అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే.. | Amarnath Yatra 2026 Begins, PM Modi Writes To Pilgrims With Five Sankalpas, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

Jul 3 2026 10:21 AM | Updated on Jul 3 2026 10:39 AM

PM Modi writes to Amarnath Yatra pilgrims urges five sankalpas

పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర 2026 అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ యాత్రికులకు ప్రత్యేక లేఖ రాశారు. ఈ యాత్రను గొప్ప అదృష్టంగా అభివర్ణించారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను కూడా పాటించాలని భక్తులకు ఆయన సూచించారు. ఈ మేరకు ఐదు సంకల్పాలను మోదీ సూచించారు.

ప్రధాని మోదీ లేఖలో ప్రధాన సందేశం
యాత్రికులకు రాసిన లేఖలో ప్రధాని మోదీ.. అమర్‌నాథ్ యాత్రను భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటిగా పేర్కొన్నారు. ఆయన ఈ యాత్రను భక్తి, ఏకత్వం మరియు శ్రద్ధకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ సమయంలో యాత్రికులు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలుగా ఆయన ఐదు సంకల్పాలుగా సూచించారు.

ఐదు సంకల్పాలు ఇవే..

  • యాత్ర మార్గాల్లో పరిశుభ్రతను కాపాడటం

  • భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియమాలను పాటించడం

  • స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం (“Vocal for Local”)

  • యాత్ర అనంతరం ఒక మొక్క నాటడం (“Ek Ped Maa Ke Naam”)

  • దేశాభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించడం (“Nation First” భావన)

ఇక, ఈ ఏడాది యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు 57 రోజుల పాటు కొనసాగనుంది. హిమాలయాల్లో 12,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. యాత్ర ప్రారంభానికి ముందు జమ్మూ నుంచి మొదటి భక్తుల బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా భక్తులు “హర్ హర్ మహాదేవ్”, “బమ్ బమ్ భోలే” అంటూ భక్తి నినాదాలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర బలగాలు, జమ్మూ, కాశ్మీర్ పోలీసులు కలిసి బలమైన మల్టీ-లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీటీవీలు, ఆధునిక మానిటరింగ్ వ్యవస్థలు ఉపయోగించి యాత్ర మార్గాన్ని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement