Sports
-
PBKS VS MI, Qualifier 2: ఫైనల్లో పంజాబ్ కింగ్స్
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఫైవ్స్టార్ చాంపియన్లు (ముంబై, చెన్నై), మూడుసార్లు విజేత (కోల్కతా)ను చూసిన ఫ్యాన్స్ ఈ సీజన్లో కొత్త చాంపియన్ను చూడబోతున్నారు. తొలి క్వాలిఫయర్లో తేలిపోయిన పంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫయర్లో జూలు విదిల్చింది. 11 ఏళ్ల తర్వాత (2014) ఐపీఎల్లో ఫైనల్కు చేరింది. ఆదివారం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఇంటికి పంపింది. రేపు జరిగే ఫైనల్లో బెంగళూరు, పంజాబ్ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం తలపడతాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఠాకూర్ తిలక్ వర్మ (29 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు), నమన్ ధీర్ (18 బంతుల్లో 37; 7 ఫోర్లు) దంచేశారు. అజ్మ తుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి గెలిచింది. నాయకుడు శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్లు) జట్టు గెలిచేదాకా నడిపించాడు. నేహల్ వధేరా (29 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. గెలిపించిన అయ్యర్ పంజాబ్కు అంతపెద్ద లక్ష్యం ఛేదించడానికి అవసరమైన శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్లో ప్రభ్సిమ్రన్ (6), కాసేపటికే ప్రియాన్ష్ ఆర్య (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుకు చుక్కెదురైంది. దీంతో పవర్ప్లేలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన 64/2 స్కోరు చేసింది. ఇన్గ్లిస్ (21 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేసే ఆటను పాండ్యా అడ్డుకున్నాడు. దీంతో 72 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నేహల్ వాధేరా జట్టు స్కోరును వంద దాటించారు. 12 ఓవర్లలో 109/3 స్కోరు చేసిన పంజాబ్... విజయానికి 48 బంతుల్లో 95 పరుగులు కష్టమనిపించింది. టాప్లీ 13వ ఓవర్లో అయ్యర్ కొట్టిన వరుస 3 సిక్స్లు, ఆ వెంటనే బౌల్ట్ బౌలింగ్లో వాధేరా కొట్టిన బౌండరీలతో ఈ రెండు ఓవర్లలోనే 33 పరుగులు సాధించడంతో కింగ్స్ రేసులో పడింది. నాలుగో వికెట్కు 84 పరుగులు జోడించాక వాధేర అవుటయ్యాడు. శశాంక్ (2) రనౌటైనా... 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్ భారీ సిక్స్లతో కింగ్స్ను గెలిపించాడు. దంచేసిన తిలక్, సూర్య రోహిత్ (8), బెయిర్స్టో (38)ల తర్వాత తిలక్, సూర్యకుమార్ అడపాదడపా మెరుపులతో జట్టు స్కోరు 10 ఓవర్లలో 100 పరుగులు దాటింది. ఈ జోడీ నిలబడి దూకుడు పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. చహల్ ఓవర్లో సిక్సర్ బాదిన సూర్యకుమార్... జేమీసన్ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. ఇదే జోరుతో 4, 6 కొట్టిన అతన్ని చహల్ అవుట్ చేయడంతో మూడో వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లోనే తిలక్ను జేమీసన్ పెవిలియన్ చేర్చాడు. అయితే నమన్ ధీర్ ధనాధన్ బౌండరీలతో ఓవర్కు సగటున 10 రన్రేట్తో ముంబై స్కోరు దూసుకెళ్లింది. ఆఖరి ఓవర్లో నమన్ అవుట్ కాగా జట్టు 200 మార్క్ దాటింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) వైశాక్ (బి) స్టొయినిస్ 8; బెయిర్స్టో (సి) ఇన్గ్లిస్ (బి) వైశాక్ 38; తిలక్ వర్మ (సి) ప్రియాన్ష్ (బి) జేమీసన్ 44; సూర్యకుమార్ (సి) వధేరా (బి) చహల్ 44; హార్దిక్ పాండ్యా (సి) ఇన్గ్లిస్ (బి) అజ్మతుల్లా 15; నమన్ (సి) స్టొయినిస్ (బి) అజ్మతుల్లా 37; రాజ్ (నాటౌట్) 8; సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–19, 2–70, 3–142, 4–142, 5–180, 6–197. బౌలింగ్: అర్‡్షదీప్ సింగ్ 4–0–44–0, జేమీసన్ 4–0–30–1, స్టొయినిస్ 1–0–14–1, అజ్మతుల్లా 4–0–43–2, వైశాక్ 3–0–30–1, చహల్ 4–0–39–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) హార్దిక్ (బి) అశ్వని 20; ప్రభ్సిమ్రన్ (సి) టాప్లీ (బి) బౌల్ట్ 6; ఇన్గ్లిస్ (సి) బెయిర్స్టో (బి) హార్దిక్ 38; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 87; వధేరా (సి) సాంట్నర్ (బి) అశ్వని 48; శశాంక్ (రనౌట్) 2; స్టొయినిస్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–13, 2–55, 3–72, 4–156, 5–173. బౌలింగ్: బౌల్ట్ 4–0–38–1, టాప్లీ 3–0– 40–0, బుమ్రా 4–0–40–0, అశ్వని 4–0–55–2, సాంట్నర్ 2–0–15–0, పాండ్యా 2–0–19–1. -
ప్రపంచ రెండో ర్యాంకర్ నకమురాపై అర్జున్ గెలుపు
స్టావెంజర్: నార్వే చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ అద్భుత విజయం అందుకున్నాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా (అమెరికా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్లో అర్జున్ అర్మగెడాన్ టైబ్రేక్ గేమ్లో గెలుపొందాడు. వీరిద్దరి మధ్య జరిగిన క్లాసికల్ ఫార్మాట్ గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ను నిర్వహించారు. ఈ గేమ్లో అర్జున్ 48 ఎత్తుల్లో నకమురాపై విజయం సాధించాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఐదో రౌండ్ గేమ్లో 56 ఎత్తుల్లో వె యి (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి చైనా గ్రాండ్మాస్టర్ లె టింగ్జీపై అర్మగెడాన్ టైబ్రేక్ గేమ్లో 38 ఎత్తుల్లో గెలిచింది. అంతకుముందు వీరిద్దరి మధ్య క్లాసికల్ ఫార్మాట్ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. భారత మరో గ్రాండ్మాస్టర్ వైశాలి 35 ఎత్తుల్లో స్పెయిన్కు చెందిన సారా ఖాడెమ్ను ఓడించింది. -
శభాష్ స్వితోలినా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనం చోటు చేసుకుంది. టైటిల్ ఫేవరెట్స్లో ఒకరైన ఇటలీ స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ జాస్మిన్ పావోలిని ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. ఉక్రెయిన్ సీనియర్ ప్లేయర్ ఎలీనా స్వితోలినా అద్భుత పోరాటపటిమ కనబరిచి జాస్మిన్ పావోలినిని బోల్తా కొట్టించింది. మూడు సార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకొని స్వితోలినా గెలుపొందడం విశేషం. కెరీర్లో 12వసారి ఫ్రెంచ్ ఓపెన్లో ఆడుతోన్న 13వ సీడ్ స్వితోలినా తాజా విజయంతో ఐదోసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన పోరులో స్వితోలినా 4–6, 7–6 (8/6), 6–1తో జాస్మిన్ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్తో పోరుకు సిద్ధమైంది. తొలి సెట్ కోల్పోయిన స్వితోలినా రెండో సెట్లో 3–5తో వెనుకబడింది. ఎనిమిదో గేమ్లో జాస్మిన్ సర్వీస్ను బ్రేక్ చేసిన స్వితోలినా ఆధిక్యాన్ని 4–5కు తగ్గించింది. తొమ్మిదో గేమ్లో స్వితోలినా సర్వీస్లో జాస్మిన్ విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే ఈ రెండింటిని కాపాడుకున్న స్వితోలినా తన సర్వీస్ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేసింది. అనంతరం స్కోరు 6–6తో సమం కావడంతో సెట్ టైబ్రేకర్కు దారి తీసింది. టైబ్రేక్లో జాస్మిన్ 6–5తో ఆధిక్యంలో నిలిచి విజయానికి పాయింట్ దూరంలో నిలిచింది. ఈసారీ స్వితోలినా సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి సెట్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో స్వితోలినా చెలరేగిపోయి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో సెట్ను, మ్యాచ్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో జాస్మిన్ తన సర్వీస్ను ఏడుసార్లు, స్వితోలినా ఆరుసార్లు కోల్పోయారు. స్వియాటెక్ వరుసగా ఆరోసారి... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, ఐదో సీడ్ ఇగా స్వియాటెక్ వరుసగా ఆరోసారి ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత మూడేళ్లలో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన స్వియాటెక్కు ప్రిక్వార్టర్ ఫైనల్లో గట్టిపోటీ ఎదురైంది. 12వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్)తో జరిగిన మ్యాచ్లో స్వియాటెక్ 1–6, 6–3, 7–5తో నెగ్గి ముందంజ వేసింది. అరంటా సాంచెజ్ వికారియో (స్పెయిన్; 1991 నుంచి 2000 వరకు; 10 సార్లు) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్లో వరుసగా ఆరు లేదా అంతకంటే ఎక్కువసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన రెండో ప్లేయర్గా స్వియాటెక్ గుర్తింపు పొందింది.రిబాకినాతో 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో స్వియాటెక్ రెండు ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది. నాలుగుసార్లు తన సర్వీస్ను కోల్పోయినా స్వియాటెక్ ప్రత్యర్థి సర్వీస్ను కూడా నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 33 విన్నర్స్ కొట్టిన స్వియాటెక్ నెట్వద్దకు 11 సార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది. సబలెంకా జోరు ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), ఎనిమిదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. సమ్సనోవా (రష్యా)తో 2 గంటల 47 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కిన్వెన్ జెంగ్ 7–6 (7/5), 1–6, 6–3తో గెలిచి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సబలెంకా 7–5,6 –3తో అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది. తద్వారా సెరెనా విలియమ్స్ (అమెరికా) తర్వాత వరుసగా పదిసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న ప్లేయర్గా ఈ బెలారస్ స్టార్ ఘనత వహించింది. బోపన్న, యూకీ జోడీలు అవుట్ ఫ్రెంచ్ ఓపెన్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ జోడీలు మూడో రౌండ్లో నిష్క్రమించాయి. బోపన్న (భారత్)–ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం 2–6, 6–7 (5/7)తో రెండో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది.యూకీ బాంబ్రీ (భారత్)–రాబర్ట్ గాలోవే (అమెరికా) జంట 4–6, 4–6తో తొమ్మిదో సీడ్ క్రిస్టియన్ హారిసన్–ఇవాన్ కింగ్ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. మూడో రౌండ్లో ఓడిన బోపన్న, యూకీ జోడీలకు 43,500 యూరోల (రూ. 42 లక్షల 22 వేలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది. మరోవైపు బాలుర సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో మానస్ ధామ్నె (భారత్) 5–7, 3–6తో రోనిత్ కర్కీ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. జొకోవిచ్ ముందుకు పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మూడో రౌండ్ మ్యాచ్లో జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో ఫిలిప్ మిసోలిచ్ (ఆ్రస్టియా)పై గెలుపొందాడు. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఆరు ఏస్లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. అమెరికా ప్లేయర్, ప్రపంచ 12వ ర్యాంకర్ టామీ పాల్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో టామీ పాల్ 6–3, 6–3, 6–3తో పాపిరిన్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించాడు. -
పియాస్ట్రి ప్రతాపం
బార్సిలోనా (స్పెయిన్): క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగిస్తూ... మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఐదో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్ప్రిలో పియాస్ట్రి విజేతగా అవతరించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన పియాస్ట్రి ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. నిర్ణీత 66 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 32 నిమిషాల 57.375 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో పియాస్ట్రి చైనా గ్రాండ్ప్రి, బహ్రెయిన్ గ్రాండ్ప్రి, సౌదీ అరేబియా గ్రాండ్ప్రి, మయామి గ్రాండ్ప్రిలలో విజేతగా నిలిచాడు. మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ ఐదో స్థానంలో నిలిచినా... చివరి ల్యాప్లో జార్జి రసెల్ కారును ఢీకొట్టినందుకు అతనిపై 10 సెకన్ల పెనాల్టీని విధించారు. దాంతో వెర్స్టాపెన్ చివరకు పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు ఆస్టన్ మార్టిన్ జట్టు డ్రైవర్ లాన్స్ స్ట్రోల్ చేతిలో నొప్పి కారణంగా రేసులో పాల్గొనలేదు. మెర్సిడెస్ డ్రైవర్ కిమి ఆంటోనెలి 53వ ల్యాప్లో, అలెగ్జాండర్ ఆల్బోన్ (విలియమ్స్) 27వ ల్యాప్లో వైదొలిగారు. 24 రేసుల ఈ సీజన్లో 9 రేసులు ముగిశాయి. 186 పాయింట్లతో పియాస్ట్రి అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 176 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 137 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు కెనడియన్ గ్రాండ్ప్రి జూన్ 15న మాంట్రియల్లో జరుగుతుంది. -
చాంపియన్స్ లీగ్ విజేత పీఎస్జీ
మ్యూనిక్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుది పోరులో పీఎస్జీ 5–0 గోల్స్ తేడాతో ఇంటర్ మిలాన్ జట్టుపై విజయం సాధించింది. పీఎస్జీ తరఫున డెసైర్ డౌ (20వ, 63వ నిమిషాల్లో) రెండు గోల్స్తో చెలరేగగా... అష్రఫ్ హాకిమి (12వ నిమిషంలో), ఖ్విచా క్వారట్స్ఖేలియా (73వ నిమిషంలో), సెన్నీ మయులు (86వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆద్యంతం పీఎస్జీ జట్టు ఆధిపత్యం కనబర్చగా... ఇటలీ క్లబ్ ఇంటర్ మిలాన్ జట్టు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. 60 శాతం బంతిని తమ ఆధినంలో పెట్టుకున్న పీఎస్జీ చిన్న చిన్న పాస్లతో ఫలితం రాబట్టింది. 70 ఏళ్ల చరిత్రగల యూరోపియన్ కప్ ఫైనల్లో ఇలా ఒక జట్టు ఏకపక్షంగా భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఇదే తొలిసారి. పీఎస్జీకి ఇదే మొదటి యూరోపియన్ కప్ టైటిల్ కాగా... ఏడో ఫైనల్ ఆడిన ఇంటర్ మిలాన్ జట్టు నాలుగోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది. 1956లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో రియల్ మాడ్రిడ్ జట్టు విజేతగా నిలవగా... ఇప్పుడు పీఎస్జీ రూపంలో 24వ విజేత అవతరించింది. మ్యూనిక్ వేదికగా ఇప్పటి వరకు ఐదుసార్లు ఈ టోర్నీ ఫైనల్ జరగగా... ఐదుసార్లూ కొత్త విజేత ఆవిర్భవించడం విశేషం. -
ENG VS WI 2nd ODI: 54వ సెంచరీ.. చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అంతర్జాతీయ క్రికెట్లో 54వ సెంచరీ, వన్డేల్లో 18వ సెంచరీని నమోదు చేశాడు. వెస్టిండీస్తో ఇవాళ (జూన్ 1) జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. సెంచరీ చేసే క్రమంలో రూట్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 309 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ అజేయమైన సెంచరీతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. రూట్ సిక్సర్, బౌండరీతో సెంచరీ పూర్తి చేశాడు. 🚨 54th INTERNATIONAL HUNDRED FOR JOE ROOT 🚨- The Greatest England Batter ever. 🐐 pic.twitter.com/bs7uEjregH— Johns. (@CricCrazyJohns) June 1, 202538 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 226/5గా ఉంది. రూట్తో (117) పాటు విల్ జాక్స్ (35) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే 72 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది. ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలో ఎదురుదెబ్బలు తినింది. ఓపెనర్లు జేమీ స్మిత్, బెన్ డకెట్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. వన్డౌన్లో వచ్చిన రూట్ అజేయమైన సెంచరీతో విజయం దిశగా తీసుకెళ్తున్నాడు. హ్యారీ బ్రూక్ 47, జోస్ బట్లర్ 0, జేకబ్ బేతెల్ 17 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2, జేడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. వన్డౌన్ బ్యాటర్ కీసీ కార్టీ సూపర్ సెంచరీతో (105 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు), ఓపెనర్ బ్రాండన్ కింగ్ (67 బంతుల్లో 59; 10 ఫోర్లు), నాలుగో నంబర్ ఆటగాడు షాయ్ హోప్ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (10-0-63-4), సాకిబ్ మహమూద్ (9.4-0-37-3) చెలరేగగా.. బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్, విల్ జాక్స్ తలో వికెట్ తీశారు.కాగా, విండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లు)..విరాట్ కోహ్లి-82జో రూట్-54రోహిత్ శర్మ-49కేన్ విలియమ్సన్-48స్టీవ్ స్మిత్-48వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు..జో రూట్-7000 (నాటౌట్)ఇయాన్ మోర్గాన్-6957ఇయాన్ బెల్-5416జోస్ బట్లర్-5196పాల్ కాలింగ్వుడ్-5092 -
IPL 2025 Qualifier 2, PBKS VS MI: మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి..?
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (జూన్ 1) పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు వరుస విరామాల్లో అడ్డుపడుతున్నాడు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి మ్యాచ్ 9 గంటల వరకు ప్రారంభం కాలేదు. 9 గంటల ప్రాంతంలో వర్షం జోరుగా కురుస్తుంది. 9:30 గంటల లోపు మ్యాచ్ ప్రారంభమైతేనే ఎలాంటి ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరిగేలా లేదు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో లేని వర్షం మ్యాచ్ ప్రారంభ సమయానికి జోరందుకుంది.మ్యాచ్ రద్దైతే ఏంటి పరిస్థితి..?ఒకవేళ ఈ మ్యాచ్ పూర్తిగా రద్దైతే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం చేత పంజాబ్ కింగ్స్ ఫైనల్కు చేరుతుంది. ప్లే ఆఫ్స్లో మ్యాచ్లకు రిజర్వ్ డే లేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందేమో చూడాలి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్ స్థానంలో రీస్ టాప్లే.. పంజాబ్ తరఫున హర్ప్రీత్ బ్రార్ స్థానంలో చహల్ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్ -
సెంచరీల మోత మోగిస్తున్న విండీస్ బ్యాటింగ్ సంచలనం.. 4 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఇవాళ (జూన్ 1) జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ వన్డౌన్ ఆటగాడు కీసీ కార్టీ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. కార్టీ 105 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేయడంతో 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. కార్టీతో పాటు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (67 బంతుల్లో 59; 10 ఫోర్లు), నాలుగో నంబర్ ఆటగాడు షాయ్ హోప్ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. విండీస్ ఇన్నింగ్స్లో జువెల్ ఆండ్రూ 0, షిమ్రోన్ హెట్మైర్ 4, జస్టిన్ గ్రీవ్స్ 22, మాథ్యూ ఫోర్డ్ 1, రోస్టన్ ఛేజ్ 0, గుడకేశ్ మోటీ 18, అల్జరీ జోసఫ్ 10 పరుగులకు ఔటయ్యారు. కార్టీ, హోప్ క్రీజ్లో ఉండగా విండీస్ ఇంకా భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఆదిల్ రషీద్ (10-0-63-4), సాకిబ్ మహమూద్ (9.4-0-37-3) చెలరేగడంతో విండీస్ 308 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్, విల్ జాక్స్ కూడా తలో వికెట్ తీశారు.కాగా, విండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ (60), జో రూట్ (57), హ్యారీ బ్రూక్ (58), జేకబ్ బేతెల్ (82) అర్ద సెంచరీలతో చెలరేగగా.. జేమీ స్మిత్ (37), జోస్ బట్లర్ (37), విల్ జాక్స్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 4, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 26.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ తలో 3, ఆదిల్ రషీద్ 2, బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో 11వ నంబర్ ఆటగాడు జేడెన్ సీల్స్ (29 నాటౌట్) టాప్ స్కోరర్గా కాగా.. షాయ్ హోప్ (25), కీసీ కార్టీ (22) 20కి పైగా పరుగులు చేశారు.గత తొమ్మిది ఇన్నింగ్స్ల్లో నాలుగో సెంచరీఇంగ్లండ్తో రెండో వన్డేలో సెంచరీతో మెరిసిన కీసీ కార్టీకి గత తొమ్మిది వన్డే ఇన్నింగ్స్ల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. 28 ఏళ్ల కార్తీ గత 10 ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీలు, 2 అర్ద సెంచరీల సాయంతో 95కు పైగా సగటుతో 864 పరుగులు సాధించాడు. ఓవరాల్ కెరీర్లో 36 వన్డేలు ఆడిన కార్టీ 5 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీల సాయంతో 50కి పైగా సగటుతో 1403 పరుగులు చేశాడు.2nd ODI Vs ENG 103 (105)1st ODI Vs ENG 22 (26) 3rd ODI Vs IRE 170 (142) 2nd ODI Vs IRE 102 (109) 1st ODI Vs IRE 6 (15) 3rd ODI Vs BAN 95 (88) 2nd ODI Vs BAN 45 (47) 1st ODI Vs BAN 21 (37) 3rd ODI Vs ENG 128 (114) 2nd ODI Vs ENG 71 (77) -
PBKS VS MI, Qualifier 2 Updates: ముంబైపై పంజాబ్ విజయం
ఫైనల్లో పంజాబ్19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి ఫైనల్కు చేరిన పంజాబ్ కింగ్స్.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్169 పరుగుల వద్ద పంజాబ్ తన 5వ వికెట్ (షశాంక్) కోల్పోయింది.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ 156 పరుగుల వద్ద పంజాబ్ తన 4వ వికెట్ (నెహాల్) కోల్పోయింది.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ 72 పరుగుల వద్ద పంజాబ్ తన 3వ వికెట్ (జోష్) కోల్పోయింది.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్55 పరుగుల వద్ద పంజాబ్ తన 2వ వికెట్ (ప్రియాన్ష్) కోల్పోయింది.మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్3వ ఓవర్లో పంజాబ్ కింగ్స్ తన మొదటి వికెట్ కోల్పోయింది.పంజాబ్ టార్గెట్ 204 పరుగులుముంబై ఇండియన్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేశారు. దాంతో పంజాబ్కు 204 పరుగులు టార్గెట్గా నిర్దేశించారు.ఆరో వికెట్ కోల్పోయిన ముంబైచివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ 6వ వికెట్ కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేశారుఐదో వికెట్ కోల్పోయిన ముంబై17.6వ ఓవర్- 180 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. అజ్మతుల్లా బౌలింగ్లో హార్దిక్ పాండ్యా (15) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై14.1వ ఓవర్- 142 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో తిలక్ వర్మ (44) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్తిలక్ వర్మ (43), సూర్యకుమార్ యాదవ్ (26) ధాటిగా ఆడుతున్నారు. ఫలితంగా ముంబై 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన ముంబై6.6వ ఓవర్- 70 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో జోస్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి జానీ బెయిర్స్టో (38) ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ /1జానీ బెయిర్స్టో 24, తిలక్ వర్మ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్2.2వ ఓవర్- 19 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్లో వైశాఖ్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (8) ఔటయ్యాడు.రోహిత్ శర్మకు లైఫ్1.5వ ఓవర్- రోహిత్ శర్మకు రెండో ఓవర్లోనే లైఫ్ లభించింది. జేమీసన్ బౌలింగ్లో ఒమర్జాయ్ కాస్త కష్టతరమైన క్యాచ్ డ్రాప్ చేశాడు. 9:45 గంటలకు ప్రారంభమైన మ్యాచ్.. ఎలాంటి ఓవర్ల కోత లేదువర్షం కారణంగా 2 గంటల 15 నిమిషాలు ఆలస్యమైన మ్యాచ్ ఎట్టకేలకు 9:45 గంటలకు ప్రారంభమైంది. ఆలస్యంగా ప్రారంభమైనా ఓవర్లలో ఎలాంటి కోత లేదు. తొలి ఇన్నింగ్స్ 11:15 గంటల వరకు జరుగుతుంది. ఇన్నింగ్స్ విరామ సమయాన్ని 10 నిమిషాలకే కుదించారు. 11:25 గంటలకు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. 12:55 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో ఇవాళ (జూన్ 1) క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్ స్థానంలో రీస్ టాప్లే.. పంజాబ్ తరఫున చహల్ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్ -
విరాట్ కోహ్లికి అవమానం.. 18 నంబర్ జెర్సీ మరొకరికి కేటాయింపు
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లికి అవమానం జరిగింది. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ జెర్సీ నంబర్ 18ని మరొకరి కేటాయించారు. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో భారత-ఏ జట్టు ఆటగాడు ముకేశ్ కుమార్ 18 నంబర్ జెర్సీని ధరించి కనిపించాడు. బీసీసీఐ ఏ ఉద్దేశంతో ముకేశ్కు ఈ జెర్సీ నంబర్ కేటాయించిందోతెలీదు కానీ, విరాట్ అభిమానులు మాత్రం ఈ విషయమై మండిపడుతున్నారు. ఇది తమ ఆరాధ్య ఆటగాడిని అవమానించినట్లే అని బీసీసీఐని టార్గెట్ చేస్తున్నారు.క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీ నంబర్లను ఇతరులకు కేటాయించకపోవడం ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచింది. విరాట్ విషయంలో మొదటి నుంచి పట్టీపట్టనట్లుండే బీసీసీఐ మరోసారి దిగ్గజ ఆటగాడిని అవమానింది. టెస్ట్ల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో విరాట్ కీలకపాత్ర పోషించాడు. అతను కెప్టెన్గా ఉన్న సమయంలో భారత్ చాలాకాలం పాటు నంబర్ వన్ జట్టుగా కొనసాగింది. విరాట్ నాయకత్వంలో టీమిండియా అపురూప విజయాలు సాధించింది. వ్యక్తిగతంగానూ విరాట్కు టెస్ట్ల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది.అలాంటి విరాట్కు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక బీసీసీఐ కనీసం వీడ్కోలు సభ కూడా ఏర్పాటు చేయలేదు. సాధారణంగా దిగ్గజ ప్లేయర్లు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించినా సంబంధిత క్రికెట్ బోర్డులు వారిని గౌరవించుకుంటాయి. అయితే బీసీసీఐ అలాంటి ప్లాన్లు ఏమీ చేయకపోగా.. దిగ్గజ ఆటగాడిని అవమానిస్తుంది. విరాట్ జెర్సీ నంబర్ను ఇతరులకు కేటాయించడంపై విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. భారత క్రికెట్కు విరాట్ ఎంతో చేశాడని, అతని జెర్సీని ఇతరులకు కేటాయించకపోవడం కనీస ధర్మమని అంటున్నారు.ఇదిలా ఉంటే, తొలుత టీ20లకు, ఆతర్వాత టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ఈ సీజన్లో ఫైనల్కు చేరింది. ఈసారి టైటిల్ సాధించి ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలకాలని విరాట్ భావిస్తున్నాడు. జూన్ 3న ఐపీఎల్ 2025 ఫైనల్ జరుగుతుంది. ఇవాళ (జూన్ 1) జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్లో (ముంబై వర్సెస్ పంజాబ్) విజేతతో ఆర్సీబీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఐపీఎల్పై ఫిక్సింగ్ అనుమానాలు.. ఫైనల్ మ్యాచ్ పోస్టర్లో హార్దిక్ పాండ్యా
క్వాలిఫయర్-2 మ్యాచ్కు ముందు ఐపీఎల్ మేనేజ్మెంట్ విడుదల చేసిన ఓ పోస్టర్ వివాదాస్పదంగా మారింది. ఇందులో ఇదివరకే ఫైనల్కు చేరిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఫోటో ఐపీఎల్ ట్రోఫీకి ఓ పక్కన ఉండగా.. మరో పక్క ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నీడను పోలిన ఇమేజ్ ఉంది. ఫైనల్ నేపథ్యంలో ఐపీఎల్ ఈ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఓ బెర్త్ ఆర్సీబీ దక్కించుకుంది. మరో బెర్త్ ఎవరిదో అన్న క్వశ్చన్ మార్కుతో ఈ పోస్టర్ను విడుదల చేసింది.2⃣ teams. 1⃣ seat next to #RCB 💙❤Qualifier 2 has all the answers 🔥#TATAIPL | #TheLastMile pic.twitter.com/gJNtTajmVk— IndianPremierLeague (@IPL) June 1, 2025వాస్తవానికి రెండో ఫైనల్ బెర్త్ కోసం ఇవాళ (జూన్ 1) పోటీ (క్వాలిఫయర్-2) జరుగనుంది. ఈ పోటీలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతుంది.అయితే క్వాలిఫయర్-2 మ్యాచ్ ఫలితం రాకుండానే ఐపీఎల్ మేనేజ్మెంట్ ఫైనల్ పోస్టర్పై హార్దిక్ పాండ్యా నీడను పోలిన ఇమేజ్ను పెట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఫైనల్లో ఆర్సీబీతో తలపడబోయేది ముంబై ఇండియన్సే అని ఐపీఎల్ మేనేజ్మెంట్ క్లూ ఇచ్చిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ 2025 ఫిక్స్ అయ్యిందంటూ సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.ఐపీఎల్ మేనేజ్మెంట్ ఫైనల్ పోస్టర్పై హార్దిక్ నీడను పోలిన ఇమేజ్ పెట్టడంతో పాటు నీలం రంగు గుండె సింబల్తో ఏమోజీని పెట్టింది. నీలం రంగు ముంబై ఇండియన్స్ జెర్నీని సూచిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఫైనల్లో ఆర్సీబీతో తలపడబోయేది ముంబై ఇండియన్సే అని పరోక్షంగా సంకేతాలు అందుతున్నాయి.ఐపీఎల్ ఉద్దేశపూర్వకంగా చేసిందో ఏమో తెలీదు కానీ, ముంబై ఇండియన్స్కు ఫేవర్గా ఫైనల్ పోస్టర్ ఉండటం నెట్టింట దుమారాన్ని రేపుతుంది. ఐపీఎల్ ఫిక్స్ అయ్యిందంటూ ముంబై ఇండియన్స్ వ్యతిరేకులు ప్రచారం మొదలుపెట్టారు. ఐపీఎల్ యాజమాన్యం వ్యవహారశైలిపై పంజాబ్ కింగ్స్ అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్ మేనేజ్మెంట్ ముంబై ఇండియన్స్కు అనుకూలంగా, మాకు వ్యతిరేకంగా మైండ్ గేమ్ ఆడుతుందని అంటున్నారు.ఐపీఎల్పై జరుగుతున్న ఫిక్సింగ్ ప్రచారంలో నిజానిజాలెంతో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. ఒకవేళ మ్యాచ్ నిజంగానే ఫిక్స్ అయ్యుంటే క్రికెట్ అభిమానులు ఈజీగా పట్టేస్తారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. -
నిబంధనల అతిక్రమణ.. వెస్టిండీస్కు షాకిచ్చిన ఐసీసీ
మే 29న ఇంగ్లండ్తో వన్డే మ్యాచ్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వెస్టిండీస్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఆ జట్టు ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘణ స్లో ఓవర్ రేట్ పరిధిలోకి వస్తుంది. ఆ మ్యాచ్లో విండీస్ అదనపు సమయం ముగిసినా తమ కోటా ఓవర్లు (50) పూర్తి చేయలేకపోయింది. ఓ ఓవర్ వెనకపడింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో విండీస్ జట్టులోని ఆటగాళ్లందరికీ ఐదు శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధించాడు. ఈ జరిమానాను విండీస్ జట్టు సభ్యులు సవాలు చేయకుండా స్వీకరించారు. సాధారణంగా నిర్ణీత సమయంలోగా కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్కు ఐదు శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధిస్తారు.ఇదిలా ఉంటే, మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు మే 29న తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ (60), జో రూట్ (57), హ్యారీ బ్రూక్ (58), జేకబ్ బేతెల్ (82) అర్ద సెంచరీలతో చెలరేగగా.. జేమీ స్మిత్ (37), జోస్ బట్లర్ (37), విల్ జాక్స్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 4, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 26.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ తలో 3, ఆదిల్ రషీద్ 2, బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో 11వ నంబర్ ఆటగాడు జేడెన్ సీల్స్ (29 నాటౌట్) టాప్ స్కోరర్గా కాగా.. షాయ్ హోప్ (25), కీసీ కార్టీ (22) 20కి పైగా పరుగులు చేశారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇవాళ (జూన్ 1) రెండో వన్డే జరుగుతుంది. -
తొలి మ్యాచ్లోనే ఇరగదీసిన సీఎస్కే చిచ్చరపిడుగు బ్రెవిస్
సీఎస్కే చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ ఇంగ్లండ్ టీ20 లీగ్లో (వైటాలిటి టీ20 బ్లాస్ట్ 2025) తన తొలి మ్యాచ్లోనే ఇరగదీశాడు. ఈ లీగ్లో హ్యాంప్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రెవిస్.. ఎసెక్స్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. బ్రెవిస్తో పాటు టాబీ ఆల్బర్ట్ (54), జేమ్స్ విన్స్ (62) కూడా మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో హ్యాంప్షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ చేసింది. హ్యాంప్షైర్ ఇన్నింగ్స్లో హోవెల్ 11, జేమ్స్ ఫుల్లర్ 4, వెథర్లీ 3, టామ్ ప్రెస్ట్ 3 పరుగులకు ఔట్ కాగా.. లియామ్ డాసన్ 19, వుడ్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఎసెక్స్ బౌలర్లలో మహ్మద్ ఆమిర్, వాల్టర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుక్, హార్మర్, క్రిచ్లే తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్ ఏమాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది. డాసన్ (4-0-26-4), స్టార్ కర్రీ (2.2-0-20-2) చెలరేగడంతో ఆ జట్టు 16.2 ఓవర్లలో 124 పరుగులకే చాపచుట్టేసింది. ఫుల్లర్, హోవెల్ కూడా తలో వికెట్ తీశారు. ఎసెక్స్ ఇన్నింగ్స్లో కైల్ పెప్పర్ ఒక్కడే అర్ద సెంచరీతో (51) రాణించాడు. రొస్సింగ్టన్ (18), వాల్టర్ (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డీన్ ఎల్గర్ 0, క్రిచ్లీ 4, అల్లీసన్ 0, బెన్కెన్స్టెయిన్ 6, హార్మర్ 2, స్నేటర్ 5, ఆమిర్ 3 పరుగులకు ఔటయ్యారు.ఐపీఎల్ 2025లో అదరగొట్టిన బ్రెవిస్ఐపీఎల్ 2025లో లేట్గా రంగప్రవేశం చేసిన డెవాల్డ్ బ్రెవిస్ ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్ల్లోనే తన తడాఖా చూపించాడు. ఈ మ్యాచ్లో అతను 180 స్ట్రయిక్రేట్తో రెండు హాఫ్ సెంచరీల సాయంతో 225 పరుగులు చేశాడు. ఈ సీజన్లో బ్రెవిస్ ఆడిన ఇన్నింగ్స్లు వచ్చే సీజన్లో సీఎస్కే ప్రయాణానికి జీవం పోశాయి. బ్రెవిస్ను ఈ సీజన్లో సీఎస్కే రీప్లేస్మెంట్ ఆటగాడిగా తీసుకుంది. రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. -
ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. ఎప్పుడంటే?
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్ను రింకూ పెళ్లిచేసుకోనున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 8న జరగనుంది. వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హాటల్లో జరగనుంది. అదేవిధంగా రింకూ సింగ్, ప్రియా సరోజ్ నవంబర్లో వివాహం చేసుకోనున్నారు. వారి పెళ్లి వారణాసిలో నవంబర్ 18న హోటల్ తాజ్లో గ్రాండ్గా జరగనుంది. ఈ విషయాన్ని రింకూ సింగ్ సన్నిహితులు వెల్లడించారు. కాగా వీరిద్దరి పెళ్లి అంశం ఈ ఏడాది జనవరిలో తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. కాగా 27 ఏళ్ల రింకూ భారత టీ20 జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఈ యూపీ క్రికెటర్ టీమిండియా తరపున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. అదేవిధంగా 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లోని మచ్లిషెహర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. ప్రియా సరోజ్ ఎంపీ మాత్రమే కాకుండా ఆమె న్యాయవాది వృత్తిలో కూడా కొనసాగుతున్నారు.చదవండి: IND vs ENG: 'కోహ్లిని ముందే హెచ్చరించారు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు' -
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ
కార్డిఫ్ వేదికగా వెస్టిండీస్తో రెండో వన్డేలో తలపడేందుకు ఇంగ్లండ్ సిద్దమైంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ జామీ ఓవర్టన్ చేతి వేలి గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ప్లెయింగ్ ఎలెవన్లో అతడి స్ధానంలో పేసర్ మాథ్యూ పాట్స్కు ఛాన్స్ లభించింది. ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డేలో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పర్యాటక విండీస్ను 238 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓడించింది.ఇప్పుడు రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ భావిస్తోంది. బ్రూక్ సేన బ్యాటింగ్, బౌలింగ్లో పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్లో స్మిత్, రూట్, డకెట్, బట్లర్, బెథల్ వంటి బ్యాటర్లు అద్బుతమైన ఫామ్లో ఉండగా.. బౌలింగ్లో షోయబ్ మహమూద్, బ్రైడన్ కార్స్ వంటి స్టార్ పేసర్లు ఉన్నారు.మరోవైపు విండీస్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. అయితే వెస్టిండీస్ టీమ్లో షాయ్ హోప్, కార్టీ, సీల్స్ మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ఫామ్లో లేరు. కనీసం రెండో వన్డేలోనైనా కరేబియన్ వీరులు చెలరేగుతారో లేదో వేచి చూడాలి.రెండో వన్డేకు ఇంగ్లండ్ తుది జట్టుబెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, బ్రైడాన్ కార్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్. -
'కోహ్లిని ముందే హెచ్చరించారు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆకస్మిక టెస్టు రిటైర్మెంట్పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్ మొత్తం ఆడేందుకు తనకు అవకాశమివ్వమని సెలక్టర్లు చెప్పడంతోనే కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడని పనేసర్ అభిప్రాయపడ్డాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత కొత్త టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. టెస్టు జట్టులో యువ ఆటగాళ్లు సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండా యువ భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో గిల్ సేన ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో ఎలా రాణిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు."ఇంగ్లండ్ పర్యటనకు విరాట్ కోహ్లి వస్తాడని నేను అనుకున్నాను. ఇంగ్లండ్ జట్టు సభ్యులు కూడా కోహ్లి ఆడుతాడని ఆశించారు. కానీ కోహ్లి సడన్గా రిటైర్మెంట్ ప్రకటించడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ వంటి కఠిన సిరీస్ నుంచి కోహ్లి కావాలనే బయటపడ్డాడని అన్పిస్తోంది.ఎందుకంటే గత కొన్నేళ్లగా వైడ్ ఆప్ స్టంప్ సమస్యను కోహ్లి అధిగమించలేకపోతున్నాడు. టెస్టు క్రికెట్లో పదేపదే అదే బంతులకు కోహ్లి ఔట్ అవుతున్నాడు. బహుశా ఇది అతడి మైండ్లో ఉండవచ్చు. అదేవిధంగా సెలక్టర్లు కూడా కోహ్లితో ఓ విషయం చర్చించి ఉంటారు అని అనుకుంటున్నాను. తొలి రెండు టెస్టుల్లో బాగా రాణించకపోతే, మిగిలిన మూడు మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని సెలక్టర్లు చెప్పి ఉండొచ్చు. ఇవన్నీ ఆలోంచాకే కోహ్లి తన నిర్ణయాన్ని ప్రకటించాడు" అని హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: బీసీసీఐ చైర్మెన్గా రాజీవ్ శుక్లా..? -
బీసీసీఐ చైర్మెన్గా రాజీవ్ శుక్లా..?
భారత క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది జూలైలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చెర్మైన్ పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. 70 ఏళ్ల నిండిన తర్వాత ఆఫీసు బేరర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.ఈ ఏడాది జూలై 19తో బిన్నీ70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ క్రమంలో రోజర్ తనంతట తానే అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు క్రిక్బ్లాగర్కు తెలిపాయి. అతని స్దానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా బోర్డు తాత్కాలిక చైర్మెన్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రిక్బ్లాగర్ తమ కథనంలో పేర్కొంది. ఈ విషయంపై బోర్డులో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 1983 వరల్డ్కప్ విజేతైన రోజర్ బిన్నీ.. 2022లో గంగూలీ స్ధానంలో బీసీసీఐ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన దాదాపు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఇక రాజీవ్ శుక్లా చాలా ఏళ్ల నుంచి భారత క్రికెట్తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా గతంలో ఐపీఎల్ చైర్మెన్గా కూడా పనిచేశారు. త్వరలో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో శుక్లా ఎంపికను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.చదవండి: IPL 2025 Qualifier 2: పంజాబ్కు గుడ్ న్యూస్.. ముంబైకి బ్యాడ్ న్యూస్? -
IPL 2025 Qualifier 2: పంజాబ్కు గుడ్ న్యూస్.. ముంబైకి బ్యాడ్ న్యూస్?
ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2కు సమయం అసన్నమైంది. ఆదివారం సెకెండ్ క్వాలిఫయర్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ కీలక మ్యాచ్కు పంజాబ్ కింగ్స్కు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమైన యుజ్వేంద్ర చాహల్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో క్వాలిఫయర్-2కు చాహల్ అందుబాటులో ఉండనున్నాడని రేవ్స్పోర్ట్స్ తమ రిపోర్ట్లో పేర్కొంది. కాగా చాహల్ గాయం నుంచి కోలుకుపోవడం పంజాబ్కు కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో చాహల్ పంజాబ్ జట్టుకు ప్రధాన స్పిన్నర్గా ఉన్నాడు. ఓ హ్యాటిక్ కూడా అతడి ఖాతాలో ఉంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన చాహల్.. 9.56 ఏకానమితో 14 వికెట్లు పడగొట్టాడు.చాహర్ డౌటే..మరోవైపు ఈ మ్యాచ్కు కూడా ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ అందుబాటులో ఉండేది అనుమానమే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చాహర్.. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ కోచింగ్ స్టాప్, కోచ్ మహేల జయవర్ధనేతో కలిసి ఫిట్నెస్ కసరత్తులు చేస్తున్నట్లు రేవ్స్పోర్ట్స్ తమ కథనంలో రాసుకొచ్చింది. కానీ అతడు ఇంకా కుంటుతున్నట్లు సదరు వెబ్సైట్ రాసుకొచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్కు చాహర్ దూరమైతే.. యువ పేసర్ అశ్వినీ కుమార్కు మరోసారి అవకాశం లభించనుంది.తుది జట్లు(అంచనా)పంజాబ్ కింగ్స్ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, కైల్ జామీసన్, చాహల్ముంబై ఇండియన్స్రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్ -
కరుణ్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్లో భారత్-ఎ భారీ స్కోర్
కాంటర్బరీ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు చేసింది. దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శన కనబర్చి ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన కరుణ్ నాయర్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కరుణ్ నాయర్ 281 బంతుల్లో 26 ఫోర్లు, ఒక సిక్సర్తో 204 పరుగులు చేశాడు. ఓవర్నైట్ స్కోరు 409/3తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ చివరకు 125.1 ఓవర్లలో 557 పరుగులకు ఆలౌటైంది.వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ (120 బంతుల్లో 94; 11 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (7) విఫలమయ్యాడు. శార్దుల్ ఠాకూర్ (27), హర్ష్ దూబే (32), అన్షుల్ కంబోజ్ (23) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లలో జోష్ హాల్, జమాన్ అక్తర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ లయన్స్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 52 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టామ్ హైన్స్ (147 బంతుల్లో 103 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... మ్యాక్స్ హోల్డెన్ (61 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఎమిలియో (46) ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్లో సత్తాచాటిన భారత ‘ఎ’ ఆటగాళ్లు... బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఇంగ్లండ్ లయన్స్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు.అన్షుల్ కంబోజ్, హర్ష్ దూబే చెరో వికెట్ పడగొట్టగా... ముకేశ్ కుమార్, హర్షిత్ రాణా భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయిన నితీశ్ రెడ్డి బౌలింగ్లో 3 ఓవర్లే వేసి 27 పరుగులు సమరి్పంచుకున్నాడు. నాలుగు రోజుల ఈ పోరులో... చేతిలో 8 వికెట్లు ఉన్న ఇంగ్లండ్ లయన్స్ జట్టు భారత్ ‘ఎ’ స్కోరుకు ఇంకా 320 పరుగులు వెనుకబడి ఉంది. టామ్ హైన్స్, హోల్డన్ క్రీజులో ఉన్నారు. మూడో రోజు భారత బౌలర్లు ఎలాంటి ప్రభావం కనబరుస్తారో చూడాలి.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్.. టీమిండియా మేనేజర్గా యుధ్వీర్ -
ఇంగ్లండ్ టూర్.. టీమిండియా మేనేజర్గా యుధ్వీర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు మేనేజర్గా యుధ్వీర్ సింగ్ ఎంపికయ్యాడు. ఈ నెల 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టూర్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యు«ద్వీర్ను మేనేజర్గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యూపీసీఏ) కార్యదర్శిగా పనిచేస్తున్న యుధ్వీర్... గతంలో యూపీసీఏ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. క్రికెట్ వ్యవహారాల్లో అతడికి విశేష అనుభవం ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ప్రకటించగా... యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో గిల్ సారథ్యంలోని యువ జట్టు ఈ సిరీస్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సీజన్ను భారత జట్టు ఇదే సిరీస్తో ప్రారంభించనుంది.చదవండి: పది మందికి రూ. 1 కోటికి పైగా... -
ప్రిక్వార్టర్స్లో సినెర్, జ్వెరెవ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్టార్లు, సీడెడ్ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, డిఫెండింగ్ చాంపియన్ కార్లొస్ అల్కరాజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో రెండో సీడ్ కొకొ గాఫ్, మూడో సీడ్ పెగూలా, ఆరో సీడ్ అండ్రీవా ప్రిక్వార్టర్స్ చేరారు. అయితే భారత డబుల్స్ ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న తన చెక్ రిపబ్లిక్ భాగస్వామితో ముందంజ వేయగా... శ్రీరామ్ బాలాజీకి రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. సులువుగా సినెర్... టాప్సీడ్ ఇటలీ స్టార్ యానిక్ సినెర్ క్లేకోర్ట్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేశాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో మూడు గ్రాండ్స్లామ్ల చాంపియన్, నిరుటి ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ సినెర్ 6–0, 6–1, 6–2తో చెక్ రిపబ్లిక్ ఆటగాడు జిరి లెహెకాపై అలవోక విజయం సాధించాడు. గంటన్నర పాటు జరిగిన ఈ సమరంలో 3 ఏస్లు సంధించిన టాప్సీడ్ ఆటగాడు, 27 విన్నర్లు కొట్టాడు. లెహెక మూడు ఏస్లు సంధించినప్పటికీ 14 విన్నర్లే కొట్టగలిగాడు. గత ఫ్రెంచ్ ఓపెన్, తాజా ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 7–6 (7/4), 6–1తో ఇటలీకి చెందిన ఫ్లావికొ కొబొలిపై గెలుపొందగా... స్పెయిన్ సంచలనం, రెండో సీడ్ అల్కరాజ్ 6–1, 6–3, 4–6, 6–4తో డమిర్ డిజుమ్హుర్ (బోస్నియా)పై విజయం సాధించాడు. పెగూలా జోరు మహిళల సింగిల్స్లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో జెస్సికా పెగూలా (అమెరికా) 3–6, 6–4, 6–2తో మార్కెటా వొండ్రుసొవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందగా... రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) 6–1, 7–6 (7/3)తో బొజ్కొవా (చెక్ రిపబ్లిక్)తో విజయం సాధించింది. ఆరో సీడ్ అండ్రీవా (రష్యా) 6–3, 6–1తో యూలియా పుతిత్సెవా (కజకిస్తాన్)పై సులువుగా గెలిచి ప్రిక్వార్టర్స్ చేరారు. అమెరికన్ ప్రత్యర్థుల మధ్య జరిగిన మరో పోరులో ఏడో సీడ్ మాడిసన్ కీస్ 4–6, 6–3, 7–5తో 31వ సీడ్ కెనిన్పై నెగ్గింది. డబుల్స్ ప్రిక్వార్టర్స్లో బోపన్న భారత అగ్రశ్రేణి డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న పురుషుల డబుల్స్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన రెండో రౌండ్లో బోపన్న–పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జోడీ 6–7 (2/7), 7–6 (7/5), 6–2తో ఫ్రాన్స్కు చెందిన 13వ సీడ్ సాడియో డౌంబియా– ఫెబియెన్ రి»ొల్ జంటపై చెమటోడ్చి నెగ్గింది. ఇరు జోడీలు హోరాహోరీగా తలపడటంతో తొలి రెండు సెట్లు టైబ్రేక్కు దారితీసాయి. తొలిసెట్ కోల్పోయినప్పటికీ ఎలాంటి నిరుత్సాహానికి గురవని భారత్–చెక్ జోడీ రెండో సెట్లో పుంజుకొంది. టైబ్రేక్తో రెండో సెట్ను తర్వాత మూడో సెట్తో మ్యాచ్లో గెలుపొందింది. మరో డబుల్స్ ద్వయం శ్రీరామ్ బాలాజీకి రెండో రౌండ్లో చుక్కెదురైంది. బాలాజీ–రెయెస్ వారెలా (మెక్సికో) 3–6, 4–6తో ఇటలీకి చెందిన సిమోన్ బొలెలి– అండ్రియా వవసొరి జంట చేతిలో ఓటమి పాలైంది. -
24 పతకాలతో భారత్కు రెండో స్థానం
గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆఖరి రోజు కూడా భారత్ పతకాల వేట కొనసాగింది. శనివారం జరిగిన చివరి రోజు పోటీల్లో అథ్లెట్లు మరో అర డజను (6) పతకాలు సాధించారు. జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్, మహిళల 5000 మీ. పరుగులో పారుల్ చౌదరి రజతం గెలుపొందగా. మరో రజత పతకం మహిళల 4్ఠ100 మీ. రిలేలో లభించింది. పురుషుల 200 మీ. స్ప్రింట్లో అనిమేశ్ కుజూర్, మహిళల 800 మీ. పరుగులో పూజ సింగ్, మహిళల 400 మీ. హర్డిల్స్లో విత్య రామ్రాజ్ కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో రెండో పతకం గెలవాలని గంపెడాశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ మేటి రన్నర్ జ్యోతి యర్రాజీకి 200 మీటర్ల పరుగులో నిరాశ ఎదురైంది. 100 మీ. హర్డిల్స్లో పసిడి పతకాన్ని నిలబెట్టుకున్న ఆమె... స్ప్రింట్లో మాత్రం 23.47 సెకన్ల టైమింగ్తో ఐదో స్థానానికి పరిమితమైంది. భారత్కు రెండో స్థానం ఓవరాల్గా భారత్ 24 పతకాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గత బ్యాంకాక్ (2023లో 27 పతకాలు) ఈవెంట్తో పోల్చితే 3 పతకాలు తగ్గినా... బంగారంలో భారత్ మెరుగైంది. నాటి క్రీడల్లో 6 స్వర్ణాలు సాధిస్తే... తాజా ఈవెంట్లో 8 పసిడి పతకాలు సహా 10 రజతాలు, 6 కాంస్య పతకాలను భారత బృందం గెలిచింది. చైనా 32 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. బీజింగ్ బృందం 19 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించింది.28 పతకాలు గెలుచుకున్న జపాన్ మూడో స్థానంలో ఉంది. జపనీస్ అథ్లెట్లు రజతాలు (11), కాంస్యాలు (12) ఎక్కువగా సాధించినప్పటికీ స్వర్ణాల్లో (5) వెనుకబడటంతో మూడో స్థానం దక్కింది. ఈ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ చరిత్రలో భారత్ 2017లో 29 పతకాలతో అగ్ర స్థానంలో నిలిచిన ఘనతను సొంతం చేసుకుంది. సొంతగడ్డ (భువనేశ్వర్)పై జరిగిన ఆ ఈవెంట్లో 10 స్వర్ణాలు, 6 రజతాలు, 13 కాంస్య పతకాలను భారత్ చేజిక్కించుకుంది. పారుల్కు రెండో రజతం ఈ పోటీల్లో ఇదివరకే మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో రజత పతకం సాధించిన పారుల్ చౌదరి డబుల్ ధమాకా సాధించింది. తాజాగా ఆమె మహిళల 5000 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంతో పోడియంలో నిలిచింది. సుదీర్ఘ పరుగు పోటీని ఆమె 15 నిమిషాల 15.33 సెకన్లలో ముగించి రెండో రజత పతకాన్ని చేజిక్కించుకుంది. పురుషుల జావెలిన్ త్రోలో రైజింగ్ స్టార్ సచిన్ యాదవ్ ఈటెను 85.16 మీటర్ల దూరంలో విసిరి రజతం అందుకున్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (84.39 మీ.)ను అధిగమించాడు. సచిన్ సహచరుడు... ఫైనల్ బరిలో నిలిచిన యశ్వీర్ సింగ్ కూడా అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (82. 57 మీటర్లు) నమోదు చేసినప్పటికీ ఐదో స్థానంలో నిలిచాడు. మహిళల 4x100 మీటర్ల రిలే ఈవెంట్లో తెలంగాణ అథ్లెట్ నిత్య గంధె, అభినయ, స్నేహ, శ్రావణి నందతో కూడిన భారత బృందం సీజన్ బెస్ట్ ప్రదర్శన 43.86 సెకన్లతో రెండో స్థానంతో రజత పతకాన్ని గెలుచుకుంది. విత్య, పూజలకు కాంస్యాలు ఆసియా క్రీడల కాంస్య పతక విజేత విత్య రామ్రాజ్ కాంస్య పతకం గెలిచింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల అథ్లెట్ పోటీని 56.46 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంతో ‘పోడియం’లో నిలిచింది. శనివారం ఈ ఫైనల్స్ బరిలో నిలిచిన మరో భారత అథ్లెట్ అను రాఘవన్కు ఏడో స్థానం దక్కింది. ఆమె పోటీని 57.46 సెకన్లలో పూర్తి చేసింది. మహిళల ఈవెంట్లో మరో కాంస్యాన్ని పూజ సింగ్ సాధించింది. మహిళల 800 మీటర్ల పరుగులో పోటీపడిన ఆమె రేస్ను 2 నిమిషాల 01.89 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచింది.స్ప్రింట్లో దశాబ్దం తర్వాత...కొరియన్ గడ్డపై స్పింట్లో పతకానికి పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పురుషుల 200 మీటర్ల పరుగులో అనిమేశ్ కుజూర్ కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన పోటీలో 21 ఏళ్ల ఒడిశా స్ప్రింటర్ పరుగును 20.32 సెకన్లలో పూర్తిచేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. కానీ వెంట్రుక వాసిలో 00.01 సెకన్ తేడాతో రజతం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే అతని వ్యక్తిగత అత్యుత్తమ వేగాన్ని (20.40 సెకన్లు) మెరుగుపర్చుకున్నాడు. ఈ ఏడాది సీనియర్ అథ్లెటిక్స్లో ఆ టైమింగ్ను నమోదు చేశాడు. అబ్దుల్ అజీజ్ (సౌదీ అరేబియా; 20.31 సె.) రజతం నెగ్గారు. సరిగ్గా పదేళ్ల క్రితం (2015లో) 200 మీ. పరుగులో ధరమ్వీర్ సింగ్ కాంస్యంతో స్ప్రింట్లో భారత్ తొలి పతకం అందించాడు. ఆ తర్వాత నాలుగుసార్లు 2017, 2019, 2021, 2023 ఆసియా ఈవెంట్ జరిగినా... ఎవరూ స్ప్రింట్లో పతకం నెగ్గలేకపోయారు. -
పది మందికి రూ. 1 కోటికి పైగా...
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–12 కోసం జరిగిన వేలంలో ఆటగాళ్ల పంట పండింది. లీగ్ వేలం చరిత్రలో ఒకే సీజన్లో తొలిసారి 10 మందికి పైగా ఆటగాళ్లు రూ. 1 కోటికి మించి విలువ పలకడం విశేషం. గత సీజన్లో ‘అత్యంత విలువైన ఆటగాడి’ అవార్డు పొందిన ఇరాన్ ప్లేయర్ మొహమ్మద్ రెజా షాద్లుయికి రికార్డు స్థాయిలో రూ. 2.23 కోట్లు దక్కడం విశేషం. ఈ భారీ మొత్తానికి గుజరాత్ జెయింట్స్ రెజాను సొంతం చేసుకుంది. వరుసగా మూడు సీజన్లోనూ రూ. 2 కోట్లకు మించిన ధర పలికిన ఆటగాడిగా రెజా నిలవడం అతని స్థాయిని చూపిస్తోంది. భారత ఆటగాళ్లలో దేవాంక్ దలాల్ టాపర్గా నిలిచాడు. అతడిని వేలంలో బెంగాల్ వారియర్స్ రూ. 2.20 కోట్లకు గెలుచుకుంది. గత సీజన్లో దేవాంక్ బెస్ట్ రైడర్గా నిలిచి పట్నా పైరేట్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు టైటాన్స్ జట్టు వేలంలో భరత్ (రూ.81.50 లక్షలు), విజయ్ మలిక్ (రూ.51.50 లక్షలు), శుభమ్ షిండే (రూ. 80 లక్షలు)లను ఎంచుకుంది. -
సెమీస్లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
సింగపూర్: భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో పరాజయం పాలైంది. వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీస్లో శనివారం సాత్విక్–చిరాగ్ జంట 21–19, 10–21, 18–21తో ఆరోన్ చియా–సోహ్ యిక్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడింది. 64 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ గెలిచిన భారత జోడీ... ఆ తర్వాత రెండో గేమ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో చక్కటి ప్రదర్శన కనబర్చినప్పటకీ... కీలక సమయాల్లో పాయింట్లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీకి ఇది మూడో సెమీఫైనల్ ఓటమి. అంతకుముందు ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్లోనూ ఈ జంట సెమీస్లోనే పరాజయం పాలైంది. పారిస్ ఒలింపిక్స్లో మలేసియా ప్లేయర్ల చేతిలోనే ఓడి ఇంటి బాటప్టటిన భారత షట్లర్లు ఈ సారి కూడా వారిపై విజయం సాధించలేకపోయారు. -
MI Vs PBKS: ఫైనల్ చేరేదెవరో!
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే ఫైనల్ చేరగా... రెండో ఫైనలిస్ట్ను తేల్చే సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. క్వాలిఫయర్–1లో బెంగళూరు చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పంజాబ్... ఈ పోరులో సత్తా చాటి ఫైనల్లో మరోసారి బెంగళూరును ఎదుర్కోవాలని భావిస్తోంది. మరో వైపు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి... ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ను చిత్తుచేసిన ముంబై ఇదే జోరులో పంజాబ్పై గెలిచి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. క్వాలిఫయర్–1లో టాపార్డర్ విఫలమవడంతో పంజాబ్ 101 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకోగా... ఎలిమినేటర్లో గుజరాత్ బౌలింగ్ను ఓ ఆటాడుకుంటూ ముంబై భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ విజయం సాధించింది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ సమష్టి ప్రదర్శన ముందు... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన పంజాబ్ కింగ్స్ ఏమాత్రం నిలుస్తుందో చూడాలి! టాపార్డర్ రాణిస్తేనే... ఈ సీజన్లో ఆడిన 15 మ్యాచ్ల్లో ఏడింట రెండొందల పైచిలుకు స్కోర్లు చేసిన పంజాబ్ జట్టు... టాపార్డర్ ప్రదర్శనపై అతిగా ఆధారపడుతోంది. అన్క్యాప్డ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య నిలకడకు ఇన్గ్లిస్, శ్రేయస్ మెరుపులు తోడవడంతో పంజాబ్ వరస విజయాలు సాధించగలిగింది. అయితే సొంతగడ్డపై జరిగిన క్వాలిఫయర్–1లో మాత్రం ఈ నలుగురు మూకుమ్మడిగా విఫలమవడంతో... జట్టు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి... రికీ పాంటింగ్ వ్యూహాలు తోడవడంతో ఈ సీజన్లో పంజాబ్ పట్టికలో అగ్ర స్థానం దక్కించుకోగలిగింది. దీంతోనే క్వాలిఫయర్–1లో ఓడినా... ఫైనల్ చేరేందుకు మరో అవకాశం దక్కింది. ఈ సీజన్లో ప్రభ్సిమ్రన్ 517 పరుగులతో పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు సాధించగా... శ్రేయస్ 516, ప్రియాన్ష్ 431 పరుగులు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఇన్గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్ సత్తాచాటాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్ల్లో బరిలోకి దిగని స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్ ఆడటం ఖాయమే. బౌలింగ్లో అర్ష్ దీప్ సింగ్, అజ్మతుల్లా, జెమీసన్, హర్ప్రీత్ బ్రార్ కీలకం కానున్నారు. గత మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకోకపోతే... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ ఇక్కడితోనే ప్రయాణాన్ని ముగించాల్సి ఉంటుంది. బుమ్రానే ప్రధాన తేడా! ఐపీఎల్ నాకౌట్స్లో అపార అనుభవం ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి కలిసికట్టుగా కదంతొక్కి ఆరో టైటిల్ వేటకు చేరాలని చూస్తోంది. పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయినా... వారి స్థానాలను భర్తిచేసే ఆటగాళ్లు ఉండటం ముంబైకి కలిసి రానుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత రికెల్టన్, విల్ జాక్స్ జట్టును వీడినా... గత మ్యాచ్లో తొలిసారి ముంబై జట్టుకు ప్రాతనిధ్యం వహించిన జానీ బెయిర్స్టో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కూడా టచ్లోకి రావడం ముంబై బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచింది. రోహిత్, బెయిర్స్టో జట్టుకు శుభారంభం అందిస్తుంటే... సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఈ సీజన్లో 673 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఆలస్యంగా వేగం పుంజుకున్న రోహిత్ 410 పరుగులు చేయగా... హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ ఫినిషర్ల పాత్ర పోషిస్తున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్కు కూడా దీపక్ చహర్ అందుబాటులో ఉండటం కష్టమే కాగా... గత మ్యాచ్ చివర్లో కండరాలు పట్టేసిన గ్లీసన్ బరిలోకి దిగుతాడా లేదా చూడాలి. ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రా కానున్నాడు. ఆశలే లేని స్థితిలో సైతం తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉన్న బుమ్రాను... పంజాబ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, జోస్ ఇన్గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, హర్ప్రీత్ బ్రార్, జెమీసన్, చాహల్, అర్ష్ దీప్. ముంబై ఇండియన్స్: హార్దిక్ (కెప్టెన్), రోహిత్ శర్మ, బెయిర్స్టో, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్, సాంట్నర్, రాజ్ బావా, గ్లీసన్, బుమ్రా, బౌల్ట్, అశ్వని కుమార్. పిచ్, వాతావరణం ఈ సీజన్లో అహ్మదాబాద్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరింట మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో టాస్ కీలక పాత్ర పోషించవచ్చు. మ్యాచ్కు వర్షం ముప్పులేదు. ఐపీఎల్లో నేడు (క్వాలిఫయర్–2)పంజాబ్ X ముంబైవేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో -
డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్..
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ ఘనంగా ఆరంభించాడు. కాంటర్బరీ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న తొలి అనాధికారిక-ఎ టెస్టులో కరుణ్ నాయర్.. భారత-ఎ జట్టు తరపున అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన నాయర్.. 272 బంతుల్లో తన డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 26 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఓవరాల్గా 204 పరుగులు చేసి ఔటయ్యాడు. నాయర్కు ఇది నాలుగో ఫస్ట్ క్లాస్ ద్విశతకం కావడం గమనార్హం.కోహ్లి వారసుడు ఫిక్స్..?కాగా విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్టుల్లో అతడి స్దానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. కొంతమంది సాయిసుదర్శన్ పేరును సూచిస్తుంటే.. మరి కొంతమంది కరుణ్ నాయర్ను పేరును చెబుతున్నారు.ఇటువంటి సమయంలో కోహ్లి స్ధానానికి తనే సరైనోడనని నాయర్ డబుల్ సెంచరీతో చాటుకున్నాడు. కాగా కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తుండడంతో నాయర్కు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. నాయర్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్గా నిలవడంలో కరుణ్ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్గా నిలిచాడు. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.భారీ స్కోర్ దిశగా భారత్-ఎఇక అనాధికరిక టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్-ఎ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్తోంది. 112 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్(92), ధ్రువ్ జురెల్(94) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. -
Qualifier 2 PBKS vs MI: అలా జరిగితే ముంబై ఇండియన్స్ ఇంటికే?
ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2కు రంగం సిద్దమైంది. జూన్ 1(ఆదివారం) జరగనున్న సెకెండ్ క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. 2014 తర్వాత తొలిసారి ఫైనల్కు చేరుకునేందుకు పంజాబ్ ప్రయత్నిస్తుండగా.. ముంబై ఇండియన్స్ ఆరో ఐపీఎల్ టైటిల్ లక్ష్యంగా పెట్టుకుంది.క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు మొహాలీలోని ముల్లాన్పూర్ స్టేడియం ఆతిథ్యమివ్వగా.. ఇప్పుడు క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నాయి.క్వాలిఫయర్-2 రద్దు అయితే?ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ వర్షం లేదా ఏదైనా కారణం వల్ల రద్దు అయితే ఏంటి పరిస్థితి అని ఇరు జట్ల అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్కు బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించలేదు. దీంతో వర్షం లేదా వేరే ఇతర కారణం చేత మ్యాచ్ రద్దు అయితే.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్కు ఆర్హత సాధిస్తోంది. అంటే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెడుతోంది. ముంబై పాయింట్ల టేబుల్లో నాలుగో స్ధానంలో ఉంది. అయితే వర్షం ముప్పు పొంచిలేదు. వెధర్.కామ్ ప్రకారం.. 24 శాతం మాత్రమే వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. దీంతో మ్యాచ్ సజావుగా జరిగనుంది. కాగా ఫైనల్ మ్యాచ్ మాత్రం బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించింది. జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.తుది జట్లు(అంచనా)ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో (వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మచదవండి: రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా -
చాహల్తో డేటింగ్ రూమర్స్.. ఆర్జే మహ్వశ్ మరో పోస్ట్ వైరల్!
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్జే మహ్వశ్ పేరు మార్మోగిపోతోంది. చాహల్తో కలిసి ఛాంపియన్ ట్రోఫీలో కనిపించడంతో ఆమె పేరు ఒక్కసారిగా వైరలైంది. ఇంకేముందు టీమిండియా క్రికెటర్ చాహల్తో డేటింగ్ చేస్తున్నారంటూ ఒకటే టాక్. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ప్రతి మ్యాచ్కు ఆర్జే హాజరు కావడం ఆ రూమర్స్కు మరింత బలం చేకూరింది. ఇటీవల ఆర్సీబీ- పంజాబ్ మ్యాచ్లోనూ మహ్వశ్ స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది.ఈ నేపథ్యంలోనే ఆర్జే మహ్వశ్ మరో పోస్ట్తో వార్తల్లో నిలిచింది. నీ జీవితంలో ఏది ముఖ్యమో అది నీకే తెలుసు.. నువ్వు ఎవరితోనూ ఎప్పుడు తప్పు చేయవని తెలుసు.. నీ లక్ష్యం విషయంలో క్లారిటీ ఉంది.. మీరు నిజాయితీగా జీవించండి.. ఎవరెమనుకున్నా హ్యాపీగా వాటిని వదిలేయండి. అంటూ ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ చాహల్తో డేటింగ్ వార్తలపైనే స్పందించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల తనపై వస్తున్న వార్తల నేపథ్యంలోనే ఆర్జే మరోసారి క్లారిటీ ఇచ్చేసిందని అంటున్నారు.కాగా.. ఆర్జే మహ్వశ్..చాహల్ గతేడాది మొదటిసారి జంటగా కనిపించారు. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్న చాహల్ ఇటీవలే విడాకులు కూడా తీసుకున్నారు. అందుకే మహ్వశ్తో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వీరిద్దరు కనిపించడంతో అప్పటి నుంచే మరింత వైరలయ్యాయి. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా
ఐపీఎల్-2025 సీజన్ ఫైనల్కు చేరేందుకు ముంబై ఇండియన్స్ అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ను 20 పరుగుల తేడాతో ఓడించిన ముంబై.. క్వాలిఫయర్-2కు ఆర్హత సాధించింది. ఆదివారం జరగనున్న సెకెండ్ క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్తో హార్దిక్ సేన అమీతుమీ తెల్చుకోనుంది. కాగా ఎలిమినేటర్లో ముంబై విజయం సాధించడంలో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర.తీవ్ర ఒత్తిడిలో కూడా బుమ్రా తన అద్భుత బౌలింగ్తో ముంబైను గెలుపు తీరాలకు చేర్చాడు. 229 భారీ లక్ష్య చేధనలో పవర్ ప్లేలోనే కెప్టెన్ శబ్మన్ గిల్, మెండిస్ వికెట్లను గుజరాత్ కోల్పోయినప్పటికి.. సాయిసుదర్శన్(80), వాషింగ్టన్ సుందర్(48) ముంబై బౌలర్లపై విరుచుపడ్డారు.వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ గుజరాత్ను లక్ష్యానికి చేరువ చేశారు. సుందర్, సాయి విధ్వంసం ఫలితంగా టైటాన్స్ 13 ఓవర్లలో 150 పరుగుల మార్క్కు చేరువైంది. దీంతో ముంబై డౌగట్తో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. 14 ఓవర్ వేసేందుకు బుమ్రాను తిరిగి ఎటాక్లో తీసుకొచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని బుమ్బుమ్ బుమ్రా వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ను బుమ్రా అద్బుతమైన యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. సుందర్ ఔటైనప్పటికి, క్రీజులో ఇంకా ఇన్ఫామ్ బ్యాటర్ సుదర్శన్ ఉండడంతో ముంబై కోచింగ్ స్టాఫ్ తీవ్ర ఒత్తిడిలో కన్పించారు. బౌండరీ లైన్ వద్దకు హెడ్కోచ్ జయవర్ధనే, కీరన్ పొలార్డ్ వచ్చి ఫీల్డర్లకు, బౌలర్లకు పదేపదే తమ సూచనలను పంపారు.కోచ్ మాట వినని బుమ్రా..ఈ క్రమంలో జయవర్దనే బౌండరీ లైన్ దగ్గర బుమ్రాకు ఏదో చెబుతుండగా అతడు విన్పించుకోలేదు. "ప్రశాంతంగా ఉండండి, నా పని నాకు తెలుసు. నేను చూసుకుంటా అని బుమ్రా అన్నట్లు హిందీ కామెంటేటర్ జతిన్ సప్రు వ్యాఖ్యనించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: ముంబై చేతిలో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న గిల్ సోదరి! వీడియో వైరల్ -
రషీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రషీద్ ఖాన్.. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పేరు గాంచాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధులను ముప్పు తిప్పలు పెట్టే సత్తా ఉన్నోడు రషీద్. కానీ ఐపీఎల్-2025లో మాత్రం రషీద్ తన మార్క్ను చూపించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ దారుణంగా విఫలమయ్యాడు.ప్రతీ మ్యాచ్లోనూ భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా మారాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్లోనూ అదే తీరును కనబరిచాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో వికెట్ ఏమీ తీయకుండా 31 పరుగులు ఇచ్చాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన రషీద్.. 9.34 ఏకానమితో కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.రషీద్ ఖాన్ చెత్త రికార్డు..ఈ క్రమంలో రషీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్గా రషీద్ ఆప్రతిష్టను మూటకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో రషీద్ ఏకంగా 33 సిక్సర్లు ఇచ్చాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేరిట ఉండేది. 2022 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తూ సిరాజ్ 31 సిక్సర్లు ఇచ్చాడు. తాజా మ్యాచ్లో రెండు సిక్సర్లు ఇచ్చిన రషీద్.. సిరాజ్ను అధిగమించాడు. వీరిద్దరి తర్వాత స్ధానాల్లో చాహల్(30), హసరంగా(30),బ్రావో ఉన్నారు. కాగా ఎలిమినేటర్ మ్యాచ్లో 20 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్ -
ముంబై చేతిలో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న గిల్ సోదరి! వీడియో వైరల్
ఐపీఎల్-2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కథ ముగిసింది. శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్లో 20 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. దీంతో ఈ మెగా ఈవెంట్ నుంచి గుజరాత్ నిష్కమ్రించింది. 229 పరుగుల భారీ లక్ష్య చేధనలో సాయిసుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్తో 80), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికి.. మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ముఖ్యంగా ఈ మ్యాచ్లో గుజరాత్ ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగ్. మ్యాచ్ ఆరంభంలోనే ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు రెండు లైఫ్లు వచ్చాయి. వరుస ఓవర్లలో అతడి ఇచ్చిన ఈజీ క్యాచ్లను గుజరాత్ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది.3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్.. ఏకంగా 81 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బౌలర్లు కూడా భారీ పరుగులు సమర్పించుకున్నారు. పేలవ ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగానే ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.కన్నీరు పెట్టుకున్న నెహ్రా ఫ్యామిలీ..ఇక ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్టాండ్స్లో కూర్చున్న నెహ్రా కుమారుడు, కూమర్తె ఎక్కి ఎక్కి ఏడ్చారు. ఈ సమయంలో పక్కనే ఉన్న గుజరాత్ కెప్టెన్ గిల్ సోదరి షహ్నీల్ గిల్ కూడా వారిని ఓదర్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా భోవోద్వేగానికి లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 effort on a 𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 occasion 💙@mipaltan seal the #Eliminator with a collective team performance ✌Scorecard ▶ https://t.co/R4RTzjQNeP#TATAIPL | #GTvMI | #TheLastMile pic.twitter.com/cJzBLVs8uM— IndianPremierLeague (@IPL) May 30, 2025 Nehra ka Beta bada hoke humse badla lega 🤣🤣#MIvsGT pic.twitter.com/2j8Z17Hxx1— WTF Cricket (@CricketWtf) May 30, 2025 -
అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ముగిసింది. శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్లో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన గుజరాత్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో గుజరాత్ విఫలమైంది. సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ మిగితా బ్యాటర్లు తేలిపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లక్ష్య చేధనలో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పయి 208 పరుగులు చేయగల్గింది. ఇక ఈ హార్ట్బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. తమ పేలవ ఫీల్డింగ్ కారణంగానే ఓడిపోయాము అని గిల్ తెలిపాడు."క్రికెట్ అనేది నిజంగా ఒక అద్బుతమైన గేమ్. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడి ఓడిపోయాము. చివరి మూడు, నాలుగు ఓవర్లలో మాకు కలిసి రాలేదు. అయినప్పటికి మేము బాగానే ఆడాము. కచ్చితంగా క్యాచ్లు మ్యాచ్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.ఈ మ్యాచ్లో మేము మూడు సునాయస క్యాచ్లు జారవిడిచాము. ఈజీగా క్యాచ్లను వదిలిస్తే బౌలర్లకు పరుగులను నియంత్రించడం అంత సులభం కాదు. సాయిసుదర్శన్, వాషింగ్టన్ సుందర్కు మేము ఒకటే మెసేజ్ పంపాము. ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా ఆడాలని వారికి చెప్పాం. జట్టును గెలిపించడమే వారద్దరి లక్ష్యం.మంచు కారణంగా వికెట్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. ఈ సీజన్లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. గత మూడు మ్యాచ్లలో మేము స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాము. కానీ జట్టులోని ప్రతీ ఒక్కరూ కూడా మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా సాయిసుదర్శన్ ఒక అద్బుం. ఈ సీజన్లో అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: హార్దిక్ -
అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: హార్దిక్
ఐపీఎల్-2025లో శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఎలిమినిటేర్ మ్యాచ్ సస్పెన్ష్ థ్రిల్లర్ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ 20 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు ఆర్హత సాధించింది. ఆదివారం జరగనున్న సెకెండ్ క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్తో ముంబై తలపడనుంది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. మ్యాచ్ను మలుపు తిప్పిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు."కీలక మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఒకానొక దశలో గేమ్ సమానంగా మారింది. రెండో ఇన్నింగ్స్లో వికెట్ బ్యాటింగ్కు మరింత మెరుగ్గా అనుకూలించింది. మంచు కారణంగా బంతి సునాయసంగా బ్యాట్పైకి వచ్చింది. దీంతో రిథమ్ అందుకున్న గుజరాత్ బ్యాటర్లు దూకుడుగా ఆడడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా మా బౌలర్లకు సపోర్ట్గా ఉండాలని నిర్ణయించుకున్నాము.ఇక జానీ బెయిర్ స్టో తన అరంగేట్రంలో ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మాకు అతడు అద్బుతమైన ఆరంభాన్ని అందించాడు. రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్ చూపించాడు. తొలుత కాస్త నెమ్మదిగా ఆడినప్పటికి.. తన రిథమ్ అనుకున్న తర్వాత ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌలింగ్లో గ్లీసన్, బుమ్రా, అశ్విన్ కుమార్ ప్రతీ ఒక్కరూ రాణించారు.ఈ మ్యాచ్లో మేము ఎటువంటి ఒత్తిడి లోనవ్వలేదు. తొలి ఇన్నింగ్స్లో నేను మరో సిక్స్లు కొట్టి ఉంటే బాగుండేంది. ఎందుకంటే ఆఖరిలో చేసే పరుగులు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతాయి. బ్యాటింగ్లో మేము అనుకున్న విధంగా దూకుడుగా ఆడాము. ఇక బుమ్రాతో ఎప్పుడు బౌలింగ్ చేయంచాలన్నది అన్నది చాలా సులభం. మ్యాచ్ చేజారిపోతుందని అనిపిచ్చినప్పుడు బుమ్రాను ఎటాక్లో తీసుకురావాలి. బుమ్రా లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే కెప్టెన్కు అదొక వరం.ముంబైలో ఇళ్లు ఎంత ఖరీదుగా ఉంటాయో, బుమ్రా కూడా అంతే కాస్టలీ. చివరి ఓవర్లలో అదనపు పరుగులు ఉంచుకోగలిగితే, వాటిని డిఫెండ్ చేయగల బౌలర్లు జట్టులో ఉన్నారు అని భావించాను. అందుకే 18 ఓవర్ బుమ్రాతో వెయించాను. అందుకు తగ్గట్టే ఆ ఓవర్లో అతడు కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో గుజరాత్కు కావల్సిన రన్రేట్ పెరిగింది. మా తదుపురి మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని హార్ధిక్ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(81) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(80) పోరాడాడు. అయితే 48 పరుగులతో దూకుడుగా ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ను ఔట్ చేసి బుమ్రా మ్యాచ్ మలుపు తిప్పాడు. -
‘స్వర్ణ’ నందిని
గుమి (దక్షిణ కొరియా): తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పసిడి మెరుపులతో అదరగొడుతున్నారు. పోటీల మూడో రోజు ఆంధ్ర అథ్లెట్ జ్యోతి యర్రాజీ బంగారు పతకం సాధిస్తే... ఇప్పుడు నాలుగో రోజు శుక్రవారం తెలంగాణ అథ్లెట్ నందిని అగసార స్వర్ణ పతకం సాధించింది. మొత్తం మీద కొరియన్ గడ్డపై భారత బృందం స్వర్ణభేరి మోగిస్తోంది. నాలుగో రోజు పోటీల్లో మన నందినితో పాటు... లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్, హైజంపర్ పూజ సింగ్లు కూడా బంగారు పతకాలు గెలుపొందారు. దీంతో భారత్ ఇప్పటికే 18 పతకాలు సాధించింది. ఇందులో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలున్నాయి. ఇదే జోరు కొనసాగితే... గత 2023–బ్యాంకాక్ చాంపియన్షిప్లో పట్టుకొచ్చిన 27 పతకాల రికార్డును భారత్ అధిగమించే అవకాశముంది. ఇదివరకు 100 మీటర్ల హర్డిల్స్లో విజేతగా నిలిచిన జ్యోతి యర్రాజీ మరో పతకంపై గురిపెట్టింది. ఆమె 200 మీటర్ల పరుగులో ఫైనల్స్కు అర్హత సంపాదించింది. నిత్య గంధే కూడా ఫైనల్ చేరింది. పురుషుల 200 మీటర్ల స్ప్రింట్లో అనిమేశ్ కుజూర్ ఫైనల్ పరుగుకు సిద్ధమయ్యాడు. చైనా అథ్లెట్ను అధిగమించి... తెలంగాణ తేజం నందిని హెప్టాథ్లాన్లో పతకం కోసం పెద్ద పోరాటమే చేసింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన ఈ ఈవెంట్లో నందిని చైనా అథ్లెట్ ఇచ్చిన గట్టి పోటీని తట్టుకొని... అగ్రస్థానం సాధించడం గొప్ప విశేషం. అందుకే ఎనిమిదేళ్ల తర్వాత ఈ క్లిష్టమైన హెప్టాథ్లాన్లో భారత్ బంగారు పతకం సాధించగలిగింది. 2017లో స్వప్న బర్మన్ తర్వాత ఆసియా ఈవెంట్లో బంగారం నెగ్గిన ఘనత మన నందినిదే కావడం గమనార్హం. సోమ బిస్వాస్ (2005లో) తర్వాత సుదీర్ఘ నిరీక్షిణకు ఆమె తెరదించితే... నందిని తాజాగా భారత్కు పసిడి పతకం తీసుకొచ్చింది. 100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్ల పరుగు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల పరుగు ఇలా... ఈ ఏడు క్రీడాంశాల్లో మొత్తంగా కలిపి నందిని 5941 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆరో ఈవెంట్ అయిన జావెలిన్ త్రోలో కేవలం 34.18 మీటర్ల పేలవ ప్రదర్శన తర్వాత రేసు (మొత్తం పాయింట్లు)లో వెనుకబడిన తెలంగాణ అథ్లెట్ ఆఖరి పోటీ అయిన 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 15.54 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలువడంతో తిరిగి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. నందినికి ఆఖరిదాకా సవాల్ విసిరిన చైనా హెప్టాథ్లెట్ లియు జింగ్యి 5869 పాయింట్లతో రజత పతకానికి పరిమితమైంది. నిజానికి చైనా క్రీడాకారిణి జావెలిన్ త్రో తర్వాత ఆధిక్యంలోకి వచ్చింది. అయితే నందిని 800 మీటర్ల పరుగులో పుంజుకోవడంతో చైనా అథ్లెట్ ‘బంగారు’ ఆశలు గల్లంతయ్యాయి. అనర్హతకు గురైన పురుషుల రిలే జట్టు మూడో రోజు పోటీల్లో మహిళలు, పురుషుల రిలే జట్లు పతకాలు సాధించగా... తాజాగా 4్ఠ100 మీటర్ల రిలే ఈవెంట్లో భారత పురుషుల జట్టు అనర్హతకు గురైంది. ప్రణవ్ గౌరవ్, రాహుల్, మణికంఠ, అమ్లన్ బొర్గొహైన్లతో కూడిన రిలే జట్టు ప్రిలిమినరీ రౌండ్లోనే అనర్హతకు గురైంది. ఒకరి నుంచి మరొకరు బ్యాట్ను అందుకునేందుకు అనుమతించే చోటు (చేంజ్ ఓవర్ జోన్)ని దాటి బ్యాటన్ను తీసుకోవడంతో (ప్రణవ్నుంచి రాహుల్) టీమ్ డిస్క్వాలిఫై అయింది. అయితే పురుషుల జావెలిన్ త్రోలో సచిన్, యశ్వీర్ ఫైనల్ పోటీలకు అర్హత సాధించారు.గుల్వీర్ అ‘ద్వితీయ’ంఆసియా చాంపియన్షిప్ మొదలైన రోజే 10 వేల మీటర్ల సుదీర్ఘ పరుగులో బంగారు పతకం సాధించిన గుల్వీర్ సింగ్ నాలుగో రోజు మరో పసిడిని పట్టాడు. శుక్రవారం పురుషుల 5000 మీటర్ల పరుగులో అతను విజేతగా నిలిచాడు. గుల్వీర్ 13 నిమిషాల 24.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. వెంట్రుక వాసిలో థాయ్లాండ్ అథ్లెట్ కీరన్ తుంతివతే (13:24.97 సెకన్లు)ను రజతానికి పరిమితం చేశాడు. పూజ ‘హై’జంప్హరియాణాకు చెందిన 18 ఏళ్ల టీనేజ్ అథ్లెట్ పూజ సింగ్ హైజంప్లో పసిడి శోభ తెచ్చింది. మహిళల హైజంప్లో ఆమె తన ఐదవ ప్రయత్నంలో 1.89 మీటర్ల ఎత్తులో జంప్ చేయడం ద్వారా తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేసింది. దీంతో ఆమెకు బంగారు పతకం లభించింది. పూజ ‘షో’తో ఉజ్బెకిస్తాన్ హైజంపర్ సఫినా సదుల్లెవా (1.86 మీటర్లు) రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. భవన నిర్మాణ కూలీ కుమార్తె అయిన పూజ రెండేళ్ల క్రితం ఆసియా అండర్–23 చాంపియన్షిప్ (2023)లోనూ బంగారు పతకంతో సత్తా చాటుకుంది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో పారుల్ చౌదరి రజతం గెలుపొందింది. 9 నిమిషాల 12.46 సెకన్లలో పోటీని పూర్తిచేసిన ఆమె జాతీయ రికార్డు నెలకొల్పింది. కేవలం 2 సెకన్ల తేడాతో పారుల్ స్వర్ణావకాశం చేజారింది. కజకిస్తాన్ అథ్లెట్ నోరా జెరుతో తనుయ్ (9:10.46 సెకన్లు) బంగారు పతకం గెలుచుకుంది. -
ప్రిక్వార్టర్స్లో సబలెంక, స్వియాటెక్
