ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ | Cm Revanth Reddy Meets Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

Jun 11 2026 9:15 PM | Updated on Jun 11 2026 9:19 PM

Cm Revanth Reddy Meets Prime Minister Narendra Modi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలని కోరారు. గోదావరి జలాల సమర్థవంతమైన వినియోగం కోసం మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం సహాయం చేయాలని.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2: 123 కి.మీ. విస్తరణకు రూ.38,595 కోట్లు.. వెంటనే అమోదించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం భూ సేకరణ 90 శాతం పూర్తి అయ్యిందని వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం (చౌటుప్పల్-సంగారెడ్డి) కూడా ఏకకాలంలో ఆమోదించాలి. హైదరాబాద్-అమరావతి-బందర్ 12 లేన్ ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్ర అనుమతి ఇవ్వండి. తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ.. ఎగుమతులకు గేమ్ ఛేంజర్. వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులు త్వరగా ప్రారంభించాలి. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు  200 ఎకరాలు సిద్ధంగా ఉందని.. అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement