in the Parliamentary elections in Bangladesh. This victory shows the trust of the people of Bangladesh in your leadership.India will continue to stand in support of a democratic,…— Narendra Modi (@narendramodi) February 13, 2026 -
నేడు సేవా తీర్థ్ ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) చిరునామా మారబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ బ్లాక్ను విడిచిపెట్టి, ఇకపై కొత్త భవనం సేవా తీర్థ్ నుంచే అధికారిక విధులు నిర్వర్తించబోతున్నారు. నూతన పీఎంఓగా తీర్చిదిద్దిన సేవా తీర్థ్ కాంప్లెక్స్ను మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే కర్తవ్య భవన్–1, కర్తవ్య భవన్–2ను సైతం ప్రారంభించనున్నారు. పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సెక్రెటేరియట్ కూడా సేవా తీర్్థలోనే కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం ఇవి ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కర్తవ్య భవన్–1, 2లలో కేంద్ర న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖలతోపాటు ఇతర శాఖలను ఏర్పా టు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా శాఖల కార్యాలయాలు లుటెన్స్ ఢిల్లీ రైసినా హిల్స్లోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లో ఉన్నాయి. వాటిని ఖాళీ చేయబోతున్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా సౌత్ బ్లాక్లో శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. నార్త్ బ్లాక్ నుంచి కేంద్ర హోంశాఖ కార్యాలయాన్ని ఇప్పటికే కామన్ సెంట్రల్ సెక్రెటేరియెట్లోని 347 రూమ్ కాంప్లెక్స్కు తరలించారు. -
Bharat Bandh: ఇది ఆరంభం మాత్రమే... బీజేపీకి మాస్ వార్నింగ్
-
దేశాన్ని అమ్మింది కాంగ్రెసే
న్యూఢిల్లీ: వాణిజ్య ఒప్పందం పేరిట దేశాన్ని మోదీ సర్కారు అమెరికాకు అమ్మేసిందన్న విపక్ష నేత రాహుల్గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ‘‘దేశ ప్రయోజనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటి అంతర్జాతీయ సంస్థలకు తాకట్టు పెట్టింది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే. పేదలు, రైతుల ప్రయోజనాలను వాటికి అమ్మేసింది. ఏకంగా దేశాన్నే అమ్మేసింది’’అంటూ దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉండగా షెర్మెల్ షేక్ చర్చల సందర్భంగా దేశాన్ని దాయాది పాకిస్తాన్కు తనఖా పెట్టిన, ఏకంగా మన సార్వ¿ౌమత్వం విషయంలో రాజీ పడ్డ చరిత్ర కూడా కాంగ్రెస్దేనని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ 2026–27పై లోక్సభలో జరిగిన చర్చకు నిర్మల బుధవారం సాయంత్రం బదులిచ్చారు. మన దేశాన్ని అమ్మగల, కొనగల వాడెవరూ పుట్టలేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఆమె పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి పని ఎప్పటికీ చేయబోరని స్పష్టం చేశారు. ఇంధన, ఆర్థిక, ఆహార, డేటా భద్రత తదితరాలపై రాహుల్ లేవనెత్తిన ఆందోళనలను కొట్టిపారేశారు. ఆ విషయాల్లో అవసరమైన అన్ని చర్యలూ కేంద్రం తీసుకుందని, బడ్జెట్లో వాటికి చాలినన్ని నిధులు కేటాయించిందని చెప్పారు. సంబంధిత గణాంకాలను సభకు చదివి వినిపించారు. రాహుల్ అసలు బడ్జెట్నే చదవకుండా నిరాధార ఆరోపణలకు దిగారని మండిపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని రూ.53.47 లక్షల కోట్లుగా అంచనా వేసినట్టు నిర్మల సభకు తెలిపారు. ‘‘మా ప్రభుత్వం కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.3 శాతానికి పరిమితం కావచ్చు’’అని అంచనా వేశారు. దేశంలో ఎరువుల కొరత ఉందన్న వార్తలను కొట్టిపారేశారు. వాటి దిగుమతికి బడ్జెట్లో ఏకంగా రూ.1.71 లక్షల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. బెంగాల్లో బాంబుల రాజ్యం! కేంద్ర బడ్జెట్లో పశి్చమబెంగాల్కు కేటాయింపులే లేవన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ ఏలుబడిలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా మంటగలిశాయంటూ మమతా బెనర్జీ సర్కారు పనితీరును దుయ్యబట్టారు. బెంగాల్లో ఎక్కడ చూసినా బాంబుల సంస్కృతే రాజ్యమేలుతోందని ఆరోపించారు. ‘బెంగాల్లో బాంబులే మాట్లాడతాయి, చట్టాలు కాదు’అంటూ పలు ఉదంతాలను ఉటంకించారు. దాంతో విపక్ష సభ్యులు పెద్దపెట్టున నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాలు, స్టేషనరీ, విద్యపై జీఎస్టీ వసూలు చేస్తున్నారన్న తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు అభిõÙక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ‘‘వాస్తవాలను ఆయన ఉద్దేశపూర్వకంగా పూర్తిగా వక్రీకరించారు. పెన్సిళ్లు, షార్పనర్లపైనా జీఎస్టీ వేశామట! మరీ ఈ స్థాయిలో అబద్ధాలా? 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచీ పాలపై ఎన్నడూ జీఎస్టీ విధించలేదు. చావుపైనా జీఎస్టీ వేశారని పచ్చి అబద్ధాలు చెప్పారు. అంతిమక్రియలపై కూడా ఎప్పుడూ జీఎస్టీ లేదు. వింటున్న సభ్యులకు తెలివి లేదని అభిõÙక్ భావిస్తున్నారా?’’అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. బహుశా పశ్చిమబెంగాల్లో నడుస్తున్న సిండికేట్ మరణాలపైనా పన్నులు వసూలు చేస్తోందేమో అంటూ అధికార తృణమూల్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అన్యాయానికి గురయ్యామంటూ సానుభూతి కార్డు వాడటం, ప్రతిదానికీ సుప్రీంకోర్టు దగ్గరికి పరుగెత్తడం, చివరికి కోర్టుతో చీవాట్లు తినడం తృణమూల్కు అలవాటుగా మారిందన్నారు. -
రాహుల్ గాంధీపై కేంద్రం సీరియస్
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్పై రాహుల్ అసత్య వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైంది. దీనిపై రాహుల్ సాయంత్రం 5గం లోపు స్పీకర్ కార్యాలయంలోకి హజరై వివరణ ఇవ్వాలని తెలిపింది.దీనిపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ స్పందించారు. రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందన్నారు. ఆయన చేసినవన్ని నిరాధార ఆరోపణలని తెలిపారు. ఎప్స్టీన్ ఫైల్స్ అంశంలో రాహుల్ గాంధీ చెప్పిన అంశాల్లో అసలు వాస్తవం లేదని దానికి సంబంధించిన చాలా నిజాలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఓటుచోరి అంటూ అంటూ రాహుల్ ఎలక్షన్ కమిషన్పై ఆయన చేసిన డ్రామా విఫలమయ్యిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు.కాగా అంతకు ముందు రాహుల్ గాందీ పార్లమెంటులో మాట్లాడారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చేసిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం యుద్ధాల యుగంలోకే ప్రవేశిస్తున్నామని దానికి ఉక్రెయిన్, గాజా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలను ఆయన ఉదాహరణగా చూపారు. శాంతి స్థాపన జరుగుతుందన్న అంచనాలు ఇక చెల్లవని, నిరంతర సంఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవమని రాహుల్ అన్నారు.అయితే రాహుల్ ఎప్స్టీన్ ఫైల్స్ అంశం ప్రస్థావించాలని ప్రయత్నించగా స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ అదానీ, అంబానీ, హర్ధీప్ సింగ్ పేర్లను ప్రస్థావించారు. దీనిపై రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆప్ ఆర్డర్ లేవనెత్తారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. -
’మా కుమారుడి వివాహానికి రండి.. మీ సలహాలకు థాంక్యూ’
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్- అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండుల్కర్ మార్చి 5న వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. స్నేహితురాలు సానియా చందోక్తో కలిసి ఏడడుగులు వేయనున్నాడు.వియ్యంకులతో కలిసిఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కుటుంబం.. వియ్యంకులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలిసింది. కాబోయే వధూవరులు అర్జున్, సానియా కూడా మోదీని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని సచిన్ టెండుల్కర్ స్వయంగా వెల్లడించాడు.రాష్ట్రపతి గారికి ధన్యవాదాలుఅదే విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి తమ కుమారుడి వివాహానికి (Arjun- Saania Wedding) రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సచిన్ తెలిపాడు. ఈ నేపథ్యంలో.. ‘‘గత ఫిబ్రవరిలో గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు మా మదిలో అలాగే ఉన్నాయి.ఈరోజు అర్జున్- సానియా వివాహానికి ఆహ్వానించేందుకు మరోసారి వారిని కలిశాము. వధూవరుల్ని ఆశీర్వదించిన గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు’’ అని సచిన్ ట్వీట్ చేశాడు. రాష్ట్రతితో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా పంచుకున్నాడు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సైతం వివాహానికి ఆహ్వానించినట్లు తెలిపాడు సచిన్.మీ విలువైన సలహాలకు థాంక్స్ఇక ప్రధాని నరేంద్ర మోదీకి సైతం సచిన్ ధన్యవాదాలు తెలిపాడు. ‘‘అర్జున్- సానియా వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. యువ జంటకు మీరు ఇచ్చిన విలువైన సలహాలు, ఆశీర్వాదాలకు కృతజ్ఞులమై ఉంటాము’’ అని సచిన్ ప్రధానితో దిగిన ఫొటోలు షేర్ చేశాడు. వ్యాపార కుటుంబంకాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా చందోక్. ఆమె కూడా వ్యాపార రంగంలోనే ఉన్నారు. సచిన్ కుమార్తె సారా టెండుల్కర్కు సానియా స్నేహితురాలు. ఇక అర్జున్- సానియాల నిశ్చితార్థం గతేడాది జరిగిన విషయం తెలిసిందే. కాగా సచిన్- అంజలి దంపతులకు మొదటి సంతానంగా సారా జన్మించగా.. తర్వాత అర్జున్ జన్మించాడు. అయితే, అక్క కంటే ముందు తమ్ముడు పెళ్లి పీటలు ఎక్కనుండటం విశేషం. ఇక సారా వ్యాపార రంగంలో అడుగుపెట్టగా.. అర్జున్ తండ్రి బాటలో క్రికెటర్ అయ్యాడు. అయితే, ఇప్పటి వరకు ఆశించినంత గుర్తింపు పొందలేకపోయాడు 26 ఏళ్ల అర్జున్. చదవండి: నయా రాకెట్ -
ప్రధానిపై దాడికి యత్నం.. మోదీ సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు
-
సాంకేతికతకు సాగిలపడొద్దు
న్యూఢిల్లీ: సాంకేతికత అనేది విద్యార్థులను బానిసలుగా మార్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తంచేశారు. విద్యార్థి దశలో శిక్షణలో భాగంగా నేర్చుకునే పరంపరను కొనసాగించాలనీ అన్నింటిపై కృత్రిమ మేథ మీద ఆధారపడొద్దని ఆయన హితవు పలికారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల విద్యార్థులకు విద్యా సంబంధ చిట్కాలు, సలహాలు చెబుతూ అత్యంత ప్రజాదరణతో కొనసాగుతున్న ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమం 9వ విడత రెండో ఎపిసోడ్ సందర్భంగా కోయంబత్తూర్, రాయ్పూర్, గువాహటి, గుజరాత్లకు చెందిన పలువురు ఔత్సాహిక విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఏఐ అంటే భయమేల? ‘‘కృత్రిమ మేధ(ఏఐ) వంటి కొత్త తరం సాంకేతికతలను చూసి విద్యార్థులు భయపడొద్దు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ వాటిలోనూ మీరు రాణించాలి. ఏఐ లేదా స్మార్ట్ఫోన్ను అత్యున్నత గురువుగా భావించొద్దు. కొందరు పిల్లలకు తొలుత స్మార్ట్ఫోన్లో ఏదైనా చూశాకే వాళ్ల నోట్లోకి ముద్ద దిగుతుంది. మనం ఏఐను ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. అంతేగానీ అదే మన మార్గదర్శి అనే స్థాయిలో దానికి విలువ ఇవ్వొద్దు. పాఠ్యపుస్తకాల్లో ఉన్నదానికి ఏఐ సమాచారం అనేది అదనపు విలువ జోడింపు ఇస్తుంది అనే భావనతోనే మెలగాలి. అంతేగానీ నేర్చుకోవడం మానేసి పూర్తిగా ఏఐ ఆధారపడొద్దు. గతంలో ఎడ్లబండి మీద వెళ్లిన మనం ఇప్పుడు ఏరోప్లేన్లో వెళ్లినట్లుగా పాతరకం ఉద్యోగాలు మటుమాయమై ఎల్లప్పుడూ కొత్త రకం ఉద్యోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఉపాధి మారొచ్చేమోగానీ జీవితం మారదు. కొనసాగుతూనే ఉంటుంది. భయం, జంకూ వీడి కొత్త రకం సాంకేతికతలను నేర్చుకోవాలి. వాటిపై పట్టుసాధించాలి. సాంకేతికతతో మీ శక్తిసామర్థ్యాలను మరింత పెంపొందించుకోండి. సాంకేతికత సత్తాను మీ పనిలో చూపించండి’’అని మోదీ సూచించారు. పాతవి తిరగేయండి.. హాయిగా నిద్రపొండి ‘‘పరీక్షలకు సంబంధించి పాత క్వశ్చన్ పేపర్లను తిరగేయండి. ప్రశ్నల తీరును అర్థంచేసుకోండి. పగలంతా పక్కా ప్రణాళికతో చదివేసి రాత్రి హాయిగా నిద్రపోండి. రాత్రి బాగా నిద్రపోతేనే ఉదయం అంతకంటే బాగా పరీక్ష రాయగల్గుతారు. పరీక్షకు బాగా సంసిద్ధమయ్యాక కొత్తగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. చక్కటి నిద్ర అనేది మిమ్మల్ని రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది’’అని అన్నారు. తమ పిల్లలను ఇతర విద్యార్థులతో పోల్చి చూసే ధోరణిని తల్లిదండ్రులు విడనాడాలని మోదీ సూచించారు. రెండింటిపై స్వారీ చేయండి విద్య, సొంత ఇష్టాయిష్టాలను సమన్వయం చేసుకోవడం కష్టంగా ఉందని ఓ విద్యార్థి వెలిబుచి్చన ఆవేదనపై మోదీ తనదైన శైలిలో సలహా ఇచ్చారు. ‘‘ఓ వైపు ఆర్ట్ అంటే ఇష్టం. మరోవైపు శాస్త్రసాంకేతిక రంగంలో రాణించాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఎటూపాలుపోక నిట్టూర్చేకంటే ప్రతి రోజూ లేదా వారానికి ఒకసారి సొంత ఇష్టాయిష్టాలపై దృష్టిపెట్టండి. విద్యకు ఎప్పట్లాగే అత్యంత ప్రాధాన్యతా ఇవ్వండి’’అని సూచించారు. అంకుర సంస్థల వైపు మొగ్గుచూపొచ్చా? అని మరో విద్యార్థి అడగ్గా..‘‘ముందు అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక స్పష్టతకు రావాలి. ఇప్పటికే ఉన్న సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు చేయదలిచారా? లేదంటే డ్రోన్లు, విద్యుత్ వ్యవస్థల వంటి వాటికి కొత్త పరిష్కారాలు వెతకాలనుకుంటున్నారా? దీంట్లో స్పష్టత వస్తే అంకురసంస్థను స్థాపించాలా వద్దా అనేది తేలిపోతుంది. ముందుగా సాంకేతికత లేదా ఆర్థిక రంగాలపై పట్టున్న స్నేహితులతో ఒక బృందంగా ఏర్పడండి. స్టార్టప్ను ఆరంభించడానికి వయసుతో పనేలేదు. నిజంగా మీకు దీనిపై ఉత్సుకత ఉంటే ఇప్పటికే ఉన్న అంకురసంస్థలను సందర్శించండి. మీకున్న పరిజ్ఞానంతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ను సిద్ధంచేయండి. అది బాగుంటే అందరినోటా పడి చివరకు భారీ మద్దతు లభిస్తుంది. ఆర్థికసాయమూ అందుతుంది. తర్వాత ఎలా ముందుకెళ్లాలనేది నిర్ణయించుకోవచ్చు’’అని మోదీ సూచించారు. -
ప్రధాని మోదీతో సీషెల్స్ అధ్యక్షుడి భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ( సోమవారం) హైదరాబాద్ హౌస్ లో సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మీనితో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం సీషెల్స్ అధ్యక్షుడు మోదీతో కలిసి రాజ్ ఘాట్ వద్ద మహత్మాగాంధీకి నివాళులర్పించారు.అంతకుముందు సీషెల్స్ అధ్యక్షుడితో భేటీ ఎంతో ఆనందంగా ఉందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సముద్ర పొరుగు దేశాలుగా, ఈ ప్రాంతంలో ఆర్థిక శ్రేయస్సు మరియు భద్రత కోసం విజన్ మహాసాగర్ ని విజయవంతం చేయడంతో ఆయన మద్దతు చాలా విలువైనదిగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.ప్రస్తుతం సీషెల్స్ అధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా చైన్నై, ముంబైలలో పర్యటించిన వివిధ పలువురు వ్యాపార వేత్తలతో సమావేశమయ్యారు. పరిశ్రమలు, కోస్టల్ మేనెజ్ మెంట్, ఆరోగ్యం తదితర రంగాలలో సహాకారాన్ని బలోపేతం చేయడానికి చర్చలు జరిపారు.కేంద్రమంత్రి శర్బానంద సోనోవాలాతో పాట్రిక్ హెర్మీని భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సముద్ర వాణిజ్యం తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. భారత పర్యటన నిమిత్తం వచ్చిన పాట్రిక్ హెర్మీని ఫిబ్రవరి 10 వరకూ దేశంలో ఉండనున్నారు. ఇటీవల భారత్, సిీషెల్స్ ద్రైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయ్యాయి. -
ప్రధాని మోదీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. నిజమెంత?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను తలుచుకుంటే నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని అంతం చేయగలనని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఉన్న ఈ క్లిప్ భారతీయ నెటిజన్లలో తీవ్ర గందరగోళాన్ని, ఆందోళనను రేకెత్తించింది. ట్రంప్ రెండవమారు అధికారంలోకి వచ్చాక భారత్-అమెరికా సంబంధాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్న తరుణంలో ఈ వైరల్ క్లిప్ దుమారం రేపుతోంది.అయితే ఈ వైరల్ వీడియో ప్రచారంలో వాస్తవం లేదని ‘ఫ్యాక్ట్ చెక్’ ద్వారా స్పష్టమైంది. ఈ వీడియో 2025 అక్టోబర్లో వైట్ హౌస్లో ట్రంప్ విలేకరులతో మాట్లాడిన సందర్భానికి సంబంధించినదని తేలింది. ఆ సమయంలో ఆయన మోదీని ప్రశంసిస్తూ, ఆయనపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. ప్రధాని మోదీకి తనపై ఎంతో ప్రేమ ఉందని చెబుతూ, ఆ ‘ప్రేమ’ అనే పదాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ట్రంప్ చమత్కరించారు. ఆ సందర్భంలోనే ఆయన తాను ప్రధాని మోదీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 🚨 Breaking NewsDonald Trump's statement is making headlines.“I could end Narendra Modi’s political career, but I don’t want to.”One Statement, Many Questions.Is this just a Political statement, or is there a Deeper Meaning Behind It?In Global Politics, Words Carry… pic.twitter.com/my42g7J6r2— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) February 8, 2026కొందరు సోషల్ మీడియా యూజర్స్ ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. ‘నేను మోదీ కెరీర్ను అంతం చేయగలను.. కానీ నాకు ఇష్టం లేదు’ అని ట్రంప్ బెదిరించినట్లుగా క్యాప్షన్లు పెట్టి షేర్ చేస్తున్నారు. కాగా అధికారిక వైట్ హౌస్ నివేదికలు గానీ, అంతర్జాతీయ మీడియా సంస్థలు గానీ ఇలాంటి హెచ్చరికలు వచ్చినట్లు తెలియజేయలేదు. అసలు క్లిప్లో ట్రంప్ ఎంతో స్నేహపూర్వకంగా మోదీని ‘గ్రేట్ మ్యాన్’ అని కొనియాడారు.కొందరు కేవలం ఒక చిన్న పదాన్ని పట్టుకుని, అప్పటి సందర్భాన్ని తొలగించి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టమయ్యింది. నాడు ట్రంప్ భారతదేశంపై, మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా అభివర్ణిస్తూ, గతంలో భారత్ పదే పదే నాయకత్వ మార్పులను చూసేదని, కానీ మోదీ వచ్చాక రాజకీయ స్థిరత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. మోదీని కాలపరీక్షకు నిలబడిన నాయకుడు అని ట్రంప్ కొనియాడారు. ఇది కూడా చదవండి: ‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల -
‘పరీక్షలంటే ఒక ఉత్సవం’: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(సోమవారం) ‘పరీక్షా పే చర్చా’ 2026 రెండో ఎపిసోడ్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. పరీక్షల సమయంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి? బోర్డు, పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో ఎలా సిద్ధం కావాలనే అంశాలపై ప్రధాని కీలక సూచనలు చేశారు. పరీక్షలను ఒక భయానక అంశంగా కాకుండా, ఒక ‘ఉత్సవం’లా జరుపుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సానుకూల దృక్పథానికి ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ చర్చా కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా చదువుతో పాటు కళలు, క్రాఫ్ట్స్ ఎలా కొనసాగించాలంటూ కోయంబత్తూరు విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. చదువును, కళలను విడివిడిగా చూడవద్దని మోదీ సూచించారు. సైన్స్ ప్రయోగాలను బొమ్మల రూపంలో గీస్తూ, చదివితే సబ్జెక్టు సులభంగా అర్థమవుతుందని, రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కళలు ఒక ఔషధంలా పనిచేస్తాయని ప్రధాని వివరించారు. స్టార్టప్లు ప్రారంభించాలనుకునే వారు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, పరిశ్రమ నిపుణులను కలిసి, వారు ఎలా పనిచేస్తారో క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.పరీక్షా పే చర్చా 2026 ఎడిషన్ గత రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది ఏకంగా 4.5 కోట్ల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇతర అనుబంధ కార్యకలాపాలతో కలిపి మొత్తం 6.76 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. 2023లో 38.8 లక్షలుగా ఉన్న రిజిస్ట్రేషన్లు, 2025 నాటికి 3.53 కోట్లకు చేరుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సృష్టించగా, ఈ ఏడాది ఆ సంఖ్య మరింతగా పెరగడం గమనార్హం.దేశంలోని విభిన్న రాష్ట్రాల నుంచి విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడానికి ఈ వేదిక దోహదపడింది. ఈ కార్యక్రమం దూరదర్శన్ నేషనల్, డీడీ న్యూస్, డీడీ ఇండియాతో పాటు ఆల్ ఇండియా రేడియో, పలు ప్రైవేట్ ఛానెల్స్లో ప్రత్యక్ష ప్రసారమైంది. అలాగే పీఎంఓ, విద్యా మంత్రిత్వ శాఖ వెబ్సైట్లు, యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ తదితర డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా లక్షలాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. -
ఐఎన్ఏ యోధుడితో ప్రధాని మోదీ భేటీ
కౌలాలంపూర్: ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఆజాద్ హింద్ ఫౌజ్)లో పనిచేసిన యోధుడు జయరాజ్ రాజారావును మలేషియా పర్యటనలో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ కౌలాలంపూర్లో కలుసుకున్నారు. ఐఎన్ఏ శ్రేణులు ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలు, వారి ఆశయాలు, త్యాగాలకు భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. జయరాజ్ రాజా రావును కలుసుకోవడం ఎంతో ప్రత్యేకమని అనంతరం ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. ఆయనతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొనే క్రమంలో ఎదురైన అనుభవాలను ఆయన నుంచి తెలుసుకోవడం ఎంతో ప్రేరణ కలిగించిందన్నారు. జయరాజ్ రాజావుతోపాటు మరో వెటరన్ను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రిటిషర్ల పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా ఒకప్పుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఐఎన్ఏను స్థాపించడం తెల్సిందే. 1943 సెప్టెంబర్లో కౌలాలంపూర్లోని ఇండిపెండెన్స్ స్క్వేర్లో చేరిన వేలాది మంది అనుచరులనుద్దేశించి నేతాజీ చేసిన ప్రసంగం అనంతరకాలంలో ఎందరో యువత ఐఎన్ఏలో చేరేందుకు ప్రేరణగా నిలిచింది. అప్పట్లో మలేసియా, సింగపూర్ ప్రధాన కేంద్రాలుగా ఐఎన్ఏ కార్యకలాపాలు సాగాయి. -
ప్రగతి బాటలో కలిసి నడుద్దాం
కౌలాలంపూర్: ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, మలేషియా తీర్మానించుకున్నాయి. వాణిజ్యంలో అత్యధిక ప్రాధాన్య రంగాలతోపాటు పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, తయారీ, సెమీకండక్టర్ల రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని, ప్రగతి బాటలో కలిసి నడవాలని నిర్ణయించాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారత్, మలేషియా కట్టుబడి ఉన్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆయన ఆదివారం మలేషియా పరిపాలనా రాజధాని అయిన పుత్రజయలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్, మలేషియా మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సెమీకండక్లర్ట రంగంలో ఫ్రేమ్వర్క్ ఒప్పందంతోపాటు కీలక రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. భేటీ అనంతరం మోదీ, అన్వర్ ఇబ్రహీం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని వారిద్దరూ తీవ్రంగా ఖండించారు. మానవాళికి శత్రువుగా మారిన ఉగ్రవాద భూతాన్ని సమాధి చేయడానికి ప్రపంచదేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు మోదీ బహిర్గతం చేశారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు గానీ, రాజీపడడం గానీ ఉండబోదని స్పష్టంచేశారు. భారత్–మలేషియా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని వివరించారు. ఇరుదేశాల ప్రజల మధ్య శతాబ్దాలుగా లోతైన, సౌహార్ధ సంబంధాలు ఉన్నట్లు గుర్తుచేశారు. వ్యూహాత్మక విశ్వాసంతో ఇరుదేశాల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. ‘అంతర్జాతీయ’ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరి మలేషియాలో భారత కాన్సులేట్ జనరల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటం, నిఘా సమాచారం పంచుకోవడం, మారిటైమ్ సెక్యూరిటీ విషయంలో మలేషియాతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. రక్షణ బంధాన్ని సైతం విస్తృతపర్చుకుంటామని వివరించారు. కృత్రిమ మేధ(ఏఐ), డిజిటల్ టెక్నాలజీతోపాటు సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రతపై భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి గ్రోత్ ఇంజన్గా ఎదుగుతోందని వెల్లడించారు. మలేషియా లాంటి మిత్రదేశాల అండతో ‘ఆసియాన్’ దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకుంటామని చెప్పారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ఇండో–పసిఫిక్లో ఆసియాన్తో కలిసి అభివృద్ది, శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అన్వర్ ఇబ్రహీంతో అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్, మలేషియా మధ్య స్నేహసంబంధాలు పెరుగుతుండడం ఇరుదేశాలకు మేలు చేస్తుందని వెల్లడించారు. సవాళ్లను అధిగమించాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టడం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. భారత్–మలేషియా సంబంధాల విషయంలో అన్వర్ ఇబ్రహీం చక్కటి చొరవ చూపుతున్నారని కొనియాడారు. చరిత్రాత్మక నిర్ణయం: ఇబ్రహీం భారత్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని ఇబ్రహీం ప్రశంసించారు. భారత్తో భాగస్వామ్యం వల్ల తమకు ఎనలేని లబ్ధి చేకూరుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇరుదేశాల వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లో నిర్వహించుకోవాలన్నది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు.భారత సంతతి నేతలతో భేటీ మలేషియాలో భారత సంతతి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారత్తో వారి భావోద్వేగ అనుబంధం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. భారత సంతతి వ్యక్తులు ప్రజా జీవితంలో సాధిస్తున్న విజయాలు గర్వకారణమని ఉద్ఘాటించారు. మలేషియాలో అభివృద్ధిలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. భారత్, మలేషియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని వివరించారు. భారత్ను అభివృద్ధి చేయడంలో మోదీ దార్శనికత, కార్యాచరణ స్ఫూర్తిదాయమని భారత సంతతి నేతలు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలతో: ప్రధాని నరేంద్ర మోదీ మలేషియాలో నలుగురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములయ్యేందుకు వారు చూపుతున్న ఆసక్తిని ప్రశంసించారు. ఇంధన రంగంలో పునరుత్పాదక, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎల్ఎన్జీ, పెట్రోకెమికల్స్లో భాగస్వామ్యంపై వారితో చర్చించారు. అలాగే భారత్, మలేషియాకు చెందిన పలు కంపెనీల సీఈఓలతోనూ మోదీ భేటీ అయ్యారు. అనంతరం రెండు రోజుల మలేషియా పర్యటన ముగించుకొని ఆదివారం స్వదేశం చేరుకున్నారు. -
పాక్కు పుతిన్ మెసేజ్..భారత్కు దూరం కానున్న రష్యా?
భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ రష్యాకు కోపం తెచ్చిందా?. భారత్కు ఎల్లవేళలా అపన్న హస్తం అందించే చిరకాల మిత్రుడు ఇప్పుడు ఇండియాకి దూరం కానున్నారా? ఈ రెండు దేశాల మధ్య డిస్టెన్స్ ఇప్పుడు మాస్కోని పాకిస్థాన్కు చేరువచేస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ని ఇంతకాలం పక్కకు పెట్టిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో బాంబు దాడి జరిగితే స్వయంగా స్పందించారు.రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. "రష్యా సుఖ-దుఃఖ కాలంలో భారత్కు సహాయకారిగా ఉండే గొప్ప మిత్రుడు" అని భారత ప్రధాని మోదీ అన్నారంటే ఇరుదేశాల మధ్య మైత్రి ఎంతగొప్పదో అర్థం చేసుకోవచ్చు. భారత్ సైతం రష్యాకు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించింది. ఈయూతో పాటు ఇతర దేశాలు రష్యాతో ఆర్థిక బంధాలు తెంచుకున్న సమయంలో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది.అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇంతకాలం చిరకాల మిత్రులుగా ఉన్న దేశాలను దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్పై అధిక పన్నులు తగ్గించారు. ఫలితంగా భారత్ రష్యానుంచి చమురు కొనుగోలు చేయదని మాటిచ్చిందన్నారు. అయితే ఇక్కడ తుంటరి ట్రంప్ మాటలను నమ్మేవారు అధికంగా లేకున్నా.. ఇండియా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. పైగా ట్రంప్ని ప్రశంసిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై రష్యా సైతం సానుకూలంగా స్పందించింది. భారత్ ఎవరి నుంచైనా చమురు కొనుగోలు చేయచ్చని దానిలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని తెలిపింది.ఇదిలా ఉండగా రష్యా పాక్తో దగ్గరయ్యే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం రష్యా పాకిస్థాన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశంలో సైతం పాక్ ప్రధాని షెహబాజ్, పుతిన్ కోసం 40 నిమిషాలు ఎదురుచూసి అసహనానికి గురయ్యారు. కాగా ఇప్పుడు రష్యా పాక్తో మైత్రికి చేయి చాపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఇస్లామాబాద్లో బాంబుదాడి జరిగి 36 మంది మృతిచెందారు. దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానికి మెసేజ్ పెట్టారు.పుతిన్ మెసేజ్లో.. మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన, అమానవీయమైన మనస్థత్వాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహాబాజ్ షరీప్లకు సంతాప సందేశం పంపారు. అంతే కాకుండా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అని తెలిపారు. దీంతో పాకిస్తాన్తో కలిసి పుతిన్ కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రష్యానుంచి చమురు కొనుగోలు భారత్ ఆపేసిందని ట్రంప్ ప్రకటనలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ నిజంగా అలా చేస్తే మాత్రం ఎల్లవేళలా అండగా ఉన్న గొప్పమిత్రున్ని భారత్ దూరం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘ఉగ్రవాదంపై రాజీ లేదు.. ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు’
కౌలాలంపూర్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఉన్నారు. ఆదివారం ఆయన ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ‘పుత్రజయ’లో కీలక భేటీ నిర్వహించారు. రక్షణ, భద్రత, ఆర్థిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. ‘ఉగ్రవాదం విషయంలో మా సందేశం చాలా స్పష్టం.. ఇందులో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు, రాజీ పడే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాలు పరస్పరం సమాచారాన్ని పంచుకోవాలని, భద్రతా పరమైన సహకారాన్ని పెంచుకోవాలని అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్గా మారుతున్నదని, ఆసియా దేశాల (ASEAN) సహకారంతో ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల కోసం భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సముద్ర తీర సంబంధాలను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత్ వెలుపల అత్యధికంగా భారత సంతతి ప్రజలు నివసిస్తున్న రెండో దేశం మలేషియా అని పేర్కొంటూ, ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. రక్షణ రంగంలో సహకారాన్ని కేవలం కొనుగోళ్లకే పరిమితం చేయకుండా, సమగ్రంగా మార్చాలని మోదీ పిలుపునిచ్చారు.సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రత తదితర కీలక రంగాలలో సరికొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ రంగాల్లో భారత్ సాధిస్తున్న వృద్ధిని అభినందించారు. శనివారం కౌలాలంపూర్ చేరుకున్న ప్రధాని మోదీకి మలేషియా ప్రభుత్వం అపూర్వ స్వాగతం పలికింది. విమానాశ్రయంలో ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా మోదీని ఆహ్వానించడం విశేషం. ఆదివారం ఉదయం పెర్దానా పుత్రలో ప్రధానికి ఘనంగా గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) సమర్పించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య నాగరికత, చారిత్రక,ప్రజల మధ్య ఉన్న సంబంధాలను మరింత దృఢ పరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. #WATCH | Kuala Lumpur, Malaysia: Prime Minister Narendra Modi says, "Yesterday, I also had the opportunity to meet with members of the diaspora with you. It was a very special experience, and I saw the personal respect and affection that the diaspora has for you, which was… https://t.co/Y1N6KORfGz pic.twitter.com/4gLdLyAcwB— ANI (@ANI) February 8, 2026 -
ఇది వంచనే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారతీయ రైతులు, సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు, ప్రజల ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసేలా మోదీ సర్కార్ ట్రంప్ ప్రభుత్వం ఎదుట సాగిలపడిందని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగ సారథి పవన్ ఖేడా శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘తాజాగా కుదిరింది ఎన్డీఏ ప్రభుత్వం, ట్రంప్ సర్కార్ల మధ్య వాణిజ్య ఒప్పందంగా లేదు. అగ్రరాజ్యం ముందు మోదీ ప్రభుత్వం ఒంగి సలామ్ చేసినట్లుగా ఉంది. ఈ ఒప్పందం అమలైతే అమెరికా నుంచి పెద్ద ఎత్తున అమెరికన్ ఉత్పత్తులు భారత్ను ముంచెత్తుతాయి. ఇవి మన రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సాధారణ ప్రజానీకం ప్రయోజనాలను నాశనంచేస్తాయి. గత 75 ఏళ్లుగా భారత్ అవలంభిస్తున్న విధానాలను పూర్తిగా తుంగలో తొక్కి వంచనతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం అంటే ఇరుపక్షాలు సమస్థాయిలో సమావేశమై కుదుర్చుకునేది. అంతేగానీ నీ తలపై తుపాకీ గురిపెట్టి, బ్లాక్మెయిల్ చేసి కుదుర్చుకునేది ఒప్పందం అనిపించుకోదు. అది కేవలం సరెండర్ అవడం అవుతుంది. భారత ప్రధాని విదేశం ఎదుట లొంగిపోవడాన్ని కాంగ్రెస్ ఏమాత్రం సహించట్లేదు. ఇది నిజంగా దురదృష్టం’’అని ఖేడా వ్యాఖ్యానించారు. రైతన్నల వెన్ను విరిచారు ‘‘అమెరికా నుంచి విపరీతంగా సాగు సంబంధ ఉత్పత్తుల దిగుమతికి మోదీ సర్కార్ ఇప్పుడు అనుమతించింది. దీంతో ఇక్కడ రైతుల వెన్ను విరగనుంది. దీంతో భవిష్యత్తులో వ్యవసాయం అనేది కష్టాలపాలుకానుంది. ఈ ఒప్పందం భారత్లో వ్యవసాయాన్ని ఎంతగా నాశనం చేయనుందో త్వరలోనే కళ్లకుకడుతుంది. ఒప్పందం కారణంగా ఎన్ని రకాల ఉత్పత్తులు భారతీయ విపణికి విపరీతంగా పోటెత్తనున్నాయో వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ చెప్పట్లేరు. దిగుమతి కాబోయే వస్తూత్పత్తుల జాబితాను ఆయన తెలివిగా దాచేశారు. ఏఏ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయో అవి మాత్రమే ఘంటాపథంగా చెబుతున్నారు’’అని ఖేడా వెల్లడించారు. గోయల్నుద్దేశిస్తూ.. ‘‘మన రూపాయి భవితవ్యం, మన ఆర్థికవ్యవస్థ తాజా పరిస్థితి మీకు తెలుసా? ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతుల విలువ ఏటా 40 లేదా 42 బిలియన్ డాలర్లు ఉంటే ఇకపై ఏటా అది 100 బిలియన్ డాలర్లకు పెరిగిపోనుంది. అంతగా విదేశీమారకద్రవ్యాలను ఎక్కడి నుంచి తెచ్చి కడతాం?’’అని నిలదీశారు. హగ్లు, ఫొటోలు పనిచేయలేదు ‘‘ఏ దేశాధినేత, ప్రధాని, అగ్రనేతను కలిసినా మోదీ ఆలింగనం చేసుకుంటూ తెగ ఫొటోలు దిగుతారు. ఈ హగ్లు చేసుకునే హగ్లోమసీ, ఫొటోలు దిగే ఫొటో–ఆప్స్ ఏమాత్రం భారత అనుకూల ఒప్పందాన్ని సాకారంచేయలేదు. పేరుకే ఆయన నరేంద్ర మోదీ. పని మాత్రం సరెండ్ కావడం అంటూ ‘నామ్ నరేందర్, కామ్ సరెండర్’అని వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ‘‘హౌడీ మోదీ నినాదం కంటే నమస్తే ట్రంప్ నినాదమే ఆధిపత్యం కనబర్చింది’’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ‘‘అమెరికన్ రైతులపై భారత్ దిగుమతి సుంకం ఎత్తేసింది. దీంతో వాళ్లు భారత్లోకి విపరీతంగా తమ సరుకులను దిగుమతిచేయడం ఖాయం’’అని జైరాం అన్నారు. -
నమ్మకమే బలమైన కరెన్సీ
కౌలాలంపూర్: అగ్రరాజ్యం అమెరికా మొదలు యురోపియన్ యూనియన్ దాకా ముఖ్యదేశాలు, కీలక కూటములతో భారత్ బలమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక అంతకంటే బలమైన విశ్వాసం దాగి ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం కౌలాలంపూర్కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి భారతీయసంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘బ్రిటన్, అమెరికా, ఆ్రస్టేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, న్యూజిలాండ్ మొదలు ఈయూదాకా అన్ని దేశాలు భారత్ను విశ్వసనీయమైన అభివృద్ధి భాగస్వామిగా చూశాయి. అందుకే భారత్తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక్కడ భారత రూపాయి కంటే భారత్ అనే విశ్వసనీయతే బలమైన కరెన్సీగా ఎదిగింది. ఇక మలేసియా విషయానికొస్తే ఇక్కడ 30 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ లెక్కన అత్యధిక మంది భారతీయులున్న రెండో అతిపెద్ద దేశంగా మలేసియా అవతరించింది. ఇది ఇరుదేశవాసుల మదులను దోచుకుంటోంది. ఇదొక్కటే కాదు మలేసియాలో సర్వసాధారణంగా ఆరగించే రోటీ కనాయ్, మలబార్ పరోటా, కొబ్బరితోపాటు సుగంధ ద్రవ్యాలు, వేడివేడి తేహ్ టరీక్ టీ.. కౌలాలంపూర్లో అయినా కొచి్చలో అయినా ఒకేలా గుబాళిస్తాయి. తమిళనాడు మూలాలున్న వ్యక్తులు మలేసియాలో చాలా ఎక్కువగా ఉన్నారు’’అని అన్నారు. ప్రధానికి ఎంజీఆర్ పాటలంటే ఇష్టం ‘‘మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, నేనూ ఎప్పట్నుంచో మంచి స్నేహితులం. మలేసియా ప్రధాని పీఠంపై అధిరోహించకముందే ఈయన నాకు తెలుసు. ఈయనకు రాజకీయ చతురతే కాదు పాటలు పాడటంలోనూ ప్రావీణ్యం ఉంది. ఇటీవలే ఆయన ఓ పాట కూడా పాడారు. ఆయనకు తమిళ దిగ్గజం ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) పాటలంటే ఎంతో ఇష్టం. భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, నిర్మలా సీతారామన్, ఎల్.మురుగన్ కూడా తమిళులే. మలేసియాలో శతాబ్దాలుగా తమిళులు స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. ఈ చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని మలయ విశ్వవిద్యాలయ తిరువల్లువార్ పీఠాన్ని ఇక్కడ ఏర్పాటుచేసుకోవడం మనకు గర్వకారణంగా ఉంది. ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనను మలేసియాతో మొదలెట్టడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయంగా భారత్ విజయం సాధించిందంటే మలేసియా సైతం గెలిచిట్లే. ఆ లెక్కన ఆసియా గెలుపొందినట్లే. ఇరుదేశాల అభివృద్ధి దిశాపదం ఇంపాక్ట్(ఇండియా మలేసియా పార్ట్నర్షిప్ ఫర్ అడ్వాన్సింగ్ కలెక్టివ్ ట్రాన్స్ఫార్మేషన్–ఐఎంపీఏసీటీ)’’అని మోదీ అభివరి్ణంచారు. మోదీకి ఘన స్వాగతం అంతకుముందు ఢిల్లీ నుంచి కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోదీకి మలేసియా ప్రధాని ఇబ్రహీం ఘన స్వాగతం పలికారు. ఎర్రతివాచీ పరచి స్వయంగా ఎదురొచ్చి ఆలింగనం చేసుకున్నారు. -
మధ్యంతర ఒప్పందానికి సై
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా మరో ముందడుగు పడింది. ఇరుదేశాల పారిశ్రామికవర్గాలు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు తీపి కబురు అందింది. భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ను ఖరారు చేసుకున్నాయి. ఈ మేరకు ఇరుదేశాలు శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు వసూలు చేస్తుండగా.. మధ్యంతర ఒప్పందంలో భాగంగా వాటిని 18 శాతానికి తగ్గించినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు గత ఏడాది ఆగస్టులో విధించిన 25 శాతం అదనపు సుంకాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. 25 శాతం అదనపు సుంకాలను శనివారం నుంచే రద్దు చేస్తున్నట్లు అమెరికా తేలి్చచెప్పింది. రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి, అమెరికా నుంచి ఇంధన ఉత్పత్తులను భారత్ కొంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ప్రస్తావించారు. రాబోయే పదేళ్లలో అమెరికాతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఫ్రేమ్వర్క్కు కట్టుబడి ఉంటామని భారత్ అంగీకరించిందని పేర్కొన్నారు. వచ్చే నెలలో సంతకాలు! ఒప్పందంలో భాగంగా పలు ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలు రద్దు చేయడం లేదా తగ్గించడం జరిగినట్లు ఉమ్మడి ప్రకటనలో ఇరుదేశాలు పేర్కొన్నాయి. తద్వారా రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం మరింత వృద్ధి చెందుతుందని, పరిశ్రమలకు, ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశాయి. ఇది పరస్పరం ఇచి్చపుచ్చుకొనే, ఉమ్మడిగా ప్రయోజనం పొందే ఒప్పందమని అభివరి్ణంచాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఇది తొలిదశ అని ఉద్ఘాటించాయి. పూర్తిస్థాయి ఒప్పందంపై చర్చలను మరింత వేగవంతం చేస్తామని తెలిపాయి. మధ్యంతర ఒప్పందం వల్ల అమెరికాలో 30 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ భారత ఎగుమతిదారులకు అందుబాటులోకి వస్తుందని భారత ప్రభుత్వం ఆశాభావం వ్యక్తంచేసింది. మధ్యంతర ఒప్పందంపై వచ్చే నెల రెండో వారంలో సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందాన్ని చాలా వేగంగా అమల్లోకి తీసుకొస్తామని భారత్, అమెరికా ప్రకటించాయి. భారత్, రష్యాల చమురు వాణిజ్యంపై నిఘా అమెరికా ఆహార, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు కొన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను రద్దు చేశామని, మరికొన్నింటిపై తగ్గించామని భారత ప్రభుత్వం వెల్లడించింది. పశువుల దాణాగా ఉపయోగించే ఎర్రజొన్నలు, ట్రీ నట్స్, శుద్ధి చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్, మద్యం తయారీలో వాడే ధాన్యాల వంటివి ఇందులో ఉన్నట్లు పేర్కొంది. అమెరికా నుంచి వచ్చే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధన ఉత్పత్తులు, ఎయిర్క్రాఫ్ట్లు, విమాన విడిభాగాలు, అరుదైన లోహాలు, టెక్నాలజీ ఉత్పత్తులు, కోకింగ్ కోల్ వంటివి దిగుమతి చేసుకోబోతున్నట్లు స్పష్టంచేసింది. రష్యా నుంచి ప్రత్యక్ష లేదా పరోక్ష చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఒకవేళ రష్యా నుంచి ఎప్పటిలాగే చమురు కొంటున్నట్లు తేలితే భారత్పై మరోసారి 25 శాతం అదనపు సుంకాలు విధించడంతోపాటు మరికొన్ని ఆంక్షలు ఉంటాయని కార్యనిర్వాహక ఉత్తర్వులో తేలి్చచెప్పడం గమనార్హం. భారత్, రష్యాల మధ్య చమురు వాణిజ్యంపై నిఘా వేస్తామని అమెరికా సర్కార్ వెల్లడించింది. అతిపెద్ద మార్కెట్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమీసన్ గగ్రీర్ హర్షం వ్యక్తంచేశారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బంధం మరింత బలపడుతుందని చెప్పారు. అమెరికా ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని, దానివల్ల తమ పరిశ్రమలు, కారి్మకులకు మేలు జరుగుతుందని చెప్పారు. భారత్తో ఈ ఒప్పందం విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం గత ఏడాది ఇండియాపై 25 శాతం సుంకాలతోపాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతీకారంగా 25 శాతం అదనపు సుంకాలు విధించింది. మొత్తం సుంకాలు 50 శాతానికి చేరుకోవడంతో భారత్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. భారత ఎగుమతిదారులు నష్టాలు చవిచూశారు. భారత ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ అమెరికా. మధ్యంతర ఒప్పందంతో మొత్తం సుంకాలు ఏకంగా 18 శాతానికి దిగిరావడం భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. భారత్ నుంచి వ్రస్తాలు, తోలు ఉత్పత్తులు, చెప్పులు, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ రసాయనాలు, ఇంటి అలంకరణ సామగ్రి, కొన్ని రకాల యంత్రాలు, హస్త కళాకృతుల ఎగుమతులు ఇక ఊపందుకోనున్నాయి. భారత జనరిక్ ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలపై టారిఫ్లను రద్దు చేస్తామని అమెరికా తెలియజేసింది. మనకు భారీ ప్రయోజనం → 44 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సున్నా సుంకాలు → కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశానికి భారీగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంచేశారు. మన దేశం నుంచి 44 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతులపై ఎలాంటి సుంకాలు ఉండవని తెలిపారు. సున్నా టారిఫ్లు అమలవుతాయని అన్నారు. శనివారం ఒప్పందం ఖరారైన తర్వాత పీయూష్ గోయల్ స్పందించారు. లేబర్ ఇంటెన్సివ్ రంగాలకు సంబంధించిన వ్రస్తాలు, తోలు, పాదరక్షలు, హస్త కళాకృతుల ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. 2030 నాటికి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పారదర్శకమైన, సమతూకంతో కూడిన ఒప్పందానికి వచ్చామని స్పష్టంచేశారు. మన జనరిక్ ఫార్మాస్యూటికల్స్, ఎయిర్క్రాఫ్ట్, ఆటో విడిభాగాలకు సైతం జీరో టారిఫ్ వర్తిస్తుందన్నారు. 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ మనకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. యువత, మహిళలు, నిపుణులకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు. మనదేశంలో కొత్తగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. మన రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తాయన్నారు. వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు, యంత్ర విడిభాగాలు, బొమ్మలు, తోలు, పాదరక్షలు, హోమ్ డెకార్, స్మార్ట్ ఫోన్ల పరిశ్రమల వృద్ధికి చక్కటి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై మనం సుంకాలు రద్దు చేయడం గానీ, తగ్గించడం గానీ చేయడం లేదని తేలి్చచెప్పారు. మన రైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పీయూష్ గోయల్ వివరించారు. మొత్తానికి మధ్యంతర ఒప్పందం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’కు మరింత ఊపు వస్తుందన్నారు. ముఖ్యాంశాలు → భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిపోతాయి. → భారత ఎగుమతిదారుల కోసం 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్లోకి ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రధానంగా భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ), రైతులకు, మత్స్యకారులకు లాభం చేకూరుతుంది. → ఎగుమతులు పెరిగితే సహజంగానే పరిశ్రమల్లో ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. దానివల్ల యువతకు, మహిళలకు కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. → ఎగుమతులపై ఆధారపడిన భారత్లోని ముఖ్యమైన రంగాలకు మేలు జరుగుతుంది. → సెక్షన్ 232 కింద విమాన విడిభాగాలపై భారత్కు కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. ఆటో విడిభాగాలపై టారిఫ్ రేట్ కోటా అమలు చేస్తామని తెలిపింది. → అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేసే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. తమ రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమని ప్రకటించింది. → ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే నాన్–టారిఫ్ అవరోధాలను, డిజిటల్ ట్రేడ్ అవరోధాలను పరిష్కరించుకుంటామని భారత్, అమెరికా తెలిపాయి. → గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు సహా టెక్నాలజీ ఉత్పత్తుల వాణిజ్యాన్ని మరింత పెంచుకుంటామని వెల్లడించాయి. ఉమ్మడి టెక్నాలజీ సహకారాన్ని ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించాయి. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు నో రిలీఫ్ తమ రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టలేమని, అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులను తమ దేశంలోకి అనుమతించబోమని భారత్ తేల్చేసింది. అమెరికా నుంచి వచ్చే ఆయా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. అమెరికా మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయాలు, మాంసంపై సుంకాలు యథాతథంగా వసూలు చేస్తామని, మినహాయింపులేవీ ఉండవని పేర్కొంది. భారత్లో కోట్లాది మంది రైతులు వ్యవసాయ, పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే అవి చౌకగా వచి్చపడే అవకాశం ఉంటుంది. దానివల్ల భారత రైతులు నష్టపోవడం ఖాయం. ఇతర దేశాలతో కుదుర్చుకునే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో మన రైతులు ప్రయోజనాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, పాడి రంగాలే వెన్నెముక అనడం అతిశయోక్తి కాదు.‘మేక్ ఇన్ ఇండియా’ బలోపేతం: మోదీన్యూఢిల్లీ: అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో ‘మేక్ ఇన్ ఇండియా’ బలోపేతం కావడం తథ్యమని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఈ ఒప్పందంతో మనకు నూతన అవకాశాలు వస్తాయన్నారు. రైతులు, వ్యాపారవేత్తలకు మేలు జరుగుతుందని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఈ మేరకు మోదీ శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. భారత్, అమెరికాల మధ్య సంబంధాల బలోపేతం కోసం వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యంతర ఒప్పందం రెండు దేశాలకు ఒక గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. భారత్, అమెరికాల భాగస్వామ్యంలో లోతైన విశ్వాసానికి ఇదొక ప్రతీక అని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ భాగస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. సప్లై చెయిన్లకు ప్రోత్సాహం లభిస్తుందని, ప్రపంచానికి సైతం ఆర్థికంగా మేలు జరుగుతుందని మోదీ వివరించారు. మన ప్రజల సాధికారత, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాలతో ఒప్పందాలు, భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఉమ్మడి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. -
మలేషియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
కౌలాలంపూర్: రెండు రోజుల పర్యటన నిమిత్తం.. ప్రధాని నరేంద్ర మోదీ మలేసియా రాజధాని కౌలాలంపూర్కు చేరుకున్నారు. ఆయనకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల జెండాలతో చిన్నారులు ప్రధాని మోదీకి అభివాదం చేశారు. అనంతరం, ఎయిర్ పోర్టు నుంచి మోదీ, అన్వర్ ఇబ్రహీం కలిసి ఒకే కారులో ప్రయాణించారు. కౌలాలంపూర్ లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ నృత్యంతో మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారుకాగా, భారత్-మలేషియా మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' మరింత పటిష్టం చేయడమే ప్రధాని పర్యటన సాగుతోంది. రక్షణ, భద్రత, ఆర్థిక బంధాల బలోపేతంపై ఇరు దేశాల దృష్టి పెట్టారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రక్షణ, భద్రత, ఆర్థిక, ఆవిష్కరణల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.From airport to community meet: PM Modi shares car ride with Malaysia's PM Anwar, reflecting personal rapportRead @ANI Story | https://t.co/ZzlEW7jXby#PMModi #Malysia #bilatiralvisit #AnwarIbrahim pic.twitter.com/vgOnvrbQjd— ANI Digital (@ani_digital) February 7, 20262024లో ఇరు దేశాల మధ్య కుదిరిన 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయి పెంపు తర్వాత ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. భారతీయ సంతతి ప్రజలు ఇరు దేశాల మధ్య 'సజీవ వారధి'గా నిలుస్తున్నారని, వారి చారిత్రక స్నేహానికి వారే బలమైన స్తంభాలని ప్రధాని మోదీ కొనియాడారు. -
రిటైర్మెంట్పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన 9వ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తన వయసు, పదవీ విరమణపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని.. గత ఏడాది సెప్టెంబర్లో తాను 75వ ఏట అడుగుపెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. తన పుట్టినరోజున ఒక నేత తనకు ఫోన్ చేసి ‘మీకు 75 ఏళ్లు నిండాయి కదా’.. అని అన్నారని, దానికి తాను స్పందిస్తూ ‘75 ఏళ్లు పూర్తి కాలేదు, ఇంకా 25 ఏళ్లు మిగిలే ఉన్నాయి’ అని బదులిచ్చినట్లు ప్రధాని తెలిపారు. గడిచిన కాలం కంటే, దేశం కోసం ఇంకా చేయాల్సిన పనులనే తాను లెక్కిస్తానని ప్రధాని మోదీ అన్నారు.బీజేపీలో 75 ఏళ్లు నిండిన నేతలు క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవాలనే అప్రకటిత నిబంధన గతంలో చర్చనీయాంశమైంది. ఇదే క్రమంలో మోదీ వయసుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గతంలో చేసిన వ్యాఖ్యలను శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ప్రస్తావిస్తూ, గతంలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లను ఇదే వయస్సు సాకుతో పక్కన పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత నాయకత్వానికి ఈ నిబంధన వర్తిస్తుందో లేదో చూడాలని ఆయన సవాల్ విసిరారు.ప్రధాని మోదీ నాయకత్వంపై బీజేపీ అగ్రనేతలు పూర్తి భరోసా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాజ్యాంగంలో ఎక్కడా 75 ఏళ్లకు రిటైర్ కావాలనే నిబంధన లేదని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ తరఫున మోదీయే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని వారు చెప్పారు. అటు మోహన్ భగవత్ సైతం తన వ్యాఖ్యలను వివరణ ఇస్తూ, తాను ఎవరినీ రిటైర్ కావాలని సూచించలేదని, కేవలం ఒక సందర్భాన్ని మాత్రమే ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి (2047), దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తన ఏకైక లక్ష్యమని ప్రధాని మోదీ గతంలో స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: మలేషియా పర్యటనకు ప్రధాని మోదీ -
మలేషియా పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (శనివారం) తన రెండు రోజుల మలేషియా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ కానున్నారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాలలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రక్షణ, భద్రతా సంబంధాలను మరింతగా పటిష్టం చేసుకోవడమే మా లక్ష్యం. ఆర్థిక, ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, నూతన రంగాలలో మా సహకారాన్ని విస్తరిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి ఆధునిక అంశాల్లో కూడా మలేషియాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆ ప్రకటనలో తెలిపారు.#WATCH | PM Narendra Modi departs for Kuala Lumpur, Malaysia, for a two-day visit.Source: DD pic.twitter.com/qn2As5M9NK— ANI (@ANI) February 7, 2026మలేషియా అభివృద్ధిలో అక్కడి భారతీయ సంతతి పోషిస్తున్న పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు. మలేషియాలోని భారతీయులను కలుసుకోనున్నానని తెలిపారు. మలేషియా పురోగతికి వారి అపారమైన కృషి ఉందన్నారు. ఈ రెండు దేశాల మధ్య ఒక సజీవ వంతెనలా వారు పోషిస్తున్న పాత్ర, చారిత్రక స్నేహానికి బలమైన పునాదిని అందిస్తోందని మోదీ ప్రశంసించారు.ఇది కూడా చదవండి: ‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ -
‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో ఈ కీలక పరిణామాన్ని ప్రకటించిన ఆయన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, బంధానికి ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న చొరవను, నిబద్ధతను మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.ఈ వాణిజ్య ఒప్పందం భారతీయ ఆర్థిక వ్యవస్థకు, ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి మరింత ఊతాన్నిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు లభించడంతో స్థానిక పరిశ్రమలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా తయారయ్యే వస్తువులకు అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, విదేశీ ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఈ నూతన ఒప్పందం ద్వారా రైతులకు, పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ ఆవిష్కర్తలకు భారీ ప్రయోజనం చేకూరనుందని ప్రధాని పేర్కొన్నారు. Great news for India and USA! We have agreed on a framework for an Interim Trade Agreement between our two great nations. I thank President Trump for his personal commitment to robust ties between our countries.This framework reflects the growing depth, trust and dynamism of… https://t.co/zs1ZLzamhd— Narendra Modi (@narendramodi) February 7, 2026అమెరికాతో సులభతర వాణిజ్యం వల్ల గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడమే కాకుండా, చిన్న తరహా పరిశ్రమలు తమ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా, దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా దేశంలోని యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇది చారిత్రక ఒప్పందం: పీయూష్ గోయల్భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన తాజా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక సంబంధాల్లో మైలురాయిగా నిలవనుందని, ప్రధాని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఈ ఒప్పంద ముసాయిదా ఖరారైనట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన అవకాశాలు లభించనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
భారత్, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు
-
బదులిచ్చే ధైర్యం ప్రధానికి లేదు: ఖర్గే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం విమర్శలు గుప్పించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధానికి లేదన్నారు. ప్రభుత్వం సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నడపాలనుకోవడం లేదని ఆరోపించారు. పదేపదే అబద్ధాలు చెప్పడమే మోదీ పని అని ఆరోపించారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మోదీ తన 97 నిమిషాల ప్రసంగంలో ముఖ్యమైన, అవసరమైన విషయం ఒక్కటీ చెప్పలేదు. ఇంకా వందేళ్లు, 75 ఏళ్లు, 50 ఏళ్ల కిందటి సంగతులే మాట్లాడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని అధికార పక్షం పార్లమెంటులో చెబుతోంది. తాము ఆ పుస్తకాన్ని బాహాటంగా చూపినా వారికి అర్థం కావడం లేదు. ముందుగా వాస్తవాలను శ్రద్ధగా విని, ఆపై సమాధానం చెప్పాలి’’ అని ఖర్గే అన్నారు. రాహుల్, కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టూ్ట వివాదంపైనా ఆయన స్పందించారు. సభ బయట ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను సిక్కులకు జరిగిన అవమానంగా ముద్ర వేశారని మండిపడ్డారు. ‘‘సిక్కులను కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానిగా పనిచేశారు’’ అని గుర్తు చేశారు. సిక్కులను, దళితులను, ఆదివాసీలను ఎవరినీ గౌరవించే అలవాటు లేనిది బీజేపీకేనన్నారు. ఇతరు లను ఎలా కించపరచాలా అనే మోదీ ఆలోచిస్తారని ఖర్గే ఆరోపించారు. ‘‘దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిందే తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. కానీ మోదీ మాత్రం వాటిని దివాలా తీసే కర్మాగారాలు అని పిలుస్తూ నెహ్రూపై విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని నడిపే దార్శనికత మోదీకి లేదు’’ అన్నారు. రాహుల్ ఏం ప్రశ్నలు అడుగుతారో, ఎలాంటి వాస్తవాలు బయటపెడతా రోనని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘లోక్సభలో మోదీపై దాడి జరుగుతుందని నిఘా సమాచారముందని చెబుతున్నారు. అంత గొప్ప ఇంటలిజెన్స్ పుల్వామా వంటి ఉగ్ర దాడుల సమయంలో ఏమైంది?’’ అని ఖర్గే ప్రశ్నించారు. ‘‘ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడ్డ తరవాత మోదీ ఆందోళనగా ఉన్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లొంగిపోయి ఆ దేశంతో ఏకపక్ష వాణిజ్య ఒప్పందం కుదుర్చు కున్నారు. తద్వారా మన దేశ రైతులను బలిపశు వులను చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్య.. మోయలేని భారం కాదు
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం అంటే మోయలేని భారంగా భావించొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కేవలం మార్కులపైనే కాకుండా జీవితాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇతరులు చెప్పేది వినాలని.. చివరకు మన జీవితానికి సంబంధించిన నిర్ణయం మనమే తీసుకోవాలని పేర్కొన్నారు. మారాలన్న బలమైన సంకల్పం ఉన్నప్పుడే మన జీవన విధానం మారుతుందని స్పష్టంచేశారు. పరీక్షలు వస్తున్నాయంటే భయపడాల్సిన పని లేదని, పరీక్షలను పండుగలా భావిస్తూ ఆనందంగా జరుపుకోవాలని వెల్లడించారు. ‘ప్రధానమంత్రితో పరీక్షా పే చర్చ–2026’కార్యక్రమంలో భాగంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచి్చన పాఠశాల విద్యార్థులతో మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. త్వరలో పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. ఒత్తిడిని జయించి, పరీక్షలకు హాజరైతే విజయం సొంతమవుతుందని అన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను మోదీ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పరీక్షలను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడంపై విద్యార్థులతో చక్కటి చర్చ జరిగిందని వివరించారు. ఈ వీడియోను అందరూ తిలకించాలని కోరారు. పరీక్షా పే చర్చలో ప్రధానమంత్రి ఏం చెప్పారంటే. మనపై మనకు విశ్వాసం ఉండాలి ‘‘కంఫర్ట్ జోన్లో ఉండిపోతే జీవితం మారదు. అందుకోసం జీవన విధానం మార్చుకోవాలి. విద్యను భారంగా భావించకుండా అందులో పూర్తిగా నిమగ్నం కావాలి. అరకొరగా చదివితే ఉపయోగం ఉండదు. కేవలం మార్కులే పరమావధిగా భావించకుండా జీవితంపైనా దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు, టీచర్లు, మిత్రులు ఏం చెప్పారన్నది కాకుండా మనపై మనకు విశ్వాసం ఉండాలి. ఇతరులు చెప్పేది మనసులో పెట్టుకోవాలి. మన జీవితాన్ని మార్చే నిర్ణయం మనమే తీసుకోవాలి. ఆశించిన లక్ష్యం సమీపంలోనే ఉంటుంది. కానీ, దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి. మనసును అదుపులో పెట్టుకొని చదివితే అనుకున్నది సాధించడం సులభమే. మార్కుల కోసం ఎక్కువ ఆరాట పడొద్దు. గత ఏడాది బోర్డు పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి పేరు ఎవరికైనా గుర్తుందా? చాలావరకు గుర్తుండదు. అలాంటి విద్యార్థిని కొద్దిసేపు ప్రశంసిస్తాం, తర్వాత మర్చిపోతాం. అందుకే పరీక్షల్లో మార్కులే ముఖ్యమని భావించడానికి వీల్లేదు. చదువులో సొంత విధానం ఉండాలి విద్యార్థుల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. చదువు విషయంలో ఒత్తిడి చేస్తుంటారు. చదివే విధానం గురించి తల్లిదండ్రులు ఒకలా, టీచర్లు మరొకలా చెబుతుంటారు. విద్యార్థులు ఇంకోలా భావిస్తుంటారు. మొత్తానికి వారిలో గందరగోళం ఏర్పడుతుంది. ఏది సరైందో నిర్ణయించుకోలేరు. ఒక ఇంటిలో తోబుట్టువుల్లోనే ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. ఎవరి సొంత విధానం వారికే ఉంటుంది. అందుకే చదువు విషయంలో మీకు ఏది నచి్చతే అదే చేయండి. కొందరు రాత్రిపూట చదువుకోవడానికి, మరికొందరు ఉదయం పూట చదువుకోవడానికి ఇష్టపడుతుంటారు. మీకు ఎప్పుడు చదుకోవడం వెసులుబాటుగా ఉంటుందో అప్పుడే చదువుకోండి. సొంత విధానాన్ని నమ్ముకోవాలి. ఇతరుల సూచనలు జాగ్రత్తగా వింటూ.. సొంత అనుభవాల ద్వారా ఆ విధానంలో మార్పులు చేసుకోవచ్చు. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా అనుసరించాల్సిన పనిలేదు. నేను ‘పరీక్షా పే చర్చ’ను ప్రారంభించినప్పుడు కొన్నాళ్లు ఒకేలాగా కొనసాగింది. తర్వాత మెరుగుపర్చాం. వేర్వేరు రాష్ట్రాల్లో సెషన్లు నిర్వహించాం. మూలానికి కట్టుబడి ఉంటూనే ఫార్మాట్ మార్చాం. జరిగిపోయిన దాని గురించి ఎందుకు? విద్యార్థులు గతాన్ని తవ్వుకుంటూ సమయం వృథా చేయొద్దు. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. జరిగిపోయిన దాని గురించి నేను అంతగా పట్టించుకోను. ఇకపై ఏం జరగబోతోందో దానిపైనే నా దృష్టి ఉంటుంది. పరీక్షల్లో రాబోయే ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు మాత్రమే టీచర్లు బోధించే విధానం గతంలో ఉండేది. పరీక్షల్లో మంచి మార్కుల కోసం అలా చేసేవారు. నిజానికి ఒక మంచి టీచర్ జీవితానికి పనికొచ్చే అన్ని అంశాలూ బోధిస్తాడు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాడు. జీవితం అంటే పరీక్షలు ఒక్కటే కాదు, జీవితంలో పైకి ఎదగడానికి విద్య ఒక సాధనం. నేను ప్రధానమంత్రిని అయ్యాను. విభిన్నంగా పనిచేయండి అని ప్రజలు చెబుతుంటారు. మీరు కూడా విభిన్నంగా చదవడం ప్రయత్నించండి. ఇంటర్నెట్పై సమయం వృథా చేయొద్దు ఇంటర్నెట్లో గేమింగ్లు పక్కనపెట్టి చదువుపైనే దృష్టి పెట్టాలంటూ విద్యార్థులపై సమాజం నుంచి ఒత్తిడి ఉన్నమాట నిజమే. గేమింగ్ అంటే ఒక అభిరుచి మాత్రమే కాదు.. అదొక నైపుణ్యం. అందులో రాణించాలంటే వేగం, అప్రమత్తత అవసరం. సెల్ఫ్ డెవలప్మెంట్కు గేమింగ్ తోడ్పడుతుంది. నాణ్యమైన గేమ్ల్లో అనుభవం పెంచుకోండి. అదేసమయంలో చదువును నిర్లక్ష్యం చేయొద్దు. గేమింగ్లో జూదానికి దూరంగా ఉండాలి. జూదాన్ని అరికట్టే చట్టాలు మనదేశంలో ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్లు చాలా ప్రమాదకరం. దేశంలో ఇంటర్నెట్ చౌకగా దొరుకుతోంది కదా అని దానిపైనే సమయం వృథా చేయకండి. నిర్మాణాత్మక నైపుణ్యాలు పెంచుకోవడం కోసం గేమ్లు ఆడొచ్చు. భారతీయ సంస్కృతి, పురాణ గాథలతో ముడిపడి ఉన్న స్టోరీ టెల్లింగ్ గేమ్లను అభివృద్ధి చేయండి. వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటే చక్కటి గుర్తింపు లభిస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. మరింత ప్రోత్సహిస్తారు. కొత్త ఐడియాలు ఇస్తారు. పంచతంత్ర కథల ఆధారంగా గేమ్ను అభివృద్ధి చేయొచ్చు. మీరు క్రియేటర్గా మారండి. సొంతంగా సోషల్ మీడియా పేజీ ప్రారంభించండి. విద్యార్థి ఒక అడుగు ముందే ఉండాలి విద్యార్థి వేగం ఎల్లప్పుడూ టీచర్ వేగం కంటే ఎక్కువే ఉండాలి. అలా ఉండేలా చూసే బాధ్యత టీచర్లదే. అంటే టీచర్ కంటే విద్యార్థి ఒక అడుగు ముందే ఉండాలి. విద్యార్జనలో సమతూకం ఉండేలా జాగ్రత్తపడాలి. చదువుతోపాటు విశ్రాంతి, నైపుణ్యాలు, అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వాలి. లైఫ్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ అని రెండు రకాల నైపుణ్యాలు ఉంటాయి. ఆ రెండింటినీ విడదీసి చూడలేం. కేవలం ఒకదానివైపే మొగ్గు చూపితే జీవితంలో విఫలమవుతారు. రెండు రకాల నైపుణ్యాలూ సమానమే’’అని ప్రధాని మోదీ వివరించారు. గిన్నిస్ రికార్డుకెక్కిన చర్చ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ‘పరీక్షా పే చర్చ’2018లో ప్రారంభమైంది. ప్రతిఏటా ఆయన విద్యార్థులతో సంభాషిస్తున్నారు. వార్షిక పరీక్షల ముందు వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇది దేశంలో అతిపెద్ద విద్యా కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పరీక్షా పే చర్చలో పాల్గొనడం కోసం 2023లో 38.8 లక్షల మంది విద్యార్థులు రిజి్రస్టేషన్ చేసుకోగా, 2025లో ఆ సంఖ్య 3.53 కోట్లకు చేరింది. ఈ ఏడాది 4.5 కోట్ల మంది రిజి్రస్టేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే గిన్నిస్ బుక్ రికార్డుకెక్కింది. ఇంకా 25 ఏళ్లు ఉన్నాయి పరీక్షా పే చర్చలో విద్యార్థులతో మోదీ ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. గత ఏడాది సెపె్టంబర్ 17వ తేదీన ఆయన 75వ జన్మదినం జరిగింది. ఈ సందర్భంగా ఓ నాయకుడు ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు 75 ఏళ్లు వచ్చాయంటూ గుర్తుచేశారు. మోదీ బదులిస్తూ.. 75 ఏళ్లు రావడం కాదు, ఇంకా 25 ఏళ్లు ఉన్నాయని చెప్పారు. మణిపూర్ సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన ఇమోటా కె.శ్యామ్ అనే విద్యార్థి మోదీతో మాట్లాడాడు. చిన్నప్పటి నుంచి మీరంటే ఎంతో స్ఫూర్తి అని అన్నాడు. తన పుట్టినరోజు గురించి తెలిపాడు. మోదీ స్పందిస్తూ... ‘జరిగిపోయినదాన్ని నేను లెక్కపెట్టను. జరగబోయేది మాత్రమే లెక్కిస్తా. మీకు నేను చెప్పేది ఒక్కటే. పాత విషయాల గురించి ఆలోచిస్తూ టైమ్ వేస్టు చేసుకోకండి. జరగబోయేదే ఆలోచించండి. మిగిలిన జీవితం ఎలా జీవించాలో యోచించండి’’అని సూచించారు. -
ఆరోసారి భారత్కు ప్రపంచకప్.. ప్రధాని మోదీ ప్రశంసలు
కుర్రాళ్లు కుమ్మేశారు. ఏకంగా ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియా నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ని 100 పరుగుల తేడాతో యువ భారత్ ఓడించింది. అలా ఆరో వరల్డ్కప్ని టైటిల్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. యువ జట్టుని అభినందిస్తూ ట్వీట్ చేశారు.'భారత క్రికెట్ ప్రతిభ మెరిసింది. మన అండర్-19 జట్టు ప్రపంచకప్ సాధించినందుకు గర్వంగా ఉంది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలానే ఆకట్టుకునే ప్రతిభ చూపించింది. ఈ విజయం చాలామంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. గెలిచిన ఆటగాళ్లకు నా అభినందనలు' అని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా యువ టీమిండియాని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఇంగ్లండ్ కష్టపడినప్పటికీ 311 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో వరల్డ్కప్ సొంతం చేసుకుంది.టీమిండియా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఈ టోర్నీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్.. ఫైనల్లో ఆడాడు. 14 ఏళ్ల వైభవ్.. తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. India’s cricketing talent shines! Proud of our U-19 team for bringing home the World Cup. The team has played very well through the tournament, showcasing exceptional skill. This win will inspire several young sportspersons too. Best wishes to the players for their upcoming…— Narendra Modi (@narendramodi) February 6, 2026 -
ఓం బిర్లా చెప్పిందంతా పచ్చి అబద్ధం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సభకు రాకుండా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెనుక దాక్కున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా ధ్వజమెత్తారు. మోదీ సభకు వస్తే కాంగ్రెస్ ఎంపీలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని, అందుకే రావొద్దని చెప్పానంటూ బిర్లా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బిర్లా చెప్పిందంతా పచ్చి అబద్ధమని మండిపడ్డారు. గురువారం లోక్సభ వాయిదా పడిన తర్వాత ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. సభకు వచ్చి విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదన్నారు. అందుకే స్పీకర్తో అబద్ధాలు చెప్పిస్తున్నారని విమర్శించారు. సభలో మోదీపై దాడి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదని స్పష్టంచేశారు. మోదీపై చేతులెత్తే ప్రసక్తే లేదన్నారు. లేని ఆలోచన ఉన్నట్లు కల్పించవద్దని సూచించారు. బుధవారం లోక్సభలో ప్రధానమంత్రి స్థానం వద్ద ముగ్గురు మహిళా ఎంపీలు నిల్చున్నారని, అంతకు మించి ఏమీ జరగలేదని ప్రియాంక గాంధీ తేలి్చచెప్పారు. సభలో ఏదైనా మాట్లాడేందుకు అధికారపక్ష ఎంపీలకు స్పీకర్ అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. తమను మాత్రం మాట్లాడనివ్వడం లేదన్నారు. ప్రతిపక్షాలను ఎందుకు మాట్లానివ్వడం లేదో మోదీని, అమిత్ షాను అడగాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని సైతం అనుమతించడం లేదని ఆమె ఆక్షేపించారు. -
ప్రధాని సమాధానం లేకుండానే.. లోక్సభలో తీర్మానం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ చరిత్రలో గత 22 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ బుధవారమే సమాధానం ఇస్తారని భావించినప్పటికీ, నినాదాలు, నిరసనల కారణంగా సభ గురువారానికి వాయిదా పడిన విషయం తెల్సిందే. గురువారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభమైన సభ కూడా కొద్దిసేపటికే వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు సభ ఆరంభమయ్యాక సైతం ప్రధాని మోదీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇండియా కూటమి ఎంపీలు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాం«దీకి మాట్లాడే అవకాశం నిరాకరించారంటూ ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నరేంద్ర–సరెండర్’ అంటూ ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వెల్లోకి వెళ్లారు. కాశీలో మణికరి్ణక ఘాట్ వ్యవహారంపై బ్యానర్లు ప్రదర్శిస్తూ సమాజ్వాదీ పార్టీ సభ్యులు.. టీఎంసీ, ఇతర ఇండియా కూటమి సభ్యులు కూడా వారికి జత కలిశారు. ఈ గందరగోళం మధ్యే జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ సభలో చదివి వినిపించారు. ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదించింది. తీర్మానానికి ప్రతిపక్షాలు చేసిన సవరణలను స్పీకర్ తిరస్కరించారు. -
రాష్ట్రపతిని కించపర్చారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వరుస పరాజయాలను ఆ పార్టీ జీరి్ణంచుకోలేకపోతోందని అన్నారు. తనపై ఎంత విద్వేషం గుమ్మరించినా తనను సమాధి చేయడం కాంగ్రెస్ పార్టీ తరం కాదని తేలి్చచెప్పారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. దాదాపు 100 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడం పట్ల విచారం వ్యక్తంచేశారు. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్న పేద గిరిజన మహిళను, రాజ్యాంగబద్ధమైన పదవిని, భారత రాజ్యాంగాన్ని ఆ పార్టీ కించపర్చిందని మండిపడ్డారు. దళితులను, గిరిజనులను, ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కూడా కించపర్చిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి రవనీత్సింగ్ బిట్టూను ద్రోహి అని నిందించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చొరబాటుదార్లను నిస్సిగ్గుగా కాపాడుతోందని మండిపడ్డారు. ‘ప్రేమ దుకాణం’ అంటూ కల్ల»ొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోదీ.. తేరీ ఖబర్ ఖుదేగీ(మోదీ.. నీ సమాధి తవ్వుతాం) అంటూ నినాదాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అది వారి తరం కాదని అన్నారు. పేద కుటుంబంలో జని్మంచిన తాను ఉన్నత స్థానానికి చేరుకోవడం, ఈ పదవి ఇంకా కొనసాగుతుండడం చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, అందుకే నిత్యం తనను దూషిస్తోందని విమర్శించారు. ప్రధానమంత్రి పదవిని వారి కుటుంబ హక్కుగా భావిస్తున్నారని సోనియా గాంధీ కుటుంబంపై మండిపడ్డారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రతిపక్షాల వల్లే లోక్సభకు వెళ్లలేకపోయా.. ‘‘దేశంలో కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, పేదల ఆశీస్సులు నాకున్నాయి. వారి సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నా. ప్రజల అండదండలున్న నన్ను ఏమీ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను ఒక సమస్యగా పరిగణిస్తోంది. కానీ, మేము ప్రజలను ఒక బలంగా, సవాళ్లకు పరిష్కారంగా భావిస్తున్నాం. బుధవారం లోక్సభలో జరిగిన పరిణామాలు నిజంగా బాధాకరం. ప్రతిపక్షాలు అలజడి సృష్టించడం వల్లనే సభకు వెళ్లలేకపోయా. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. సభాపతి స్థానంలో ఉన్న అస్సాం ఎంపీపై, ఆంధ్రప్రదేశ్ దళిత ఎంపీపై పేపర్లు విసిరేశారు. అస్సాం ప్రజలను.. మొత్తం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను అవమానించారు. దళితులను అవమానించారు. కాంగ్రెస్ వల్ల అస్సాం గాయకుడు భూపేన్ హజారికా ఎన్నో అవమానాలకు గురయ్యారు. సదానందన్ మాస్టర్ను అవమానించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బిట్టూను కాంగ్రెస్ నాయకుడొకరు(రాహుల్ గాం«దీ) బుధవారం ద్రోహి అంటూ దూషించారు. ఆ పార్టీకి సిక్కులంటే ద్వేషం. కాంగ్రెస్ నుంచి ఎన్నో గ్రూప్లు విడిపోయాయి. ఎంతోమంది ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. బిట్టూ సిక్కు కాబట్టి ద్రోహి అని నిందించారు. ఇది సిక్కులకు, గురువులకు జరిగిన అవమానం. సిక్కుల పట్ల విద్వేషాన్ని కాంగ్రెస్ మరోసారి బయటపెట్టుకుంది. నిన్న రాజ్యసభలో స్వతంత్ర సభ్యుడు సదానందన్ మాస్టర్ తన కృత్రిమ కాలును ప్రదర్శిస్తే ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఆయన గొప్ప విలువలున్న వ్యక్తి. రాజకీయ గొడవల వల్ల మూడు దశాబ్దాల క్రితం కాలు పోగొట్టుకున్నారు. ఆయనను అవమానించడం మొత్తం దేశానికి బాధ కలిగించింది. అందుకు విపక్ష ఇండియా కూటమి బాధ్యత వహించాలి. ఓట్ల కోసం చొరబాటుదార్లను రక్షిస్తున్నారు ‘‘పశ్చిమ బెంగాల్లో దయలేని ప్రభుత్వం అధికారం చెలాయిస్తోంది. పతనం కావడంతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఓట్ల కోసం చొరబాటుదార్లను కాపాడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారం కోసం దేశాన్ని నాశనం చేయొద్దు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం చొరబాటుదార్లను సహించవు. వారిని బయటకు వెళ్లగొడతాయి. మనదేశంలో మాత్రం చొరబాటుదార్లను రక్షించే పరిస్థితులున్నాయి. అందుకోసం కోర్టులపైనా ఒత్తిడి తెస్తున్నారు. మన యువత హక్కులను లాక్కొని, గిరిజనుల భూములను కబ్జా చేస్తున్నవారిని కాపాడడం ఏమిటి? మన ఆడబిడ్డలు, కుమారుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నవారిని రక్షించడం తగదు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు దశాబ్దాలపాటు అధికారం అనుభవించాయి. అధికారంలో ఉన్నప్పుడు సొంత లాభం చూసుకోవడం తప్ప ప్రజల బాగు కోసం చేసిందేమీ లేదు. నేడు మనం డీల్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. గతంలో డీల్ అంటే బోఫోర్స్ డీల్ మాత్రమే. ప్రజల జీవితాలను మార్చడం వారికి ముఖ్యం కాదు. సొంత జేబులు నింపుకోవడమే ముఖ్యం’’ అని మోదీ ధ్వజమెత్తారు. .నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలి ‘‘అన్ని రంగాల్లో నూతన స్ఫూర్తి, శక్తితో వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇందులో భాగంగా నాణ్యమైన వస్తువుల ఉత్పత్తిపై మనం దృష్టి పెట్టాలి. ఇందుకు ప్రజలు సహకరించాలి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ భారత్’ ప్రపంచమంతటా వినిపించాలి. మన నాణ్యమైన ఉత్పత్తులు అన్ని చోట్లకూ వెళ్లాలి. అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ, అరుదైన ఖనిజాల రంగాల్లో ముందడుగు వేస్తున్నాం. సంస్కరణల ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తోంది. గతంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు సంస్కరణల వల్ల లాభాల్లోకి వస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ సంస్కరణలు చేపట్టాం. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన నిర్వాకాలకు ఇప్పుడు ఆ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పులను సరిచేయడానికి మా శక్తిని ఖర్చు పెడుతున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభించడానికి తన స్థానం నుంచి లేవగానే విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ను కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దాంతో మోదీ ప్రసంగం ప్రారంభించారు. దాంతో ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలతో హోరెత్తించారు. నిరసన వ్యక్తంచేశారు. లోక్సభలో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవమానాలు సహించబోమని అన్నారు. కూర్చొని నినాదాలు ఇవ్వొచ్చంటూ ఖర్గేకు ప్రధాని మోదీ సూచించారు. కొద్ది సేపటి తర్వాత ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మోదీ ప్రసంగం కొనసాగింది. విపక్ష సభ్యులు బయటకు వచ్చి మకరద్వారం వద్ద నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు. ఆ ఒప్పందాలతో ప్రపంచంలో గొప్ప విశ్వాసం ‘‘యూరోపియన్ యూనియన్తో కుదిరిన చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం తర్వాత అమెరికాతో ఒప్పందానికి వచ్చాం. ఇవి ఫ్యూచర్ రెడీ ఒప్పందాలు. ప్రపంచంలో గొప్ప విశ్వాసం నింపాయి. ప్రపంచ స్థిరత్వానికి ఈ ఒప్పందాలు తోడ్పడుతాయి. గత కొన్నేళ్లలో తొమ్మిది పెద్ద దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. ఇది ఈయూతో కుదిరిన ఒప్పందం ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’. మనం ఇక వెనక్కి చూడాల్సిన అవసరం గానీ, పరుగు ఆపాల్సిన అవసరం గానీ లేదు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన దిశగా వేగంగా దూసుకెళ్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి సమయంలో ప్రపంచమంతటా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత నూతన ప్రపంచ క్రమం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇప్పుడు భారత్ పట్ల ప్రపంచదేశాల్లో గొప్ప విశ్వాసం వ్యక్తమవుతోంది. ఎన్నో దేశాలకు మన దేశం విశ్వసనీయ భాగస్వామిగా మారింది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తులో పాలుపంచుకోవాలని ఇతర దేశాలు కోరుకుంటున్నాయి. అందుకే మనతో ఒప్పందాలకు ముందుకొస్తున్నాయి. దక్షిణార్ధ గోళ దేశాలకు(గ్లోబల్ సౌత్) నేడు మనమే బలమైన గొంతుకగా మారాం’’ అని మోదీ అన్నారు. -
దేశం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదు: మోదీ
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాల వాకౌట్ చేశాయి. మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ప్రధాని మోదీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మీరు కూర్చునే నినాదాలు చేయొచ్చు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. విపక్ష పార్టీల ఎంపీలు నిరసనతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే కూడా లేచి నిలబడి నిరసనలు తెలిపారు. దీంతో, మోదీ... వయసు రీత్యా ఖర్గే కూర్చుని నిరసనలు చేపట్టొచ్చని మోదీ అన్నారు. అనంతరం, రాజ్యసభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. ముందు నన్ను మాట్లాడనివ్వాలంటూ విపక్షాలకు ప్రధాని మోదీ సూచించారు.మరోవైపు.. రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘ఎన్డీయే హయాంలో భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుంది. దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది. దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు. గతంలో భారత్తో ఒప్పందానికి పలు దేశాలు ముందుకు వచ్చేవి కాదు. దేశం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదు. కాంగ్రెస్కు ఎప్పుడూ ఒక విజన్ లేదు. ఎన్డీయే హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. మా హయాంలో అనేక సంస్కరణలు చేపట్టాం.భారత్ తొమ్మిది దేశాల్లో ట్రేడ్ డీల్ చేసుకుంది. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొవడానికి దేశం సిద్దంగా ఉంది. యూపీఏ హయాంలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇటీవలి కాలంలో దేశం శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. అన్ని వర్గాల్లో మార్పు కనిపిస్తోంది. 27 దేశాలు, ఈయూతో అనేక ఒప్పందాలు చేసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు. #WATCH | In Rajya Sabha, PM Modi says, "...India is signing future-ready trade deals with several countries. In the past few days, we signed trade deals with 9 big and important countries of the world. Mother of all deals with 27 countries, with European Union is one of them..." pic.twitter.com/qpOcOpVUks— ANI (@ANI) February 5, 2026రాష్ట్రపతిని విపక్షాలు దారుణంగా అవమానించారు. దేశ అత్యున్నత పదవిని విపక్షాలు అవమానించాయి. దేశ అత్యున్నత పదవిని, రాజ్యాంగాన్ని, ఆదివాసీలను అవమానించారు. లోక్సభలో విపక్షాల ప్రవర్తన నన్నెంతో బాధపెట్టింది. స్పీకర్ కుర్చీలో కూర్చున్న దళితులను విపక్షాలు అవమానించాయి. అసోం ప్రజలు ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. కాంగ్రెస్ యువరాజు ఓ ఎంపీని ద్రోహి అన్నారు. అతనికి గర్వం తలకెక్కింది. కాంగ్రెస్ నుంచి ఎంతో మంది పార్టీని వీడారు. బిట్టు సిక్కు కావడంతో అతడిని అవమానించారు. సిక్కుల పట్ల ఎంత ద్వేషం ఉందో వారి మాటల్లో కనిపించింది అని మండిపడ్డారు. -
లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..
-
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీపై దాడి చేసేలా కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించారు. అందుకే ప్రధానిని సభకు రావొద్దని చెప్పాను. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. విపక్షాలు సభా మర్యాదలను ఉల్లంఘించారు’అని ఆయన అన్నారు.పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీని అగౌరవపరచవచ్చనే ముందస్తు సమాచారం నాకు అందింది. అందుకే ప్రధానిని సభకు రావొద్దని విజ్ఞప్తి చేశాను’అని స్పీకర్ తెలిపారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆయన స్పందించారు.బుధవారం ప్రధానమంత్రి ప్రసంగానికి ముందు సభలో జరిగిన గందరగోళం, వాయిదాపై ఓం బిర్లా వ్యాఖ్యానిస్తూ..‘ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీ కుర్చీని చుట్టుముట్టారు. లోక్సభలో కొంతమంది సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో గందరగోళం సృష్టించవచ్చని నాకు ముందస్తు సమాచారం వచ్చింది’ అని ఆయన వెల్లడించారు. -
7,8లలో ప్రధాని మోదీ మలేషియా పర్యటన
న్యూఢిల్లీ: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల(ఫిబ్రవరి) 7, 8 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు జరగనున్నాయి. మోదీ మలేషియాలో పర్యటించడం ఇది మూడోసారి. 2024, ఆగస్టులో ఇరు దేశాల మధ్య కుదిరిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ తర్వాత ప్రధాని మోదీ చేస్తున్న పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, అన్వర్ ఇబ్రహీంలు భారత్-మలేషియా సంబంధాలలోని పలు అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర తీర సహకారం తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వీటితో పాటు డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇరు దేశాల నేతలు సమీక్షించనున్నారు. భవిష్యత్తులో రెండు దేశాల ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మలేషియాలోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. పారిశ్రామిక, వ్యాపార రంగ ప్రముఖులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ‘10వ భారత్-మలేషియా సీఈఓ ఫోరమ్’ కూడా జరగనుంది. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడం ద్వారా ఇరు దేశాల మైత్రిని మరింత పటిష్టం చేయడమే ఈ భేటీల ప్రధాన ఉద్దేశం. భారత్- మలేషియాల మధ్య సుదీర్ఘమైన చారిత్రక, నాగరికత, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. -
బాధ్యత దులిపేసుకున్న మోదీ
న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య 2020లో జరిగిన ఘర్షణ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ముఖ్యమైన బాధ్యతను అప్పటి ఆర్మీ చీఫ్పైకి నెట్టేసి, చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సంక్షోభ సమయంలో మోదీ అలా తప్పించుకోవడం ఏమిటని నిలదీశారు. ప్రజలు ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతోందని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే రచించి, ఇంకా అధికారికంగా విడుదల చేయని జ్ఞాపకాల పుస్తకాన్ని ప్రదర్శించారు. అందులోని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ పుస్తకం నిజంగా ఉందన్న సంగతిని యువత తెలుసుకోవాలని కోరారు. అసలు ఇలాంటి పుస్తకమే లేదని ప్రభుత్వం నమ్మబలుకుతోందని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అదేమాట చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు లద్ధాఖ్లో గల్వాన్ ఘర్షణ సమయంలో ఏం జరిగిందో నరవణే సవివరంగా రాశారని తెలిపారు. మోదీ వస్తే పుస్తకం అందజేస్తా.. ‘‘చైనా యుద్ధ ట్యాంకులు కైలాస పర్వతం దాకా దూసుకొచ్చాయి.. ఇప్పుడేం చేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోపాటు రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ను అడిగారు. అందుకు వారు సమాధానం చెప్పలేదు. దాంతో రాజ్నాథ్ సింగ్ను మళ్లీ అడిగారు. ఉన్నత స్థాయి వాళ్లను(ప్రధానమంత్రి) అడిగి చెప్తానని రాజ్నాథ్ బదులిచ్చారు. రాజ్నాథ్ వెళ్లి ప్రధానమంత్రిని అడిగితే.. మీకు ఏది సముచితం అనిపిస్తే అదే చేయండి అంటూ మోదీ బాధ్యత దులిపేసుకున్నారు. చైనా యుద్ధ ట్యాంకులు మన భూభాగంలోకి ప్రవేశించినా తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు. దాంతో ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మారిపోయినట్లు భావించానని నరవణే తన పుస్తకంలో రాశారు. ఇదే విషయం నేను పార్లమెంట్లో చెప్తానని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే నన్ను సభలో మాట్లాడనివ్వడం లేదు. లోక్సభకు వచ్చేంత ధైర్యం ప్రధాని మోదీకి ఉందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన వస్తే ఈ పుస్తకం అందజేస్తా’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఈ పుస్తకం ప్రతిపక్ష నేత గానీ, విదేశీ రచయిత గానీ రాయలేదని వెల్లడించారు. మాజీ ఆర్మీ చీఫ్ రాశారని పేర్కొన్నారు. అయినా ఇలాంటి పుస్తకం లేనేలేదని అంటున్నారని తప్పుబట్టారు. పార్లమెంట్కు వచి్చ, నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం మోదీకి లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం భయపడుతోంది: ప్రియాంక చైనాతో ఘర్షణ జరిగినప్పుడు మోదీ ప్రభుత్వ నిర్వాకం ఏమిటో జనరల్ నరవణే బయటపెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. నిజాలు ప్రజలకు తెలుస్తాయని మోదీ సర్కార్ భయపడుతోందని, అందుకే లోక్సభలో మాట్లాడేందుకు రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వడం లేదని బుధవారం విమర్శించారు. బీజేపీ ఎంపీలు కూడా గతంలో పుస్తకాలు, మేగజైన్లు, రిపోర్టులను ప్రస్తావిస్తూ పార్లమెంట్లో మాట్లాడారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ కూడా సంజయ్బారు పుస్తకం గురించి మాట్లాడారని తెలిపారు. నరవణే పుస్తకంపై రాహుల్ మాట్లాడితే తప్పేమిటని ప్రశ్నించారు. అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఎంపీలకు ఉందన్నారు. -
సభలో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం, మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే పుస్తకంపై లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు బుధవారం సైతం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు నిజాలు బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. సభలో బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, ఆయన సభకు హాజరు కాలేదు. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో స్పీకర్ సభను ఉదయం 11 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యుల ఆందోళన ఆగలేదు. ప్రభుత్వం సమాధానం చెప్పేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. విపక్ష ఎంపీలు తొలుత వెల్లో బైఠాయించారు. అనంతరం బ్యానర్లు ప్రదర్శిస్తూ అధికార పక్ష సభ్యులవైపు దూసుకొచ్చారు. నరవణే పుస్తకంపై సభలో రాహుల్ గాం«దీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి తీరును కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్ షా తప్పుపట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా, తర్వాత 2 గంటల దాకా వాయిదా వేశారు. మరో వాయిదా తర్వాత 5 గంటలకు సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ సమయంలోనే ప్రధాని ప్రసంగించాల్సి ఉంది. కాంగ్రెస్ మహిళా ఎంపీ వర్షా గైక్వాడ్ సహా మరికొందరు మహిళా సభ్యులు ప్రధాని కూర్చొనే స్థానం వద్దకొచ్చి ఘోరావ్ చేశారు. అప్పుడు మోదీ సభలో లేరు. వెనక్కి రావాలంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కోరినా విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. పరిస్థితి అదుపులో లేకపోవడం వల్లనే మోదీ సభకు రాలేదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చెప్పారు. రాహుల్కు పోటీగా దూబే పుస్తక ప్రదర్శన..మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ‘ఎడ్వినా అండ్ నెహ్రూ’, ‘మిత్రోఖిన్ ఆర్కైవ్’ అనే పుస్తకాలను సభలో ప్రదర్శిస్తూ వాటి గురించి ప్రస్తావించడంతో వివాదం మొదలైంది. దివంగత ప్రధానమంత్రులు నెహ్రూ, ఇందిరా గాం«దీ, రాజీవ్ గాంధీపై ఆయన విమర్శలు చేశారు. వారు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, సభలో పుస్తకాల గురించి ప్రస్తావించడానికి వీల్లేదని సభాపతి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి స్పష్టంచేశారు. నిషికాంత్ దూబ్ తీరుపై మండిపడుతూ కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభాపతి లోక్సభను సాయంత్రం 5 గంటల దాకా వాయిదా వేశారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. నిషికాంత్ దూబేపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. -
ట్రంప్నే బెంబేలెత్తించింది.. భారత్ విజయ రహస్యం ఇదే!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే అక్కసుతో భారత్పై భారీగా సుంకాలు మోపిన అమెరికా.. ఉన్నఫళంగా ఎందుకు దిగివచ్చింది? ఏకపక్షంగా సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా భారత్తో డీల్ కుదిరిందని, ట్యాక్స్లను 18 శాతానికి తగ్గించామని ఎందుకు ప్రకటించారు?? బెదిరింపులతో లొంగదీసుకుందామని ట్రంప్ భావిస్తే.. ఏకు మేకై కూర్చుంటామంటూ పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం అమెరికా తల వంచిందా?ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛాయుత వాణిజ్యంపై భారత్ కుదుర్చుకున్న డీల్ ఇప్పుడు ట్రంప్ మెడలను వంచిందా? బంగారం ధరలు మొదలు.. పలు దేశాల షేర్ మార్కెట్లను మాటలతో శాసిస్తున్న ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి?? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే..! అహింసామార్గంలో.. శాంతియుతంగా ఎదుటివారి మెడలు వంచేలా చేయడం భారత్ నైజం..!! ఈ విషయంలో భారత్ వ్యూహాత్మక అడుగులు.. వాటి ఫలితాలను గురించి వివరంగా తెలుసుకోవాలంటే.. చదవాల్సిందే👉అది అనుకున్నంత ఈజీ కాకపోగా..ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు..! బాలిస్టిక్ మిసైల్స్.. యుద్ధ విమానాలతో విరుచుకుపడాల్సిన పని లేదు..! ఆంక్షల ఛట్రంలో ఆ దేశాన్ని బంధించి, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యేలా చేస్తే చాలు..! ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే దశలో ఆ దేశాలను దారికి తెచ్చుకోవచ్చు..! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే..! ఇదే మైండ్ గేమ్తో ఎన్నో దేశాలను దారికి తెచ్చుకున్నాడు. భారత్ను కూడా అదే గాడిన కట్టాలనుకున్నాడు. భారత్ ఆత్మగౌరవం ముందు ఓడిపోయాడు. అది అనుకున్నంత ఈజీ కాకపోగా.. అమెరికన్లకే ధరాఘాతంతో శాపంగా మారుతోంది. దీంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల మెట్లు దిగిరాక తప్పలేదు..!👉ఆ మౌనమే ట్రంప్ను బెంబేలెత్తించింది..భారత్ను దారికి తెచ్చుకోవాలనే తపనతో ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి భారత్ నుంచి ప్రకటనలు లేకున్నా.. తానే భారతీయుల తరఫున ప్రకటనలు చేసుకున్నారు. రష్యా చమురును భారత్ కొనబోదని.. అమెరికా నుంచే కొంటుందని ప్రకటించేసుకున్నారు. అలాంటి ప్రకటనలకు భారత్ తొందరపడి ఏమాత్రం స్పందించలేదు. ‘నో కామెంట్’ అంటూ దాటవేయలేదు. చేసిందల్లా.. మౌనంగా ఉండడమే..! ఆ మౌనమే ఇప్పుడు ట్రంప్ను బెంబేలెత్తించింది. వెనక్కి తగ్గేలా చేసింది. మౌనంగానే భారత్ విజయం సాధించింది.👉జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు..సాధారణంగా మౌనం అర్ధాంగీకారం అంటారు. కానీ, జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు. ఒక పాలసీని అమలు చేయడానికి ముందు.. దానికి సమ్మతిని ఇవ్వడానికి ముందు చేసే ఆలోచనలు, కసరత్తుకు నిదర్శనమే మౌనం అంటారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. 1988లో అమెరికన్ ఆలోచనాపరుడు నోమ్ చోమ్స్కీతోపాటు.. ఆర్థికవేత్త ఎడ్వర్డ్.ఎస్.హెర్మాన్ తమ పుస్తకం ‘ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ద మాస్ మీడియా’లో ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించారు. ఆంక్షలు, లేదా యుద్ధాలకు ముందు.. నిరసనను వ్యక్తం చేయకుండా.. విధానాలను సాధారణీకరించేందుకు మౌనం దాల్చడం ఓ రాజనీతి అంటారు. అమెరికా సుంకాల విషయంలో భారత్ పాటించిన మౌనం దీనికి చక్కటి ఉదాహరణ..!👉కన్జూమర్ సైకాలజీ అంటే ఇదే..కొనుగోలుదారులు ఎవరైనా తమకు కావాల్సిన వస్తువు ఎక్కడ చౌకగా దొరుకుతుందో అక్కడే కొంటారు. అది కన్జూమర్ సైకాలజీ. ఈ బేసిక్ నాలెడ్జ్ని కూడా మరిచిపోయిన ట్రంప్ చమురు విషయలో భారత్పై ఒత్తడి తేవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇక రాజనీతి విషయానికి వస్తే.. అగ్రదేశాలు అంతగా జియోపాలిటిక్స్ను వంటబట్టించుకోని రోజుల్లోనే మనదేశంలో ద్వాపరయుగంలో విదురనీతి.. ఆధునిక యుగంలో చాణక్యనీతి అమల్లో ఉన్నాయి. భారత్కు రష్యా ముందు నుంచి మిత్ర దేశం. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఆంక్షల ఛట్రంలో రష్యా కూరుకుపోయింది.👉భారత్ను దెబ్బతీయాలనుకున్నారు కానీ...ఈ క్రమంలో చౌకగా చమురు అమ్మేందుకు రష్యా సిద్ధమైనా.. అభివృద్ధి చెందుతున్న దేశాలేవీ కొనేందుకు ముందుకు రాలేదు. ఐరోపా దేశాలే రష్యా చమురు కొంటున్న తరుణంలో భారత్ కూడా రష్యాకు అతిపెద్ద వినియోగదారుగా మారింది. ఈ చర్య అటు రష్యాకు, ఇటు భారత్కు లబ్ధి చేకూర్చింది. దీన్ని జీర్ణించుకోలేని ట్రంప్.. సుంకాలతో భారత్ను దెబ్బతీయాలనుకున్నారు. భారత్ తన ప్లాన్-బీని అమలు చేసింది.👉ఊహించని పరిణామం..అంతే.. కొత్త వినియోగదారులను సొంతం చేసుకుంది. ఐరోపా సమాఖ్యతో 19ఏళ్లుగా కలగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకు ముందే.. చైనాకు దగ్గరైంది. ఉప్పు-నిప్పుగా ఉండే తాలిబాన్లను అక్కున చేర్చుకుంది. ఇరాన్తోనూ వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమైంది. జీయోపాలిటిక్స్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఊహించని ఈ పరిణామం అమెరికా మార్కెట్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో.. ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.👉భారత్ స్వరం మార్చింది..దౌత్యం విషయంలో భారత వ్యూహాలు మునుపటిలా లేవు. గడిచిన దశాబ్దన్నర కాలంగా వ్యూహప్రతివ్యూహాలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంతా భగవతేచ్ఛ.. అని భావించే భారత్.. ఇప్పుడు స్వరం మార్చింది. ప్రేమిస్తే.. ప్రాణమిస్తాం.. వంచిస్తే.. కాలరాస్తాం.. ఎక్కడా తగ్గేదే లే.. అని చాటిచెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ఈ విషయం స్పష్టమైంది. ఏరంగంలోనైనా శత్రువు ఢీ-అంటే ఢీకొడతామని తేల్చిచెప్పింది.👉ఇంకా చెప్పాలంటే..ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే.. 2019లో ఆంక్షల పేరుతో ఇరాన్, వెనిజెవెలా, భారత్ నుంచి చమురు దిగుమతులను నిలివేశారు. ఆ సమయంలో ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీతో రాయబారాలు నెరిపారు. అప్పటి నుంచే.. భారత్-అమెరికా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ ఆత్మనిర్భరతతో ఉందనే విషయాన్ని అమెరికాకు చాటి చెప్పింది. అమెరికా సాధారణంగా తన దారికి తెచ్చుకోవాలనుకునే దేశాలపై ప్రయోగించే సామ, దాన, బేధ, దండోపాయాలకు తాము అతీతమని భారత్ నిరూపించింది. ట్రంప్ మాదిరిగా.. దావోస్లాంటి వేదికను బెదిరింపులకు వినియోగించుకోకుండా.. అసందర్భ ప్రేలాపనలకు పోకుండా.. మౌనం వహించింది. విజయం సాధించింది. -
మౌనంగానే మెడలు వంచి!
అసలే అతను డొనాల్డ్ ట్రంప్. శత్రువులా, మిత్రులా అన్న తేడా కూడా లేకుండా అన్ని దేశాలనూ హడలెత్తిస్తూ వస్తున్న వ్యక్తి! కఠిన పదజాలంతో కూడిన బెదిరింపులతో, ఎడాపెడా టారిఫ్ల బాదుడుతో వణుకు పుట్టించడాన్నే తన నైజంగా మార్చుకున్నారు. రెండోసారి అధికారం చేపట్టింది మొదలు, ఈ ఏడాది కాలంలో ప్రపంచ దేశాలకు ఒకరకంగా పీడకలలా పరిణమించారు. చివరికి దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి అతి సన్నిహిత మిత్ర దేశాలు కూడా ట్రంప్ బెదిరింపులకు జడిసి ఆయన డిమాండ్లకు అనుగుణంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు తలొగ్గాల్సి వచ్చింది.ఇలాంటి పరిస్థితుల్లో భారత్ విషయంలో మాత్రం ట్రంప్ హఠాత్తుగా దిగొచ్చిన తీరు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తోంది. భారత్పై 50 శాతం టారిఫ్లను ఏకంగా 18 శాతానికి తగ్గిస్తున్నట్టు సోమవారం ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీన్ని భారత్ సాధించిన ఘన విజయంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో తొలినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గకుండా, మాటల యుద్ధానికి బదులివ్వకుండా సంయమనం పాటిస్తూనే చివరికి మౌనంగానే ఆయన మెడలు వంచారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమ వుతోంది. బెదిరింపులనే తిరుగులేని ఆయుధంగా చేసుకుంటూ గత ఏడాది కాలంలో ట్రంప్ చెలరేగి పోయారు. దేశాధినేతలంతా తాను చెప్పినట్టు వినాలన్న ఒంటెత్తు పోకడ ప్రదర్శించారు. చివరికి నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడినంటూ ప్రకటనలు చేయాల్సిందిగా వారిని ఒత్తిడి చేసే స్థాయికీ వెళ్లారు! పాక్ లాంటి పలు దేశాల అధినేతలు అందుకు తలొగ్గారు కూడా. కానీ మోదీ నుంచి మాత్రం మౌనమే సమాధానమైంది. దాంతో ట్రంప్ ఇగో దెబ్బ తిన్నది కూడా. మోదీ వ్యక్తిగతంగా ఫోన్ చేయనందుకే భారత్తో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ బాహాటంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పట్టాయి. ప్రధాని మాత్రం వీటిని పట్టించుకోలేదు. అంతేగాక ట్రంప్ బెదిరింపుల ఉచ్చులో పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.ఒప్పందం విషయమై ట్రంప్ నాలుగుసార్లు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినా పట్టించుకోలేదు. ఆయన కారాలు, మిరియాలు నూరుతున్నా లక్ష్యపెట్టకుండా బ్రిటన్, న్యూజిలాండ్, అనంతరం ఒమన్లతో లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తద్వారా స్వతహాగా వ్యాపారి అయిన ట్రంప్నే మించిపోయే స్థాయిలో మోదీ వ్యాపార దక్షత ప్రదర్శించారు. ఈ చర్యతో ఆయనను పునరాలోచనలో పడేశారు. ఇక గత నెలలో యూరోపియన్ యూనియన్తో అతి కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసుకుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీదని కొనియాడుతున్న ఈ డీల్ భారత్పై దూకుడు విషయంలో ట్రంప్కు గట్టిగా బ్రేకులు వేసిందని చెబుతున్నారు.27 దేశాల కూటమి అయిన ఈయూతో కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయ వేదికపై భారత స్థాయిని మరింత పెంచింది. ట్రంప్ చపలచిత్తం పుణ్యమా అని ఇతర దేశాల దృష్టిలో అమెరికా శరవేగంగా విశ్వసనీయతను కోల్పోతూ వస్తోంది. అందుకు విరుద్ధంగా భారత్ మాత్రం అత్యంత నమ్మదగ్గ భాగస్వామ్య దేశంగా తన ప్రతిష్టను పెంచుకుంటూ వచ్చింది. పైగా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ను ఏ దేశమూ ఇప్పుడు తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇందుకు అమెరికా కూడా మినహయింపు కాదు. అందుకే వ్యవసాయ, పాడి తదితర కీలక రంగాలను అమెరికా పరిశ్రమలకు బాహాటంగా తెరిచేందుకు కరాఖండిగా నిరాకరించి కూడా ఒప్పందానికి ట్రంప్ను భారత్ ఒప్పించగలిగింది! అదే సమయంలో ట్రంప్ ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ప్రతి వ్యాఖ్యలకు దిగకుండా మోదీ పరిణతి ప్రదర్శించారు. చైనాతో స్నేహ గీతంట్రంప్ దూకుడుకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా వ్యూహాత్మకంగా చైనాకు దగ్గరయ్యేందుకు కూడా భారత్ వెనకాడలేదు. గతేడాది షాంఘై సహకార సమాఖ్య భేటీకి హాజరయ్యేందుకు ఏడేళ్ల అనంతరం మోదీ చైనాలో పర్యటించారు! ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చివరికి ట్రంప్ కూడా వాటిపై చిర్రబుర్రులాడారు. భారత్, రష్యాలను అమెరికా చివరికి చైనాకు కోల్పోయిందంటూ నిట్టూర్చారు! ఆ తర్వాత రెండు నెలలకే పుతిన్కు ఢిల్లీలో మోదీ రాచమర్యాదలు చేశారు.రష్యాతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఇలా పలు అగ్ర రాజ్యాలతో భారత్ వ్యూహాత్మకంగా ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకుంటున్న వైనం కూడా ట్రంప్ను పునరాలోచనలో పడేసింది. భారత్ అక్కడితోనే ఆగలేదు. ట్రంప్ టారిఫ్లకు ప్రతీకా రంగా తాను కూడా అమెరికాపై సుంకాలు బాదింది! అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, తృణధాన్యాలపై ఏకంగా 30 శాతం టారిఫ్లు విధించింది. ట్రంప్లా గొంతెత్తి ప్రకటనలు చేయకుండా మౌనంగానే గత నవంబర్ నుంచే వాటిని వసూలు చేయడం కూడా ప్రారంభించింది.‘ఒప్పందం’పై మోదీ మౌనంభారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిపోయిందని ట్రంప్ ప్రకటించినా, దానిపై మోదీ మాత్రం సూటిగా స్పందించకపోవడం విశేషం. అంతేగాక రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్ ఒప్పుకుందని, అమెరికా నుంచి దిగుమతులను ఏకంగా 500 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లనుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైనా మోదీ మౌనమే వహించారు. కేవలం టారిఫ్ల తగ్గింపుకు హర్షం వ్యక్తం చేయడానికే తన స్పందనను పరిమితం చేయడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ ‘గోర్’ ఫ్యాక్టర్సెర్గియో గోర్. భారత్లో అమెరికా నూతన రాయబారి. భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం, టారిఫ్ల తగ్గింపు వెనక ఆయన పాత్ర కీలకంగా నిలిచింది. ఇరు దేశాల సంబంధాలు కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారిన తరుణంలో గత జనవరి 12న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎన్నడూ లేనంత బలోపేతం చేయడమే ఆ సందర్భంగా స్పష్టంగా ప్రకటించారు. ‘నిజమైన మిత్రులు తొలుత విభేదించవచ్చు. కానీ అంతిమంగా ఒక్కతాటిపైకే వస్తారు’ అని చెప్పుకొచ్చారు. అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరేదీ లేదని కూడా స్పష్టం చేశారు.ఖనిజాల అన్వేషణ, ఏఐ టెక్నాలజీ వాడకానికి సంబంధించి అమెరికా ఏర్పాటు చేసిన ‘పాక్స్ సిలికా’ కూటమిలో చేరాల్సిందిగా భారత్ను ఆహ్వానించారు కూడా. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న సుదీర్ఘ ప్రతిష్టంభన కాస్తా ఆయన వచ్చిన మూడు వారాల్లోపే వీడిపోవడం విశేషం. ట్రంప్కు అత్యంత సన్నిహితునిగా గోర్కు పేరుంది. ఏ సందర్భంలోనైనా గోర్ను తాను పూర్తిగా విశ్వసిస్తానని ట్రంప్ చెబుతుంటారు. భారత్తో ఒప్పందం, టారిఫ్ల తగ్గింపు విషయంలో ట్రంప్పై ఆయన ప్రభావం చాలా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.మాకు సమాచారం లేదు: రష్యా మాస్కో: చమురు కొనుగోళ్ల నిలిపి వేతపై భారత్ నుంచి ఇప్పటి దాకా అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదని రష్యా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్ అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఇకపై వెనెజువెలా నుంచే భారత్ అధికంగా చమురు కొనుగోలు చేస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ మంగళవారం ఈ మేరకు స్పందించారు. భారత్తో వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.ట్రంప్ వ్యాఖ్య లను నిశితంగా పరిశీలి స్తున్నట్టు రష్యా ఇంధన రంగ వ్యవహారాలు చూసే ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ చెప్పారు. భారత రిఫైనరీల నుంచి ఒప్పందాల రద్దు దిశగా ఎలాంటి నోటీసులూ అందలేదని రష్యా ఇంధన శాఖ వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఉక్రెయిన్తో యుద్ధం అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. ఆ దేశం నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశంగా కూడా నిలిచింది. దీనిపై అమెరికాతో పాటు యూరప్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా లెక్కచేయని సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్సభలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్పై విమర్శలు గుప్పించారు. చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వలేదు. మోదీ ఇమేజ్ను క్రియేట్ చేసిన వాళ్లే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో విడుదల చేయనివి ఇంకా ఉన్నాయి. అమెరికాలో అదానీపై కేసు నమోదు చేశారు. వాళ్ల టార్గెట్ అదానీ కాదు.. మోదీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. యూఎస్-ఇండియా ట్రేడ్ నాలుగు నెలలుగా పెండింగ్లో ఉంది. ఇప్పటికిప్పుడు భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందంపై కేంద్రం ఆమోదం ఎందుకు తెలిపింది.‘మోదీ చాలా భయంతో ఉన్నారు. మోదీని ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారు. ట్రంప్ ఒత్తిడితోనే ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. రైతుల రక్త మాంసాలను కేంద్రం అమ్ముకుంది. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారు.’ అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్లోక్సభలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్కు గుయ్యారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. సెక్రటరీ జనరల్ బెంచ్పైకి ఎక్కి నినాదాలు చేస్తూ సభ సజావుగా జరగనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, వారింగ్, కిరణ్ రెడ్డి సస్పెన్షతో పాటు మొత్తం ఎనిమిది మంది లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. -
భారత్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్ న్యూస్
-
ఇజ్రాయెల్లో నినదించిన ప్రధాని మోదీ పిలుపు
జెరూసలేం: పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమం ఇజ్రాయెల్లోనూ నినదించింది. ఇక్కడి మోషావ్ నెవాతిమ్ ప్రాంతంలో దాదాపు 300 మొక్కలను నాటి ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. యూదుల పర్యావరణ దినోత్సవమైన ‘తు బిష్వత్’ పండుగను పురస్కరించుకుని ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.భారత రాయబార కార్యాలయం, ‘కెరెన్ కైమెట్ లెయిజ్రాయెల్’, స్థానిక సంస్థల సహకారంతో ఈ ఈవెంట్ను నిర్వహించారు. వందలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం.. పర్యావరణంపై భారత్, ఇజ్రాయెల్ దేశాలకున్న నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ రామి రోజెన్, ఇజ్రాయెల్లో భారత రాయబారి జెపి సింగ్, బిన్నీ షిమోన్ ప్రాంతీయ మండలి అధిపతి నిర్ జమీర్ పాల్గొన్నారు. From Roots to Relationships 🌱Jointly celebrated the Jewish festival of ‘Tu Bishvat’ (New Year for Trees) and Indian Prime Minister Shri. Narendra Modi’s initiative of ‘Ek Ped Maa Ke Naam’ at Moshav Nevatim today.‘Ek Ped Maa ke Naam’ at Moshav Nevatim 🇮🇱 brought children &… pic.twitter.com/JI47t4hi71— India in Israel (@indemtel) February 2, 2026ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి, ప్రకృతి సంరక్షణలో భారత్-ఇజ్రాయెల్ దేశాలు ఒకే బాటలో పయనిస్తున్నాయని కొనియాడారు. కేవలం సాంకేతిక రంగంలోనే కాకుండా, భూగోళాన్ని రక్షించే బాధ్యతలో కూడా ఇరు దేశాలు భాగస్వాములు కావడం గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు. భారత రాయబారి జెపి సింగ్ మాట్లాడుతూ ‘తు బిష్వత్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. ఈ రెండూ ప్రకృతితో సమాజాన్ని ఏకంచేసే గొప్ప సంప్రదాయాలు’ అని అన్నారు. నేడు నాటిన ఈ మొక్కలు రాబోయే తరాలకు భారత్-ఇజ్రాయెల్ స్నేహానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాతావరణ మార్పులు, పర్యావరణ రంగాలలో సహకారం అందుతోందని, ప్రకృతిని కాపాడుకోవడం అంటే జీవరాశిని కాపాడుకోవడమేనని ఇజ్రాయెల్ అధికారులు అన్నారు. కాగా ఈ కార్యక్రమం జరిగిన ‘మోషావ్ నెవాతిమ్’ ప్రాంతానికి ఒక ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఇది కేరళలోని కొచ్చిన్ నుండి వలస వెళ్లిన భారతీయ యూదులచే స్థాపితమయ్యింది. ఇక్కడ కొచ్చిన్ శైలిలో నిర్మించిన ప్రార్థనా మందిరం (సినగోగ్), భారతీయ యూదుల వారసత్వ కేంద్రం నేటికీ భారతీయ సంస్కృతిని చాటిచెబుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు -
ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం అవసరం
భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్పై విధించిన సుంకాలను తగ్గించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని అన్నారాయన. అమెరికా వాణిజ్య విషయంలో భారత్ తీరు సరిగా లేదంటూ.. గతేడాది ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని 18 శాతానికి తగ్గుతాయని ట్రంప్ తన సోషల్ ట్రూత్లో ప్రకటించారు. అయితే.. భారత ఉత్పత్తులపై అమెరికా మొత్తంగా 50 శాతం టారిఫ్లు వసూలు చేస్తోంది. ఇందులో రష్యాతో చమరు కొనుగోళ్ల నేపథ్యంతో విధించిన 25 శాతం సుంకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో.. రష్యాతో చమురు వాణిజ్యం పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని కూడా ట్రంప్ తన సోషల్ మీడియా సోషల్ ట్రూత్లో వెల్లడించారు. కానీ, ఆ సుంకాల పరిస్థితిపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు.మోదీ ఏమన్నారంటే..ట్రంప్ ఫోన్కాల్.. సోషల్ మీడియా పోస్ట్ పరిణామంపై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపై అమెరికా ఇకపై 18 శాతం సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్ ట్రంప్కు ఎంతగానో కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ఆయన సారథ్యం ఎంతో కీలకం’’అంటూ కొనియాడారు. శాంతిసాధన దిశగా ఆయన ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకరిస్తుంది.. .. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక, ప్రజాస్వామిక వ్యవస్థలు కలసికట్టుగా పని చేస్తే అంతిమంగా ప్రజలకు ఎనలేని మేలు కలుగుతుంది. ఇరు పక్షాలకూ లాభదాయంగా అపారమైన అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. భారత్, అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ట్రంప్తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’’అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ చెప్పిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం మోదీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం! ఇక ట్రంప్ ఏమన్నారంటే.. ‘‘మోదీతో నా స్నేహం, ఆయనపై గౌరవం దృష్ట్యా, ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చింది. అమెరికాపై టారిఫ్, టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్ చర్యలు చేపట్టనుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపేయనుంది. ఇకపై వెనెజువెలా, అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిణామం ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెర దించేందుకు దోహదపడుతుందని ట్రంప్ హర్షం వెలిబుచ్చారు. నేను, మోదీ మాటల మనుషులం కాదు. పక్కా చేతల వ్యక్తులం. కనుక భారత్, అమెరికా నడుమ ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయి. మోదీని నా అత్యుత్తమ మిత్రుల్లో ఒకరు. వర్తకం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడంతో పాటు పలు అంశాలపై మోదీతో సుదీర్ఘంగా చర్చించా. ఇకపై అమెరికా వస్తువులను భారత్ మరింత భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తుందని మోదీ నాకు హామీ ఇచ్చారు(BUY AMERICAN). 500 బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే చమురు, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు అని ట్రంప్ అన్నారు. అంతకు ముందు.. సోమవారం రాత్రి నుంచే ఈ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అంటూ బ్రేకింగ్ న్యూస్లా ఒక్కో పరిణామాన్ని వివరించుకుంటూ పోయారు. అయితే.. రష్యా చమురు సంకాల పరిస్థితిపై మాత్రం అటు ట్రంప్, ఇటు మోదీ నుంచి క్లారిటీ రాలేదు. కానీ, గోర్ మాత్రం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘భారత్పై అమెరికా తుది టారిఫ్లు 18 శాతం మాత్రమే’అంటూ స్పష్టత ఇచ్చారు. అయితే.. రష్యా చమురు విషయంలో జాతి ప్రయోజనాల విషయంలో తగ్గేదే లే అని భారత్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ఒత్తిళ్లకు నిజంగానే తలొగ్గిందా? అనేదానిపై కేంద్రం నుంచి స్పష్టత రావ్సాల్సి ఉంది. -
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
-
15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మొత్తం 15 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో బడ్జెట్ రోజున సెన్సెక్స్ ఎనిమిది సార్లు నష్టాలు మూటగట్టుకుంది. ఏడు పర్యాయాలు లాభాలు ఆర్జించింది. ఇందులో 2019, 2024 సాధారణ ఎన్నికలకు ముందు రెండుసార్లు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.బడ్జెస్ట్ రోజు సెన్సెక్స్ ఇలా..➤2014 జూలై 10 - 72 పాయింట్ల లాభం: 25,373 వద్ద ముగింపు➤2015 ఫిబ్రవరి 28 - 141 పాయింట్ల లాభం: 29,362 వద్ద ముగింపు➤2016 ఫిబ్రవరి 29 - 152 పాయింట్ల నష్టం: 23,002 వద్ద ముగింపు➤2017 ఫిబ్రవరి 1 - 486 పాయింట్ల లాభం: 28,142 వద్ద ముగింపు➤2018 ఫిబ్రవరి 1 - 58 పాయింట్ల నష్టం: 35,907 వద్ద ముగింపు➤2019 ఫిబ్రవరి 1 - 213 పాయింట్ల లాభం: 36,469 వద్ద ముగింపు➤2019 జూలై 5 - 58 పాయింట్ల నష్టం: 39,513 వద్ద ముగింపు➤2020 ఫిబ్రవరి 1 - 395 పాయింట్ల నష్టం: 39,736 వద్ద ముగింపు➤2021 ఫిబ్రవరి 1 - 2,315 పాయింట్ల లాభం: 48,601 వద్ద ముగింపు➤2022 ఫిబ్రవరి 1 - 848 పాయింట్ల లాభం: 58,863 వద్ద ముగింపు➤2023 ఫిబ్రవరి 1 - 158 పాయింట్ల లాభం: 59,708 వద్ద ముగింపు➤2024 ఫిబ్రవరి 1 - 107 పాయింట్ల నష్టం: 71,645 వద్ద ముగింపు➤2024 జూలై 23 - 73 పాయింట్ల నష్టం: 80,429 వద్ద ముగింపు➤2025 ఫిబ్రవరి 1 - 5 పాయింట్ల నష్టం: 77,506 వద్ద ముగింపు➤2026 ఫిబ్రవరి 1 - 1,843 పాయింట్ల నష్టం: 80,723 వద్ద ముగింపు -
నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్
కొత్త ఆదాయపు పన్ను.. జీఎస్టీ మార్పుల వంటి అనూహ్య నిర్ణయాలు చూస్తున్న వీక్షకులంతా... బడ్జెట్ కూడా ఈ వారంలో మొదలయ్యే టి–20 వరల్డ్కప్ మ్యాచ్లా ఉంటుందనుకున్నారు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్ శర్మ స్థాయి పవర్ప్లేకి రెడీ అయిపోయారు. కానీ... కెప్టెన్ మోదీ తమది టి–20 ధనాధన్ కాదని.. సుదీర్ఘ టెస్ట్ ఇన్నింగ్స్తోనే అనుకున్న వృద్ధిని సాధిస్తామని సంకేతాలిచ్చారు. తమ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఫుల్గార్డ్తో పంపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావనిని సాధిస్తామంటూ రెండు దశాబ్దాల తరువాతి లక్ష్యాన్ని ఆవిష్కరించారు. ఆ దిశగా టెస్ట్ ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టారు. వీరబాదుడు లేదు.. రిస్కీ షాట్లు లేనే లేవు. బౌండరీలు, సిక్సర్లు అస్సలే లేవు. ప్రతి బంతినీ పద్ధతిగా ఆడుతూ సింగిల్స్కు పరిమితమయ్యారు. సునీల్ గవాస్కర్ను మరిపించారు. కళ్లు చెదిరే షాట్లు అక్కర్లేదు... క్రీజ్లో ఉంటే చాలనే స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా కెప్టెన్ నరేంద్ర మోదీ చెప్పింది ఒక్కటే.. ‘నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్... ఇది లాంగ్టర్మ్ ఇన్నింగ్స్’’.ఇన్కమ్ట్యాక్స్ పిచ్ ఏమాత్రం మారలేదు. అవే శ్లాబ్స్. కాకపోతే టీసీఎస్, టీడీఎస్ విషయాల్లో చిన్నచిన్న ఉపశమనాలిచ్చారు. ఎన్నారైలు, ఫారిన్ అసెట్స్కు సంబంధించి పాత తప్పులు దిద్దుకోవటానికి కొన్ని ఫ్రీహిట్స్ ఇచ్చారు. వన్టైమ్ డిస్క్లోజర్ అనేది ఓ వారి్నంగ్. అంటే... నోబాల్గా ప్రకటించిన క్లీన్బౌల్డ్ అన్నమాట. 7 రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచటం... 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు అంటూ మోదీ ‘7’వ నంబర్లో వచ్చే ధోనీ, కపిల్ వంటి కెప్టెన్ల స్థాయిని కళ్లకు కట్టారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, బయోఫార్మా శక్తి, కెమికల్ పార్కులు, రేర్ ఎర్త్ కారిడార్లు, కంటైనర్ తయారీ, ఎల్రక్టానిక్ కాంపోనెంట్ల తయారీ వంటి పథకాలన్నీ మున్ముందు స్కోర్బోర్డును ముందుకు తీసుకెళ్లబోయే షాట్లు. ఇన్ని ఒత్తిళ్ల నడుమ... ద్రవ్య లోటును 4.3 శాతానికే పరిమితం చేస్తామంటూ... సింగిల్స్తోనైనా రన్రేటు మాత్రం పడిపోకుండా చూసుకున్నారు. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే... ఎస్టీటీ రూపంలో మోదీ ప్రభుత్వం ఓ బౌన్సర్ వేసింది. ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలి కనక స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్నును 150 శాతం, ఆప్షన్లపై 50 శాతం పెంచారు. మార్కెట్లకిది నచ్చలేదు. బంతిని బలంగానే కొట్టాయి. ప్రస్తుతానికైతే బంతి గాల్లోకి లేచి మార్కెట్లు పడ్డాయి. అది క్యాచో కాదో మున్ముందు తెలుస్తుంది. ఇవీ చదవండి:రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్అదే పిచ్.. కాస్త రిలీఫ్ఖనిజ సంపదకు కారిడార్ వెలుగులునిధుల సిక్సర్విలేజ్.. విన్నర్ -
హైస్పీడ్గా రైల్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేని అత్యాధునికంగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైస్పీడ్ రైల్, రవాణా సామర్థ్యం పెంపు, భద్రత విభాగాలపై మరింత దృష్టి కేంద్రీకరించింది. ఇందులోభాగంగా దేశంలో ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటుచేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. అభివృద్ధి అనుసంధానకర్తగా భావించే ఈ కారిడార్లను ముంబై–పుణే, పుణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, చెన్నై–బెంగళూరు, ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి మధ్య ఏర్పాటుచేయాలని ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 బడ్జెట్లో రైల్వే శాఖకు రూ.2,77,830 కోట్లను కేటాయించారు. దీంతోపాటు అదనపు బడ్జెటరీ వనరుల నుంచి రూ.15 వేల కోట్లు సమకూరుతాయని బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు. ఈ నిధులతో కొత్తలైన్ల నిర్మాణ,ం లోకోమోటివ్స్, కోచ్లు, వేగన్ల కొనుగోలు, ఇతర పనులు చేపడతారు. 2025–26లో రైల్వేకి 2,52,000 కోట్లు కేటాయించగా, ఈసారి 10.25 శాతం ఎక్కువగా కేటాయించారు. ఇప్పటివరకు రైల్వేకి చేసిన కేటాయింపుల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. రవాణా కారిడార్» సుస్థిర రవాణా కోసం డెడికేటెడ్ రవాణా కారిడార్ (డీఎఫ్సీ)ను డాంకునీ (పశ్చిమబెంగాల్) నుంచి సూరత్ (గుజరాత్) వరకు 2.052 కి.మీ. నిడివి తో ఏర్పాటుచేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. దీన్ని తూర్పు– పశ్చిమ డీఎఫ్ఏసీగా పేర్కొంటారు.» అధిక రద్దీ ఉండే 18 వేల కి.మీ. ట్రాక్ మార్గంలో భద్రతకు నిర్దేశించిన కవచ్, సీసీటీవీ కెమెరాలు, టెలికం కోసం రూ.7,500 కోట్లు కేటాయించారు. రైల్వే నెట్వర్క్ మొత్తానికి కవచ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలని బడ్జెట్ లో పేర్కొన్నారు» దేశీయ కంటెయినర్ తయారీ కోసం కొత్త పథకం ప్రవేశపెడుతూ రూ.10వేల కోట్లు కేటాయించారు. » లోకోమోటివ్స్, వేగన్లు తదితరాల కొనుగోలుకు రూ.52,108.73 కోట్లు కేటాయించారు. దీంతో మరిన్ని వందేభారత్ రైళ్లు, 24–కోచ్ స్లీపర్ రైళ్లను తీసుకుంటారు.» అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కోసం రూ.11,917 కోట్లు కేటాయించారు. » కొత్త లైన్ల నిర్మాణానికి రూ.36,721.55 కోట్లు, రూ. గేజ్ మార్పిడికి రూ.4,600 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 37,750 కోట్లు కేటాయించారు.రూపురేఖలు మారిపోతాయిహైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణంతో దేశ రవాణారంగం రూపురేఖలు మారిపోతాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఏడు కారిడార్లు మొత్తం 4000 కి.మీ. నిడివితో విస్తరించి ఉంటాయని తెలిపారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి రూ.1.20 లక్షల కోట్లు ప్రయాణికులు, భద్రత కోసం వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. భద్రతపై రైల్వే ఎక్కువ ఫోకస్ పెట్టిందని, దీనివల్ల 95 శాతం రైలు ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. ముంబై–అహ్మదాబాద్ మధ్య తొలిసారి చేపట్టిన హైస్పీడ్ రైలు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. – రైల్వే మంత్రి3,547.32 కోట్ల మిగులురైల్వే శాఖకు వచ్చే సంవత్సరంలో రూ.3,85,733.33 కోట్ల ఆదాయం వస్తుందని, రూ. 3,82,186.01 కోట్లు వ్యయమవుతాయని బడ్జెట్లో అంచనా వేశారు. ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 3,547.32 కోట్లు మిగులుతుందని భావిస్తున్నారు. 2024–25లో రైల్వేకి రూ. 3,35,757.09 కోట్ల ఆదాయం సమకూరగా, రూ.3,32,440.64 కోట్లు వ్యయమైంది. రూ.3,316.45 కోట్లు మిగులు వచ్చింది. మ్యాచ్ సమ్మరీవందే భారత్తో రైల్వే శాఖ బౌలింగ్ స్పీడు పెరిగింది. ఆ స్పీడు మరింత పెంచేందుకు వీలుగా... ఎంత ఫాస్ట్ బౌలింగ్నైనా తట్టుకునేందుకు తగ్గ పిచ్లు తయారు చేయాలని మోదీ సర్కారు సంకల్పించింది. దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించింది. ఇవి అమల్లోకి వస్తే కొత్త రైళ్లు హైస్పీడ్ బంతుల్లా దూసుకెళతాయి. స్థిరమైన ఆటకు తగ్గ పిచ్లా సరకు రవాణాను గాడిలో పెట్టడానికి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అక్కరకొస్తుంది. కవచ్, సీసీటీవీలతో భద్రతపై పెట్టే వ్యయం... నోబాల్స్, వైడ్స్కు అడ్డుకట్ట వేస్తుంది. రూ.2.77 లక్షల కోట్ల భారీకేటాయింపుతో ఈ బడ్జెట్లో రైల్వే మామూలు ఓవర్ కాదు. దేశ రవాణాను వేగంగా నడిపించే పవర్ స్పెల్ వేసింది. -
సాగు.. ఫోకస్ మిస్!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,62,671 కోట్లు కేటాయించారు. 2025–26 సవరించిన అంచనాల (రూ. 1,51,853 కోట్లు) కంటే ఈసారి 7.12 శాతం మాత్రమే కేటాయింపులు పెంచారు. దీంతో వ్యవసాయ రంగంలో ఏ విభాగంపై కూడా పెద్దగా ఫోకస్ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ రంగాన్ని ఆర్థిక మంత్రి పూర్తి నిర్లక్ష్యం చేశారని అఖిల భారత కిసాన్ సభ ఆరోపించింది. వ్యవసాయ రంగం వ్యూహాత్మక పునరుజ్జీవనం పట్ల ఎటువంటి నిబద్ధతను చూపలేదని ఆక్షేపించారు. అయితే, వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ’సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే దార్శనికతను కనబరిచిందని ఆర్థిక మంత్రి నిర్మలచెప్పారు. సంప్రదాయసాగుపై ఆధారపడటాన్ని తగ్గించి గ్రామీ ణ జీవనోపాధిని వైవిధ్యపరిచేందుకు బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. కొత్త ఏఐ టూల్.. » కేంద్రం ‘భారత్–విస్తార్ (వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్)’ అనే పేరుతో బహుళ భాషా కృత్రిమ మేధ టూల్ను ప్రకటించింది. దీనికోసం రూ.150 కోట్లు కేటాయించింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, రైతులకు సలహాలు అందించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ టూల్ అగ్రిస్టాక్ పోర్టల్లను, సాగు పద్ధతులపై ఐకార్ ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధానం చేస్తుంది. » పండ్లు, కూరగాయల మిషన్ను క్రిష్నియోన్నతి యోజన కింద కలిపేసి రూ.700 కోట్లు కేటాయించారు. » మఖానా బోర్డు పేరును బిహార్, ఇతర రాష్ట్రాల్లో మఖానా అభివృద్ధి పథకంగా మార్చారు. దీనికి రూ.90 కోట్లు కేటాయించారు. » పీఎం–కిసాన్కు రూ.63,500 కోట్లు కేటాయించారు. » వ్యవసాయ విద్య, పరిశోధనకు 3 శాతం కోతవేసి రూ. 9,964 కోట్లు కేటాయించారు. » ఇన్లాండ్ ఫిషరీల కోసం 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్లను స్టార్టప్లు, మహిళా సంఘాలు, చేపల పెంపకందారుల ద్వారా పటిష్టం చేస్తారు. ప్రధానమంత్రి సంపద యోజనకు కేటాయింపులను రూ.1,500 కోట్ల నుంచి 2,500 కోట్లకు పెంచారు. » కోస్తా, కొండ ప్రాంతాల్లో అధిక వ్యయమయ్యే పంటలైన కొబ్బరి, గంధం, కోకో, జీడిపప్పు, బాదం, వాల్నట్స్ సాగుకు రూ.350 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించారు. » పేద, సన్నకారు రైతులకు వస్తున్న ఆదాయంలో దాదాపు 16 శాతం పశుసంపద నుంచి వస్తోందంటూ.. 20,000 కంటే ఎక్కువ పశువైద్య నిపుణుల లభ్యతను పెంచడానికి రుణ–సంబంధిత మూలధన సబ్సిడీ పథకాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ పథకం ప్రైవేట్ రంగంలో వెటర్నరీ, పారావెట్ (పారా–వెటర్నరీ) కళాశాలలు, వెటర్నరీ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, బ్రీడింగ్ సౌకర్యాల స్థాపనకు తోడ్పడుతుంది. » గత బడ్జెట్లో ప్రకటించిన కాటన్ టెక్నాలజీ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ హైబ్రిడ్ సీడ్స్కు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. దీంతో ఈ పథకాలు ఇంకా ప్రారంభంకాలేదు. చరిత్రాత్మక బడ్జెట్..అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశానికి బలమైన పునాది వేసే చరిత్రాత్మక బడ్జెట్ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. ఇది రైతులు, యువత, మహిళలు, పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెప్పారు. – వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్మ్యాచ్ సమ్మరీఈ ఇన్నింగ్స్లో వ్యవసాయ రంగానిది విచిత్రమైన పరిస్థితి. బంతి నేరుగా వ్యయసాయ రంగం చేతిలోకి వచ్చింది. కానీ కీపర్ చేతిలోకి రాకుండానే జారిపోయింది. అంటే... అన్నీ ఉన్నా కొంచెం ఫోకస్ మాత్రం మిస్సయింది. కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. పెద్ద షాట్లు వస్తాయని ఆశించిన చోట బంతి జారిపోయింది. అటు బ్యాట్స్మన్కూ అందలేదు. ఇటు కీపర్కూ దొరకలేదు. సాగు, అనుబంధ రంగాల కేటాయింపుల్లో స్కోర్బోర్డు ముందుకు కదిలినట్టే కనిపించినా, ఫీల్డ్లో మాత్రం ఫోకస్ తప్పిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఏఐ టూల్స్, పథకాలు ప్రకటించినా రైతులు ఎదురుచూస్తున్న అంశాలకు మాత్రం చోటు దొరకలేదు. వికెట్ పడలేదు. కానీ ఫోకస్ లేక వ్యవసాయానికి అవకాశం మిస్ అయింది. డేటా సెంటర్లలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులుకేంద్ర ప్రభుత్వం అంచనా న్యూఢిల్లీ: డేటా సెంటర్లలో 200 బిలియన్ డాలర్ల(రూ.18.33 లక్షల కోట్లు) పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం అణు ఇంధనంపై ఆధారపడాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 90 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కార్యరూపం దాలుస్తున్నాయని వివరించారు. భారత్లో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియాలో డేటా సెంటర్లు సహా ఏఐ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెడతామని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డిజిటల్ కనెక్షన్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. డేటా సెంటర్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో 2047 దాకా ట్యాక్స్ హాలిడే ప్రకటించింది. దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రతిపాదిత ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో చిప్ల తయారీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్ బాధితులపై కరుణ17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం రద్దుఅత్యాధునిక చికిత్సలు మరింత మందికి చేరువ సాక్షి, అమరావతి: క్యాన్సర్ బాధితులకు కేంద్రం భారీ ఆర్థిక ఊరట ఇచ్చింది. క్యాన్సర్ చికిత్సల్లో వినియోగించే 17 రకాల ప్రాణాధార ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ ఆధునిక ఔషధాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. టార్గెట్, ఇమ్యునోథెరపీ లాంటి ఖరీదైన చికిత్సలు మరింత మందికి అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు అభిప్రాయపడు తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ మందులపై సాధారణంగా 10% కస్టమ్స్ సుంకం ఉంటుంది. తాజాగా దీన్ని మినహాయించనుండటంతో బాధి తులకు ఊరట లభించనుంది. శరీరంలో నిర్దిష్టంగా క్యాన్సర్ కణాలను మాత్రమే వెతికి పట్టుకుని నాశనం చేసే టార్గెటెడ్ థెరపీ, రోగ నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసి క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసే ఇమ్యునోథెరపీ లాంటి ఆధునిక చికిత్సలు ప్రస్తుతం పేద రోగులకు అందుబాటులో లేవు. ఆ మందులు విదేశాల నుంచి దిగుమతి అవుతుండటమే దీనికి కారణం. ఇక 7 రకాల అరుదైన వ్యాధులకు సంబంధించి వ్యక్తిగతంగా దిగుమతి చేసుకునే ఔషధాలను కూడా సుంకాల మినహాయింపు జాబితాలో చేర్చారు. -
హెల్త్ 'హబ్'
న్యూఢిల్లీ : ఆరోగ్య రంగంలో సదుపాయాలను విస్తరించడం, వైద్య విద్య, ఫార్మా రంగాలకు ప్రోత్సాహం, హెల్త్కేర్లో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చడం లక్ష్యంగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పది శాతం పెంపుతో రూ.1,06,530.42 కోట్లను ఆరోగ్యశాఖకు కేటాయించారు. ఆధునిక చికిత్సలతో బయో ఫార్మాస్యూటికల్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ‘బయో ఫార్మా శక్తి’ కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం చేయనున్నారు. దేశం బయో ఫార్మా తయారీ హబ్గా ఎదిగి దిగుమతులపై ఆధార పడాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది. కొత్తగా మూడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ఏర్పాటుతోపాటు ఇప్పటికే ఉన్న 7 నైపర్లను ఆధునీకరిస్తారు. వెయ్యి అక్రిడిటెడ్ క్లినికల్ ట్రయల్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు రూ.4,000 కోట్లు కేటాయించారు. నేషనల్ ఎయిడ్స్, లైంగిక సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమానికి రూ.3,477 కోట్లు వ్యయం చేయనున్నారు. రాంచి, తేజ్పూర్లోని మానసిక ఆరోగ్య కేంద్రాలను అప్గ్రేడ్ చేయడంతోపాటు ఉత్తరాదిలో ‘నిమ్హాన్స్’ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆరోగ్య రంగంలో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు రూ.350 కోట్లు కేటాయించారు. ప్రమాదాల సమయంలో వేగంగా అత్యవసర వైద్య సదుపాయాలు అందేలా ప్రతి జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ, ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆరోగ్య, వైద్య విద్య రంగంలో సిబ్బంది, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, వైద్య విద్య సీట్ల అప్గ్రెడేషన్, నర్సింగ్ విద్య తదితరాల కోసం రూ.1,725 కోట్లు కేటాయించారు. దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా, జీవన శైలి జబ్బుల చికిత్స భారం, నైపుణ్యం కలిగిన హెల్త్కేర్ నిపుణులకు డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని హెల్త్కేర్ ప్రొఫెషనల్ విద్య విస్తరణ, బలోపేతం కోసం మూడేళ్లలో రూ.980 కోట్లు వ్యయం చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. దీని ద్వారా 10 కీలక విభాగాల్లో హెల్త్ ప్రొఫెషనల్ అనుబంధ ఇన్స్టిట్యూట్లను నెలకొల్పి ఐదేళ్లలో లక్ష మంది నిపుణులైన ప్రొఫెషనల్స్ను సిద్ధం చేస్తారు. వృద్ధుల జనాభాకు అనుగుణంగా 1.5 లక్షల మంది కేర్ టేకర్స్ను సిద్ధం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతారు. దేశంలో ఐదు ప్రాంతీయ మెడికల్ టూరిజం హబ్ల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆయుష్, ఆధునిక మౌలిక సదుపాయాలతో ఆస్పత్రులు, అధునాతన రోగ నిర్ధారణ పరీక్షలు, పునరావాసం, వైద్య విద్య , పరిశోధన సౌకర్యాలతో ఇవి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లుగా ఉంటాయని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కేంద్రాలు 3 ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.ప్రధాని స్వాస్థ సురక్ష యోజన రూ.11,307 కోట్లు ఎన్హెచ్ఎం రూ.39,390 కోట్లు పీఎం –జేఏవై రూ.9,500 కోట్లు పీఎం – ఏబీహెచ్ఐఎం రూ.4770 కోట్లు ఢిల్లీ ఎయిమ్స్ రూ.5500.92 కోట్లు సీజీహెచ్ఎస్ పెన్షనర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్ పథకానికి రూ.8697.86 కోట్లు కేంద్ర ఆస్పత్రులకు రూ.4599.66 కోట్లు హెల్త్ రీసెర్చ్ విభాగానికి రూ.4,821.21 కోట్లు (డీహెచ్ఆర్) సురక్షితమైన రక్త మార్పిడి సేవలకు రూ.275 కోట్లు -
విలేజ్.. విన్నర్
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలాంటి గ్రామీణ భారతావనిపై మరింత దృష్టి సారించింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి, ఇళ్ల నిర్మాణం, అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం కీలక ఫ్లాగ్షిప్ పథకాలకు తాజా బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించింది. గత ఉపాధి హామీ పథకం స్థానంలో మరింత పటిష్టమైన వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. రాష్ట్రాలను భాగస్వామ్యం చేసే ఈ కొత్త పథకానికి మునుపెన్నడూ లేని రీతిలో కేటాయింపులు చేయడం విశేషం. మొత్తంమీద గ్రామీణాభివృద్ధికి 2026–27 బడ్జెట్లో రూ.1,94,369 కోట్లు దక్కాయి. పాత ఉపాధి హామీ పథకానికి రూ.30,000 కోట్లు, వ్యవసాయ మౌలికసదుపాయాలు, అభివృద్ధి ఫండ్కు రూ.4,400 కోట్లను కలుపుకుంటే 21 శాతం మేర నిధులు ఎగబాకినట్లు లెక్క!గ్రామీణ ప్రజలకు పక్కాగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో రెండు దశాబ్దాల క్రితం యూపీఏ సర్కారు అమల్లోకి తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో మోదీ సర్కారు కొత్త చట్టాన్ని తీసుకొచి్చంది. దీనికి వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ).. సంక్షిప్తంగా వీబీ–జీ రామ్ జీ అని పేరు పెట్టారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఇకపై ఏటా 125 రోజుల పాటు (పాత చట్టంలో 100 రోజులు) ఉపాధి హామీ దక్కుతుంది. కీలక వ్యవసాయ సీజన్లో కూలీల కొరతను నివారించేందుకు 60 రోజుల పాటు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. దీని కింద ప్రధానంగా జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధిని కల్పించే పనులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులను చేపడతారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం(వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా, మెరుగైన ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ గవర్నెన్స్ పెంపొందించడం, పల్లెవాసుల్లో ఆర్థిక సాధికారతను పెంచడం కొత్త చట్టం ప్రధానోద్దేశమని మోదీ ప్రభుత్వం చెబుతోంది. పాత ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలు 100 శాతం, మెటీరియల్ ఖర్చులో 75 శాతం కేంద్రమే భరించేది. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న జీ–రామ్–జీ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్రాలు ఉపాధి వ్యయాన్ని 60:40 శాతం చొప్పున భరించాల్సి ఉంటుంది. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది 90:10 నిష్పత్తిలో ఉంటుంది. తాజా బడ్జెట్ కేటాయింపులకు రాష్ట్రాల వాటా తోడైతే జీ–రామ్–జీ కోసం ఏకంగా రూ.1.51 లక్షల కోట్లు దక్కుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఈ కేటాయింపులను ‘చరిత్రాత్మకం, అపూర్వమైనది’గా ఆయన అభివర్ణించారు. కాగా, ముగిసిపోతున్న పాత పథకం కింద చేపట్టిన పనుల కోసం అదనంగా ఈ బడ్జెట్లో మరో రూ.30,000 కోట్లను కేటాయించడం ద్వారా ఉపాధి కల్పనకు గట్టిగానే నిధుల హామీ లభించింది.‘వికసిత్ భారత్ జీ–రామ్–జీ’తో ఉపాధికి మరింత గ్యారంటీ... 2026–27 కేటాయింపులు:రూ.95,692 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.86,000 కోట్లు (సవరించిన అంచనా రూ.88,000 కోట్లు)జోరుగా ఇళ్ల నిర్మాణం (పీఎంఏవై)గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తాజా బడ్జెట్లోనూ కేంద్రం నిధులను భారీగా కేటాయించింది. పీఎంఏవై 2.0 స్కీమ్ కింద పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.18,625 కోట్లు దక్కాయి. గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబి్ధదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద 2026–27లో రూ.3,000 కోట్లు జమ చేయనున్నారు. కాగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు 2026–27లో 6.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్ధేశించారు. తద్వారా 30.75 లక్షల మంది కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరనుంది. పీఎంఏవై (గ్రామీణ్)కు రూ.54,917 కోట్ల నిధులు అందనున్నాయి. గ్రామాల్లో 2029 మార్చికల్లా 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026–27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలనేది బడ్జెట్ అంచనా.2026–27 కేటాయింపులు: రూ.73,542 కోట్లు2025–26 కేటాయింపులు:రూ.74,626 కోట్లు(సవరించిన అంచనా రూ.40,000 కోట్లు)మ్యాచ్ సమ్మరీఈ బడ్జెట్ మ్యాచ్లో గ్రామీణ భారతం క్రీజ్లో నిలబడి గెలిచింది. ఉపాధి, ఇళ్లు, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీతో పల్లెల ఇన్నింగ్స్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఫ్లాగ్షిప్ పథకాలకు దండిగా నిధులు రావడంతో గ్రామీణ అభివృద్ధి స్ట్రైట్ బ్యాట్తో ఆడిన క్లియర్ విన్నర్గా మారింది. ఉపాధి హామీకి కొత్త రూపు, ఇళ్ల నిర్మాణానికి వేగం, గ్రామ రహదారులకు దిశ, ఇంటింటికీ నీరు, నెట్కి హైస్పీడ్తో గ్రామాలు ఈ బడ్జెట్లో చేతులెత్తి విజయాన్ని ప్రకటించాయి. ఇది వికసిత్ భారత్ లక్ష్యం దిశగా గ్రామీణ భారతం సమయం చూసుకుని కొట్టిన మ్యాచ్– విన్నింగ్ షాట్.రహదారులు.. రయ్ రయ్ (పీఎంజీఎస్వై) 2026–27 కేటాయింపులు:రూ.19,000 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.19,000 కోట్లు(సవరించిన అంచనా రూ.11,000 కోట్లు) గ్రామీణ ప్రాంతాల్లో పక్కా రోడ్ల నిర్మాణం, వాటిని సక్రమంగా నిర్వహించేందుకు అమలవుతున్న ఫ్లాగ్ షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన – పీఎంజీఎస్వై) ఇది. తాజా బడ్జెట్లోనూ మోదీ సర్కారు ఈ పథకంపై మరింత ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ స్కీమ్ నాలుగో దశ అమలవుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 26,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్ల నిర్మాణం లక్ష్యం. పర్యావరణ అనుకూల సాంకేతికతతో 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 4,200 గ్రామీణ ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానించాలని కేంద్రం సంకల్పించింది. ఈ పథకం ప్రారంభం నుంచి 2025 డిసెంబర్ నాటికి 7,87,809 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు అంచనా.స్వచ్ఛ భారత్.. రెండో దశ 2014లో ఆరంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్షిప్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన (ఓడీఎఫ్) స్టేటస్ సాకారమైంది. దీన్ని కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణ కోసం ఇప్పుడు రెండో దశ అమలవుతోంది. 2026–27లో 48,096 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణ పరిధిలోకి తీసుకురానున్నారు. 36,119 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. 1,352 బ్లాక్లలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. 1,50,000 గ్రామాల్లో సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. స్వచ్ఛ భారత్ (అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో 2026–27లో 50,000 వ్యక్తిగత టాయిలెట్లు, 5,000 కమ్యూనిటీ టాయిలెట్లు, 10,000 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించనున్నారు. 2026–27 కేటాయింపులు:రూ.9,692 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.12,192 కోట్లు (సవరించిన అంచనా రూ.8,000 కోట్లు)ఇంటింటికీ తాగునీరు (జల్జీవన్ మిషన్) జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ పథకం ద్వారా దేశంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనేది లక్ష్యం. దీన్ని సాకారం చేసేందుకు పథకాన్ని 2028 వరకు పొడిగించారు. తదనుగుణంగానే తాజా బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించారు. ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2026–27లో 1,70,000 గ్రామ పంచాయితీల్లో హర్ఘర్ జల్ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. 80 శాతం గ్రామాలకు కుళాయిల ద్వారా తాగునీరు అందించాలనేది తాజా బడ్జెట్ లక్ష్యం.2026–27 కేటాయింపులు:రూ.67,670 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.67,000 కోట్లు (సవరించిన అంచనా రూ.17,000 కోట్లు)భారత్ నెట్.. హైస్పీడ్దేశంలో గ్రామ పంచాయతీలన్నింటినీ హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ కనెక్ట్ చేయాలనేది ఈ స్కీమ్ లక్ష్యం. ఇప్పటిదాకా 2,24,323 పంచాయితీలను కనెక్ట్ చేశారు. 7,72,676 లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) వేశారు. 2025–26లో 10,000 జీపీలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించారు. 80,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్సీ నెట్వర్క్ వేశారు. 2026–27లో 42,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్బ్యాండ్ సౌకర్యం లభించనుంది. 1,60,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్సీ వేయనున్నారు. 20,50,00 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం.2026–27 కేటాయింపులు: రూ.24,000 కోట్లు2025–26 కేటాయింపులు: రూ.22,000 కోట్లు (సవరించిన అంచనా రూ.5,500 కోట్లు)ఇక చాంపియన్లుగా ఎంఎస్ఎంఈలుబడ్జెట్లో రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్ న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) చాంపియన్లుగా ఎదగడానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్ను తాజా బడ్జెట్లో ప్రకటించింది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉత్పాదకత పెంచడం, వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సమగ్ర ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ ఆదివారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మన కర్తవ్యం నెరవేర్చు కోవడానికి సంస్కరణల ఎక్స్ప్రెస్ వేగం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. మనకు మూడు కర్తవ్యాలు ఉన్నట్లు చెప్పారు. అవి.. వేగవంతమైన, సుస్థిరాభివృద్ధి, ఆకాంక్షలు నెరవేర్చుకోవడం–సామర్థ్యాలు పెంచుకోవడం, సబ్కా సాత్, సబ్కా వికాస్ అని వివరించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎస్ఈలు చాంపియన్లుగా మారాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రోత్ ఇంజన్కు ఎంఎస్ఎంఈలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆయా కంపెనీలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అందుకోసం రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ప్రతిపాదించారు. సూక్ష్మ పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి 2021లో ఏర్పాటుచేసిన ‘స్వయం సమృద్ధ భారత్ నిధి’కి రూ.2,000 కోట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. రూ.7 లక్షల కోట్లకుపైగా విలువైన టీఆర్ఈడీఎస్లను ఎంఎస్ఎంఈలు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఆయా కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. టీడీఎస్ను సులభతరం చేయడంతో ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతుందన్నారు. -
వికసిత్ భారత్కు రోడ్మ్యాప్
‘‘ఇదొక విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన బడ్జెట్. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్. ప్రపంచ వేదికపై మనదేశ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ అనే పేరుతో 140 కోట్ల మంది భారతీయులు సంతృప్తి చెందడం లేదు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలని కోరుకుంటున్నారు. ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, పెట్టుబడి వ్యయాన్ని పెంచడం, అధిక వృద్ధిని సాధించడమే ధ్యేయంగా బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఇది భారతీయుల సమ్మిళిత సంకల్పం. విశ్వసనీయ ప్రజాస్వామ్య భాగస్వామిగా, విశ్వసనీయ నాణ్యమైన ఉత్పత్తుల సరఫరాదారుగా భారత్ పాత్ర మరింత విస్తరిస్తుంది.యువతకు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్ను రూపొందించారు. ఈ చరిత్రాత్మక బడ్జెట్ యువత ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మహిళల సాధికార స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. గ్రామాల సంక్షేమం, పేదలు, రైతుల అభివృద్ధి కోసం చక్కటి బడ్జెట్ను తీసుకొచ్చిన నిర్మలా సీతారామన్, ఆమె బృందానికి నా అభినందనలు. వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉంది. అద్భుత అవకాశాలకు ఈ బడ్జెట్ ఒక రహదారి. వికసిత్ భారత్–2047కు బలమైన పునాదిగా నిలుస్తుంది. దేశం ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్ప్రెస్కు నూతన వేగం, నూతన శక్తి లభించడం తథ్యం.మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి రోడ్మ్యాప్గా తోడ్పడుతుంది. దేశ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. మన పరిశ్రమలు లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. బడ్జెట్లో ప్రతిపాదించిన చర్యలతో ‘అభివృద్ధి చెందిన భారత్’ దిశగా మన ప్రయాణం వేగవంతమవుతుంది. ఏ దేశానికైనా ప్రజలే అతిపెద్ద బలం. అందుకే ప్రజల్లో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు పెంచడానికి కృషి చేస్తున్నాం. యువశక్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తాజా బడ్జెట్తో వేర్వేరు కీలక రంగాల్లో నాయకులు, నూతన ఆవిష్కరణలు తయారు కాబోతున్నారు. క్రీడా రంగంలో యువతకు నూతన అవకాశాలు దక్కబోతు న్నాయి.మన దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్ హబ్గా మార్చడమే లక్ష్యంగా పన్ను మినహా యింపులు ప్రకటించాం. దేశంలో కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. మహిళల సారథ్యంలోని స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం నుంచి మరింత మద్దతు దక్కుతుంది. ప్రతి జిల్లాలో బాలికల కోసం కొత్త హాస్టళ్లు రాబోతున్నాయి. దాంతో వారి విద్యాభ్యాసం మరింత మెరుగవుతుంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమలు ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రాధాన్య రంగాలే. కొబ్బరి, జీడిపప్పు, కోకోవా, చందనం రైతులకు బడ్జెట్లో ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించాం’’ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ -
ట్రంప్ కోసమే మోదీ అలా చేశారు.. భారత్ రియాక్షన్ ఇదే
ఎప్స్టీన్ ఫైల్స్ ప్రస్తుతం అమెరికాలో ఈ వ్యవహారం ఎంత హాట్టాఫిక్గా మారిందో అంతా తెలిసిందే. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్క్లింటన్తో పాటు బిల్గ్రేడ్స్, మైకేల్ జాక్సన్ లాంటి ప్రముఖుల అంతరంగిక వ్యవహారాలు అందులో ఉన్నాయి. అయితే ఆ ఫైళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థావన ఉండడంతో భారత్ దానిపై వివరణ ఇచ్చింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ దీనిపై స్పందించారు.ఇటీవల అమెరికా న్యాయవిభాగం జెఫ్రీ ఎప్స్టీన్ దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. అయితే ఇందులో చాలా మంది ప్రముఖుల అంతరంగిక విషయాలకి సంబంధించిన సమాచారంపై ఆరోపణలున్నాయి. అయితే అందులో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ట్రంప్ సూచన మేరకే జరిగిందని ఉంది. ఎప్స్టీన్ మెయిల్స్లలో..2017లో ట్రంప్- మోడీ భేటీ జరిగింది. అప్పుడు ట్రంప్ మోదీని ఇజ్రాయెల్ పర్యటించాల్సిందిగా సూచించారు. దీంతో మోదీ ఆ ఏడాది ఇజ్రాయెల్ పర్యటన చేశారు. అని మెయిల్లో ఉంది.అంతేకాకుండా 2014లో ప్రస్తుత కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ప్రధానిగా మోదీ ఎన్నికైన తర్వాత భారత్తో సంబంధాలు ఎందుకు మెరుగుపరుచుకుకోవాలో అని మెయిల్లో తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. " ఎప్స్టీన్ ఫైళ్లలో 2017లో భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించిన విషయం మినహా అంతకు మించి ఏది నిజం కాదు. మిగతా ప్రస్థావనలు అన్నీ ఒక నేరస్థుడు చెప్పిన అసత్య ప్రకటనలు" అని ఆయన అన్నారు. అవి పూర్తిగా అవాస్తవాలు అని తెలిపారు.అయితే రెండు రోజుల క్రితం అమెరికా న్యాయశాఖ విభాగం ఎప్స్టీన్కు సంబంధించి 30 వేల పత్రాలు, 2వేల వీడియోలు, విడుదల చేశారు. అందులో ఆ దేశ మాజీ అధ్యక్షులతో పాటు బిల్గ్రేట్స్, ఎలాన్ మస్క్కు సంబంధించిన కీలక సమాచారం ఉంది. -
నిర్మలా సీతారామన్ బడ్జెట్పై ప్రధాని మోదీ ప్రశంసలు
ఢిల్లీ: లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 140కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం ఈబడ్జెట్. వికసిత్ భారత్ నిర్మాణానికి మార్గనిర్ధేశనం చేస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్ర బడ్జెట్ అధిక మూలధన వ్యయం, అధిక వృద్ధి మధ్య సరైన సమతుల్యతను సాధించిందన్నారు. సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టిన తొమ్మిదవ కేంద్ర బడ్జెట్. ప్రపంచంలో భారత్ బలమైన స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మోదీ మార్క్ రాజకీయం.. ఇండియా కూటమికి బిగ్ షాక్