పారిస్: ప్రపంచ నంబర్వన్ అరియాన సబలెంక, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. వీరిద్దరితో పాటు నాలుగో సీడ్ పావొలిని, ఎనిమిదో సీడ్ క్విన్వెన్ జెంగ్, 12వ సీడ్ రిబాకినాలు కూడా ప్రిక్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్లో ఎనిమిదో సీడ్ లారెంజో ముసెట్టి, పదో సీడ్ హోల్గర్ రూన్లు కూడా ప్రిక్వార్టర్స్ సమరానికి అర్హత సంపాదించారు. పురుషుల డబుల్స్లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ తన అమెరికన్ భాగస్వామితో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అలవోక విజయంతో... మహిళల సింగిల్స్లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్ పోటీల్లో నిరుటి క్వార్టర్ ఫైనలిస్ట్, తాజా ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ సబలెంక (బెలారస్) 6–2, 6–3తో సెర్బియన్ ప్లేయర్ ఓల్గా డానిలోవిచ్ అలవోక విజయం సాధించింది. కేవలం గంటా 19 నిమిషాల్లోనే సెర్బియన్ ప్రత్యర్థి ఆట కట్టించింది. గతేడాది ప్రిక్వార్టర్ ఫైనల్ దాకా పోరాడిన ఓల్గా ఈసారి మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఫ్రెంచ్ ఓపెన్లో హ్యాట్రిక్ చాంపియన్ (2022, 2023, 2024), పోలండ్ స్టార్ స్వియాటెక్ వరుసగా నాలుగో టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. మూడో రౌండ్లో ఐదో సీడ్ స్వియాటెక్ 6–2, 7–5తో జాక్వెలైన్ క్రిస్టిన్ (రొమేనియా)పై గెలుపొందగా, నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ) 6–4, 6–1తో ఉక్రెయిన్కు చెందిన యులియా స్టారొడుత్సెవాను ఓడించింది. 12వ సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–2తో జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలుపొందగా, ఆ్రస్టేలియన్ ఓపెన్ మాజీ రన్నరప్, చైనా స్టార్ క్విన్వెన్ జెంగ్ 6–3, 6–4తో విక్టోరియా ఎం»ొకొ (కెనడా)పై విజయం సాధించింది. చెమటోడ్చిన రూన్ పురుషుల సింగిల్స్లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో హోల్గర్ రూన్ (డెన్మార్క్) 4–6, 6–2, 5–7, 7–5, 6–2తో క్వెంటిన్ హలైస్ (ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గాడు. ఎనిమిదో సీడ్ లారెంజో ముసెట్టి (ఇటలీ) 4–6, 6–4, 6–3, 6–2తో మరియానో నెవొన్ (అర్జెంటీనా) గెలుపొందగా, 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–3, 3–6, 7–6 (9/7), 3–6, 6–3తో కరెన్ కచనొవ్ (రష్యా)పై పోరాడి గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ జోడీ భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో యూకీ–గాలోవే (అమెరికా) ద్వయం 6–7 (4/7), 7–6 (7/4), 6–3తో ఏడో సీడ్ నికోల మెక్టిక్ (క్రొయేషియా)–మైకేల్ వీనస్ (ఆ్రస్టేలియా) జంటపై ఆఖరిదాకా పోరాడి గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ–గాలోవే జోడీ... అమెరికాకు చెందిన తొమ్మిదో సీడ్ క్రిస్టిన్ హ్యరీసన్– ఇవాన్ కింగ్ జంటతో తలపడుతుంది. -
సెమీస్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట
సింగపూర్: భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో భాగంగా శుక్రవారం క్వార్టర్స్లో సాత్విక్–చిరాగ్ జంట 21–17, 21–15తో ప్రపంచ నంబర్వన్ జోడీ గోహ్ జీ ఫెయి–నూర్ ఇజుద్దీన్ (మలేసియా)పై గెలుపొందింది. గాయాల కారణంగా మూడు నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత జంట అదరగొడుతోంది. క్వార్టర్స్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ వరల్డ్ నంబర్వన్ జోడీని వరుస గేమ్ల్లో చిత్తుచేసింది. ‘ఇది పెద్ద గెలుపు. ప్రస్తుతం మేం 27వ ర్యాంక్లో ఉన్నాం. అగ్ర స్థానంలో ఉన్న ప్లేయర్లపై గెలవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం. మిగిలిన మ్యాచ్ల్లోనూ ఇదే తీవ్రత కొనసాగిస్తూ టైటిల్ అందుకోవాలనుకుంటున్నాం’ అని సాత్విక్–చిరాగ్ వెల్లడించారు. -
MI Vs GT: ముంబై ముందుకు... గుజరాత్ ఇంటికి
ఒత్తిడితో కూడిన మ్యాచ్లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్... గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసి క్వాలిఫయర్–2కు చేరింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ దూకుడుకు... బెయిర్స్టో, సూర్యకుమార్ మెరుపులు తోడవడంతో మొదట భారీ స్కోరు చేసిన ముంబై... ఆ తర్వాత బౌలింగ్లోనూ ఆకట్టుకొని ముందంజ వేసింది. టాప్–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడిన గుజరాత్... కీలక ఎలిమినేటర్ పోరులో అది సాధ్యపడక పరాజయంతో లీగ్ నుంచి నిష్క్రమించింది. ముల్లాన్పూర్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (50 బంతుల్లో 81; 9 ఫోర్లు, 4 సిక్స్లు) దుమ్మురేపగా... జానీ బెయిర్స్టో (22 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 80; 10 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2... బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఆదివారం జరగనున్న క్వాలిఫయర్–2లో పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. దంచుడే దంచుడు... టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్, బెయిర్స్టో మెరుపు ఆరంభాన్నిచ్చారు. రికెల్టన్ అందుబాటులో లేకపోవడంతో... ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన బెయిర్స్టో తన విలువ చాటుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో ఫోర్తో దూకుడు పెంచిన బెయిర్స్టో... ప్రసిధ్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో పరుగుల పండగ చేసుకున్నాడు. వరసగా 6, 4, 6, 6, 4... 26 పరుగులు పిండుకున్నాడు. సిరాజ్ ఓవర్లో రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చిన రోహిత్ సాయి కిషోర్ బౌలింగ్లో 6, 4, 4తో గేర్ మార్చాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్ను కోట్జీ వదిలేయగా... 12 పరుగుల వద్ద మెండిస్ మరో సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. దీన్ని పూర్తిగా వినియోగించుకున్న రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై జట్టు 79/0తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం మందగించగా... బెయిర్స్టోను అవుట్ చేసి సాయి కిషోర్ గుజరాత్కు బ్రేక్ ఇచ్చాడు. రషీద్ ఓవర్లో 4, 6 ద్వారా ఐపీఎల్లో 7 వేల పరుగులతో పాటు 300 సిక్స్లు పూర్తి చేసుకున్న రోహిత్... 28 బంతుల్లో హాఫ్సెంచరీ మార్క్ అందుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో విరుచుకుపడిన సూర్యకుమార్ను సాయి కిషోర్ పెవిలియన్ పంపగా... ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (11 బంతుల్లో 25; 3 సిక్స్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. స్లో బంతితో రోహిత్ను ప్రసిధ్ కృష్ణ బుట్టలో వేసుకోగా... చివరి ఓవర్లో మూడు సిక్స్లు కొట్టిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 సిక్స్లు) జట్టుకు భారీ స్కోరు అందించాడు. సుదర్శన్ పోరాడినా... భారీ లక్ష్యఛేదనలో గుజరాత్కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ గిల్ (1) ఇన్నింగ్స్ నాలుగో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్ సుదర్శన్ బాధ్యతగా ముందుకు సాగాడు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన కుశాల్ మెండిస్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్లు) కాస్త సహకరించగా... సుదర్శన్ క్లాస్ కవర్ డ్రైవ్లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్లముందు ఉన్నా... ఏమాత్రం వెరవని టైటాన్స్ పవర్ప్లే ముగిసేసరికి 66/1తో నిలిచింది. గ్లీసన్, హార్దిక్, బుమ్రా, సాంట్నర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన పసుదర్శన్ 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మెండిస్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. ప్రమాదక బుమ్రా బంతులను కాచుకున్న ఈ జంట... మిగిలిన ఓవర్లలో ధాటిగా పరుగులు రాబట్టింది. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి టైటాన్స్ 148/2తో నిలిచింది. విజయానికి 42 బంతుల్లో 81 పరుగులు కావాల్సిన దశలో... బుమ్రా అద్భుత యార్కర్తో సుందర్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పరిస్థితి మారిపోయింది. సుదర్శన్ను గ్లీసన్ను అవుట్ చేయగా... రూథర్ఫోర్డ్ (24; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. చివర్లో రాహుల్ తెవాటియా (16; 1 ఫోర్, 1 సిక్స్), షారుక్ ఖాన్ (13; 1 సిక్స్) మెరుపులు జట్టును గెలిపించలేకపోయాయి. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 81; బెయిర్స్టో (సి) కోట్జీ (బి) సాయి కిషోర్ 47; సూర్యకుమార్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 33; తిలక్ (సి) మెండిస్ (బి) సిరాజ్ 25; హార్దిక్ (నాటౌట్) 22; నమన్ ధీర్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 9, సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–84, 2–143, 3–186, 4–194, 5–206. బౌలింగ్: సిరాజ్ 4–0–37–1; ప్రసిధ్ కృష్ణ 4–0–53–2; సాయి కిషోర్ 4–0–42–2; రషీద్ ఖాన్ 4–0–31–0; కోట్జీ 3–0–51–0; సుందర్ 1–0–7–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (బి) గ్లీసన్ 80; గిల్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 1; మెండిస్ (హిట్ వికెట్) (బి) సాంట్నర్ 20; సుందర్ (బి) బుమ్రా 48; రూథర్ఫోర్డ్ (సి) తిలక్ (బి) బౌల్ట్ 24; తెవాటియా (నాటౌట్) 16; షారుక్ ఖాన్ (సి) సూర్యకుమార్ (బి) అశ్వని కుమార్ 13; రషీద్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–3, 2–67, 3–151, 4–170, 5–193, 6–208. బౌలింగ్: బౌల్ట్ 4–0–56–2; బుమ్రా 4–0–27–1; గ్లీసన్ 3.3–0–39–1; హార్దిక్ పాండ్యా 3–0–37–0; సాంట్నర్ 1–0–10–1; నమన్ ధీర్ 1–0–9–0; అశ్వని కుమార్ 3.3–0–28–1. -
IPL 2025 Eliminator Match: ఉత్కంఠ పోరులో గుజరాత్పై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించగా.. గుజరాత్ ఇంటిబాట పట్టింది.ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్స్టో (47), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మూడు సిక్సర్లు బాదాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ముంబై ఇండియన్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ (80) ఆకాశమే హద్దుగా చెలరేగి ముంబై ఇండియన్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. సాయి క్రీజ్లో ఉన్నంత సేపు మ్యాచ్ గుజరాత్ చేతుల్లో ఉండింది. అయితే సాయి ఔటయ్యాక పరిస్థితి మెల్లగా చేజారుతూ వచ్చింది. చివరి ఓవర్ వరకు పోరాడినా గుజరాత్కు విజయం దక్కలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్తో పాటు వాషింగ్టన్ సుందర్ (48) రాణించాడు. శుభ్మన్ గిల్ ఒక్క పరుగుకే ఔట్ కాగా.. రూథర్ఫోర్డ్ 24, తెవాతియా 16 (నాటౌట్), షారుఖ్ ఖాన్ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వనీ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది. -
England Tour: డబుల్ సెంచరీకి చేరువలో కరుణ్ నాయర్
ఇంగ్లండ్ లయన్స్తో ఇవాళ (మే 30) మొదలైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు ఆటగాళ్లు కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ఇరగదీశారు. వీరిలో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీకి చేరువలో (186 నాటౌట్) ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ (119 బంతుల్లో 92; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన ధృవ్ జురెల్ (82 నాటౌట్) అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 3 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.కాంటర్బరీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత-ఏ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు.జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఔటయ్యే సమయానికే భారత్ పటిష్ట స్థితిలో ఉంది.సర్ఫారాజ్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన ధృవ్ జురెల్ కూడా ఇరగదీశాడు. కరుణ్, జురెల్ ఇద్దరు పోటీపోటీగా ఆడుతూ భారత్ను అతి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. -
IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్లో రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (మే 30) జరుగుతున్న కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. ఐపీఎల్లో 7000 పరుగులు సహా 300 సిక్సర్లు పూర్తి చేశాడు.ఈ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 2 సిక్సర్లు బాదిన రోహిత్ ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్గా, ఓవరాల్గా రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో 8 పరుగుల వద్ద 7000 పరుగులు పూర్తి చేసిన రోహిత్ ఐపీఎల్లో విరాట్ కోహ్లి తర్వాత ఈ మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-5 బ్యాటర్లు..క్రిస్ గేల్-357రోహిత్ శర్మ-300విరాట్ కోహ్లి-291ఎంఎస్ ధోని-264ఏబీ డివిలియర్స్-251ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..విరాట్ కోహ్లి-8618రోహిత్ శర్మ-7000 (ఇన్నింగ్స్ కొనసాగుతుంది)శిఖర్ ధవన్-6769డేవిడ్ వార్నర్-6565సురేశ్ రైనా-5528మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 13 ఓవర్ల అనంతరం రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (0) క్రీజ్లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్లో జానీ బెయిర్స్టో 22 బంతుల్లో 47 (4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 33 పరుగులు (ఫోర్, 3 సిక్సర్లు) చేశారు. ఈ ఇద్దరి వికెట్లు సాయి కిషోర్కు దక్కాయి. కాగా, ఈ మ్యాచ్లో ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఫైనల్కు ముందు మరో మ్యాచ్ (క్వాలిఫయర్-2లో పంజాబ్తో) ఆడాల్సి ఉంటుంది. నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో పంజాబ్పై విజయం సాధించి ఆర్సీబీ నేరుగా ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్ ఓపెనర్ల విధ్వంసకర శతకాలు
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (మే 30) జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు ట్యామీ బేమౌంట్, యామీ జోన్స్ చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ జోడీ తొలి వికెట్కు 222 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. బేమౌంట్ 107 (104 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), యామీ జోన్స్ 122 పరుగులు (121 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్) చేసి ఔటయ్యారు. 41 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 262/3గా ఉంది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (8), సోఫియా డంక్లీ (6) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది.కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ ఇదివరకే ముగియగా.. వన్డే సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్ను కూడా అదే తరహాలో ముగించాలని భావిస్తుంది. మే 30, జూన్ 4, 7 తేదీల్లో మూడు వన్డేలు వేర్వేరు వేదికల్లో జరుగనున్నాయి. -
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి ఎట్టకేలకు భారత జట్టులో చోటు సంపాదించిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ పర్యటనలో తన తొలి ఇన్నింగ్స్లోనే సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్, భారత్-ఏ మధ్య ఇవాళ (మే 30) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో కరుణ్ అర్ద సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన కరుణ్ 85 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో భారత-ఏ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు. జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. 44 ఓవర్ల అనంతరం భారత జట్టు స్కోర్ 158/2గా ఉంది. కరుణ్ 66, సర్ఫరాజ్ 48 పరుగుల వద్ద క్రీజ్లో ఉన్నారు.కాగా, కరుణ్ నాయర్కు ఇంగ్లండ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ కౌంటీలు ఆడిన కరుణ్.. 21 ఇన్నింగ్స్ల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 1025 పరుగులు చేశాడు.2024 అక్టోబర్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కరుణ్ స్కోర్లు.. 66* (ప్రస్తుత మ్యాచ్), 135, 86, 6, 45, 29, 122, 105, 3, 4, 39, 123, 85ఇదిలా ఉంటే, 33 ఏళ్ల కరుణ్ నాయర్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఈ లీగ్లో తన తొలి మ్యాచ్లోనే కరుణ్ ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. ఈ మ్యాచ్ మినహా కరుణ్ ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినా దేశవాలీ క్రికెట్లో ట్రాక్ రికార్డు కారణంగా కరుణ్కు ఇంగ్లండ్ టూర్కు పిలుపు అందింది. ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లకు, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్లకు కరుణ్ ఎంపికయ్యాడు.గతేడాది కాలంగా భారత క్రికెట్ సర్కిల్స్లో కరుణ్ పేరు మార్మోగిపోతుంది. ఈ మధ్యకాలంలో అతను ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు.ఈ ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 మ్యాచ్లు ఆడి నమ్మశక్యంకాని సగటుతో (389.50) 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి.ఈ ఏడాది రంజీ ట్రోఫీలోనూ కరుణ్ అదే జోష్ను కొనసాగించాడు. 16 ఇన్నింగ్స్ల్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టును ఛాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్ల్లో 177.08 స్ట్రయిక్రేట్తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఇవే కాక కరుణ్ గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాడు. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్ల్లో 188.4 స్ట్రయిక్రేట్తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్ దేశవాలీ సీజన్లో కరుణ్ 11 ఇన్నింగ్స్ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
IPL 2025 Eliminator Match: గుజరాత్పై ముంబై ఇండియన్స్ గెలుపు
గుజరాత్పై ముంబై ఇండియన్స్ గెలుపుఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించగా.. గుజరాత్ ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ఛేదనలో చివరి వరకు పోరాడిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది.ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్రెండు వికెట్లు కోల్పోయిన సాయి సుదర్శన్ ఏమాత్రం తగ్గడం లేదు. 36 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 67 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా వాషింగ్టన్ సుందర్ (16) క్రీజ్లో ఉన్నాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 106/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్6.2వ ఓవర్- 67 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో కుసాల్ మెండిస్ (20) హిట్ వికెట్గా వెనుదిరిగాడు. ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయినా, పవర్ ప్లేలో ఇరగదీసిన గుజరాత్ బ్యాటర్లుతొలి ఓవర్లోనే గిల్ (1) వికెట్ కోల్పోయినా గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (43), కుసాల్ మెండిస్ (20) పవర్ప్లేలో ఇరగదీశారు. వీరి ధాటికి గుజరాత్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.టార్గెట్ 229.. 3 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 3 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (1) ఔటయ్యాడు. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్స్టో (47), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మూడు సిక్సర్లు బాదాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై17.2వ ఓవర్- 194 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో తిలక్ వర్మ (25) ఔటయ్యాడు.సెంచరీ మిస్ చేసుకున్న రోహిత్16.4వ ఓవర్- 186 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 81 పరుగుల వద్ద ఔటై రోహిత్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.సెంచరీకి చేరువగా రోహిత్.. భారీ స్కోర్ దిశగా ముంబై ఇండియన్స్16 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 175/2గా ఉంది. రోహిత్ శర్మ 81, తిలక్ వర్మ 11 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారీ స్కోర్ దిశగా ముంబై15 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 160/2గా ఉంది. రోహిత్ శర్మ 74, తిలక్ వర్మ 3 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఒకే ఇన్నింగ్స్తో రెండు భారీ రికార్డులుఐపీఎల్లో రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (మే 30) జరుగుతున్న కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. ఐపీఎల్లో 7000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 2 సిక్సర్లు బాదిన రోహిత్ ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెట్గా చరిత్ర సృష్టించాడు. 11 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 120/1 కాగా.. రోహిత్ 57, సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై7.2వ ఓవర్- 84 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్లో కొయెట్జీ క్యాచ్ పట్టడంతో జానీ బెయిర్స్టో (47) ఔటయ్యాడు.ప్రసిద్ద్ కృష్ణను ఉతికి ఆరేసిన బెయిర్స్టోనాలుగో ఓవర్లో ప్రసిద్ద్ కృష్ణను జానీ బెయిర్స్టో ఉతికి ఆరేశాడు. ఈ ఓవర్లో అతను 3 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు. ఫలితంగా ముంబై 4 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. బెయిర్స్టో 39, రోహిత్ శర్మ 13 పరుగుల వద్ద క్రీజ్లో ఉన్నారు. రోహిత్ శర్మకు రెండు లైఫ్లుముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మకు రెండు లైఫ్లు లభించాయి. గెరాల్డ్ కొయెట్జీ, కుసాల్ మెండిస్ సునాయాసమైన క్యాచ్లు వదిలేశారు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 28/0గా ఉంది. రోహిత్, బెయిర్స్టో తలో 13 పరుగుల వద్ద క్రీజ్లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 30) ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు..ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్ఇంపాక్ట్ సబ్స్: కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, అశ్వనీ కుమార్, రీస్ టోప్లీ.గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, కుసల్ మెండిస్(w), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, జయంత్ యాదవ్, అర్షద్ ఖాన్. -
IPL 2025, Eliminator: అదే జరిగితే ముంబై ఇండియన్స్ ఇంటికే..!
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 30) రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది. నిన్న (మే 29) జరిగిన తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ పంజాబ్పై విజయం సాధించి, నేరుగా ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే.కాగా, నేడు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్కే కాదు ప్లే ఆఫ్స్లో ఏ మ్యాచ్కూ రిజర్వ్ డే లేదు. ఏదైనా కారణం చేత నేడు జరగాల్సిన గుజరాత్, ముంబై మ్యాచ్ రద్దైతే.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం చేత (గుజరాత్ మూడో స్థానంలో ఉంటే, ముంబై నాలుగో స్థానంలో ఉంది) గుజరాత్ క్వాలిఫయర్-2కు చేరుతుంది. అప్పుడు ముంబై ఇండియన్స్ ఇంటిముఖం పడుతుంది. కాబట్టి నేటి మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాకూడదని ముంబై ఇండియన్స్ కోరుకుంటుంది.వాస్తవానికి నేటి మ్యాచ్ ఏ కారణంగానూ రద్దయ్యే అవకాశం లేదు. ఈ మ్యాచ్కు వేదిక అయిన ముల్లాన్పూర్లో వాతావరణం పూర్తి మ్యాచ్ సజావుగా సాగేందుకు అనుకూలంగా ఉంది. ఎలాంటి వర్ష సూచనలు లేవు. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ కూడా ఇదే వేదికగా జరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ వాతావరణం ఇంకా సానుకూలంగా ఉంది.ముంబై-గుజరాత్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డును పరిశీలిస్తే.. గుజరాత్ స్పష్టమైన ఆధిక్యం కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 7 మ్యాచ్ల్లో తలపడగా.. గుజరాత్ 5, ముంబై 2 గెలిచాయి. ఈ సీజన్లో లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గుజరాతే గెలిచింది.తుది జట్లు (అంచనా)..ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో, సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్/కర్ణ్ శర్మగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమాన్ గిల్, కుసల్ మెండిస్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, అర్షద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
కేఎల్ రాహుల్.. నీ కమిట్మెంట్కు సలాం..!
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్కు చేరని జట్ల ఆటగాళ్లందరూ ప్రస్తుతం వారివారి పనుల్లో నిమగ్నమైపోయారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత ఏ ఆటగాళ్లు ఇవాల్టి నుంచి ఇంగ్లండ్ లయన్స్తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఏ జట్టు రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఆతర్వాత టీమిండియా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఐపీఎల్ పూర్తయిన తర్వాత ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెడతారు.కాగా, ఐపీఎల్లో తన జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఖాళీగా ఉన్న ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ బీసీసీఐని ఓ విషయం కోసం అభ్యర్దించినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ఎంపికై, ప్రస్తుతం భారత్లోనే ఉన్న రాహుల్ ఇంగ్లండ్ లయన్స్తో జరిగే రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ కోసం తనను ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట.ప్రస్తుతం భారత్లో వాతావరణ పరిస్థితులు ప్రాక్టీస్కు అనుకూలంగా లేకపోవడంతో (వర్షాలు) లయన్స్తో టెస్ట్ మ్యాచ్ తన ప్రాక్టీస్కు ఉపయోగపడుతుందని రాహుల్ భావిస్తున్నాడట. ఇందుకే తనను లయన్స్తో రెండో టెస్ట్ మ్యాచ్కు ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట. ఈ విషయంపై స్పందించిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాహుల్కు రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రాహుల్ను సోమవారం (జూన్ 2) లండన్కు బయల్దేరాల్సిందిగా ఆదేశించిందట.జాతీయ జట్టు తరఫున రాణించేందుకు రాహుల్ బీసీసీఐకి చేసిన విన్నపం గురించి తెలిసి భారత క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. రాహుల్ కమిట్మెంట్కు సలాం కొడుతున్నారు. స్టార్డమ్ ఉన్న ఇతర ఆటగాళ్లు ఖాళీ దొరికితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చూస్తారు. రాహుల్ మాత్రం తన దేశం తరఫున రాణించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాండంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి నార్తంప్టన్ వేదికగా జరుగనుంది.ఇంగ్లండ్ లయన్స్తో టెస్ట్ మ్యాచ్లకు ఎంపిక చేసిన భారత-ఏ జట్టు..కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, తనుశ్ కోటియన్, హర్ష్ దూబే, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, తుషార్ దేశ్పాండే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, ఆకాశ్దీప్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
IPL 2025: 'ఈ లెక్కన' ఈ సారి ఆర్సీబీదే టైటిల్..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 29) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఐపీఎల్లో ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. గడిచిన మూడు సందర్భాల్లో ఈ జట్టు రన్నరప్తో సరిపెట్టుకుంది.ఆర్సీబీ ఫైనల్కు చేరిన సీజన్లు..2009- డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి2011- సీఎస్కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి2016- ఎస్ఆర్హెచ్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి2025- ?కాగా, ఈ సీజన్లో ఆర్సీబీ ఫైనల్కు చేరాక ఓ ఆసక్తికర విషయం ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రతి సీజన్లో ఈ సాలా కప్ నమదే అనే ఆర్సీబీ అభిమానులకు ఇది ఊపునిచ్చే అంశం. అదేంటంటే.. 2018 నుంచి క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలిచింది. ఈ విషయం తెలిసి ఆర్సీబీ అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ ఒక్క సెంటిమెంట్ చాలు మేము ఈ యేడు కప్ కొడతామని చెప్పడానికంటూ చాటింపు చేసుకుంటున్నారు.సెంటిమెంట్ విషయాన్ని పక్కన పెడితే, ఈ యేడు ఆర్సీబీకి టైటిల్ గెలిచే జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆర్సీబీ ఈ సీజన్లో గత సీజన్లకు చాలా భిన్నంగా కనిపిస్తుంది. టైటిల్ గెలవాలన్న కసి ఆ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే వారి ప్రదర్శనలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ప్రతి సీజన్లో వీక్గా కనిపించే ఆర్సీబీ బౌలింగ్ విభాగం ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. నిన్న జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో అది నిరూపితమైంది. ఇదే జోరును ఆర్సీబీ బౌలర్లు ఫైనల్ మ్యాచ్లోనూ కొనసాగిస్తే, ఆ జట్టును టైటిల్ గెలవకుండా ఎవరూ ఆపలేరు.ఈ సారి ఆర్సీబీకి పటిష్టమైన జట్టుతో పాటు సెంటిమెంట్లు కూడా వర్కౌటయ్యేలా ఉన్నాయి. క్వాలిఫయర్-1 సెంటిమెంట్తో పాటు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ సెంటిమెంట్ కూడా ఆ జట్టుకు ఈ సారి కలిసొచ్చేలా ఉంది. కోహ్లి జెర్సీ నంబర్ 18, ఐపీఎల్ సీజన్ సంఖ్య కూడా 18.2018 నుంచి క్వాలిఫయర్-1 గెలిచిన జట్లు, టైటిల్ గెలిచిన జట్ల వివరాలు..2018- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2019- క్వాలిఫయర్-1 విజేత ముంబై ఇండియన్స్- టైటిల్ విజేత కూడా ముంబై ఇండియన్సే2020- క్వాలిఫయర్-1 విజేత ముంబై ఇండియన్స్- టైటిల్ విజేత కూడా ముంబై ఇండియన్సే2021- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2022- క్వాలిఫయర్-1 విజేత గుజరాత్- టైటిల్ విజేత కూడా గుజరాతే2023- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2024- క్వాలిఫయర్-1 విజేత కేకేఆర్- టైటిల్ విజేత కూడా కేకేఆరే2025- క్వాలిఫయర్-1 విజేత ఆర్సీబీ- టైటిల్ విజేత..? -
వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మోదీ ముచ్చట్లు
పాట్నా: యువ క్రికెట్ కెరటం, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈరోజు(శుక్రవారం, మే 30వ తేదీ) ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో భాగంగా పాట్నా ఎయిర్ పోర్ట్ లో కలిసిన వైభవ్ సూర్యవంశీతో సరదాగా మాట్లాడారు. తొలుత వైభవ్ సూర్యవంశీని ఆప్యాయంగా పలకరించిన మోదీ..క్రికెట్ కు సంబంధించిన విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పాట్నా ఎయిర్ పోర్ట్ లో మోదీని కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవ్ సూర్యవంశీ కలిశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు మోదీ.‘వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతడు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. నా ఆశీస్సులు అతడికి ఎప్పుడూ ఉంటాయి’ అని మోదీ పేర్కొన్నారు.ఇదిలా ఉంచితే, వైభవ్ సూర్యవంశీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ లో అరంగేట్రం ద్వారా సంచలన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపిస్తున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా వైభవ్ సూర్యవంశీ తెరపైకి వచ్చాడు. At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6— Narendra Modi (@narendramodi) May 30, 2025 -
నార్వే చెస్ టోర్నీ.. గుకేశ్కు తొలి విజయం
స్టావెంజర్: వరల్డ్ చెస్ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తన 19వ పుట్టిన రోజున కీలక గెలుపును తనకు తాను బహుమతిగా ఇచ్చుకున్నాడు. నార్వే చెస్ టోర్నమెంట్ తొలి రెండు రౌండ్లలో పరాజయం చవిచూసిన అతను మూడో రౌండ్లో గెలుపు నమోదు చేశాడు. హికారు నకముర (అమెరికా)తో గురువారం జరిగిన పోరులో గుకేశ్ 42 ఎత్తుల్లో విజయం సాధించాడు. టోర్నీ తొలి రౌండ్లో కార్ల్సన్, రెండో రౌండ్లో అర్జున్ ఇరిగేశి చేతిలో గుకేశ్ ఓటమిపాలయ్యాడు. గత రెండు పరాజయాలను మరచి ఒక కొత్త టోర్నీ తరహాలో ఈ రౌండ్ను మొదలు పెట్టానని, విజయం దక్కడం సంతోషంగా ఉందని గుకేశ్ వ్యాఖ్యానించాడు. మరో వైపు ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో అర్జున్ ఇరిగేశి పరాజయం పాలవగా...వీ యి (చైనా) చేతిలో అనూహ్యంగా మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. మూడు రౌండ్ల తర్వాత కరువానా అగ్రస్థానంలో ఉండగా, అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు. మరో వైపు మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడో రౌండ్లో హంపి...సారా ఖదమ్ (స్పెయిన్)పై గెలుపొందింది. మరో పోరులో జు వెన్ జున్ (చైనా)...భారత్కు చెందిన వైశాలిపై విజయం సాధించింది. -
'నీ ఈగోను జేబులో పెట్టుకో శ్రేయస్'.. పంజాబ్ కెప్టెన్పై మూడీ ఫైర్
ఐపీఎల్-2025 క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్కు ఘోర పరాభవం ఎదురైంది. గురువారం ముల్లాన్పూర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 101 పరుగులకే ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ పది ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో దారుణ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ విమర్శల వర్షం కురిపించారు.పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయడం నేర్చుకో అయ్యర్ అంటూ ఆయన మండిపడ్డారు. కాగా కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బాధ్యతాయుతంగా ఆడాల్సిన శ్రేయస్.. హాజిల్వుడ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ కీపర్కు దొరికిపోయాడు. శ్రేయస్ కేవలం రెండు 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు.అదేవిధంగా టీ20ల్లో అయ్యర్పై హాజిల్వుడ్కు మంచి రికార్డు ఉంది. ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ అయ్యర్ను నాలుగు సార్లు టీ20ల్లో ఔట్ చేశాడు. అయినప్పటికి అతడి బౌలింగ్లో నిర్లక్ష్యంగా షాట్ ఆడి అయ్యర్ ఔటయ్యాడని మూడీ వంటి దిగ్గజాలు విమర్శలు గుప్పిస్తున్నారు."శ్రేయస్ అయ్యర్ పరిస్థితులకు తగ్గట్టు ఏ మాత్రం ఆడలేదు. కెప్టెన్గా తన బాధ్యతను కూడా మర్చిపోయాడు. గతంలో చాలా సార్లు తనను హాజిల్వుడ్ ఔట్ చేశాడని అయ్యర్కు బాగా తెలుసు. అయినప్పటికి జాగ్రత్తగా ఆడకుండా ఈగోకి పోయి తన వికెట్ను సమర్పించుకున్నాడు. కొన్నిసార్లు మన అహాన్ని జేబులో పెట్టుకుని ముందుకు సాగాలి. అప్పుడే విజయాలు సాధించగలము" అని మూడీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సీజన్ అసాంతం తన కెప్టెన్సీ, బ్యాటింగ్తో ఆకట్టుకున్న శ్రేయస్.. కీలకమైన మ్యాచ్లో మాత్రం విఫలమై విమర్శలను ఎదుర్కొంటున్నాడు. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచ క్రికెట్లో తొలి జట్టుగా
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను ఇంగ్లండ్ విజయంతో ఆరంభించింది. గురువారం ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డేలో 238 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 400 పరుగులు చేసింది. బెన్ డకెట్(60), జోరూట్(57), హ్యారీ బ్రూక్(58), జాకోబ్ బెతెల్(82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జేమీ స్మిత్(37), విల్ జాక్స్(39) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ నాలుగు వికెట్లు సాధించగా.. అల్జారీ జోసెఫ్, జస్టిన్ గ్రీవ్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో కరేబియన్ జట్టు కేవలం 162 పరుగులకే కుప్పకూలింది.చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్..ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఒక్క ప్లేయర్ కూడా సెంచరీ చేయకుండా వన్డేల్లో అత్యధిక స్కోరును నమోదు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డులకెక్కింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఏ ఒక్క బ్యాటర్ సెంచరీ చేయనప్పటికి.. టీమ్ స్కోర్ మాత్రం 400 పరుగుల మార్క్ను అందుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. 2007లో పాకిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఏ ఒక్క ప్లేయర్ కూడా సెంచరీ చేయకుండా సౌతాఫ్రికా 392 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో సఫారీల ఆల్టైమ్ రికార్డును ఇంగ్లీష్ జట్టు బ్రేక్ చేసింది. అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్లో ఏడుగురు బ్యాటర్లు 30 ప్లస్ రన్స్ చేయడం కూడా ఇదే తొలిసారి.చదవండి: నేను సాకులు చెప్పను.. యుద్దం ఇంకా ముగియలేదు: శ్రేయస్ అయ్యర్ -
నేను సాకులు చెప్పను.. యుద్దం ఇంకా ముగియలేదు: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్-2025లో గురువారం ముల్లాన్పుర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన పంజాబ్.. 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఫైనల్ చేరేందుకు ఇప్పుడు క్వాలిఫయర్-2లో తలపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలోనే కేవలం 101 పరుగులకే కుప్పకూలింది.స్టోయినిష్(26) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమిపాలైమని అయ్యర్ అంగీకరించాడు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు."ఈ రోజును అంతవేగంగా మర్చిపోలేము. డ్రెస్సింగ్ రూమ్కు తిరిగి వెళ్లి తప్పు ఎక్కడ జరిగిందో చర్చిస్తాము. ఏదేమైనప్పటికీ ఒక బ్యాటింగ్ యూనిట్గా తీవ్ర నిరాశపరిచాము. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాయు. అయితే కెప్టెన్గా నేను తీసుకున్న నిర్ణయాలపై నాకు ఎటువంటి సందేహం లేదు. మైదానంలో గానీ, మైదానం వెలుపల గానీ మేము అన్ని ఆలోచించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటాము. ఈ మ్యాచ్లో మాత్రం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. అలా అని బౌలర్లను కూడా తప్పుబట్టలేము. ఎందుకంటే మా బౌలర్లు డిఫెండ్ చేసుకోవడానికి ఈ టోటల్ సరిపోదు. ముల్లాన్పూర్ పిచ్ను మేము సరిగ్గా అంచనా వేయలేకపోయాము. ఈ వికెట్పై బ్యాటింగ్ పరంగా మరింత ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది. ఈ మైదానంలో మేము ఆడిన మూడు మ్యాచ్లలోనూ బౌన్స్ ఎక్కువగా ఉంది. అయితే మేము ప్రొఫెషనల్ క్రికెటర్లు కాబట్టి, ఇటువంటి సాకులు చెప్పాలని అనుకోవడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్న అందుకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాలి. ఇది చిన్న ఓటమి మాత్రమే.. యుద్దం ఇంకా పూర్తిగా ముగియలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో అయ్యర్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: ఏంటి కోహ్లి ఇది.. నీ స్దాయికి ఇది తగునా? ఫ్యాన్స్ కౌంటర్ -
ఏంటి కోహ్లి ఇది.. నీ స్దాయికి ఇది తగునా? ఫ్యాన్స్ కౌంటర్
ఐపీఎల్-2025లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి క్వాలిఫయర్లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో అరంగేట్ర ఆటగాడు ముషీర్ ఖాన్ పట్ల ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి ప్రవర్తించిన తీరు వివాదస్పదమైంది. సోషల్ మీడియా వేదికగా కోహ్లిపై విమర్శల వర్షం కురుస్తోంది.అసలేమి జరిగిదంటే?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌలర్ల దాటికి 8.2 ఓవర్లలో కేవలం 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో పంజాబ్ మెనెజ్మెంట్ యువ బ్యాటర్ ముషీర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు పంపింది. అతడికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం. అయితే క్రీజులోకి వచ్చిన ముషీర్ తొలి బంతిని ఎదుర్కొనేందుకు గార్డ్ తీసుకుంటుండగా.. స్లిప్లో ఉన్న కోహ్లి వాటర్ బాయ్ను బ్యాటింగ్కు పంపారు అన్నట్లు నవ్వుతూ సైగ చేశాడు. అయితే వాయిస్ అంత క్లారిటీగా స్టంప్స్ మైక్లో రికార్డు కాలేద.Kohli saying "yeh paani pilata hai" while pointing towards debutant Musheer Khan.Shameful. https://t.co/XgqQXzeAWK— Dhillon (@sehajdhillon_) May 29, 2025 ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు జూనియర్ల పట్ల ఇలానే ప్రవర్తిస్తావా? నీ స్దాయికి ఇది తగునా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కోహ్లి అభిమానులు అతడికి సపోర్ట్గా నిలుస్తున్నారు. "ఇదే మ్యాచ్లో కొన్ని ఓవర్ల క్రితం మషీర్ డ్రింక్స్ తీసుకొచ్చడాని, అంతలోనే ఇప్పుడు బ్యాటింగ్కు రావల్సి వచ్చిందని కోహ్లి చెబుతున్నాడు. కావాలనే కోహ్లిని తప్పుబట్టి ట్రోలు చేస్తున్నారని" ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడుFew overs ago, Musheer brought drinks in timeout.So Kohli was saying that just few minutes ago he was bringing water and now he had to come to bat. You people are so blind in your hate for Kohli that you make up things in your mind. https://t.co/JQYLlY299X— nitin (@Nitin__10) May 29, 2025. కాగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ముషీర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మూడు బంతులు ఎదుర్కొని సుయాష్ శర్మ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు వరకు ముషీర్ కేవలం డ్రింక్స్ అందించిడానికే పరిమితమయ్యాడు.Virat Kohli pointing at the debutant and saying mockingly "ye paani pilaata hai"This Guy is so shameless shame on you kohli.pic.twitter.com/k1SMhEkEJJ— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) May 30, 2025 -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి జట్టుగా రికార్డు
తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్-2025లో ఫైనల్ బెర్త్ను ఆర్సీబీ ఖారారు చేసుకుంది. గురువారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. నాలుగోసారి ఈ క్యాష్రిచ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్లో అద్బుతంగా రాణించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆర్సీబీ బౌలర్లు చెలరేగడంతో కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ ఇన్నింగ్స్లో మార్కస్ స్టోయినిస్ (17 బంతుల్లో 26 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 102 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఈ మ్యాచ్లో అద్బుత విజయం సాధించిన బెంగళూరు టీమ్ పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో ప్రత్యర్ధిని 15 ఓవర్లలోపే ఆలౌట్ చేసిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డులెక్కింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్(20 ఓవర్ల ఫుల్ గేమ్)లో బంతులపరంగా అతిపెద్ద విజయాన్ని సాధించిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఈ మ్యాచ్ను ఆర్సీబీ 60 బంతులు మిగిలూండగానే ముగించింది. ఇంతకుముందు ఈ రికార్డు కోల్కతా నైట్రైడర్స్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 ఫైనల్లో ఎస్ఆర్హెచ్పై 57 బంతులు మిగిలూండగానే కేకేఆర్ విజయం సాధించింది. తాజా మ్యాచ్తో కేకేఆర్ నైట్రైడర్స్ రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది.👉అయితే 2017 సీజన్లో ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్పై కేకేఆర్ కేవలం 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కానీ ఆ మ్యాచ్ను వర్షం కారణంగా ఆరు ఓవర్లకు కుదించారు. -
విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 238 పరుగుల తేడాతో విక్టరీ
వెస్టిండీస్తో వన్డే సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం బర్మింగ్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల తేడాతో విండీస్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. బ్రూక్ కెప్టెన్సీలో ఆడిన తొలి మ్యాచ్లోనే ఇంగ్లండ్ భారీ స్కోరుతో విజృంభించింది. జాకబ్ బెథెల్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 5 సిక్స్లు), బెన్ డకెట్ (60; 6 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (57; 5 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (58; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. జెమీ స్మిత్ (37), బట్లర్ (37), విల్ జాక్స్ (39) కూడా రాణించారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 4, అల్జారీ జోసెఫ్, జస్టిన్ గ్రేవ్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 26.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జైడెన్ సీల్స్ (29; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కెపె్టన్ షై హోప్ (25) కాస్త పోరాడగా... మిగిలిన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాఖీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.చదవండి: నేను అతడికి పెద్ద అభిమానిని.. ఇంకా ఒకే ఒక మ్యాచ్: ఆర్సీబీ కెప్టెన్ -
RCB Vs PBKS: నేను అతడికి పెద్ద అభిమానిని.. ఇంకా ఒకే ఒక మ్యాచ్: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టింది. గురువారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి క్వాలిఫయర్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆలౌటైంది.బెంగళూరు బౌలర్లలో సుయాష్ శర్మ, హాజిల్వుడ్ తలా మూడు వికెట్లు పడగొట్టి పంజాబ్ పతనాన్ని శాసించగా.. యశ్దయాల్ రెండు, షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో స్టోయినిష్(26) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా..మయాంక్(19), కోహ్లి(12) పర్వాలేదన్పించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సుయాష్ శర్మపై రజత్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ మ్యాచ్లో స్పష్టమైన బౌలింగ్ ప్రణాళికలతో బరిలోకి దిగాము. మా ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండీషన్స్ను బాగా ఉపయోగించుకున్నారు. ఇక సుయాష్ శర్మ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు బౌలింగ్ చేసిన విధానం ఒక అద్బుతం. చక్కటి లైన్ అండ్ లెంగ్త్లతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేశాడు. కెప్టెన్గా అతడి బౌలింగ్పై నాకు ఒక క్లారిటీ ఉంది. స్టంప్స్ లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడమే అతడి బలం. సూయూష్ బౌలింగ్ను ఆర్దం చేసుకోవడం బ్యాటర్లకు చాలా కష్టం. నేనెప్పుడూ అతడిని కన్ఫ్యూజ్ చేయలేదు. ప్రతీ మ్యాచ్లోనూ అతడికి సపోర్ట్గా ఉన్నాము. ఈ క్రమంలో అతను కొన్ని పరుగులు ఇచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ టోర్నీ అసాంతం మేము చాలా మేము చాలా ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గోన్నాము. కాబట్టి ఒక రోజు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఇక ఫిల్ సాల్ట్ ప్రతీ మ్యాచ్లోనూ మాకు అద్బుతమైన ఆరంభాలను అందించాడు. ఈ మ్యాచ్లో మరోసారి తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. అతడికి నేను పెద్ద అభిమానిని. డగౌట్ నుంచి అతడి ఆటను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. చిన్నస్వామిలోనే కాదు మేము ఎక్కడికి వెళ్లినా మాకు సపోర్ట్గా నిలుస్తున్న ఆర్సీబీ అభిమానులకు ధన్యవాదాలు. మిమ్మల్ని మేము ప్రేమిస్తునే ఉంటాము, మీరు కూడా మాకు మద్దతు ఇస్తూ ఉండండి. మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఆ తర్వాత కలిసి సెలబ్రేట్ చేసుకుందాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో పాటిదార్ పేర్కొన్నాడు.చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు... -
ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం గెలుచుకున్న జ్యోతి యర్రాజీకి హృదయపూర్వక అభినందనలు. మీ గెలుపు భారత్, ఆంధ్రప్రదేశ్కు గర్వ కారణం’ అని పేర్కొన్నారు. Heartiest congratulations to @JyothiYarraji on winning the Gold in Women’s 100m Hurdles at the 26th Asian Athletics Championships in Gumi, South Korea! A proud moment for both India and Andhra Pradesh. Wishing you many more accolades ahead!#AAC2025 pic.twitter.com/IlVI79is5d— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025 -
జ్యోతి ‘పసిడి’ పరుగు
గుమి (దక్షిణ కొరియా): భారత క్రీడాకారులు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకాల పంట పండిస్తున్నారు. రెండో రోజు అర డజను (6) పతకాలు సాధించిన భారత బృందం మూడో రోజు కూడా మరో ఆరు పతకాలను గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకాన్ని నిలబెట్టుకుంది. పురుషుల 3000 మీ. స్టీపుల్చేజ్లో అవినాశ్ సబ్లే విజేతగా నిలువగా, 4x400 మీటర్ల రిలే ఈవెంట్లో భారత మహిళల బృందం స్వర్ణం సాధిస్తే... పురుషుల జట్టేమో రజతంతో సరిపెట్టుకుంది. మహిళల లాంగ్జంప్లో ఆన్సీ సోజన్ రజతం, శైలీ సింగ్ కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్గా ఈ మూడు రోజుల్లోనే భారత్ మొత్తం 14 పతకాలతో సత్తా చాటుకుంది. తొలి రోజు రెండు పతకాలు నెగ్గిన భారత బృందం ఈ చాంపియన్షిప్లో బుధవారం పోటీలు ముగిసే సరికి పతకాల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. తెలుగు తేజం కొత్త రికార్డు రెండేళ్ల క్రితం బ్యాంకాక్ (థాయ్లాండ్)లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో జ్యోతి యర్రాజీ బంగారు పతకాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు సరికొత్త రికార్డుతో తెలుగుతేజం స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. గురువారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పోటీని 12.96 సెకన్లలో పూర్తిచేసిన ఏపీ అథ్లెట్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఆమె 1998లో కజకిస్తాన్ అథ్లెట్ ఓల్గా షిషిజినా (13.04 సె.) రికార్డును అధిగమించింది. ఈ టైమింగ్నే 2011లో చైనా క్రీడాకారిణి సున్ యావె (13.04 సె.) నమోదు చేసింది. 2023–బ్యాంకాక్ ఈవెంట్లో జ్యోతి (13.09 సె.) బంగారు పతకాన్ని గెలిచింది. తద్వారా ఆసియా చాంపియన్షిప్ చరిత్రలో హర్డిల్స్లో స్వర్ణాలు నిలబెట్టుకున్న అరుదైన ఐదుగురు అథ్లెట్ల క్లబ్లో చేరింది. ఎమి అకిమొతొ (జపాన్; 1979, 1981, 1983), జాంగ్ యు (చైనా; 1991, 1993), సు యిన్పింగ్ (చైనా; 2003, 2005), సున్ యావె (చైనా; 2009, 2011)ల సరసన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి నిలిచింది. 36 ఏళ్ల తర్వాత బంగారం భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో భారత్కు 36 ఏళ్ల తర్వాత స్టీపుల్చేజ్లో పసిడి పతకాన్ని తెచ్చిపెట్టాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ పోటీని 8:20.92 సెకన్ల టైమింగ్తో అగ్ర స్థానంలో నిలిచాడు. గత ఏడాది భారత ఆటగాడు 8:09.91 సెకన్లతో జాతీయ రికార్డును నెలకొల్పాడు.చివరిసారిగా భారత్ ఈ క్రీడాంశంలో 1989లో బంగారు పతకం గెలిచింది. దినరామ్ విజేతగా నిలువగా, తొలిసారిగా పసడి నెగ్గిన ఘనత హర్బల్ సింగ్ (1975లో)కు దక్కింది. మహిళల 10వేల మీటర్ల పరుగులో ‘పోడియం’కు దూరమైన సంజీవని జాదవ్ (33:08.17 సె.), సీమా (33:08.23 సె.) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. రిలేలో పతకాల జోరు మూడో రోజు పోటీల్లో రిలే బృందాలు సత్తా చాటుకున్నాయి. మహిళల 4x400 మీటర్ల రిలే ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కుంజా రజిత సహా జిస్నా మాథ్యూ, రూపల్ చౌదరి, శుభా వెంకటేశన్లతో కూడిన బృందం బంగారు పతకం సాధించింది. పోటీని అందరికంటే ముందుగా భారత జట్టు 3 నిమిషాల 34.18 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. పురుషుల 4x400 మీటర్ల రిలే ఈవెంట్లో తృటిలో స్వర్ణావకాశం చేజారడంతో రజతం దక్కింది. జయ్ కుమార్, ధర్మ్వీర్ చౌదరి, మనూ తెక్కినలిల్, విశాల్లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 03.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. కేవలం 0.15 సెకన్ల తేడాతో ఖతర్ జట్టు (3 ని.03.52 సె) బంగారు పతకం సాధించింది. మహిళల లాంగ్జంప్ ఈవెంట్లో ఆన్సీ సోజన్ రజతం గెలుపొందగా, షైలీ సింగ్ కాంస్య పతకం నెగ్గింది. ఆన్సీ 6.33 మీటర్లు దూకి రెండో స్థానం సాధించగా, షైలీ సింగ్ 6.30 మీటర్లతో ఆమె వెనక నిలిచింది. ఈ ఈవెంట్లో ఇరాన్ అథ్లెట్ మొబిని అరని (6.40 మీ.) స్వర్ణం గెలుచుకుంది. -
టెస్టు సిరీస్కు రిహార్సల్
కాంటర్బరీ (ఇంగ్లండ్): టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి సహా పలువురు ప్లేయర్లు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు సన్నాహక మ్యాచ్ బరిలోకి దిగనున్నారు. వచ్చే నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుండగా... దానికి ముందు ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత ‘ఎ’ జట్టు శుక్రవారం నుంచి నాలుగు రోజుల మొదటి అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇందులో భారత్ ‘ఎ’ జట్టు తరఫున అభిమన్యు ఈశ్వరణ్, ధ్రువ్ జురేల్, కరుణ్ నాయర్, ఆకాశ్ దీప్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, తనుశ్ కొటియాన్, ముకేశ్ కుమార్, హర్షిత్ రాణా, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబే బరిలోకి దిగనున్నారు. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఈ సన్నాహక మ్యాచ్లు సహకరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో భాగం కాని... భారత టెస్టు జట్టు ఆటగాళ్లను బీసీసీఐ ముందే ఇంగ్లండ్ పంపింది. కరుణ్ నాయర్ మినహా... మిగిలిన ఆటగాళ్లందరికీ ఇదే తొలి ఇంగ్లండ్ పర్యటన. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్న అనంతరం టీమిండియా ఆడనున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కానుండటంతో... వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు ఈ మ్యాచ్ తోడ్పడనుంది. ప్రధాన సిరీస్లో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను నిర్ణయించేందుకు కూడా ఈ సన్నాహక మ్యాచ్లు సహాయపడనున్నాయి. అభిమన్యు ఈశ్వరణ్, కరుణ్ నాయర్, ఆంధ్రప్రదేశ్ పేస్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి ప్రదర్శనపై అందరి దృష్టి నిలవనుంది.ఆ్రస్టేలియా పర్యటనలో 298 పరుగులతో ఆకట్టుకున్న నితీశ్ రెడ్డి... ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోగా... ఇంగ్లండ్తో తుది జట్టులో చోటు దక్కాలంటే ఈ మ్యాచ్లో సత్తాచాటాల్సిన అవసరముంది. పేస్ ఆల్రౌండర్గా శార్దుల్ ఠాకూర్ నుంచి అతడికి పోటీ ఎదురు కానుంది. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో... కొత్త స్పిన్నర్గా ఎవరు వెలుగులోకి వస్తారో చూడాలి. -
జ్వెరెవ్, సినెర్ మూడో రౌండ్లోకి...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ స్టార్లు, సీడెడ్ క్రీడాకారులు మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. ప్రపంచ నంబర్వన్ ఆటగాడు యానిక్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) వరుస సెట్లలో ప్రత్యర్థులపై గెలిచి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్లో రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా), మూడో సీడ్ పెగూలా (అమెరికా), ఆరో సీడ్ అండ్రీవా (రష్యా), ఏడో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)లు కూడా అలవోక విజయాలతో మూడో రౌండ్లోకి చేరుకున్నారు. టైటిలే లక్ష్యంగా... హార్డ్ కోర్టుల్లో (ఆ్రస్టేలియా ఓపెన్లో 2, యూఎస్ ఓపెన్లో 1) మూడు టైటిల్స్ సాధించిన టాప్సీడ్ ప్లేయర్ సినెర్ ఈసారి క్లే కోర్టు టైటిలే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఇటలీకి చెందిన నిరుటి సెమీఫైనలిస్ట్ సినెర్ 6–3, 6–0, 6–4తో రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. కేవలం రెండు గంటల్లోపే (1: 57 నిమిషాలు) వరుస సెట్లలో ప్రత్యర్థి ఆటకట్టించాడు. ప్రత్యర్థిపై మూడు ఏస్లు సంధించిన సినెర్ ఒక్క డబుల్ఫాల్ట్ కూడా చేయలేదు. 21 విన్నర్లు కొట్టిన సినెర్ ఫ్రాన్స్ ఆటగాడిపై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించాడు. గత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనలిస్ట్, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 3–6, 6–1, 6–2, 6–3తో జెస్పెర్ డి జోంగ్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. తొలిసెట్ను కోల్పోయిన జర్మనీ స్టార్ తర్వాత వరుస సెట్లలో ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా పట్టుదలగా ఆడి గెలుపొందాడు. 17వ సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా) 7–6 (7/1), 6–1, 7–6 (7/5)తో ఆడమ్ వాల్టన్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందగా, తొమ్మిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)కు రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. గత ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనలిస్ట్ డిమినార్ 6–2, 6–2, 4–6, 3–6, 2–6తో అనామక కజకిస్తాన్ ప్లేయర్ బబ్లిక్ చేతిలో కంగుతిన్నాడు. సెర్బియన్ స్టార్, ఆరోసీడ్ నొవాక్ జొకోవిచ్ 6–3, 6–2, 7–6 (7/1)తో మౌటెట్ (ఫ్రాన్స్)పై గెలుపొంది మూడో రౌండ్కు చేరుకున్నాడు. గాఫ్, అండ్రీవాల జోరు మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ కొకొ గాఫ్, ఆరో సీడ్ అండ్రీవా తమ ప్రత్యర్థుల్ని చాలా సులువుగా చిత్తు చేశారు. గాఫ్ (అమెరికా) 6–2, 6–4తో వాలెంతొవా (చెక్ రిపబ్లిక్)పై గంటా 15 నిమిషాల్లోనే గెలుపొందగా, అండ్రీవా 6–3, 6–4తో క్రూగెర్ (అమెరికా)ను గంటా 13 నిమిషాల్లోనే చిత్తు చేసింది. మూడో సీడ్ పెగూలా (అమెరికా) 6–3, 7–6 (7/3) అన్ లీ (అమెరికా)పై, ఏడో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–3తో బౌల్టెర్ (ఇంగ్లండ్)పై విజయం సాధించారు. పదో సీడ్ బడొసా (స్పెయిన్) 3–6, 6–4, 6–4తో ఎలీనా గాబ్రియెలా రూస్ (రొమేనియా)పై గెలిచింది. శ్రీరామ్ బాలాజీ జోడీ కూడా... పురుషుల డబుల్స్లో మరో భారత జోడీ కూడా ముందంజ వేసింది. మెక్సికో ఆటగాడు మిగుల్ రేస్ వరెలాతో జతకట్టిన శ్రీరామ్ బాలాజీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం అర్ధరాత్రి ముగిసిన ఈ తొలిరౌండ్ పోరులో బాలాజీ–మిగుల్ రేస్ జోడీ 6–2, 6–1తో యుంచవొకెత్ బూ (చైనా)–యుగొ కారబెలి (అర్జెంటీనా) జంటపై వరుస సెట్లలో అలవోక విజయం సాధించింది. -
గుజరాత్ X ముంబై
ముల్లాన్పూర్: ఐపీఎల్ 18వ సీజన్లో బెంగళూరు జట్టు తుది పోరుకు అర్హత సాధించగా... గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్ధమయ్యాయి. శుక్రవారం జరగనున్న పోరులో గెలిచిన జట్టు... క్వాలిఫయర్–1లో ఓడిన పంజాబ్ కింగ్స్తో క్వాలిఫయర్–2లో తలపడనుంది. ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 5 పరాజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకున్న గుజరాత్ పట్టికలో మూడో స్థానంతో ‘ప్లే ఆఫ్స్’కు చేరుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై 14 మ్యాచ్ల్లో 8 విజయాలు, 6 పరాజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్కు చేరింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరగగా... రెండింట్లోనూ గుజరాత్నే విజయం వరించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్, హార్దిక్ పాండ్యా నమన్ ధీర్ ముంబై బ్యాటింగ్కు కీలకం కానుండగా... జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, సాంట్నర్ బౌలింగ్ భారం మోయనున్నారు. మరోవైపు స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ సేవలు అందుబాటులో లేకపోవడంతో గుజరాత్ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. కెపె్టన్ శుబ్మన్ గిల్, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ప్రదర్శనపైనే ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా సత్తా చాటాల్సిన అవసరముంది.ఐపీఎల్లో నేడు (ఎలిమినేటర్)గుజరాత్ X ముంబైవేదిక: ముల్లాన్పూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో -
తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు...
ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచి తొలి టైటిల్ కోసం పోరాడుతూనే ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ఈ సీజన్లో ట్రోఫీ దిశగా మరో ముందడుగు వేసింది. బౌలర్లు విజృంభించడంతో క్వాలిఫయర్–1లో పంజాబ్పై ఏకపక్ష విజయం సాధించిన బెంగళూరు... తొమ్మిదేళ్ల తర్వాత నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. హాజల్వుడ్ పేస్తో బెంబేలెత్తిస్తే... సుయాశ్ శర్మ గూగ్లీలతో పంజాబ్ పనిపట్టాడు. ఈ సీజన్లో ప్రధానంగా టాప్–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడ్డ పంజాబ్.. ఆ ముగ్గురు మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో ఓటమి పాలైంది. ముల్లాన్పూర్: సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) క్వాలిఫయర్–1లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ఐపీఎల్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తుచేసి తుదిపోరుకు చేరింది. బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టగా... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం వైపు నిలిచింది. మొదట పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ స్టొయినిస్ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... ప్రభ్సిమ్రన్ సింగ్ (18), అజ్మతుల్లా ఓమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (2)తో పాటు ప్రియాన్ష్ ఆర్య (7), జోష్ ఇన్గ్లిస్ (4), నేహల్ వధేరా (8), శశాంక్ సింగ్ (3), ముషీర్ ఖాన్ (0) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సుయాశ్ శర్మ, హాజల్వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... యశ్ దయాళ్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో బెంగళూరు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (12; 2 ఫోర్లు) త్వరగానే అవుట్ అయినా... ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుదిపోరులో క్వాలిఫయర్–2 విజేతతో బెంగళూరు ట్రోఫీ కోసం తలపడనుంది. ఒకరి వెంట ఒకరు... టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. ఈ సీజన్లో మెరుగైన ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ప్రభ్సిమ్రన్ కీలక పోరులో ఆకట్టుకోలేకపోయారు. యశ్ దయాళ్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి ప్రియాన్ష్ సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా... భువనేశ్వర్ వేసిన మరుసటి ఓవర్లో రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చిన ప్రభ్సిమ్రన్ అదే జోరులో మరో షాటే ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 3 బంతులే ఆడి అవుట్ అయ్యాడు. హాజల్వుడ్ బంతిని కట్ చేసే ప్రయత్నంలో కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. హాజల్వుడ్ తన మరుసటి ఓవర్లో ఇన్గ్లిస్ను కూడా బుట్టలో వేసుకోగా... నేహల్ వధేరా ఇలా వచ్చి అలా వెళ్లాడు. స్టొయినిస్ కొన్ని షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించే ప్రయత్నం చేసినా అతడికి సహాకారం అందించేవాళ్లే కరువయ్యారు. సుయాశ్ గూగ్లీని అర్థం చేసుకోలేక శశాంక్ క్లీన్ బౌల్డ్ కాగా... ఇంపాక్ట్ ప్లేయర్గా అనూహ్య అవకాశం దక్కించుకున్న ముషీర్ ఖాన్ ఐపీఎల్ అరంగేట్రంలో డకౌట్గా వెనుదిరిగాడు. బ్యాటర్లు వరసగా విఫలమవుతుండటంతో... ముషీర్కు తుది జట్టులో చోటు దక్కగా... ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే అతడు అవుట్అయ్యాడు. తన తదుపరి ఓవర్లో స్టొయినిస్ను కూడా సుయాశ్ పెవిలియన్కు పంపడంతో పంజాబ్ పనైపోయింది. ఆఖర్లో అజ్మతుల్లా విలువైన పరుగులు చేసి జట్టు స్కోరును వంద పరుగుల మార్క్ దాటించాడు. ఆడుతూ పాడుతూ.. బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభానికి ముందే పంజాబ్ పరాజయం ఖాయమైపోగా... నాలుగో ఓవర్లో కోహ్లిని ఔట్ చేసి జెమీసన్ కాస్త ఆసక్తి రేపినా... సాల్ట్ విజృంభణతో ఎలాంటి సంచలనానికి అవకాశం లేకుండా పోయింది. మూడో ఓవర్లో 4, 6 కొట్టిన సాల్ట్... ఐదో ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. జెమీసన్ ఓవర్లో వరసగా 4, 4, 6 కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 61/1తో నిలిచింది. మయాంక్ అగర్వాల్ (19; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రజత్ పాటీదార్ (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. 23 బంతుల్లో సాల్ట్ హాఫ్సెంచరీ పూర్తి చేసుకోగా... భారీ సిక్స్తో పాటీదార్ మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) కృనాల్ (బి) దయాళ్ 7; ప్రభ్సిమ్రన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 18; ఇన్గ్లిస్ (సి) భువనేశ్వర్ (బి) హాజల్వుడ్ 4; శ్రేయస్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 2; నేహల్ (బి) దయాళ్ 8; స్టొయినిస్ (బి) సుయాశ్ 26; శశాంక్ (బి) సుయాశ్ 3; ముషీర్ (ఎల్బీ) (బి) సుయాశ్ 0; అజ్మతుల్లా (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 18; హర్ప్రీత్ (బి) షెఫర్డ్ 4; జెమీసన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో ఆలౌట్) 101. వికెట్ల పతనం: 1–9, 2–27, 3–30, 4–38, 5–50, 6–60, 7–60, 8–78, 9–97, 10–101. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–17–1; యశ్ దయాళ్ 4–0–26–2; హాజల్వుడ్ 3.1–0–21–3; సుయాశ్ శర్మ 3–0–17–3; కృనాల్ పాండ్యా 1–0–10–0, రొమారియో షెఫర్డ్ 1–0–5–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (నాటౌట్) 56; కోహ్లి (సి) ఇన్గ్లిస్ (బి) జెమీసన్ 12; మయాంక్ (సి) శ్రేయస్ (బి) ముషీర్ 19; రజత్ పాటీదార్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు: 4; మొత్తం (10 ఓవర్లలో 2 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–30, 2–84. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 2–0–20–0; జెమీసన్ 3–1–27–1; అజ్మతుల్లా 1–0–10–0; హర్ప్రీత్ బ్రార్ 2–0–18–0; ముషీర్ ఖాన్ 2–0–27–1. -
IPL 2025: పంజాబ్ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ
ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు (మే 30) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.అతి పెద్ద విజయంఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో బంతుల పరంగా ఆర్సీబీ అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ మరో 60 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో ఈ రికార్డు కేకేఆర్ పేరిట ఉండేది. 2024 సీజన్ ఫైనల్లో కేకేఆర్ ఎస్ఆర్హెచ్పై 57 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.నాలుగోసారి..తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. ఆర్సీబీ 2009, 2011, 2016 సీజన్లలో కూడా ఫైనల్కు చేరింది. అయితే మూడు సందర్భాల్లో ఈ జట్టుకు ఓటమే ఎదురైంది. -
IPL 2025, Qualifier 1: ప్లే ఆఫ్స్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పంజాబ్
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో అతి తక్కువ ఓవర్లు ఆడిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది. 2008 సీజన్లో ఢిల్లీ 16.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ చేసిన 101 పరుగుల స్కోర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోర్గానూ రికార్డైంది.ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో అత్యల్ప స్కోర్లు..82 - డెక్కన్ ఛార్జర్స్ vs RCB, DY పాటిల్, 2010 (3వ స్థానం ప్లేఆఫ్)87 - DC vs RR, ముంబై, 2008 SF101 - LSG vs MI, చెన్నై, 2023 ఎలిమినేటర్101 - PBKS vs RCB, ముల్లన్పూర్, క్వాలిఫైయర్ 1*104 - డెక్కన్ ఛార్జర్స్ vs CSK, DY పాటిల్, 2010 SFకాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 30 పరుగుల వద్ద కోహ్లి (12) వికెట్ కోల్పోయింది. 4 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 30/1గా ఉంది. సాల్ట్ (14), మయాంక్ అగర్వాల్ (0) క్రీజ్లో ఉన్నారు. -
IPL 2025, Qualifier 1: అరుదైన రికార్డు సాధించిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్
ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో 18 పరుగులకే ఔటైన ప్రభ్సిమ్రన్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు పూర్తి చేసిన ఆరో అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్ తొలి సీజన్లో పంజాబ్కే చెందిన షాన్ మార్ష్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కాగా.. 2018లో సూర్యకుమార్ యాదవ్ (ఎంఐ), 2020 సీజన్లో ఇషాన్ కిషన్ (ఎంఐ), 2023 సీజన్లో యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్), 2024 సీజన్లో రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్) ఈ ఘనత సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా రికార్డుల్లో ఉన్నారు. ఈ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన ప్రభ్సిమ్రన్ 517 పరుగులు చేశాడు. ఈ సీజన్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 500 పరుగుల మార్కును దాటాడు (15 మ్యాచ్ల్లో 516 పరుగులు).ఇదిలా ఉంటే, ఆర్సీబీతో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ దాదాపుగా చేతులెత్తేసింది. ఈ జట్టు 13 ఓవర్లలో కేవలం 92 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశారు. సుయాశ్ శర్మ 3, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాల్ తలో 2, భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 7, ప్రభ్సిమ్రన్ సింగ్ 18, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, మార్కస్ స్టోయినిస్ 26, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0 పరుగులకు ఔట్ కాగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడినా మరో అవకాశం (క్వాలిఫయర్-2) ఉంటుంది. -
IPL 2025, Qualifier 1: పంజాబ్పై ఆర్సీబీ ఘన విజయం
పంజాబ్పై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ఫైనల్కు చేరింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ7.5వ ఓవర్- 84 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 102.. 30 పరుగుల వద్ద కోహ్లి ఔట్3.2వ ఓవర్- 102 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 30 పరుగుల వద్ద విరాట్ కోహ్లి (12) వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో జోస్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి విరాట్ ఔటయ్యాడు. రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. 78 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్10.3వ ఓవర్- 78 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్లో ప్రమాదకరంగా కనిపిస్తున్న మార్కస్ స్టోయినిస్ (26) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్8.5వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. సుయాశ్ బౌలింగ్లో ముషీర్ ఖాన్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్8.2వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్లో శశాంక్ సింగ్ (3) క్లీన్ బౌల్డయ్యాడు. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 6.3వ ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్లో నేహల్ వధేరా (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దయాల్, హాజిల్వుడ్ తలో 2, భువీ ఓ వికెట్ తీశారు. 38 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్5.1వ ఓవర్- 38 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్కు క్యాచ్ ఇచ్చి జోష్ ఇంగ్లిస్ (4) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్3.4వ ఓవర్- 30 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (2) ఔటయ్యాడు. ఇన్ ఫామ్ బ్యాటర్లు ప్రియాంశ్, ప్రభ్సిమ్రన్, శ్రేయస్ ఔట్ కావడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్2.6వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఇన్ ఫామ్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (18) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్1.2వ ఓవర్- 9 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (7) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, స్టార్ బౌలర్ వచ్చేశాడుఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. పంజాబ్ తరఫున మార్కో జన్సెన్ స్థానంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ తరఫున స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ బరిలోకి దిగనున్నాడు. నువాన్ తుషార స్థానాన్ని జోష్ భర్తీ చేశాడు.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, కైల్ జామీసన్ఇంపాక్ట్ సబ్లు: విజయ్కుమార్ వైషాక్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్, జేవియర్ బార్ట్లెట్.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మఇంపాక్ట్ సబ్స్: మయాంక్ అగర్వాల్, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్. -
విండీస్తో వన్డే సిరీస్ నుంచి ఇంగ్లండ్ తాజా మాజీ కెప్టెన్ ఔట్.. భారత్తో సిరీస్కు కూడా..!
ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు తాజా మాజీ కెప్టెన్ హీథర్ నైట్ త్వరలో వెస్టిండీస్తో జరుగనున్న వన్డే సిరీస్ నుంచి నిష్క్రమించింది. గాయం కారణంగా నైట్ ఈ సిరీస్తో పాటు జూన్, జులైల్లో షెడ్యూలైన భారత పర్యటనకు కూడా దూరమైంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నైట్ పై రెండు సిరీస్లతో పాటు హండ్రెడ్ లీగ్ నుంచి కూడా తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నైట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూడు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నైట్ ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్లో ఆడేది కూడా అనుమానంగా కనిపిస్తుంది. నైట్ గైర్హాజరీలో విండీస్తో సిరీస్లో నాట్ సీవర్ బ్రంట్ ఇంగ్లండ్ కెప్టెన్గా వ్యవహరించనుంది. ఈ సిరీస్లో నైట్ స్థానాన్ని అలైస్ క్యాప్సీ భర్తీ చేయనుంది. నైట్ మే 26న విండీస్తో జరిగిన మూడో టీ20 సందర్భంగా గాయపడింది. ఈ మ్యాచ్లో 66 పరుగుల వద్ద ఉన్న సమయంలో నైట్ అర్దంతరంగా మైదానాన్ని వీడింది.కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ ఇదివరకే ముగియగా.. వన్డే సిరీస్ మే 30 నుంచి ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్ను కూడా అదే తరహాలో ముగించాలని భావిస్తుంది. మే 30, జూన్ 4, 7 తేదీల్లో మూడు వన్డేలు వేర్వేరు వేదికల్లో జరుగనున్నాయి.విండీస్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ జట్టు..నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), అలైస్ డేవిడ్సన్ రిచర్డ్స్, మహిక గౌర్, సోఫీ డంక్లీ, ట్యామీ బేమౌంట్, అలైస్ క్యాప్సీ, ఆమీ జోన్స్, ఎమ్మా లాంబ్, ఎమ్ ఆర్లాట్, సారా గ్లెన్, కేట్ క్రాస్, లిన్సే స్మిత్, లారెన్ బెల్, చార్లెట్ డీన్ -
భారత ఆటగాడిని అవమానించిన పాక్ టెన్నిస్ ప్లేయర్.. వైరల్ వీడియో
పాకిస్తాన్ టెన్నిస్ ప్లేయర్ ఒకరు భారత ఆటగాడిని అవమానించాడు. భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేక ఓవరాక్షన్ చేశాడు. మ్యాచ్ పూర్తయ్యాక షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లిన భారత ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కోపంతో ఊగిపోతూ కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కజకిస్థాన్ వేదికగా జరిగిన ఏసియా-ఓసియానియా జూనియర్ డేవిడ్ కప్ (అండర్-16) టెన్నిస్ టోర్నీమెంట్లో ఇది జరిగింది. India defeats Pakistan 2-0 in Junior Davis CupLook at the Pakistan player's attitude on handshake after loosing, Pathetic Stuff! 😡 pic.twitter.com/8twsAbDqPd— India Insights 🇮🇳 (@India_insights0) May 27, 2025ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. పాక్ ఆటగాడి ప్రవర్తనను భారత క్రీడాభిమానులు ఖండిస్తున్నారు. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని మండిపడుతున్నారు. పాక్ ఆటగాళ్ల నుంచి ఇంతకంటే గొప్ప ప్రవర్తన ఆశించలేమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్-పాక్ మధ్య యుద్దం తర్వాత జరిగిన ఘటన కావడంతో భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.కాగా, జూనియర్ డేవిడ్ కప్ టెన్నిస్ టోర్నీలో 11వ స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్లో భారత్ పాక్ను 2-0 తేడాతో చిత్తుగా ఓడించింది. సింగిల్స్ మ్యాచ్ల్లో భారత ఆటగాళ్లు ప్రకాశ్ సర్రన్, తవిశ్ పహ్వా వరుస సెట్లలో పాక్ ఆటగాళ్లును ఓడించారు. -
భారత్లో ఆస్ట్రేలియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ విడుదల చేసింది. ఈ పర్యటనలో ఆసీస్ మహిళా టీమ్ భారత మహిళల క్రికెట్ జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో చెన్నై వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్లు ప్రారంభమవుతాయి.ఆస్ట్రేలియా-ఏ, సౌతాఫ్రికా-ఏ జట్లు కూడా..!ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుండగానే ఆ దేశ పురుషుల ఏ టీమ్ కూడా భారత్లో పర్యటించనుంది. సెప్టెంబర్ 16- అక్టోబర్ 5 మధ్య తేదీల్లో ఆసీస్-ఏ టీమ్ భారత ఏ జట్టుతో రెండు అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది. టెస్ట్ మ్యాచ్లకు లక్నో ఆతిథ్యమివ్వనుండగా.. వన్డేలు కాన్పూర్లో జరుగనున్నాయి.భారత్లో ఆస్ట్రేలియా-ఏ మెన్స్ టీమ్ షెడ్యూల్..తొలి టెస్ట్: సెప్టెంబర్ 16-19 (లక్నో)రెండో టెస్ట్: సెప్టెంబర్ 23-26 (లక్నో)తొలి వన్డే: సెప్టెంబర్ 30 (కాన్పూర్)రెండో వన్డే: అక్టోబర్ 3 (కాన్పూర్)మూడో వన్డే: అక్టోబర్ 5 (కాన్పూర్)ఆస్ట్రేలియా ఏ పురుషుల టీమ్ భారత్లో పర్యటిస్తుండగానే సౌతాఫ్రికా ఏ పురుషుల ఏ టీమ్ కూడా భారత్లో పర్యటిస్తుంది. ఆస్ట్రేలియా ఏ టీమ్ లాగే ఈ జట్టు కూడా భారత్ ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది. టెస్ట్ మ్యాచ్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్లో జరుగనుండగా.. వన్డేలు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్నాయి.భారత్లో సౌతాఫ్రికా-ఏ మెన్స్ టీమ్ షెడ్యూల్..తొలి టెస్ట్: అక్టోబర్ 30-నవంబర్ 2 (బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గ్రౌండ్)రెండో టెస్ట్: నవంబర్ 6-9 (బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గ్రౌండ్)తొలి వన్డే: నవంబర్ 13 (చిన్నస్వామి స్టేడియం)రెండో వన్డే: నవంబర్ 16 (చిన్నస్వామి స్టేడియం)మూడో వన్డే: నవంబర్ 19 (చిన్నస్వామి స్టేడియం) -
Qualifier 1: స్టార్ బౌలర్ దూరం.. బలహీనంగా కనిపిస్తున్న పంజాబ్ బౌలింగ్ విభాగం
ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగబోయే క్వాలిఫయర్-1కు ముందు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్కు ఆ జట్టు స్టార్ పేసర్ మార్కో జన్సెన్ దూరమయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ దృష్ట్యా అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. జన్సెన్ స్థానాన్ని అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేసే అవకాశం ఉంది. కీలకమైన ఈ మ్యాచ్లో జన్సెన్ లేకపోవడం పంజాబ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చహల్ ఆడేది కూడా అనుమానమే..!నేటి మ్యాచ్లో పంజాబ్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఆడేది కూడా అనుమానమే అని తెలుస్తుంది. చహల్ కొద్ది రోజుల కిందట గాయపడ్డాడు (చేతి వేలికి). ఈ కారణంగా అతను గత రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. కీలక మ్యాచ్ కావడంతో పంజాబ్ యాజమాన్యం చహల్ను బరిలోకి దించే సాహసం చేయవచ్చు.జన్సెన్, చహల్ లాంటి నాణ్యమైన బౌలర్లు నేటి మ్యాచ్లో ఆడకపోతే పంజాబ్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీరిద్దరు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల బౌలర్లు. వీరి గైర్హాజరీలో పంజాబ్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. నంబర్ వన్ టీ20 బౌలర్ అర్షదీప్ ఉన్నా ఒక్కడు ఏ మేరకు ప్రభావం చూపగలడో చూడాలి. జేమీసన్, ఒమర్జాయ్ లాంటి పేసర్లు ఉన్నా వారి నుంచి అతిగా ఆశించలేని పరిస్థితి. స్పిన్ విభాగంలో హర్ప్రీత్ బ్రార్పై కొద్దొగొప్పో నమ్మకాలు పెట్టుకోవచ్చు. ఒకవేళ చహల్ దూరమైతే అతని స్థానంలో విజయ్కుమార్ వైశాక్ ఆడవచ్చు. అయితే వైశాక్ చహల్ లేని లోటును భర్తీ చేయలేడు. వైశాక్ తుది జట్టులోకి వస్తే పంజాబ్ స్పిన్ విభాగాన్ని హర్ప్రీత్ బ్రార్ ఒక్కడే మోయాల్సి వస్తుంది. కాబట్టి గాయం తగ్గకపోయినా నేటి మ్యాచ్లో పంజాబ్ యాజమాన్యం చహల్ను బరిలోకి దించవచ్చు. భీకర ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లిని బలహీనంగా కనిపిస్తున్న ఈ పంజాబ్ బౌలింగ్ యూనిట్ ఏ మేరకు నిలువరించగలదో చూడాలి.బౌలింగ్ విషయాన్ని పక్కన పెడితే.. పంజాబ్ బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. ఈ జట్టులో దాదాపు అందరు బ్యాటర్లు మంచి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇంగ్లిస్ గత మ్యాచ్లో తడాకా చాటాడు. శ్రేయస్ సీజన్ ఆరంభం నుంచి మంచి టచ్లో ఉన్నాడు. నేహల్ వధేరా, శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ చివర్లో అద్భుతాలు చేయడం చూశాం. పంజాబ్ బ్యాటింగ్ విభాగాన్ని స్టోయినిస్ ఫామ్ ఒక్కటే కలవరపెడుతుంది. ఇతను కూడా నేటి మ్యాచ్లో టచ్లోకి వస్తే ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి.నేటి మ్యాచ్లో పంజాబ్ తుది జట్టు (అంచనా)..ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (WK), శ్రేయస్ అయ్యర్ (C), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, అర్ష్దీప్ సింగ్, వైషాక్ విజయ్కుమార్/యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ ప్లేయర్: ప్రభ్సిమ్రాన్ సింగ్ -
IPL 2025 Qualifier 1: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
ఐపీఎల్-2025 సీజన్ తొలి క్వాలిఫయర్లో గురువారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. సమ ఉజ్జీలగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోరు మరోసారి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే లీగ్ స్టేజిలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్లు కూడా అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు ఆర్హత సాధిస్తోంది. ఇక హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.చరిత్రకు అడుగు దూరంలో..ఈ మ్యాచ్లో కోహ్లి మరో 30 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్పై అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు పంజాబ్పై కోహ్లి 1104 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ పంజాబ్ కింగ్స్పై 1034 పరుగులు చేశాడు.ఒకే ఒక ఫిప్టీ..ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక ఆర్ధశతకాలు నమోదు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేసేందుకు కోహ్లి అడుగుదూరంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో విరాట్ హాఫ్ సెంచరీ సాధిస్తే వార్నర్ సరసన చేరుతాడు. కోహ్లి ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. 2016 ఐపీఎల్ సీజన్లో వార్నర్ 9 ఫిప్టీలు సాధించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో విరాట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. తన అద్బుత ఇన్నింగ్స్లతో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కింగ్ కోహ్లి ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడి 602 పరుగులు చేశాడు.పంజాబ్తో మ్యాచ్కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజిత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారాచదవండి: ENG vs IND: 'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు' -
క్వాలిఫయర్-1.. ఆర్సీబీకి అదిరిపోయే న్యూస్
ఐపీఎల్-2025 క్వాలిఫయర్-1కు సర్వసిద్దమైంది. చంఢీగడ్లోని ముల్లాన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇరు జట్లు సమ ఉజ్జీలగా ఉండడంతో గెలుపు ఎవరిదో క్రికెట్ నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి గుడ్న్యూస్ అందినట్లు తెలుస్తోంది.హాజిల్ వుడ్ రీ ఎంట్రీ?గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్న జోష్ హాజిల్వుడ్ తిరిగి ఆర్సీబీ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. భుజం నొప్పితో బాధపడుతున్న ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. రొమిరియో షెఫర్డ్ స్దానంలో ప్లేయింగ్ ఎలెవన్లోకి హాజిల్వుడ్ రానున్నట్లు ఆర్సీబీ వర్గాలు వెల్లడించాయి.హాజిల్వుడ్ తిరిగొస్తే బెంగళూరు బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. ఇప్పటికే భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా వంటి స్పీడ్ స్టార్లు ఆర్సీబీ జట్టులో ఉన్నారు. మరోవైపు గత రెండు మ్యాచ్లలో ఇంప్టాక్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ సైతం ఈ మ్యాచ్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాడు. అయితే విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్ మాత్రం ఈ మ్యాచ్లో కూడా ఆడేది అనుమానమే. డేవిడ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతోంది.పంజాబ్తో మ్యాచ్కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజిత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారాచదవండి: ENG vs IND: 'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు' -
వరల్డ్ బౌలింగ్ లీగ్లో కోహ్లి పెట్టుబడి..
