విక్టోరియా: ప్రధాని మోదీ ఆదివారం మారిషస్ ప్రధానమంత్రి నవీన్చంద్ర రామ్గూలమ్తోనూ సమావేశమయ్యారు. భారత్, మారిషస్ ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. పరస్పర సహకారం, సముద్ర భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరువురు నేతలు భారత్– మారిషస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు.