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజనం కొనసాగుతోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై తాజాగా ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. దీంతో, రానున్న ఎన్నికల్లో కూడా కేంద్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో, కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నెలకొంది.ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ప్రకారం.. ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించే అవకాశం ఉందని తేలింది. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 41 శాతం(287 సీట్లు), కాంగ్రెస్ పార్టీకి 20 శాతం(80సీట్లు), మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55 శాతం మంది భావించినట్లు సర్వే వెల్లడించింది. కాగా, ఆరు నెలల కిందటితో పోల్చితే మూడు శాతం ఓటింగ్ పెరిగినట్లు స్పష్టం చేసింది. ప్రధాని మోదీ పనితీరుపై 57 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాహుల్ గాంధీ 27 శాతం మంది మొగ్గు చూపినట్లు సమాచారం.#MoodOfTheNation | BJP at 41% vote share, Congress at 20% if polls are held todayProjected seat shareBJP - 287 Congress - 80 BJP national spokesperson @Sanju_Verma_ decodes the findings of the #MOTN survey.@BJP4India | @SardesaiRajdeep @maryashakil pic.twitter.com/luJIoaCpER— IndiaToday (@IndiaToday) January 29, 2026ఇక, ఆగస్టు 2025లో నిర్వహించిన ఇండియా టుడే సర్వేలో ఎన్డీయేకి 324 సీట్లు, ఇండియా బ్లాక్కు 208 సీట్లు వస్తాయని అంచనా వేశారు. తాజా సర్వేలో ఎన్డీయే సీట్ల సంఖ్య మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే, 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 293 సీట్లు, ఇండియా బ్లాక్ 234 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. తాజా సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అలాగే, ఇండియా బ్లాక్ ఈ సర్వేలను జాగ్రత్తగా తీసుకోవాలని, అసలు పోరు ఎన్నికల సమయంలోనే తేలుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. మోదీ వేవ్లో భాగంగా 2025లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2026 కూడా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో విజయాలతో శుభారంభం చేసింది. ప్రస్తుతానికి ఎన్డీయే కూటమి ఫోకస్ మొత్తం రానున్న బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఆయా రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మోదీ ముందుకు సాగుతున్నారు. -
భారత్ కొత్త ఆశాకిరణంగా ఎదుగుతోంది
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యంలో భారత్ ఇప్పుడొక కొత్త ఆశాకిరణంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల ఆరంభం సందర్భంగా గురువారం ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రాంగణంలో ప్రసంగించారు. యూరోపియన్ యూనియన్తో భారత్ బుధవారం చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చుకున్న మరుసటి రోజే బడ్జెట్ సమావేశాలు ఆరంభమవడంతో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘ఆశయాల భారత్ ఇది. అత్యంత కీలకమైన ఐరోపా కూటమితో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో భారతీయ భారతీయ తయారీదారులకు సువర్ణావకాశం దక్కింది. 27 ఈయూ దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేద్దాం.ఇకనైనా సంస్థలు ఐరోపా విపణిలోకి విస్తృతంగా విస్తరించేలా, ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవాలి. మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. ‘‘సమాజంలో అట్టడుగు, చిట్టచివరి వ్యక్తికి సైతం ప్రభుత్వ ప్రయోజనాలు దక్కేలా ఎన్డీఏ సర్కార్ కృషిచేస్తుందని విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగిస్తాం. భవిష్యత్ తరాలకు సంస్కరణల ఫలాలను అందిస్తాం. భారత ప్రజాస్వామ్యం, భారత జనాభాయే ఇప్పుడు ప్రపంచానికి గొప్ప అవకాశాలు, వనరులుగా కన్పిస్తున్నాయి. ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో భారతదేశం తన శక్తిసామర్థ్యాలు, ప్రజాస్వామ్యం పట్ల తన అంకితభావాన్ని, ప్రజాస్వామ్యయుతంగా తీసుకునే నిర్ణయాలను భారత్ గౌరవిస్తుందనే సందేశాలను గట్టిగా విన్పించే అవకాశం మనకు దక్కింది. ఈ సందేశాలను ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆమోదిస్తున్నాయి, శ్లాఘిస్తున్నాయి. నేటి సమాజం అవరోధాలు సృష్టించేందుకుకాదు సమస్యల పరిష్కారం కోసమే ఉంది. విధ్వంసాలు కాదు తీర్మానాలు కావాలి. భారత్ ఇటీవలే దీర్ఘకాలిక సమస్యల వలయం నుంచి బయటపడి దీర్ఘకాలిక భవిష్యత్ ఆశయాల సాధన దిశలో వడివడిగా అడుగులేస్తోంది. ఇదే తరుణంలో 21వ శతాబ్దపు తొలి పావుభాగం ముగింపునకు, తర్వాత పావుభాగం ఆరంభానికి తాజా బడ్జెట్ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ ఏడాది మనకెంతో సానుకూలంగా ఉంది. ప్రపంచానికి భారత్ ఒక కొత్త ఆశాకిరణంగా వెలుగొందుతోంది. ఇప్పుడు ప్రపంచంలో మనమే ప్రధాన ఆకర్షణ’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ త్రైమాసిక తొలినాళ్లలోనే కుదిరిన ఎఫ్టీఏ ఒప్పందం.. మన భారతీయ యువత బంగారు భవితకు కొత్త చివుళ్లు తొడిగిస్తోంది. కొత్త బాసట బాటలో నడిపిస్తోంది. ఆశయాల భారత్, ఆశావహ యువత, ఆత్మనిర్భర్ భారత్ కోసమే ఈ ఒప్పందం కుదుర్చుకున్నాం’’అని మోదీ అన్నారు.మనీతోపాటు మనసుల్ని గెల్చుకుందాం..‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పేరొందిన ఈ ఒప్పందం ద్వారా మనం సరకులను ఈయూ మార్కె ట్లోకి ముంచెత్తేలా చేద్దాం. తయారీ దారులకు ఆత్మ సంతృప్తి ఎంత అవసరమో సరకుల నాణ్యత అనేది కూడా అంతే ఆవశ్యకం. నాణ్యమై న వస్తూత్పత్తులను అందించడం ద్వారా మంచి లాభాలను గడించండి. నాణ్యమైన ఉత్ప త్తుల ఎగుమతితో యూరప్ దేశవాసుల మన సులనూ గెల్చుకో వచ్చు. దీంతో దశాబ్దాలపాటు మంచి పేరు అలాగే నిల్చి ఉంటుంది. వాణిజ్యబంధమూ బలపడుతుంది. ఇక్కడి బ్రాండ్లను అక్కడ పరిచయం చేయడంతోపాటు భారతీయత అనే బ్రాండ్నూ సుస్థిరంచేయండి. తద్వారా భారత్కు మరింత ప్రతిష్టను తీసుకురండి’’ అని తయారీదారులకు మోదీ సూచించారు. -
ఈయూ ఒప్పదంతో లక్ష్యాలు సాకారం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచ వేదికపై తనదైన ముద్రను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఐరోపా సమాఖ్య (ఈయూ)తో కుదుర్చుకోబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎప్టీఏ)కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదని, ఇది నవ భారతపు ప్రతిష్టాత్మక లక్ష్యాలకు నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రధాని.. కొత్తగా తెరుచుకుంటున్న అంతర్జాతీయ మార్కెట్లను అందిపుచ్చుకోవాలని దేశీయ తయారీదారులకు పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అది కేవలం అధికారిక ప్రసంగం మాత్రమే కాదని, 140 కోట్ల భారతీయుల నమ్మకానికి, సామర్థ్యానికి ముఖ్యంగా యువత ఆకాంక్షలకు అద్దం పడుతోందని అన్నారు. దేశ భవిష్యత్తుపై రాష్ట్రపతి గీసిన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ మాదిరిగా ఆ ప్రసంగం ఉందని మోదీ అభివర్ణించారు.బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు సభ్యులకు (ఎంపీలు) రాష్ట్రపతి చేసిన సూచనలను ప్రధాని గుర్తు చేశారు. 2026 కొత్త ఏడాది ఆరంభంలో పార్లమెంటు సభ్యులంతా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులంతా రాష్ట్రపతి వెలిబుచ్చిన అంచనాలను దృష్టిలో ఉంచుకుని, సభా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అర్థవంతమైన చర్చల్లో పాల్గొంటారని తాను నమ్ముతున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో భారత తయారీదారులు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో పోటీ పడాలని ప్రధాని సూచించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను వినియోగించుకుని, భారత్లో తయారైన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను ఏలాలని ఆయన ఆకాంక్షించారు. ఈ బడ్జెట్ సమావేశాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసే కీలక నిర్ణయాలు వెలువడనున్నాయని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల భారతీయుల ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దం రెండో క్వార్టర్కు తొలి బడ్జెట్ ఇది ఒక చారిత్రక ఘట్టమని, అలాగే 2047 ‘వికసిత భారత్’ లక్ష్యానికి కీలకమైన 25 ఏళ్ల ప్రారంభమన్నారు. వరుసగా 9వసారి మహిళగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని అన్నారు. భారత్ నేడు ప్రపంచానికి ఆశాకిరణంగా, ఆకర్షణ కేంద్రంగా ఉందని, భారత్–ఈయూ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం యువతకు, పరిశ్రమలకు పెద్ద అవకాశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.దేశీయ తయారీదారులు నాణ్యతపై దృష్టి పెట్టాలని, 27 ఈయూ దేశాల మార్కెట్లు భారత్కు పూర్తిగా తలుపులు తెరుచుకున్నాయని ప్రధాని తెలిపారు. రైతులు, మత్స్యకారులు, సేవారంగానికి ఫ్రీ ట్రేడ్తో లాభాలు ఉంటాయన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్’ మార్గంలో ప్రభుత్వం పయనిస్తోందని, పూర్తి వేగంతో ‘రిఫార్మ్ ఎక్స్ప్రెస్’ సాగుతోందన్నారు. దీర్ఘకాలిక సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాల దిశగా భారత్ ముందుకు సాగుతోందని, హ్యూమన్ సెంట్రిక్ అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. లాస్ట్ మైల్ డెలివరీపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇది అడ్డంకుల కాలం కాదని, పరిష్కారాల కాలమని ప్రధాని పేర్కొన్నారు. -
మైకుల్లో కాదు ‘మెటా’లో..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు అప్పుడే తమ పోరాట క్షేత్రాన్ని క్షేత్రస్థాయి నుంచి డిజిటల్ వేదికలకు తరలించాయి. ‘మెటా’, గూగుల్ యాడ్ ట్రాన్స్పరెన్సీ లైబ్రరీల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇటీవల ‘ఇండియా టుడే’ బృందం విశ్లేషించింది. ఈ నివేదికలోని వివరాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. డిసెంబర్ 18 నుండి జనవరి 16 మధ్య సాగిన డిజటల్ యుద్ధం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.నెల రోజులకు రూ. 6.38 కోట్లుగడచిన నెల రోజుల వ్యవధిలో బెంగాల్లోని రాజకీయ పార్టీలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్లలో ప్రకటనల కోసం ఏకంగా రూ. 6.38 కోట్లు వెచ్చించాయి. ఈ డిజిటల్ ప్రకటనల ఖర్చుల విషయంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ప్రధాని ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ కంటే స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.ప్రకటనల్లో టీఎంసీ జోరుతృణమూల్ కాంగ్రెస్ తన వ్యూహకర్త ‘ఐ-ప్యాక్’ (ఐ-పాక్)తో కలిసి గూగుల్, మెటా ప్లాట్ఫారమ్లలో ప్రకటనల కోసం గత నెలలో సుమారు రూ. 2.4 కోట్లు ఖర్చు చేసింది. కేవలం అధికారిక పేజీలే కాకుండా.. ‘అబర్ జీత్బే బంగ్లా’, ‘అమీ బంగ్లార్ డిజిటల్ జోద్ధా’ లాంటి పలు సరోగెట్ (అప్రత్యక్ష) పేజీల ద్వారా మరో రూ. 32 లక్షలు వెచ్చించి ప్రచారం నిర్వహిస్తోంది.మమతా బెనర్జీకి అనుకూలంగా..ఈ పేజీలలో పార్టీ గుర్తును నేరుగా వాడకపోయినప్పటికీ, మమతా బెనర్జీ ప్రభుత్వానికి అనుకూలమైన కథనాలను ఇవి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ‘బోల్చే బంగ్లా’ లాంటి పేజీలు ఒకడుగు ముందుకు వేసి, బీజేపీపై పలు విమర్శలు చేస్తూ, ఇందుకు ప్రయాగ్రాజ్ మాఘ మేళా వీడియోలను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీపై వ్యూహాత్మక దాడులకు దిగాయి.అధికారిక ప్రచారంలో బీజేపీపశ్చిమ బెంగాల్ బీజేపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మెటాపై రూ. 72 లక్షలు, గూగుల్పై రూ. 63 లక్షలు వెచ్చించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈసారి సరోగెట్ పేజీల కంటే అధికారిక ప్రచారానికే ప్రాధాన్యతనిస్తోంది. ఇదిలా ఉండగా, పార్టీలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలు కూడా తమ పథకాల ప్రచారం మొదలుపెట్టాయి. పశ్చిమ బెంగాల్ సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖ రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం నెల రోజుల్లో రూ. 2.1 కోట్లు ఖర్చు చేసింది.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్’ సుమారు రూ. 19 లక్షలు వెచ్చించింది.బెంగాల్ కోటలో సమరభేరిదేశవ్యాప్తంగా డిజిటల్ ప్రచారం సాగించడంలో బీజేపీకి తిరుగులేకపోయినప్పటికీ, పశ్చిమ బెంగాల్ను మాత్రం కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటి గణాంకాలను పరిశీలించినా టీఎంసీదే పైచేయిగా కనిపిస్తోంది. ప్రస్తుత ప్రచార శైలిని చూస్తే, టీఎంసీ గూగుల్ యాడ్స్ ద్వారా విధానపరమైన ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నది. బీజేపీ ‘మెటా’ వేదికలపై భావోద్వేగపూరిత అంశాలను ప్రచారం చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బెంగాల్ కోటను బద్దలు కొట్టాలని చూస్తుండగా, పటిష్టమైన వ్యూహాలతో టీఎంసీ ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది.ఇది కూడా చదవండి: Mumbai: మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్ -
యూరప్ దేశాల్లో మన ఆయుష్ సేవలు
న్యూఢిల్లీ: చరిత్రాత్మక ఇండియా–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారతీయ ప్రాచీన సంప్రదాయ వైద్య సేవలు అందించేవారు విశేషంగా ప్రయోజనం పొందుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన ఆయుష్ వైద్యులు ఇకపై యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లోనూ వైద్య చికిత్సలు, సేవలు అందించవచ్చని తెలిపారు. వారికి అక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మనదేశంలో ఆర్జించిన వైద్య అర్హతలతో యూరప్ దేశాల్లో పని చేయవచ్చని సూచించారు. ఆయుర్వేదం, యోగా వంటివి నేర్చుకున్న యువతకు చక్కటి ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. కేరళలోని ఆర్య వైద్యశాల చారిటబుల్ హాస్పిటల్ శత వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈయూతో కుదిరిన ఒప్పందాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ సంప్రదాయ వైద్య సేవలకు, వైద్యులకు మేలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. యూరప్ దేశాల్లో వెల్నెస్ కేంద్రాలు ఈయూతో ఒప్పందంలో భాగంగా యూరప్ దేశాల్లో ఆయుష్ వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చని ప్రధానమంత్రి వివరించారు. మన సంప్రదాయ ఆయుర్వేద, ఆయుష్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. శతాబ్దాలపాటు ఆయుర్వేదంతో భారతీయులు ప్రయోజనం పొందారని గుర్తుచేశారు. కానీ, దురదృష్టవశాత్తూ నేడు ఆయుర్వేదం గురించి మన దేశంలోనే ప్రజలకు పూర్తిగా తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆయర్వేదం ప్రాముఖ్యతను దేశ విదేశాల్లో ప్రజలకు వివరించాల్సిన అవసరం వచి్చందని ఉద్ఘాటించారు. సాక్ష్యాల ఆధారిత పరిశోధనలు, పరిశోధన పత్రాల అందుబాటులో లేకపోవడం వల్లే ఆయుర్వేదం గురించి ప్రజలకు తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. 600కుపైగా ఔషధాల తయారీ సైన్స్, ప్రజల విశ్వాసం ఆధారంగా ఆయుర్వే ద విధానాలను పరీక్షిస్తే అవి బలోపేతం అవుతాయని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయర్వేదానికి ప్రాముఖ్యత లభించేలా ఆర్య వైద్యశాల కృషి చేస్తోందని ప్రశంసించారు. సీఎస్ఐఆర్, ఐఐటీ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తూ ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని తెలిపారు. దీనిపై ఎన్నో పరిశోధనలు చేస్తోందన్నారు. ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానాలను పరిరక్షించడంలో, మరింత అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉందని వివరించారు. ఆర్య వైద్యశాల వ్యవస్థాపకుడు వైద్య రత్నం పి.ఎస్.వారియర్ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా గుర్తుచేశారు. శతాబ్దాలుగా మానవళికి భారత్ అందిస్తున్న సేవలకు, సంప్రదాయ వైద్యానిక ఆర్య వైద్యశాల ఒక ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఆర్య వైద్యశాల 600కుపైగా ఔషధాలు తయారు చేస్తోందని, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆసుపత్రులను నిర్వహిస్తోందని వెల్లడించారు. విదేశాల నుంచి సైతం రోగులు వస్తుంటారని తెలిపారు. -
సిందూర్తో బలం చాటాం: మోదీ
న్యూఢిల్లీ: భారతదేశ బలాన్ని, సైనిక దళాల శౌర్య పరాక్రమాలను ‘ఆపరేషన్ సిందూర్’ ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా మన స్వదేశీ ఆయుధాల శక్తిసామర్థ్యాలను ప్రదర్శించామని చెప్పారు. ఆధునిక యుద్ధాలు, సైనిక ఘర్షణలు కేవలం దేశ సరిహద్దులకే పరిమితం కాదని, అవి యుద్ధ ట్యాంకులు, తుపాకులతో జరగడం లేదని తెలిపారు. కోడ్స్, క్లౌడ్స్తో జరుగుతున్నాయని వివరించారు. సైబర్, ఇన్ఫర్మేషన్ యుద్ధాల గురించి ప్రస్తావించారు. బుధవారం ఢిల్లీ కంటోన్మెంట్లో వార్షిక ‘ఎన్సీసీ పీఎం ర్యాలీ’లో ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ భద్రత కోసం ఎన్సీసీ కేడెట్లు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశవ్యాప్తంగా 75 వేల మందికిపైగా కేడెట్లు వేర్వేరు ప్రాంతాల్లో సేవలందించారని పేర్కొన్నారు. పౌర రక్షణ, హాస్పిటల్ మేనేజ్మెంట్తోపాటు సామాజిక సేవలో పాల్గొన్నారని వెల్లడించారు. మన సైనిక దళాలకు సహకరించారని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారని, జవాన్లకు ప్రాథమిక చికిత్స అందించారని గుర్తుచేశారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా కేడెట్లు 8 లక్షల మొక్కలు నాటారని చెప్పారు. వాటిని సంరక్షించడం మన బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈయూతో డీల్ గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాలతో మనం కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో(ఎఫ్టీఏ) దేశంలో యువతకు లెక్కలేనన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. తాజాగా ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంతో లక్షలాది మంది యువతకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. నేడు ప్రపంచం మొత్తం పూర్తి విశ్వాసంతో భారతీయ యువత వైపు దృష్టి సారించిందని అన్నారు. ఇందుకు మన యువతలోని నైపుణ్యాలు, సంస్కారమే కారణమని ఉద్ఘాటించారు. ‘ఇదే సమయం, ఇదే సరైన సమయం’ అంటూ ఎర్రకోట నుంచి చెప్పానని గుర్తుచేశారు. ఆ విషయంలో ఎన్సీసీకి తిరుగులేదు ఎన్సీసీ అంటే ఒక వ్యవస్థ మాత్రమే కాదని.. అదొక విప్లవమని ప్రధాని మోదీ అభివర్ణించారు. యువతీ యువకుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని ప్రశంసించారు. దేశం పట్ల అంకితభావం కలిగిన పౌరులను తయారు చేస్తోందన్నారు. యువతలో క్రమశిక్షణ పెంచడంతో ఎన్సీసీకి తిరుగులేదన్నారు. ప్రజాస్వామ్య సంస్కృతిని కలిగి ఉండడం భారతీయ యువత ప్రత్యేకత అని వెల్లడించారు. వైవిధ్యం పట్ల వారికి ఎనలేని గౌరవం ఉందన్నారు. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబంగా భావిస్తుంటారని నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్సీసీ కేడెట్ల సంఖ్య ఇటీవల 14 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగిందన్నారు. ప్రధానంగా దేశ సరిహద్దులు, కోస్తా తీరాల్లోని యువత ఎన్సీసీలో చేరుతున్నారని తెలిపారు. ‘ఎన్సీసీ పీఎం ర్యాలీ’లో కేడెట్ల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. -
విమానయానరంగానికి కోపైలట్గా ఉండండి
సాక్షి, హైదరాబాద్: భారత విమానయాన రంగం గత దశాబ్ద కాలంలో చరిత్రాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఒకప్పుడు దేశంలో విమానయానం కొద్దిమందికే పరిమితం కాగా.. నేడు భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఎదిగిందని చెప్పారు. విమాన తయారీ, పైలట్ శిక్షణ, అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ, విమాన లీజింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని.. వీటిని పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తానికి భారత విమానయాన రంగానికి కోపైలట్గా ఉండాలని చెప్పారు. రాబోయే కాలంలో విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగి పెట్టుబడులకు విస్తృత అవకాశాలు దొరుకుతాయన్నారు. బుధవారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా–2026’ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. గత పదేళ్లలో దేశీయ విమానయాన రంగం అసాధారణ అభివృద్ధి సాధించిందని, ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయని వెల్లడించారు. ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ విమానయాన సంస్థలు 1,500కు పైగా కొత్త విమానాలను ఆర్డర్ చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల భాగస్వాములకు వింగ్స్ ఇండియా సదస్సు ఎంతో కీలకమన్నారు. రెండో దశ ‘ఉడాన్’ స్కీమ్’విమాన ప్రయాణాన్ని ప్రత్యేక హక్కుగా కాకుండా ప్రతి పౌరుడికి అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేశామని ప్రధాని మోదీ చెప్పారు. 2014లో దేశంలో కేవలం 70 విమానాశ్రయాలే ఉండగా, ప్రస్తుతం అవి 160కిపైగా చేరాయని, పదేళ్లలోనే రెట్టింపు కంటే ఎక్కువ విమానాశ్రయాలు నిర్మించినట్లు తెలిపారు. ప్రాంతీయ, ఎయిర్ కనెక్టివిటీ, స్లీ–ప్లేన్ ఆపరేషన్స్ కోసం రెండో దశ ‘ఉడాన్ స్కీమ్’ ఉంటుందన్నారు. ప్రతీ పౌరుడు సులభంగా విమానయానం చేసేందుకు వీలైన చర్యల్లో భాగంగా సరసమైన విమాన చార్జీల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు కోటిన్నర మంది ప్రయాణికులు, గతంలో లేని మార్గాల్లో కూడా ప్రయాణించారని తెలిపారు. 2047 నాటికి దేశంలో 400కు పైగా విమానాశ్రయాలు ఉండనున్నాయని, అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారత్ ముందుకెళ్తున్నందున విమాన అనుసంధాన విస్తరణ మరింత వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. పర్యాటక రంగంపైనా దృష్టిదేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ, ఎక్కువ మంది విమాన ప్రయాణాన్ని ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోందని ప్రధాని మోదీ చెప్పారు. విమాన డిజైన్, తయారీ, మరమ్మతులు–నిర్వహణ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. భారత్ ఇప్పటికే విమాన భాగాల తయారీలో కీలక దేశంగా మారిందని, దేశీయంగానే సైనిక, రవాణా విమానాలను ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. పౌర విమానాల తయారీ దిశగానూ అడుగులు వేస్తున్నామని తెలిపారు. భౌగోళికంగా భారత్కు ఉన్న వ్యూహాత్మక స్థానం, విస్తృత దేశీయ అనుసంధాన వ్యవస్థ, భవిష్యత్తులో పెద్దఎత్తున విమాన సేవల విస్తరణ భారత్కు పెద్ద బలమని పేర్కొన్నారు. భారత్లో రూపొందించి తయారుచేసిన ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటీవోఎల్) విమానాలు త్వరలోనే దేశీయ విమానయాన రంగాన్ని మార్చబోతున్నాయని, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని చెప్పారు.గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీసస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్పై భారత్ గట్టిగా పని చేస్తోందని, భవిష్యత్తులో గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ, ఎగుమతుల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. విమానయాన రంగంలో సంస్కరణల వల్ల భారత్ గ్లోబల్ సౌత్కు, ప్రపంచానికి మధ్య ప్రధాన విమాన ద్వారంగా మారుతోందని చెప్పారు. పెట్టుబడిదారులు, తయారీదారులకు ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. విమానయానంతో పాటు ఎయిర్ కార్గో రంగానికీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, కార్గో రవాణా వేగవంతం, సులభతరం చేయడానికి సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. భారత్ త్వరలో అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మారుతుందని, గిడ్డంగులు, ఫ్రైట్ ఫార్వర్డింగ్, ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్, ఈ–కామర్స్ రంగాల్లో అవకాశాలను పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
అజిత్ పవార్ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
-
Trade Deal : ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చేసేలా భారత్ కీలక ఒప్పందం
-
అజిత్ పవార్ మృతి పట్ల మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన అకాల మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఫోన్ చేసి మాట్లాడారు. విమాన ప్రమాదంపై ఆరా తీశారు. అలాగే, పలువురు మంత్రులు, రాజకీయ నేతలు అజిత్ మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా అజిత్ పవార్కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మోదీ..‘అజిత్ పవార్ ప్రజల నేతగా, కింద స్థాయి వరకు బలమైన అనుబంధం కలిగిన నాయకుడు. మహారాష్ట్ర ప్రజల సేవలో అహర్నిశలు శ్రమించిన కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఆయనకు విశేష గౌరవం ఉంది. పరిపాలనా వ్యవహారాలపై లోతైన అవగాహనతో పాటు, పేదలు-అణగారిన వర్గాల సాధికారతపై ఆయనకు ఉన్న అంకితభావం ప్రశంసనీయం. ఆయన అకాల మరణం అత్యంత తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి అని పోస్టు చేశారు. Shri Ajit Pawar Ji was a leader of the people, having a strong grassroots level connect. He was widely respected as a hardworking personality at the forefront of serving the people of Maharashtra. His understanding of administrative matters and passion for empowering the poor and… pic.twitter.com/mdgwwGzw4R— Narendra Modi (@narendramodi) January 28, 2026కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవితం మహారాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కొరకు పని చేశారని అన్నారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు
-
మహిళా బిల్లు మోదీ చేతిలో పోస్ట్ డేటెడ్ చెక్కు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో అమలుచేస్తున్న ప్రైవేటీకరణ, కాషాయీకరణ విధానాలతో రాజకీయంగానూ పెనుమార్పులు సంభవిస్తున్నాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ ఆందోళన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా మొత్తం రాజకీయ వ్యవస్థనే క్రమంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఓ క్రమపద్ధతిలో దెబ్బతీస్తూ పార్లమెంటు వ్యవస్థల పనితీరును తగ్గించడం, విపక్ష గొంతులను అణిచివేయడం, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని చెప్పారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు విచ్చేసిన బృందా కారత్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... మహిళలపై పెరుగుతున్న దమనకాండ 12 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు దేశవ్యాప్తంగా మహిళలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో బీజేపీ ప్రభుత్వం వివిధ చట్టాల్లో తెస్తున్న మార్పుచేర్పులతో దేశంలో మహిళాశక్తి నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడింది. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు రూపొందించి మహిళలు, కార్మికులు, రైతులు, పేదల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. కార్మిక చట్టాల తొలగింపు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, సంక్షేమ పథకాల్లో కోతలే ఇందుకు నిదర్శనం. దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయి. కులం, మతం ఆధారంగా కూడా మహిళల పట్ల హింస పెచ్చరిల్లే అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో మహిళలను అణగదొక్కేందుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనుస్మృతిని అమలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో అంకిత్ భండారి కేసులో దోషులను ఇప్పటికీ పట్టుకోలేదు. బీజేపీ నేత కుమారుడు ప్రత్యక్షంగా అంకిత్ భండారి హత్యకేసులో ఉన్నట్లు తేలినా చర్యల్లేవు. డబుల్ ఇంజన్ సర్కార్గా చెప్పుకునే ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్లో మహిళలపై దాడులు భయపెడుతున్నాయి. మనువాదం ప్రకారం మహిళలను అన్ని రంగాల్లో అణగదొక్కడం, వేధించడమే ఆర్ఎస్ఎస్–బీజేపీ విధానం. ఓటు రాజకీయాలు.. దేశంలో మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ ఓటు రాజకీయాలను నడుపుతోంది. ఈ రిజర్వేషన్ బిల్లు అనేది మోదీ చేతిలో పోస్ట్ డేటెడ్ చెక్కులాంటిది. 2013లోనే చెక్కు ఇచ్చారు... కానీ సంతకం 2023లో చేశారు. అయితే అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియదు. మహిళలు జనాభాలో సగం ఉన్నప్పుడు, అధికార నిర్ణయ వ్యవస్థల్లో వారి ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్య వైఫల్యమే. ఇప్పుడు జనగణన, నియోజకవర్గాల పునరి్వభజన అంటూ వాయిదా వేస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఇన్ని అడ్డంకులు ఎందుకు? ఇప్పటికే దశాబ్దకాలానికిపైగా ఈ బిల్లు కోసం ఎదురుచూస్తున్న మహిళలు మోదీ ప్రభుత్వ సాగదీత వ్యవహారంతో ఇంకెన్నేళ్లు వేచి చూడాలి. రాజకీయ వ్యవస్థలను నిర్వీర్యం చేసే కుట్ర సీపీఎం దేశంలో బలహీనపడిందనే వాదన సరికాదు. ప్రస్తుతం దేశంలో మొత్తం రాజకీయ వ్యవస్థనే క్రమంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీస్తోంది. దీనికోసం ఎంతకైనా తెగిస్తోంది. పార్లమెంటు పనితీరును తగ్గించడం, విపక్ష స్వరాలను అణిచివేయడం, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. సీపీఎం ఎదుర్కొంటున్న పరిస్థితి కేవలం ఎన్నికల పరాజయాల సమస్య కాదు. మౌలిక ప్రజాస్వామ్య రాజకీయాలపై సాగుతున్న దాడిలో భాగం. సమాజాన్ని విభజించడం, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం, అధికారాన్ని కేంద్రీకరించడమే బీజేపీ–ఆర్ఎస్ఎస్ ఉద్దేశం. ఆదివాసీ ప్రాంతాల్లో భూములు, అడవులపై గిరిజనుల హక్కులను కాలరాయడం, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడంలో భాగమే ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను లక్ష్యంగా చేసుకొని ఏరివేయడం. హింసాత్మక చర్యలతో భావజాలాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. ఆర్ఎస్ఎస్కు టీఎంసీ గొడుగు పశ్చిమబెంగాల్, త్రిపురలో సీపీఎంకు పూర్వవైభవం తెచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో సీపీఎం, ఇతర వామపక్ష పాచ్చిలు విజయం సాధిస్తాయనే నమ్మకం ఉంది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్.. ఆర్ఎస్ఎస్–బీజేపీకి రాచబాట వేస్తోంది. ఎండకు, వానకు తడవకుండా టీఎంసీ గొడుగు పడుతోంది. అన్ని రకాలుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎదిగేందుకు తోడ్పడుతోంది. ఆ విషయాన్ని బెంగాల్ ప్రజలు గుర్తిస్తున్నారు. ఈసారి సీపీఎంను ఆదరిస్తారు. త్రిపురలో తిప్రమోతా–బీజేపీ కూటమి ప్రభుత్వం పట్ల గిరిజనులు అసహనంతో ఉన్నారు. -
93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలో నూతన శకానికి తెర లేచింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నడుమ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జరిపిన శిఖరాగ్ర చర్చల్లో ఈ చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. పరిమాణంతో పాటు ప్రాధాన్యతపరంగా కూడా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలన్నింటికీ ఈ ఎఫ్టీయూ తల్లి వంటిదని(మదర్ ఆఫ్ ఆల్ డీల్స్) పరిశీలకులు అభివర్ణిస్తున్నారు! ఇది అమల్లోకి వస్తే ఇరు పక్షాల నడుమ వార్షిక సుంకాలు ఏకంగా 400 కోట్ల యూరోల మేరకు తగ్గనున్నాయి. యూరప్ కార్లు, వైద్య పరికరాలు, వైన్ తదితరాలపై టారిఫ్లు దిగొస్తాయి. మొత్తంగా అక్కడి దేశాల దిగుమతులన్నింటిపైనా సుంకాలు భారీగా తగ్గుతాయి. యంత్ర పరికరాలు, రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులపై ప్రస్తుతమున్న భారీ టారిఫ్లు దాదాపుగా కనుమరుగవుతాయి. బదులుగా ఆ ఖండానికి భారత ఎగుమతుల్లో చాలావాటిపై సుంకాలు వచ్చే ఏడేళ్ల వ్యవధిలో 90 నుంచి 100 శాతం దాకా తగ్గనున్నాయి! ఈ తగ్గింపు వస్తూత్పత్తులతో పాటు సేవలకు కూడా వర్తించనుంది!! మొత్తమ్మీద 93 శాతం వస్తువులపై సుంకాల ఎత్తివేతకు ఇరు పక్షాలూ అంగీకరించాయి. ఈ ఒప్పందం కోసం ఇరు పక్షాల నడుమ 18 ఏళ్లకు పైగా చర్చోపచర్చలు కొనసాగుతుండటం విశేషం. అయితే ఎఫ్టీఏపై లాంఛనంగా సంతకాలు జరిగేందుకు కనీసం మరో ఆర్నెల్లు, అది అమల్లోకి రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టనుంది. ఒప్పందానికి సంబంధించిన న్యాయపరమైన, ఇతరత్రా అంశాలపై ఇరువైపులా పూర్తిస్థాయి అధ్యయనం తదితరాలు జరగాల్సి ఉండటమే ఇందుకు కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా ప్రపంచ దేశాలపై టారిఫ్లను ఆయుధంగా ప్రయోగిస్తూ హడలెత్తిస్తుండటం తెలిసిందే. ఆ వాణిజ్య బెదిరింపులకు భారత్, ఈయూ ఒప్పందాన్ని దీటైన సమాధానంగా పరిగణిస్తున్నారు. ఎఫ్టీఏకు తోడుగా ద్వైపాక్షిక వాణిజ్యానికి ఊపునిచ్చే దిశగా మరో 12 ఒప్పందాలు కూడా శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఖరారయ్యాయి. వాటితో పాటు మరో రెండు కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా ఖరారయ్యాయి. వాటిలో ఒకటి రక్షణ–భద్రతకు సంబంధించినది కాగా మరొకటి భారత్ నుంచి ప్రతిభావంతులను యూరప్లో మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు తదితరాలు కల్పించేందుకు వీలు కల్పించేది. ప్రపంచానికే స్థిరత్వం: మోదీ ఎఫ్టీఏ ఖరారుపై మోదీ హర్షం వెలిబుచ్చారు. ఒప్పందం అనంతరం ఉర్సులా, కోస్టాతో కలిసి ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. వాణిజ్యపరంగా అంతర్జాతీయంగా అల్లకల్లోల పరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో భారత్, ఈయూ భాగస్వామ్యం ప్రపంచానికి అత్యవసరమైన స్థిరత్వాన్ని అందిస్తుందని మోదీ విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘భారత్ తన చరిత్రలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యూరప్ మార్కెట్తో మన చిన్న పరిశ్రమలు, రైతులకు అనుసంధానం మరింత పెరిగేందుకు, ఉత్పత్తి, సేవా రంగాల్లో నూతన అవకాశాల సృష్టికి ఇది ఎంతగానో తోడ్పడనుంది. ఎఫ్టీతో భారత్, ఈయూ మధ్య పెట్టుబడులు ఇతోధికంగా పెరగనున్నాయి. నూతన ఇన్నొవేషన్ భాగస్వామ్యాలు ఏర్పడటమే గాక అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు మరింత బలోపేతం కానున్నాయి. ఆ కోణంలో చూస్తే ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, భారత్–ఈయూ సమైక్య ప్రగతికి బ్లూప్రింట్ వంటిది’’అంటూ ప్రధాని కొనియాడారు. ఇరు పక్షాల నడుమ ఈ భాగస్వామ్యం అంతిమంగా ప్రపంచానికే ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇండో–పసిఫిక్ మొదలుకుని కరీబియన్ దీవుల దాకా పలు ప్రాజెక్టుల విషయంలో భారత్, ఈయూ కలిసి పని చేస్తాయని ప్రకటించారు. సవాళ్లకు సమాధానం: ఉర్సులా భారత్, ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక మైలురాయి వంటిదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ అన్నారు. వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుతున్న వేళ ఈ ఒప్పందానికి ఎనలేని ప్రాధాన్యం సమకూరిందని అమెరికా ఒంటెత్తు పోకడలను ఉద్దేశిస్తూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యపరంగా ప్రస్తుతం దేశాలన్నీ ఎదుర్కొంటున్న పెను అంతర్జాతీయంగా సవాళ్లకు పరస్పర సహకారం, సమన్వయమే అత్యుత్తమ పరిష్కారమని ఈ ఒప్పందం మరోసారి సందేశమిచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘మేం సాధించాం. ఒప్పందాలన్నింటికీ తల్లిగా చెప్పదగ్గ ఎఫ్టీఏను కుదుర్చుకున్నాం. ఏకంగా 200 కోట్ల మందికి అద్భుతమైన మార్కెట్ను ఏర్పాటు చేసుకోనున్నాం. ఇది ప్రపంచంలో రెండో, నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా నిలిచిన రెండు దిగ్గజాల గాథ. ఇరు పక్షాలకూ లాభదాయకమైన రీతిలో ఒప్పందం కుదిరింది’’అని ఉర్సులా పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో భారత, యూరప్ ఎగుమతిదారులపై వార్షిక సుంకాలు ఏకంగా 400 కోట్ల యూరోల దాకా తగ్గుతాయని చెప్పారు. అంతేగాక ఇరువైపలా లక్షలాది నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ‘‘భారత నైపుణ్యాలు, సేవలు, యూరప్ టెక్నాలజీ, పెట్టుబడులు, ఇన్నొవేషన్లు పరస్పరం అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఇరు పక్షాలూ ఊహించలేని స్థాయిలో ప్రగతి సాధిస్తాయి. ఒంటరిగా వెళ్తే భారత్, ఈయూల్లో ఏ ఒక్కరికీ ఆ స్థాయి ప్రగతి సాధ్యం కాదు’’అని ఆమె స్పష్టం చేశారు. ‘‘ఎఫ్టీఏ ద్వారా రెండు ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడంతో పాటు భారత్, ఈయూ పౌరులకు భద్రత మరింత మెరుగవనుంది. నానాటికీ అభద్రత పెరిగిపోతున్న నేటి ప్రపంచంలో ఇది అత్యంత కీలకమైన అంశం’’అని ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మైలురాయి వంటిది: కోస్టా భారత్, ఈయూ ఎఫ్టీఏను వాణిజ్య ఒప్పందాల చరిత్రలోనే మైలురాయిగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, వ్యూహత్మక అంశాల్లో సహకారమే పునాదులుగా ఒప్పందం కుదిరిందన్నారు. అందుకే ఇది ఎనలేని చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పారు. చర్చలే శాంతికి మార్గం యుద్ధాలతో శాంతి ఎన్నటికీ సాధ్యం కాదని భారత్, ఈయూ శిఖరాగ్ర సదస్సులో నేతలు అభిప్రాయపడ్డారు. పరస్పర విశ్వాసంతో కూడిన చర్చలే అందుకు ఏకైక మార్గమని ప్రధాని మోదీ, ఈయూ సారథులు ఉర్సులా, ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో స్థితిగతులు, ఇండో–పసిఫిక్లో పరిస్థితులు తదితరాలపై వారితో లోతుగా చర్చలు జరిగినట్టు మోదీ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు చెప్పారు. యుద్ధాలతో ఎన్నటికీ శాంతిని సాధించలేమని ఉక్రెయిన్ ఘర్షణను ఉద్దేశించి ఉర్సులా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్వం ద్వారా శాంతిసాధన యత్నాల్లో యూరప్ కూడా మోదీవైపు నమ్మకంతో చూస్తోందని కోస్టా పేర్కొనడం విశేషం. -
ఇంధన రంగంలో అద్భుత అవకాశాలు
బేతుల్(గోవా): సంస్కరణల ఎక్స్ప్రెస్పై మనదేశం పరుగులు తీస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇంధన రంగంలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. వేగవంతమైన సంస్కరణలు, విప్లవాత్మక చర్యలతో ఇంధన భద్రత నుంచి ఇంధన స్వతంత్రత దిశగా భారత్ ముందుకు సాగుతోందని వివరించారు. మంగళవారం గోవాలో ‘భారత ఇంధన వారోత్సవం–2026’లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ దశాబ్దం ఆఖరు నాటికి దేశ ఇంధన రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చమురు, సహజ వాయువు అన్వేషణ, వెలికితీత కోసం 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.చమురు, గ్యాస్ వెలికితీత కోసం ఇప్పటికే 170 బ్లాక్లు కేటాయించామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా భారత్ అవతరించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అండమాన్ నికోబార్ బేసిన్ హైడ్రోకార్బన్ ఉత్పత్తి కేంద్రంగా మారబోతోందని అన్నారు. మనం ఉపయోగించుకుంటున్న మొత్తం ఇంధనంలో సహజ వాయువు వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచబోతున్నట్లు వి వరించారు. దీనివల్ల ఎన్ఎన్జీ, పైపులైన్ల తయారీలో కొత్తగా అందుబాటులోకి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థ నానాటికీ బలోపేతం అవుతోందని, ఫలితంగా రాబోయే రోజుల్లో పెట్రోకెమికల్స్కు డిమాండ్ మరింత పెరుగుతుందని అన్నారు.మాతో చేతులు కలపండిభారత ఇంధన రంగంలో నేడు వ్యాపారాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని దేశ విదేశాల పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ రికార్డుకెక్కిందని, దేశంలో ఇంధన ఉత్పత్తులకు డిమాండ్ స్థిరంగా పెరుగుతోందని గుర్తుచేశారు. అంతర్జాతీయ డిమాండ్ను సైతం తీర్చేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలో టాప్–5లో ఒకటిగా నిలుస్తోందన్నారు. 150కి పైగా దేశాలకు ఎగుమతు లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో భారత సామర్థ్యం విదేశీ భాగస్వాములకు తోడ్పడుతుందని ఉద్ఘాటించారు. తమతో చేతులు కలపాలని, ఇక్కడున్న అవకాశాలు ఉపయోగించుకోవాలని విదేశీ పెట్టుబడిదారులకు సూచించారు. చమురు, గ్యాస్ అన్వేషణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, సముద్ర మంథన్ మిషన్లో భాగంగా సముద్రాల అంతర్భాగంలో వనరుల కోసం అన్వేషణ సాగిస్తున్నామని వివరించారు. -
ట్రంప్ కు బిగ్ షాక్...యూరప్ భారత్ మెగా డీల్
-
PM Modi: ఈయుతో భారీ ఒప్పందం
-
భారత్, ఈయూ చారిత్రక వాణిజ్య డీల్
న్యూఢిల్లీ: ఐరోపా దేశాల ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు చవగ్గా అందించే లక్ష్యంతో యూరోపియన్ యూనియన్తో భారత్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలతో ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం భేటీ తర్వాత అధికారికంగా ఎఫ్టీఏ ఒప్పందాన్ని ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఒప్పందానికి సంబంధించి ఉన్నతాధికారుల స్థాయి చర్చలు సోమవారం ముగిశాయని భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ప్రకటించారు. అయితే చర్చలు విజయవంతమయ్యాయని మంగళవారం అధికారికంగా భారత్–ఈయూ సదస్సులో అగ్రనేతలు ప్రకటించనున్నారు. ఉర్సులా, యూరోపియన్ యూనియన్ వాణిజ్య, ఆర్థిక భద్రతా విభాగ కమిషనర్ మారోస్ సెకోవిక్లతో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చల తర్వాత ఒప్పంద వివరాలను బహిర్గతం చేయనున్నట్లు తెలుస్తోంది. ముడి వ్రస్తాలు, తోలు, దుస్తులు, పాదరక్షలు, రత్నాలు, వజ్రాభరణాలు, కార్లు, వైన్ తయారీ పరిశ్రమల ఉత్పత్తులపై ఈయూ టారిఫ్లను పూర్తిగా తొలగించాలని భారత్ మొదట్నుంచీ డిమాండ్చేస్తోంది. ఈ మేరకు ఈయూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాణిజ్యం, రక్షణ, భద్రత, వాతావరణ మార్పులు, భూఅయస్కాంతాల వెలికితీత సంబంధ సంక్లిష్టమైన సాంకేతికతలు సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరినట్లు సమాచారం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈయూలోని 27 సభ్యదేశాలతో భారత్ మరింత విస్తృతమైన రక్షణ, భద్రత సహకారం ఉండేలా భద్రత, రక్షణ ఒప్పందం(ఎస్డీపీ) కుదుర్చుకోనున్నారు. ఎఫ్టీఏను ప్రకటించక ముందే రక్షణ ప్రణాళికా చట్రం, వ్యూహాత్మక ఎజెండాలను ఆవిష్కరించనున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) ఒప్పందం కుదిరాక యూరోపియన్ యూనియన్లోని ‘సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్(సేఫ్) కార్యక్రమంలో భారతీయ సంస్థలు చేరతాయి. తద్వారా యూరప్ మార్కెట్లోకి భారతీయ కంపెనీలు అడుగుపెడతాయి. దీంతోపాటు పారిశ్రామిక రక్షణ సహకారం బలోపేతం లక్ష్యంగా సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్(ఎస్ఓఐఏ)ను కుదుర్చుకోనున్నారు. భారతీయ కారి్మకులను యూరప్లో అవకాశాలు పెంచేలా అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకోనున్నారు. లగ్జరీ కార్లపై టారిఫ్ తగ్గే చాన్స్.. తమ విలాసవంత కార్లపై టారిఫ్ను భారత్ తగ్గించాలని ఈయూ దేశాలు కోరుతున్నాయి. దీంతో ఇరువైపులా డిమాండ్లు ఏమేరకు నెరవేరనున్నాయో మంగళవారంతో తేలిపోనుంది. మరోవైపు సేవారంగంలోనూ ఉదారవాద నిర్ణయాలను తీసుకోనున్నారు. అయితే యూరప్కు చెందిన లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించాలని భారత్ భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లగ్జరీ కార్లపై 110 శాతం టారిఫ్ విధిస్తుండగా ఇకపై కేవలం 40 శాతం టారిఫ్ విధించనున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్లో లగ్జరీ కార్ల సెగ్మెంట్ విపరీతంగా విస్తరించనుంది. ప్రసుత్తం కార్ల మార్కెట్లో విలాసవంత కార్ల మార్కెట్ కేవలం ఒక శాతం ఉండటం గమనార్హం. ఈ సెగ్మెంట్ వృద్ధికి విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. 15 వేల యూరోల(రూ.16 లక్షలు) కంటే ధర ఎక్కువుండే కార్లకే ఈ తగ్గింపు వర్తింపజేయాలని యోచిస్తున్నారు. దీంతో ఫోక్స్వ్యాగన్, మెర్సిడెజ్బెంజ్, బీఎండబ్ల్యూ కార్ల మార్కెట్ మరింత విస్తృతంకానుంది. భవిష్యత్తులో ఈ 40 శాతం టారిఫ్లను 10 శాతం స్థాయికి తగ్గిస్తారని తెలుస్తోంది. 136.53 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం.. ప్రస్తుతం ఈయూ మద్యం ఉత్పత్తులపై భారత్ 100–125 శాతం టారిఫ్ విధిస్తోంది. ఈయూ ఆటోమొబైల్ విడిభాగాలపై భారత్ 35.5 శాతం, ప్లాస్టిక్లపై 10.4 శాతం, రసాయనాలు, ఫార్మాసూటికల్స్పై 9.9 శాతం టారిఫ్ విధిస్తోంది. ఎఫ్టీఏ అమల్లోకి వచ్చాక ఇన్నాళ్లూ ఇరువైపులా వాణిజ్యం జరిగే వస్తూత్పత్తుల్లో 90 శాతం ఉత్పత్తులపై టారిఫ్ను భారీగా తగ్గించడమో లేదా పూర్తిగా తొలగించడమో చేయాలి. అయితే తమ బీఫ్, చక్కెర, బియ్యం మార్కెట్ల రక్షణకు ఈయూ ప్రాధాన్యతనిస్తోంది. భారత్ తమ పాడి ఉత్పత్తులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు భారత్ పాటుపడుతోంది. ప్రస్తుతం ఈయూ దేశాలతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2024–25 ఆర్థికసంవత్సరంలో 136.53 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో భారత్ నుంచి 75.85 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమ తులు ఉండగా భారత్కు 60.68 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు ఉన్నాయి. 2024–25లో భారత్ 15.17 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును సాధించింది. భారత ఎగుమతుల్లో ఈయూ దేశాలకు 17 శాతం వస్తూత్పత్తులు వెళ్తున్నాయి. -
జాతీయ ప్రాధాన్యతగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం
సాక్షి, అమరావతి: అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దే క్రమంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని అమలుచేయడం జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా రాష్ట్రాలకు సూచించాలని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తిచేశారు. ప్రపంచంలో భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారుచేయడానికి ఇది అత్యావశ్యకమని తెలిపారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని కేంద్రమే సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం, నాడు జగన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లాయి. ఇంత గొప్ప చట్టంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం నిర్వహించి ఈ చట్టం అమలును సమీక్షించాలని ప్రధాని కోరారు. లేనిపక్షంలో ఒక కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశాన్ని చర్చించడానికి ఆదేశించాల న్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రాధాన్యత, వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఏపీలో అది అమలుకావడం, దాని ప్రాధాన్యతను గుర్తించకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దుచేయడం తదితర అంశాలపై సోమవారం ధర్మాన ప్రధానికి లేఖ రాశారు. అందులో ఆయన పేర్కొన్న అంశాలు.. దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా మీరు ప్రారంభించిన ఆత్మనిర్భర్, వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక పథకాలు ప్రజలకు వరంగా నిలు స్తున్నాయి. ఆ లక్ష్యసాధన దిశగా 2020 ఏప్రిల్ 24న రూ.566.23 కోట్లతో స్వామిత్వ పథకాన్ని ప్రారంభించి 1.61 లక్షల గ్రామాల్లో 2.42 కోట్ల ప్రాపర్టీ కార్డుల పంపిణీ, 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే విజయవంతంగా పూర్తిచేశారు. జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ, మోడరనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేశారు. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో భూమి అనే అంశంపై మీరు చేసిన కృషి గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. రాష్ట్రాలకు ముసాయిదా చట్టం.. దేశ, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి, వివాదాల శాతాన్ని తగ్గించడానికి.. భూ రికార్డులను ఆధునీకరించాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. నీతి ఆయోగ్తో కలిసి ముసాయిదా చట్టాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపించింది. ప్రస్తుతమున్న భావనాత్మక హక్కుల (ప్రిజెంటివ్) స్థానంలో నిర్ధారిత హక్కుల (కన్క్లూజివ్) వ్యవస్థను తీసుకురావడానికి రాష్ట్రాలను ప్రోత్సహించింది. భూ సమస్యలు, వివాదాలు పరిష్కరించి దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి మీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.జగన్ చట్టం తెస్తే చంద్రబాబు రద్దుచేశారుమీ ప్రభుత్వ లక్ష్యాలు, దార్శనికతకు అనుగుణంగా ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023 (యాక్ట్ ఆఫ్ 27 ఆఫ్ 2023) అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, 2024లో చంద్రబాబు ప్రభుత్వం ఈ చట్టం అవసరాన్ని విస్మరిస్తూ దాన్ని ఉపసంహరించుకుని రద్దుచేసింది. తద్వారా వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వేలో మన దేశం 154వ స్థానంలో ఉందనే సత్యాన్ని.. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు ఇలాంటి ప్రగతిశీల చట్టం అవసరాన్ని విస్మరించింది.ప్రస్తుతం నీతి ఆయోగ్ సూచించిన ఈ ముసాయిదా బిల్లును చట్టంగా చేయడానికి 12 రాష్ట్రాలు సంసిద్ధతను వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఆస్తి యాజమాన్యపు హక్కుకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే టోరెన్స్ విధానంలో కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ప్రతిపాదించిన ఈ ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేయాల్సిన అవసరం ఉంది. ఈ చట్టంపై రాష్ట్రాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలి. అంతర్జాతీయ మేటి రాజనీ తిజు్ఞనిగా అవతరిస్తున్న మన దేశ ప్రధానికి సహకరించడమంటే ఈ చట్టం అమలుచేయడమే. -
భారత్కు డొనాల్డ్ ట్రంప్ సందేశం
న్యూఢిల్లీ: భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సందేశాన్ని పంపారు. భారతదేశంలోని ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో భారత్-అమెరికాలది హిస్టారిక్ బాండ్ అంటూ కోడ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్న ‘బ్లాక్ అండ్ వైట్’ ఫోటోను షేర్ చేశారు ట్రంప్. తమది ఎన్నో దశాబ్దాల సంబంధం అని అర్ధం వచ్చేలా ఉంది ట్రంప్ షేర్ చేసిన ఫోటో. భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలను అమెరికా ప్రజల తరఫున తెలియజేస్తున్నాను అని ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి యూఎస్ ఎంబసీ తన అధికారిక అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈరోజు అంతకముందే భారత్కు అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. భారత్తో తమది చారిత్రాత్మక బంధం అంటూ అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. ఆపై అధ్యక్షుడు ట్రంప్ కూడా అదే సందేశాన్ని ఇచ్చారు. “On behalf of the people of the United States, I extend my heartfelt congratulations to the government and people of India as you celebrate your 77th Republic Day. The United States and India share a historic bond as the world’s oldest and largest democracies.” - President… pic.twitter.com/oC9x3Qs9y3— U.S. Embassy India (@USAndIndia) January 26, 2026 ఇదీ చదవండి: మనది చారిత్రాత్మక బంధం: అమెరికా శుభాకాంక్షలు -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రధానికి ధర్మాన లేఖ
సాక్షి, శ్రీకాకుళం: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి, ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. కేంద్రం తెచ్చిన చట్టాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేశారు’’ అని లేఖలో ధర్మాన పేర్కొన్నారు.‘‘మీరు తీసుకువచ్చిన గ్రామాల సర్వే, గ్రామ ప్రాంతాల్లో అభివృద్ధి చారిత్రాత్మక నిర్ణయం. 566. 23 కోట్ల రూపాయలతో 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే విజయవంతంగా పూర్తి చేశారు. జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ, మోడరనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో మీరు ఉన్నారు. 'భూమి' అనే రాష్ట్ర జాబితాలోని అంశంపై చేసిన కృషి గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది.భూ రికార్డులను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ తో కలిసి ఈ ముసాయిదా చట్టం తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. పౌరుల మధ్య వివాదరహిత సామరస్యాన్ని పెంపొందించడానికి ఈ చర్యలు మీ ప్రభుత్వం చేపట్టింది. మీరు తెచ్చిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది (AP LAND TITLING ACT 2023 (ACT 27 of 2023)ను 31.10.2023).2024లోచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ప్రతిపాదించిన ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులతో మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ చట్టం అమలును సమీక్షించాలి’’ అని ధర్మాన ప్రసాదరావు లేఖలో కోరారు. -
R-DAY 2026: ఈసారీ ‘మోదీ మార్క్’ వైరల్
న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన వస్త్రధారణతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక శైలి కలబోతగా ఆయన ధరించిన దుస్తులు నిలిచాయి. ముఖ్యంగా ఆయన ధరించిన రాజస్థానీ శైలి తలపాగా ఈ వేడుకలో అందరినీ ఆకర్షించింది.పశ్చిమ భారతదేశంలో శుభప్రదమైన రంగులుగా భావించే ఎరుపు, పసుపు, లేత ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో, ‘లహరియా’ డిజైన్తో ప్రధాని మోదీ ధరించిన తలపాగాను రూపొందించారు. ఏటా ఒక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక తలపాగాను ధరించాలన్న తన ఆనవాయితీని ప్రధాని మోదీ కొనసాగించారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పట్టేలా ప్రధాని ఈ తరహా ఎంపిక చేసుకున్నారు. 77th #RepublicDay🇮🇳 | Prime Minister Narendra Modi arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the parade(Source: DD) pic.twitter.com/Xb9dNsnJQD— ANI (@ANI) January 26, 2026తలపాగాకు జతగా ప్రధాని లేత నీలం రంగు స్లీవ్లెస్ జాకెట్ను ధరించారు. ఇది సంప్రదాయ నెహ్రూ జాకెట్కు ఆధునిక రూపం. దీనిని ప్రస్తుతం ‘మోదీ జాకెట్’ అని పిలుస్తున్నారు. నాణ్యమైన ఖాదీ, చేనేత పట్టుతో తయారైన ఈ జాకెట్.. దేశీయ వస్త్ర పరిశ్రమపై ఆయనకున్న అభిమానాన్ని ప్రతిబింబిస్తోంది. తలపాగా రంగులను పోలిన పాకెట్ స్క్వేర్ ఆయన వస్త్రధారణకు మరింత హుందాతనాన్ని ఇచ్చింది.ప్రధాని ధరించిన తలపాగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ‘బందేజ్’శైలిని పోలి ఉంది. కాగా ప్రధాని మోదీ ‘ఎక్స్’వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘గణతంత్ర దినోత్సవం మన దేశ గౌరవానికి, కీర్తికి ప్రతీక అని, ఇది పౌరుల జీవితాల్లో కొత్త శక్తిని నింపాలని’ ఆయన ఆకాంక్షించారు. వికసిత భారత్ సంకల్పం మరింత బలపడాలని ఆయన పిలుపునిచ్చారు.ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో.. రెండో పెద్ద పండుగ! -
మోదీ మెచ్చిన 'కిచెన్'..! అక్కడ అంతా ఒకేసారి..