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి... వరల్డ్ బౌలింగ్ లీగ్ (డబ్ల్యూబీఎల్)లో అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన కోహ్లి... డబ్ల్యూబీఎల్లో వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా మారాడు. డబ్ల్యూబీఎల్లో భాగంగా ఇటీవల తొలి జట్టు ఓఎమ్జీ ఫ్రాంచైజీని ప్రకటించింది.ఇప్పుడు తాజాగా క్రికెట్ సూపర్ స్టార్ కోహ్లి భాగస్వామ్యాన్ని బహిర్గతం చేసింది. ‘నేను 11 ఏళ్ల వయసులో బౌలింగ్ చేయడం ప్రారంభించా. 12 ఏళ్ల వయసు నుంచి బంతిని తిప్పేందుకు ప్రయతి్నస్తున్నా. ఈ లీగ్లో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. వ్యాపారాభివృద్ధి కోణంలోనూ ఇది మంచి అడుగు అనుకుంటున్నా. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త క్రీడలను ప్రోత్సహించాల్సిందే. ఈ1 సిరీస్లో మా జట్టు పురోగతి చూస్తే ముచ్చటేస్తోంది. డబ్ల్యూబీఎల్ వ్యూహాత్మక పెట్టుబడి దారుడిగా, సహ యజమానిగా ఉండడం ఉత్సాహాన్నిస్తోంది’అని విరాట్ కోహ్లి వెల్లడించాడు. -
'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు'
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ స్ధానంలో శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ నియమితుడయ్యాడు. అయితే ఈ జట్టులో అద్బుతమైన ఫామ్లో ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.శ్రేయస్ అయ్యర్ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్కు సెలక్టర్లు చోటిచ్చారు. తాజాగా సెలక్టర్ల నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుదర్శన్ బదులుగా అనుభవం ఉన్న అయ్యర్కు ఛాన్స్ ఇవ్వాల్సందని కైఫ్ అభిప్రాయపడ్డాడు."సాయి సుదర్శన్ ఒక అద్బుతమైన ఆటగాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ సీజన్లో బాగా రాణించడంతో అతడిని టెస్టు జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్-2023, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అయ్యర్ దాదాపు 550 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా అద్బుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్గా అతడు విజయవంతమయ్యాడు. సుదర్శన్ను వైట్ క్రికెట్ ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టులోకి తీసుకున్నప్పుడు, మరి అయ్యర్ విషయంలో ఏమైందని" సెలక్టర్లపై కైఫ్ మండిపడ్డాడు.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
సిక్స్ బాదాడని బ్యాటర్ను కొట్టిన బౌలర్! వీడియో వైరల్
మిర్పూర్ వేదికగా దక్షిణాఫ్రికా-ఈ, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్లో వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ షెప్టో తులి జెంటల్మేన్ గేమ్కు మాయని మచ్చ తీసుకొచ్చేలా ప్రవర్తించాడు. క్రికెట్లో చిన్న చిన్న గొడవలు సాధారణంగా మనం చూస్తూ ఉంటాము.కానీ ఈ యువ బౌలర్ తులి మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్ సిక్స్ బాదడని దాడికి దిగాడు. బంగ్లా ఇన్నింగ్స్ 105వ ఓవర్ వేసిన తులి బౌలింగ్లో తొలి బంతిని రిపోన్ మోండోల్ స్ట్రైయిట్గా సిక్సర్ బాదాడు. దీంతో సహనాన్ని కోల్పోయిన సఫారీ బౌలర్.. రిపోన్తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అతడి వద్దకు వెళ్లి చేయి చేసుకున్నాడు.రిపోన్ కూడా తిరగబడడంతో గొడం పెద్దదైంది. ఇద్దరు ఆటగాళ్ళు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవసద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. క్రిక్ ఇనో ఫో రిపోర్ట్ ప్రకారం.. ఈ ఇద్దరి ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీ క్రికెట్ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులకు తన నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిపై వారి క్రికెట్ బోర్డు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశముంది.I have never seen such an incident in the history of cricket. A direct fight. What a shameful incident of cricket happened between the talented bowler Shepo Ntuli of South Africa and Ripon Mondal of Bangladesh. This is extreme. #BANevsSAe #CricketTwitter #Bangladesh #SouthAfrica pic.twitter.com/3CbMTHwUEA— Monirul Ibna Rabjal 🇧🇩🇪🇺 (@to2monirul) May 28, 2025 -
పులి కడుపున పులే పుడుతుంది!
గోల్ఫ్ సామ్రాజ్యానికి రారాజు, అంతర్జాతీయ గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ కుమారుడు చార్లీ వుడ్స్ తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. 16 ఏళ్ల చార్లీ వుడ్స్ తన తొలి అమెరికన్ జూనియర్ గోల్ఫ్ అసోసియేషన్ (AJGA) టైటిల్ను గెలుచుకున్నాడు. బుధవారం ఫ్లోరిడాలోని బౌలింగ్ గ్రీన్లో జరిగిన టీమ్ టేలర్ మేడ్ ఇన్విటేషనల్ టోర్నీ విజేతగా నిలిచాడు. అమెరికన్ జూనియర్ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో చార్లీ అదరగొట్టాడు. చివరి రౌండ్ సమయానికి ఓవర్నైట్ లీడర్ ల్యూక్ కోల్టన్ కంటే జూనియర్ వుడ్స్ వెనకబడి ఉన్నాడు. కానీ ఆఖరి రౌండ్లో మాత్రం చేసిన చార్లీ.. సిక్స్-అండర్ పార్ 66 సాధించి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఈ రౌండ్లో చార్లీ వుడ్స్ ఎనిమిది బర్డీలు, రెండు బోగీలు సాధించాడు. ఓవరాల్గా 15-అండర్ 201తో వుడ్స్ ముగించాడు.చదవండి: Gautam Gambhir: నేను సెలక్టర్ను కాదు.. నన్ను ఎందుకు అడుగుతారు -
నేను సెలక్టర్ను కాదు.. నన్ను ఎందుకు అడుగుతారు: గంభీర్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కెప్టెన్గా శుబ్మన్ గిల్, అతడి డిప్యూటీగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. సాయిసుదర్శన్, అర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.అదేవిధంగా కరుణ్ నాయర్, శార్ధూల్ ఠాకూర్ వంటి వెటరన్ ఆటగాళ్లకు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. అయితే ఈ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. రంజీ ట్రోఫీ సహా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా చక్కటి రికార్డు ఉన్న అయ్యర్ పేరును సెలక్టర్లు పరిశీలించకపోవడం ఆశ్చర్యపర్చింది.క్రికెటేతర కారణాలతో అతడిని పక్కన పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేదు. ‘నేను సెలక్టర్ను కాదు’ అంటూ ఒక్క ముక్కలో గంభీర్ స్పందించాడు.కానీ ఐపీఎల్ ఫైనల్కు త్రివిధ దళాల అధిపతులను ఆహ్వానించినందుకు బీసీసీఐని గంభీర్ ప్రశంసించాడు. అది నమ్మశక్యం కాని నిర్ణయమని అన్నాడు. దేశం మొత్తం మన సాయుధ దళాలకు సెల్యూట్ చేయాలని గంభీర్ పేర్కొన్నాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్2025-27లో భాగంగా జరగనుంది.చదవండి: IPL 2025: రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ -
ఆసియాలో ఆరు పతకాల జోరు
గుమి (దక్షిణ కొరియా) : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత జోరు కొనసాగుతోంది. తొలి రోజు రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు... రెండో రోజు పోటీల్లో ఒక స్వర్ణం సహా మొత్తం ఆరు పతకాలు కైవసం చేసుకున్నారు. 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే టీమ్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు పసిడి పతకం నిలబెట్టుకోగా... డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్, పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకాలతో మెరిశారు. మహిళల 400 మీటర్ల పరుగులో రూపాల్ చౌదరి, మహిళల 1500 మీటర్ల పరుగులో పూజ కూడా రజత పతకాలు సాధించగా... పురుషుల 1500 మీటర్ల పరుగులో యూనుస్ షా కాంస్యం గెలుచుకున్నాడు.దీంతో భారత ఖాతాలో మొత్తంగా 8 పతకాలు (2 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు) చేరాయి. 26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన 4్ఠ400 మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రూపాల్ చౌదరి, సంతోష్ కుమార్, విశాల్, సుభ వెంకటేశన్తో కూడిన భారత బృందం 3 నిమిషాల 18.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్ర స్థానంలో నిలిచింది. 2023లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలైన సుభ ఈసారి కూడా సత్తా చాటింది. చైనా (3 నిమిషాల 20.52 సెకన్లు), శ్రీలంక (3 నిమిషాల, 21.95 సెకన్లు) బృందాలు వరసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచినా... అనర్హత వేటుకు గురయ్యాయి. దీంతో ఆ తర్వాత నిలిచిన కజకిస్తాన్ (3 నిమిషాల 22.70 సెకన్లు), కొరియా (3 నిమిషాల 22.87 సెకన్లు) జట్లకు రజత, కాంస్యాలు దక్కాయి. పోటీల తొలి రోజు పురుషుల 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ గుల్విర్ సింగ్ స్వర్ణం గెలుచుకోగా.. 20 కిలోమీటర్ల రేస్ వాక్లో సెబాస్టియన్ కాంస్యం గెలుచుకున్నాడు. రూపాల్ డబుల్ ధమాకా... మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన రూపాల్ మహిళల 400 మీటర్ల ఈవెంట్లో రజతం కూడా గెలుచుకొని డబుల్ ధమాకా మోగించింది. మహిళల ఈవెంట్లో రూపాల్ 52.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో బరిలోకి దిగిన విద్య రామ్రాజ్ 53.00 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ననాకో మసుమొటో (52.17 సెకన్లు; జపాన్)కు స్వర్ణం, జానిబిబి హుకుమోవా (52.79 సెకన్లు; ఉజ్బెకిస్తాన్)కు కాంస్యం గెలుచుకుంది.2022 ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రెండు పతకాలు (4్ఠ400 మీటర్ల రిలే, 400 మీటర్ల పరుగు) సాధించిన రూపాల్ ఈ టోర్నీలోనూ రెండు పతకాలు నెగ్గడం విశేషం. ఉత్తరప్రదేశ్కు చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చిన రూపాల్... గాయాల బారిన పడకుండా మెరుగైన ఫలితాలు సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది. ‘పతకం సాధించడం ఆనందంగా ఉన్నా... ఫలితాలతో సంతృప్తిగా లేను. మరింత మెరుగైన టైమింగ్ సాధించాలనుకున్నా. దాని కోసం కఠోర సాధన చేస్తున్నా. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్న’ అని 20 ఏళ్ల రూపాల్ పేర్కొంది.యూనుస్కు కాంస్యం పురుషుల 1500 మీటర్ల పరుగులో యూనుస్ 3 నిమిషాల 43.03 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. కజుటో లిజావా (3 నిమిషాల 42.56 సెకన్లు; జపాన్) వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి గెలుచుకోగా... జియాంగ్ లీ (3 నిమిషాల 42.79 సెకన్లు; దక్షిణ కొరియా) కాంస్యం దక్కించుకున్నాడు. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో విశాల్ వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ (45.57 సెకన్లు)తో రేసును ముగించినా... నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో పసిడి గెలిచిన భారత జట్టులో సభ్యుడైన విశాల... వ్యక్తిగత విభాగంలో మెరుగైన ప్రదర్శనే చేసినా పతకం మాత్రం సాధించలేకపోయాడు. పూజకు రజతంమహిళల 1500 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ పూజ 4 నిమిషాల 10.83 సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం నెగ్గింది. భారత్ కే చెందిన లిలి దాస్ (4 నిమిషాల 13.81 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచి పతకానికి దూరమైంది. లి చున్హి (4 నిమిషాల 10.58 సెకనర్లు; చైనా)కి పసిడి, టొమాకా కైమురా (4 నిమిషాల 11.56 సెకన్లు; జపాన్)కు కాంస్య పతకాలు దక్కాయి.» ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. మహిళల హర్డిల్స్లో జ్యోతి 13.18 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ముందంజ వేసింది. » మహిళల లాంగ్జంప్లో శైలీ సింగ్, ఆన్సీ సోజన్ ఫైనల్కు అర్హత సాధించారు. బుధవారం క్వాలిఫయింగ్ ఈవెంట్లో శైలీ సింగ్ 6.17 మీటర్లు దూకగా... ఆన్సీ 6.14 మీటర్ల దూరం లంఘించింది. ప్రవీణ్ మూడో ప్రయత్నంలో...పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకంతో మెరిశాడు. బుధవారం పోటీల్లో ప్రవీణ్ 16.90 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ‘పరిస్థితులు అనుకూలించాయి. తొలి రెండు ప్రయత్నాల్లో టాప్–8లో ఉంటే చాలు అనుకున్నా. మూడో ప్రయత్నంలో శక్తినంతా కూడదీసుకొని లంఘించా. ఆ తర్వాత వర్షం కారణంగా అంతరాయం కలగింది. దీంతో కాస్త ఇబ్బందిపడ్డా. పతకం సాధించడం సంతోషంగా ఉంది’ అని ప్రవీణ్ పేర్కొన్నాడు. తొలి ప్రయత్నంలో 16.60 మీటర్లు దూకిన ప్రవీణ్, రెండో ప్రయత్నంలో 16.67 మీటర్లు లంఘించాడు. తేజస్విన్కు సిల్వర్భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ డెకథ్లాన్లో రజతం గెలుచుకున్నాడు. 10 ఈవెంట్ల (100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్పుట్, హై జంప్, 400 మీటర్ల పరుగు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు) సమాహారమైన ఈ పోటీలో తేజస్విన్ 7618 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఫై జియాంగ్ (7634; చైనా)కు స్వర్ణం, కిసుకే ఒకుడా (7602; జపాన్)కు కాంస్య పతకం లభించింది. -
యువ భారత్ ‘హ్యాట్రిక్’
రొసారియో (అర్జెంటీనా): నాలుగు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన యువ భారత్... ఆతిథ్య అర్జెంటీనాతో జరిగిన హోరాహోరీ పోరులో షూటౌట్లో విజయం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 1–1 గోల్స్తో సమం కాగా... అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్లో భారత్ 2–0తో గెలుపొందింది. మ్యాచ్లో భారత్ తరఫున కనిక (44వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున మిలాగ్రోస్ డెల్ వాలె (10వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. అర్జెంటీనా జట్టు తొలి క్వార్టర్లోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా... మూడో క్వార్టర్లో కనిక గోల్తో భారత్ స్కోర్లు సమం చేయగలిగింది. షూటౌట్లో భారత్ తరఫున లాల్రిన్పుయి, లాల్థన్ట్లుంగి విజయవంతం అయ్యారు. యువ భారత జట్టు కెప్టెన్ నిధి గోల్కీపర్గా అర్జెంటీనా ప్లేయర్ల దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో భారర్లీ టోర్నమెంట్లో వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. తదుపరి మ్యాచ్లో శుక్రవారం చిలీతో భారత్ తలపడుతుంది. -
సాత్విక్–చిరాగ్ జోడీ బోణీ
సింగపూర్: మూడు నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బోణీ కొట్టింది. వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బుధవారం సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–13 చూంగ్ హోన్ జియాన్–మొహమ్మద్ హైకాల్ (మలేసియా) జంటపై గెలుపొందింది. 37 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రపంచ మాజీ నంబర్వన్ ద్వయం వరుస గేమ్ల్లో విజయం సాధించింది. చిరాగ్ గాయం కారణంగా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ నుంచి తప్పుకున్న ఈ జంట... పూర్తి ఫిట్నెస్తో కోర్టులో సత్తా చాటింది. ప్రస్తుతం ప్రపంచ 27వ ర్యాంక్లో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీకి... 41వ ర్యాంకర్ మలేసియా జోడీపై ఇది రెండో విజయం. ఈ సీజన్లో మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్లో సెమీస్కు చేరిన ఈ జంట... ఆ తర్వాత గాయాల కారణంగా ప్రధాన టోర్నీలకు దూరమైంది. ప్రిక్వార్టర్స్లో గాయత్రి జోడీ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ రెండో రౌండ్కు చేరుకుంది. బుధవారం తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జంట 21–14, 19–21, 21–17తో చాంగ్ చింగ్ హూయి–యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలచి ప్రిక్వార్టర్స్కు చేరింది. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్–గద్దె రుత్విక శివాని జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. రోహన్–శివాని జంట 21–16, 21–19 చెన్ జీ యీ–ఫ్రాన్సెస్కా కార్బెట్ (అమెరికా) ద్వయంపై గెలుపొందింది. మహిళల సింగిల్స్లో ఆకర్షి కశ్యప్, ఉన్నతి హూడా పోరాడి ఓడారు. ఆకర్షి కశ్యప్ 21–17, 13–21, 7–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ హాన్ యీ చేతిలో ఉన్నతి 21–13, 9–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జీ యీ చేతిలో పరాజయం పాలయ్యారు. సుమారు గంట పాటు సాగిన ఈ రెండు మ్యాచ్ల్లో తొలి గేమ్లో విజయం సాధించిన అనంతరం భారత షట్లర్లు పట్టు సడలించి టోర్నీ నుంచి నిష్క్రమించారు. అనుపమా ఉపాధ్యాయ 12–21, 16–21తో సంగ్ షో యున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడగా... మహిళల డబుల్స్లో వైష్ణవి–అలీషా జంట పరాజయం పాలైంది. లక్ష్యసేన్కు గాయం పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ లక్ష్యసేన్ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. లిన్ చున్ యూ (చైనీస్ తైపీ)తో తొలి రౌండ్ మ్యాచ్ 21–15, 17–21, 5–13తో ఉన్న సమయంలో గాయం కారణంగా లక్ష్యసేన్ వైదొలిగాడు. ‘వెన్ను నొప్పితో లక్ష్యసేన్ తొలి రౌండ్ నుంచి వైదొలిగాడు. టోర్నీ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ నుంచే లక్ష్య ఈ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. నొప్పి మరింత ఎక్కువ కావడంతో మూడో గేమ్ మధ్యలో ఆట నుంచి తప్పుకున్నాడు. లక్ష్యసేన్ వీలైనంత త్వరగా కోలుకునే విధంగా వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఇండోనేసియా ఓపెన్ వరకు అతడు తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడనే నమ్మకముంది’ అని అతడి తండ్రి, కోచ్ డీకే సేన్ పేర్కొన్నాడు. -
మూడో రౌండ్కు పావొలిని
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ మహిళల విభాగం గత ఏడాది రన్నరప్ జాస్మిన్ పావొలిని ఈ సారి కూడా చక్కటి ప్రదర్శనతో దూసుకుపోతోంది. నాలుగో సీడ్ పావొలిని (ఇటలీ) టోర్నమెంట్ మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో ఆమె 6–3, 6–3 స్కోరుతో అజ్లా టాంజొనొవిక్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. ఒక గంటా 21 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 24 విన్నర్స్ కొట్టిన పావొలిని 3 ఏస్లు బాదింది. పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ కూడా ముందంజ వేశాడు. అయితే అతనికి రెండో రౌండ్లో కాస్త పోటీ ఎదురైంది. ఈ మ్యాచ్లో అల్కరాజ్ (స్పెయిన్) 6–1, 4–6, 6–1, 6–2 స్కోరుతో ఫాబియాన్ మారోజాన్ (హంగేరీ)ని ఓడించాడు. ప్రపంచ 56వ ర్యాంకర్ మారోజాన్ అనూహ్యంగా ఒక సెట్ నెగ్గినా...వెంటనే కోలుకున్న అల్కరాజ్ పైచేయి సాధించాడు. 2 గంటల 9 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. వరల్డ్ నంబర్వన్, టాప్ సీడ్ అరైనా సబలెంకా (బెలారస్) కూడా మూడో రౌండ్కు చేరింది. రెండో రౌండ్ మ్యాచ్లో సబలెంకా 6–3, 6–1తో జిల్ టీక్మన్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది.పురుషుల సింగిల్స్లో ఏడో సీడ్ కాస్పర్ రూడ్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. అన్సీడెడ్ నూనో బోర్జెస్ (పోర్చుగల్) 2–6, 6–4, 6–1, 6–0తో రూడ్ (నార్వే)ని ఓడించాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్లో ఎనిమిదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) 6–4, 6–0, 6–4తో డేనియల్ గలాన్ (కొలంబియా)పై గెలిచి ముందంజ వేశాడు.మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగు సార్లు విజేత ఇగా స్వియాటెక్ మరో టైటిల్ దిశగా ముందడుగు వేసింది. రెండో రౌండ్లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎమా రాడుకాను (బ్రిటన్)ను చిత్తు చేసింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్లలో ఎనిమిదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) 6–2, 6–3తో ఎమీలియా అరాంగో (కొలంబియా)పై, 13వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 7–6 (7/4), 7–5తో అనా బొండర్ (హంగేరీ)పై గెలుపొందారు. రిత్విక్ జోడి పరాజయం... గ్రాండ్స్లామ్ ఈవెంట్లో తొలి విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరికి మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లోనే రిత్విక్ (భారత్) – నికొలస్ బరింటోస్ (కొలంబియా) జోడి ఓటమిపాలైంది. జాకబ్ ఫియర్లీ (బ్రిటన్) – గాబ్రియెల్ డియాలో (కెనడా) ద్వయం 6–0, 6–2తో రిత్విక్–నికొలస్ జంటను చిత్తు చేసింది. 56 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. మరో వైపు ఇద్దరు భారత ఆటగాళ్లు రోహన్ బొపన్న, యూకీ బాంబ్రీ తమ భాగస్వాములతో కలిసి రెండో రౌండ్కు చేరుకున్నారు. బోపన్న – ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జోడి 7–6 (8/6), 5–7, 6–1 స్కోరుతో రాబర్ట్ క్యాష్ (అమెరికా) – జె ట్రేసీ (అమెరికా)ను ఓడించారు. మరో మ్యాచ్లో యూకీ బాంబ్రీ (భారత్) – రాబర్ట్ గాలొవే (అమెరికా) జంట తొలి రౌండ్లో 6–3, 6–7 (8/10), 6–3 స్కోరుతో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) – హెన్డ్రిక్ జెబెన్స్ (జర్మనీ)పై గెలుపొంది ముందంజ వేసింది. -
PBKS Vs RCB: ఫైనల్ వేటలో...
ముల్లాన్పూర్: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న రెండు జట్లు... 18వ సీజన్ ఫైనల్ చేరేందుకు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గురువారం క్వాలిఫయర్–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ ఆరంభం నుంచి ఆడుతున్న ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన ఇరు జట్లు... ఈ సారి నిలకడైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్’కు చేరాయి. లీగ్ దశలో 14 మ్యాచ్లాడిన పంజాబ్ కింగ్స్ 9 విజయాలు, 4 పరాజయాలు, ఒక ఫలితం తేలని మ్యాచ్తో 19 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. 2014 తర్వాత పంజాబ్ జట్టు ‘ప్లే ఆఫ్స్’కు చేరడం ఇదే తొలిసారి కాగా... అప్పుడు కూడా పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన పంజాబ్... తుదిపోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఇక మరోవైపు 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 4 పరాజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్తో 19 పాయింట్లు సాధించిన బెంగళూరు రన్రేట్లో కాస్త వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్లో రెండు మ్యాచ్లు జరగగా... చెరొకటి గెలిచాయి. బెంగళూరులో జరిగిన పోరులో పంజాబ్ గెలవగా... ముల్లాన్పూర్లో జరిగిన పోరులో బెంగళూరు పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్–2 రూపంలో మరో అవకాశం ఉండనుంది. టాప్–3పైనే ఆశలు... ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన కెప్టెన్గా ఘనత సాధించిన శ్రేయస్ అయ్యర్... పంజాబ్కు ప్రధాన బలం కానున్నాడు. మైదానం బయటి నుంచి రికీ పాంటింగ్ సలహాలు... లోపల శ్రేయస్ వ్యూహాలతో ఇప్పటికే పంజాబ్ కింగ్స్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ముందుండి నడిపించే వాడే నాయకుడు అనే విధంగా శ్రేయస్ బ్యాట్తోనూ దుమ్మురేపుతున్నాడు. 14 మ్యాచ్ల్లో 51.40 సగటుతో అతడు 514 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తున్న శ్రేయస్ 171.90 స్ట్రయిక్రేట్తో ఈ పరుగులు చేయడం విశేషం. ఇక యువ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ 499 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 424 పరుగులతో సత్తా చాటారు. ఈ ఇద్దరు అందిస్తున్న శుభారంభాలతోనే పంజాబ్ భారీ స్కోర్లు చేయగలిగింది. ఈ సీజన్లో పంజాబ్ నిలకడైన విజయాలకు ఈ ముగ్గురి ఫామే ప్రధాన కారణం. ఇన్గ్లిస్ మంచి టచ్లో ఉండగా... నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్ అవసరమైన సమయంలో సత్తా చాటుతున్నారు. బౌలింగ్లో అర్ష్ దీప్ సింగ్, కైల్ జేమీసన్, అజు్మతుల్లా కీలకం కానున్నారు. జాతీయ జట్టు అవసరాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ స్వదేశానికి తిరిగి వెళ్లడం జట్టుకు కాస్త ఇబ్బంది కాగా... గాయం కారణంగా గత రెండు మ్యాచ్లకు అందుబాటులో లేని చాహల్ రాకతో స్పిన్ విభాగం పటిష్టమైంది. విరాట్పై పెను భారం లీగ్ ఆరంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్ కోహ్లి... 18వ సీజన్లో అయినా ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా... అనధికారిక కెపె్టన్గా కోహ్లిపైనే జట్టు అధికంగా ఆధారపడుతోంది. అందుకు తగ్గట్లే ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన విరాట్... 13 మ్యాచ్ల్లో 60.20 సగటుతో 602 పరుగులు చేశాడు. 147.91 స్ట్రయిక్రేట్తో పరుగులు రాబట్టిన కోహ్లి... 8 అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తన వికెట్ విలువ అర్థం చేసుకొని ఆడుతున్న కోహ్లి... ఈ సీజన్లో అత్యధిక స్కోరు ముల్లాన్పూర్లోనే పంజాబ్పై నమోదు చేసుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. కోహ్లి, సాల్ట్ జట్టుకు శుభారంభాలు అందిస్తుండగా... మయాంక్ అగర్వాల్, రజత్ పాటీదార్, జితేశ్ శర్మ చక్కటి ఫామ్లో ఉన్నారు. గత మ్యాచ్లో ఆశలే లేని స్థితిలో అద్భుత ప్రదర్శన చేసిన జితేశ్ శర్మ నుంచి ఫ్రాంఛైజీ అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. గాయం కారణంగా టిమ్ డేవిడ్ అందుబాటులో లేకపోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారగా... అతడి స్థానంలో లియామ్ లివింగ్స్టోన్ ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు. ఫిట్నెస్ సాధించిన జోష్ హాజల్వుడ్ తిరిగి రావడం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. తన వైవిధ్యమైన బౌలింగ్తో ఎలాంటి బ్యాటర్నైనా ఇబ్బంది పెట్టగల హాజల్వుడ్ ఈ మ్యాచ్లో కీలకం కానున్నాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్తో కలిసి అతడు పేస్ భారాన్ని మోయనుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, జెమీసన్, హర్ప్రీత్, అర్ష్ దీప్, చాహల్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, జితేశ్, కృనాల్ పాండ్యా, లివింగ్స్టోన్, షెఫర్డ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, హజల్వుడ్, సుయాశ్ శర్మ. పిచ్, వాతావరణం ముల్లాన్పూర్ మైదానంలో ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు జరగగా... అందులో మూడు ఇన్నింగ్స్ల్లో స్కోర్లు 200 దాటాయి. మిగిలిన ఐదు ఇన్నింగ్స్ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బుధవారం పిచ్ ఎలా స్పందిస్తుందనేది కీలకం. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. ఐపీఎల్లో నేడు (క్వాలిఫయర్ –1)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో -
మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రిన్నీ కంతారియా ఈ నెల 18న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉనద్కత్ ఇవాళ (మే 28) సాయంత్రం సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు. ఉనద్కత్, రిన్నీ 2021లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023 డిసెంబర్లో జేడన్ (మగబిడ్డ) జన్మించాడు.👼🏻❤️ pic.twitter.com/Maoc5AbA3h— Jaydev Unadkat (@JUnadkat) May 28, 202533 ఏళ్ల ఉనద్కత్ ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడాడు. ఈ సీజన్లో అతను 7 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో సన్రైజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఉనద్కత్ రంజీల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఆ జట్టుకు అతను కెప్టెన్గానూ వ్యవహరిస్తున్నాడు. అతని సారథ్యంలో సౌరాష్ట్ర 2020లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఇది ఆ జట్టుకు తొలి టైటిల్. 2010లో టీమిండియా అరంగేట్రం చేసిన ఉనద్కత్.. మధ్యలో చాలాకాలం జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. 15 ఏళ్లలో అతను టీమిండియా తరఫున 4 టెస్ట్లు, 8 వన్డేలు, 10 టీ20లు మాత్రమే ఆడాడు. ఇందులో 26 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో ఉనద్కత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లోనూ 2010లోనే కెరీర్ ప్రారంభించిన ఉనద్కత్.. ఇప్పటివరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున 112 మ్యాచ్లు ఆడి 110 వికెట్లు తీశాడు. -
విండీస్తో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఐపీఎల్ స్టార్లకు చోటు
భారతకాలమానం ప్రకారం రేపు (మే 29) సాయంత్రం 5:30 గంటలకు వెస్టిండీస్తో జరుగబోయే తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఐపీఎల్-2025 స్టార్ త్రయం జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్), విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్), జేకబ్ బేతెల్కు (ఆర్సీబీ) చోటు దక్కింది. వీరితో పాటు సీఎస్కే బౌలర్ జేమీ ఓవర్టన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్లో ఇంగ్లిష్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. బట్లర్, బేతెల్, జాక్స్ ఐపీఎల్లో తమ జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉన్నా లీగ్ మ్యాచ్లు పూర్తి కాగానే జాతీయ విధులకు హాజరయ్యారు. ఈ ముగ్గురు లీగ్ దశలో తమతమ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.రేపు విండీస్తో జరుగబోయే మ్యాచ్లో జేమీ స్మిత్, బెన్ డకెట్ ఓపెనింగ్ చేస్తారు. వెటరన్ ఆటగాడు మూడో స్థానంలో, కెప్టెన్ బ్రూక్ నాలుగో స్థానంలో, బట్లర్, బేతెల్, జాక్స్, ఓవర్టన్ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగుతారు. గాయం కారణంగా ఐపీఎల్ ప్రారంభానికి ముందే వైదొలిగిన బ్రైడన్ కార్స్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన జోఫ్రా ఆర్చర్ కూడా తొలుత ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ ఐపీఎల్ సందర్భంగా గాయపడటంతో అతని స్థానంలో సాకిబ్ మహమూద్ను ఎంపిక చేసుకుంది ఇంగ్లిష్ మేనేజ్మెంట్. రేపటి మ్యాచ్కు అతను కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మొత్తంగా చూస్తే, రేపు విండీస్తో తలపడబోయే ఇంగ్లిష్ జట్టు ఐపీఎల్ డూప్ జట్టుగా కనిపిస్తుంది.విండీస్తో తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టు..బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్.ఇదిలా ఉంటే, రేపటి మ్యాచ్ కోసం విండీస్ తుది జట్టును ప్రకటించాల్సి ఉంది. మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్, ఆతర్వాత టీ20 సిరీస్ జరుగుతాయి. మే 29, జూన్ 3 తేదీల్లో వన్డేలు.. 6, 8, 10 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి.పూర్తి జట్లు..వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కీసీ కార్టీ, షాయ్ హోప్(w/c), అమీర్ జాంగూ, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, అల్జారి జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జెడియా బ్లేడ్స్, జ్యువెల్ ఆండ్రూ, జేడెన్ సీల్స్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షిమ్రాన్ హెట్మైర్ఇంగ్లండ్: బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్(c), జోస్ బట్లర్(wk), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్, టామ్ బాంటన్, మాథ్యూ పాట్స్, టామ్ హార్ట్లీ -
IPL 2025: రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ.. ఆ హీరోలు వీరే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కొందరు క్రికెటర్లు అంచనాలకు మించి రాణించారు. వీరిలో కొందరు ఏమాత్రం అంచనాలు లేకుండానే అదరగొట్టారు. ఇలాంటి వారిపై ఫ్రాంచైజీలు చాలా తక్కువ పెట్టుబడి పెట్టి పైసా వసూల్ ప్రదర్శనలు చేయించుకున్నారు. ఇలా రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ చూపిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.ఈ జాబితాలో ముందొచ్చే పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ ఈ 14 ఏళ్ల కుర్ర చిచ్చరపిడుగును కేవలం రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. తీసుకున్న డబ్బుకు వైభవ్ తొలి మ్యాచ్ నుంచే న్యాయం చేస్తూ వచ్చాడు. ఓ విధ్వంసకర సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 206.56 స్ట్రయిక్రేట్తో 252 పరుగులు చేశాడు.పైసా వసూల్ ప్రదర్శన చేసిన మరో చిచ్చరపిడుగు ప్రియాంశ్ ఆర్య. ఇతగాడిని పంజాబ్ వేలంలో రూ. 3.8 కోట్లకు సొంతం చేసుకుంది. తొలుత ప్రియాంశ్పై పంజాబ్ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టిందని అంతా అనుకున్నారు. అయితే అతను ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దాదాపు ప్రతి మ్యాచ్లో ఇరగదీశాడు. పంజాబ్ ఈ సీజన్లో టేబుల్ టాపర్గా నిలవడంలో ప్రియాంశ్ పాత్ర చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో అతను 183.55 స్ట్రయిక్రేట్తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 424 పరుగులు చేశాడు. రేటు తక్కువ, ప్రభావం ఎక్కువ చూపిన మరో ఆటగాడు ర్యాన్ రికెల్టన్. ముంబై ఇండియన్స్ ఇతన్ని కేవలం కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. ఇతను దాదాపు ప్రతి మ్యాచ్లో ముంబైకు అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ఈ సీజన్లో ముంబై ప్లే ఆఫ్స్కు చేరడంలో రికెల్టన్ కీలకపాత్ర పోషించాడు. ఇతను 14 మ్యాచ్ల్లో 150.97 స్ట్రయిక్రేట్తో 388 పరుగులు చేశాడు.ఈ సీజన్లో తక్కువ ధరకే అబ్బురపడే ప్రదర్శనలు చేసిన మరో ఆటగాడు అనికేత్ వర్మ. సన్రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని కేవలం 30 లక్షలకే సొంతం చేసుకుంది. ఇతను ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్ల్లో 166.20 స్ట్రయిక్రేట్తో 236 పరుగులు చేశాడు. లోయల్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగే అనికేత్ అంచనాలకు మించి భారీ హిట్టింగ్ చేసి తన జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్ లాంటి విధ్వంసకర వీరులు ఉన్న జట్టులో అనికేత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.పైన పేర్కొన్న నలుగురే కాకుండా ఈ సీజన్లో రేటు తక్కువ, ప్రభావం చాలా ఎక్కువ చూపిన మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. సీఎస్కే తరఫున ఆయుశ్ మాత్రే (30 లక్షలు), డెవాల్డ్ బ్రెవిస్ (2.2 కోట్లు).. ఆర్సీబీ తరఫున కొద్ది మ్యాచ్లే ఆడిన దేవ్దత్ పడిక్కల్ (2 కోట్లు), ఢిల్లీ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ (50 లక్షలు), బౌలర్లలో ఎల్ఎస్జీకి చెందిన దిగ్వేశ్ రాఠీ (30 లక్షలు), ముంబై బౌలర్లు అశ్వనీ కుమార్ (30 లక్షలు), కర్ణ్ శర్మ (50 లక్షలు) అంచనాలకు మించి రాణించి ఈ సీజన్లో మంచి పేరు తెచ్చుకున్నారు. -
LSG VS RCB: రిషబ్ పంత్పై మండిపడ్డ అశ్విన్.. సొంత బౌలర్నే ఫూల్ చేశాడు..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 27) జరిగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ మన్కడింగ్కు (నాన్ స్ట్రయికర్ ఎండ్లోని బ్యాటర్ బంతి వేయకముందే క్రీజ్ను దాటిన సమయంలో బౌలర్ వికెట్లను గిరాటు వేయడం) పాల్పడ్డాడు. ఈ విషయమై రాఠీ అప్పీల్ చేసినప్పటికీ.. లక్నో కెప్టెన్ పంత్ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. రీప్లే పరిశీలించిన అనంతరం థర్డ్ అంపైర్ దీన్ని నాటౌట్గా ప్రకటించాడు.టెక్నికల్గా (రాఠీ ఫ్రంట్ ఫుట్ ల్యాండ్ అయ్యే సమయానికి నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న జితేశ్ శర్మ క్రీజ్లోనే ఉన్నాడు) ఇది నాటౌటే అయినప్పటికీ.. రూల్స్కు విరుద్దం అయితే కాదు. గతంలో చాలా సందర్భాల్లో బౌలర్లు మన్కడింగ్ చేసి బ్యాటర్లను ఔట్ చేశారు. తాజాగా అదే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ కెప్టెన్ బౌలర్ను సమర్థించకపోవడం చర్చనీయాంశంగా మారింది.అ విషయమై క్రికెట్ సర్కిల్స్లోభిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు రాఠీ చర్యను సమర్దిస్తుంటే.. మరికొందరు పంత్ అప్పీల్ను వెనక్కు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.రాఠీ చర్యను సమర్దించిన వారిలో సీఎస్కే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. యాష్ ఓ పక్క రాఠీ చర్యను సమర్దిస్తూనే, అప్పీల్ను విత్డ్రా చేసుకున్న పంత్ను తప్పుబట్టాడు. పంత్ అప్పీల్ను విత్డ్రా చేసుకోవడం వల్ల రాఠీ కోట్లాది మంది అభిమానుల ముందు ఫూల్ అయ్యాడని అభిప్రాయపడ్డాడు. పంత్ రాఠీని జీవితంలో ఇంకోసారి మన్కడింగ్కు పాల్పడకుండా చేశాడని మండిపడ్డాడు.మన్కడింగ్ విషయంలో బౌలర్లంటే ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించాడు. ఓ రకంగా బౌలర్కు ఇది అవమానమని అన్నాడు. పంత్ తీసుకున్న నిర్ణయం వల్ల రాఠీ భయపడి ఉంటాడని తెలిపాడు. బౌలర్ చర్యను వెనకేసుకురావడం కెప్టెన్ బాధ్యత అని గుర్తు చేశాడు. ఔటైనా, నాటౌటైనా మన్నడింగ్ అనేది ఆటలో భాగమని అన్నాడు. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా బౌలర్ ఇలాంటి ప్రయత్నం చేయడం తప్పేది కాదని అభిప్రాయపడ్డాడు.కాగా, ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో (ఆఖరి బంతికి) ఇది జరిగింది. రాఠీ మన్కడింగ్కు పాల్పడే సమయానికి ఆర్సీబీ 19 బంతుల్లో 29 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అప్పటకే జితేశ్ శర్మ జోరు మీదున్నాడు. ఒకవేళ జితేశ్ మన్కడింగ్ ద్వారా ఔటయ్యుంటే ఆర్సీబీ కష్టాల్లో పడేది. మ్యాచ్ను కూడా కోల్పోవాల్సి వచ్చేది. ఇలాంటి సందర్భంలో పంత్ బౌలర్ అప్పీల్ను ఉపసంహరించుకుని ఆర్సీబీకి ఫేవర్ చేశాడు. క్రీడా స్పూర్తి అని పెద్దపెద్ద మాటలు అనుకోవచ్చు కానీ, మ్యాచ్ను కాపాడుకునే ప్రయత్నంలో బౌలర్ చేసింది కరెక్టే అని చెప్పాలి. రాఠీ అప్పీల్ను పంత్ చిన్నచూపు చూసి తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా అప్పీల్ విత్డ్రా చేసుకున్న తర్వాత జితేశ్ను కౌగించుకుని సొంత బౌలర్ను అవమానించాడు. మన్కడింగ్ తర్వాత మరింత రెచ్చిపోయిన జితేశ్ కొద్ది బంతుల్లోనే మ్యాచ్ను లక్నో చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. -
IPL 2025: ప్లే ఆఫ్స్లో ఆర్సీబీ చరిత్ర ఇదీ..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా క్వాలిఫయర్-1లో పోటీ పడే అవకాశాన్ని (ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది) కూడా దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరడం ఇది పదోసారి. ఇన్ని ప్రయత్నాల్లో ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మూడు సందర్భాల్లో (2009, 2011, 2016) ఫైనల్ వరకు చేరినా రిక్తహస్తాలతో వెనుదిరిగింది.ఐపీఎల్ చరిత్రలో 15 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ.. ఐదు మ్యాచ్ల్లో గెలిచి, పదింట ఓడింది. ప్లే ఆఫ్స్లో ఆర్సీబీని అత్యంత దురదృష్టమైన జట్టు అని అంటారు. లీగ్ దశలో చెలరేగి ఆడే ఈ జట్టు నాకౌట్ మ్యాచ్లు వచ్చే సరికి ఢీలా పడిపోతుంది. గతమంతా ఇలాగే సాగింది. కానీ ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తుంది.ఆర్సీబీ ఈ సీజన్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఇందుకు నిన్న (మే 27) లక్నోతో జరిగిన మ్యాచే నిదర్శనం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లి వికెట్ సహా నాలుగు వికెట్లు కోల్పోయినా ఏ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా అబ్బురపడే విజయం సాధించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు.ఈ గెలుపుతో ఆర్సీబీ క్వాలిఫయర్-1లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. మే 29న జరిగే ఈ పోటీలో ఆర్సీబీ టేబుల్ టాపర్ పంజాబ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఓడినా ఆర్సీబీకి మరో అవకాశం ఉంటుంది. జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పోటీ పడే ఛాన్స్ ఉంటుంది. గుజరాత్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో తలపడుతుంది.ప్లే ఆఫ్స్లో ఆర్సీబీ ప్రస్తానం..2009- ఫైనల్లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి2010- సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమి2011- ఫైనల్లో సీఎస్కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి2015- క్వాలిఫయర్-2లో సీఎస్కే చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి2016- ఫైనల్లో సన్రైజర్స్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి2020- ఎలిమినేటర్లో సన్రైజర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి2021- ఎలిమినేటర్లో కేకేఆర్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి2022- క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి2024- ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి2025- క్వాలిఫయర్-1లో పంజాబ్ ప్రత్యర్థి -
RCB VS PBKS Qualifier-1: అలా జరిగితే గెలవకపోయినా పంజాబ్ ఫైనల్కు చేరుతుంది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లీగ్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, పంజాబ్ తలపడతాయి. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. లీగ్ దశలో సాధించిన విజయాలు, నెట్ రన్రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారయ్యాయి. పంజాబ్, ఆర్సీబీ తలో 14 మ్యాచ్ల్లో చెరో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పాయింట్లు సమంగా (19) ఉన్నా, ఆర్సీబీతో పోలిస్తే నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండటంతో పంజాబ్కు తొలి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కింది.గుజరాత్ 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ కూడా పంజాబ్, ఆర్సీబీ మాదిరి 14 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించినా.. పంజాబ్, ఆర్సీబీ ఆడాల్సిన ఓ మ్యాచ్ (వేర్వేరుగా) రద్దైంది. దీంతో పంజాబ్, ఆర్సీబీలకు అదనంగా తలో పాయింట్ లభించింది.ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఎలా..?పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు (పంజాబ్, ఆర్సీబీ) మొదటి క్వాలిఫయర్లో తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో ఓడిన జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫయర్-2లో (జూన్ 1) పోటీ పడే అవకాశం దక్కుతుంది. క్వాలిఫయర్-2లో ఇంకో బెర్త్ ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా తెలుస్తుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడతాయి. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పోటీ పడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్లో ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు.. క్వాలిఫయర్-1లో గెలిచే జట్టుతో ఫైనల్లో (జూన్ 3) తలపడుతుంది.ఆర్సీబీ, పంజాబ్ క్వాలిఫయర్ మ్యాచ్ రద్దైతే..?పంజాబ్, ఆర్సీబీ మధ్య మే 29న జరగాల్సిన క్వాలిఫయర్-1 మ్యాచ్ ఏ కారణంగా అయినా రద్దైతే పంజాబ్ ఫైనల్కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది కాబట్టి, ఆ జట్టుకు ఈ అవకాశం దక్కుతుంది. షెడ్యూల్ ప్రకారం క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే లేదు. కాబట్టి తప్పనిసరిగా మ్యాచ్ జరిగి గెలిస్తేనే ఆర్సీబీ ఫైనల్కు చేరుతుంది. పంజాబ్కు అలా కాదు. ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైనా ఆ జట్టు ఫైనల్కు చేరుతుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఏ కారణంగా కూడా పంజాబ్, ఆర్సీబీ క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదు. -
LSG VS RCB: అబ్బురపరిచే ఇన్నింగ్స్.. ధోని రికార్డు బద్దలు కొట్టిన జితేశ్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 27) జరిగిన ఉత్కంఠ సమరంలో లక్నో సూపర్ జెయింట్స్పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీని తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ ఒంటిచేత్తో గెలిపించాడు. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జితేశ్ హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.ఈ ఇన్నింగ్స్తో జితేశ్ ధోని పేరిట ఏడేళ్లు కొనసాగిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. విజయవంతమైన ఛేదనల్లో 6 అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2018 సీజన్లో ధోని ఆర్సీబీపై 34 బంతుల్లో అజేయమైన 70 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో సీఎస్కే ఆర్సీబీపై విజయం సాధించింది.విజయవంతమైన ఛేదనల్లో 6 అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్లు..85*(33) - జితేష్ శర్మ (RCB) vs LSG, లక్నో, 2025 70* (34) - MS ధోని (CSK) vs RCB, బెంగళూరు, 2018 70*(31) - ఆండ్రీ రస్సెల్ (KKR) vs PBKS, ముంబై WS, 2022 70(47) - కీరన్ పొలార్డ్ (MI) vs RCB, బెంగళూరు, 2017 68(30) - డ్వేన్ బ్రావో (CSK) vs MI, ముంబై WS, 2018లక్నో, ఆర్సీబీ మ్యాచ్ పూర్తి వివరాలు..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే (4 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) సహకరించాడు.అంతకుముందు విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు.ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ సెకెండ్ టాపర్గా నిలిచి క్వాలిఫయర్-1 బెర్త్ ఖరారు చేసుకుంది. మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. -
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్కు ఊహించని షాక్
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ గాయం బారిన పడ్డాడు. జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో అట్కిన్సన్ తొడ కండరాలు పట్టేశాయి. అతడు గాయం నుంచి కోలుకోవడానికి రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.ఈ క్రమంలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్కు అట్కిన్సన్ దూరమయ్యాడు. అతడు విండీస్తో టీ20లలో కూడా ఆడేది అనుమానమే. కాగా జూన్ 20న ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సమయానికైనా 27 ఏళ్ల గస్ అట్కిన్సన్ ఫిట్నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.కాగా విండీస్తో వన్డేలకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఇప్పటికే స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయింది. గాయం కారణంగా ఆర్చర్ విండీస్ టూర్కు దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లూక్ వుడ్తో ఇంగ్లండ్ సెలక్టర్లు భర్తీ చేశారు. ఇక ఇంగ్లండ్-విండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ వన్డే జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, విల్ జాక్స్, జో రూట్, బెన్ డకెట్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జేకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్లే, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, జేమీ స్మిత్. ఇంగ్లండ్ టీ20 జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్. -
భారత-ఎ జట్టు నుంచి తప్పుకున్న శుబ్మన్ గిల్..!