అక్కడ అందరికి ఒకే వంటగది. అందరూ కలిసి ఒకే కుటుంబ సభ్యుల్లా భోంచేస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి ఐక్యత ఎక్కడ కనిపించదు. కానీ ఈ గ్రామం ఐక్యమత్యం విలువ ఏంటో గొంతెత్తి చెబుతున్నట్లు ఉంటుంది. అక్కడ ఎవ్వరి నోట నుంచి ఒంటరితనం అనే మాట వినిపించదు. అంతలా వసుధైక కుటుంబంలా ఆదర్శవంతంగా నివశిస్తున్న గ్రామప్రజల జీవిన విధానం చూసి మోదీ సైతం మెచ్చుకున్నారు. అంతా ఒక్కమాటపై సమిష్టిగా ఉంటే ఏ బడ్జెట్ కేటాయింపులతో పని ఉండదు. కేవలం కలిసి ఉండాలన్న ఆ ఆలోచనే అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిపోతుంది అనేందుకు ఈ గ్రామమే ఉదాహరణ. పైగా ఇతర గ్రామాలకు ఆదర్శం కూడా. ఆ గ్రామమే గుజరాత్లోని చందకి గ్రామం. అక్కడ ఎవ్వరూ వంట చెయ్యరు. ఏ ఇంటిలోనే పొయ్యి వెలగదు. మరి భోజనం ఎలా అంటే..అక్కడ వాళ్లందరికీ కమ్యూనిట్ కిచ్న్ ఆధారం. అక్కడ సమిష్టిగా భోజనం తయారు చేసుకుని, అందరు కలిసి తింటారు. నిజానికి ఈ సంప్రదాయం ఐక్యత, సంరక్షణ, భాగస్వామ్య జీవనం వంటి విలువలను నేర్పించేలా ఉంది ఆ గ్రామస్తుల జీవన విధానం.ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే..గుజరాత్లోని మెహ్సానా జిల్లాలోని చందాకి గ్రామంలో ఒకప్పుడు వెయ్యి మందికి పైగా నివాసితులు ఉండేవారు. కానీ ఇప్పుడు కేవలం 500 మంది పెద్దలు మాత్రమే ఉన్నారు. యువకులు చదువు, ఉద్యోగ రీత్యా అహ్మదాబాద్ వంటి నగరాలకు వెళ్లిపోయారు. కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. దాంతో అక్కడ జనాభా తగ్గింది. చుట్టూ దుకాణాలు తగ్గాయి..రోజువారీ వంట వారికి ఓ పోరాటంలా మారింది. కనీస ప్రాథమిక అవసరాల కోసం కూడా ఏకంగా రూ. 3 కిలోమీటర్లు నడక తప్పేది కాదు. దాంతోపాటు ఒంటిరితనం ఆవరించడం మొదలైంది. ఎటుచూసినా ఇళ్లన్నీ.. నిశబ్దంగా ఉండటం మొదలయ్యాయి. ఇదంతా గమనించి ఆ ఊరి సర్పంచ్ పూనంభాయ్ పటేల్ దీనికి పరిష్కార మార్గం ఏంటని ఆలోచిస్తుండేదామె. న్యూయార్క్లో 20 ఏళ్లకు పైగా ఉన్న ఆమె తన స్వంతూరికి తిరిగి వచ్చి.. చాలా ఆలోచించి..ఓ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. గ్రామానికంతటికి ఒకే వంటగది ఉండేలా గ్రామ ప్రజలందర్నీ చైత్యనపరిచి మరి ఏర్పాటు చేశారామె. అక్కడున్న వారంతా నెలకు కేవలం రూ.2000 నుంచి రూ. 2500 వరకు చెల్లిస్తే చాలు..రెండు పూటల ఆరోగ్యకరమైన భోజనం రోటీలు, స్వీట్లు తినొచ్చు. సౌరశక్తితో నడిచే కిచెన్, ఎయిర్ కండిషన్ తదితర అత్యాధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ వంటగదిని ఏర్పాటు చేసుకున్నారు. అందరు కలిసి సమిష్టిగా వంటచేసుకుని మరి..భోజనం చేస్తారు. ఇక నడవలేని దివ్యాంగులు, పెద్దలకు నేరుగా భోజనం ఇంటి వద్దకే అందిస్తారు. దీనివల్ల వారిలో తాము ఒంటరి అనే భావన కనుమరుగైంది. అందరూ ఆనందంగా ఆరోగ్యకరమైన భోజనం తింటూ సంతోషభరితంగా జీవిస్తూ..ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు అక్కడి ప్రజలు. ఆ గ్రామ జీవన విధానం ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆకర్షించింది. ఆయన తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో, దీని గురించి ప్రస్తావించి..అక్కడి కమ్యూనిటీ కిచెన్ సంప్రదాయన్ని మెచ్చుకున్నారు.ఇది వంటభారాన్ని తగ్గించడమే కాకుండా సామాజిక బంధాలను బలోపేతం చేసింది. వసుధైక కుటుంబంలా జీవించేలా బలమైన కుటుంబ స్ఫూర్తిని అందించిందన్నారు. అంతేగాదు వాళ్లంతా కలిసి తినేలా ఒక విధానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజు ఉదయం 11 గంటలకు గంట మోగుతుంది. అది భోజన సమయం అయ్యింది అనేందుకు సంకేతం. అప్పుడు పెద్దలు గ్రామ ప్రవేశద్వారం సమీపంలో ఉన్న చంద్రేశ్వర్ మహాదేవ్ ఆలయంలో సమావేశమవుతారు. వెంటనే ఆ ఆలయ ప్రాంగణంలో టేబుళ్లు, కుర్చీలు క్షణాల్లో సిద్ధమవుతాయి. అంతా హాయిగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేస్తారు. వడ్డన కూడా చాలా గౌరవప్రదంగా ఉంటుందట.#DidYouKnow in #Gujarat's Chandanki village, food isn't cooked in individual homes? Instead, the entire village shares meals in a community kitchen. This initiative fosters community and senior care, crucial for the well-being of residents.@GujaratTourism pic.twitter.com/Xzy1LPWVNm— Dhanraj Nathwani (@DhanrajNathwani) March 10, 2024 (చదవండి: ఒంటరి పెంగ్విన్ ఇంత స్ఫూర్తిని రగిలించిందా?!) -
‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ గణతంత్ర సందేశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఆదివారం) తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 130వ ఎపిసోడ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవం, భారత రాజ్యాంగం, ఎన్నికల ప్రక్రియల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించారు. జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ రోజు రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను స్మరించుకునేందుకు ఒక గొప్ప అవకాశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.జనవరి 25న జరుపుకునే ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ ప్రాముఖ్యతను వివరిస్తూ, భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కీలక పాత్ర పోషిస్తారని, ఓటరే ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటివారని మోదీ అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధాని చెప్పారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరైనా యువతీయువకులు మొదటిసారి ఓటు వేస్తున్నప్పుడు, వారు ఇరుగుపొరుగు వారితో కలసి స్వీట్లు పంచుకోవాలని పిలుపునిచ్చారు. 2016 జనవరిలో యువత కోసం ‘స్టార్టప్ ఇండియా’ ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు.నాడు చిన్నదిగా మొదలైన ఆ ప్రయత్నం, నేడు భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా తీర్చిదిద్దిందని ప్రధాని పేర్కొన్నారు. ఏఐ (ఏఐ), అంతరిక్షం, అణుశక్తి, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ తదితర అత్యాధునిక రంగాల్లో భారతీయ స్టార్టప్లు సత్తా చాటుతున్నాయని అన్నారు. ఈ ప్రగతిలో యువత ఎంపికలు, ఆవిష్కరణలే కీలకమని పేర్కొన్నారు. భారతీయ ఉత్పత్తులంటేనే ‘అత్యుత్తమ నాణ్యత’ అనే గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. దేశంలోని యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు సెల్యూట్ చేస్తూ, నవకల్పనలతో పాటు బలమైన ప్రజాస్వామ్య భాగస్వామ్యం వైపు అడుగులు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పని ఒత్తిడి.. టెక్కీ దుస్థితి వైరల్ -
వాణిజ్య ఒప్పందాలతో యువతకు నూతన అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ: మన యువతకు దేశ విదేశాల్లో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా వేర్వేరు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యువత అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా మన దేశంలోనే ఉందని గుర్తుశారు. వారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తే దేశం ప్రగతి మరింత వేగవంతమవుతుందని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ శనివారం 18వ రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరిగిన రోజ్గార్ మేళాలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 61 వేలమందికిపైగా యువతీ యువకులకు వర్చువల్గా నియామక పత్రాలు అందజేశారు. దేశ యువతకు 2026 సంవత్సరం సరికొత్త ఆశలు ఆనందాలతో మొదలైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ నియామక పత్రం కేవలం ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి అనుమతి మాత్రమే కాదని.. ఇది దేశ నిర్మాణానికి అందిన ఆహ్వానం అని అభివర్ణించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’నిర్మాణానికి కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. నాగరిక్ దేవో భవ ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో గతంలో ఎదురైన అనుభవాలు గుర్తుచేసుకోవాలి. అలాంటి ఇబ్బందులు ప్రజలకు ఎదురు కాకుండా మనం వారికి సేవ చేయాలి. ఉద్యోగ జీవితంలో ప్రజాసేవే పరమార్థంగా భావించాలి. నాగరిక్ దేవో భవ అనే సూక్తిని పాటించాలి. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పౌరుడిని దేవుడిగా పరిగణించాలి. యువత ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. దీనివల్ల నిర్మాణ సంబంధిత రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. మన దేశంలో స్టార్టప్ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 2 లక్షల రిజిస్టర్డ్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. ‘డిజిటల్ ఇండియాతో’నూతన ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. యానిమేషన్, డిజిటల్ మీడియాతోపాటు ఇతర రంగాల్లో ఇండియా గ్లోబల్ హబ్గా మారుతుండడం హర్షణీయం. యువత కృషి వల్లే ఈ ఘనత సాధ్యమవుతోంది. సంస్కరణలతో మేలు నేడు దేశం సంస్కరణల ఎక్స్ప్రెస్లో పయనిస్తోంది. సంస్కరణలతో ప్రజల జీవితాలు, వ్యాపార–వాణిజ్యాలను మరింత సులభతరంగా మార్చాలని నిర్ణయించాం. వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో తదుపరి తరం సంస్కరణలతో యువ పారిశ్రామికవేత్తలకు, ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతోంది. చరిత్రాత్మక కార్మిక సంస్కరణల(లేబర్ కోడ్)తో కార్మికులు, ఉద్యోగుల సామాజిక భద్రత బలోపేతమైంది. వ్యాపారవేత్తలకు సైతం లబ్ధి చేకూరుతోంది. గడిచిన పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతి సాధించింది. దశాబ్ద కాలంలో దేశ జీడీపీ రెట్టింపైంది. 2014 ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2.5 రెట్లు పెరిగాయి. పెట్టుబడులు పెరగడమంటే యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే. ఎల్రక్టానిక్స్ తయారీ రంగం 2014 నుంచి ఆరు రెట్లు వృద్ధి చెంది రూ.11 లక్షల కోట్లకు చేరుకుంది. ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు దాటాయి’’అని ప్రధానమంత్రి వివరించారు. మహిళా సాధికారతకు బాటలు దేశంలో రోజ్గార్ మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 11 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. శనివారం నియామక పత్రాలు అందుకున్నవారిలో 8 వేల మందికి పైగా యువతులు ఉన్నారు. గత 11 ఏళ్లలో దేశ వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యం దాదాపు రెట్టింపు అయ్యిందని ప్రధాని మోదీ తెలిపారు. ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు మహిళా సాధికారతకు బాటలు వేశాయని, మహిళా స్వయం ఉపాధి 15 శాతం మేర పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. అంతేకాకుండా మహిళల కొనుగోలు శక్తి పెరగడంతో 2025లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 2 కోట్ల మార్కును దాటాయని ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణ కోసం రూపొందించిన ‘ఐగాట్’ప్లాట్ఫామ్లో ఇప్పటికే 1.5 కోట్ల మంది ఉద్యోగులు చేరారని, కొత్త ఉద్యోగులు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
61 వేల ఉద్యోగాలు.. ప్రధాని మోదీ చేతుల మీదుగా నియామక పత్రాలు
న్యూఢిల్లీ: దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు (శనివారం) జరిగిన 18వ ‘రోజ్గార్ మేళా’లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా ఎంపికైన దాదాపు 61 వేల మంది యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఈ రోజు మీ అందరి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈ నియామక పత్రం కేవలం ఉద్యోగంలో చేరడానికి అనుమతి మాత్రమే కాదు.. ఇది దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడానికి ఒక ఆహ్వానం. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) కలను సాకారం చేయడానికి, దేశ ప్రగతిని వేగవంతం చేయడానికి ఇది ఒక సంకల్ప పత్రం వంటిది’ అని ఆయన యువతకు పిలుపునిచ్చారు. #WATCH | PM Narendra Modi distributes appointment letters to more than 61000 youthSource: DD pic.twitter.com/mjnWCBfXpM— ANI (@ANI) January 24, 2026కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా రక్షణ రంగంలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు పంపిణీ చేసిన నియామక పత్రాల్లో 49,200 హోం మంత్రిత్వ శాఖ, పారామిలటరీ దళాలకు సంబంధించినవే కావడం విశేషం. మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. సరిహద్దుల్లోని జీరో లైన్ వద్ద బీఎస్ఎఫ్ మహిళా దళాలు పహారా కాస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే జనవరి 26న కర్తవ్య పథ్లో జరిగే గణతంత్ర వేడుకల్లో సీఆర్పీఎఫ్ పురుషుల దళాలకు ఒక మహిళా అసిస్టెంట్ కమాండెంట్ నాయకత్వం వహించనున్నారు’ అని ప్రధాని మోదీ ప్రకటించారు.భారత ప్రభుత్వం అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, దీనివల్ల భారతీయ యువతకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు. జనవరి 24వ తేదీకి ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఉందని మోదీ గుర్తుచేశారు. సరిగ్గా 76 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగ సభ ‘జనగణమన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా ఆమోదించింది. ఈ పవిత్రమైన రోజున నియామక పత్రాలు అందుకోవడం రాజ్యాంగం పట్ల బాధ్యతను మరింత పెంచుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
అది ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్
తిరువనంతపురం: విపక్ష కాంగ్రెస్ అధికారం కోసం సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తోందని, ముస్లిం లీగ్తో అంటకాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిపోయిందని ఆరోపించారు. శుక్రవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ దుష్ట రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వారి దుర్మార్గ వ్యూహాలకు కేరళను ప్రయోగశాలగా వాడుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్కు అభివృద్ధి అజెండా లేదన్నా రు. మావోయిస్టులను మించిన కమ్యూ నిస్టులుగా, ముస్లింలీగ్ను మించిన మతతత్వవాదులుగా మారిపోయారని కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ తీరుపై మండిపడ్డారు. శబరిమలలో అయ్యప్ప ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అయ్యప్ప బంగారాన్ని సైతం చోరీ చేశారని విమర్శించారు. కేరళలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే బంగారం చోరీపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. దోషులను గుర్తించి జైలుకు పంపిస్తామన్నారు. ఇదీ మోదీ గ్యారంటీ అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒక్కటేనని విమర్శించారు. అవినీతికి చరమగీతం పాడి అభివృద్ధికి బాటలు వేసే బీజేపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కేరళ ప్రజలకు పిలుపునిచ్చారు. మన నినాదం ‘వికసిత్ కేరళం’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మార్పునకు ఇదే సరైన సమయమని వెల్లడించారు. గుజరాత్లో నాలుగు దశాబ్దాల క్రితం తొలుత అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేసి, క్రమంగా రాష్ట్రమంతటా విస్తరించామని అధికారం దక్కించుకున్నామని మోదీ గుర్తుచేశారు. అదే తరహాలో కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ను గెల్చుకు న్నామని, ఇక రాష్ట్రంలో అధికారంలోకి రాబోతు న్నామని ధీమా వ్యక్తంచేశారు. గుజరాత్ ఫలితం కేరళలో పునరావృతం అవుతుందన్నారు. తిరువ నంతపురం మేయర్గా ఎన్నికైన వి.వి.రాజేశ్ను బహిరంగ సభ వేదికపై ప్రధాని మోదీ అభినందించారు. ఆయనతో కలిసి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొ రేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. డిప్యూటీ మేయర్ ఆశానాథ్.. మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. ప్రధాని మోదీ కేరళలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. -
తమిళనాడులో అరాచక పాలన
మధురాంతకం(తమిళనాడు): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎంసీ(కరప్షన్, మాఫియా, క్రైమ్) సర్కార్ రాజ్యమేలుతోందని మండిపడ్డారు. అవినీతి, మాఫియా, నేరాలకు డీఎంకే పర్యాయ పదంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు గట్టిగా బుద్ధి చెప్పాలని తమిళనాడు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని స్పష్టంచేశారు. సీఎంసీని ఎవరూ సహించబోరని అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం తమిళనాడులోని మధురాంతకంలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రజలతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అన్నా డీఎంకే అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి, అమ్మ మక్కల్ కట్చి కళగం(ఏఎంఎంకే) అధినేత టీటీవీ దినకరన్, పీఎంకే నాయకుడు డాక్టర్ అన్బుమణి రాందాస్, టీఎంసీ–ఎం నేత జీకే వాసన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని పేర్కొన్నారు. అరాచక పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సుపరిపాలన కోసం వారంతా ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి డీఎంకే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. తిరుప్పరకుండ్రంలో ఇటీవల జరిగిన కార్తీక దీప వివాదాన్ని ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలను కూడా డీఎంకే లెక్కచేయడం లేదని ఆక్షేపించారు. భక్తుల హక్కుల రక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. డీఎంకేలో ఎవరైనా పైకి ఎదగాలంటే వారసత్వం, అవినీతి, మహిళలపై వేధింపుల్లో ప్రమేయం ఉండాలని ఎద్దేవా చేశారు. మన సంస్కృతిని అవమానించేవారికి ఆ పార్టీలో పెద్దపీట వేస్తుంటారని విమర్శించారు. డీఎంకే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇష్టం ఉండదని చెప్పారు. కేవలం ఒక్క కుటుంబం కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. తమిళనాడులో ఎంత అవినీతి జరిగిందో, ఎవరికి జేబుల్లోకి ఎంత సొమ్ము వెళ్లిందో చిన్నపిల్లలకు కూడా తెలుసని పేర్కొన్నారు. డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి మనమంతా ఒక్కటి కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని సూచించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్రంతో భుజం భుజం కలిపి పనిచేసే ప్రభుత్వం కావాలన్నారు. డీఎంకే పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆక్షేపించారు. డ్రగ్స్, నేరాలు తప్ప ఇక్కడ అభివృద్ధి లేదన్నారు. యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కుకున్నారని, మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు నేరాలను కట్టడి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రస్తుతం డీఎంకే పాలనలో ప్రజలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. -
ఇజ్రాయెల్ పర్యటనకు నరేంద్ర మోదీ!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం శుక్రవారం(జనవరి 23) ధ్రువీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ ఇజ్రాయెల్కు వెళ్లే అవకాశముంది. భారత ప్రధాని మోదీని ఇజ్రాయెల్కు ఆహ్వానించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాము అని ఇజ్రాయెల్ ఎంబసీ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల ప్రధానులు మోదీ, బెంజమిన్ నెతన్యాహు చర్చలు జరపనున్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, గాజా శాంతి ప్రణాళికలపై నెతన్యాహుతో మోదీ మాట్లాడే అవకాశముంది.ఇటీవలే నెతన్యాహు.. నరేంద్ర మోదీతో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. మోదీ తొలిసారి 2017లో ఇజ్రాయెల్లో పర్యటించారు. -
రాహుల్కు ఝలక్.. మోదీకి శశిథరూర్ సపోర్ట్?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సమావేశాన్ని డుమ్మా కొట్టి.. కేరళలోనే ఉండటం చర్చనీయాంశంగా మారింది. అది కూడా మోదీ పర్యటిస్తున్న సమయంలో ఆయన కేరళలోనే ఉండటం మరోసారి అనుమానాలను పెంచింది.కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక వ్యూహాత్మక సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి సీనియర్ నేత శశిథరూర్ హాజరుకాలేదు. ఆయన నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న సమయంలో ఆయన కేరళలోనే ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఆయన కార్యాలయం స్పందిస్తూ.. కొలికోడ్లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్ట్లో పాల్గొనేందుకే థరూర్ రాష్ట్రంలో ఉన్నారని తెలిపింది.ఇదిలా ఉండగా.. కాంగ్రెస్లో సీనియర్ నేత, నాలుగుసార్లు ఎంపీగా ఉన్న థరూర్.. ఇటీవల పలు సందర్భాల్లో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడం ఆ పార్టీని ఇబ్బందికి గురిచేస్తోంది. దీంతో రాష్ట్ర నాయకులు కూడా పార్టీ వ్యవహారాల్లో ఆయన్ను పక్కన పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కొచ్చిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ తనతో సరిగా వ్యవహరించకపోవడంపై థరూర్ తీవ్ర కలత చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన అధిష్ఠానం దృష్టికీ తీసుకెళ్లినట్లు తెలిసింది. -
డీఎంకే పార్టీకి కౌంట్డౌన్ మొదలైంది: ప్రధాని మోదీ
చెన్నై: డీఎంకే పార్టీకి కౌంట్డౌన్ మొదలైందని.. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన తమిళనాడులో ఎన్డీఏ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చెన్నై సమీపంలోని మదురాంతకం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తమిళనాడులో ఎన్డీఏ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.డీఎంకేను సీఎంసీ ప్రభుత్వం(అవినీతి, మాఫియా, క్రైమ్) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ప్రజలు ఈ పార్టీని వేరులతో సహా పెకిలించి మార్పు కోసం ఓటు వేయాలని నిర్ణయించుకున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలపై మోదీ మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వం కేవలం ఒకే కుటుంబం కోసం పనిచేస్తోందని విమర్శించారు. 2014 కంటే ముందు కేంద్రంలో కాంగ్రెస్, డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధుల కంటే, తమ ప్రభుత్వం తమిళనాడుకు మూడు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించిందని మోదీ గుర్తుచేశారు. స్టాలిన్ ప్రభుత్వంలో డ్రగ్స్, మద్యం మాఫియాలు పెరిగిపోయాయంటూ ఆరోపించారు.ఎన్డీయేకు వేసే ప్రతి ఓటు తమిళనాడును మాదకద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి చేస్తుందంటూ మోదీ చెప్పుకొచ్చారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలో ఉంటే (డబుల్ ఇంజిన్ ప్రభుత్వం) పెట్టుబడులను ఆకర్షించడం సులభమవుతుందన్నారు. దివంగత నేత జయలలిత హయాంలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ బాగుండేదని.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. -
కేరళపై బీజేపీ మాస్టర్ ప్లాన్.. మోదీ గ్యారంటీ అంటూ..
తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రం కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఇది వికసిత కేరళ సమయం.. రానున్నది ఎన్డీఏ ప్రభుత్వానికి సమయం అంటూ వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘కేరళలో అవినీతి అభివృద్ధిని తీవ్రంగా అడ్డుకుంది. ఎల్డీఎఫ్ హయాంలో బ్యాంకుల్లో జమ చేసిన పొదుపు కూడా ప్రభావితమైంది. సహకార బ్యాంకు కుంభకోణం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బు దోపిడీకి గురైంది. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. దోపిడీదారుల నుండి ప్రతి రూపాయిని తిరిగి తీసుకునేలా మేము చూస్తాం. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ల అవినీతిని అంతం చేస్తాం. రాబోయే ఎన్నికలు రాష్ట్ర పరిస్థితులను మార్చేస్తాయి. ఇప్పటివరకు మీరు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల పాలన మాత్రమే చూశారు. అవి రాష్ట్రాన్ని నాశనం చేశాయి. మూడోవైపు ఉంది. అది బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తుంది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకి వేర్వేరు జెండాలు ఉన్నప్పటికీ.. వాటి అజెండా ఒక్కటే. అదే అవినీతి, జవాబుదారీతనం లేకపోవడం. ఇప్పుడు ప్రజల అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం అవసరం, ఆ పని మేం చేస్తాం. కేరళ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి.. మాతో చేతులు కలపాలి అని కోరారు.#WATCH | Thiruvananthapuram, Kerala: At a BJP rally, PM Modi says, "The upcoming elections will be the ones to change the condition and direction of Kerala. When it comes to the future of Kerala, you have seen just two sides so far. On one side, there is LDF, and on the other… pic.twitter.com/DmLIEmghQV— ANI (@ANI) January 23, 2026ఇదే సమయంలో శబరిమల ఆలయంలో బంగారు చోరీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. మొత్తం దేశానికి, మనందరికీ అయ్యప్ప స్వామిపై అచంచలమైన విశ్వాసం ఉంది. అయితే, ఎల్డీఎఫ్ ప్రభుత్వం శబరిమల ఆలయ సంప్రదాయాలను దెబ్బతీయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు, ఇక్కడ బంగారం దొంగతనం జరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. స్వామివారి పక్కనుండే ఆలయం నుండి బంగారం దొంగిలించబడినట్లు నివేదికలు వస్తున్నాయి. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. కేరళలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుంది. దోషులను జైలుకు పంపిస్తాం. దీనిపై విచారణ జరిగేలా చూడటం ‘మోదీ గ్యారెంటీ’ అని పేర్కొన్నారు.కాగా, కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ భారీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ కేరళలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికలలో బీజేపీ.. 45 సంవత్సరాల తర్వాత ఎల్డీఎఫ్ నుండి తిరువనంతపురం కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. ప్రధాని ఈ విజయాన్ని అసాధారణమైనదిగా, చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఇది కేరళలో బీజేపీ ప్రభుత్వానికి పునాది వేసిందని అన్నారు. ఇక, కేరళ అసెంబ్లీలోని 140 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. -
పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ జెండా ఊపిన ప్రధాని
-
వీడియో: చిన్నోడా.. అలసిపోయి ఉంటావ్!
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బహిరంగ సభకు హజరైన జనాల్లో ఓ పిల్లాడు చేసిన పని మోదీ దృష్టిని ఆకర్షించింది. అంతే.. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. తిరువనంతపురంలో శుక్రవారం ప్రధాని మోదీ సభ జరిగింది. అయితే ఒక చిన్న పిల్లాడు ప్రధాని మోదీ డ్రాయింగ్ ఫోటోను ఎత్తిపట్టి చాలా సేపు నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రధాని మోదీ.. తన ప్రసంగాన్ని ఆపి ఆ బాలుడిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘చిన్నోడా, నువ్వు చాలా సేపు ఫోటో పట్టుకుని నిలబడ్డావు. అలసిపోయి ఉంటావ్. ఆ ఫోటోను నాకు ఇవ్వు. దాని వెనకాల నీ చిరునామా రాయు. నేను నీకు వ్యక్తిగతంగా లేఖ రాస్తాను’’ అని అన్నారు. ఈ క్రమంలో.. ఆ పిల్లాడి చేతుల్లోని ఫొటోను జాగ్రత్తగా తీసుకోవాలని తన ప్రత్యేక రక్షణ బృందం (SPG)కి సూచించారు. అది ఆ బాలుడి ప్రేమ, ఆశీర్వాదాల ప్రతీక. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో సభ ఒక్కసారి చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ సమయంలోనే.. మరో మహిళ ఓ పెద్ద పుస్తకాన్ని ఎత్తి మోదీ వైపు ప్రదర్శించింది. మోదీ ఆమెను కూడా గుర్తించి.. ఆమె కూడా నాకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. పెద్ద పుస్తకం తయారు చేసి తీసుకొచ్చారు అని అనడంతో నవ్వులు పూశాయి. ఇక కేరళ సభలో మోదీ రాజకీయ ప్రసంగంలో.. సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలో మార్పు అవసరమని.. అందుకు బీజేపీని ఆశీర్వదించాలని కేరళ ప్రజలను ఆయన కోరారు. ఇప్పటికే ఆ మార్పు మొదలైందని.. ప్రజల ఆశీస్సులతోనే కేరళలో కమల వికాసం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ పర్యటనలోనే ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొత్త రైలు సేవలను ప్రారంభించారు. కేరళ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని కేరళ ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారాయన. प्रधानसेवक मोदी जी के प्रति केरला के बच्चों का प्रेम pic.twitter.com/u0tKKimQsw— Dr Neetu Dabas 🇮🇳 (@INeetuDabas) January 23, 2026 -
కేరళని ధ్వంసం చేసింది వారే : మోదీ
కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే శబరిమల అయ్యప్ప దేవాలయంలో గోల్డ్ చోరీ నిందితులని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ఈ సారి అధికార మార్పు తప్పనిసరని పేర్కొన్నారు. ఈ రోజు (శుక్రవారం) కేరళలో మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా అధికార కమ్యూనిస్టుల ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తిరువనంతపురంలో LDF, UDF ప్రభుత్వాలు ఇంతకాలం చేసిన అవినీతిని బీజేపీ అంతం చేస్తుందని తెలిపారు. మోదీ కేరళ పర్యటన సందర్భంగా ఇటీవల తిరువనంతరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఆయన ప్రస్థావించారు. కేరళ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అందుకు నిదర్శనం ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమేనని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న LDF, UDF కూటములకు ప్రత్యామ్నయంగా బీజేపీ ఎదిగిందన్నారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ "రాబోయే ఎన్నికలు కేరళ స్థితిని గతిని రెండింటిని మారుస్తాయి. ఇప్పటివరకూ మీరు కేరళని రెండువైపుల నుంచే చూశారు. LDF, UDF రెండు కూటములు కేరళని ధ్వంసం చేశాయి. కానీ మూడోవైపు కూడా ఉంది అదే అభివృద్ధి, పరిపాలన అదే బీజేపీ" అని ఆయన అన్నారు. ఇంతకాలం ఈ రెండుకూటములు అవినీతి, లంచగొడితనం చేసి రాష్ట్రాన్ని బాగుపడకుండా చేశాయన్నారు. ఇక్కడ కాంగ్రెస్ "ముస్లీం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్" గా మారిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని వికసిత్ కేరళగా మార్చే హామీ తనదని అన్నారు. LDF, UDF కూటములు ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివి ఆ రెండింటి పాలన ఒకే విధంగా ఉంటుందన్నారు. ఐదు లేదా పది సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుందని వారికి తెలుసని మారేది ప్రభుత్వమే.. పాలన కాదు ఆ రెండు పార్టీల విధానం ఒకటేనని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు మేలు చేసి అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలని అది బీజేపీ పార్టీనేనని మోదీ స్పష్టం చేశారు.ఇటీవల తిరువనంతపురం ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు అద్భుతమని అక్కడ పాలించడానికి బీజేపీని ప్రజలు ఆదరించారని తెలిపారు. రాష్ట్ర యువతకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మోదీ విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో ఇండియా భారీ ఒప్పందాలు చేసుకుంటుందని అందుకే కేరళలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. -
నిర్భయ నాయకత్వానికి నేతాజీ ప్రతీక :మోదీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిర్భయమైన నాయకత్వానికి, అచంచలమైన దేశభక్తికి ప్రతీకగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. జనవరి 23 నేతాజీ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేస్తూ ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్మృతులతో కూడిన ప్రత్యేక వీడియోను తన ఎక్స్ ఖాతాలో జోడించారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ "నేతాజీ జయంతిని మనం పరాక్రమ్ దివస్గా జరుపుకుంటున్నాం. ఈ సందర్బంగా ఆయన అజేయమైన సంకల్పాన్ని, దేశానికి చేసిన అసమానమైన సేవలను స్మరించుకుందాం. నిర్భయమైన నాయకత్వానికి అచంచలమైన దేశభక్తికి ఆయన ప్రతీకగా నిలిచారు. ఆయన ఆలోచనలు దేశాన్ని ధృడంగా నిలపడంలో ఎన్నో తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి" అని మోదీ అన్నారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. పిన్న వయస్సులోనే ఐసీఎస్ ( ప్రస్తుత సివిల్స్) పరీక్షకు ఎంపికయ్యారు. అయినప్పటికీ తన దేశవాసులు పడుతున్న కష్టాలు చూసి ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2021 నుంచి జనవరి 23ను పరాక్రమ్ దివస్గా జరుపుతుంది.On the birth anniversary of Netaji Subhas Chandra Bose, which is commemorated as Parakram Diwas, we recall his indomitable courage, resolve and unparalleled contribution to the nation. He epitomised fearless leadership and unwavering patriotism. His ideals continue to inspire… pic.twitter.com/KokJhJu33d— Narendra Modi (@narendramodi) January 23, 2026 -
మన అమృత్ భారత్ రైలు నేడు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించనున్నారు. అందులో భాగంగా తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి–తిరువనంతపురం సూపర్ఫాస్ట్ రైలు కూడా ఉంది. ఇప్పటికే చర్లపల్లి–ముజఫర్పూర్ మధ్య అమృత్ భారత్ రైలు నడుస్తుండగా, ఇది రాష్ట్రానికి రెండో రైలు. రాష్ట్రానికి మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. రైలు వేళలు ఇలా... 17041 నంబరుతో ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17042 నంబరుతో బుధవారం సాయంత్రం 5.30కు తిరువనంతపురం నుంచి బయలుదేరి గురువారం రాత్రి 11.30కి చర్లపల్లికి చేరుకుంటుంది.ఈ రైలు నల్లగొండ, గుంటూరు, తెనాలి, గూడూ రు, రేణిగుంట, కాటా్పడి, ఈరోడ్ – కోయంబత్తూరు, పాలక్కాడ్, ఎర్నాకులం టౌన్, కొ ట్టాయం, కాయంకులం రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుంది. ప్రస్తుతం ఇదే రూట్లో శబరి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది. కొత్తగా ప్రారంభం కానున్న అమృత్భారత్ వల్ల అయ్యప్ప భక్తులకు భారీ ఊరట లభించనుంది. నల్లగొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో హాలి్టంగ్ సదుపాయం ఉంది.ఈ ట్రైన్లో 11 సాధారణ బోగీలు, 8 స్లీపర్ బోగీలు ఉన్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు. -
మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..
ప్రకృతిని పూజించడం, ఆరాధించడం ఇవాళ్టిదేం కాదు.. మనిషి జీవితంలోని ప్రతిదశ ప్రకృతితో ముడిపడిపోయి ఉంటుంది. అంతలా పెనువేసుకుపోయారు మనిషి, ప్రకృతి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రకృతితో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. అలా ప్రకృతిని ఆరాధించే అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యమే బగురుంబ. మరి ఆ నృత్యం విశేషాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.అస్సాం ప్రజలకు ప్రకృతి అంటే కేవలం ఒక వనరుకాదు, ఒక జీవనాధారం. వారి నృత్యం, పాట, పండుగ, అన్నీ పచ్చదనం చుట్టూనే తిరుగుతాయి. అలా ప్రకృతితో మమేకమయి చేసే ప్రసిద్ధ నృత్యం బగురుంబ నృత్యం. అతిపెద్ద గిరిజన తెగ అయిన బోడో ప్రజల సంప్రదాయ నృత్యం ఇది. ఈ నృత్యంలో మహిళలు తమ చేతుల్లో రంగురంగుల కండువాలను పట్టుకుని రెండు చేతులు చాచి ఎగురుతున్న సీతాకోక చిలుకల వలె కదులుతారు. అందుకే దీనిని సీతాకోక చిలుక నృత్యం అని కూడా పిలుస్తారు.వసంతాన్ని ఆహ్వానిస్తూ..ప్రకృతి పట్ల బోడో ప్రజలకున్న గౌరవానికి చిహ్నం బగురుంబ. వసంత రుతువు రాకను ఆహ్వానిస్తూ, ప్రకృతి అందాలను కొనియాడుతూ ఏప్రిల్ నెలలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యం చేసేటపుడు స్త్రీలు దోఖానా అనే సంప్రదాయ చీర, జ్వమ్గ్రా అనే కండువాను ధరిస్తారు. వీరు సాధారణంగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నృత్యానికి తోడుగా పురుషులు వెదురు ఫ్లూట్, డ్రమ్, వయోలిన్, జోటా, తార్ఖా వంటి వాయిద్యాలను వాయిస్తారు.ప్రధాని ప్రశంసఇటీవలే గువాహటిలోని సరుసాజై స్టేడియంలో 10,000 మంది బోడో మహిళా కళాకారులు ఏకకాలంలో ఈ బగురుంబ నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా వీక్షించి ప్రశంసించారు. బిహు నృత్యం కూడా అస్సాంలో చాలా ప్రసిద్ధమైనది. ఇది వసంత కాలాన్ని, పంటల సాగును సూచిస్తుంది. ఈ రెండు నృత్యాలు అస్సాంలోని వైవిధ్యమైన సంస్కృతిని చాటి చెబుతాయి.The stage is all set, the performers are pumped up.#BagurumbaDwhou - just a few hours to go! pic.twitter.com/PfSiC6CQLy— Himanta Biswa Sarma (@himantabiswa) January 17, 2026 (Beauty Tips: కళ్ల కింద నలుపు తగ్గాలంటే..!) -
త్వరలో భారత్తో బిగ్ ట్రేడ్ డీల్: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026 సదస్సులో బుధవారం పాల్గోన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒక భారీ ట్రేడ్ డీల్ కుదరబోతుందని ఆయన అన్నారు.ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో తన ప్రసంగం ముగిసిన తర్వాత భారత్కు చెందిన 'మనీకంట్రోల్' వార్తా సంస్థతో ట్రంప్ మాట్లాడారు. "మీ ప్రధానమంత్రిపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. నాకు మంచి మిత్రుడు. త్వరలో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాము" అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా భారత్-యూఎస్ బీటీఎ ఒప్పందం మొదట దశకు చాలా దగ్గరగా ఉందని భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రేడ్ డీల్ గురుంచి ట్రంప్ కూడా వ్యాఖ్యలు చేయడం ప్రధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $191(సుమారు ₹15.8 లక్షల కోట్లు) బిలియన్లుగా ఉంది. అయితే ఈ కొత్త డీల్ ద్వారా 2030 నాటికి దీనిని $500 బిలియన్లకు (సుమారు ₹41 లక్షల కోట్లు) చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్కు ప్రస్తుతం అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్ మొత్తం ఎగుమతుల్లో సుమారు 18 శాతం వాటా అమెరికాదే. అయితే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు సుంకాలను ట్రంప్ ప్రభుత్వం విధించింది. దీంతో భారత ఎగుమతులు సుమారు 8.5 శాతం తగ్గాయి. అయితే దావోస్ సదస్సులో భారత్పై ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో ఈ సుంకాలు తగ్గే అవకాశముంది. -
పార్టీ వ్యవహారాల్లో... నబీన్ నా బాస్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రస్థానంలో నూతన శకానికి తెర లేచింది. బిహార్కు చెందిన యువ నాయకుడు నితిన్ నబీన్ సిన్హా పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదికైంది. బీజేపీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో 45 ఏళ్ల నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు.ఈ మేరకు సర్టిఫికెట్ను ఆయనకు అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఐదో అంతస్తులోని చాంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నుంచి నబీన్ లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అతిరథ మహారథులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామి, నయాబ్ సింగ్ సైనీ, ప్రమోద్ సావంత్, ముఖ్యమంత్రి పేమా ఖండు తదితరులు వీరిలో ఉన్నారు. మోదీతో పాటు వారంతా నబీన్ను స్వయంగా అధ్యక్ష చాంబర్లోకి తోడ్కొని వెళ్లారు.బీజేపీ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షునిగా, బిహార్ నుంచి వచ్చిన తొలి సారథిగా నబీన్ నిలిచారు. బీజేపీకి ఆయన 12వ అధ్యక్షుడు. నబీన్ ఎన్నికను చరిత్రాత్మక ఘట్టంగా నడ్డా అభివర్ణించారు. ఇంతకాలం తనకు అన్నివిధాలా సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.నితిన్ వెన్నంటి సాగుతాం: మోదీబీజేపీ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన నబీన్కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను నవతరానికి ప్రతినిధి (మిలీనియల్)గా అభివర్ణించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ నేతగా, ప్రధానిగా ఎంత అనుభవమున్నా అన్నింటికంటే ముందు నేను బీజేపీ కార్యకర్తను. ఇకపై పార్టీపరమైన వ్యవహారాల్లో నితిన్ నాకు బాస్’’ అని చెప్పారు. ఆయన్ను పదేపదే ‘గౌరవనీ యులైన’ అంటూ సంబోధించారు.‘‘యువకుడైన నబీన్ శక్తియుక్తులు, వ్యవస్థాగత వ్యవహారాల్లో ఆయనకున్న అపార అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇకపై ఆయన నోట వచ్చే ప్రతి మాటా మాకందరికీ నూతన దిశానిర్దేశం చేస్తుంది. పార్టీ భావి కార్యాచరణకు నబీన్ మార్గదర్శకత్వం వెలకట్టలేని ఆస్తి కానుంది’’ అన్నారు. ‘‘పార్టీ కార్యకర్తగా నేను కూడా నా పనితీరును ఎప్పటికప్పుడు నూతన అధ్యక్షునికే నివేదిస్తాను. నా పనితీరుకు సంబంధించిన రహస్య నివేదికను రాసేది ఆయనే. కనుక నబీన్ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నా’’ అని మోదీ చెప్పుకొచ్చారు. బీజేపీ వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు ఎన్డీఏ భాగస్వాముల నడుమ సమన్వయం సజావుగా కొనసాగేలా చూ డాల్సిన బాధ్యత కూడా నబీన్దేనని గుర్తు చేశారు.కాంగ్రెస్ తప్పిదాలు మనం చేయొద్దుకాంగ్రెస్ తప్పిదాల నుంచి నేర్చుకోవాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు మోదీ సూచించారు. ‘‘1984 లో 50 శాతం పై చిలుకు ఓట్లతో 400కు పైగా లోక్సభ స్థానాలు సాధించిన కాంగ్రెస్ నేడు 100 సీట్లు కూడా నెగ్గలేక ఆపసోపాలు పడుతోంది. కనుక ఆ పార్టీ దుర్లక్షణాలన్నింటినీ నిశితంగా గమనించి మనం వాటికి దూరంగా ఉందాం. అప్పుడిక మనల్ని ఎవరూ ఓడించలేరు’’ అన్నారు. నిష్పాక్షిక ఆత్మవిమర్శే బీజేపీ బలమని గుర్తు చేశారు.‘‘బీజేపీ ఒక సంప్రదాయం. అది ఒక కుటుంబం. సభ్యత్వం కంటే సంబంధాలకు విలువనిచ్చే పార్టీ. పదవుల ద్వారా కాకుండా ప్రక్రియ ద్వారా పనిచేసే పార్టీ బీజేపీ. ఇక్కడ అధ్యక్షులు మారినా ఆదర్శాలు, దిశానిర్దేశాలు మారవు. వాజపేయీ, అడ్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి దిగ్గజాల సారథ్యంలో బీజేపీ సున్నా నుంచి శిఖరస్థాయికి ఎదిగింది. వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా సారథ్యంలో మరింత ఎదిగింది’’ అని గుర్తు చేసుకున్నారు.చొరబాట్లు, అర్బన్ నక్సల్స్తో... దేశ భద్రతకే ప్రమాదం!చొరబాటుదారులు, అర్బన్ నక్సల్స్ దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారారని మోదీ ఆందోళన వెలిబుచ్చారు. చొరబాటుదారులను గుర్తించి తిప్పి పంపడం చాలా ముఖ్యమన్నారు. అక్రమ వలసలతో సంపన్న దేశాలు కూడా సతమతమవు తున్నాయి. వారిని వెళ్లగొడుతున్నాయి. వారు ప్రజలను కొల్లగొట్టడాన్ని భారత్ ఎప్పటికీ అనుమతించబోదు. కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు దన్నుగా నిలుస్తున్నాయి. వాటి ముసుగు తొలగించి ప్రజల ముందు నిలబెడదాం’’ అని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.‘‘దేశం ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య అర్బన్ నక్సలిజం. ‘‘నా గురించి, ఎన్డీఏ ప్రభుత్వం గురించి సానుకూలంగా ఎవరు మాట్లాడినా లక్ష్యం చేసుకుని నోరు మూయించే కార్యక్రమం జరుగుతోంది. కొందరు జర్నలిస్టులు కూడా వారిని దారుణంగా హేళన చేసి అవమా నిస్తున్నారు. అంటరానివాళ్లుగా ముద్ర వేస్తున్నారు. ఇదంతా అర్బన్ నక్సల్స్ నూతన శైలి. వీరంతా కలిసి దేశానికి చేటు చేసేందుకు నిత్యం ప్రయత్ని స్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. వీరికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడం చాలా అవసరమన్నారు.అట్టహాసంగా కార్యక్రమంనబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆయనను మోదీ పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యాలయం కోలాహలంగా మారింది. జై శ్రీరాం, జై నితిన్ నబీన్ నినాదాలతో మార్మోగింది. ఆయన భార్య, పిల్లలు, కుటుంబీకులు, సన్నిహితులు కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగు నేతల సందడినబీన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు ఎన్.రాంచందర్రావు, పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, శ్రీనివాసవర్మ, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. వారంతా నబీన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.రాజకీయాల్లోకి యువతబీజేపీ నూతన సారథి నబీన్ పిలుపున్యూఢిల్లీ: రాజకీయాల్లోకి ప్రజలు మరింత చురుగ్గా రావాల్సిన అవస రముందని బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా అభిప్రా యపడ్డారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తద్వారా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని కలసికట్టుగా సాకారం చేసుకుందామని పేర్కొ న్నారు. ‘‘అయితే రాజకీయాలు 100 మీటర్ల రేసు కాదు. సుదీర్ఘంగా సాగే మారథాన్. అక్కడ పరీక్ష వేగానికి కాదని, శారీరక సామర్థ్యానికి. యువత దీన్ని గుర్తించాల్సిన అవసరముంది’’ అన్నారు.బీజేపీ సారథిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం పార్టీ ప్రధాన కార్యాల యంలో ఆయన నేతలు, కార్యక ర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీలో ప్రతి కార్యకర్తకూ పనికి తగిన గుర్తింపు ఎప్పుడూ లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరి కృషినీ గుర్తించేంత శక్తియుక్తులు బీజేపీ ‘వాచ్టవర్’కు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. కీలకమైన పశ్చిమ బెంగాల్తో పాటు రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బూత్ నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి దాకా పూర్తి చిత్తశుద్ధి, అంకితభావంతో పని చేయాలని సూచించారు. విపక్ష ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, డీఎంకేలపై నబీన్ ఈ సందర్భంగా ఘాటు విమర్శలు చేశారు. కార్తీక దీప సంప్రదాయాన్ని కూడా అడ్డుకునే కుయుక్తులకు డీఎంకే సర్కారు దిగిందన్నారు. ఇలాంటి శక్తులను ఓడించి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. -
అబుదాబిలో ‘హౌస్ ఆఫ్ ఇండియా’
భారత్-యూఏఈ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. భారతీయ సంస్కృతి, చరిత్రను చాటిచెప్పేలా అబుదాబిలో ‘హౌస్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటుకు యూఏఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటనలో భాగంగా తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలలో ఇదొకటి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'లూవ్రే అబుదాబీ'వంటి మ్యూజియం ఉన్న సాదియాత్ కల్చరల్ డిస్ట్రిక్ట్ లోనే ఈ 'హౌస్ ఆఫ్ ఇండియా'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం విశేషం. ఇందులో యోగా,ఆయుర్వేదం వంటి భారతీయ పురాతన సంప్రదాయాలను డిజిటల్ గ్యాలరీల రూపంలో పర్యాటకులకు వివరించనున్నారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, భారతీయ పారిశ్రామికవేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు సమావేశమయ్యేలా ఒక 'బిజినెస్ అండ్ కల్చరల్ హబ్'గా ఈ హౌస్ ఆఫ్ ఇండియా పనిచేయనుంది.ఇప్పటికే అబుదాబిలో బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ప్రధాని నరేంద్ర చేతుల మీదగా ప్రారంభమైంది. కాగా యూఏఈ అధ్యక్షుడు కేవలం రెండు గంటల పర్యటన కోసం భారత్కు సోమవారం(జనవరి 19) వచ్చిన సంగతి తెలిసిందే. -
ద్వైపాక్షిక వాణిజ్యం రూ.18 లక్షల కోట్లకు!
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, యూఏఈ నిర్ణయించాయి. 2032 నాటికి పరస్పర వార్షిక వాణిజ్యాన్ని ఏకంగా రూ.18 లక్షల కోట్లకు (200 బిలియన్ డాలర్లకు) పెంచుకోవాలని తీర్మానించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రధాని నరేంద్ర మోదీ చర్చల సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. సోమవారం నహ్యాన్ కుటుంబసమేతంగా భారత్లో పర్యటించారు. మోదీ ప్రొటోకాల్ను పక్కన పెట్టి మరీ ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. కరచాలనం అనంతరం అధినేతలిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తర్వాత చర్చల నిమిత్తం లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధాని అధికార నివాసానికి మోదీ, నహ్యాన్ ఒకే కారులో వెళ్లడం విశేషం! కొన్నేళ్లుగా యూఏఈతో బలపడుతూ వస్తున్న భారత బంధానికి ఈ సన్నివేశం అద్దం పట్టిందని చెబుతున్నారు. 2023–24లో ఇరు దేశాల నడుమ 84 బిలియన్ డాలర్ల మేరకు వర్తకం జరిగింది. ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిందే నహ్యాన్, మోదీ చర్చల సందర్భంగా భారత్, యూఏఈ నడుమ వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం దిశగా కీలక ముందడుగు పడింది. దానితో పాటు అంతరిక్ష మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా ఒప్పందం కుదిరింది. వీటి విధివిధానాల ఖరారుకు తదితరాలకు సంబంధించిన లెటర్స్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు జరిగాయి. దీర్ఘకాలిక ప్రాతిపదికన భారత్కు యూఏఈ ఏటా 5 లక్షల టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేసేలా కూడా ఒప్పందం కుదిరింది. గుజరాత్లోని ధొలెరాలో ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో యూఏఈ పెట్టుబడులు పెట్టనుంది. అధినేతలు ఇరువురూ తొలుత ఏకాంతంగా సమావేశమయ్యారు. రక్షణ మొదలుకుని వర్తకం, ఇంధనం, ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై లోతుగా చర్చించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని వారు ముక్త కంఠంతో ఖండించారు. వాటికి ప్రోత్సాహం, ఆర్థిక మద్దతు ఇచ్చేవారిని కూడా శిక్షించాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఆహార భద్రత, వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం తదితరాలపై ఈ సందర్భంగా ఒప్పందాలు జరిగాయి. కృత్రిమ మేధ రంగంలో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నేతలు నిర్ణయానికి వచ్చారు. అనంతరం ఇరు దేశాల బృందాలు కూడా చర్చల్లో పాల్గొన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. చర్చల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఇందుకోసం దుబాయ్ యువరాజు షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ మక్తోమ్, ఇతర రాజ కుటుంబీకులు, మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన భారీ బృందం నహ్యాన్తో పాటు వచి్చనట్టు ఆయన వివరించారు. అధినేతల సమక్షంలో ఇరు బృందాలు పలు ఒప్పంద పత్రాలను ఇచి్చపుచ్చుకున్నట్టు చెప్పారు. వ్యవసాయ రంగం ఒప్పందంతో భారత రైతులకు లబ్ధి చేకూరడంతో యూఏఈకి ఆహార భద్రత లభిస్తుందని మిస్రీ తెలిపారు. పౌర అణు ఇంధన రంగంలో భాగస్వామ్య అవకాశాలను ఇరుదేశాలు మరింతగా అన్వేíÙంచనున్నట్టు చెప్పారు. అలాగే ‘డేటా ఎంబసీ’ఏర్పాటు అవకాశాలను కూడా పరిశీలిస్తాయన్నారు. తమ చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు మోదీ పేర్కొన్నారు. నహ్యాన్ను తన సన్నిహిత మిత్రునిగా సంబోధించారు. ‘‘విమానాశ్రయానికి వెళ్లి నా సోదరునికి స్వాగతం పలికా. భారత్, యూఏఈ మధ్య బలమైన మిత్ర బంధానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ పర్యటన అద్దం పడుతోంది’’అంటూ ఎక్స్ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. ఇరుదేశాల నడుమ ఇప్పటికే కీలకమైన ఒప్పందాలెన్నో కుదిరాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, స్థానిక కరెన్సీలోనే చెల్లింపుల వ్యవస్థ, ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం వంటివి వాటిలో ఉన్నాయి. పశ్చిమాసియాపైనే చర్చ? పశి్చమాసియా ప్రాంతంలో నానాటికీ పెచ్చరిల్లుతున్న ఉద్రిక్తతలపైనే మోదీ, నహ్యాన్ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇరాన్లో ఆందోళనలు, నిరసనలు నానాటికీ మిన్నంటుతుండటం తెలిసిందే. వాటికి ఇప్పటికే కనీసం 5 వేల మందికి పైగా బలయ్యారు. అవసరమైతే ఇరాన్పై దాడికి కూడా వెనకాడబోమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ఉద్రిక్తతలు ఓ దశలో తారస్థాయికి చేరాయి. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం పూర్తిగా ముగియలేదు. వీటికి తోడు యెమన్ కారణంగా యూఏఈ కూడా సోదర దేశమైన సౌదీ అరేబియాపై ఇటీవలే కత్తులు దూయాల్సి వచి్చంది. యెమన్లోని ముకల్లా పోర్టును యూఏఈ దన్నుతో స్థానిక సాయుధ గ్రూపు చెరబట్టడంతో సౌదీ ఆగ్రహించి ఆ పోర్టుపై క్షిపణి దాడులకు దిగింది. సౌదీ హెచ్చరికలతో యెమన్ నుంచి యూఏఈ తన సేనలను ఉపసంహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫోన్లలో మాట్లాడేందుకు కుదరని పలు ‘అత్యవసర’అంశాలపై చర్చల నిమిత్తమే నహ్యాన్ హుటాహుటిన భారత్ వచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అవేమిటన్నది మాత్రం సస్పెన్స్గానే మిగిలింది. పశి్చమాసియా ప్రాంతంలో భారత్కు యూఏఈ అత్యంత సన్నిహిత మిత్ర దేశం. కరోనా సమయంలో భారత్ తక్షణం స్పందించి అత్యవసరమైన వ్యాక్సీన్లు తదితరాలను యూఏఈకి భారీగా సరఫరా చేసింది. నాటినుంచీ ఇరుదేశాల బంధం మరింత బలపడింది. ప్రయాణం 6 గంటలు... పర్యటన 1.45 గంటలు! నహ్యాన్ తాజా పర్యటనకు దౌత్య కోణంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నట్టు చెబుతున్నారు. అయితే, ఈ పర్యటనలో విపరీతమైన ఆసక్తికి కారణంగా నిలిచిన విశేషం మరొకటుంది. అదేమిటంటే, నహ్యాన్ పర్యటన కేవలం అక్షరాలా గంటా నలభై ఐదు నిమిషాల పాటు మాత్రమే కొనసాగడం! అబుదాబి నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణ సమయమే 3 గంటలకు పైగా ఉంటుంది. నహ్యాన్ సోమవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు పాలెం విమానాశ్రయంలో దిగారు. 4.45కు మోదీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తిరిగి సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు యూఏఈకి పయనమయ్యారు. అంటే భారత్లో గడిపింది కేవలం 1.45 గంటలు. అందుకోసం రానూ పోనూ నహ్యాన్ 6 గంటలకు పైగా ప్రయాణం చేశారు! ఒక దేశాధినేత అధికారిక పర్యటన కేవలం ఇంత తక్కువ సమయం పాటు జరగడం అసాధారణమేనని దౌత్య నిపుణులు అంటున్నారు. ‘‘నహ్యాన్ రాక ఏదో వేరే దేశ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో జరిగిన బాపతు కాదు. కేవలం మోదీతో భేటీ అయ్యేందుకే ఆయన యూఏఈ నుంచి బయల్దేరి వచ్చారు. బహుశా అతి ముఖ్యమైన అంశంపై అత్యవసరంగా చర్చించాల్సిన అవసరమే ఇందుకు దారితీసి ఉంటుంది’’అని వారు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఆహా్వనం మేరకే నహ్యాన్ భారత పర్యటనకు వస్తున్నట్టు విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.ఊయల ఊగారు! నహ్యాన్కు మోదీ బహుమతులు యూఏఈ అధ్యక్షుడు నహ్యాన్కు ప్రధాని మోదీ పలు అరుదైన కానుకలు అందజేశారు. గుజరాతీ కళాకారులు అత్యంత నైపుణ్యంతో తయారు చేసిన చెక్క ఊయల, కశ్మీర్కు చెందిన పష్మీనా శాలువా తదితరాలు వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా నేతలిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ఊయలపై కూర్చుని అలరించారు. కశీ్మరీ శాలువాను తెలంగాణలో తయారు చేసిన వెండి పెట్టెలో పెట్టివ్వడం విశేషం. నహ్యాన్తో పాటు వచ్చిన ఆయన తల్లి, ఇతర రాజకుటుంబ సభ్యులకు కూడా శాలువాలతో పాటు కశీ్మరీ కుంకుమ పువ్వు తదితరాలను మోదీ అందజేశారు. -
భారీ బడ్జెట్.. వరల్డ్ క్లాస్ మేకింగ్.. ప్రధాని బయోపిక్ విశేషాలివే..!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్గా వస్తోన్న చిత్రం "మా వందే". ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు క్రాంతికుమార్ సీహెచ్ రూపొందిస్తున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ "మా వందే రూపంలో ప్రేక్షకులను చూపించనున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో.. అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్లోనూ రిలీజ్ చేయనున్నారు.ఈ మూవీని ప్రపంచంలో తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్వామ్యాన్లో హీరోగా నటించిన జేసన్ మమొవాను "మా వందే" చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఓ మామూలు బయోపిక్లా కాకుండా సినీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత భారీ ప్రాజెక్ట్గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ 22వ తేదీ నుంచి కశ్మీర్లో ప్రారంభం కానుంది. -
యూఏఈ అధ్యక్షుడికి మోదీ స్వాగతం
యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మెుహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. యుఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలకడానకి స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లారు. యుఏఈ అధ్యక్షున్ని కౌగిలించుకొని సాదరంగా స్వాగతం పలికారు.ఈ వివరాలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. "నా సోదరుడు షేక్ మెుహమ్మద్ బిన్ జాయెద్కు స్వాగతం పలకడానికి ఎయిర్పోర్టుకు వెళ్లాను. ఆయన పర్యటన భారత్కు ఆయన ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. యూఏఈ అధ్యక్షునితో చర్చల కోసం ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.ఇరువురు దేశాధినేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, సాంకేతికత, ఆహర భద్రత, తదితర అంశాలలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
మహా జంగిల్రాజ్ను అంతం చేయండి
సింగూర్: ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదార్లను కాపాడుతూ దేశ భద్రతతో ఆటలాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ పారీ్టకి బుద్ధి చెప్పాలని పశ్చిమబెంగాల్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలంటే ‘మహా జంగిల్రాజ్’ను అంతం చేయాల్సిందే. అభివృద్ధి కావాలన్నా, పెట్టుబడిదారులను ఆకర్షించాలన్నా తృణమూల్ను చిత్తుగా ఓడించాల్సిందే’’ అన్నారు. మోదీ ఆదివారం హుగ్లీ జిల్లాలోని సింగూర్లో పర్యటించారు. రూ.830 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మూడు వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మహా జంగిల్రాజ్కు, బీజేపీ సుపరిపాలనకు పోరు జరగనుందన్నారు. తప్పుడు డాక్యుమెంట్లతో స్థిరపడిన చొరబాటుదార్లను తాము అధికారంలోకి రాగానే వెనక్కి పంపిస్తామని పునరుద్ఘాటించారు. బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్ను ఆదరించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కలి్పస్తామన్నారు.అరాచక ప్రభుత్వాన్ని శిక్షించాలి ‘‘బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చొరబాట్లు విపరీతంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో సరిహద్దుల్లో కంచె నిర్మాణం ఆగిపోయింది. చొరబాటుదార్లు ప్రభుత్వ సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించి, ఇక్కడే తిష్టవేస్తున్నారు. వారిని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా కాపాడుతోంది. మేమొచ్చాక వారందరినీ ఏరేస్తాం. బెంగాలీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న అరాచక ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటున్న ప్రభుత్వాలను ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. దేశమంతటా ఈ ధోరణి కనిపిస్తోంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా నిలిపివేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్కు ప్రజలు బుద్ధి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం బెంగాల్లో అమలు కావడం లేదు. పేద ప్రజలు నష్టపోతున్నారు. వారంతా తృణమూల్ కాంగ్రెస్ను ఓడించడం ఖాయం. మేము వచ్చాక ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తాం. ఇదీ నా గ్యారంటీ తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మాఫియా నాయకులు, సిండికేట్లు, నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ప్రజలను పీడిస్తున్నారు. ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. బీజేపీ పాలనలో వారి ఆట కట్టిస్తాం. ప్రజలకు సుపరిపాలన అందిస్తాం. ఇదీ నా గ్యారంటీ. సిండికేట్ రాజ్ ఆగడాలు తట్టుకోలేక పరిశ్రమలు వెళ్లిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సొంత సామ్రాజ్యాలు సృష్టించుకున్నారు. సిండికేట్ రాజ్, మాఫియా సంస్కృతిని అంతం చేయడమే మా లక్ష్యం. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. సందేశ్కాళీలో భూములు ఆక్రమించారు. టీచర్ల నియామకంలో భారీగా అవినీతి జరిగింది. విద్యా వ్యవస్థను మాఫియాలు నియంత్రిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇలాంటివి ఆగిపోతాయి. మహిళలు, యువత, రైతులకు తృణమూల్ కాంగ్రెస్ శత్రువులా మారింది. వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది’’ అన్నారు.చొరబాటుదార్లకు కాంగ్రెస్ అండ కలియాబోర్: కాంగ్రెస్ పారీ్టపై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. అస్సాంలో ఆ పార్టీ హయాంలో ఓట్ల కోసం భూములను చొరబాటుదార్లకు కట్టబెట్టిందని మండిపడ్డారు. దాంతో చొరబాటుదార్ల జనాభా విపరీతంగా పెరిగిపోయిందన్నారు. వారు భూములు, అడవులను విచ్చలవిడిగా ఆక్రమించుకున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాటుదార్లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. అస్సాంలోని నాగావ్ జిల్లాలో రూ.6,957 కోట్ల విలువైన కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు మోదీ ఆదివారం పర్యటించారు. శంకుస్థాపన చేశారు. రెండు అమృత్భారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘చొరబాటుదారులు అస్సాం సంస్కృతిపై దాడి చేస్తున్నారు. స్థానిక యువత ఉపాధిని కొల్లగొడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో భూములు కబ్జా చేస్తున్నారు. చొరబాటుదార్ల కారణంగా అస్సాంకే కాకుండా మొత్తం దేశ భద్రతకు ముప్పు పొంచి ఉంది. చొరబాటుదార్లను కాపాడి అధికారం దక్కించుకోవడమే కాంగ్రెస్ విధానంగా మారిపోయింది. చొరబాటుదార్లకు మద్దతుగా బిహార్లో ర్యాలీలు నిర్వహించిన కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించారు. అస్సాంలోనూ కాంగ్రెస్ కూటమికి అదే గతి పడుతుంది. కాంగ్రెస్కు అభివృద్ధి అజెండా అనేదే లేదు. ప్రతికూల రాజకీయాలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది’’ అన్నారు. -
మోదీపై అభిషేక్ బెనర్జీ విమర్శలు
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.అసెంబ్లీ ఎన్నికల తరుణంలో టీఎంసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకుంటోందని, బీజేపీ రాష్ట్ర ప్రజలపై కష్టాలు మోపుతోందని అన్నారు. నిధుల నిలిపివేత వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.కేంద్రం గ్రామీణ అభివృద్ధి, పథకాలు, మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదు. దీని వల్ల పేదలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రజలపై నేరుగా దాడి చేసినట్టే. బెంగాల్ ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అందుకే కేంద్రం ప్రతీకారంగా నిధులను నిలిపివేస్తోంది’ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. తృణమూల్ కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి పెంచుతుండగా, బీజేపీ మాత్రం నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయి. అందుకే విడుదల నిలిపివేశాం అని వాదిస్తోంది. ఈ వివాదం రాబోయే ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి, పశ్చిమ బెంగాల్కు నిధుల నిలిపివేతపై అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలు రాష్ట్ర కేంద్ర సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. -
పుట్టిన చోటే పరాభవం: కాంగ్రెస్పై ప్రధాని మోదీ విసుర్లు
గౌహతి: ‘ఏ ముంబై నగరంలో కాంగ్రెస్ పార్టీ పుట్టిందో, అదే చోట నేడు ఆ పార్టీ ఐదో స్థానానికి పడిపోయింది. దేశ ప్రజలు కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రతికూల రాజకీయాలను నిరంతరం తిరస్కరిస్తూనే ఉన్నారు’ అని మోదీ ఎద్దేవా చేశారు. అస్సాంలోని కలియాబోర్లో జరిగే బహిరంగ సభలో ఆదివారం ప్రసంగించిన ఆయన.. నేటి ఓటరు కేవలం మాటలు నమ్మడం లేదని, వారికి అభివృద్ధితో పాటు వారసత్వ సంపదకు తగిన గౌరవం రావాలని కోరుకుంటున్నారని, అందుకే బీజేపీని తమ మొదటి ఎంపికగా చేసుకుంటున్నారని అన్నారు.కజిరంగా నేషనల్ పార్క్ సందర్శన తన జీవితంలో అత్యంత మధురమైన అనుభవం అని, రెండేళ్ల క్రితం ఇక్కడ గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. అస్సాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని, ఇది బీజేపీ అభివృద్ధి ఎజెండాకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. కేవలం అస్సాం మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ సుపరిపాలనపై నమ్మకం ఉంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. VIDEO | Addressing a public rally in Assam, Prime Minister Narendra Modi says, "Today, I have once again had the good fortune of coming to Kaziranga. Memories of my previous visit come flooding back. The moments I spent in Kaziranga National Park two years ago are among the most… pic.twitter.com/HqdHFbTkbv— Press Trust of India (@PTI_News) January 18, 2026ప్రపంచంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటైన ముంబై లో బీజేపీ చారిత్రక విజయం సాధించిందని, తొలిసారి అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించడం ప్రజల మద్దతుకు నిదర్శనమని ప్రధాని అన్నారు.కేరళలో కూడా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోందని, తిరువనంతపురం కార్పొరేషన్లో తొలిసారి బీజేపీ మేయర్ పదవిని కైవసం చేసుకోవడం ఒక గొప్ప మార్పు అని అన్నారు. బిహార్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి రికార్డు స్థాయి మెజారిటీని ఇచ్చి నమ్మకాన్ని చాటుకున్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.ఈశాన్య ప్రాంతంతో ఇతర ప్రాంతాలకు అనుసంధానాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) అస్సాంలో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గౌహతి పర్యటనలో భాగంగా రూ. 6,957 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. Looking forward to being in Kaliabor, Assam today for the Bhoomi Poojan of key development works, including the 35 km elevated corridor across Kaziranga. This will go a long way in safeguarding animals, particularly in the monsoon season. During the programme, Amrit Bharat trains… pic.twitter.com/bd8X4MTEfI— Narendra Modi (@narendramodi) January 18, 2026శనివారమే గౌహతి చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. సర్సజైలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్టేడియంలో సుమారు 10,000 మంది కళాకారులు ప్రదర్శించిన బోడో జానపద నృత్యం ‘బగురుంబా’ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ‘నాగావ్ జిల్లాలోని కలియాబోర్లో కీలక అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ముఖ్యంగా 35 కిలోమీటర్ల కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, వన్యప్రాణులను, ముఖ్యంగా వర్షాకాలంలో వరదల బారి నుండి రక్షించడంలో ఎంతో ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రూపొందించిన ఈ 86 కిలోమీటర్ల కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో 35 కిలోమీటర్ల ఎలివేటెడ్ వైల్డ్ లైఫ్ కారిడార్ను కజిరంగా నేషనల్ పార్క్ మీదుగా నిర్మిస్తున్నారు. దీనితో పాటు 21 కిలోమీటర్ల బైపాస్, ఎన్హెచ్-715 జాతీయ రహదారిని రెండు లైన్ల నుండి నాలుగు లైన్లకు విస్తరించే 30 కిలోమీటర్ల పనులు కూడా ఇందులో ఉన్నాయి. నాగావ్, కర్బీ అంగ్లాంగ్, గోలాఘాట్ జిల్లాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టు ఎగువ అస్సాం, దిబ్రూగఢ్, టిన్సుకియాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. జంతువుల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడటం, మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడం, మరియు జఖలబంధ, బోకాఖట్ వంటి పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశాలు.ఈశాన్య భారతాన్ని ఉత్తర భారతంతో అనుసంధానించే దిశగా రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. అవి.. గువహటి (కామాఖ్య) నుండి రోహ్తక్ వరకు, దిబ్రూగఢ్ నుండి లక్నో (గోమతి నగర్) వరకు నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు. ఈ కొత్త రైలు సర్వీసులు ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తాయని, తద్వారా ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు పేర్కొన్నారు. -
వందేభారత్ స్లీపర్ ప్రారంభం
దేశంలో మొట్టమొదటి వందేభారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం మాల్డా రైల్వేస్టేషన్లో జరిగిన జరిగిన కార్యక్రమంలో.. రైలు, రోడ్లకు సంబంధించి మొత్తం రూ.3,250 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. వందేభారత్ స్లీపర్ రైలుతోపాటు నాలుగు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు వర్చువల్గా పచ్చజెండా ఊపారు. వందేభారత్ స్లీపర్ రైలు బెంగాల్లోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి మధ్య రాకపోకలు సాగించనుంది. ప్రయాణ సమయం 18 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గిపోతుంది. కొత్త రైళ్ల రాకతో ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని ప్రధానమంత్రి వివరించారు.కాళీమాత, కామాఖ్య మాతల పవిత్ర క్షేత్రాలను అనుసంధానించే రైలును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆధునిక రైళ్ల గురించి గతంలో విన్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని వ్యాఖ్యానించారు. అమెరికా లేదా యూరప్ కంటే మనదగ్గరే ఎక్కువ రైల్వే కోచ్లు తయారవుతున్నాయని గుర్తుచేశారు. దేశంలో రవాణా సదుపాయాలను ఆధునీకరిస్తున్నామని, ఈ విషయంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని తెలిపారు. మాల్డా స్టేషన్లో ప్రయాణికులతో మోదీ మాట్లాడారు. -
చొరబాటుదార్లను వెళ్లగొట్టుడే
మాల్డా: అక్రమ చొరబాట్లే పశ్చిమ బెంగాల్కు అతిపెద్ద సవాలుగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పొరుగుదేశం నుంచి వెల్లువెత్తుతున్న చొరబాట్ల కారణంగా ఇక్కడ జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని, తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ చొరబాట్ల వెనుక తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమేయం ఉందని మండిపడ్డారు. శరణార్థులుగా వచ్చినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లోని మాల్డాలో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. తృణమూల్ కాంగ్రెస్ సిండికేట్ రాజ్ రాజకీయ లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇక్కడి పాలకులు చొరబాటుదార్లతో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. అక్రమంగా వచ్చినవారిని బయటకు పంపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తేలి్చచెప్పారు. అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలు సైతం చొరబాటుదార్లను భరించడం లేదని, బయటకు వెళ్లగొడుతున్నాయని గుర్తుచేశారు. బెంగాల్లో తాము అధికారంలోకి వచ్చాక చొరబాటు దార్ల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. చట్టవిరుద్ధమైన వలసలను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేయాలి ‘‘చొరబాటుదారుల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో జనాభా స్థితిగతులు మారిపోతున్నాయి. చాలాచోట్ల ఇన్నాళ్లూ అధికంగా వినిపించిన భాష కూడా మారుతోంది. మరో భాష ఆధిపత్యం కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు. అక్రమంగా మనదేశంలోకి వచ్చినవారు ఘర్షణలకు కారణమవుతున్నారు. బెంగాల్లోని మాల్డా, ముర్షిదాబాద్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, చొరబాటుదార్ల మధ్య బంధాన్ని విచి్ఛన్నం చేయాలి. ఇతర దేశాల్లో మతపరమైన వివక్ష ఎదుర్కొంటూ మనదేశంలోకి వచ్చినవారికి రక్షణ కల్పిస్తాం. మతువా వర్గం ప్రజలు అస్సలు ఆందోళన చెందొద్దు. అరాచక పాలనకు ముగింపు పలకాల్సిందే బెంగాల్లో పరివర్తన్కు సమయం ఆసన్నమైంది. తృణమూల్ కాంగ్రెస్ అరాచక పాలనకు ముగింపు పలకాల్సిందే. పేదల జీవితాలకు ముప్పుగా మారిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. బెంగాల్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. సుపరిపాలన అందిస్తోంది. ఇక బెంగాల్లోనూ అధికారంలోకి రావడం, సుపరిపాలన అందించడం తథ్యం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ఖాయం. పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను వారికి దక్కనివ్వడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు అవినీతిలో మునిగి తేలుతున్నారు. ప్రజల బాగు కోసం కేంద్రం ఇస్తున్న సొమ్మును విచ్చలవిడిగా లూటీ చేస్తున్నారు. అందుకే ప్రజాకంటక తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలి. బీజేపీ అభివృద్ధి మోడల్ పట్ల యువతలో విశ్వాసం పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అపూర్వమైన విజయం సాధించింది. గతంలో మేము బలహీనంగా ఉన్నచోట ఇప్పుడు బలోపేతమయ్యాం. బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, రైతులను నూతన అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతాం’’అని ప్రధాని మోదీ ప్రకటించారు. -
బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: మోదీ
పశ్చిమ బెంగాల్: బెంగాల్ పర్యటనలో మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. పశ్చిమబెంగాల్లో శనివారం ఆయన వందే భారత్ స్లీపర్ ట్రైన్ను ప్రారంభించారు. అనంతరం సభలో ప్రధాని మాట్లాడుతూ. పేద, మధ్య తరగతి ప్రజలంటే మమత సర్కార్కు లెక్కలేదంటూ విమర్శలు గుప్పించారు. బెంగాల్లో అభివృద్ధికి మమతా బెనర్జీనే పెద్ద అడ్డంకి అంటూ మండిపడ్డారు.కేంద్ర నిధులను సైతం టీఎంసీ సర్కార్ పక్కదారి పట్టించిందని.. బెంగాల్ ప్రజల్ని మమత సర్కార్ లూటీ చేస్తోందంటూ ఆరోపించారు. మమత ప్రభుత్వం బెంగాల్లో అభివృద్ధిని కోరుకోవడం లేదు. మమత సర్కార్ అన్నిరంగాల్లో అవినీతిలో కూరుకుపోయింది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం. పశ్చిమబెంగాల్కు పూర్వ వైభవం తీసుకువస్తాం. బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’’ అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. -
స్టార్టప్లు తయారీ, డీప్టెక్పై దృష్టి పెట్టాలి: ప్రధాని
భారతీయ స్టార్టప్లు కేవలం సేవా రంగానికే పరిమితం కాకుండా తయారీ, అత్యాధునిక సాంకేతికత రంగాల్లో ప్రపంచ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘స్టార్టప్ ఇండియా మిషన్’ ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన దేశంలోని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.గ్లోబల్ వాల్యూ చైన్లో భారత్ కీలకంగడిచిన పదేళ్లలో డిజిటల్, సర్వీస్ రంగాల్లో భారత స్టార్టప్లు అద్భుతమైన ప్రగతిని సాధించాయని ప్రధాని ప్రశంసించారు. అయితే, ఇకపై వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తయారీ రంగంలో దేశీయంగా ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో భారత్ కీలక భాగస్వామిగా ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. ‘కొత్త ఆలోచనలతో సమస్యలకు పరిష్కారాలు చూపాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యతగల ఉత్పత్తులను స్టార్టప్లు రూపొందించాలి’ అని స్పష్టం చేశారు.ఏఐ, డీప్టెక్కు పెద్దపీటకృత్రిమ మేధ (AI) ఆవిష్కరణల్లో నాయకత్వం వహించే దేశాలకే భవిష్యత్తులో వ్యూహాత్మక ప్రయోజనం ఉంటుందని ప్రధాని విశ్లేషించారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.ఇండియా ఏఐ మిషన్లో భాగంగా కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించేందుకు 38,000 జీపీయూలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, భారతీయ సర్వర్లపై అభివృద్ధి చేసిన స్వదేశీ ఏఐను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.గతంలో పరిమితులున్న రక్షణ, అంతరిక్ష, డ్రోన్ రంగాల్లో స్టార్టప్ల కోసం సడలింపులు ఇచ్చామన్నారు.మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్..2014లో కేవలం 500 కంటే తక్కువగా ఉన్న స్టార్టప్ల సంఖ్య నేడు రెండు లక్షలకు పైగా చేరడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా ఎదిగిందని, ఇందులో 125 యునికార్న్లు ఉన్నాయని గుర్తు చేశారు. స్టార్టప్లకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించినట్లు తెలిపారు. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, స్పేస్ సీడ్ ఫండ్ వంటి పథకాల ద్వారా రూ.25,000 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే.. -
మోదీని కలిస్తే తప్పేంటి?
నిర్మల్: నరేంద్ర మోదీ తనకు బంధువేమీ కాదని, తనకు చుట్టరికం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ‘నరేంద్ర మోదీని రేవంత్రెడ్డి పదేపదే కలుస్తుంటారని చాలామంది అంటున్నారు. ఆయన మన దేశానికి ప్రధానమంత్రి. ఆయన్ను కలిస్తే తప్పేంటి? ఆయన అనుమతిస్తే ఎయిర్పోర్టు వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లినప్పుడు మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు కూడా నా వెంట ఉంటారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే ఎవరినైనా, ఎన్నిసార్లైనా కలుస్తా..’ అని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై నిర్మించిన సదర్మట్ బరాజ్ని ఆయన ప్రారంభించారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధి ‘కొమురం భీమ్, రాంజీ గోండ్ పుట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోరాటాల పురిటి గడ్డ. జల్ జంగిల్ జమీన్ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. కానీ పదేళ్లలో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది. ఒకప్పుడు ఎర్రబస్సు ఎరగని ఆదిలాబాద్ జిల్లాకు ప్రస్తుతం ఎయిర్బస్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత పథకాన్ని ప్రారంభించి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతాం. ఆదిలాబాద్ జిల్లాలో పదివేల ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామికవాడ, నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. నా సొంత జిల్లా పాలమూరుతో సమానంగా ఉమ్మడి ఆదిలాబాద్ను అభివృద్ధి చేస్తా. చనాఖా–కొరటాకు సి.రామచంద్రారెడ్డి పేరు, సదర్మట్ బరాజ్కు పొద్దుటూరి నర్సారెడ్డి పేరు పెడుతున్నాం..’ అని సీఎం ప్రకటించారు.వాళ్ల తప్పులు, అప్పులే ఉరితాడుగా మారాయి.. ‘గత పాలకులు చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి ఉరితాడుగా మారాయి. అప్పటి ప్రభుత్వం పదేళ్లలో చిన్న సమస్యలను కూడా పరిష్కరించకపోవడం, పట్టించుకోకపోవడంతోనే చనాఖా–కొరట, సదర్మట్ వంటి బరాజ్ల పనులు పెండింగ్లో ఉండిపోయాయి. మా ప్రభుత్వం వచ్చాక, ఉత్తమ్కుమార్రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయ్యాక సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ఫామ్హౌస్లో ఉండేటాయన శుక్రాచార్యుడిలా తెరవెనుక ఉంటే, మారీచుడు, సుబాహుల్లా బావబామ్మర్దులు అడ్డుపడుతున్నారు. హైదరాబాద్లో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ పేరిట గొప్ప నగరాన్ని నిర్మిస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెడుతుంది. ముందుచూపుతో అభివృద్ధి చేపడుతుంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు. అనుభవంతో అభివృద్ధికి సహకరించడం చేతకాకపోతే ఫామ్హౌస్లో మౌనంగా ఉండాలి..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.సౌత్ కుంభమేళా మేడారం ‘ప్రపంచలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర.. సౌత్ కుంభమేళా లాంటిది. రూ.300 కోట్లతో నిర్మించిన అమ్మవార్ల గుడులను, చేసిన అభివృద్ధి పనులను ఈ నెల 19న ప్రారంభిస్తాం. ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే బొజ్జుపటేల్ అడిగిన మేరకు రూ.22 కోట్లు మంజూరు చేశాం..’ అని సీఎం తెలిపారు. మంచివాళ్లనే గెలిపించండి ‘రేపోమాపో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మంచివాళ్లను గెలిపించుకోవాలి. మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే పది ఖర్చు పెట్టి, వందలు వెనకేసుకునే వాళ్లను కాకుండా మంచోణ్ణి, మనోణ్ణి గెలిపించుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం సర్పంచ్ స్థానాలను గెలుపొందాం. మేము పాలకులు కాదు..సేవకులం.. ప్రజల మనసులు గెలుస్తున్నాం..’ అని రేవంత్రెడ్డి అన్నారు.గోదావరి నీళ్లను వదులుకోం: ఉత్తమ్కుమార్రెడ్డి గోదావరి నదీ జలాల విషయంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశాయని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా తాము వదులుకోబోమన్నారు. పోలవరం–నల్లమలసాగర్ను వ్యతిరేకిస్తూ తాను, సీఎం రేవంత్రెడ్డి..కేంద్ర ప్రభుత్వాన్ని, ట్రిబ్యునల్ను కలిశామని ఉత్తమ్ వెల్లడించారు. చనాఖా–కొరాట కోసం రూ.100 కోట్లు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. దక్షిణ కశ్మీరాన్ని తలపించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి చెప్పారు. రూ.100 కోట్లతో బాసర అభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, బొజ్జు పటేల్, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీలు దండె విఠల్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రైతులను అడ్డుకున్న పోలీసులుఇబ్రహీంపట్నం (కోరుట్ల): సదర్మట్ ప్రాజెక్టు నుంచి గంగనాల ప్రాజెక్టుకు నిరంతరం నీళ్లు వచ్చేలా చూడాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు జగిత్యాల జిల్లా రైతులు సిద్ధం అయ్యారు. అయితే పోలీసులు వారిని అనుమతించలేదు.చనాఖా–కొరట నుంచి నీళ్లు విడుదలసాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం హత్తిఘాట్లోని చనాఖా–కొరట పంప్హౌస్ వద్ద మీట నొక్కిన సీఎం రేవంత్రెడ్డి నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు. అనంతరం కాలువలో పారుతున్న నీటికి పూజలు నిర్వహించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సుదర్శన్రెడ్డి, నగేష్తో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్Š ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
స్టార్టప్లలో నాయకత్వ స్థానానికి ఎదగాలి: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో స్టార్టప్ కంపెనీలు, ఆవి చేసే నవీన ఆవిష్కరణలపై సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ ట్రెండ్స్, టెక్నాలజీలో భారత్ నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. కృత్రిమ మేధ(ఏఐ)లో మనం ముందంజలో ఉండాలని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ‘స్టార్టప్ ఇండియా’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే పదేళ్లలో నూతన స్టార్టప్ ఆవిష్కరణలు, సాంకేతికతకు మనమే సారథ్యం వహించేలా ఎదగాలని పేర్కొన్నారు. నూతన ఆలోచనలు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అదే సమయంలో నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందించాలని స్టార్టప్ కంపెనీలను కోరారు. ముఖ్యంగా తయారీ, పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈనాటి పరిశోధనే రేపటి మేధో సంపత్తి అవుతుందన్నారు. స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వడానికి, నిధులు అందజేయడానికి తమ ప్రభుత్వం పలు పథకాలు తీసుకొచి్చనట్లు ప్రధానమంత్రి గుర్తుచేశారు. కాలం చెల్లించిన నిబంధనలు తొలగించామని అన్నారు. స్టార్టప్ల ప్రతినిధులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్టార్టప్ ఇండియా మిషన్ ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా అభివరి్ణంచారు. మన దేశంలో 2014లో కేవలం నాలుగు స్టార్టప్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 2 లక్షలకు చేరిందని హర్షం వ్యక్తంచేశారు. 125 యాక్టివ్ యూనికార్న్ కంపెనీలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచంలో మూడోఅతిపెద్ద స్టార్టప్ల వ్యవస్థ మన దేశంలోనే ఉందన్నారు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి కంపెనీలు ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు. 45 శాతం స్టార్టప్ కంపెనీల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్ లేదా భాగస్వామి ఉండడం సంతోషం కలిగిస్తోందని ఉద్ఘాటించారు. -
ప్రధాని కార్యక్రమానికి వేదిక ఇచ్చేదే లేదు: తేల్చిచెప్పిన కేరళ సర్కారు?