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ హైవోల్టేజ్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రధాన సిరీస్కు ముందు భారత-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది.తొలి టెస్టు మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటర్బరీ వేదికగా, రెండో టెస్టు నార్తాంప్టన్లో జూన్ 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. అయితే ఈ అనాధికారిక టెస్టు సిరీస్కు ముందు టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా- ఎ జట్టు నుంచి తప్పుకోవాలని గిల్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్కు ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో గిల్ సభ్యునిగా ఉన్నాడు. ఇంగ్లండ్ కండీషన్స్కు అలవాటు పడేందుకు గిల్కు ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు ఉపయోగపడతాయని సెలక్టర్లు భావించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కారణంగా తొలి వార్మాప్ మ్యాచ్కు గిల్ దూరంగా ఉంటాడని, రెండవ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇండియా-ఎ జట్టులో చేరతారని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపాడు. కానీ ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న గిల్కు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే భారత-ఎ జట్టు ఇంగ్లండ్కు పయనమైంది. ఈ జట్టు కెప్టెన్గా దేశవాళీ దిగ్గజం అభిమాన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. జూన్ 13 నుంచి బెకెన్హామ్ వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఇంట్రా స్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ పాల్గోనే అవకాశముంది.ఇంగ్లండ్ పర్యటనకు భారత- ఎ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబేచదవండి: ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్ -
ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో సోమవారం ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్తో ఆర్సీబీ టాప్-2 ప్లేస్ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. లక్నో యువ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠి మరోసారి తన చర్యతో వార్తల్లోకెక్కాడు.అసలేమి జరిగిందంటే?228 పరుగుల భారీ లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి(54) ఔటయ్యాక స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ క్రీజులోకి వచ్చాడు. జితేష్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బదడం మొదలుపెట్టాడు. జితేష్ క్రీజులోకి వచ్చినప్పటికే ఆర్సీబీ కావల్సిన రన్ రేట్ ఓవర్కు 13పైగా ఉంది. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌలర్లను ఎంతమంది మార్చిన అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు.ఈ క్రమంలో అతడి దూకుడును అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్ దిగ్వేష్ను తిరిగి పంత్ ఎటాక్లోకి తెచ్చాడు. దీంతో 17 ఓవర్ వేసిన దిగ్వేష్ ఓవరాక్షన్ చేశాడు. జితేష్ను తన బౌలింగ్తో ఆపలేకపోయిన దిగ్వేష్.. అతడిని మన్కడింగ్ చేసి పెవిలియన్కు పంపాలని ప్రయత్నించాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని వేసే క్రమంలో నాన్ స్ట్రైక్లో ఉన్న జితేష్ క్రీజు దాటడం గమనించిన దిగ్వేష్ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్ను పడగొట్టాడు. వెంటనే రనౌట్కు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. పలు మార్లు రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. అప్పటికే దిగ్వేశ్ బౌలింగ్ యాక్షన్ పూర్తి చేయడంతో నిబంధనల ప్రకారం నాటౌట్గా ప్రకటించాడు.పంత్ క్రీడా స్పూర్తి.. అయితే ఇదే సమయంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. థర్డ్ అంపైర్ తన నిర్ణయం ప్రకటించికముందే పంత్ తమ అప్పీల్ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో జితేత్.. పంత్కు వద్దకు వెళ్లి అలిగంనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కోహ్లి ఫైర్..కాగా దిగ్వేష్ మన్కడింగ్కు ప్రయత్నించడంతో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్ప విరాట్ కోహ్లి ఊగిపోయాడు. తన చేతిలో ఉన్న బాటిల్ను కిందకు విసిరి కొట్టాడు. అస్సలు నీవు ఏమి చేస్తున్నావు అన్నట్లు కోహ్లి సీరియస్ రియాక్షన్ ఇచ్చాడు. కాగా దిగ్వేష్ ఇప్పటికే తన మితిమీరిన ప్రవర్తనతో ఓ మ్యాచ్ నిషేదాన్ని కూడా ఎదుర్కొన్నాడు.థర్డ్ అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడంటే?మెరిల్బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్ చేయాలనుకుంటే యాక్షన్ను పూర్తి చేయకముందే ఔట్ చేయాలి. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలి. కానీ దిగ్వేష్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్ను పూర్తి చేసి స్టంప్స్ను పడగొట్టాడు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. Watch out for Virat’s reaction after Digvesh attempted mankid on Jitesh Sharma. #IPL2025 #IPL #JiteshSharma pic.twitter.com/sAKf6Ck7TV— Akhilesh Dhar (@akhileshdhar1) May 27, 2025 -
కోహ్లి సరికొత్త చరిత్ర.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ విరాట్ కోహ్లి పరుగులు వరద పారిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన కీలక మ్యాచ్లో కోహ్లి అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.228 పరుగుల భారీ లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను కోహ్లి ఉతికారేశాడు. కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కోహ్లి 10 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన కింగ్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్లో అత్యధిక ఆర్ధ సెంచరీలు సాధించిన ప్లేయర్గా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు 63 హాఫ్ సెంచరీలు ఐపీఎల్లో సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ ఐపీఎల్లో 62 ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. తాజా హాఫ్ సెంచరీతో వార్నర్ను కోహ్లి అధిగమించాడు. ఈ ఫీట్ను కోహ్లి 257వ ఐపీఎల్ ఇన్నింగ్స్లో అందుకోగా.. వార్నర్ కేవలం 184 ఇన్నింగ్స్లలోనే సాధించాడు.👉అదేవిధంగా టీ20 క్రికెట్లో ఓ జట్టు తరుపున 9వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. లక్నో మ్యాచ్లో 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్తో పాటు ఛాంపియన్స్ లీగ్టీ20తో కలిపి కోహ్లి ఆర్సీబీ తరుపున 9వేల పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రెండో స్దానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ముంబై ఇండియన్స్ తరుపన 6060 పరుగులు చేశాడు.టీ20 క్రికెట్లో ఓ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..విరాట్ కోహ్లి (ఆర్సీబీ) – 9030 పరుగులురోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 6060 పరుగులుజేమ్స్ విన్స్ (హాంప్షైర్) – 5934 పరుగులుసురేశ్ రైనా (సీఎస్కే) – 5529 పరుగులుఎంఎస్ ధోని (సీఎస్కే) – 5314 పరుగులు👉ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు 600 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు. కోహ్లి ఇప్పటివరకు ఐదు సీజన్లలో 600కు పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడి 602 పరుగులు చేశాడు.చదవండి: IPL 2025: రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ -
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్-2025 సీజన్ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. అయితే ఓటమి బాధలో ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్కు మరో బిగ్ షాక్ తగిలింది.ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ పంత్కు రూ. 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ ఎడ్వైజరీ కమిటీ విధించింది. అలాగే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానాగా చెల్లించాలని సదరు కమిటీ ఆదేశించింది.ఈ ఏడాది సీజన్లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్ను నమోదు చేయడం ఇది మూడో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జరిమానా విధించారు. "లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్కు జరిమానా విధించాం. ఏకానా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మూడో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పంత్ కు రూ. 30 లక్షలు ఫైన్ వేశాము ’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. సీజన్ ఆరంభం నుంచి విఫలమైన పంత్.. తమ ఆఖరి మ్యాచ్లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. రిషబ్ 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.చదవండి: IND Vs ENG: బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్కు మళ్లీ పిలుపు -
IPL 2025: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. ఎవరితో ఎవరు ఆడతారంటే?
ఐపీఎల్-2025లో లీగ్ దశ మ్యాచ్లు సోమవారం(మే 27)తో ముగిశాయి. ఈ మెగా టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ క్వాలిఫియర్-1కు ఆర్హత సాధించింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్లో ఏ జట్టు ఎవరితో తలపడుతుందో ఓ లుక్కేద్దాం. ఈ ఏడాది సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్దానంలో పంజాబ్ కింగ్స్(18) నిలవగా.. ఆర్సీబీ(18) రెండో స్ధానంలో నిలిచింది. పాయింట్ల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నప్పటికి బెంగళూరు కంటే పంజాబ్ రన్రేట్ మెరుగ్గా ఉండడంతో టాప్ ప్లేస్ను సుస్థిరం చేసుకుంది.క్వాలిఫయర్-1లో పంజాబ్, ఆర్సీబీ ఢీ..టాప్-2లో నిలిచిన పంజాబ్, ఆర్సీబీ మే 29న చంఢీగడ్ వేదికగా క్వాలిఫయర్-1లో తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు ఆర్హత సాధిస్తోంది. అయితే ఇక్కడ ఓడిన జట్టుకు కూడా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. ఓటమి చెందిన జట్టు జూన్ 1న క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ లేదా గుజరాత్ టైటాన్స్ ఆడాల్సి ఉంటుంది. అక్కడ గెలిస్తే ఫైనల్కు చేరుకోవచ్చు. ఇక పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, మంబై ఇండియన్స్ మే 30న ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఇక్కడ గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్తో తలపడాల్సి ఉంటుంది. ఇక చివరగా ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.IPL 2025 ప్లేఆఫ్స్ షెడ్యూల్:క్వాలిఫయర్ 1: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మే 29, చండీగఢ్ఎలిమినేటర్: గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ - మే 30, చండీగఢ్క్వాలిఫయర్ 2: క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు vs ఎలిమినేటర్ విజేత - జూన్ 1, అహ్మదాబాద్ఫైనల్: క్వాలిఫయర్ 1 విజేత vs క్వాలిఫయర్ 2 విజేత - జూన్ 3, అహ్మదాబాద్ -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసాధరణ ప్రదర్శన కనబరిచింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ క్వాలిఫయర్-1కు ఆర్హత సాధించింది. లక్నో నిర్ధేశించిన 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది.ఆర్సీబీ బ్యాటర్లలో స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ(33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 85 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. విరాట్ కోహ్లి(30 బంతుల్లో 10 ఫోర్లతో 54), మయాంక్ అగర్వాల్(23 బంతుల్లో 41 నాటౌట్), సాల్ట్(30) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆకాష్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్లు) సీజన్లో తొలి సెంచరీతో చెలరేగగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు.ఆర్సీబీ సరికొత్త చరిత్ర..ఇక ఈ మ్యాచ్లో అద్బుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఒక ఐపీఎల్ సీజన్లో ప్రత్యర్ధి జట్లతో వాటి హోం గ్రౌండ్స్లో జరిగిన అన్నీ మ్యాచ్లలోనూ గెలుపొందిన తొలి టీమ్గా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ను ఓడించిన ఆర్సీబీ.. ఆ తర్వాత సీఎస్కే, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ను వారి సొంత మైదానాల్లోనే చిత్తు చేసింది.చదవండి: IND vs ENG: బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్కు మళ్లీ పిలుపు -
బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్కు మళ్లీ పిలుపు
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్కు చెందిన టి.దిలీప్ మళ్లీ ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దిలీప్ను మరో సారి ఫీల్డింగ్ కోచ్గా నియమించింది. 2021 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకు దిలీప్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించగా... ఆ్రస్టేలియాలో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో సహాయక కోచ్ అభిషేక్ నాయర్తో పాటు దిలీప్ను తొలగించింది.ఫీల్డింగ్ కోచ్గా విదేశీయుడిని నియమించాలని బోర్డు ప్రయత్నించనా... అది వీలు కాకపోవడంతో జట్టు సభ్యులతో మంచి అనుబంధం ఉన్న దిలీప్ను తిరిగి ఎంపిక చేసింది. "దిలీప్ చాలా మంచి కోచ్. నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పనిచేశాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు అతడిని తిరిగి నియమించాం"అని బోర్డు అధికారి వెల్లడించారు. ఇక మరోవైపు భారత టెస్టు కొత్త కెపె్టన్ శుబ్మన్ గిల్, సుదర్శన్ జూన్ 6 నుంచి ఇంగ్లండ్ లయన్స్తో జరిగే వార్మప్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: జితేశ్ జితాదియా -
సినెర్ ముందంజ
పారిస్: ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో అలవోక విజయాలతో శుభారంభం చేశారు. అయితే మాజీ ప్రపంచ నంబర్వన్, 11వ సీడ్ రష్యన్ స్టార్ డానిల్ మెద్వెదెవ్కు తొలి రౌండ్లోనే ఊహించని షాక్ ఎదురైంది. మహిళల సింగిల్స్లో అమెరికన్ స్టార్లు కొకొ గాఫ్, మాడిసన్ కీస్ వరుస సెట్లతో ప్రత్యర్థుల్ని చిత్తు చేసి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మిగతా సీడెడ్ క్రీడాకారిణుల్లో జెస్సికా పెగూలా, మిర అండ్రీవా ముందంజ వేశారు. గత ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ కొకొ గాఫ్ (అమెరికా) 6–2, 6–2తో గడెక్కి (ఆస్ట్రేలియా)పై గెలుపొందగా... అజరెంకా (బెలారస్) 6–0, 6–0తో విక్మయెర్ (బెల్జియం)పై నెగ్గింది. మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 6–2, 6–4తో అన్క టొడొని (రొమేనియా)పై, ఆరో సీడ్ మిర అండ్రీవా (రష్యా) 6–4, 6–3తో క్రిస్టీనా బుక్సా (స్పెయిన్)పై విజయం సాధించారు. 12వ సీడ్ రిబాకినా 6–1, 4–6, 6–4తో రియెరా (అర్జెంటీనా)పై గెలుపొందగా, ఏడో సీడ్ కీస్ (అమెరికా) 6–2, 6–1తో సవిల్లే (ఆస్ట్రేలియా)ను ఓడించింది. సోఫియా కెనిన్ (అమెరికా) 6–3, 6–1తో గ్రాచెవా (ఫ్రాన్స్)పై గెలిచింది. జొకో అలవోకగా... మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్లో జొకోవిచ్ 6–3, 6–3, 6–3తో అమెరికన్ ప్లేయర్ మెక్డొనాల్డ్పై సునాయాస విజయంతో ముందంజ వేశాడు. తాజా ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ ఇటలీ స్టార్ సినెర్ 6–4, 6–3, 7–5తో రిండెర్క్నెచ్ (ఫ్రాన్స్) గెలుపొందాడు. మూడో సెట్లో స్థానిక ప్లేయర్ నుంచి గట్టీపోటీ ఎదురైనప్పటికీ మరో సెట్కు అవకాశమివ్వకుండా మూడు సెట్లలోనే ప్రపంచ నంబర్వన్ ఆటగాడు ముగించాడు. ఈ సీజన్ మెద్వెదెవ్కు నిరాశనే మిగిలిస్తోంది. ఆ్రస్టేలియన్ ఓపెన్లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఈ 11వ సీడ్ రష్యన్ స్టార్ ఇక్కడ తొలిరౌండ్లోనే 5–7, 3–6, 6–4, 6–1, 5–7తో కామెరూన్ నోరీ (బ్రిటన్) చేతిలో కంగుతిన్నాడు. బల్గేరియాకు చెందిన 16వ సీడ్ దిమిత్రోవ్ 6–2, 6–3 2–6తో అమెరికన్ క్వాలిఫయర్ కిన్పై రెండు సెట్లతో ఆధిక్యంలో ఉండగా రిటైర్డ్హర్ట్గా కోర్టు నుంచి నిష్క్రమించాడు.ఏడో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 6–3, 6–4, 6–2తో రమొస్ వినొలస్ (స్పెయిన్)పై, గత ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, ఈ సీజన్ ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–3, 6–4తో లర్నెర్ టియెన్ (అమెరికా)పై గెలుపొందారు. -
గుల్వీర్కు గోల్డ్
గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ పసిడి పతకంతో సత్తా చాటాడు. 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ అగ్ర స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 20 కిలోమీటర్ల రేస్ వాక్లో భారత్కు చెందిన సెర్విన్ సెబాస్టియన్ కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో పోటీల తొలి రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన 26 ఏళ్ల గుల్వీర్... మంగళవారం 10,000 మీటర్ల రేసును 28 నిమిషాల 38.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకున్నాడు. గుల్వీర్కు ఇదే తొలి ఆసియా చాంపియన్షిప్ స్వర్ణం. మెబుకి సుజుకి (28 నిమిషాల 43.84 సెకన్లు; జపాన్), అల్బర్ట్ రోప్ (28 నిమిషాల 46.82 సెకన్లు; బహ్రెయిన్) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. భారత్కే చెందిన సావన్ బర్వాల్ 28 నిమిషాల 50.53 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి రోజు పోటీలు ముగిసేసరికి భారత్ ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 5 స్వర్ణాలు, 2 రజతాలతో చైనా నంబర్వన్గా ఉండగా... 3 రజతాలు, 2 కాంస్యాలతో జపాన్ మూడో స్థానంలో ఉంది. చివరి 200 మీటర్లలో వేగం పెంచి.. ఉత్తరప్రదేశ్లోని నిరుపేద రైతు కుటుంబానికి చెందిన గుల్వీర్ సింగ్ ఇప్పటికే జాతీయ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో అతడు 10,000 మీటర్ల రేసును 27 నిమిషాల 00.22 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. మంగళవారం రేసులో చివరికి వచ్చేసరికి మూడో స్థానంలో కనిపించిన గుల్వీర్... మరో 200 మీటర్లలో రేసు ముగుస్తుందనగా వేగం పెంచాడు. ఒక్కొక్క సహచరుడిని వెనక్కి నెడుతూ చిరుతలా దూసుకొచ్చాడు. ఆఖరి వరకు అదే కొనసాగిస్తూ ఫినిషింగ్ లైన్ దాటాడు. ‘విజేతగా నిలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగా. టైమింగ్పై కాకుండా అందరికంటే ముందుండాలని అనుకున్నా. స్వర్ణం గెలవడం ఆనందంగా ఉంది. దీంతో నా ర్యాంకింగ్ మరింత మెరుగవనుంది. ఈ ఏడాది సెపె్టంబర్లో టోక్యో వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు అర్హత సాధించడానికి అది తోడ్పడనుంది’అని గుల్వీర్ పేర్కొన్నాడు. భారత్ నుంచి 1975లో హరిచంద్, 2017 లక్ష్మణన్ పసిడి పతకాలు గెలవగా... ఇప్పుడు గుల్వీర్ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 5000 మీటర్ల పరుగులోనూ జాతీయ రికార్డు కలిగిన గుల్వీర్ ఇక్కడ కూడా ఆ విభాగంలో పోటీపడనున్నాడు. 2023 ఆసియా చాంపియన్షిప్ 5000 మీటర్ల పరుగులో గుల్వీర్ కాంస్యం నెగ్గగా... ఇప్పుడు పతకం రంగు మార్చాలని కృతనిశ్చయంతో ఉన్నాడు.డెకాథ్లాన్లో తేజస్విన్ దూకుడు... భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ డెకథ్లాన్ (100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్పుట్, హై జంప్, 400 మీటర్ల పరుగు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు)లో సత్తాచాటుతున్నాడు. పోటీల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ఐదు ఈవెంట్లలో శంకర్ దుమ్మురేపాడు. దీంతో సగం పోటీలు ముగిసేసరికి తేజస్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. పురుషుల 400 మీటర్ల పరుగులో విశాల్ ఫైనల్కు చేరగా... మహిళల 400 మీటర్ల పరుగులో రూపాల్ చౌధరీ, విదయ రామ్రాజ్ తుది రేసుకు అర్హత సాధించారు. పురుషుల హై జంప్లో భారత అథ్లెట్ అనిల్ కుషారె 2.10 మీటర్ల ఎత్తు దూకి ఫైనల్కు అర్హత సాధించాడు. పురుషుల 1500 మీటర్ల రేసులో యూనుస్ షా ఫైనల్కు చేరాడు. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి నాలుగో స్థానంలో నిలిచి పతకానికి దూరమైంది. సెబాస్టియన్కు కాంస్యం పురుషుల 20 కిలోమీటర్ల రేస్వాక్లో సెబాస్టియన్ 1 గంట 21 నిమిషాల 13.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచాడు. ‘పతకం నెగ్గడం సంతోషంగా ఉంది. విజేతల మధ్య పెద్ద అంతరం లేదు. ఆసియా చాంపియన్షిప్లో ఇదే నా తొలి పతకం’అని సెబాస్టియన్ అన్నాడు. వాంగ్ జవో (1 గంట 20 నిమిషాల 36.90 సెకన్లు; చైనా), కెంటా యొషికవా (1 గంట 20 నిమిషాల 44.90 సెకన్లు; జపాన్) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత వాకర్ అమిత్ 1 గంట 22 నిమిషాల 14.30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంలో నిలిచాడు. -
వరల్డ్ చాంపియన్షిప్ పతకమే లక్ష్యం
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం... పారిస్ ఒలింపిక్స్... 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్... భారత్కు చెందిన 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ సమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా పతకం సాధించగల షూటర్ల జాబితాలో ఆమె కూడా ఉంది. సంవత్సరం ముందు ఇదే ఈవెంట్లో సిఫ్ట్ ప్రపంచ రికార్డును నమోదు చేయడం కూడా అందుకు ఒక కారణం. అయితే అసలు సమయంలో రైఫిల్ గురి చెదిరింది. సగటు భారత అభిమాని కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఒక్కసారిగా పేలవ ప్రదర్శన నమోదైంది.32 మంది పోటీ పడితే సిఫ్ట్ కౌర్ 31వ స్థానంతో ముగించింది! ఈ షాక్కు ఒక్కసారిగా సిఫ్ట్ ఆట నుంచి తప్పనిసరిగా విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇకపై భవిష్యత్తు గురించి సందేహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు నాటి పరాభవం నుంచి కోలుకున్న సిఫ్ట్ ఇప్పుడు మళ్లీ చిరునవ్వులు చిందించింది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో ఆమె స్వర్ణంతో మెరిసి ఒలింపిక్ బాధను కాస్త మర్చిపోయేలా చేసుకుంది. నిరాశ నుంచి కోలుకొని... పారిస్లో ఘోర ప్రదర్శన తర్వాత సిఫ్ట్ కౌర్ మానసికంగా చాలా కుంగిపోయింది. ఆ ఈవెంట్ ముగిసిన సమయం నుంచి ఆమెను సాధారణ స్థితికి తెచ్చేందుకు తల్లిదండ్రులు, సోదరుడు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్ వేదిక నుంచి ఆమెను విహారయాత్ర కోసం వారు మరో నగరానికి తీసుకెళ్లి సరదాగా గడిపి వచ్చారు. స్వదేశానికి తిరిగొచ్చాక తండ్రి మరో రూపంలో ఆమెను బిజీగా ఉంచే ప్రయత్నం చేశారు. మళ్లీ మళ్లీ వైఫల్యం గురించి, స్కోర్ల గురించి ఆలోచించకుండా సరదాగా గన్స్తో ఆడుతున్నట్లుగానే ఆడమంటూ రైఫిల్ రేంజ్కే తీసుకెళ్లే ఓదార్చే ప్రయత్నం చేశాడు. మన దేశంలో అభిమానులు ఒలింపిక్స్ క్రీడలకు అన్నింటికంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని... అందరి దృష్టీ వాటి ఫలితాలపైనే ఉండటం వల్ల అసలు సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సిఫ్ట్ చెప్పుకుంది. కోలుకునేందుకు కొంత సమయం పట్టినా... తాను వెనక్కి వెళ్లి ఫలితాన్ని మార్చలేను కాబట్టి ఇక ఆలోచించడం అనవసరం అని ఆమె భావించింది. జాతీయ స్థాయి పోటీలతో... దాదాపు ఆరు నెలల తర్వాత సిఫ్ట్ మళ్లీ షూటింగ్లో పోటీ పడేందుకు సిద్ధమైంది. అందుకు ముందుగా పెద్ద ఆలోచనలు పెట్టుకోకుండా జాతీయ క్రీడల్లో పాల్గొంది. ఆమె స్థాయికి ఈ క్రీడలు చిన్నవే అయినా... ఆరంభానికి ఇదే సరైందని సిఫ్ట్ భావించింది. సహజంగానే స్వర్ణం నెగ్గడంతో కాస్త ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ తర్వాత వరుసగా రెండు సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొని అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ చేసిన 595 పాయింట్ల స్కోరు పారిస్లో సాధించి ఉంటే ఆమె ఫైనల్స్కు చేరేది! తాజా ప్రదర్శనతో అర్జెంటీనాలో జరిగే వరల్డ్ కప్ షూటింగ్కు సిఫ్ట్ ఎంపికైంది. సవాల్ను అధిగమించి... బ్యూనస్ఎయిర్స్లో కొత్తగా నిర్మించిన రేంజ్లో వరల్డ్ కప్ స్థాయి పోటీలు జరగడం ఇదే తొలిసారి. వాతావరణం, గాలి దిశ... ఇలా అన్నీ కొత్తగానే ఉండటంతో సిఫ్ట్ కాస్త ఆందోళన చెందింది. 16.1 డిగ్రీల ఉష్ణోగ్రతలో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పోటీలు మొదలైనా ఇంకా చలిగానే ఉంది. తమ సన్నాహాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. అయితే పట్టుదలగా ఆడి క్వాలిఫికేషన్ను ఆమె అధిగమించింది. ఆపై ఫైనల్ పోరులో మళ్లీ తడబాటు. ‘నీలింగ్’ పొజిషన్ ముగిసేసరికి ఆమె చివరి స్థానంలో ఉంది. ‘ప్రొన్’ పొజిషన్ కాస్త మెరుగ్గా ఆడినా ఆ తర్వాతా అదే ఆఖరి స్థానం! ఆ తర్వాత తనకిష్టమైన ‘స్టాండింగ్’ పొజిషన్కు ఆమె సిద్ధమైంది. అసాధారణ ప్రదర్శన కనబరిస్తే గానీ ముందుకెళ్లే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో సిఫ్ట్ తన ఆటకు పదును పెట్టింది. అద్భుతంగా లక్ష్యంపైకి బుల్లెట్లు సంధిస్తూ దూసుకుపోయింది. తుది ఫలితం చూస్తే 458.6 పాయింట్ల స్కోరుతో సిఫ్ట్కు స్వర్ణ పతకం. ‘నీలింగ్’ ముగిసిన తర్వాత సిఫ్ట్కంటే ఏకంగా 7.2 పాయింట్లు ముందంజలో ఉన్న జర్మనీ షూటర్ అనితను వెనక్కి నెట్టిన సిఫ్ట్ అగ్రస్థానం సాధించడం విశేషం. ఇప్పుడు సిఫ్ట్ తర్వాతి లక్ష్యం వరల్డ్ షూటింగ్ చాంపియన్షిప్. నవంబర్లో జరిగే ఈ పోటీల్లో చెలరేగి భారత్ తరఫున తొలి స్వర్ణం సాధించిన మహిళగా నిలవాలని సిఫ్ట్ కౌర్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే ఇప్పుడు తీవ్ర సాధనను కొనసాగిస్తోంది. -
సింధు, ప్రణయ్ శుభారంభం
సింగపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21–14, 21–9 తేడాతో వెన్ యూ జాంగ్ (కెనడా)పై విజయం సాధించింది. 31 నిమిషాల్లో ముగిసిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన తెలుగమ్మాయి వరస గేమ్ల్లో గెలుపొందింది. బుధవారం జరగనున్న ప్రిక్వార్టర్స్లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ చెన్ యూ ఫీ (చైనా)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్లో ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 21–16, 21–14తో రాస్మస్ గెమ్కే (డెన్మార్క్)పై గెలుపొందాడు. 72 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్లో ఓడిన అనంతరం తిరిగి పుంజుకున్న ప్రణయ్... ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరుస్తూ మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. తదుపరి రౌండ్లో ఫ్రాన్స్ షట్లర్ క్రిస్టోవ్ పొపోవ్తో ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. కాగా ఈ టోర్నీలో మిగిలిన భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్, అన్మోల్ పరాజయం పాలవగా... పురుషుల సింగిల్స్లో ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జ్కు నిరాశ తప్పలేదు. మాళవిక, ప్రియాన్షు తొలి గేమ్ గెలిచినప్పటికీ అదే జోరు కొనసాగించడంలో విఫలమై పరాజయాల పాలయ్యారు. మాళవిక 21–14, 18–21, 11–21తో ఎనిమిదో సీడ్ సుపనిడా కటెథాంగ్ (థాయ్లాండ్) చేతిలో... ప్రియాన్షు 21–14, 10–21, 14–21తో ఏడో సీడ్ నరోకా (జపాన్) చేతిలో ఓడాడు. అన్మోల్ 11–21, 22–24తో చెన్ చేతిలో... కిరణ్ జార్జ్ 19–21, 17–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో సంతోష్ రామ్రాజ్ 14–21, 8–21తో కిమ్ గా ఇన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, అషిత సూర్య–అమృత ప్రథమేశ్ జోడీలు నిరాశ పరచగా... మహిళల డబుల్స్లో కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింగ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. -
జితేశ్ జితాదియా
లక్నో: సొంతగడ్డపై విజయగర్వంతో సీజన్ను ముగించే భారీ స్కోరునే లక్నో చేసింది... ఛేదనలో సాల్ట్, లివింగ్స్టోన్, కోహ్లిలాంటి విలువైన వికెట్లను తీసింది. 52 బంతుల్లో 105 పరుగుల సమీకరణం బెంగళూరుకు క్లిష్టంగా అనిపించింది... అయితే కెప్టెన్ జితేశ్... మయాంక్తో కలిసి చేసిన బ్యాటింగ్ మ్యాజిక్ మ్యాచ్నే మార్చేసింది. ఇంకో 8 బంతులు మిగిలుండగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై జయభేరి మోగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్లు) సీజన్లో తొలి సెంచరీతో కదం తొక్కగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు), కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు) చెలరేగారు. చితగ్గొట్టిన పంత్ మార్ష్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన బ్రిట్జ్కీ (14) మూడో ఓవర్లో నిష్క్రమించాడు. తర్వాత రిషభ్ పంత్ రావడంతో లక్నో ప్రతీ ఓవర్లోనూ పండగ చేసుకుంది. యశ్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదడం ద్వారా పంత్ ప్రతాపం మొదలైంది. పవర్ప్లే తర్వాత ఓ వైపు మార్ష్, ఇంకోవైపు రిషభ్ ధనాధన్ షోతో ఓవర్కు సగటున పది పరుగుల రన్రేట్ నమోదైంది. దీంతో 9.5 ఓవర్లో జెయింట్స్ 100 స్కోరును చేరుకుంది.ముందుగా పంత్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో సిక్సర్తో మార్ష్ 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆ ఓవర్లో రిషభ్ కూడా ఫోర్, సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన మార్ష్ ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 152 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యానికి తెరపడింది. అతని మరుసటి ఓవర్లో బౌండరీతో పంత్ 54 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం, జట్టు 200మార్క్ దాటడం జరిగిపోయాయి. మెరుపు భాగస్వామ్యం... సాల్ట్, కోహ్లిలు పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరుబోర్డును పరుగు పెట్టించారు. 4 ఓవర్లలోనే స్కోరు 50కి చేరింది. కానీ పవర్ప్లే ఆఖరి ఓవర్లోనే సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) వికెట్ను కోల్పోయింది. తర్వాత కోహ్లికి జతయిన రజత్ పటిదార్ (14) ఫోర్, సిక్సర్ బాదాడు. కానీ రూర్కే ఒకే ఓవర్లో అతన్ని, లివింగ్స్టోన్ (0)ను అవుట్ చేసి బెంగళూరును కష్టాల్లో పడేశాడు. కోహ్లి తన మార్క్ షాట్లతో చెలరేగిపోవడంతో రన్రేట్ లక్ష్యాన్ని కరిగించేంత వేగంగా దూసుకెళ్లింది. 9.1 ఓవర్లోనే ఆర్సీబీ స్కోరు వందను దాటేసింది. కోహ్లి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ధాటిని కొనసాగించే ప్రయత్నంలో కొట్టిన షాట్ మిడాఫ్లో బదోని చేతికి చిక్కడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడు జట్టు స్కోరు 11.2 ఓవర్లలో 123/4. కాగా గెలుపు సమీకరణం 52 బంతుల్లో 105 చాలా కష్టమైంది.మయాంక్, కెప్టెన్ జితేశ్ శర్మల మెరుపులకు తోడు... లక్నో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్, సులువైన రనౌట్పట్ల రూర్కే అశ్రద్ధ వెరసి... పరుగులు, బౌండరీలు అలవోకగా రావడంతో చూస్తుండగానే లక్ష్యం దిగొచ్చింది. అబేధ్యమైన ఐదో వికెట్కు మయాంక్, జితేశ్లు కేవలం 44 బంతుల్లోనే 107 పరుగులు జోడించడం విశేషం! స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 67; బ్రిట్జ్కీ (బి) తుషార 14; పంత్ నాటౌట్ 118; పూరన్ (సి) యశ్ దయాళ్ (బి) షెఫర్డ్ 13; సమద్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–25, 2–177, 3–226. బౌలింగ్: తుషార 4–0–26–1, కృనాల్ పాండ్యా 2–0–14–0, యశ్ దయాళ్ 3–0–44–0, భువనేశ్వర్ 4–0–46–1, సుయశ్ 3–0–39–0, షెఫర్డ్ 4–0–51–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) దిగ్వేశ్ (బి) ఆకాశ్ 30; కోహ్లి (సి) బదోని (బి) అవేశ్ఖాన్ 54; పటిదార్ (సి) సమద్ (బి) రూర్కే 14; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రూర్కే 0; మయాంక్ నాటౌట్ 41; జితేశ్ నాటౌట్ 85; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–61, 2–90, 3–90, 4–123. బౌలింగ్: ఆకాశ్ 4–0–40–1, విల్ రూర్కే 4–0–74–2, దిగ్వేశ్ రాఠి 4–0–36–0, షాబాజ్ 3–0–39–0, అవేశ్ఖాన్ 3–0–32–1, బదోని 0.4–0–9–0. ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’క్వాలిఫయర్–1 (మే 29)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచిఎలిమినేటర్ (మే 30)గుజరాత్ X ముంబైవేదిక: ముల్లాన్పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs LSG: వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన జితేశ్.. ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ విజయవంతమైంది. ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) సహకరించాడు. అంతకుముందు విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు. లక్నో బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 2, ఆకాశ్ సింగ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ సెకెండ్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్స్కు చేరింది.మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. -
IPL 2025, LSG VS RCB: విధ్వంసకర శతకం.. పల్టీ కొట్టిన పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కారణంగా ముప్పేట దాడిని ఎదుర్కొన్న పంత్ ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో ఆది నుంచే దూకుడుగా ఆడిన పంత్.. 54 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్లో పంత్కు ఇది రెండో సెంచరీ. సెంచరీ పూర్తి చేసిన అనంతరం పంత్ ఆనందంతో పల్టీ కొట్టాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, వీడియోలు సోషల్మీడియాలో వైరవలవుతున్నాయి.Coldest IPL hundred celebration 🥶pic.twitter.com/WDHHIvLVv6— CricTracker (@Cricketracker) May 27, 2025ఎట్టకేలకు పంత్ తనపై పెట్టిన పెట్టుబడికి (రూ. 27 కోట్లు) న్యాయం చేశాడని నెటిజన్లు అంటున్నారు. ఈ సీజన్లో పంత్ చాలా దారుణమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్కు ముందు 12 ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ పేలవ ప్రదర్శన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ చాలా మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాక ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్లో పంత్ సెంచరీతో సత్తా చాటాడు.ఇటీవలికాలంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. ఐపీఎల్లో పంత్ చివరిగా 2018 సీజన్లో సెంచరీ చేశాడు. నాడు సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నేటికి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్గా చలామణి అవుతుంది. తాజా శతకంతో పంత్ తనలో చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు.ఆర్సీబీతో మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం గుజరాత్, ఆర్సీబీ పోటీలో ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. -
LSG VS RCB: అరుదైన మైలురాయిని తాకిన మిచెల్ మార్ష్
లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసకర ఆటగాడు మిచెల్ మార్ష్ టీ20ల్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. పొట్టి ఫార్మాట్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 115వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టీ20 కెరీర్లో 201 మ్యాచ్లు ఆడిన మార్ష్ 136 స్ట్రయిక్రేట్తో 2 సెంచరీలు, 31 అర్ద సెంచరీల సాయంతో 5000 పరుగుల మార్కును దాటాడు.ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్లో మార్ష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మార్ష్ 12 ఓవర్ల అనంతరం 45 పరుగులతో అజేయంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచి అదిరిపోయే ఫామ్లో ఉన్న మార్ష్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 13 మ్యాచ్ల్లో సెంచరీ, 5 అర్ద సెంచరీల సాయంతో 607 పరుగులు చేసి పరుగుల వేటను కొనసాగిస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కష్టాలు కొని తెచ్చుకుంది. లక్నో ఆదిలోనే బ్రీట్జ్కీ (14) వికెట్ కోల్పోయినప్పటికీ.. రిషబ్ పంత్ (59), మిచెల్ మార్ష్ (47) విధ్వంసం సృష్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 131/1గా ఉంది.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నా ఎందుకో ఈ జట్టు విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం పోటీలో గుజరాత్, ఆర్సీబీ ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. -
సెంచరీలు మీద సెంచరీలు చేసినా..
టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, టైమ్ కూడా కలసిరావాలంటారు పెద్దవాళ్లు. అవును నిజమే.. ఎంత ప్రతిభ ఉన్నా కూడా, లక్ లేకపోతే వెనుబడిపోయే చాన్స్ ఉంది. టాలెంట్ను నిరూపించే వేదిక దొరక్కపోతే తెర మరుగు కావడం ఖాయం. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఆ బాధ వర్ణణాతీతం. పోటీ ఎక్కువగా ఉండే క్రీడల్లో దేశం తరపున ఆడే అవకాశం దక్కినా బరిలోకి దిగే చాన్స్ రాక చాలా మంది వెలుగులోకి రాలేకపోయారు.క్రికెట్ కెరీర్గా ఎంచుకున్న ప్రతి ప్లేయర్ దేశం తరపున ఆడాలని కలలుగంటారు. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా కష్టపడుతుంటారు. బ్లూ క్యాప్, జెర్సీతో బరిలోకి దిగాలని వర్ధమాన భారత క్రికెటర్లు అహరహం శ్రమిస్తుంటారు. కానీ జాతీయ జట్టులో ఆడే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. చాన్స్ దక్కించున్న వారిలో నిలదొక్కునే వారు అతి కొద్ది మంది మాత్రమే. ఇక జట్టులో చోటు దక్కినా మైదానంలో బరిలోకి దిగే అవకాశం రాని దురదృష్టవంతులూ ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఒకరు.విషయం అర్థమైందిదేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ప్రియాంక్ పంచల్ టీమిండియా (Team India) తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్మెన్లో ఒకరైన 35 ఏళ్ల ఈ స్టార్ గుజరాతీ బ్యాటర్.. మూడు ఫార్మాట్లలో ఏ ఒక్కదానిలోనూ భారత జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. దీంతో 17 ఏళ్ల క్రికెట్ కెరీర్కు తాజాగా వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం ప్రకటించాడు. 'టీమిండియాలో ఎప్పటికీ నాకు చోటు దక్కదనే విషయం అర్థమైంది' అంటూ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.చాన్స్ రాలేదుడొమెస్టిక్ సూపర్స్టార్గా పేరొందిన ప్రియాంక్.. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించి సత్తా చాటాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించిన బ్యాటర్లలో ఒకరైన ప్రియాంక్ పేరు పలుమార్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందు వచ్చింది. 2021-22లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి దగ్గరగా వచ్చాడు కానీ బ్లూ క్యాప్ దక్కించులేకపోయాడు. టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మ స్థానంలో రిజర్వ్ ఓపెనర్గా ఎంపికయ్యాడు కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. 2022లోనూ శ్రీలంక టూర్కు సెలెక్ట్ అయినా అరంగ్రేటం చేసే చాన్స్ రాలేదు.టైమ్ ముఖ్యంతనకు జాతీయ జట్టులో ఆడేందుకు రాసిపెట్టి లేదని భావించిన ప్రియాంక్ ఇప్పటి వరకు దేశీయ క్రికెట్లోనే కొనసాగుతూ తానేంటో నిరూపించుకున్నాడు. సెంచరీలు మీద సెంచరీలు చేసినా, టైమ్ కలిసి రాకపోతే తనలాగే అవుతుందని సరిపెట్టుకున్నాడు. 'క్రికెట్లో నిలకడగా ఆడాలి. ఆటగాడిగా మంచి ప్రదర్శన ఇవ్వాలి. సరైన సమయంలో ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అంతర్జాతీయ క్రికెట్లో సమయం చాలా విలువైనది. నిలకడగా 100 తర్వాత 100 పరుగులు చేస్తూనే ఉన్నప్పటికీ.. మీ జట్టు గెలవకపోతే, అది సరైన సమయం కాదు. కానీ 30 పరుగులు చేసినప్పటికీ.. జట్టు గెలిస్తే మీ సహకారం చాలా విలువైనది. అంతర్జాతీయ క్రికెట్కు అది అవసరం. దాని నుండి నేను చాలా నేర్చుకున్నాన'ని ప్రియాంక్ పేర్కొన్నాడు.బాధగానే ఉంది.. కానీటీమిండియా తరపున ఆడలేకపోవడం బాధగానే ఉందని ప్రియాంక్ చెప్పాడు. అయితే క్రికెట్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకునే అవకాశం రావడం మామూలు విషయం కాదన్నాడు. రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా ఆలోచన చేస్తున్నానని, ఇప్పుడే సరైన సమయం అని భావించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. చదవండి: ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్లు వీరేనా?'రిటైర్ అవ్వాలనే ఆలోచన నా మనసులో చాలా కాలంగా ఉంది. ఎందుకంటే, నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. టీమిండియాకు ఆడాలన్న ఆకాంక్ష నన్ను నడిపించేంది. క్రమశిక్షణ, అంకిత భావంతో ఆడి జాతీయ జట్టులో చోటు కోసం శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అవకాశాలు చేజారాక నేను ఆచరణాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టాను. టీమిండియాలో నాకు ఇక చోటు దక్కదని గ్రహించాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాన'ని ప్రియాంక్ వివరించాడు. -
ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకిన పాక్ ప్లేయర్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ బౌలర్ సదియా ఇక్బాల్ అగ్రస్థానానికి ఎగబాకింది. సదియా.. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ను కిందకు దించి టాప్ ప్లేస్కు చేరుకుంది. గత వారం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉండిన సదియా ఓ స్థానం మెరుగుపర్చుకుంది.తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో ఎక్లెస్టోన్ పాల్గొనకపోవడంతో సదియా అగ్రపీఠాన్ని దక్కించుకుంది. సదియా ఖాతాలో 746 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఎక్లెస్టోన్ ఖాతాలో 734 పాయింట్లు ఉన్నాయి. ఎక్లెస్టోన్ మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయింది.భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (737 పాయింట్లు), ఆసీస్ బౌలర్ అన్నాబెల్ సదర్ల్యాండ్ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు ఎగబాకారు. భారత పేసర్ రేణుక సింగ్ ఠాకూర్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది.ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్ ఏకంగా 13 స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. మరో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్, పాకిస్తాన్ బౌలర్ సష్రా సంధు, ఆస్ట్రేలియా బౌలర్ జార్జియా వేర్హమ్ ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్ సారా గ్లెన్ నాలుగు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 16, శ్రేయాంక పాటిల్ 21, పూజా వస్త్రాకర్ 33 స్థానాల్లో ఉన్నారు.బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బెత్ మూనీ టాప్ ప్లేస్ను నిలబెట్టుకుంది. విండీస్ స్టార్ బ్యాటర్ హేలీ మాథ్యూస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగు నుండి రెండో స్థానానికి చేరింది. ఆసీస్ బ్యాటర్ తహిళ మెక్గ్రాత్, టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన తలో స్థానం కోల్పోయి మూడు, నాలుగు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, దీప్తి శర్మ టాప్-3లో కొనసాగుతున్నారు. -
IPL 2025: లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
లక్నోపై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ (227/3) చేసింది. అనంతరం ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు.14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 156/4జితేశ్ శర్మ 22, మయాంక్ అగర్వాల్ 32నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ11.2వ ఓవర్- 123 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో ఆయుశ్ బదోనికి క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (54) ఔటయ్యాడు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీవరుస బంతుల్లో ఆర్సీబీ వికెట్లు వికెట్లు కోల్పోయింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్లో పాటిదార్, లివింగ్స్టోన్ వరుసగా ఔటయ్యారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ7.5వ ఓవర్- 90 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్లో అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి రజత్ పాటిదార్ (14) ఔటయ్యాడు. విరాట్కు (42) జతగా లివింగ్స్టోన్ క్రీజ్లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ5.4వ ఓవర్- 61 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆకాశ్ సింగ్ బౌలింగ్లో దిగ్వేశ్ రాఠీకి క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (30) ఔటయ్యాడు. కోహ్లికి (29) జతగా పాటిదార్ క్రీజ్లోకి వచ్చాడు.ఒకే ఓవర్లో 4 ఫోర్లు బాదిన కోహ్లి228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ను ప్రారంభించింది. విలియమ్ ఓరూర్కీ వేసిన రెండో ఓవర్లో కోహ్లి ఏకంగా నాలుగు ఫోర్లు బాదాడు. ఇదే ఓవర్లో సాల్ట్ కూడా ఓ ఫోర్ కొట్టాడు. 3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 39/0గా ఉంది. సాల్ట్ 17, కోహ్లి 21 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. శతక్కొటిన పంత్.. లక్నో భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.రిషబ్ పంత్ సెంచరీలక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. బెంగళూరుతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 50 బంతుల్లో 100 పరుగులు చేశాడు.రెండో వికెట్ కోల్పోయిన లక్నో15.3వ ఓవర్- 177 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (67) ఔటయ్యాడు. రిషబ్ పంత్ 83 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 14 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 150/1మిచెల్ మార్ష్ 54, రిషబ్ పంత్ 7012 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 127/1మిచెల్ మార్ష్ 45, రిషబ్ పంత్ 58ధాటిగా ఆడుతున్న పంత్ఈ మ్యాచ్లో వన్డౌన్గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ ధాటిగా ఆడుతున్నాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. మరో ఎండ్లో మిచెల్ మార్ష్ ఓ మోస్తరుగా ఆడుతున్నాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. 9 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 84/1గా ఉంది.6 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 55/1మిచెల్ మార్ష్ 15, రిషబ్ పంత్ 20తొలి వికెట్ కోల్పోయిన లక్నో2.4వ ఓవర్- 25 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. నువాన్ తుషార బౌలింగ్లో మాథ్యూ బ్రీట్జ్కీ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీఐపీఎల్ 2025లో ఇవాళ (మే 27) చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. లక్నో వేదికగా ఎల్ఎస్జీ, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(w/c), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషారఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్.లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, విలియం ఓర్కేఇంపాక్ట్ సబ్స్ - ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి -
ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో హెచ్సీఏ పాత్ర.. విచారణలో సంచలన విషయాలు
ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) పాత్రపై విజిలెన్స్ విచారణ పూర్తయ్యింది. ప్రాథమిక నివేదికను విజిలెన్స్ ప్రభుత్వానికి పంపింది. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. టికెట్ల విషయంలో హెచ్సీఏ అధ్యక్షుడు సన్రైజర్స్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పది శాతం టికెట్లు ఉచితంగా ఇస్తున్నా.. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇవ్వాలని హెచ్సీఏ కార్యదర్శి ఒత్తిడి చేసినట్లు రుజువైంది. విజిలెన్స్ తమ నివేదికలో హెచ్సీఏపై చర్యలకు సిఫార్సు చేసింది.కాగా, అదనపు టికెట్ల కోసం హెచ్సీఏ ఒత్తిడి తెస్తుందని సన్రైజర్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇచ్చే ప్రసక్తే లేదని సన్రైజర్స్ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశాడు. వ్యక్తిగతంగా తనకు మరో పది శాతం టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని సన్రైజర్స్ మేనేజ్మెంట్ తేల్చి చెప్పింది. సన్రైజర్స్ యాజమాన్యం టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ల సందర్భంగా జగన్మోహన్ రావు ఇబ్బందులకు గురి చేశాడు. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేయించాడు. -
IPL 2025: రోహిత్ చాలా అనాసక్తిగా ఆడుతున్నాడు.. భారత మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సీజన్లో అతను 13 మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 329 పరుగులు చేశాడు. హిట్మ్యాన్ ఈ సీజన్లో ఓ మోస్తరుగా రాణిస్తున్నా విమర్శకులు అతన్ని టార్గెట్ చేస్తున్నారు.రోహిత్ ప్రదర్శనలు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు పెద్దగా ఉపయోగపడలేదని అంటున్నారు. హిట్మ్యాన్ చాలా నిర్లక్ష్యంగా, అనాసక్తిగా ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. తాజాగా హిట్మ్యాన్ వ్యతిరేకులతో భారత మాజీ బౌలర్ అతుల్ వాసన్ కూడా గళం కలిపాడు.ఈ సీజన్లో రోహిత్ ప్రదర్శనలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడా జీవితంలో అన్ని సాధించాక రోహిత్ చాలా అనాసక్తిగా కనిపిస్తున్నాడంటూ కామెంట్ చేశాడు. రోహిత్లో ప్రేరణ కొరవడిందని అన్నాడు. ప్రేరణ కోసం అతను లక్ష్యాలను సెట్ చేసుకోవాలని సూచించాడు.వాసన్ వ్యాఖ్యలు ఘాటుగా ఉన్నప్పటికీ అతని అభిప్రాయంతో ఏకీభవించాల్సిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయినప్పటి నుంచి రోహిత్లో ఏదో తెలినీ తేడా కనిపిస్తుంది. మునుపటిలా అతను జట్టు కోసం ఆడటం లేదు. చాలా నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు. ఈ సీజన్లోనూ అదే జరిగుతుంది. ఒకటి, రెండు మ్యాచ్లు మినహా రోహిత్ శ్రద్దగా ఆడింది లేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతూ జట్టు జయాపజయాల పట్ల పట్టీపట్టనట్లున్నాడు. టీమ్లో అతని ఇన్వాల్మెంట్ ఎక్కడా కనిపించడం లేదు. ఎవరి కోసమో అడుతున్నా అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో అతని బాండింగ్ మొదటి నుంచే మిస్ అయినట్లు కనిపిస్తుంది. రోహిత్ అభిమానులు పైకి ఏమీ చెప్పలేకపోతున్నా అసలు విషయం వారికి బాగా తెలుసు. తమ ఆరాధ్య ఆటగాడు వంద శాతం కమిట్మెంట్తో ఆడటం లేదని లోలోపల వారూ మదనపడుతున్నారు.సూర్యకుమార్ యాదవ్ మెరుపులు, రికెల్టన్ ప్రతిభ, బౌలర్ల కష్టంతో ముంబై ఇండియన్స్ అనూహ్య రీతిలో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆ జట్టు నెగ్గుకొస్తుందన్న ఆశలు లేవు. అదే రోహిత్ వంద శాతం కమిట్మెంట్తో ఆడితే ఫలితం అనుకూలంగా రావచ్చు. -
ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్లు వీరే..?
ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్త్లు (పంజాబ్, గుజరాత్, ఆర్సీబీ, ముంబై) ఇదివరకే ఖరారయ్యాయి. క్వాలిఫయర్-1 (పంజాబ్), ఎలిమినేటర్ (ముంబై) మ్యాచ్ల్లో కూడా ఒక్కో బెర్త్ ఖరారైంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన జట్లు (సీఎస్కే, రాజస్థాన్, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, లక్నో, ఢిల్లీ) తదుపరి సీజన్లో మరింత బలంగా తిరిగి రావాలని ఆశిస్తున్నాయి. కొన్ని జట్లు తదుపరి సీజన్లో ఎవరిని వదిలించుకోవాలో, ఎవరిని అట్టిపెట్టుకోవాలో అన్నదానిపై ఇప్పటికే ఓ అంచనా కలిగి ఉన్నాయి.ఆటగాళ్ల రిటెన్షన్ గురించి మాట్లాడుకుంటే వెటరన్ ఆటగాళ్ల ప్రస్తావన వస్తుంది. కొందరు వెటరన్లు లీగ్ ప్రారంభం నుంచి ఆడుతూ ఇంకా కొనసాగుతున్నారు. వీరిలో కొందరకి ఈ సీజన్ ఆఖరిదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారిపై ఓ లుక్కేద్దాం.ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే ఆటగాళ్ల ప్రస్తావన వస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ధోని. 44 ఏళ్ల ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమైనా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ధోనికి ఈ సీజన్ ఆఖరిదని చాలామంది అంటున్నారు. ధోని ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ.. రిటైర్ కానని కూడా ఖరాఖండిగా చెప్పలేదు. ధోని ఈ సీజన్లో ఆటగాడిగా, కెప్టెన్గా దారుణంగా విఫలమయ్యాడు. అతడిపై వయోభారం స్పష్టంగా కనిపిస్తుంది.ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. 39 ఏళ్ల అశ్విన్ను ఈ సీజన్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే యాష్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. కుర్ర విధ్వంసకర బ్యాటర్ల ముందు అతని మాయాజాలం పని చేయలేదు. జట్టు నుంచి స్వతహాగా వైదొలగాలని సొంత జట్టు అభిమానులే కోరుకున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు గుడ్బై చెప్పడం గ్యారెంటీ అని తెలుస్తుంది.ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో స్టార్ క్రికెటర్ ఫాప్ డుప్లెసిస్. ఫాఫ్ను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ మోస్తరు ధరకే సొంతం చేసుకుంది. వయసు మీద పడటంతో ఫాఫ్ మునుపటిలా వేగంగా ఆడలేకపోతున్నాడు. అందుకే అతన్ని ఆర్సీబీ వదిలించుకుంది. 40 ఏళ్ల ఫాఫ్ కుర్ర బ్యాటర్లతో పోటీపడి గతంలోలా భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. వాస్తవానికి ఆర్సీబీ వదిలించుకున్నప్పుడే అతని పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఢిల్లీ ఏదో ప్రణాళికతో అతన్ని దక్కించుకుంది. తీరా అది కూడా ఫ్లాప్ అయ్యింది.ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ. త్వరలో 38లో అడుగుపెట్టనున్న మొయిన్ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు గుడ్బై చెబుతాడని టాక్ నడుస్తుంది. ఈ సీజన్లో మొయిన్ను కేకేఆర్ నామమాత్రపు ధరకు సొంతం చేసుకుంది. మొయిన్ ఫ్రాంచైజీ నమ్మకానికి వంద శాతం న్యాయం చేయలేకపోయినా, పర్వాలేదనిపించాడు. మొయిన్ విదేశీ లీగ్లపై దృష్టి పెట్టేందుకు తనకు పెద్దగా డిమాండ్ లేని ఐపీఎల్ను వదిలేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.పైన పేర్కొన్న ఆటగాళ్లే కాకుండా విజయ్ శంకర్ (సీఎస్కే), మోహిత్ శర్మ (ఢిల్లీ), అజింక్య రహానే (కేకేఆర్) కూడా ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు గుడ్బై చెప్పవచ్చని టాక్ నడుస్తుంది. -
వెస్టిండీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు వెస్టిండీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో భాగంగా నిన్న (మే 26) జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా.. విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.రాణించిన హీథర్ నైట్స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ హీథర్ నైట్ అజేయ అర్ద సెంచరీతో (66) రాణించడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో నాట్ సీవర్ బ్రంట్ 37, ఆమీ జోన్స్ 22,అలైస్ క్యాప్సీ 4, సోఫియా డంక్లీ 3, ఎమ్ ఆర్లాట్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3, జైదా జేమ్స్, క్లాక్స్ట్న్ తలో వికెట్ పడగొట్టారు.హేలీ పోరాటం వృధా145 పరుగుల ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. ఆ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ (71) ఒంటరిపోరాటం చేసినా గెలవలేకపోయింది. విండీస్ ఇన్నింగ్స్లో మాథ్యూస్తో పాటు గ్రిమ్మండ్ (15), గజ్నబి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు లారెన్ బెల్, ఆర్లాట్, చార్లోట్ డీన్, లిన్సే స్మిత్ తలో రెండు వికెట్లు పడగొట్టి విండీస్ను కట్టడి చేశారు.30 నుంచి ప్రారంభంకాగా, మూడు టీ20లు, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ నిన్నటితో ముగియగా.. మే 30 (డెర్బీ), జూన్ 4 (లీసెస్టర్), 7 తేదీల్లో (టాంటన్) మూడు వన్డేలు జరుగనున్నాయి. -
PKL 2025: యు ముంబా హెడ్ కోచ్గా అనిల్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో యు ముంబా జట్టుకు అనిల్ చప్రానా హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. పీకేఎల్ 11వ సీజన్లో యు ముంబా జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న గులామ్రజా మజందరాని (ఇరాన్) సీజన్ ముగిశాక తన బాధ్యతల నుంచి వైదొలిగాడు.గత సీజన్లో అనిల్ చప్రానా యు ముంబా జట్టుకు అసిస్టెంట్ కోచ్గా పని చేశాడు. గులాంరజా తప్పుకున్న తర్వాత 12వ సీజన్ కోసం భారత మాజీ ప్లేయర్ రాకేశ్ కుమార్ను యు ముంబా కొత్త హెడ్ కోచ్గా నియమించుకుంది. అయితే ఆదివారం అనూహ్య పరిణామంచోటు చేసుకుంది. రాకేశ్ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పిస్తున్నామని ముంబా సీఈఓ సుహైల్ చందోక్ తెలిపారు. రాకేశ్తో సంప్రదింపులు చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చందోక్ వివరించారు. 2022లో యు ముంబా జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న అనిల్ చప్రానాకు మరోసారి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నామని, అసిస్టెంట్ కోచ్గా పారి్థబన్ను ఎంపిక చేశామని సోమవారం సదరు ఫ్రాంచైజీ పేర్కొంది. ఈనెల 31న, జూన్ 1న పీకేఎల్ 12వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కార్యక్రమం జరగనుంది. 2014లో పీకేఎల్ ఆరంభ సీజన్ నుంచి పోటీపడుతున్న యు ముంబా జట్టు రెండుసార్లు రన్నరప్గా, ఒకసారి చాంపియన్గా (2015) నిలిచింది. గత సీజన్లో యు ముంబా టాప్–6లో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్లో పట్నా పైరేట్స్ చేతిలో ఓడింది. -
సూర్యకుమార్ వరల్డ్ రికార్డు.. సౌతాఫ్రికా కెప్టెన్ను దాటేశాడు
ఐపీఎల్-2025లో టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దుమ్ములేపుతున్నాడు. సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 39 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సూర్య భాయ్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 క్రికెట్లో వరుసగా అత్యధిక సార్లు 25 పరుగులు దాటిన క్రికెటర్గా సూర్య చరిత్రపుటలెక్కాడు. ఐపీఎల్-2025 సీజన్లో ఈ ముంబైకర్ వరుసగా 14 సార్లు 25 పైగా పరుగులు చేశాడు. దీంతో ఈ ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా పేరిట ఉండేది. బావుమా వరుసగా 13 టీ20 మ్యాచ్లలో 25 ప్లస్ పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ప్రోటీస్ కెప్టెన్ను సూర్య అధిగమించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ 640 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్దానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్పై 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ టాప్ స్దానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.సూర్యకుమార్ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. అర్ష్దీప్, యాన్సెన్, వైశాక్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలుపొందింది.చదవండి: గిల్ను కాదు అతడిని కెప్టెన్గా సెలక్ట్ చేయాల్సింది: వీరేంద్ర సెహ్వాగ్ -
గిల్ను కాదు అతడిని కెప్టెన్గా సెలక్ట్ చేయాల్సింది: వీరేంద్ర సెహ్వాగ్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. అదేవిధంగా గిల్కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు మీడియా రిపోర్ట్లు ప్రకారం.. కెప్టెన్సీ రేసులో నుంచి ఫిట్నెస్, వర్క్లోడ్ కారణంగా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడంతో గిల్కు జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. కాగా భారత సెలక్టర్ల ముందు గిల్తో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అప్షన్స్ కూడా ఉండేవి. కానీ జట్టు దీర్ఘకాలక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీమ్ సెలక్షన్ ప్రెస్మీట్లో తెలిపాడు. అయితే 25 ఏళ్ల గిల్ను కెప్టెన్గా ఎంపిక చేయడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ,వీరేంద్ర సెహ్వాగ్లు తమ మనసులోని మాటను బయటపెట్టారు. ఫిట్నెస్ సమస్యల కారణంగానే బుమ్రా కాదని గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించరాని తివారీ అన్నాడు."భారత టెస్టు కెప్టెన్సీకి శుబ్మన్ గిల్ సెకెండ్ బెస్ట్ ఆప్షన్. సెలక్టర్లకు తొలి ఎంపికగా బుమ్రా ఉండేవాడు. కానీ ఫిట్నెస్ సమస్యల వల్ల తుదిజట్టులో ఆడలేని వారికి సారథ్య బాధ్యతలు ఎలా అప్పగిస్తారు. అందుకే తమ సెకెండ్ అప్షన్ అయిన గిల్కు జట్టు పగ్గాలను కట్టబెట్టారు" అని క్రిక్బజ్ లైవ్ షోలో తివారీ పేర్కొన్నాడు. అయితే తివారీ వ్యాఖ్యలతో సెహ్వాగ్ విభేదించాడు. గిల్ను కాకుండా పంత్ కెప్టెన్గా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు."కేవలం ఒక్క సిరీస్ కోసం అయితే బుమ్రాను కెప్టెన్గా సెలక్ట్ చేయవచ్చు. అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ దీర్ఘకాలనికి అయితే ఈ నిర్ణయం సరైంది కాదు. భారత్ ఒక ఏడాది 10 టెస్టులు ఆడితే, ఆ మ్యాచ్లన్నీ బుమ్రా ఆడగలడా అని ఆడగాలి? లేదా అతడు ఎన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండగలడు అని ప్రశ్నించాలి. కెప్టెన్ను ఎంపిక చేయడంలో అది ఒక ప్రధాన అంశం.కానీ సెలక్టర్లు ఆ ఒత్తిడిని, వర్క్లోడ్ను బుమ్రాపై పెట్టాలనుకోలేదు. అందుకే అతడిని కెప్టెన్గా ఎంపిక చేయలేదు. సెలక్టర్లు తీసుకుంది సరైన నిర్ణయం అని నేను కూడా భావిస్తున్నాను. అయితే కెప్టెన్సీకి గిల్ రెండవ బెస్ట్ ఆప్షన్ అని తివారీ అన్నారు. నా దృష్టిలో టీమిండియాకు సారథిగా రిషభ్ పంత్ సెకండ్ బెస్ట్ ఆప్షన్. టెస్ట్ క్రికెట్కు పంత్ చేసినంతగా, ఇతర మరే ఇతర ఆటగాడు చేయలేదు. విరాట్ కోహ్లి తర్వాత టెస్టు క్రికెట్ చూసేలా చేసిన ప్లేయర్ పంత్. కారు ప్రమాదం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత పంత్ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. దీన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. అతడు తిరిగి తన ఫామ్ను అందుకంటే, భవిష్యత్తులో అతన్ని కెప్టెన్గా చేసే నిర్ణయాన్ని సెలక్టర్లు తీసుకొవచ్చు.అందుకే వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. అయితే భారత టెస్టు సారథిగా చాలా కొద్ది మంది బౌలర్లరే వ్యవహరించారు.నేను క్రికెట్ ఆడిన కాలంలో కేవలం అనిల్కుంబ్లేనే ఈ ఫీట్ సాధించాడు. అదేవిధంగా అన్ని మ్యాచ్లకు కూడా అతడు అందుబాటులో ఉన్నాడని" సెహ్వాగ్ విశ్లేషించాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. -
సంచలనం.. 2 పరుగులకే టీమ్ ఆలౌట్! అందులో ఓ వైడ్
క్రికెట్ చరిత్రలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ జట్టు కేవలం రెండు పరుగులకు ఆలౌటైంది. ఈ వింత రికార్డుకు ఇంగ్లండ్ మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ వేదికైంది. ఈ లీగ్ మూడో టైర్ డివిజన్లో భాగంగా సోమవారం నార్త్ లండన్ సీసీ 3rd XI, రిచ్మండ్ సీసీ 4th XI జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ సీసీ నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 426 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. నార్త్ లండన్ బ్యాటర్ డాన్ సిమ్మన్స్(140) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అనంతరం 427 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రిచ్మండ్ సీసీకి ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. నార్త్ లండన్ సీసీ బౌలర్ల ధాటికి రిచ్మండ్ బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో రిచ్మండ్ 5.4 ఓవర్లలో కేవలం 2 పరుగులకే ఆలౌటైంది. ఈ రెండు పరుగుల స్కోర్లో ఓ వైడ్ కూడా ఉండడం గమనార్హం. రిచ్మండ్ ఇన్నింగ్స్ లో ఏకంగా 9 మంది బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్కు సంబంధించిన స్కోర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.నార్త్ లండన్ బౌలర్లలో మాథ్యూ రాన్సన్ 5 వికెట్లతో ప్రత్యర్ది పతనాన్ని శాసించగా..థామస్ పాటన్ 3 వికెట్లు పడగొట్టారు. లాస్ట్ బ్యాటర్ విక్రమ్ మంగళూరు బ్యాటింగ్ కు రాలేదు. రిచ్మండ్ 2 పరుగులే చేయడంతో నార్త్ లండన్ 424 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్ కిందకు రానుందన ఈ చెత్త రికార్డును పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యల్ప స్కోరు సాధించిన రికార్డు ది బిఎస్ జట్టు పేరు మీద ఉంది. 1810లో లార్డ్స్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ది బిస్ కేవలం 6 పరుగులకే ఆలౌట్ అయింది. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో ఈ చెత్త రికార్డు న్యూజిలాండ్ జట్టు పేరిట ఉంది. 1955లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కివీస్ జట్టు కేవలం 26 పరుగులకే ఆలౌటైంది. -
భారత సైన్యానికి స్పెషల్ ట్రిబ్యూట్ ఇవ్వనున్న బీసీసీఐ
ఐపీఎల్-2025 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మంగళవారం(మే 27)తో లీగ్ స్టేజి మ్యాచ్లు ముగియనున్నాయి. మే 29న తొలి క్వాలిఫయర్, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్-2 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక ఆఖరిగా జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ ఫైనల్కు మ్యాచ్కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సీజన్ ఫైనల్ సందర్బంగా నిర్వహించే ముగింపు వేడుకను భారత సాయుధ దళాలకు అంకితమివ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. ఈ క్లోజింగ్ సెర్మనీ కార్యక్రమానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్లను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు."ఆపరేషన్ సిందూర్లో మన సాయుధ దళాలు చూపించిన ధైర్య సహసాలకు బోర్డు సెల్యూట్ చేస్తోంది. ముగింపు వేడుకను మన సైన్యానికి అంకితం చేయాలని మేము నిర్ణయించుకున్నాము" అని సైకియా స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా పెహల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్ధావరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. ఆ తర్వాత పాక్-భారత్ మధ్య ఉద్రిక్తలు తలెత్తడంతో ఐపీఎల్ను వారం రోజుల పాటు వాయిదా వేశారు. పరిస్థితులు సద్దుమణగడంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తిరిగి ప్రారంభమైంది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. -
వారిద్దరూ అద్బుతం.. అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2025 పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవాలని కలలు కన్న ముంబై ఇండియన్స్(MI)కు నిరాశ మిగిల్చింది. సోమవారం జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి పరిమితమైన ముంబై జట్టు.. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. మరోవైపు ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. దీంతో క్వాలిఫయర్-1 ఆడేందుకు శ్రేయస్ సేన అర్హత సాధించింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ యూనిట్గా మరింత మెరుగ్గా రాణించి ఉండాల్సందని పాండ్యా అభిప్రాయపడ్డాడు."జైపూర్ పిచ్ బ్యాటింగ్కు అద్బుతంగా ఉంది. ఈ పిచ్ను బట్టి చూస్తే కనీసం 20 పరుగులు తక్కువ చేశామని అన్పించింది. అయితే గత కొన్ని మ్యాచ్లుగా మేము మంచి క్రికెట్ ఆడుతున్నాము. ఈ మ్యాచ్లో మాత్రం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము.ఈ ఓటమి మాకు నష్టం కలిగించింది. ముంబై ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఐదు ట్రోఫీలను గెలుచుకుంది. అయినప్పటికి ప్రతీ మ్యాచ్ కూడా సవాలుతో కూడుకున్నది. ఒక్కసారి మన స్పీడ్ను తగ్గిస్తే ప్రత్యర్ధి దాన్ని ఉపయోగించుకుని విజయాలు సాధిస్తారు.మా బాయ్స్కు నేను చెప్పేది ఒక్కటే. ఈ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుని నాకౌట్ దశ కోసం సిద్ధంగా ఉండాలి. ఏదేమైనప్పటికి బ్యాటింగ్ యూనిట్గా మేము కచ్చితంగా 20 పరుగులు వెనకబడ్డాము. తప్పు ఎక్కడ జరిగిందో మా డ్రెస్సింగ్ రూమ్లో చర్చించుకుంటాము. మా తర్వాతి మ్యాచ్లో ఇటువంటి పొరపాట్లు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాము. ఈ పిచ్పై లెగ్ స్పిన్నర్, పేసర్ కాంబినేషన్ పని చేస్తుందనే భావించాము. అందుకే అదనంగా ఆఫ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ బదులుగా పేసర్ అశ్వినీ కుమార్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నాము. కానీ ఫలితం మేము ఆశించినట్లు రాలేదు. మేము అశ్వినీ కుమార్ సపోర్ట్ చేస్తున్నాము. సీజన్ అంతటా మాది అదే ప్రణాళిక. సెకెండ్ హాఫ్లో కూడా పిచ్ ఏ మాత్రం మారలేదు. పంజాబ్ మా కంటే మెరుగ్గా ఆడారు. ముఖ్యంగా ఆ ఇద్దరు(ప్రియాన్ష్ ఆర్య, ఇంగ్లిష్) రెండో వికెట్కు అద్బుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. మా బౌలర్లు లైన్ తప్పిన ప్రతీసారి వారిద్దరూ బంతులను స్టాండ్స్కు పంపిచారు. బౌలింగ్ యూనిట్గా అంత గొప్పగా మేము బౌలింగ్ చేయలేకపోయాము. ఇక ఇప్పుడు ఎలిమినేటర్ లోకి వెళ్తున్నాము.. అక్కడ మంచి బ్యాటింగ్, బౌలింగ్ తో కూడా అద్భుత ప్రదర్శన చేయాల్సిన అవసరముంది అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలోనే చేధించింది. జోష్ ఇంగ్లిష్ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. -
టీమ్ విక్టరీ సెలబ్రేషన్స్.. ఫ్యాన్స్పైకి దూసుకెళ్లిన కారు! వీడియో
లివర్పూల్ టీమ్ విక్టరీ పరేడ్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రీమియర్ లీగ్లో 20వ టైటిల్ను లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం లివర్పూల్లో విక్టరీ పరేడ్ను నిర్వహించారు. తమ ఆరాధ్య ప్లేయర్లను అభినందించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గోన్నారు.ఈ క్రమంలో విక్టరీ పరేడ్లోకి ఓ దుండగుడు కారుతో దూసుకొచ్చాడు. విచక్షణారహితంగా పలువురిని ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 27 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.వాహనదారుడిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే ఇది ఉగ్రవాద చర్య కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.Car drives into Liverpool fan crowd. pic.twitter.com/Q4422ueYIo— RedandWhite Ireland (@RIreland29776) May 26, 2025చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో అదరగొట్టింది. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానాన్ని కైవసం చేసుకోంది.ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. అర్ష్దీప్, యాన్సెన్, వైశాక్ తలా 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. జోష్ ఇన్గ్లిస్ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముంబై బౌలర్లలో సాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఒక్క వికెట్ సాధించారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన శ్రేయస్..ఐపీఎల్ చరిత్రలో మూడు వెర్వేరు జట్లును క్వాలిఫయర్స్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్గా అయ్యర్ రికార్డులకెక్కాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తన ఐపీఎల్ కెరీర్ను ప్రారంభించిన శ్రేయస్.. 2020 సీజన్లో ఢిల్లీ జట్టును కెప్టెన్గా రెండవ స్ధానానికి చేర్చాడు.సెకెండ్ క్వాలిఫయర్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. దురుదృష్టవశాత్తూ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అనంతరం ఐపీఎల్-2024 పాయింట్ల పట్టికలో శ్రేయస్ సారథ్యంలోని కోల్కతా నైట్ రైడర్స్ (KKR) అగ్రస్దానంలో నిలిచింది. ఫైనల్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసి మూడో ఐపీఎల్ టైటిల్ను కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పంజాబ్ను క్వాలిఫయర్స్కు చేర్చి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చదవండి: బెంగళూరుకు ‘ఆఖరి’ చాన్స్ -
‘పోల్’ దాటడమే పరీక్ష!