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఓ కార్యక్రమానికి వేదికను ఇచ్చేదే లేదని కేరళలోని పినరయి విజయన్ సర్కారు తేల్చిచెప్పింది. ఈ నెల 23న ప్రధాని మోదీ పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి తిరువనంతపురం రానున్నారు. దీంతో.. ఆయన కోసం ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ భావించింది. ఈ క్రమంలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియం అనువైనదిగా భావించింది. ఆ మేరకు కేరళ సర్కారుకు ఓ లేఖ రాసింది.రైల్వే శాఖ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఆ స్టేడియాన్ని ప్రధాని కార్యక్రమానికి ఇచ్చేదేలేదని స్పష్టం చేసింది. ‘‘అదేంటి? గణతంత్ర వేడుకలకు మూడ్రోజుల సమయం ఉంటుంది కదా?’’ అని రైల్వే అధికారులు ప్రశ్నించగా.. రిహార్సల్స్ ఉంటాయని పేర్కొంది. దాంతో చేసేది లేక.. రైల్వే అధికారులు వెనుదిరిగారు. కేరళ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. పుతారికండం మైదానంలో ప్రధాని సభను ఏర్పాటు చేస్తామని వివరించారు. అటు రైల్వే అధికారులు కూడా ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. గ్రీన్ఫీల్డ్ స్టేడియాన్ని పరిశీలించినా.. అక్కడ క్రికెట్ మ్యాచ్లు షెడ్యూల్ అయ్యి ఉండడంతో బీజేపీ సూచించిన పుతారిఖండం మైదానానికి ఓకే చెప్పారు. నిజానికి సెంట్రల్ స్టేడియం అయితే.. ఎస్పీజీ భద్రత అనుమతులు సులభమవుతాయి. మిగతా ప్రాంతాల్లో ప్రధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. కాస్త ఇబ్బందికర పరిణామాలుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
పార్టీ కార్యకర్తను చూసి గర్వపడుతున్నా: మోదీ
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. పురపాలిక ఎన్నికల్లో బీజేపీ కూటమికి పట్టం కట్టినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ మాట్లాడుతూ "శక్తివంతమైన ప్రజలు ఎన్డీఏ ఎజెండాకు సుపరిపాలనకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏతో ప్రజలు ఏవిధంగా భాగస్వామ్యమయ్యారో చూపుతున్నాయి. ప్రజలందరికీ నా ధన్యవాదాలు" అని మోదీ తెలిపారు.అదే విధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తను చూసి తాను గర్వపడుతున్నానని మోదీ అన్నారు. మహాయుతి కూటమి రాబోయే రోజుల్లోనూ ఇదే విధమైన ట్రాక్ రికార్డును మెయింటెన్ చేస్తుందని ప్రతిపక్షాల అబద్ధాలను సమర్థవంతంగా తిప్పికొడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు ఈ విజయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మన్సిపల్ ఎన్నికల్లో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హిందుత్వ ఎప్పుడు తమ ఆత్మని, హిందుత్వాన్ని అభివృద్ధి నుండి ఎవరూ దూరం చేయలేరని ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలో జరిగిన 29 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలలో 25చోట్ల మహాయుతి కూటమి మేయర్ స్థానాన్ని ఏర్పాటు చేయచోతుందని సీఎం ఫడ్నవీస్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతీ కూటమి దూసుకపోతుంది. ముంబైతో సహా 19 కార్పోరేషన్లలో స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది. -
ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ
-
ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటింది: ప్రధాని మోదీ
ఢిల్లీ: పార్లమెంట్ సంవిధాన్ సదన్లో కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గ్లోబల్ పార్లమెంటరీ లీడర్స్ 28వ సదస్సుకు భారత్ నేతృత్వం వహిస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతం అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.ప్రధాని ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదని.. భారత్ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పార్లమెంటరీ వ్యవస్థ మరింత పారదర్శకంగా తయారవుతుందని ప్రధాని అన్నారు. భారత్ అభివృద్ధి గ్లోబల్ సౌత్, కామన్ వెల్త్ దేశాలకు ఉపయోగపడుతుందన్న మోదీ.. కరోనా సంక్షోభ సమయంలో భారత్ ప్రపంచానికి మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసిందన్నారు. ప్రజాస్వామ్య సంస్థల బలోపేతానికి భారత్ కట్టుబడి ఉందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కామన్వెల్త్ దేశాల స్వీకరులతో బిర్లా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. కామన్వెల్త్ దేశాల సమాఖ్యలోని 42 దేశాల నుంచి దాదాపు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. వీరితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.‘‘ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, బలోపేతంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత ఎంత?. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ వ్యవహారాల్లో కృత్రిమ మేధను ఎలా వాడుకోవాలి?. పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది?. చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన పెంచడం ఎలా?’’ అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. -
‘సంవిధాన్ సదన్’లో స్పీకర్ల సందడి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకమైన 28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ ముస్తాబైంది. జనవరి 15న ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని ‘సంవిధాన్ సదన్’ సెంట్రల్ హాల్లో ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తర్వాత సభికులనుద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు భారీ స్పందన లభించింది. కామన్వెల్త్ దేశాల సమాఖ్యలోని 42 దేశాల నుంచి దాదాపు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. వీరితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో సమకాలీన పార్లమెంటరీ సవాళ్లు, పరిష్కారాలపై విస్తృతంగా మేధోమథనం జరగనుంది. ప్రధానంగా ప్రజాస్వామ్య సంస్థలను పటిష్టం చేయడంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల కీలక పాత్రపై చర్చించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ పనితీరులో కృత్రిమ మేధ వినియోగం, పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం వంటి అంశాలపై లోతుగా చర్చలు జరగనున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా పార్లమెంటరీ ప్రక్రియల్లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన కల్పించేందుకు అనుసరించాల్సిన వినూత్న వ్యూహాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలు.. 1. ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, బలోపేతంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత ఎంత?2. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ వ్యవహారాల్లో కృత్రిమ మేధను ఎలా వాడుకోవాలి?3. పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది?4. చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన పెంచడం ఎలా? -
గ్లోబల్ ఫెస్టివల్ పొంగల్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతను ప్రతిబింబించే గొప్ప పండుగ పొంగల్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇది ప్రపంచ స్థాయి పండుగగా మారిందని ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, కె.రామ్మోహన్ నాయుడితోపాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ గోపూజ చేశారు. స్వయంగా పొంగలి వండారు. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పంటలు ఇచ్చే భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పొంగల్ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు. పండుగ పరమార్థంలో రైతన్నల శ్రమ కూడా దాగి ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకు సాగాలన్న సందేశాన్ని పొంగల్ ఇస్తోందని తెలిపారు. ప్రపంచంలో తమిళులు ఎక్కడున్నా సరే పొంగల్ను ఉత్సాహంగా నిర్వహించుకుంటారని, తమిళ సంస్కృతిని సుసంపన్నం చేసుకోవడంలో వారు ముందుంటారని గుర్తుచేశారు. పొంగల్ గ్లోబల్ ఫెస్టివల్గా మారడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తమిళ వారసత్వం నుంచి స్ఫూర్తి పొందుతున్నాం ‘‘కృతజ్ఞత అనేది కేవలం మాటలకే పరిమితం కావొద్దని, నిత్య జీవితంలో అది అంతర్భాగం కావాలని పొంగల్ మనకు గుర్తుచేస్తుంది. మనం జీవించడానికి ఎన్నో ఇస్తున్న భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత. పొంగల్ పండుగలో భాగం కావడం గర్వంగా భావిస్తున్నా. ప్రపంచంలో ఇప్పటికీ మనుగడలో ఉన్న ప్రాచీన నాగరికతల్లో తమిళ నాగరికత, సంస్కృతి ఉన్నాయి. ఇది శతాబ్దాల జ్ఞానం, సంప్రదాయాల సమ్మేళనం. చరిత్ర నుంచి పాఠాలను స్వీకరిస్తూ భవిష్యత్తుకు దారిచూపుతున్న మహోన్నత సంస్కృతి ఇది. తమిళ వారసత్వం నుంచి స్ఫూర్తి పొందుతున్నాం. సాంస్కృతిక మూలాల ద్వారా బలోపేతం అవుతూ మున్ముందుకు సాగుతున్నాం. ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సుహృద్భావ బంధం ఉండాలన్న పొంగల్ సందేశాన్ని మనమంతా స్వీకరిద్దాం. భవిష్యత్తు తరాల బాగు కోసం భూమి నిస్సారం కాకుండా రక్షించుకోవడం, జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, వనరులను తెలివిగా, పరిమితంగా ఉపయోగించుకోవడం అత్యవసరం. ఇందులో భాగంగానే మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ వంటి పథకాలు తీసుకొచ్చాం. ఐక్యత, విశ్వాసం మన బలం. భూమిని గౌరవించుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. సందడి చేసిన ‘పరాశక్తి’ టీమ్ కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో తమిళ సినీ నటులు కూడా సందడి చేశారు. తమిళ చిత్రం ‘పరాశక్తి’లో నటించిన శివకార్తికేయన్, రవి మోహన్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ కుమార్ పొంగల్ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పొంగల్ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. 1960వ దశకంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక నిరసన కార్యక్రమాల ఆధారంగా పరాశక్తి చిత్రాన్ని తెరకెక్కించారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరును ఇందులో ప్రస్తావించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రజలకు మోదీ పొంగల్ శుభాకాంక్షలు పొంగల్ సందర్భంగా ప్రధాన మోదీ తమిళం, ఆంగ్ల భాషల్లో ప్రజలకు బుధవారం లేఖ రాశారు. కష్టపడి పనిచేస్తూ మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న వారికి కృతజ్ఞతలు తెలియజేసే పండుగే పొంగల్ అని పేర్కొన్నారు. దేశ ప్రజలకు పొంగల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుఖ సంతోషాలు, సౌభాగ్యం, మంచి ఆరోగ్యంతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ పండుగతో వ్యవసాయం, అన్నదాతలు, గ్రామీణ, జీవితానికి బలమైన అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా కుటుంబాలు కలుస్తుంటాయని, ప్రజలు కష్టసుఖాలు కలబోసుకుంటారని, వారి మధ్య బంధం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఐక్యతా స్ఫూర్తిని పొంగల్ మరింత బలోపేతం చేస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష అయిన తమిళం మన దేశంలో ఉన్నందుకు మనం గర్వించాలని మోదీ ఉద్ఘాటించారు. -
Delhi: పొంగల్ వేడుకల్లో ప్రధాని
-
పుతిన్ ఎఫెక్ట్? భారత్కు మరో దేశాధినేత
ఢిల్లీ: ప్రస్తుతం రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. గతేడాది ఆదేశ అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం రానున్నట్లు ఆ దేశ రాయబారి తెలిపారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు భారత్లోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్చుక్ అధికారికంగా ప్రకటించారు. గుజరాత్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పోలిష్చుక్ ఈ వివరాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేయడానికే జెలెన్స్కీ భారత్లో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. పర్యాటకం, మెడిసిన్, ఇండస్ట్రీయల్ వస్తువులు, పోర్టులు తదితర రంగాలలో పరస్పర సహాకారం ఉండనున్నట్లు తెలిపారు.2024లో మోదీ ఉక్రెయిన్లో పర్యటించినప్పుడు జెలెన్స్కీ ఇండియా వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు పోలిష్చుక్ తెలిపారు. జెలెన్స్కీ పర్యటన ఆ రోజే ఖరారైందన్నారు. ఉక్రెయిన్ కష్టాల్లో ఉన్న సమయంలో ఆ దేశంలో పర్యటించిన అతి కొద్దిమంది ప్రపంచ నాయకులలో మోదీ ఒకరని భారత ప్రధానిని కొనియాడారు. తమ దేశంలో శాంతి నెలకొనాలని గుజరాత్లోని ద్వారకా మందిరంలో పూజలు చేసినట్లు పోలిష్చుక్ తెలిపారు.అయితే ఇంతకాలం భారత్ను పన్నులతో ఇబ్బందులు పెడదామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో ఇటీవలే ఆ దేశ రాయబారి భారత్ను ప్రశంసిస్తూ మాట్లాడారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్లో పర్యటిస్తారని తెలిపారు. ఒకరోజైనా గడవకముందు ఉక్రెయిన్ సైతం అదే విధంగా మాట్లాడింది. ఈ పర్యటనల వెనక ఏమైనా అంతర్యముందా అని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. -
మన జెన్ జెడ్లో పుష్కలంగా సృజన
న్యూఢిల్లీ: భారతీయ జెన్ జెడ్ యువతరంలో సృజనాత్మకత పుష్కలంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2047 ఏడాదికల్లా భారత్ను అభివృద్ధిచెందిన దేశంగా వికసిత్ భారత్గా అవతరింపజేసుకునేందుకు యువత తమ వంతుగా అందించే వినూత్న, సృజనాత్మక ఆలోచనల వేదికగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్(బీవీవైఎల్డీ)ను మోదీ ప్రభుత్వం తీర్చిదిద్దింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 12వ తేదీన బీవీవైఎల్డీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో వీబీఐఎల్డీ ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ ఏటా స్వామి వివేకానంద గౌరవార్థం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన స్ఫూర్తితో వీబీవైఎల్డీని స్థాపించాం. యువతను దృష్టిలో ఉంచుకుని పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చాం. అంకురసంస్థల విప్లవాన్ని ఆశిస్తున్నాం. ఇప్పుడు సృజనాత్మక ఆలోచనలు, శక్తి, సదుద్దేశాలతో మన యువశక్తి ఇప్పుడు దేశ నిర్మాణంలో ముందు వరసలో నిలబడింది. సృజనాత్మక ఆలోచనలు, సమా చారం, సంస్కృతిలతో ఆరెంజ్ ఎకానమీ గణనీయమైన వృద్ధిపథంలో పయనిస్తోంది. గత దశాబ్దకాలంగా చేపట్టిన పలు సంస్కరణలతో ఇప్పుడు ఏకంగా సంస్కరణ ఎక్స్ప్రెస్ దూసుకుపోతోంది. ఈ సంస్కరణల కేంద్ర బిందువు మన యువతలోనే దాగి ఉంది’’ అని మోదీ అన్నారు. జనవరి 9వ నుంచి 12వ తేదీదాకా బీవీవైఎల్డీ కొనసాగింది. దేశవ్యాప్తంగా పలు స్థాయిల్లో 50 లక్షల మందికిపైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంది. -
మకర సంక్రాంతి రోజున సేవా తీర్థ్లోకి పీఎంఓ
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఢిల్లీలోని సౌత్బ్లాక్ భవనంలో కొనసాగుతున్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని జనవరి 14వ తేదీన అంటే మకర సంక్రాంతి పండగ రోజున నూతన భవనసముదాయంలోకి మార్చనున్నారు. రైసినా హిల్స్ సమీపంలో అత్యాధునిక హంగులు, సకల సౌకర్యాలతో నిర్మించిన సేవాతీర్థ్–1 భవంతిలోకి ప్రధాని కార్యాలయం(పీఎంఓ)ను మార్చే స్తారని సోమవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మకర సంక్రాంతి రోజున కొత్త భవనంలో ప్రధాని మోదీ అడుగుపెడతారని తెలుస్తోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ కీలక కార్యాల యాల కోసం ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ కాంప్లెక్స్(సేవా తీర్థ్)ల పేరిట కొత్త భవనాలను నిర్మిస్తున్న విషయం విదితమే. డల్హౌసీ రోడ్(దారా షికో రోడ్)లో సేవా తీర్థ్–1 భవనాన్ని కట్టారు. ప్రధాని కార్యాలయా న్ని ఈ కొత్త భవనంలోకి మార్చనున్నారు. ఇన్నాళ్లూ రాష్ట్రప తిభవన్ సమీపం భవనంలో సేవలందించిన కేబినెట్ సెక్రటేరియట్ విభాగం కొత్తగా కట్టిన సేవాతీర్థ్ పార్ట్–2 భవనంలోకి ఇప్పటికే మారిపోయింది. పార్లమెంట్ స్ట్రీట్లోని సర్దార్ పటేల్ భవన్లో భారత జాతీయ భద్రతా మండలి సచివాలయం(ఎన్ఎస్సీఏ) ఉండేది. సేవా తీర్థ్–3 భవనంలోకి ఎన్ఎస్సీఎస్ కార్యాలయం మారిపోనుంది. సెంట్రల్ విస్టాలో భాగంగా కడు తున్న నూతన ప్రధాని అధికారిక నివాసం ఇంకా నిర్మాణ దశలో ఉంది. కేంద్ర ప్రజాపనుల విభాగం నుంచి 2022లో కాంట్రాక్ట్ సంపాదించిన లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ రూ.1,189 కోట్ల వ్యయంతో 2,26, 203 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలను నిర్మిస్తోంది. నాటి బ్రిటిష్పా లకులు 1920, 1930 దశకాల్లో కేంద్ర ప్రభుత్వం కార్యాల యాలకోసం రాష్ట్రపతిభవన్కు వెళ్లేదారిలో సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ పేరిట ఎర్రని ఇసుక రాళ్లతో అద్భుతమైన భవనాలను నిర్మించారు. ఈ సౌత్ బ్లాక్లోనే నాటి నెహ్రూ హయాం నుంచి ప్రధాని కార్యా లయం పని చేస్తోంది. దశాబ్దాల తర్వాత ఎట్టకేల కు ఈ ఆఫీస్ కొత్త భవనంలోకి తరలిపోతోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లు ఖాళీ చేశాక ఈ భవనాలను మోదీ సర్కార్ ‘యుగే యుగేన్ భారత్ సంగ్రహాలయ’ జాతీయ మ్యూజియంగా రూపు రేఖలు మార్చేయనుంది. మ్యూజియం ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక తోడ్పాటును ఫ్రాన్స్ మ్యూజియం డెవలప్మెంట్ ఏజెన్సీ అందించనుంది. ఆ తర్వాత సాధారణ ప్రజలను సందర్శనలకు అనుమతిస్తారు. -
వ్యూహాత్మక సుస్థిరత సాధిద్దాం
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అంశాలు, యుద్ధాలు, ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, జర్మనీ ఉమ్మడిగా నినదించాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా పరస్పరం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఇరుదేశాలు ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్లు విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత సోమవారం ఢిల్లీలో ఇరుదేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. రక్షణ, వాణిజ్యం,భూ అయస్కాంత లోహాలు, సెమీకండక్టర్లు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. అంతర్జాతీయ సమస్యలకు ఉమ్మడిగా పరిష్కారాలు సూచించే స్థాయికి ద్వైపాక్షిక బంధాలను ధృడపర్చుకోవాలని నేతలు నిర్ణయించుకున్నారు. రక్షణ పారిశ్రామిక సహకారం, ఉన్నత విద్యారంగంలో మరింత మెరుగైన సహకారం సహా 19 అంశాలపై రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పూర్తిస్థాయిలో వాణిజ్యానికి బాటలుపడేలా భారత్–యూరోíపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా సాకారం చేసుకోవాలని మోదీ, మెర్జ్లు అభిలíÙంచారు. విదేశాలకు విమానాల్లో ప్రయాణించే భారతీయులు జర్మనీ మీదుగా వెళ్తున్నప్పుడు అవసరమయ్యే ట్రాన్సిట్ వీసాతో పనిలేకుండా వీసారహిత ప్రయాణాలకు అనుమతించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. దీంతో భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. పెరిగిన సహకారమే పరస్పర విశ్వాసానికి ప్రతీక సంయుక్త ప్రకటన వేళ మోదీ మాట్లాడారు. ‘‘రక్షణ, భద్రత రంగాల్లో ఏటికేడు పెరుగుతున్న సహకారమే ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం, ఐక్య దార్శనికతకు ప్రబల నిదర్శనం. వాణిజ్య ఒప్పందం సాఫీగా సాగేలా పూర్తి స్థాయి సహాయసహకారాలు అందిస్తున్న చాన్స్లర్ మెర్జ్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం బలపడేలా మార్గసూచీ కోసం కలిసి పనిచేద్దాం. దీంతో సహఅభివృద్ధి, సహ ఉత్పత్తిలో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’’అని మోదీ అన్నారు. ‘‘పారదర్శకమైన, స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నాం. సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి తీర్మానాలను గౌరవిస్తాం. నూతన ద్వైపాక్షిక ఇండో–పసిఫిక్ సంప్రదింపుల వ్యవస్థను ప్రారంభిస్తున్నాం. ఇండియా–పశి్చమాసియా–యూరప్ ఆర్థిక నడువాకు మా మద్దతు కొనసాగుతుంది’’అని ఇరునేతలు సంయుక్త ప్రకటనలో స్పష్టంచేశారు. ఇండో–పసిఫిక్ సముద్రజలాల్లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్, జర్మనీ ఈ నిర్ణయానికొచ్చాయి. నైపుణ్య కార్మికులకెంతో డిమాండ్ ఈ సందర్భంగా చాన్స్లర్ మెర్జ్ మాట్లాడారు. ‘‘ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు బలపడుతున్నాయి. భారత్ నుంచి ఏటా నైపుణ్య కార్మికులు, సహాయకులు, నర్సుల డిమాండ్ పెరుగుతోంది. భారత్లోని ఆరోగ్యసంరక్షణ వృత్తినిపుణులకు జర్మనీలో ఎంతో గిరాకీ ఉంది. అయితే సరఫరా వ్యవస్థలు, ముడి పదార్థాల తరలింపులో బడా శక్తుల జోక్యం పెరిగిపోయింది. దీనిని భారత్, జర్మనీ ఉమ్మడిగా ఎదుర్కోనున్నాయి’’అని మెర్జ్ పరోక్షంగా చైనా, అమెరికాలను విమర్శించారు. ‘‘జర్మనీ విశ్వవిద్యాలయాలకు ఇదే నా స్వాగతం. భారత్లోకి అడుగుపెట్టి మీ వర్సిటీల క్యాంపస్లను ఆరంభించండి. ప్రతిభావంతులైన భారతీయ యువత మీ జర్మనీ ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి కృషిచేస్తోంది. సమగ్ర మార్గసూచీ అనేది విద్యారంగంలో భాగస్వామ్యాన్ని సమున్నత శిఖరాలకు చేర్చుతుంది’అని మోదీ అన్నారు. -
రిస్క్ తీసుకుంటేనే ఉన్నత స్థానం: మోదీ
స్వామి వివేకానంద జీవితం ఎంతో మందికి ఆదర్శ ప్రాయమని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ యుంగ్ లీడర్స్ 2026 ముగింపు కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. యువత రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకూడదని మీ విజయం దేశాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. 2047 వికసిత్ భారత్ ప్రయాణం దేశ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. 2014లో తాను ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో అక్కడున్న వారిలో చాలామంది చిన్నపిల్లలని అక్కడి యువతనుద్దేశించి మోదీ మాట్లాడారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ సెక్టార్లో అనేక మార్పులు తెచ్చామని ఐఐటీలను కూడా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. యవత చాలా యాక్టివ్గా ఉండాలని ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ యువతకు సూచించారు. నేడు స్వామివివేకానంద జయంతి ఈ రోజును భారత్ జాతీయ యువజన దినంగా జరపుకుంటుంది. -
"భారత్ తర్వాతే మాకు ఎవరైనా": అమెరికా
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవు. ట్రంప్ పన్నుల మోతతో ఇరు దేశాల మధ్య డిస్టెన్స్ కొద్దిగా పెరిగింది. ఈ నేపథ్యంలో యూఎస్ రాయబారి సెర్గియా గోర్ కీలక ప్రకటన చేశారు. అమెరికాకు భారత్ తర్వాతే ఏదేశమైనా అని అన్నారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్ పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టాక భారత్కు అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతాయని అంతా ఆశించారు. దానికి కారణం కూడా లేకపోలేదు. భారత ప్రధాని మోదీ, ట్రంప్ మంచి స్నేహితులు కావడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగపడతాయనుకున్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం ట్రంప్ పాక్కు అనుకూలంగా వ్యాఖ్యానించడం, తనవల్లే రెండుదేశాల మధ్య యుద్ధం ఆగిందని తరుచుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని భారత్ ఖండించినా ట్రంప్ తన తీరు మార్చుకోలేదు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొంటే అధిక పన్నులు వేస్తానని బెదిరించారు. ఇలా అమెరికాతో డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్లో అమెరికా రాయబారిగా సెర్గియా గోర్ ఈ రోజు( సోమవారం) బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్రైపాక్షిక సంబంధాలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. " డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరి స్నేహం నిజమైనది. కనుక వారిమధ్య ఏవైనా విభేదాలు ఉంటే వారి పరిష్కరించుకుంటారు. అమెరికాకు భారత్ అంత కీలకమైన దేశం మరేదిలేదు. ట్రంప్ వచ్చే ఏడాది భారత్ పర్యటించే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.తాను ట్రంప్తో చివరిసారి డిన్నర్ చేసినప్పుడు ట్రంప్ తన చివరి భారత పర్యటన వివరాలను గుర్తు చేసుకున్నారని ప్రధాని మోదీతో మైత్రి అపూర్వమని ఆయన అన్నారని తెలిపారు. భారత్, అమెరికా మధ్య రెండవ దశ ట్రేడ్ డీల్స్ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. రాయబారిగా భారత్-అమెరికా మధ్య సరైన ఎజెండా రూపొందించడం రాయబారిగా తన బాధ్యతని సెర్గియా గోర్ పేర్కొన్నారు. -
పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)
-
పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో అత్యంత వైభవంగా ప్రారంభమైన అంతర్జాతీయ గాలిపటాల పండుగలో ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేడు (సోమవారం) జరిగిన ఈ వేడుకలో ఇరువురు నేతలు ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తూ, సందడి చేశారు. దేశ విదేశాల నుండి వచ్చిన గాలిపటాల ప్రేమికులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.మకర సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు అంతర్జాతీయ గాలిపటాల పండుగ జరగనుంది. దీనిలో 50 దేశాలకు చెందిన 135 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్లతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 871 మంది పాల్గొంటున్నారు. అంతకుముందు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భారత్కు చేరుకోగా, అహ్మదాబాద్లోని చారిత్రాత్మక సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోదీ ఆయనకు సాదర స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ మందిర్లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, రక్షణ తదితర కీలక రంగాలలో సహకారాన్ని పటిష్టం చేసుకోవడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా మోదీ, మెర్జ్ తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఇరు దేశాల వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమై భవిష్యత్తు భాగస్వామ్యానికి బాటలు వేయనున్నారు. గతంలో కెనడాలో జరిగిన జీ7 సమ్మిట్ వేదికగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. రక్షణ, భద్రతా రంగాల్లో ఇరు దేశాల మధ్య బంధం బలపడుతూ వస్తోంది. #WATCH | Ahmedabad, Gujarat: Prime Minister Narendra Modi and German Chancellor Friedrich Merz fly a kite at the International Kite Festival 2026 at Sabarmati Riverfront. (Source: DD News) pic.twitter.com/P7emVdTHv1— ANI (@ANI) January 12, 2026 -
ప్రపంచంలో అస్థిరత్వం.. భారత్లో స్థిరత్వం
రాజ్కోట్: ప్రపంచమంతటా అస్థిర పరిస్థితు లు, ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, భారత్ లో మాత్రం గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ స్థిరత్వం ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశంలో వ్యాపార ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయ ని పేర్కొన్నారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్లో పెట్టుబడులకు పూర్తి సానుకూల వాతావరణం ఉందన్నారు. ఆదివారం గుజరాత్లోని రాజ్కోట్లో వైబ్రాంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. భారత ఆర్థిక వ్యవస్థ నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. దేశ ప్రగతిలో గుజరాత్ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. భారత్ పట్ల ప్రపంచ దేశాలు ఆకాంక్షలు నానాటికీ పెరుగుతున్నాయని, తాజా గణాంకాలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. దేశంలో మధ్య తరగతి వర్గం వేగంగా విస్తరిస్తోందని, వారి కొనుగోలు శక్తి పెరుగుతోందని చెప్పారు. తద్వారా వ్యాపార అభివృద్ధికి అవకాశాలు సైతం అదే స్థాయిలో పెరుగుతు న్నాయని వెల్లడించారు. మొబైల్ డేటా వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. వైబ్రాంట్ గుజరాత్ సదస్సుకు దేశ విదేశీ పెట్టుబడిదారులు హాజరయ్యారు. -
నేడు మోదీ, మెర్జ్ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్లు సోమవారం గుజరాత్లో భేటీకానున్నారు. ఇందుకు గాందీనగర్లోని మహాత్మాగాంధీ మందిర్ వేదికకానుంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు మోదీ, మెర్జ్లు తొలుత అహ్మదాబాద్లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అక్కడ మహాత్మునికి నివాళులరి్పస్తారు. తర్వాత 10 గంటల సమయంలో సబర్మతీ నదీతీరంలో జరుగుతున్న ప్రఖ్యాత ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటారు. ఇరు నేతలు స్వయంగా పతంగులను ఎగరేసే అవకాశముంది. తర్వాత నేరుగా గాం«దీనగర్కు చేరుకుంటారు. అక్కడి మహాత్మామందిర్లో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కీలక అంశాలపై విస్తృతస్థాయి చర్చించనున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిపై సమీక్ష జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, నైపుణ్య శిక్షణ, రవాణా రంగాల్లో పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. రక్షణ, భద్రత, శాస్త్ర సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, పరిశోధన, హరిత ఇంధనం, సుస్థిరాభివృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాల వంటి కీలక అంశాలపైనా విస్తృతస్థాయిల చర్చ జరగనుంది. అత్యంత నమ్మకమైన నేస్తంగా జర్మనీ.. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో భారత్కు యూరప్లో అత్యంత నమ్మకమైన నేస్తంగా జర్మనీ అవతరించింది. కేవలం వాణిజ్యానికే పరిమితమైన సంబంధాలు నేడు రక్షణ, అంతరిక్షం, హరిత ఇంధనం, సాంకేతికత వంటి కీలక రంగాలకు విస్తరించి, ఇరు దేశాల మైత్రిని సరికొత్త శిఖరాలకు చేర్చాయి. 1951లో భారత్తో దౌత్య సంబంధాలు ఏర్పరుచుకున్న తొలి దేశాల్లో జర్మనీ ఒకటి. 2026 నాటికి ఈ బంధం 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో భారత్కు జర్మనీ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దీనికి నిదర్శనమే జర్మనీ నూతన ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తన తొలి ఆసియా పర్యటన కోసం భారత్ను ఎంచుకోవడం. ఇరు దేశాల మధ్య 2000వ సంవత్సరంలో కుదిరిన ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ 2025 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుని రజతోత్సవాలు జరుపుకోవడం ఈ బంధంలోని దృఢత్వాన్ని చాటిచెబుతోంది. రక్షణ రంగంలో ‘రెడ్ కార్పెట్’.. ఒకప్పుడు రక్షణ పరికరాల ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించిన జర్మనీ నేడు తన వైఖరిని పూర్తిగా మార్చుకుని భారత్కు ఈ రంగంలో ఎర్రతివాచీ పరిచి మరీ ఆహా్వనిస్తోంది. రక్షణ ఎగుమతుల నియంత్రణలను సడలించి, భారత్కు అత్యాధునిక సాంకేతికతను అందించేందుకు సిద్ధమైంది. హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న వేళ ఇండో–పసిఫిక్ ప్రాంత భద్రతలో జర్మనీ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంది. ఇటీవల జరిగిన ‘మలబార్–2025’ నావికా విన్యాసాల్లో జర్మనీ పాల్గొనడం, భారత వాయుసేన నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘తరంగ్ శక్తి–1’ విన్యాసాల్లో జర్మన్ ఎయిర్ ఫోర్స్ పాలుపంచుకుంది. రికార్డు స్థాయిలో వాణిజ్యం.. యూరోపియన్ యూనియన్లో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా జర్మనీ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో రూ.1.51 లక్షల కోట్ల(16.65 బిలియన్ డాలర్ల)కు చేరింది. భారత్లో ఇప్పటికే సీమెన్స్, ఫోక్స్ వ్యాగన్, డీహెచ్ఎల్ వంటి 2,000కు పైగా జర్మనీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. జర్మనీలో 215కు పైగా భారతీయ కంపెనీలు ఐటీ, ఆటోమొబైల్, ఫార్మా రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి.ఉన్నత విద్య కోసం జర్మనీకి ఛలో.. విద్య, పరిశోధన, ఉపాధి రంగాల్లోనూ ద్వైపాక్షిక బంధం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు విదేశీ విద్య అంటే అమెరికా, బ్రిటన్లవైపే చూసే భారతీయ విద్యార్థులు ఇప్పుడు జర్మనీకి సైతం పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ప్రస్తుతం జర్మనీలో 60 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. జర్మనీలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం. ఇరు దేశాల మధ్య కుదిరిన ‘మైగ్రేషన్ అండ్ మొబిలిటీ’ ఒప్పందం ద్వారా భారతీయ నిపుణులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు మరింత సులభతరమయ్యాయి. ఇస్రో, జర్మన్ స్పేస్ సెంటర్ (డీఎల్ఆర్) మధ్య 1974 నుంచి కొనసాగుతున్న అంతరిక్ష పరిశోధనల సహకారం నేడు మరింత విస్తృతమైంది. ఐఐటీ మద్రాస్ వంటి భారతీయ విద్యాసంస్థలు జర్మన్ వర్సిటీలతో కలిసి డ్యూయల్ డిగ్రీలను ఆఫర్ చేస్తున్నాయి. ఇలా.. సంస్కృతి నుంచి సాంకేతికత వరకు, రక్షణ నుంచి వాణిజ్యం వరకు అన్ని రంగాల్లోనూ భారత్–జర్మనీ బంధం ‘డబుల్ ఇంజిన్’ వేగంతో దూసుకెళ్తోంది. గ్రీన్ ఎనర్జీకి జర్మనీ భరోసా.. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో జర్మనీ భారత్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. 2030 నాటికి భారత్లో హరిత ఇంధన ప్రాజెక్టుల కోసం 10 బిలియన్ యూరోల ఆర్థిక సాయం అందించేందుకు జర్మనీ కట్టుబడి ఉంది. అహ్మదాబాద్, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టులతో పాటు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని గ్రీన్ ఎనర్జీ కారిడార్లు, కొచి్చలో వాటర్ మెట్రో ప్రాజెక్టుకు జర్మనీ ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తోంది. -
మన చుట్టూతా..సోమనాథ్ పునర్నిర్మాణ వ్యతిరేక శక్తులు
సోమనాథ్: వెయ్యేళ్ల సోమనాథ్ చరిత్ర విధ్వంసం, పరాజయానికి సంబంధించినది కాదని.. అది మహోన్నత పునర్నిర్మాణ, విజయం చరిత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చరిత్రాత్మక సోమనాథ్ ఆలయం విధ్వంసానికి గురైన ప్రతిసారీ మరోసారి నిర్మితం అవుతూనే ఉందని తెలిపారు. ఖడ్గం మొనతో ప్రజల హృదయాలు గెలుచుకోలేమని స్పష్టంచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ మన మధ్యనే చురుగ్గా ఉన్నాయని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా, ఐక్యంగా ఉంటూ ఆయా శక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆదివారం గుజరాత్ రాష్ట్రం గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం సమీపంలోని సర్దార్ వల్లభ్భాయి పటేల్ విగ్రహం వద్ద నివాళులరి్పంచారు. అనంతరం ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’లో పాల్గొన్నారు. తర్వాత అక్కడే ఏర్పాటుచేసిన భారీ బహిరంగ కార్యక్రమంలో వేలాది మంది భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘సోమనాథ్ మందిరంపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఈ దాడులకు విద్వేషమే ప్రేరణగా నిలిచింది. మనకు నిజాలు తెలియకుండా కుట్రలు చేశారు’’ అని గత ప్రభుత్వాలపై మోదీ మండిపడ్డారు. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకున్నవారే.. ‘‘సోమనాథ్ ఆలయంపై దాడుల వెనుక మతపరమైన విద్వేషం ఉంది. సరిగ్గా వెయ్యేళ్ల క్రితం అతిపెద్ద దాడి జరిగింది. ఇది కేవలం సంపద కోసం జరిగిన దాడి కాదు. గర్భాలయంలో సోమనాథుడి విగ్రహాన్ని ముక్కలు చేశారు. ఇంత జరిగినా కొందరు మన కళ్లుగప్పాలని చూశారు. సంపద లూటీ కోసమే దాడులు అంటూ కట్టుకథలు అల్లారు. విద్వేషం, వేధింపులు, ఉగ్రవాద చరిత్రను దాచేయాలని కుట్రలు సాగించారు. నిజంగా సొంత మతం పట్ల నిబద్ధత కలిగినవారు ఉగ్రవాద భావజాలాన్ని సహించరు. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకున్నవారే మతపరమైన ఉగ్రవాదం ఎదుట మోకరిల్లుతారు’’ అని అన్నారు. మనం మరింత శక్తివంతంగా మారాలి ‘‘మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక∙సర్దార్ వల్లభ్భాయి పటేల్ గొప్ప ప్రతిజ్ఞ చేశారు. సోమనాథ్ ఆలయాన్ని పునరి్నరి్మస్తామని చెప్పారు. కానీ, అప్పటి పాలకులు ఆయనకు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. 1951లో ఆలయ ప్రారంభోత్సవానికి తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హాజరుకాకుండా అభ్యంతరాలు వ్యక్తంచేశారు. వెళ్లొద్దని చెప్పారు. హెచ్చరికలను లెక్కచేయకుండా ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన అవే శక్తులు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. కత్తులు, కుట్రలతో కాకుండా ఇతర మార్గాల్లో మన దేశాన్ని వ్యతిరేకిస్తున్నాయి. స్వలాభం కోసం మన మధ్య చిచ్చుపెట్టి, ముక్కలుగా విభజించాలని చూస్తున్న దుష్ట శక్తులను కచి్చతంగా ఓడించాలి’’ అని అన్నారు. ‘‘గజినీ మహమ్మద్ 1026లో సోమనాథ్పై దాడి చేశాడు. ఆ తర్వాత 18వ శతాబ్దంలో ఔరంగజేబ్ పాలన దాకా ఎన్నోసార్లు విధ్వంసాలు జరిగాయి. ఈ మందిరాన్ని మసీదుగా మార్చేందుకు ప్రయత్నించారు. కానీ, విధ్వంసం జరిగిన ప్రతిసారీ శివ శక్తులు ఆలయాన్ని మళ్లీ నిర్మించుకున్నారు. వీరిలో మాల్వా రాణి అహిల్యాభాయి హోల్కర్ సైతం ఉన్నారు. విదేశీ దురాక్రమణదారులు మన దేశాన్ని కూడా ధ్వంసం చేయడానికి శతాబ్దాలపాటు ప్రయతి్నంచారు. దేశం ఏనాడూ వారి ఎదుట తలవంచలేదు. ముష్కరుల నుంచి సోమనాథ్ మందిరాన్ని కాపాడుకోవడానికి వీర్ హమీర్జీ గోహిల్, వేగ్దాజీ భిల్ వంటి ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.శౌర్య యాత్రలో మోగిన ఢమరుకం విదేశీయుల దాడుల నుంచి సోమనాథ్ ఆలయాన్ని రక్షించుకునే క్రమంలో వీరమరణం పొందిన అసంఖ్యాక యోధులను స్మరించుకుంటూ ఆదివారం సోమనాథ్ పట్టణంలో 108 అశ్వాలతో భారీ శౌర్యయాత్ర నిర్వహించారు. ర్యాలీని ప్రారంభిస్తూ ప్రధాని మోదీ సైతం ఢమరుకం మోగించి, ఢంకా బజాయించారు. వందలాది మంది భక్తులు ఢమరుకాలను మోగిస్తూ ముందునడవగా 108 మేలుజాతి అశ్వాలు ఠీవీగా నడుస్తూ వాళ్లను అనుసరించాయి. వెనకాలే ఓపెన్టాప్ వాహనంలో ప్రధాని మోదీ వెంటరాగా రిషి కుమారులు ఆయన వెంట వచ్చారు. శంఖ్ సర్కిల్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ సర్కిల్ దాకా దాదాపు కిలోమీటర్పైగా ఈ శౌర్యయాత్ర కన్నులపండువగా కొనసాగింది. ఇరువైపులా బారులు తీరిన భక్తులపై జనం పూలవర్షం కురిపించారు. యాత్ర పొడవునా శివభక్తులు, కళాకారులు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. సోమనాథ్ ఆలయం దాకా యాత్ర జరిగింది. ఆలయ చరిత్రను వివరిస్తూ సాగిన డ్రోన్ల ప్రదర్శన ఆకట్టుకుంది. సోమనాథ్ను దర్శించుకోవడం దేవుని గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నానంటూ ప్రధాని మోదీ తర్వాత ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేశారు. -
రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు: అంబానీ కీలక ప్రకటన
2026 జనవరి 11న రాజ్కోట్లో నిర్వహించిన 'వైబ్రెంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్'లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముకేశ్ అంబానీ' ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంగ్వీ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ముకేశ్ అంబానీ తన ప్రసంగంలో.. రిలయన్స్ గుజరాత్లో అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచిందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో గుజరాత్లో సంస్థ రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. మరో ఐదేళ్లలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది గుజరాత్ పాలనపై, నాయకత్వంపై, అభివృద్ధి సామర్థ్యంపై రిలయన్స్కు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు.ఈ భారీ పెట్టుబడులు కేవలం ఆర్థిక లాభాల కోసమే కాకుండా.. గుజరాత్ ప్రజలు & భారతీయుల కోసం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అంబానీ వివరించారు. పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. క్లీన్ ఎనర్జీ & గ్రీన్ మెటీరియల్స్లో భారతదేశాన్ని ప్రపంచానికి నాయకత్వం వహించేలా చేయడం రిలయన్స్ అన్నారు.Address by RIL CMD Shri Mukesh D. Ambani at the Vibrant Gujarat Regional Conferences - Kutch & Saurashtra Region pic.twitter.com/21DsQ6Ueuy— Reliance Industries Limited (@RIL_Updates) January 11, 2026 -
సోమ్నాథ్లో ప్రధాని నరేంద్ర మోదీ శౌర్య యాత్ర
-
108 అశ్వాలతో ప్రధాని మోదీ శౌర్య యాత్ర
గాంధీనగర్: గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తన రెండో రోజు పర్యటనను ఆదివారం ప్రారంభించారు. ఆధ్యాత్మికత, దేశభక్తి మేళవింపుతో ఇది మొదలయ్యింది. ఉదయం 9:45 గంటలకు సోమనాథ్లో నిర్వహించిన భారీ ‘శౌర్య యాత్ర’లో ఆయన పాల్గొన్నారు. 108 అశ్వాలతో సాగిన ఈ ప్రదర్శన సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరిస్తూ ముందుకు సాగింది. VIDEO | Gujarat: During his Shaurya Yatra in Somnath, Prime Minister Narendra Modi (@narendramodi) bowed before and paid floral tributes to those who sacrificed their lives protecting Somnath.#Somnath #ShauryaYatra #PMModi(Source - Third party)(Full VIDEO available on… pic.twitter.com/NbOMt7ySnCVIDEO | Gujarat: During his Shaurya Yatra in Somnath, Prime Minister Narendra Modi (@narendramodi) bowed before and paid floral tributes to those who sacrificed their lives protecting Somnath.#Somnath #ShauryaYatra #PMModi(Source - Third party)(Full VIDEO available on… pic.twitter.com/NbOMt7ySnC— Press Trust of India (@PTI_News) January 11, 2026— Press Trust of India (@PTI_News) January 11, 2026 ‘శౌర్య యాత్ర’లో పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా వేలాది మంది భక్తులు జైజై నినాదాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తదితరులు పాల్గొన్నారు. ఆలయ పునర్వైభవానికి ప్రతీకగా నిర్వహించిన స్వాభిమాన్ పర్వ్ శౌర్య యాత్ర అనంతరం ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెయ్యేళ్ల క్రితం (క్రీ.శ. 1026లో) జరిగిన దాడులను తట్టుకొని నిలబడిన ఈ పుణ్యక్షేత్రం భారత నాగరికతకు, పట్టుదలకు నిదర్శనమని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు శనివారం సాయంత్రం ఆయన శ్రీ సోమనాథ్ ట్రస్ట్ సమావేశంలో పాల్గొని, భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. సోమనాథ్లో నిర్వహించే కార్యక్రమాల అనంతరం ప్రధాని రాజ్ కోట్ చేరుకోనున్నారు. అక్కడ మధ్యాహ్నం 1:30 గంటలకు పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభించనున్నారు. అనంతరం మార్వాడీ యూనివర్సిటీలో ప్రాంతీయ వైబ్రెంట్ గుజరాత్ సదస్సును ప్రారంభించి, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. -
3వేల మంది యంగ్ లీడర్స్తో రేపు ప్రధాని ముఖాముఖి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన 3 వేల మందికిపైగా యువజనులతో ముఖాముఖి సమావేశం జరపనున్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే వికసిత్ భారత్(వీబీ)–యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం జరగనుంది. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి కూడా పలువురు పాల్గొంటున్నారని ప్రధాని కార్యాలయం(పీఎంవో) శనివారం తెలిపింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా 12న జరిగే కార్యక్రమంలో ఎంపికైన యువ నేతలు 10 విభిన్న ఇతివృత్తాలకు సంబంధించిన తమ తుది ప్రజెంటేషన్లను ప్రధాని మోదీకి సమరి్పస్తారు. దేశాభివృద్ధికి సంబంధించి యువత దృక్పథం, వారి వినూత్న ఆలోచనలు, అమలు చేయదగ్గ ప్రణాళికలను నేరుగా ప్రధానితో పంచుకుంటారు. అనంతరం ప్రధాని ’వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ –2026’ వ్యాస సంకలనాన్ని విడుదల చేస్తారు. -
పావుగంటలో పట్టుకొచ్చారు.. థాంక్యూ సార్
లఖీంపూర్ ఖేరీ(యూపీ): గతంతో పోలిస్తే నేడు ఆన్లైన్ బుకింగ్ వంటి సౌకర్యాలకారణంగా వంటగ్యాస్ సిలిండర్ను కేవలం 15 నిమిషా ల్లోనే ఇంటి వద్ద డెలివరీ తీసుకోగలిగానని ప్రధాని మోదీకి ఒక గృహిణి తన అమితానందాన్ని ఒక లేఖ ద్వారా వ్యక్తంచేశారు. ఈ వివరాలను శనివారం ప్రధాని మోదీ స్వయంగా అందరితో పంచుకున్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఘటన తాలూకు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఉత్తర ప్రదే శ్లోని లఖీంపూర్ పట్టణానికి చెందిన అరుణశ్రీ డాన్ బాస్కో స్కూల్లో ఉపాధ్యాయురాలు. గత ఏడాది డిసెంబర్లో ఎల్పీజీ సిలిండర్ను బుక్ చేయగా కేవలం 15 నిమిషాల్లో డెలివరీ బాయ్ సిలిండర్ను ఇంటి వద్దకు పట్టుకొచ్చాడు. ఆశ్చర్యపోయిన ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘‘ ఆనందం, ఉద్వేగంతో ప్రధానికి లేఖ రాశా. జీవితాలను ఇంత సులభతరంగా మార్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపా. నా చిన్నతనంలో ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలన్నా, సిలిండర్ మార్చుకోవాలన్నా ఎంతో ప్రయాసతో కూడిన వ్యవహారం. ఆకాలం పోయి ఒక్క ఫోన్కాల్తో సిలిండర్ ఇంటి వద్దే ప్రత్యక్షమవుతోంది. ఈ ఘనత ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వానిదే’’ అని ఆమె అన్నారు. లేఖపై మోదీ స్పందించారు. మహిళా సాధికారత కోసం తామెన్నో కేంద్ర పథకాలను అమలుచేస్తున్నామని మోదీ గుర్తుచేశారు. -
నాగరికతకు నిలువెత్తు నిదర్శనం
వెరావల్(గుజరాత్): గతంలో విదేశీ రాజుల దండయాత్రల్లో పలుమార్లు ధ్వంసమైనాసరే తెగించి నిలబడిన భారతదేశ నాగరికతకు సోమనాథ్ ఆలయం నిదర్శనమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మూడ్రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఛైర్మన్ హోదాలో ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోదీ తన సామాజిక మాధ్య ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ నాగరికత, తెగువకు నిదర్శనంగా భాసిల్లుతున్న సోమనా థ్ ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగా నాకు దక్కిన భాగ్యం. 1026లో తొలిదాడి మొ దలు శతాబ్దాల కాలంలో ఎన్నో సార్లు విదేశీ రాజుల దాడులకు గురైనా సరే చెక్కుచెదరక భారతీయ నాగరికతా తెగువ నిదర్శనంగా నిలబడింది. ఇంతటి గొప్ప ఆలయంలోకి నాకు సాదర స్వాగతం పలికిన స్థానికులకు నా కృతజ్ఞతలు’’ అని మోదీ అన్నారు. సోమనాథ్ ఆలయం తొలిసారిగా మొహమ్మద్ గజనీ సారథ్యంలో 1026 ఏడాదిలో దాడికి గురై 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ సోమ నాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ హోదాలో సర్క్యూ ట్ హౌస్లో బోర్డ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, డెప్యూ సీఎం హర్‡్ష సంఘ్వీ, ఇతర ట్రస్టీలు, అధికారులు పాల్గొన్నా రు. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కల్గకు ండా ఏర్పాట్లుచేయాలని అధికారులకు సూచి ంచారు. ఆలయ ప్రాంగణంలో మరమ్మతుల, ఆధునీకరణ, మౌలకవసతుల మెరుగు తదితర పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. #WATCH | Gujarat | Fireworks illuminate the night sky above Somnath Temple as the 72-hour 'Aum' chanting continues in the background during the ongoing Somnath Swabhiman Parv.Source: DD pic.twitter.com/bOkFqu5hbG— ANI (@ANI) January 10, 2026ఆకట్టుకున్న డ్రోన్ షో...తర్వాత సాయంత్రం ఆలయం ప్రాంగణంలో ఓంకార మంత్రాన్ని పఠించే కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత రాత్రి చిమ్మచీకట్లో అరేబియా సముద్రంపై వినువీధిలో 3,000 చిన్నపాటి డ్రోన్లతో ఏర్పాటుచేసిన షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌర మండలం, సోమనాథ్ ఆలయం, భారీ శివలింగం, త్రిశూలం, ఢమరుకం ఆకృతుల్లో డ్రోన్లు ఎగిరి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. స్వాభిమాన్ పర్వ్ ఆదివారందాకా కొనసాగనుంది. ఆదివారం ఉదయాన్నే ఇక్కడ జరిగే శౌర్యయాత్రలో మోదీ పాల్గొంటారు. సోమనాథ్ ఆలయాన్ని కాపాడే క్రమంలో వీరమరణం పొందిన వాళ్లకు మోదీ నివాళులర్పిస్తారు. వీరుల త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ర్యాలీ చేపట్టనున్నారు. పలు కార్యక్రమాలతో మోదీ బిజీ..తర్వాత మోదీ ఒక ప్రజాకార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మోదీ రాజ్కోట్కు వెళ్తారు. అక్కడ కఛ్, సౌరాష్ట్ర ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫెరెన్స్ సదస్సులో ప్రసంగిస్తారు. తర్వాత అక్కడి పారిశ్రామిక ఉత్పత్తుల వస్తు ప్రదర్శనశాలను ఆవిష్కరి స్తారు. తర్వాత గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ ప్రాంగణంలో 14 గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ ఎస్టేట్లు, వైద్య ఉపకరణాల పార్క్ అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తర్వాత సాయంత్రం అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడ సెక్టార్ 10ఏ నుంచి మహాత్మా మందిర్ వరకు నిర్మించిన అహ్మదాబాద్ మెట్రో ఫేస్2ను ప్రారంభిస్తారు.#WATCH | Gujarat | PM Narendra Modi, Gujarat CM Bhupendra Patel, and Dy CM Harsh Sanghavi attend the drone show being organised as part of the Somnath Swabhiman Parv at the Somnath Temple.Source: DD pic.twitter.com/aCmBiqEcBB— ANI (@ANI) January 10, 2026 -
మాట్లాడితేనే ట్రేడ్ డీల్!
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య అత్యంత కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఎటూ తేలడం లేదు. ఇరుపక్షాలు తరచుగా సమావేశమై చర్చిస్తున్నా అడుగు ముందుకు పడట్లేదు. కొన్ని ముఖ్యమైన అంశాలపై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నా భారత్ ఒప్పుకోకపోవడంతో చర్చలు అసంపూర్తిగానే ముగుస్తున్నాయి. ఒప్పందం వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఇరుదేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదరకపోవడం వెనుక గల అసలు కారణాన్ని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ బయటపెట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడకపోవడం వల్లనే ఒప్పందం కుదరడం లేదని తేల్చిచెప్పారు. లుట్నిక్ గురువారం ‘ఆల్–ఇన్ పాడ్కాస్ట్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ నేరుగా ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడితే ఒప్పందం త్వరగా కుదురుతుందని, ఆ అవకాశం ఇప్పటికీ ఉందని స్పష్టంచేశారు. ‘‘ఇండియా గురించి మీకొక సంగతి చెప్పాలి. మేము మొదట యూకేతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. రెండు శుక్రవారాల్లోగా తుది నిర్ణయానికి రావాలని సూచించగా, యూకే అందుకు అంగీకరించింది. ఎందుకంటే గడువు దాటితే స్టేషన్ను వదిలేసి రైలు మరో దేశానికి వెళ్లిపోతుందని చెప్పాం. అనుకున్నట్లుగానే గడువులోగా యూకేతో ఒప్పందం కుదిరింది. బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్.. ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత డీల్ పట్టాలకెక్కింది. మా అధ్యక్షుడు ట్రంప్ నిచ్చెన మెట్ల తరహాలో ఒక దేశం తర్వాత మరో దేశంతో ఒప్పందానికి వస్తున్నారు. తొలుత వచ్చినవారికే తొలి ప్రాధాన్యత దక్కుతుంది. అందరికంటే ముందు వచ్చినవారితోనే గొప్ప డీల్ కుదురుతుంది. రెండో మెట్టుపై ఉంటే బెస్టు డీల్ ఉండదు. యూకే తర్వాత ఒప్పందం ఎవరితో ఉంటుందని ట్రంప్ను చాలామంది అడిగారు. ఆయన కొన్ని పేర్లు చెప్పారు. ఇండియా పేరును రెండుసార్లు బహిరంగంగా ప్రస్తావించారు. అనంతరం మేము ఇండియా ప్రతినిధులతో మాట్లాడాం. మీకు మూడు శుక్రవారాల దాకా గడువు ఉందని చెప్పాం. గడువులోగా ఏదో ఒకటి తేల్చాల్సిన బాధ్యత ఇండియాపైనే ఉండగా, వారు స్పందించలేదు. ట్రేడ్ డీల్పై చాలాదేశాలతో నేను ప్రత్యక్షంగా చర్చించా. కానీ, ఇది అచ్చంగా ట్రంప్ డీల్. నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే కదా! అందుకే ట్రంప్తో నేరుగా మాట్లాడాలని ఇండియా ప్రతినిధులకు సూచించా. మోదీతో మాట్లాడించాలని చెప్పా. ఎందుకో తెలియదుగానీ ఈ విషయంలో భారత్ చాలా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించింది. ట్రంప్తో మోదీ మాట్లాడలేదు. మూడు శుక్రవారాలు ముగిశాక ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలను ప్రకటించాం’’ అని లుట్నిక్ తెలియజేశారు. భారత్ ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తోంది ‘‘ఇతర దేశాల కంటే ముందే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరుతుందని మేము భావించాం. అలా జరగకపోవడంతో ఇంతకముందు అంగీకరించిన ఒప్పందాన్ని వెనక్కి తీసుకున్నాం. దానిపై ఇప్పుడు ఆలోచించడం లేదు. మరోవైపు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. డీల్కు సిద్ధంగా ఉన్నట్లు భారత్ మాకు తెలియజేసింది. మూడు వారాల క్రితమే వెళ్లిపోయిన రైలు కోసం ఎదురు చూస్తారా? అని భారత్ను ప్రశ్నించా. కొన్నిసార్లు డోలాయమాన పరిస్థితి ఉండొచ్చు. ఊగుడు బల్లపై భారత్ ఇప్పుడు రాంగ్సైడ్లో ఉంది. ఇతర దేశాలు మాతో ఇప్పందాలకు ముందుకొస్తున్నాయి. త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత్ ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. యూకే తర్వాత ఇండియాతోనే ఒప్పందం చేసుకోవాలని నేను ఆశించా. ఆ దిశగానే చర్చలు నిర్వహించా. త్వరలోనే భారత్ నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసం ఉంది. ప్రతి దేశానికీ అంతర్గతంగా ప్రతికూల రాజకీయ పరిస్థితులు ఉంటాయి. వాటిని అధిగమించాల్సి ఉంటుంది. విదేశాలతో ఒప్పందాలకు పార్లమెంట్ ఆమోదం పొందడం సంక్లిష్టమైన విషయం’’ అని లుట్నిక్ తేల్చిచెప్పారు. అది నిజం కాదు: భారత్ ట్రంప్తో మోదీ మాట్లాడకపోవడంతోనే వాణిజ్య ఒప్పందం కుదరలేదంటూ అమెరికా మంత్రి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం ఖండించారు. రెండు దేశాలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై భారత్ ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. 2025లో మోదీ, ట్రంప్ ఎనిమిదిసార్లు మాట్లాడుకున్నారని, వేర్వేరు కీలక అంశాలపై చర్చించుకున్నారని గుర్తుచేశారు. ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్తో మోదీ మాట్లాడలేదనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. పలు సందర్భాల్లో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చినట్లు రణ«దీర్ జైస్వాల్ తెలిపారు. ట్రేడ్ డీల్ త్వరలో కుదురుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
అమెరికా ఆరోపణలకు భారత్ కౌంటర్
ఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా, భారత్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. భారత్-అమెరికా వాణిజ్య చర్చల వేళ అగ్రరాజ్య వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ప్రధాని మోదీ గతేదాడి.. అధ్యక్షుడు ట్రంప్నకు ఎనిమిది సార్లు ఫోన్లు చేశారని గుర్తు చేశారు.డొనాల్డ్ ట్రంప్ 500 శాతం టారిఫ్ల బిల్లుపై భారత్ స్పందించింది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..‘ప్రతిపాదిత బిల్లు గురించి మా దృష్టికి వచ్చింది. బిల్లుకు సంబంధించిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. దేశీయ ఇంధన అవసరాలకు అనుగుణంగా భారత ఆయిల్ కొనుగోళ్లు ఉంటాయి. ఈ బిల్లు విషయమై ప్రధాని మోదీ.. ఇప్పటికే ట్రంప్తో ఎనిమిది సార్లు ఫోన్లో మాట్లాడారు. గతేడాది ఫిబ్రవరి 13 నాటికే భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడానికి కట్టుబడి ఉన్నాయి. ఇప్పటికే పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందానికి రావడానికి ఇరుపక్షాలు అనేక రౌండ్ల చర్చలు జరిపాయి. చాలా సందర్భాలలో మేము ఒక ఒప్పందానికి దగ్గరగా వచ్చాము’ అని తెలిపారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్.. భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని వెల్లడించారు. ఇది ఆయన (ట్రంప్) ఒప్పందం. దానికి ముగింపు రావాలంటే.. ట్రంప్నకు మోదీ కాల్ చేయాల్సి ఉంది. అయితే ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదు. మోదీ చివరకు ఫోన్ చేయలేదు.మేము ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. భారత్తో వాటికంటే ముందే ఒప్పందం జరుగుతుందని ఊహించాం. అలా జరగకపోవడంతో ఇంతకుముందు అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుంది. దానిపై ఇప్పుడు మేం ఆలోచించడం లేదు. బ్రిటన్తో వాణిజ్య ఒప్పంద చర్చలు కొలిక్కి వస్తోన్న సమయంలో ఆ దేశ ప్రధాని కీర్స్టార్మర్ ట్రంప్నకు కాల్ చేశారు (Donald Trump). ఆ రోజే డీల్ ముగింపునకు వచ్చింది. తర్వాతి రోజు మీడియా సమావేశంలో దాని గురించి ఇరువురు నేతలు ప్రకటించారు’’ అంటూ భారత్, బ్రిటన్ మధ్య పోలిక తెచ్చారు. మోదీ ఫోన్ చేయడానికి నిరాకరించినప్పటికీ.. ఇంకా ఫోన్ చేయడానికి అవకాశం ఉందని లుట్నిక్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.అయితే, ఒకవైపు ట్రేడ్ డీల్ చర్చలు జరుపుతూనే.. భారత్పై అమెరికా సుంకాలు విధించింది. తాజాగా అలాంటి బెదిరింపులకే పాల్పడింది. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై మరింత కక్ష సాధించేలా 500 శాతం సుంకాలు విధించే బిల్లును తేవడానికి ట్రంప్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. -
మోదీ ఫోన్ చేయలేదని.. ట్రంప్ సుంకాల ఆంక్షలు!
భారతపై 500 శాతం సుంకాలకు రెఢీ అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు మరోసారి బయటపడింది. ఇప్పటికే వరస సుంకాలతో భారత్న ఇరకాటంలో పెట్టడానికి యత్నించిన ట్రంప్.. త్వరలో 500 శాతం సుంకాల భారాన్ని వేసే దిశగా పావులు కదుపుతున్నాడు. అయితే దీనిపై ట్రంప్కు అత్యంత సన్నిహితుడు , అమెరికా వాణిజ్య కార్యదర్శి లట్నిక్ తొలిసారి పెదవి విప్పారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. అమెరికాతో భారత్ బంధం ఈ రకంగా మారడానికి గల కారణాలు వెల్లడించారు. ‘యూఎస్తో వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత ప్రధాని మోదీ ఎటువంటి ఫోన్ చేయలేదు. ట్రంప్కు ఫోన్ చేసి వాణిజ్య ఒప్పందం గురించి మోదీ ఏమీ మాట్లాడలేదు. భారత్-అమెరికాల వాణిజ్య ఒప్పందానికి తానొ డీల్ను సిద్ధం చేశాను. అయితే అది తుదిరూపం దాల్చలేదు. ఎందుకంటే భారత్ ప్రధాని మోదీ నుంచి మాకు ఎటువంటి ఫోన్ రాలేదు’ అందుకే సుంకాలన అత్యధికంగా విధించాలని ట్రంప్ సిద్ధమయ్యారు అని వెల్లడించారు. ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో వచ్చే వారం అనేక వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. కానీ భారత్తో ఒప్పందం వాటి కంటే ముందే పూర్తవ్వాల్సింది.ఇతర దేశాల కంటే ముందే భారత్తొ ఒప్పందం పూర్తవ్వాల్సింది. నేను వారితో ఎక్కువ శాతం చర్చలు జరిపాను’ అని లట్నిక్ తెలిపారు.BIG BREAKING: India trade deal isn't done because PM Modi did not call Trump, claims US Commerce Secretary Lutnick"I set the deal up. But you had to have Modi call President Trump. They (India) were uncomfortable with it. So Modi didn't call." pic.twitter.com/gFiUGGaJRl— Shashank Mattoo (@MattooShashank) January 9, 2026 కాగా, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబు సిద్ధం చేశారు. అమెరికా హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఏకంగా 500% టారిఫ్లు విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రష్యా నుంచి చమురు ఎవరూ కొనకుండా ఆంక్షలు విధించబోతున్నారు. ఆంక్షలను ఉల్లంఘించే దేశాలపై సుంకాల మోత మోగనుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లుపై అమెరికా కాంగ్రెస్లో త్వరలోనే ఓటింగ్ జరగనుంది. అక్కడ ఆమోదం పొందితే భారత్, చైనా ఉత్పత్తులపై 500 శాతం సుంకాలు విధించే అధికారం ట్రంప్కు లభిస్తుంది. -
సమాజ పురోగతికి కృత్రిమ మేధ
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలు భారత్ను ఎంతగానో విశ్వసిస్తున్నాయని, అదే మన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన స్వదేశీ కృత్రిమ మేధ(ఏఐ) మోడల్స్ విశిష్టంగా ఉండాలని చెప్పారు. సమాజ పురోగతి కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలని స్పష్టంచేశారు. డేటా గోప్యత సూత్రాలను పాటిస్తూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేసే ఏఐ మోడల్స్ రూపొందించాలని సూచించారు. అదేసమయంలో నైతికతను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్థానిక, స్వదేశీ కంటెంట్కు విశేషమైన ప్రాచుర్యం కలి్పంచాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలను పరిపుష్టం చేయడానికి ఏఐ అనేది చక్కటి వేదిక అని ఉద్ఘాటించారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు–2026’త్వరలో జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం ఇండియన్ ఏఐ స్టార్టప్ల రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగాలని, ఆ దిశగా ఇప్పటినుంచే అంకితభావంతో కృషి చేయాలని స్టార్టప్లకు పిలుపునిచ్చారు. చౌకైన, సమగ్రమైన ఏఐ సాంకేతికతలను అభివృద్ధి చేయాలన్నారు. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. భారతదేశ భవిష్యత్తుకు స్టార్టప్లు, ఏఐ ఔత్సాహికులే సహ రూపకర్తలు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సును వచ్చే నెలలో నిర్వహించబోతున్నామని, దీనిద్వారా టెక్నాలజీ రంగంలో మన ప్రాధాన్యం మరింత పెరుగుతుందని స్పష్టంచేశారు. అవతార్, భారత్జెన్, ఫ్రాక్టల్, గాన్, గెన్లూప్, జ్ఞాని, ఇంటెల్లిహెల్త్, సర్వం, శోధ్ ఏఐ, సాకేత్ఏఐ, టెక్ మహీంద్ర తదితర సంస్థలు, స్టార్టప్ల సీఈఓలు, ప్రతినిధులు ఈ రౌండ్టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. స్టార్టప్ల పనితీరు అద్భుతం యువతీ యువకులతో కృత్రిమ మేధ గురించి విస్తృతంగా చర్చించానంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇదొక మర్చిపోలేని భేటీ అని ఉద్ఘాటించారు. ఏఐ ప్రపంచంలో వస్తున్న మార్పులు, అందులో భారత్ పాత్ర గురించి అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఈ–కామర్స్, మార్కెటింగ్, ఇంజనీరింగ్ స్టిమ్యులేషన్స్, మెటీరియల్ రీసెర్చ్, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధన వంటి వేర్వేరు రంగాల్లో మన స్టార్టప్లు అద్భుతంగా పని చేస్తున్నాయని ప్రశంసించారు. చుట్టూ ఉన్న సమాజంలో సానుకూల మార్పుల కోసం ఏఐని ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించామని వివరించారు. కృత్రిమ మేధ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న వారిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గుర్తుచేశారు. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్’స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. -
బెంగాల్లో ఈడీ సోదాలు.. మమతకు కొత్త టెన్షన్?
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎంట్రీతో రాజకీయగా ఒక్కసారిగా వేడెక్కింది. బెంగాల్లో రాజకీయ కన్సల్టెన్సీ ఐప్యాక్పై ఈడీ దాడులు చేపట్టింది. ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం సహా ఐప్యాక్కు సంబంధించిన పలు ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్టు ఈడీ తెలిపింది. మరోవైపు.. ఈడీ దాడులపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.బెంగాల్లో ఈడీ దాడులపై తాజాగా మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ దయచేసి క్షమించండి. మీ హోంమంత్రి అమిత్ షాను నియంత్రించండి. రాజకీయంగా మీరు మాతో(టీఎంసీ) పోరాడండి. అలా పోరాడలేకపోతే బెంగాల్కు ఎందుకు వస్తున్నారు?. ప్రజాస్వామ్య పద్ధతిలో మమ్మల్ని ఓడించండి. మీరు మా పత్రాలను, మా వ్యూహాన్ని, మా ఓటర్లను, మా డేటాను, మా బెంగాల్ను దోచుకోవడానికి ఏజెన్సీలను వాడుకుంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల, మీకు వచ్చే సీట్ల సంఖ్య సున్నాకు తగ్గిపోతుంది. దాడులతో మీరు చేసేది ఏమీ లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.#WATCH | Kolkata | On the ED raids at the IPAC office in Kolkata, West Bengal CM Mamata Banerjee says, "I am sorry Mr. Prime Minister, please control your Home Minister... If you (BJP) cannot fight with us, then why are you coming to Bengal? Defeat us in a democratic way. You are… pic.twitter.com/SKL7DNxeAc— ANI (@ANI) January 8, 2026మరోవైపు.. ఈడీ అధికారులు ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో తనిఖీలు చేస్తుండగా మమతా బెనర్జీ, కోల్కతా పోలీసు కమిషనర్ మనోజ్ వర్మ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఈ సోదాలు రాజ్యాంగవిరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘మా పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్డిస్క్ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు’’ అని బెంగాల్ సీఎం ఆరోపించారు.అలాగే, ఈడీ ఫోరెన్సిక్ బృందం మాకు సంబంధించిన కొంత డేటాను బదిలీ చేశారని నేను విన్నాను. వారు మా హార్డ్ డిస్క్, మా ఫైనాన్షియల్ పత్రాలు, రాజకీయ పత్రాలు తీసుకున్నారు. బీజేపీకి లక్షల కోట్ల ఆస్తి ఉంది. కానీ, సీబీఐ, ఈడీ వారిని ఎవరినీ పట్టుకోలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. #WATCH | Kolkata | On the ED raids at the IPAC office in Kolkata, West Bengal CM Mamata Banerjee says, "... I heard that ED's Forensic Team had come and they transferred some data. They took our hard disk, our financial papers, political papers... BJP has lakhs and crores of… pic.twitter.com/g66y7sedh1— ANI (@ANI) January 8, 2026కాగా, ఈడీ సోదాలు మనీలాండరింగ్ కేసు సంబంధించనట్టు అధికారులు చెబుతున్నారు. నేరానికి సంబంధించిన డబ్బు.. ఐ-ప్యాక్కు చేరినట్లు గుర్తించారని ఈడీ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఇదిలా ఉండగా.. మమత వద్ద కనిపించిన ఫైల్స్లో ఏమున్నాయో పెద్దగా తెలియకపోయినప్పటికీ ఫొటోలలో ఒక ఫైల్పై ‘ఫిబ్రవరి 2022’ అని గుర్తించి ఉంది. మరొక ఫైల్లో తృణమూల్ నాయకుల ప్రయాణ రికార్డులను వివరించే పత్రాల కట్ట ఉంది. అటువంటి ఒక పత్రంలో "మహువా మోయిత్రా x 1", ఫిబ్రవరి 2, 2022 ప్రయాణ తేదీ ప్రస్తావించబడింది. మోయిత్రా కృష్ణానగర్ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇక, ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడైన ప్రతీక్ జైన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి హెడ్గానూ వ్యవహరిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి టీఎంసీతో కలిసి ఐప్యాక్ పనిచేస్తోంది. అయితే, మరికొన్ని నెలల్లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. -
వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: అధికారం ఉంది కదా అని మోదీ సర్కార్ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని.. పేదలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం మార్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా.. గురువారం గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. .. బ్రిటీష్ పాలన తరహాలో మోదీ పాలన ఉంది. ఎన్డీయే కూటమికి అనుకున్నంత మెజారిటీ రాకపోవడంతో రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు. అందుకే వేరే రూపంలో హక్కులను కాలరాస్తున్నారు. ఓటు హక్కు తీసేసే కుట్రలో భాగంగా ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. కోట్లాది మంది పేదలను దేశ పౌరులే కాదని చూపించేందుకు కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతోంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతోందిఉపాధి హామీ పథకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. భూమిలేని పేదలకు ఆహార భద్రత కల్పించేందుకే కాంగ్రెస్ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం వల్ల గ్రామాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. వలసలు ఆగిపోయాయి.. వెట్టిచాకిరీ ఆగింది. దేశంలో 80 శాతం ప్రజలు ఈ పథకం ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పథకాన్ని మార్చి పేదలకు అన్యాయం చేస్తున్నారు. పేదలపై కక్ష పూరితంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అదానీ, అంబానీలకు తక్కువ ధరకు కూలీలు దొరకడం లేదని పథకాన్ని మారుస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే ఇలా చేస్తున్నారు. గతంలో వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. ఆ నల్ల చట్టాలను ఉపసంహరించుకునేలా చేయడమే కాకుండా మోదీతో జాతికి క్షమాపణ చెప్పించింది కాంగ్రెస్. ఇప్పుడు అదే పని చేయబోతున్నాం. మోదీ క్షమాపణలు చెప్పేంత వరకు వదిలేది లేదు. ఉపాధి హామీ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఈ నెల 20 నుంచి గ్రామ సభలు నిర్వహిద్దాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నేను కూడా ఓ మండలం బాధ్యత తీసుకుంటా. అన్ని మండలాలకు ఒక్కొకకకరు బాధ్యత తీసుకోవాలి. ఫిబ్రవరి 3 నుంచి అన్ని జిల్లాల్లో రోజుకు లక్ష మందితో సభ పెడదాం. హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో సభలు పెడతాం. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేంత వరకు మోదీ సర్కార్పై యుద్ధం ఆగదు.. బీఆర్ఎస్ను వరుసగా అన్ని ఎన్నికల్లో ఓడించాం. మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలిచి తీరతాం. బీఆర్ఎస్, బీజేపీలకు రాజకీయాలే తప్ప ప్రజాసమస్యలు పట్టడం లేదు. వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నారు అని రేవంత్ అన్నారు. -
ఆ చర్చల వెనుక అంతరార్థం ఏమిటి?
కొన్ని రోజుల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘జపం’ చేస్తున్నారు. మోదీ మంచి వ్యక్తి అని అంటూనే భారత్ తనను సంతృప్తి పరచడానికి యత్నిస్తుందని తనలోని అసంతృప్తి ఇంకా మిగిలే ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ట్రంప్ను ఇంకా ఇంకా భారత్ సంతోష పెట్టాల్సిన విషయం ఏమైనా ఉందంటే అది.. రష్యా చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయడమే. రష్యాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ చమురు కొనుగోలు చేస్తుంది.. ఇప్పడు ట్రంప్ను సంతోష పరచడానికి ఆ కొనుగోలును ఎలా నిలిపివేస్తందనేది సామాన్యుడికి మెదిలే ప్రశ్న. ట్రంప్ మాటే నెతన్యాహూకు శిరోధార్యంఇదిలా ఉంచితే, నిన్న(బుధవారం, జనవరి 7 వ తేదీ) ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. వారిద్దరూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇరుదేశాల ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గాజా శాంతి ప్రణాళిక అమలు గురించి మోదీకి నెతన్యాహు సవివరంగా తెలియజేశారు. ఇదంతా ఒకటైతే.. ఇక్కడ మరొక విషయం చర్చకు దారి తీసింది. అదే ట్రంప్ వ్యూహం. నెతన్యాహూ.. ట్రంప్కు అత్యంత సన్నిహితుడు. ట్రంప్ ఏం చెబితే అది నెతన్యాహూకు శిరోధార్యం. అది ఇరాన్తోయుద్ధంతో రుజువైంది. ఇరాన్తో యుద్ధం చేయమంటే చేశారు.. ఆపేయమంటే ఆపేశారు నెతన్యాహూ.ట్రంప్తో భేటీ తర్వాత వార్నింగ్ల పరంపరంఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు నెతన్యాహూ. ట్రంప్తో కలవడానికి వెళ్లే ముందు ఇజ్రాయిల్ ఆర్మీకి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సైనిక చర్యలొద్దు అంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. ట్రంప్ను కలిసొచ్చిన తర్వాత చూద్దాం అని కూడా చెప్పారు. ఆ తరువాత అంటే ట్రంప్తో భేటీ ముగించుకుని ఇజ్రాయిల్కు వచ్చిన గంటల వ్యవధిలోనే లెబనాన్పై దాడులు చేసింది ఇజ్రాయిల్ వైమానిక దళం. దక్షిణ లెబనాన్లోని కొన్ని స్థావరాలపై దాడులు చేశారు. అక్కడ హెజ్బుల్లా ఆనవాళ్ల ఉన్నాయని అందుకే అక్కడ దాడులు చేశామని పేర్కొన్నాయి. ఇరుదేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ దాడులకు పాల్పడ్డాయి. దీనిపై లెబనాన్ తీవ్రంగా మండిపడింది. ఇజ్రాయిల్ దుశ్చర్యకు తెరలేపిందంటూ ధ్వజమెత్తింది.ఇదిలా ఉంచితే,. ట్రంప్తో భేటీ తర్వాత ఇరాన్ను పరోక్షంగా హెచ్చరించింది ఇజ్రాయిల్. వెనెజువెలాలో ఏం జరిగిందో చూశారుగా అంటూ ఇరాన్ను హెచ్చరించింది. మీరు దారికి రాకపోతే వెనెజువెలాలో ఏం జరిగిందో అదే జరుగుతుంది అని ఇజ్రాయిల్ నేత ఒకరు వ్యాఖ్యానింఆరు. ఇదంతా అమెరికా అండగా చూసుకునే ఇజ్రాయిల్ ఇలా చేస్తుందనేది కాదనలేని సత్యం. మోదీకి నెతన్యాహూ ఫోన్.. దేనికి సంకేతం?మోదీకి సైతం నెతన్యాహూ ఫోన్ చేసి మాట్లాడారు. ద్వైపాక్షిక అంశాల గురించి, గాజాలో శాంతి గురించి, ఉగ్రవాదంపై పోరు గురించి మోదీతో నెతన్యాహూ ఫోన్లో చర్చించారనేది ప్రధాన సారాంశం. ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చ జరిగినా దేశ భవిష్యత్కు సంబంధించి కార్యాచరణ చర్చలే ఉంటాయి. ఇక్కడ కూడా అదే అనుకోవచ్చు. కానీ కొన్ని రోజులుగా భారత్, మోదీ అంటూ ప్రస్తావిస్తూ వస్తున్నారు ట్రంప్. తనను పూర్తిగా భారత్ సంతృప్తి పరచలేదంటూ వ్యాఖ్యానించారు కూడా. అయితే మోదీకి నెతన్యాహూ ఫోన్ అనేది ట్రంప్ వ్యూహంలో భాగం కాదనే విషయం కొట్టిపారేయలేం అని అంటున్నారు పలువురు విశ్లేషకులు. భారత్-అమెరికాల మధ్య పూర్తిగా సఖ్యత చెడిపోకపోయినప్పటికీ, కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆపరేషన్ సిందూర్ దగ్గర్నుంచి, సుంకాల పెంపు వరకూ ఇరు దేశాలు కాస్త దూరం పాటిస్తూ వస్తున్నాయి. అయితే భారత్తో శత్రుత్వం అంత మంచిది కాదని అమెరికా ప్రముఖలే వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ ఈ రకంగా పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ పర్యటనకు ఓకేనా?ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ఎప్పుడో భారత్ పర్యటనకు రావాలి. భారత్ పర్యటనకు వస్తానని గతంలో ఆయనే స్వయంగా ప్రకటించిన తరువాత.. ఆ పర్యటన నవంబర్ నుంచి డిసెంబర్లోపు ఉంటుందని భావించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు జనవరి వచ్చేసింది. అయితే నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లారు కానీ భారత్ పర్యటనపై ఎటవంటి ప్రకటన చేయలేదు. అయితే భారత్ పర్యటనకు రావడానికే ముందుగా మోదీకి ఫోన్ చేసి టచ్లోకి వచ్చారంటున్నారు పలువురు విశ్లేషకలు. ఇదంతా కూడా ట్రంప్తో నెతన్యాహూ భేటీ తర్వాతే జరిగింది. అంటే నెతన్యాహూ భారత్లో పర్యటించడానికి కూడా ట్రంప్ను అడిగి ఉండొవచ్చనేది ఒక వాదనగా ఉంది. భారత్ పర్యటనకు నెతన్యాహూ చేపట్టడానికి ట్రంప్ గ్రీన్సిగ్నల్ ఇచ్చి ఉంటారని, అందుకే ముందస్తుగా ఇలా ఫోన్లతో మాటామంతీ కలుపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి:ట్రంప్ అసంతృప్తి లోగుట్టు! -
మోదీకి నెతన్యాహు ఫోన్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. వారిద్దరూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇరుదేశాల ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో వరి్ధల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గాజా శాంతి ప్రణాళిక అమలు గురించి మోదీకి నెతన్యాహు సవివరంగా తెలియజేశారు. భారత్, ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించారు. రెండు దేశాల బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించడానికి వీల్లేదని తేలి్చచెప్పారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. -
ట్రంప్ అసంతృప్తి లోగుట్టు!
పరాయి దేశాల్లో సైనిక కుట్రలు, కుయుక్తుల మాటెలావున్నా అగ్రరాజ్యం హోదాలో అమెరికా నాగరికంగా, గంభీరంగా ఉన్నట్టు కనబడేది. తాను ఏం చేసినా ప్రపంచశాంతి కోసమే, అది సురక్షితంగా ఉండటానికేనని ప్రవచించేది. నిరుడు ఆ దేశాధ్యక్షపీఠాన్ని అధిరోహించిన డోనాల్డ్ ట్రంప్కు ఇలాంటి డొంకతిరుగుడు నచ్చదు. బాహాటంగా బెదిరింపులకు దిగటం ఆయన నైజం. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తనను ఆనందడోలికల్లో ముంచెత్తడానికి భారత్ ప్రయత్నిస్తోందట. అయితే తాను సంతోషంగా లేని విషయం మోదీకి తెలుసట. మరో రెండు రోజులకు దాన్ని కాస్త మార్చి, తనతో మోదీ సంతోషంగా లేరంటూ మరో ప్రకటన చేశారు. ఇలా మాట్లాడుతూనే రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు నిలిపేయకపోతే సుంకాలు మరింత పెంచుతామని హెచ్చరించారు. రెండు దేశాల దౌత్యసంబంధాలు లేదా వాణిజ్యసంబంధాల్లో ఏకాభిప్రాయం కుదరనప్పుడు పరస్పరం చర్చించుకోవటం ఆనవాయితీ. ఇచ్చిపుచ్చుకునే ధోరణి చూపితే ఎక్కడో ఒకచోట సదవగాహన సాధ్యమవుతుంది. కానీ ఫలానాది మాత్రమే కావాలని పట్టు బట్టడం, మొండికేయటం వల్ల సమస్య ఎప్పటికీ అపరిష్కృతంగా ఉండి పోతుంది. మన దేశానికి మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, ఒమన్లతో ఒప్పందాలు కుదిరాయి. అటు అమెరికాకు ఈయూ, జపాన్, థాయ్లాండ్, వియత్నాం, మలేసియాలతో ఇదే విధంగా ఒప్పందాలు ఏర్పడ్డాయి. ఇలా వేరే దేశాలతో ఈ రెండు దేశాలూ ఒప్పందాలు కుదుర్చుకోగలిగినప్పడు వాటి మధ్య మాత్రం ఒప్పందాలు ఎందుకు అసాధ్యమవుతున్నాయి? తమ భద్రత అమెరికా చేతుల్లో ఉండటంతో వేరే దేశాలు అమెరికా షరతులను శిరసావహించక తప్పదు. వ్యూహాత్మక అంశాల్లో స్వతంత్రత పాటించే వారిని ఒత్తిళ్లు ప్రభావితం చేయలేవు. అందువల్లనే భారత్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అంత తేలిగ్గా సాధ్యపడవు. ట్రంప్ను సంతోషపెట్టడం వేరే దేశాల బాధ్యత ఎందుకవుతుంది? అసలు ఆ బాధ్యత అమెరికా ప్రజలకే ఉండదు. అన్ని దేశాల పాలకుల మాదిరే తన దేశ ప్రజలు ఆనందంగా ఉండేలా చూసుకునే బాధ్యత ట్రంప్ది. ఆయన్ను అందుకు ఒప్పించటం రిపబ్లికన్ల బాధ్యత. లేనట్టయితే నష్టపోయేది ఆ పార్టీయే. భారత్–పాక్ యుద్ధాన్ని ఆపానని గప్పాలు కొట్టుకున్నట్టే భారత్ తనను సంతోషపరచటానికి ప్రయత్నిస్తోందని ట్రంప్ చెప్పారా? ఈ విషయంలో మన దేశంవైపు నుంచి ఖండనేమీ లేదు. వాణిజ్య ఒప్పందం అనేది చాలా సీరియస్ అంశం. బహిరంగ వేదికలపై దాన్ని చర్చించటం సాధ్యపడదు. తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారానో, ఎయిర్ఫోర్స్ వన్ విమానంలోనో కూర్చునో తోచింది చెప్పటం, అందుకు అనుగుణంగా అవతలి దేశం మారాలని, కాళ్లబేరానికి రావాలని భావించటం... అది సాధ్యపడనప్పుడు హెచ్–1బి వీసా ఫీజు పెంచటం, బహిరంగ విమర్శలకు దిగటం ట్రంప్ ఎన్నుకున్న తప్పుడు మార్గం.నిజానికి మన దేశం చాలావరకూ తగ్గిందనే చెప్పాలి. నిరుటితో పోలిస్తే అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు 80 శాతం పెరిగాయి. 1962లో వచ్చిన అణుశక్తి చట్టాన్ని ఇటీవల రద్దుచేసి ఆ రంగంలో ప్రైవేటు సంస్థల ప్రమేయానికి అనుమతిస్తూ మన దేశం ‘శాంతి’ పేరిట కొత్త చట్టం తెచ్చింది. అణువిద్యుత్ కర్మాగారాల్లో ప్రమాదం జరిగితే పరిహారం చెల్లింపు బాధ్యత ఆ పరికరాల సరఫరాదారుకు ఉండబోదన్న విషయంలోనూ అంగీకరించింది. ఇవి తనను సంతోషపరచటానికేనని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడుతోంది. అవి ఎంతమాత్రమూ సరిపోవని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం కావొచ్చు. ఇక 95 శాతం అమెరికా ఎగుమతులపై సుంకాలు ఎత్తేయటానికి మన దేశం సిద్ధపడింది. బాదం, యాపిల్, అవకాడో వంటివాటిపై సుంకాలు తగ్గించటానికి ఒప్పు కున్నదంటున్నారు. కానీ డెయిరీ ఉత్పత్తులు, జన్యుమార్పిడి మొక్కజొన్న,సోయా బీన్స్ వగైరాలపై ఆంక్షలొద్దన్న ట్రంప్ షరతుకు అంగీకరించటం లేదు. మన రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేవి మాత్రమే ఆయనను సంతోష పరుస్తాయనుకుంటే ఆ విషయంలో చేయగలిగిందేమీ లేదని మన దేశం చెప్పటమేసరైంది. -
మోదీపై ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు..
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా- భారత సంబంధాలపై మరోసారి స్పందిస్తూ కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను వెల్లడించారు. అమెరికాతో భారత్ వాణిజ్య సమస్యలు, రక్షణ కొనుగోళ్ల విషయమై మోదీ తనను ‘సర్’ అని పిలిచారని, ఎంతో వినయంగా మాట్లాడారని ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అమెరికా నుంచి భారత్ అపాచీ హెలికాప్టర్లను ఆర్డర్ చేసింది. కానీ, గత ఐదేళ్లుగా భారత్ వాటిని పొందలేదు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా.. నాతో మాట్లాడటానికి వచ్చారు. ఆ సమయంలో మోదీ నన్ను సర్ అని సంభోదించారు. సర్, దయచేసి నేను మిమ్మల్ని కలవవచ్చా? అని వినయంగా అడిగారు అని అన్నారు. ఇదే సమయంలో మోదీతో తనకు మంచి సంబంధం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.అలాగే, భారత్ 68 అపాచీ హెలికాప్టర్లను ఆర్డర్ చేసింది. హెలికాప్టర్ల కోసం ఎదురుచూస్తోంది. తాను అది చేసి చూపించానని ట్రంప్ పేర్కొన్నారు. స్నేహపూర్వక దేశాలు కీలకమైన రక్షణ పరికరాల కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తుండగా, కొనుగోలు వ్యవస్థల్లో సంస్కరణలు అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారతదేశం వంటి దేశాలు, ఇప్పటికే ఆమోదించిన పరికరాల కోసం డెలివరీలో జాప్యం ఎదుర్కోకూడదని అన్నారు. మరోవైపు.. అపాచీ డెలివరీలలోనే కాకుండా, F-35 వంటి అధునాతన ఫైటర్ జెట్లలో కూడా ఆలస్యంపై విమర్శించారు. ఇటువంటి సుదీర్ఘ సమయాలు, రక్షణ భాగస్వామ్యాలలో విశ్వాసాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని ట్రంప్ వాదించారు. ప్రధాని మోడీ వ్యక్తిగతంగా ఈ ఆలస్యాలపై ఆందోళన వ్యక్తం చేశారని, వారి బలమైన వ్యక్తిగత సంబంధం సున్నితమైన విషయాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు.ఇదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై సుంకాల ప్రభావాన్ని హైలైట్ చేస్తూ ట్రంప్ ఇలా అన్నారు. సుంకాల కారణంగా అమెరికన్లు ధనవంతులు అవుతున్నారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సుంకాల కారణంగా మన దేశంలోకి 650 బిలియన్ డాలర్లకు పైగా డబ్బు వస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.నేను సంతోషంగా లేను.. ఇక, అంతకుముందు ప్రధాని మోదీ, భారత్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంపై తాను సంతోషంగా లేనని, భారత్పై అమెరికా అతి త్వరలో సుంకాలను పెంచే అవకాశముందని మోదీకి ఈ విషయం తెలుసు అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, నన్ను సంతోషపెట్టాలని వాళ్లు (భారత్) అనుకుంటున్నారు. ప్రధాని మోదీ మంచి చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేం సుంకాలను పెంచుతాం. 50 శాతానికి పైగా సుంకాలు విధిస్తాం. అది వారికి ఏమాత్రం బాగోదు. మా ఆంక్షలు రష్యాను తీవ్రంగా బాధిస్తున్నాయి’ అంటూ భారత్ గురించి ప్రస్తావించారు. -
11న సోమనాథ్ ఆలయానికి వెళ్తున్నా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. సోమనాథ్ ఆలయంపై విదేశీయులు మొదటిసారిగా దాడి జరిపి, ధ్వంసం చేసిన దురాగతానికి వెయ్యేళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో ఏడాదంతా వివిధ కార్యక్రమాలను తలపెట్టారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి. సోమనాథ్ను 11వ తేదీన సందర్శించుకోనున్నట్లు ప్రధాని సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం భారతీయ నాగరికత అజేయ సంకల్పానికి, బలానికి గొప్ప నిదర్శనం. విదేశీ దురాక్రమణదారులు ఎన్నిసార్లు దాడి చేసినా, ప్రతిసారీ ఈ పుణ్యక్షేత్రం మరింత వైభవోపేతంగా తిరిగి పుంజుకుంది’అని పేర్కొన్నారు. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతం వెరావల్లో అరేబియా సముద్ర తీరాన ఉన్న సోమనాథ్ ఆలయంలో శివుడు కొలువుతీరాడు. ఈ ఆలయంపై మొదటిసారిగా తుర్కియే పాలకుడు గజనీ మహ్మద్ దాడి చేసి, విధ్వంసం సృష్టించాడు. అప్పట్నుంచి పలువురు విదేశీ పాలకులు దాడి చేసి దోచుకున్నారు. ‘సోమనాథ్ కథ కేవలం ఒక ఆలయానికి సంబంధించింది కాదు, అది మన సంస్కృతిని, నాగరికతను కాపాడిన భారతమాత కోట్లాది సంతానానికి చెందిన అజేయమైన సాహసగాథ. శతాబ్దాల తరబడి దాడులు, వలసవాద దోపిడీలను తట్టుకుని నిలబడిన ఈ స్ఫూర్తే నేడు మన దేశాన్ని ప్రపంచ ఆర్థిక వృద్ధిలో అత్యంత వేగంగా ముందుకు సాగుతున్న దేశంగా నిలబెట్టింది’అని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఆలయాన్ని పునర్నిర్మించే విషయంలో సర్దార్ పటేల్ ఎంతో చొరవ కనబరిచారన్న ప్రధాని మోదీ...1951లో జరిగిన ఆలయ ఉత్సవాలకు అప్పటి ప్రధాని నెహ్రూ వెళ్లలేదంటూ నిందించారు. ‘1947లో దీపావళి వేడుకల వేళ సర్దార్ పటేల్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అప్పుడే ఆయన ఆలయానికి పూర్వవైభవం తేవాలని నిర్ణయించుకున్నారు’’ అని మోదీ చెప్పారు. -
భారత్ నన్ను సంతోష పెట్టాలనుకుంటోంది: ట్రంప్
రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తూ ఉండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురు సమస్యను పరిష్కరించడంలో భారత్ సహాయం చేయకపోతే ప్రస్తుతం ఉన్న సుంకాలను పెంచే అవకాశం ఉందని ట్రంప్ మరొకసారి హెచ్చరించారు.భారత్తో వాణిజ్య లావాదేవీలపై సుంకాలను పెంచుతామన్నారు. ‘ భారత్ నన్ను సంతోష పెట్టాలనుకుంటోంది. భారత్ ప్రధాని నరేందర మోదీ చాలా మంచి వ్యక్తి.. ఉన్నతమైన వ్యక్తి. భారత్ వైఖరి పట్ల నేను సంతోషంగా లేననే విషయం మోదీకి తెలుసు’ అంటూ పేర్కొన్నారు.#WATCH | On India’s Russian oil imports, US President Donald J Trump says, "... They wanted to make me happy, basically... PM Modi's a very good man. He's a good guy. He knew I was not happy. It was important to make me happy. They do trade, and we can raise tariffs on them very… pic.twitter.com/ANNdO36CZI— ANI (@ANI) January 5, 2026 కాగా, భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించి అక్కసు తీర్చుకున్నారు ట్రంప్. దీనిపై అమెరికాలో ఉన్న నిపణులు సైతం ట్రంప్ను హెచ్చరించారు కూడా. భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తే ఆ దేశంతో ఎన్నో దశాబ్దాల నుంచి సాగుతున్న మిత్రత్వం చెడిపోతుందని కూడా వివరించారు. దానివల్ల అమెరికాక ఒరిగేదేమీ లేకపోయినా మనమే దెబ్బతింటామని కూడా చెప్పారు. కేవలం భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని ఒక్క ఒక్క తలంపుతో 50శాతం సుంకాలను విధించారు ట్రంప్.రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించారు. రష్యా చమురును కొనడం ఆపాలనే భారత్ను పలుమార్లు హెచ్చరించారు. అయితే దాన్న భారత్ పూర్తి సీరియస్గా తీసుకోగా పోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షడు పుతిన్.. భారత్కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై మాట్లాడారు.. తాము భారత్కు సరఫరా చేస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరొకవైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్కు అసహనం తెప్పిస్తున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా వేరే దేశాలకు భారత్ దగ్గరవ్వడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత్పై సుంకాల విధింపుల పెంపుతో తన అక్కసు తీర్చుకుంటున్నారు. మరొకసారి భారత్పై వాణిజ్య సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఒకవైపు మోదీ మంచి వ్యక్తి అంటూనే రష్యా చమురును ఆపకపోతే భారత్ మరొకసారి భారీగా తాము విధించే సుంకాల విధింపును ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. -
‘2036లో ఒలింపిక్స్ నిర్వహిస్తాం’
వారణాసి: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2036లో ఈ మెగా ఈవెంట్ను నిర్వహించే సత్తా భారత్కు ఉందన్నారు. ఇప్పటికే 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ హక్కులు లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆదివారం వారణాసిలో సీనియర్ జాతీయ వాలీబాల్ చాంపియన్షిప్ మొదలు కాగా...వర్చువల్గా ప్రధాని దీనిని ప్రారంభించారు. ప్రధాన వేదికపై జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వర్ధమాన అథ్లెట్లు ఒలింపిక్స్లో రాణించేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ‘ఖేలో ఇండియా’లాంటి క్రీడలు, పథకాలు ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఒక గేమ్ చేంజర్ అని మోదీ పేర్కొన్నారు. ‘2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిస్తోంది. అలాగే 2036 విశ్వక్రీడల ఆతిథ్యం కోసం గట్టిగానే కృషి చేస్తున్నాం. దీనివల్ల మన భారత అథ్లెట్లు ఒలింపిక్స్లాంటి మెగా ఈవెంట్లలో సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది. మేం ఇదివరకే ప్రారంభించిన ఖేలో ఇండియా సత్ఫలితాలను ఇస్తోంది. ప్రతిభ గల క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేలా విస్తృత అవకాశాల్ని కల్పించింది’ అని ప్రధాని వివరించారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) ఎంతోమంది అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు తెచ్చేందుకు తోడ్పడిందన్నారు. గత దశాబ్ద కాలంగా భారత్లో 20కి పైగానే మేజర్ క్రీడా ఈవెంట్లు జరిగాయని గుర్తుచేశారు. ‘పదేళ్లుగా వివిధ నగరాల్లో చెప్పుకోదగిన స్థాయిలో అంతర్జాతీయ ఈవెంట్లు ఎన్నో జరిగాయి. ఫిఫా అండర్–17 ప్రపంచకప్, హాకీ ప్రపంచకప్, అంతర్జాతీయ చెస్ టోర్నీలు, ప్రపంచకప్ చెస్ ఈవెంట్లు జరిగాయి. కేంద్రం కూడా ప్రతీ ఏటా క్రీడల బడ్జెట్ను పెంచుతూ పోతోంది. క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల ప్రదర్శన మెరుగుపరిచేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచాం. ఎక్స్ప్రెస్ వేగంతో సంస్కరణల్ని అమలు చేస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు. సీనియర్ జాతీయ వాలీబాల్ పోటీలు ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు జరుగుతాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సరీ్వసెస్కు చెందిన 58 పురుషులు, మహిళల జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. సుమారు వేయికి పైగా ఆటగాళ్లు ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఇరు విభాగాల్లో లీగ్ దశ పోటీలు జరుగుతాయి. గ్రూప్ దశ అనంతరం నాకౌట్ దశ మొదలవుతుంది. 11న జరిగే ఫైనల్స్తో ఈవెంట్ ముగుస్తుంది. -
ఒక అజేయ స్ఫూర్తి సంకేతం
సోమనాథ్... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గుజరాత్ రాష్ట్రం ప్రభాస్ పటాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని ‘ద్వాదశ జ్యోతిర్లింగ’ స్తోత్రం ప్రస్తుతిస్తుంది. ‘‘సౌరాష్ట్రే సోమనాథం చ...’’ అంటూ ఆరంభమయ్యే ఈ స్తోత్రం, తొలి జ్యోతిర్లింగ నెలవుగా సోమనాథ్ నాగరికత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా ఈ శ్లోకం జ్యోతిర్లింగ మహత్తును ఇలా చాటిచెబుతుంది: ‘‘సోమలింగం నరో దృష్ట్వా సర్వపాపైః ప్రముచ్యతే‘ లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్’’ అంటే– ‘‘సోమనాథ్ శివలింగ దర్శన మాత్రాన జీవుడు పాప విముక్తుడై సదాశయాలను నెరవేర్చి, మరణానంతరం స్వర్గ ప్రాప్తినొందుతాడు’’ అని అర్థం. కానీ, లక్షలాది భక్తజనం భక్తిప్రపత్తులతో నీరాజనాలు అర్పించిన ఈ సోమనాథ్పై దురదృష్టవశాత్తూ విధ్వంసమే ఏకైక ధ్యేయంగా విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. ఈ నేపథ్యంలో సోమనాథ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఈ ఏడాదిలో వెయ్యేళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. అయితే, సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ మేరకు ఆలయ పునరుద్ధరణ అనంతరం 1951 మే 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ భాగ్యం కల్పిస్తూ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.అఖండ ధైర్యానికి నిర్వచనంసోమనాథ్పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది. ప్రతి పంక్తిలోనూ బట్టబయలయ్యే హింస, క్రూరత్వం వెయ్యేళ్లు గడిచినా మరపురాని విషాద భారాన్ని మన మనోఫలకంపై మోపుతాయి. భారత దేశంపైన, ప్రజల మనోధైర్యం మీద అది చూపిన పెను దుష్ప్రభావాన్ని ఒకసారి ఊహించండి. సముద్ర తీరంలోగల సోమనాథ్ ఆలయం అమేయ ఆర్థిక శక్తితో సమాజానికి సాధికారతనిచ్చింది. అన్నింటినీ మించి సోమనాథ్కు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. నాటి సమాజంలోని సముద్ర వ్యాపారులు, నావికులు సోమనాథ్ వైభవ గాథలను దేశదేశాలకు విసృతంగా మోసుకెళ్లారు. తొలి దాడికి సహస్రాబ్ది పూర్తయ్యాక కూడా సోమనాథ్ గాథ విధ్వంస నిర్వచనంగా నిలవకపోవడంపై నిస్సందేహంగా నేనెంతో గర్విస్తున్నాను. ఈ ఆలయం ఈనాడు భరతమాత కోట్లాది బిడ్డల అఖండ ధైర్యానికి నిర్వచనంగా నిలుస్తోంది. ఎన్నడో వెయ్యేళ్ల కిందట 1026లో మొదలైన మధ్యయుగపు అనాగరిక దండయాత్ర, ఇతరులను కూడా సోమనాథ్పై పదేపదే దాడులకు ‘ప్రేరేపించింది.’ దేశ ప్రజలను, సంస్కృతిని దాస్య శృంఖలాల్లో బంధించే ప్రయత్నాలకు నాంది పలికింది. ఎందరో మహానుభావులుకానీ, ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమ్నాథ్లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం. స్వామి వివేకానంద 1890 దశకంలో సోమనాథ్ను సందర్శించినపుడు అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. నాటి తన అనుభవాన్ని 1897లో చెన్నయ్ నగరంలో ఓ కార్యక్రమం సందర్భంగా– ‘‘దక్షిణ భారతంలోని ప్రాచీన ఆలయాలతోపాటు గుజరాత్లోని సోమనాథ్ వంటివి మనకు అపార జ్ఞానప్రదాతలు. ఎన్నో పుస్తకాలు వివరించలేని జాతి చరిత్రపై మనకు మరింత లోతైన అవగాహనను అందిస్తాయి. వంద దాడులను భరించిన గుర్తులతోనే కాకుండా వంద పునరుజ్జీవన చిహ్నాలతో ఈ ఆలయాలు ఎంత వైభవంగా నిలిచాయో గమనించండి. నిరంతర విధ్వంసం, శిథిలాల నుంచి నిరంతర పునరుజ్జీవనంతో మునుపటి ఠీవితో ఎంత శక్తిమంతంగా విలసిల్లుతున్నాయో చూడండి! అదే జాతీయ మనోభావనం జాతీయ జీవన స్రవంతి. అనుసరిస్తే అది అమేయ యశస్సు వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ జీవన స్రవంతిని వీడితే ఫలితం మరణమే! ఆ మార్గం వదిలిపెడితే ప్రభావం ఆత్మనాశనం, వినాశమే!’’ స్వాతంత్య్రానంతరం సమర్థుడైన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ సోమనాథ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో దీపావళి వేళ ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయిన సర్దార్ పటేల్... అక్కడే ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి 1951 మే 11న సోమనాథ్లో భవ్యమైన ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకకు హాజరయ్యారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలని కలలుగన్న యోధుడు సర్దార్ సాహెబ్ ఆ సమయానికి భౌతికంగా ఈ లోకంలో లేరు. కానీ, ఆయన స్వప్నం సాకారమై దేశం ఎదుట సగర్వంగా నిలిచింది. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ పరిణామం పట్ల అంతగా ఉత్సాహం చూపలేదు. ఎంతో విశిష్టమైన ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి, మంత్రులు పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమం భారత్పై ప్రతికూల ముద్ర వేసిందని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. అనంతర పరిణామాలు చరిత్ర పుటల్లో నిలిచే ఉన్నాయి. సర్దార్ పటేల్కు ఎంతో అండగా నిలిచిన కె.ఎం. మున్షీని స్మరించుకోకపోతే సోమనాథ్ గాథ అసంపూర్ణమే అవుతుంది. ‘సోమనాథ: నిత్య క్షేత్రం (సోమనాథ: ద ష్రైన్ ఎటర్నల్)’ గ్రంథంతోపాటు... సోమనాథ్పై ఎన్నో సమాచారభరిత, విజ్ఞానదాయకమైన రచనలు చేశారు. నిజానికి, మున్షీ తన గ్రంథ శీర్షికలో చెప్పినట్టు... ఆత్మ నిత్యత్వాన్నీ, ఉన్నత భావాల శాశ్వతత్వాన్నీ బలంగా విశ్వసించే గొప్ప నాగరికత మనది. ‘నైనం ఛిందన్తి శస్త్రాణి’ అని గీతలో చెప్పినట్టు – అది ధ్వంసం చేయ శక్యంగాని అజరామరత్వమని మనం బలంగా నమ్ముతాం. మన నాగరికత అజేయ స్ఫూర్తికి సోమనాథ్ను మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఎన్నో అవరోధాలనూ, ఆటుపోట్లనూ ఎదుర్కొని వైభవోపేతంగా నిలిచిన సోమనాథ్ కన్నా మిన్నగా మరేది దీన్ని వివరించగలదు? ఒక ఆశాగీతంవందల ఏళ్ల దాడులనూ, వలసవాద దోపిడీనీ తట్టుకొని నిలబడి... నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతోంది. నేడు భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే... మన విలువలు, భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్ను చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతోంది. అనాది కాలం నుంచి వివిధ వర్గాల ప్రజలను సోమనాథ్ ఏకం చేస్తోంది. శతాబ్దాల కిందటే పూజ్య జైన సన్యాసి కలికాల సర్వజ్ఞ హేమచంద్రాచార్యులు సోమనాథ్కు వచ్చారు. అక్కడ ప్రార్థన అనంతరం... ‘భవబీజాంకురజననా రాగాధ్యాః క్షయముపగతా యస్య’ అనే శ్లోకాన్ని ఆయన చెప్పాడంటారు. అంటే – ‘‘లౌకిక కర్మ బీజాలను నశింపజేసే వాడికీ... రాగద్వేషాలనూ, సమస్త క్లేశాలనూ తుడిచిపెట్టే వాడికీ వందనాలు’’ అని అర్థం. నేడు మన మనస్సులోనూ, ఆత్మలోనూ ఒక బలమైన చైతన్యాన్ని రగిలించే అద్భుత శక్తి సోమనాథ్కు ఉంది. 1026లో మొదటిసారి దాడి జరిగి వెయ్యేళ్లు గడిచినా... సోమనాథ్ వద్ద సాగరం నేటికీ అంతే గంభీరంగా గర్జిస్తోంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్భుతమైన కథను చెబుతున్నాయి. ఆటంకాలెన్ని ఎదురైనా... ఆ అలల మాదిరిగానే మళ్లీ సోమనాథ అభ్యుదయం తథ్యం. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిన ధూళి కణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయపదాలుగా మిగిలాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాదసూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా దేదీప్యమై వెలుగులు విరజిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏమాత్రమూ చెక్కుచెదరని ఆ అజేయమైన, చిరతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.సోమనాథ్ ఒక ఆశా గీతం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండవచ్చు. కానీ సత్యమూ, ధర్మంపై అచంచలమైన విశ్వాసమూ అమరత్వాన్ని సృజించగలవని సోమనాథ్ చాటుతోంది. వెయ్యేళ్ల కిందట దాడికి గురై, తర్వాత కూడా నిరంతర దాడులను ఎదుర్కొన్న సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలిచినట్టే... మనం కూడా పరాయి దండయాత్రలకు ముందున్న, వెయ్యేళ్ల కిందటి మన దేశ మహా వైభవాన్ని పునరుద్ధరించుకుని తీరుతాం. శ్రీ సోమనాథ మహాదేవుడి ఆశీస్సులతో, వికసిత భారత నవ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. విశ్వ కల్యాణమే పరమావధిగా... మన నాగరికతా స్ఫూర్తి దిశానిర్దేశం చేస్తోంది. జై సోమనాథ్! నరేంద్ర మోదీభారత ప్రధాని, శ్రీ సోమనాథ్ ట్రస్టు చైర్మన్ -
మోదీజీ పాక్పై అటాక్ చేయండి: అసదుద్దీన్
వెనిజువెలాపై అమెరికా దాడిపై ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ట్రంప్ మాదిరిగా భారత ప్రధాని మోదీ సైతం పాకిస్థాన్పై దాడి చేయాలన్నారు. అలా దాడి చేసి 26/11 ఘటన బాధ్యుల్ని భారత్ తీసుకురావాలని సూచించారు. అమెరికా ఆ పని చేయగా లేనిదీ.. భారత్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.26/11 ఉగ్రవాద దాడి ఘటన దేశాన్ని ఎంతగానో కలిచివేసింది. ముష్కరుల కిరాతకంగా అమాయక ప్రజలపై కాల్పులు జరపడంతో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు మాస్టర్మైండ్గా భావిస్తున్న లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాది మసూద్ అజర్ పాకిస్థాన్లో స్వేచ్చగా తిరుగుతున్నాడు. అయితే ఈ అంశంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.భారత ప్రధాని మోదీకి, అసదుద్దీన్ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. "మోదీజీ మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. పాకిస్థాన్కు ప్రత్యేక బలగాలను పంపండి. 26/11 ఉగ్రదాడి సూత్రధారులను వెనక్కి తీసుకరండి. ట్రంప్ అలా చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ట్రంప్ కంటే మీరు ఎందులో తక్కువ కాదు" అని అసదుద్దీన్ అన్నారు.అయితే గతంలోనూ ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ స్నేహంపై అసదుద్దీన్ వ్యంగ్యంగా స్పందించారు. ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. శుక్రవారం వెనిజువెలాపై, అమెరికా ఎయిర్స్ట్రైక్స్ చేసింది. ఆ దేశ అధ్యక్షుడితో పాటు అతని భార్యను బందీగా అమెరికా తరలించిన సంగతి తెలిసిందే. -
యుద్ధాల యుగం కాదు బుద్ధుడి యుగం
న్యూఢిల్లీ: ఇది యుద్ధాల యుగం కాదని.. బుద్ధుడి యుగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. మానవత్వాన్ని వ్యతిరేకించేవారిని ఓడించాలంటే శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. ఘర్షణ జరిగే చోట కరుణ చూపడం కావాలని తెలిపారు. ప్రాచీన బౌద్ధ అవశేషాల ప్రదర్శనను ప్రధానమంత్రి శనివారం ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలోని ఖిలా రాయ్ సాంస్కృతి కేంద్రంలో ఈ అరుదైన ప్రదర్శన ఏర్పాటైంది. ఇందులో బుద్ధుడికి, బౌద్ధ మతానికి ప్రత్యక్షంగా సంబంధం ఉన్న పవిత్ర రత్నాలు, అస్థికలను ప్రదర్శిస్తున్నారు. 127 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సిద్ధార్థనగర్ జిల్లాలోని పిపరాహ్వా గ్రామంలో తవ్వకాల్లో ఈ అవశేషాలు బయటపడ్డాయి. ఇవి కేవలం కళాకృతులు మాత్రమే కాదని.. ఘన చరిత్ర కలిగిన మన సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగమని, మన నాగరికత నుంచి విడదీయలేని అంశమని ప్రధాని మోదీ చెప్పారు. మన దేశంలో లభ్యమైన పిపరాహ్వా అవశేషాలు కొంతకాలం విదేశాలను కూడా చుట్టివచ్చాయని తెలిపారు. వియత్నాం, థాయ్లాండ్, రష్యా తదితర దేశాల్లో ప్రజలు వీటిని దర్శించుకొని భక్తి ప్రపత్తులు చాటుకున్నారని వెల్లడించారు. ఇతర దేశాలతో మన సంబంధాలు కేవలం రాజకీయాలు, దౌత్యం, ఆర్థిక రంగానికే పరిమితం కాలేదని.. బలమైన భావోద్వేగ, విశ్వాస, ఆధ్యాతి్మక సంబంధాలు కూడా ఉన్నాయని, బుద్ధ భగవానుడు అందించిన వారసత్వమే అందుకు కారణమని వివరించారు. సారనాథ్ నా కర్మభూమి బ్రిటిష్ వలస పాలన హయాంలో విదేశాలకు తరలిపోయిన పిపరాహ్వా అవశేషాలు 127 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వ కృషి వల్ల స్వదేశానికి చేరుకున్నా యని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇందులో గోద్రెజ్ గ్రూప్ కృషి సైతం ఉందన్నారు. గత ఏడాది మే నెలలో హాంకాంగ్లో వేలం వేస్తుండగా, తాము అడ్డుకున్నామని తెలిపారు. తథాగతుడి అవశేషాల ను కాపాడుకోవడమే కాకుండా ఆయన ఆశయాలు, సంప్రదాయాలను సైతం ముందుకు తీసుకెళ్లడానికి మనం కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. -
తప్పుడు చరిత్ర రాసే ప్రయత్నంలో కేంద్రం: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తప్పుడు చరిత్రను రాసే ప్రయత్నం చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉపాధి హామీ చట్టంలో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం హేయమైన చర్య అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మహాత్మాగాంధీ మన దేశంలోనే కాదు.. ప్రపంచం గర్వించదగిన త్యాగశీలి. ఉపాధి హామీ చట్టంలో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్రం.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ, దేశ స్వాతంత్రం కోసం 12 ఏళ్ళు జైలు జీవితం గడిపిన నెహ్రూలను మరిపించే ప్రయత్నం చేస్తుంది. దేశంలో వలసల నివారణ కోసం సోనియా గాంధీ తీసుకువచ్చిన గొప్ప చట్టం ఇది. పేదలకు ఉపాధి హక్కును కల్పించి జీవనోపాధిని కల్పించింది. 20 ఏళ్లుగా కోట్ల మంది ఆకలి తీర్చిన చట్టం ఇది.ఉపాధి హామీ పనుల్లో 90 శాతం మంది లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. 62 శాతం మంది మహిళలు లబ్ది పొందారు. పేదలకు ఆపన్న హస్తంలా నిలిచిన ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వస్తుంది. ఒక తెలంగాణలోనే గత ఏడాది 6 కోట్ల విలువైన పని దినాలు తగ్గించారు. పేదల పొట్ట కొట్టి కార్పోరేట్ శక్తులను పెంచి పోషించడమే బీజేపీ విధానం. పెట్రోల్, డీజిల్ రేటు మూడింతలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధరలు తగ్గినా.. దేశంలో రేటు పెరుగుతుంది. కేంద్ర ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రాల ఆదాయ వనరులు తగ్గాయి. ఇది చాలదు అన్నట్లు ఉపాధి హామీ నిధుల్లో 40 శాతం భారం వేయడం అన్యాయం. కేంద్రం చర్యల వల్ల ఒక్క తెలంగాణ మీదే 1800 కోట్ల అదనపు భారం పడుతుంది’ అని కామెంట్స్ చేశారు. -
గిన్నిస్ హ్యాట్రిక్ సాధించిన అహ్మదాబాద్ ఫ్లవర్ షో
అహ్మదాబాద్: గుజరాత్ అంతర్జాతీయ ఫ్లవర్ షో మరోసారి తన సత్తా చాటింది. సబర్మతి నదీతీరంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న 14వ ఫ్లవర్ షో వరుసగా మూడోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దక్కించుకుంది. ఈ ఏడాది ఏకంగా రెండు ప్రపంచ రికార్డులను సాధించింది. 10 లక్షల పుష్పాలతో తయారు చేసిన ప్రపంచంలోనే అతి పెద్ద బొకేతోపాటు, అత్యధిక సందర్శకుల రికార్డును కూడా నెలకొల్పింది. ఈ ప్రదర్శన అత్యద్భుతమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ‘అహ్మదాబాద్ ఫ్లవర్ షో ఆకర్షణీయంగా ఉంది. మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఇది సృజనాత్మకతతోపాటు ప్రజల భాగస్వామ్యానికి అద్భుతమైన ఉదాహరణ. ఇది నగరం స్ఫూర్తిని, ప్రకృతి పట్ల ప్రేమను ప్రతిబింబించింది.’అని ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈవెంట్ చిత్రాలను కూడా షేర్ చేశా రు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సైతం ఫ్లవర్ షో విశేషాలను ఎక్స్లో పంచుకున్నారు.