సాక్షి క్రీడా విభాగం: ఒకవైపు ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు తీవ్ర ఒత్తిడి మధ్య ప్రయాణానికి సిద్ధమవుతున్న తరుణం... మరోవైపు పోటీలు జరిగే దేశంలో ఉండే పరిస్థితులు, అనుకూలతల గురించి ఆలోచిస్తూ తమ వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం... సాధారణంగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఇలాంటి దశను ఎదుర్కొంటూనే ఉంటారు. టీమ్ గేమ్లకు సంబంధించి ఏర్పాట్లను చక్కబెట్టేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉంటాయి. అదే వ్యక్తిగత క్రీడాంశాల్లో పాల్గొనే ఆటగాళ్లు మాత్రం అన్నీ తామే చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ విషయంలో ఎన్నో ఏర్పాట్లు, మరెన్నో అదనపు జాగ్రత్తలతో వారు పోటీలకు వెళుతుంటారు. కానీ ఇలాంటి ఆటగాళ్లకు విమానాశ్రయంలో ప్రతీసారి నిబంధనల పేరుతో ప్రతిబంధకాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రశాంతంగా, సమస్య లేకుండా ప్రయాణం చేయాల్సిన అథ్లెట్లు సామాన్యుల తరహాలో అనేక తనిఖీలను ఎదుర్కొంటూ అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. భారత డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్కు ప్రతీసారి ఇలాంటి అనుభవమే ఎదురవుతూ ఉంటుంది. 2022 ఆసియా క్రీడల డెకాథ్లాన్ (పది క్రీడాంశాల సమాహారం) ఈవెంట్లో శంకర్ రజత పతకం సాధించాడు. ఈ పోటీల్లో భాగంగా అతను పోల్వాల్ట్ ఈవెంట్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. దాని కోసమే అతను ఎక్కడికైనా తన సొంత ‘పోల్’లను తీసుకెళతాడు. సుమారు 15.7 అడుగుల పొడవు ఉండే ఈ పోల్ను ముందుగా విమానాశ్రయం కార్గోలోకి తీసుకెళ్ళడం మొదలు విమానం దిగిన తర్వాత ఆయా ఎయిర్పోర్ట్నుంచి బయటకు తీసుకు రావడం వరకు పెద్ద ప్రహసనం సాగుతుంది. భారత్లో జరిగే ఈవెంట్లలో అయితే అతను తన పోల్లను ట్రైన్ల ద్వారా సునాయాసంగా పంపించేస్తాడు. అదే విదేశాలకు వెళ్లేటప్పుడే సమస్య ఎదురవుతుంది. టోర్నీ జరిగే సమయంలో నిర్వాహకులు పోల్లను సిద్ధం చేస్తారు కానీ కొత్తవాటిని ఉపయోగించడంలో చాలా సమస్యలు ఉంటాయి. వాటి పొడవు, బరువును బట్టి ప్రాక్టీస్లో వాడటం బాగా అలవాటైన పోల్లనే పోటీల్లోనూ వాడితే సౌకర్యంగా ఉంటుంది. అందుకే తేజస్విన్ కూడా ఎక్కడికి వెళ్లినా వాటిని తీసుకెళతాడు. యూరోప్, అమెరికా దేశాల్లో ఇలాంటి సమస్య తక్కువ. అగ్రశ్రేణి అథ్లెట్లంతా ఈ రెండు ఖండాల్లో తమకు అనువైన చోట ఒక్కో సెట్ను ఉంచుతారు. వాటిని తరలించడంలో వారికి పెద్దగా ఇబ్బంది ఎదురు కాదు. ఈనెల 27 నుంచి దక్షిణ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తేజస్విన్ పాల్గొంటున్నాడు. అతని ఈవెంట్ రెండు రోజులపాటు ఉంటుంది. మే 27న తొలి రోజు ఐదు ఈవెంట్స్ (100 మీటర్లు, లాంగ్జంప్, షాట్పుట్, హైజంప్, 400 మీటర్లు)... రెండో రోజు మే 28న మరో ఐదు ఈవెంట్స్ (110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) జరుగుతాయి. అత్యధిక పాయింట్లు సాధించిన టాప్–3 డెకాథ్లెట్లకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో తేజస్విన్ తన గతానుభవాలను వివరించాడు. వివరాలు అతని మాటల్లోనే.... ‘నా ఈవెంట్కు సంబంధించిన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్లో జావెలిన్, డిస్కస్, షాట్పుట్ సహా అన్నింటిని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ చెకింగ్ ద్వారానే నేను దాటించ గలుగుతాను. కానీ అసలు సమస్య పోల్వాల్ట్ పోటీల్లో వాడే పోల్ గురించే వస్తుంది. దాదాపు 5 మీటర్ల పొడవు ఉండే పోల్ను తీసుకెళ్లడం నాకు ఎప్పుడూ సమస్యే. అన్నింటికంటే ముందు ప్రధాన ద్వారం వద్దే సీఐఎస్ఎఫ్ జవాన్లు నన్ను ఆపేస్తారు. నా గురించి మొత్తం చెప్పిన గతంలోనూ ఇలా వెళ్లానని వివరించాల్సి వస్తుంది. మరోవైపు ప్రయాణీకులేమో నేనేదో ఆయుధాలు తీసుకెళుతున్నట్లు చూస్తారు. సాధారణంగా లగేజీకి వాడే రెండు కార్గో లిఫ్ట్లలో ఈ పోల్లు పట్టవు. అందుకే మరో లిఫ్ట్ను వాడాల్సి ఉంటుంది. మొదటిసారి నేను ఈ పోల్స్ తీసుకొని భారత్కు తిరిగొచ్చాక వాటిని ఎలా బయటకు తీసుకురావాలో తెలీక కొందరు అధికారులు వెనక్కి పంపాలని కూడా ఆలోచించారు. చివరకు నాలుగు రోజుల తర్వాత అలాంటి వాటి కోసం స్టీల్ గేట్ ఒకటి ఉంటుందని తెలిసింది. దానిని కేవలం ప్రధానమంత్రి విదేశాలకు వెళ్లేటప్పుడు మాత్రమే వాడతారని వారు చెప్పారు. ఈ గేట్ను వాడేందుకు నేను ముందుగా సదరు ఎయిర్లైన్స్ అధికారుల లెటర్ తీసుకోవాలి. ఆపై సెక్యూరిటీ హెడ్, కస్టమ్స్ హెడ్తో కూడా దానిపై సంతకం చేయించాలి. వేర్వేరు చోట్ల బిజీగా ఉండేవారంతా ఒకే సమయంలో మనకు దొరకరు. చివరకు ఆ స్టీల్ గేట్ను తెరుస్తారు. ఈ ప్రక్రియ అంతా దాదాపు ఐదు గంటల పాటు సాగుతుంది! అందుకే నేను ప్రయాణ సమయానికన్నా ఎన్నో గంటల ముందు అక్కడుంటాను. కాస్త ఆలస్యం అయితే వారు నన్ను పట్టించుకోరు. ఎన్నిసార్లు నేను ఇదే చేస్తున్నా ప్రతీసారి మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సి ఉంటుంది. భారత్ నుంచి వెళ్లిన తర్వాత మనం ఏ దేశంలో అడుగుపెడుతున్నాం అనేదానిపై తర్వాతి అంశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని ఎయిర్లైన్స్లు బాగా సహకరిస్తే కొన్ని పోల్స్ను తీసుకెళ్లమని గట్టిగా చెప్పేస్తాయి. నాకు ఇదంతా చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే పతకం గెలిచి వస్తున్నప్పుడు ఎంతో చక్కగా మనకు సహాయం చేస్తారు కూడా. ఇది ఒక అథ్లెట్గా నాకు కలిగే ఆనందం’ అని తేజస్విన్ వివరించాడు. -
LSG Vs RCB: బెంగళూరుకు ‘ఆఖరి’ చాన్స్
లక్నో: ఐపీఎల్ లీగ్ దశ ఆఖరి అంకానికి చేరింది. 66 రోజులుగా జరుగుతున్న లీగ్ దశకు నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫలితంతో తెరపడుతుంది. ఈ సీజన్లో ఎప్పుడో నాలుగు జట్లు ‘ప్లే ఆఫ్స్’ చేరాయి. అలాగని ఈ మ్యాచ్ పూర్తిగా నామమాత్రమని కొట్టిపారేయడానికి వీలు లేదు. ఎందుకంటే ‘ప్లే ఆఫ్స్’ చేరిన నాలుగు జట్లలో ఒకటైన ఆర్సీబీ సేఫ్ జోన్ టాప్–2లో నిలిచేందుకు ఇదే ఆఖరి అవకాశం. ఈడెన్ గడ్డపై మార్చి 22న మొదలైన ఐపీఎల్లో కోల్కతాపై గెలిచి శుభారంభం చేసిన బెంగళూరు... ఇప్పుడు మరో పరాయిగడ్డ లక్నోలోనూ సూపర్ జెయింట్స్పై గెలిచి టాప్–2లో చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ సీజన్లో ఎలాగూ ముందంజ వేయలేకపోయిన లక్నో... కనీసం సొంత ప్రేక్షకుల మధ్య విజయంతో ముగింపు పలకాలనే పట్టుదలతో ఉంది. మిడిలార్డర్ మెరిపిస్తే... బెంగళూరు జట్టులో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, కోహ్లి మంచి ఆరంభాన్నే ఇస్తున్నారు. హైదరాబాద్తో జరిగిన తమ చివరి మ్యాచ్లో ఓపెనింగ్ వికెట్కు 7 ఓవర్లలో 80 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్లు రజత్ పాటీదార్, జితేశ్ శర్మ, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్లు తీవ్రంగా నిరుత్సాహపరిచారు. వీళ్లందరూ మూకుమ్మడిగా విఫలమవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. లేదంటే 200 పైచిలుకు లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించేంది. ఇక బౌలర్లు గత మ్యాచ్లో విరివిగా పరుగులు సమర్పించుకున్నారు. యశ్ దయాళ్, ఇన్గిడి, షెఫర్డ్, సుయశ్లు తేలిపోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు అనుకూలతనిచ్చింది. అయితే టాప్–2లో నిలిపే కీలకమైన పోరులో సమష్టిగా బాధ్యత కనబరిస్తే ఆర్సీబీకి ఢోకా ఉండదు. తడాఖా చూపేనా లక్నో ప్లే ఆఫ్స్కు మాత్రమే దూరమైంది. అంతమాత్రాన పోరాటానికి విరామమివ్వలేదు. గత రెండు మ్యాచ్ల్ని పరిశీలిస్తే ఈ విషయమే అర్థమవుతుంది. సొంతగడ్డపై లక్నో 205 పరుగులు చేసింది. కానీ సన్రైజర్స్ దూకుడుతో ఓడింది. ఇక గుజరాత్ గడ్డ అహ్మదాబాద్పై టైటాన్స్పై 235 పరుగులు చేసి గెలిచింది. గత రెండు మ్యాచ్ల్లోనూ సులువుగా 200 పైచిలుకు పరుగులు చేసిన లక్నో బ్యాటింగ్ దుర్భేధ్యంగా ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు మిచెల్ మార్‡్ష, మార్క్రమ్, మిడిలార్డర్లో నికోలస్ పూరన్ ఫామ్లో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగుతున్నారు. లక్నో బ్యాటింగ్కు అండ, దండా ఈ ముగ్గురే! బౌలింగ్ విభాగానికి వస్తే రూర్కే, అవేశ్ ఖాన్లు నిలకడగా వికెట్లు తీస్తున్నారు. ఒక మ్యాచ్ సస్పెన్షన్తో గత మ్యాచ్కు దూరమైన స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ ఈ మ్యాచ్కు అందుబాటులోకి రావడం కలిసొచ్చే అంశం. అతని ప్రవర్తన పక్కనబెడితే స్పిన్తో బ్యాటర్లను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నేటి మ్యాచ్లో వీళ్లందరూ ఆశించిన మేర రాణిస్తే విజయంతో బైబై చెప్పడం ఏమంత కష్టం కానేకాదు. పిచ్, వాతావరణం బ్యాటింగ్కు కలిసొచ్చే పిచ్ ఇది. మూడు మ్యాచ్ల్లో 200 పైచిలుకు స్కోరు సాధ్యమైంది. ఇందులో ఒకసారైతే 206 లక్ష్యఛేదన సులువైంది. టాస్ నెగ్గిన జట్టు మొదట ఫీల్డింగ్కే మొగ్గుచూపుతుంది.. మంగళవారం వర్ష సూచనైతే లేదు. తుది జట్లు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెపె్టన్), సాల్ట్, కోహ్లి, మయాంక్, జితేశ్, రొమారియో షెఫర్డ్, కృనాల్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, ఇన్గిడి. లక్నో: రిషభ్ పంత్ (కెపె్టన్), మార్క్రమ్, మిచెల్ మార్‡్ష, పూరన్, ఆయుశ్ బదోని, సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్, అవేశ్ఖాన్, ఆకాశ్దీప్, విల్ రూర్కే. -
PBKS Vs MI: విధ్వంసం సృష్టించిన ఇంగ్లిస్, ఆర్య.. ముంబైపై పంజాబ్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 26) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఓటమితో ముంబై నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.పాయింట్ల పట్టికలో ప్లే ఆఫ్స్కు చేరిన జట్లు..పంజాబ్- 19గుజరాత్- 18ఆర్సీబీ- 17 (ఇంకా ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది)ముంబై- 16సత్తా చాటిన సూర్యకుమార్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన సూర్యకుమార్ మెరుపు అర్ద సెంచరీతో (57) సత్తా చాటాడు.ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24, తిలక్ వర్మ 1, విల్ జాక్స్ 17, హార్దిక్ పాండ్యా 26, నమన్ ధిర్ 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జన్సెన్, విజయ్కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.విధ్వంసం సృష్టించిన ఇంగ్లిస్, ప్రియాంశ్అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రియాంశ్ ఆర్య 62, జోష్ ఇంగ్లిస్ 73, శ్రేయస్ అయ్యర్ 26 (నాటౌట్), ప్రభ్సిమ్రన్ 13, నేహల్ వధేరా 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో సాంట్నర్ 2, బుమ్రా ఓ వికెట్ పడగొట్టారు. -
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో రెండు సీజన్లలో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ఇండియన్స్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2023 సీజన్లో తొలిసారి 600 ప్లస్ మార్కును (605) తాకిన స్కై.. ప్రస్తుత సీజన్లో కూడా 600 పరుగుల మైలురాయిని దాటాడు. ముంబై ఇండియన్స్ చరిత్రలో (ఐపీఎల్లో) స్కై కాకుండా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఓసారి 600 ప్లస్ పరుగులు స్కోర్ చేశాడు. సచిన్ 2010 సీజన్లో 618 పరుగులు సాధించాడు.ఓ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..619* - సూర్యకుమార్ యాదవ్ (2025)618 - సచిన్ టెండూల్కర్ (2010)605 - సూర్యకుమార్ యాదవ్ (2023)553 - సచిన్ టెండూల్కర్ (2011)540 - లెండిల్ సిమన్స్ (2015)538 - రోహిత్ శర్మ (2013)ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (మే 26) జరుగుతున్న మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 600 పరుగుల మార్కును దాటాడు. ఈ మ్యాచ్లో 44 పరుగుల వద్ద (16 ఓవర్ల తర్వాత) బ్యాటింగ్ చేస్తున్న స్కై.. ఈ సీజన్లో 14వ సారి 25 పరుగుల మార్కును దాటాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ బ్యాటర్ ఇన్ని సార్లు (ఒకే సీజన్లో) 25 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. 2018 సీజన్లో కేన్ విలియమ్సన్, 2023 సీజన్లో శుభ్మన్ గిల్ 13 సార్లు ఈ ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. పంజాబ్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. సూర్యకుమార్ యాదవ్ 44, నమన్ ధిర్ 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24, తిలక్ వర్మ 1, విల్ జాక్స్ 17 పరుగులు చేసి ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో జన్సెన్, విజయ్కుమార్ వైశాఖ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత లాహోర్ ఖలందర్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఎడిషన్ విజేతగా లాహోర్ ఖలందర్స్ అవతరించింది. నిన్న (మే 25) జరిగిన ఫైనల్లో ఆ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత నాలుగు సీజన్లలో ఖలందర్స్కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. ఖలందర్స్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సికందర్ రజా సుడిగాలి ఇన్నింగ్స్ (7 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి ఖలందర్స్ను గెలిపించాడు. 19వ ఓవర్ చివరి రెండు బంతులకు 8 పరుగులు అవసరం కాగా.. రజా వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టాడు.అంతకుముందు కుసాల్ పెరీరా మెరుపు ఇన్నింగ్స్ (31 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ఖలందర్స్ను గెలుపుకు దగ్గర చేశాడు. ఖలందర్స్ ఇన్నింగ్స్లో ఫకర్ జమాన్ 11, ముహమ్మద్ నయీమ్ 46, అబ్దుల్లా షఫీక్ 41, భానుక రాజపక్స 14 పరుగులు చేశారు.గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్లో హసన్ నవాజ్ (76) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగగా.. సౌద్ షకీల్ 4, ఫిన్ అలెన్ 12, రిలీ రొస్సో 22, అవిష్క ఫెర్నాండో 29, దినేశ్ చండీమల్ 22, ఫహీమ్ అష్రాఫ్ 28 పరుగులు చేశారు. ఖలందర్స్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, సల్మాన్ మిర్జా, హరీస్ రౌఫ్ తలో 2, సికందర్ రజా, రిషద్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.ఆఖరి నిమిషంలో బరిలోకి దిగి ఖలందర్స్ను గెలిపించిన సికందర్ రజాముందు రోజు ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించిన సికందర్ రజా.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి పది నిమిషాల ముందు ఖలందర్స్కు అందుబాటులోకి వచ్చాడు. తొలుత బౌలింగ్లో ఓ వికెట్ తీసిన రజా.. ఆతర్వాత బ్యాటింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఖలందర్స్కు టైటిల్ను అందించాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రజా 24 ఓవర్లు బౌలింగ్ చేసి రెండు ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. ఇందులో తొలి ఇన్నింగ్స్లో విఫలమైన (7) అతను.. రెండో ఇన్నింగ్స్లో అర్ద సెంచరీతో (60) రాణించాడు. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..
ఇండియా-ఎ జట్టు మాజీ కెప్టెన్, గుజరాత్ స్టార్ బ్యాటర్ ప్రియాంక్ పంచల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన తన దేశవాళీ కెరీర్కు ముగింపు పలికాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. నాకు ఈ క్షణం చాలా భాగోద్వేగంతో కూడుకున్నది. అంతే గర్వంగా కూడా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన గుజరాత్ క్రికెట్ ఆసోషియేషన్కు, అభిమానులకు, సహచర ఆటగాళ్లు ధన్యవాదాలు అని తన రిటైర్మెంట్ నోట్లో పంచల్ పేర్కొన్నాడు.ప్రియాంక్కు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన రికార్డులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో పరుగులు వరద పారించాడు. ప్రియాంక్ తన 17 ఏళ్ల కెరీర్లో127 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడి 8856 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా 2016-17 రంజీ సీజన్లో ఈ గుజరాతీ బ్యాటర్ భీబత్సం సృష్టించాడు. ఆ సీజన్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్గా ఆ ఎడిషన్లో 1310 పరుగులు చేశాడు. అదేవిధంగా97 లిస్ట్ ఏ మ్యాచుల్లో 8 సెంచరీలతో కలిపి 3,672 పరుగులు చేశాడు. 59 టీ20లు ఆడిన ప్రియాంక్ 28.71 సగటుతో 1,522 పరుగులు సాధించాడు.కాగా ప్రియాంక్ 2021లో టీమిండియాకు రిజర్వ్ ఓపెనర్గా ఎంపికయ్యాడు. కానీ భారత తరుపన అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. 2022 శ్రీలంక టూర్కు కూడా సెలక్ట్ అయ్యాడు. అక్కడ కూడా అతడికి డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు. -
IPL 2025: ముంబైపై పంజాబ్ గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 26) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకోగా.. ముంబై నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా.. పంజాబ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రియాంశ్ ఆర్య 62, జోష్ ఇంగ్లిస్ 73, శ్రేయస్ అయ్యర్ 26 (నాటౌట్) పరుగులు చేసి పంజాబ్ను విజయతీరాలకు చేర్చారు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్14.1వ ఓవర్- 143 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (62) ఔటయ్యాడు. టార్గెట్ 185.. 13 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 131/1ప్రియాంశ్ ఆర్య 57, జోష్ ఇంగ్లిస్ 54టార్గెట్ 185.. 10 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 89/1ప్రియాంశ్ ఆర్య 37, జోష్ ఇంగ్లిస్ 358 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 75/1ఇంగ్లిస్ 25, ప్రియాంశ్ ఆర్య 34టార్గెట్ 185.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్4.2వ ఓవర్- 185 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో అశ్వనీ కుమార్కు క్యాచ్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ సింగ్ (13) ఔటయ్యాడు. సత్తా చాటిన సూర్యకుమార్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన సూర్యకుమార్ మెరుపు అర్ద సెంచరీతో (57) సత్తా చాటాడు.ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24, తిలక్ వర్మ 1, విల్ జాక్స్ 17, హార్దిక్ పాండ్యా 26, నమన్ ధిర్ 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జన్సెన్, విజయ్కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్షదీప్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు (నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్) తీశాడు. 18 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 158/5సూర్యకుమార్ యాదవ్ 45, నమన్ ధిర్ 7 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై12.3వ ఓవర్- 106 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (17) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై 10.5వ ఓవర్- 87 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్లో అర్షదీప్కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (1) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ముంబై9.3వ ఓవర్- 81 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (24) ఔటయ్యాడు.9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 79/19 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 79/1గా ఉంది. రోహిత్ శర్మ 23, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై5.1వ ఓవర్- 45 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది.జన్సెన్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ (27) ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 50/0టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 45/0గా ఉంది. రికెల్టన్ 27, రోహిత్ శర్మ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (మే 26) జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, కైల్ జేమీసన్, విజయ్కుమార్ వైశాక్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షేడ్గే, జేవియర్ బార్ట్లెట్, ముషీర్ ఖాన్ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బవా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు -
IPL 2025: పంజాబ్ కింగ్స్కు శుభవార్త
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్కు ముందు పంజాబ్ కింగ్స్కు శుభవార్త అందింది. చేతి వేలి గాయం కారణంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్కు దూరంగా ఉన్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ప్లే ఆఫ్స్ సమయానికి అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. ఓ ప్రముఖ వార్తా సంస్థ తమ కథనంలో రాసుకొచ్చింది. చహల్ను నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్లో బరిలోకి దించకూడదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిన నేపథ్యంలో చహల్ విషయంలో రిస్క్ తీసుకోకూడదని ఆ జట్టు యాజమాన్యం భావిస్తుంది.కాగా, చహల్ లేని లోటు పంజాబ్కు గత మ్యాచ్లో (ఢిల్లీతో) బాగా తెలిసొచ్చింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 206 పరుగుల భారీ స్కోర్ చేసినా పంజాబ్ దాన్ని కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్లో చహల్ ఆడి ఉంటే పంజాబ్ మరో విజయం నమోదు చేసేది. అలా జరిగి ఉంటే నేటి మ్యాచ్తో (ముంబై) సంబంధం లేకుండా ఆ జట్టు టేబుల్ టాపర్గా నిలిచేది.పంజాబ్ ఇవాళ (మే 26) జైపూర్ వేదికగా జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే పంజాబ్ టేబుల్ టాపర్గా నిలుస్తుంది. ముంబై గెలిచినా అగ్రస్థానానికి చేరుకుంటుంది. లీగ్ దశ మ్యాచ్లు పూర్తయ్యే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు అదనపు ప్రయోజనం (క్వాలిఫయర్-1లో ఓడినా ఫైనల్కు చేరేందుకు క్వాలిఫయర్-2లో పోటీ పడే అవకాశం ఉంటుంది) చేకూరుతుందన్న విషయం తెలిసిందే.పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు (ప్రస్తుతం)..గుజరాత్- 18 (0.254)పంజాబ్- 17 (0.327)ఆర్సీబీ- 17 (0.255)ముంబై- 16 (1.292)నేటి మ్యాచ్లో తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రభ్సిమ్రన్ సింగ్ (wk), ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/ప్రవీణ్ దూబేముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
#RCB: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి ఐపీఎల్ జట్టుగా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ను సొంతం చేసుకోపోయినప్పటికి.. ఆర్సీబీని అభిమానించే వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో బెంగళూరు ఓ డిజిటల్ మైలురాయిని అందుకుంది. ఇన్స్టాగ్రామ్లో 2 కోట్ల మంది ఫాలోవర్లను దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా బెంగళూరు అవతరించింది.ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలో ఆర్సీబీ ఇన్స్టా ఫాలోవర్ల సంఖ్య 18 మిలియన్లగా ఉండేది. ఇప్పుడు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య 20 మిలియన్లకు చేరింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (18.6 మిలియన్లు), ముంబై ఇండియన్స్ (18 మిలియన్లు)లను బెంగళూరు ఫ్రాంచైజీ దాటిసేంది.ఇక ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. టాప్-2 స్ధానం కోసం ప్రయత్నిస్తోంది. ఆర్సీబీకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. మే 27న ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో బెంగళూరు తలపడనుంది.ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టకలో టాప్-2 స్ధానానికి చేరుకుంటుంది. ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్.. ఎనిమిదింట విజయాలో పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది.ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా ఫాలో అవుతున్న ఐపీఎల్ జట్లు ఇవే:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) - 20 మిలియన్లుచెన్నై సూపర్ కింగ్స్ (CSK)- 18.6 మిలియన్లుముంబై ఇండియన్స్ (MI)- 18 మిలియన్లుకోల్కతా నైట్ రైడర్స్ (KKR)- 7.5 మిలియన్లుసన్రైజర్స్ హైదరాబాద్ (SRH)- 5.4 మిలియన్లు -
IPL 2025: తొలి సీజన్లోనే భారీ రికార్డు సొంతం చేసుకున్న ఆయుశ్ మాత్రే
సీఎస్కే యువ కెరటం ఆయుశ్ మాత్రే ఐపీఎల్ అరంగేట్రం సీజన్లోనే భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. సీఎస్కే తరఫున ఓ సీజన్లో అత్యధిక స్ట్రయిక్రేట్తో (కనీసం 200 పరుగులు) పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన మాత్రే 188.97 స్ట్రయిక్రేట్తో ఓ భారీ అర్ద సెంచరీ సాయంతో (94) 240 పరుగులు చేశాడు.ఇదే సీజన్లో మరో చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ కూడా 180 స్ట్రయిక్రేట్తో 225 పరుగులు చేశాడు. మాత్రే తర్వాత ఓ సీజన్లో అత్యధిక స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించిన సీఎస్కే ఆటగాడిగా బ్రెవిస్ నిలిచాడు. ఈ రికార్డు విభాగంలో మాత్రే, బ్రెవిస్ తర్వాత అజింక్య రహానే (2023 సీజన్లో 172.48 స్ట్రయిక్రేట్తో 326 పరుగులు), రవీంద్ర జడేజా (2020 సీజన్లో 1671.85 స్ట్రయిక్రేట్తో 232 పరుగులు), ఎంఎస్ ధోని (2013 సీజన్లో 162.89 స్ట్రయిక్రేట్తో 461 పరుగులు) ఉన్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్తో నిన్న (మే 25) జరిగిన మ్యాచ్లో సీఎస్కే 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సీజన్ను గెలుపుతో ముగించింది. అయినా సీజన్లో ఆఖరి స్థానంతోనే సరిపెట్టుకుంది. నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే భారీ స్కోర్ (230/5) చేసింది. ఆయుశ్ మాత్రే (34), డెవాన్ కాన్వే (52), ఉర్విల్ పటేల్ (37), డెవాల్డ్ బ్రెవిస్ (57) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. సీఎస్కే బౌలర్లు చెలరేగడంతో 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ ఇలా తక్కువ స్కోర్కే చేతులెత్తేయడం ఈ సీజన్లో ఇదే మొదటిసారి. అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ తలో మూడు వికెట్లు తీసి గుజరాత్ పతనాన్ని శాశించారు. రవీంద్ర జడేజా 2, ఖలీల్ అహ్మద్, పతిరణ తలో వికెట్ తీశారు. గుజరాత్ ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ (41) టాప్ స్కోరర్గా నిలువగా.. అర్షద్ ఖాన్ (20), శుభ్మన్ గిల్ (13), షారుఖ్ ఖాన్ (19), తెవాటియా (140, రషీద్ ఖాన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. -
టీమిండియా కొత్త కెప్టెన్కు గవాస్కర్ వార్నింగ్!?
భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్తో జరగబోయే టెస్టు సిరీస్ నుంచి భారత టెస్టు కెప్టెన్గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది.గిల్కు తన మొదటి పరీక్షలోనే కఠిన సవాలు ఎదురుకానుంది. ఎందుకంటే వారి సొంతగడ్డపై ఇంగ్లీష్ జట్టును ఓడించడం అంతసులువు కాదు. అంతకుతోడు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేరు. ప్రస్తుతం భారత జట్టులో ముగ్గురు నలుగురికి మినహా ఇంగ్లండ్లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. గిల్కు కూడా ఇంగ్లీష్ కండీషన్స్లో ఆడిన అనుభవం లేదు. దీంతో గిల్ కెప్టెన్గా తన మొదటి ఎసైన్మెంట్లో ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్పై ఇప్పుడు అదనపు ఒత్తిడి ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు."భారత కెప్టెన్గా ఎంపికైన ఆటగాడిపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే జట్టు సభ్యుడిగా ఉండటానికి, కెప్టెన్గా వ్యవహరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే టీమ్ మెంబర్గా ఉన్నప్పుడు సాధారణంగా మీకు క్లోజ్గా ఉన్న ఆటగాళ్లతో ఎక్కువగా సంభాషిస్తారు. కానీ కెప్టెన్ అయినప్పుడు, జట్టులోని ఇతర ఆటగాళ్ళు మిమ్మల్ని గౌరవించే విధంగా మీరు ప్రవర్తించాలి. కెప్టెన్ ప్రవర్తన అతని ప్రదర్శన కంటే ముఖ్యమైనది" అంటూ స్పోర్ట్స్ టాక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సిరాజ్చదవండి: IPL 2025: 'పంత్ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్ -
గంగూలీ సోదరుడికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోదరుడు, క్యాబ్ (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పూరీ బీచ్లో (ఒడిశా) అతను ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో స్నేహశిష్తో పాటు అతని భార్య అర్పిత గంగూలీ కూడా ఉన్నారు. స్నేహశిష్ దంపతులు సముద్ర నీటిలో మునిగిపోతుండగా కొందరు లోకల్ బోట్ డ్రైవర్లు, మత్స్యకారులు వారిని రక్షించారు. ప్రాణాపాయం నుండి బయటపడిన స్నేహశిష్ దంపతులు ప్రస్తుతం కోల్కతాకు చేరుకున్నారు. మాకిది పునర్జన్మ అని గంగూలీ భార్య అర్పిత అన్నారు. అదో భయానక ఘటన అని అమె గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాథుని కృప వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని తెలిపారు. -
MI VS PBKS: రోహిత్ శర్మను ఊరిస్తున్న రెండు భారీ రికార్డులు
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (మే 26) జరుగనున్న కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచేందుకు ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు చాలా కీలకమవుతుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే 19 పాయింట్లతో టాప్ ప్లేస్కు చేరుతుంది. ముంబై గెలిచినా (గుజరాత్ కంటే మెరుగైన రన్రేట్ ఉండటం చేత) 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలుస్తుంది. లీగ్ దశ మ్యాచ్లు పూర్తయ్యే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు అదనపు ప్రయోజనం (క్వాలిఫయర్-1లో ఓడినా ఫైనల్కు చేరేందుకు క్వాలిఫయర్-2లో పోటీ పడే అవకాశం ఉంటుంది) చేకూరుతుందన్న విషయం తెలిసిందే.పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు (ప్రస్తుతం)..గుజరాత్- 18 (0.254)పంజాబ్- 17 (0.327)ఆర్సీబీ- 17 (0.255)ముంబై- 16 (1.292)మూడు సిక్సర్ల దూరంలో..!ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ మూడు సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 300 సిక్సర్ల అరుదైన మైలురాయిని తాకుతాడు. క్యాష్ రిచ్ లీగ్లో క్రిస్ గేల్ ఒక్కడే ఇప్పటివరకు 300 సిక్సర్ల మైలురాయిని తాకాడు. రోహిత్ తర్వాత 300 సిక్సర్ల మార్కు తాకేందుకు విరాట్ కోహ్లికి అవకాశముంది. విరాట్ ఐపీఎల్లో ఇప్పటివరకు 291 సిక్సర్లు బాదాడు.మరో 67 పరుగులు చేస్తే..!నేటి మ్యాచ్లో రోహిత్ మరో 67 పరుగులు చేస్తే ఐపీఎల్లో అత్యంత అరుదైన 7000 పరుగుల మార్కును తాకుతాడు. క్యాష్ రిచ్ లీగ్లో విరాట్ కోహ్లి మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించాడు. విరాట్ ఖాతాలో 8552 పరుగులు ఉండగా.. రోహిత్ ఖాతాలో 6933 పరుగులు ఉన్నాయి. విరాట్, రోహిత్ తర్వాత ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528) ఉన్నారు.వార్నర్, విరాట్ తర్వాత..!నేటి మ్యాచ్లో రోహిత్ 47 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరతాడు. పంజాబ్పై అత్యధిక పరుగులు చేసిన టాప్-2 బ్యాటర్లుగా డేవిడ్ వార్నర్ (1134), విరాట్ కోహ్లి (1104) చలామణి అవుతున్నారు.నేటి మ్యాచ్లో తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రభ్సిమ్రన్ సింగ్ (wk), ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/ప్రవీణ్ దూబేముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
ఇంగ్లండ్ టూర్.. కామాఖ్య ఆలయంలో గంభీర్ ప్రత్యేక పూజలు! వీడియో
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య ఆలయాన్ని సందర్శించాడు. సోమవారం ఆలయానికి చేరుకున్న గంభీర్కు ఆర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.గంభీర్ కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా కామాఖ్య ఆలయం దేశంలోని అత్యంత ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయాన్ని ప్రతీ రోజు వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.గంభీర్ ఇటీవల తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్కు భారత జట్టును బీసీసీ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్తో తలపడనుంది. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సిరాజ్ 📍 Assam — Gautam Gambhir offered prayers at Maa Kamakhya Mandir.Jai Mata Di 🚩 pic.twitter.com/975Wfj67ko— Megh Updates 🚨™ (@MeghUpdates) May 26, 2025 -
గుడ్ న్యూస్.. జియో హాట్స్టార్లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లు!
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది జూన్లో జరగనున్న ఇండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఈ ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ను జియోహాట్స్టార్ యాప్ అండ్ వెబ్ సైట్లో వీక్షించవచ్చు.కాగా వాస్తవానికి 2031 వరకు ఇంగ్లండ్లో జరిగే మ్యాచ్లను ప్రసారం చేసే అన్ని హక్కులను సోనీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ కలిగి ఉంది. అయితే క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ మార్క్యూ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్స్టార్కు సోనీ సబ్-లైసెన్స్ చేసినట్లు సమాచారం.ఈ ఒప్పందం రెండు కంపెనీల మధ్య దాదాపు నెల రోజుల చర్చల తర్వాత జరిగనట్లు సదరు క్రికెట్ వెబ్సైట్ తమ రిపోర్ట్లో పేర్కొంది. కాగా జియోహాట్స్టార్ ఇప్పటికే భారత్ హోమ్ సిరీస్లు, ఐసీసీ టోర్నమెంట్లు, ఐపీఎల్, ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రసార హక్కులను కలిగి ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్టు సిరీస్ డిజిటల్ హక్కులను కూడా దక్కించుకుంది. ఇక ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో ఇదే తొలి సిరీస్. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా ఇంగ్లండ్కు పయనం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్తో తలపడనుంది.చదవండి: IPL 2025: 'పంత్ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్ -
IPL 2025: ‘క్వాలిఫయర్-1, ఫైనల్ ఆడే జట్లు ఇవే!’
ఐపీఎల్-2025 (IPL 2025) ముగింపు దశకు వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించగా.. క్వాలిఫయర్-1 కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. లీగ్ దశ ముగిసే సరికి టాప్-2లో ఉన్న జట్లు ఈ పోరుకు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.ఆ రెండు మ్యాచ్ల ఫలితాలతో..సీజన్లో పద్నాలుగు మ్యాచ్లూ పూర్తి చేసుకున్న గుజరాత్.. తొమ్మిది గెలిచి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన మూడు జట్లకు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ మిగిలి ఉండగా.. ఓవరాల్గా సీజన్లో రెండు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ తలపడనుండగా.. మంగళవారం నాటి పోరులో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్తో ఆడుతుంది.ఈ మ్యాచ్ తర్వాత టాప్-2లో నిలిచి క్వాలిఫయర్-1 ఆడే జట్లు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే జట్లు ఏవో తేలుతాయి. ఇక క్వాలిఫయర్-1లో ఓడిపోయిన జట్టు.. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడుతుందన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్-1 విజేత టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి.ఫైనల్ ఆడే జట్లు ఇవేఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా క్వాలిఫయర్-1, ఫైనల్లో తలపడే జట్లపై తన అంచనా తెలియజేశాడు. పంజాబ్ కింగ్స్పై ముంబై, లక్నోపై ఆర్సీబీ గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు ఆక్రమిస్తాయని జోస్యం చెప్పాడు.అదే విధంగా.. ఈ రెండు జట్లే ట్రోఫీ కోసం ఫైనల్లో తలపడతాయని అంచనా వేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ముంబై పంజాబ్పై గెలవాలని పట్టుదలగా ఉంది. వాళ్లు గనుక గెలిస్తే టాప్-2లోకి వస్తారు. ఇది జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఇక ఆర్సీబీ కూడా అంతే. లక్నోపై ఆ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నా అంచనా ప్రకారం ముంబై- ఆర్సీబీ టాప్-2లో నిలుస్తాయి. అదే విధంగా ఈ రెండు జట్లే ఫైనల్లోనూ తలపడతాయి’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.మిగిలిన షెడ్యూల్ ఇలా👉క్వాలిఫయర్-1: మే 29, గురువారం, చండీగఢ్👉ఎలిమినేటర్ మ్యాచ్: మే 30, శుక్రవారం, చండీగఢ్👉క్వాలిఫయర్-2: జూన్ 1, ఆదివారం, అహ్మదాబాద్👉ఫైనల్: జూన్ 3, మంగళవారం, అహ్మదాబాద్.చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది -
'పంత్ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్
ఐపీఎల్-2025 సీజన్ను కోల్కతా నైట్రైడర్స్ ఘోర ఓటమితో ముగించింది. ఆదివారం ఢిల్లీ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 110 పరుగుల తేడాతో కేకేఆర్ పరాజయం చవిచూసింది. ఈ ఏడాది సీజన్ అసాంతం దారుణ ప్రదర్శన కనబరిచిన డిఫెండింగ్ ఛాంపియన్.. వరుస ఓటములతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంలో విఫలమైంది.శ్రేయస్ అయ్యర్ స్ధానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వెటరన్ ఆటగాడు అజింక్య రహానే జట్టును విజయం పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పించినప్పటికి, కెప్టెన్గా మాత్రం రహానే పూర్తిగా తేలిపోయాడు.ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ ఐదింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్ధానంలో నిలిచింది. ఈ క్రమంలో కేకేఆర్ మెనెజ్మెంట్పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. రహానే టాప్-3లో బ్యాటింగ్కు రావడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు."కెప్టెన్ టాప్ త్రీలోనే బ్యాటింగ్ చేయాలని ఎక్కడా రాసిలేదు. పంత్ను చూసి నేర్చుకోండి. అతడు తన ఫామ్లో లేని అని తెలిసి మిగితా ఆటగాళ్లను తనకంటే ముందు బ్యాటింగ్కు పంపుతున్నాడు. ఫామ్లో ఉన్న ఆటగాళ్లు టాపర్డర్లో బ్యాటింగ్కు రావడంతో లక్నో భారీ స్కోర్ సాధించగలుగుతుంది.కేకేఆర్ అలాగే చేసి ఉంటే బాగుండేది. అది టీమ్ మెనెజ్మెంట్, కోచింగ్ స్టాప్ బాధ్యత. నిన్న గుజరాత్తో మ్యాచ్లో కూడా సీఎస్కే అదే పనిచేసింది. ఫామ్లో ఉన్న డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబేలను ముందు బ్యాటింగ్కు పంపారు" అని క్రిక్బజ్ లైవ్ షో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్! -
చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్!
‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి కోపమొచ్చింది. తన ప్రియ శిష్యుడు మతీశ పతిరణ (Matheesha Pathirana) తీరు ‘తలా’కు విసుగుతెప్పించింది. దీంతో ధోని సీరియస్ లుక్ ఇవ్వగానే.. పతిరణ అలెర్ట్ అయిపోయాడు. కెప్టెన్ వ్యూహానికి అనుగుణంగా వ్యవహరించి.. అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో సఫలమయ్యాడు. తద్వారా ‘తలా’ను ప్రసన్నం చేసుకోగలిగాడు. 230 పరుగులుఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్కు సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41) మరోసారి శుభారంభం అందించినా.. మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (13) విఫలమయ్యాడు. జోస్ బట్లర్ (5), షెర్ఫానే రూథర్ఫర్డ్ (0) కూడా నిరాశపరిచారు. ఇలాంటి తరుణంలో సాయి సుదర్శన్తో కలిసి షారుఖ్ ఖాన్ నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు.గుజరాత్ ఇన్నింగ్స్లో శివం దూబే పదో ఓవర్ వేయగా.. తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు రాబట్టిన సాయి సుదర్శన్.. మూడో బంతికి సింగిల్ తీశాడు. ఇక నాలుగో బంతికి షారుఖ్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత షారుఖ్ సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి సుదర్శన్ రెండు పరుగులు తీశాడు. దీంతో దూబే ఓవర్లో మొత్తంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్!అయితే, ఈ ఓవర్లో ధోని ఫీల్డింగ్ సెట్ చేస్తున్న వేళ పతిరణ కాస్త నిర్లక్ష్యంగా కనిపించాడు. దీంతో తన ఆదేశాలను పట్టించుకోకుండా ఉన్న బౌలర్, ఫీల్డర్పై ధోని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇక మరుసటి ఓవర్లో రవీంద్ర జడేజా బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతికే షారుఖ్ను అవుట్ చేశాడు.ఫుల్ వైట్ అవుట్సైడ్ ఆఫ్ దిశగా చేసిన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించిన షారుఖ్ ఖాన్ బంతిని గాల్లోకి లేపగా షార్ట్ థర్డ్మ్యాన్ దిశగా పయనించింది. ఈ క్రమంలో.. పతిరణ క్యాచ్ అందుకునే క్రమంలో తడబడ్డా.. ఎట్టకేలకు విజయవంతంగా పనిపూర్తి చేశాడు. దీంతో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షారుఖ్ ఖాన్ ఇన్నింగ్స్కు తెరపడింది.ఆ తర్వాత వచ్చిన వాళ్లలో రాహుల్ తెవాటియా 14, అర్షద్ ఖాన్ 20 పరుగులు చేశారు. ఈ క్రమంలో 18.3 ఓవర్లలో 147 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయింది. సీఎస్కే 83 పరుగుల తేడాతో గెలిచి.. సీజన్లో నాలుగో విజయం సాధించి గెలుపుతో ముగించింది. ఈ మ్యాచ్లో ధోని సహనం కోల్పోయిన తీరును కామెంటేటర్లు విశ్లేషించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది.కాగా ఈ మ్యాచ్లో ధోని బ్యాటింగ్కు రాలేదు. ఓవరాల్గా ఈ సీజన్లో పదమూడు ఇన్నింగ్స్ ఆడిన ధోని 196 పరుగులు చేశాడు. ఇక సీఎస్కే పద్నాలుగు మ్యాచ్లకు గానూ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసిందిWhen #CaptainCool lost his cool! 🥵A tactical masterclass & an uncanny #MSDhoni's moment - #CSK's last match this season had it all! 💛Watch the LIVE action ➡ https://t.co/XfCrZHriFf #IPLonJioStar 👉 #SRHvKKR | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/wxPM71McJI— Star Sports (@StarSportsIndia) May 25, 2025 -
ఐర్లాండ్ను చిత్తు చేసిన విండీస్.. సిరీస్ సమం
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో 197 పరుగుల తేడాతో(డక్ వర్త్ లూయిస్ పద్దతి) వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.విండీస్ ఇన్నింగ్స్లో ఫస్ట్ డౌన్ బ్యాటర్ కీస్ కార్టీ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 142 బంతులు ఎదుర్కొన్న కార్టీ.. 15 ఫోర్లు, 8 సిక్స్లతో 170 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో కార్టీకి ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. విండీస్ బ్యాటర్లలో కార్టీతో పాటు కెప్టెన్ షాయ్ హోప్(75), జస్టిన్ గ్రీవ్స్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో బారీ మెక్కార్తీ మూడు వికెట్లు పడగొట్టగా.. లైమ్ మెక్కార్తీ రెండు, మెక్బ్రైన్, డకెరల్ తలా వికెట్ సాధించారు.అనంతరం వర్షం కారణంగా 46 ఓవర్లలో ఐర్లాండ్ టార్గెట్ను 363గా నిర్ణయించారు. భారీ లక్ష్య చేధనలో ఐర్లాండ్ 29.5 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కేడ్ కార్మైకేల్(48) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.విండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్ మూడు వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ను దెబ్బతీయగా.. జోషఫ్, గ్రీవ్స్, ఛేజ్ తలా వికెట్ సాధించారు. కాగా తొలి వన్డేలో ఐర్లాండ్ విజయం సాధించగా.. రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఇప్పుడో మూడో వన్డేలో విండీస్ గెలవడంతో సిరీస్ సమమైంది. ఇక ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: #CSK: 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి -
#CSK: 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
ఐపీఎల్-2025 సీజన్లో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్కే.. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాలలో విఫలమై అభిమానులను తీవ్ర నిరాశపరిచింది.తమ చెత్త ఆట తీరుతో మిగితా జట్ల కంటే ముందే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన సీఎస్కే.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి పరిమితమైంది.18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో పదివ స్దానంలో నిలవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా సీఎస్కే ఆఖరి స్దానానికి పరిమితం కాలేదు. ఐదు సార్లు ఛాంపియన్, 9 సార్లు ఫైనల్కు చేరిన చెన్నైకు నిజంగా ఇది ఘోర పరాభావమే అని చెప్పాలి. కాగా ఈ ఏడాది సీజన్ తమ ఆఖరి మ్యాచ్లో మాత్రం సీఎస్కే అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 83 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టి గుజరాత్కు ఊహించని షాక్ ఇచ్చింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 34), ఉర్విల్ పటేల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 37) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం లక్ష్య చేధనలో గుజరాత్.. 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయిసుదర్శన్(41) టాప్ స్కోరర్గా నిలిచాడు. . సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్ను దెబ్బతీయగా.. రవీంద్ర జడేజా రెండు, పతిరానా, ఖాలీల్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: ఇంకా ఫిట్గా ఉన్నాడా?.. అవును.. అయితే, ఎందుకు ఆడట్లేదు? -
ఫిట్గా ఉన్నాడా?.. అవును.. అయితే, ఎందుకు తప్పించుకుంటున్నాడు?
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి ఆడుతున్న తలా.. ఇప్పటికీ క్యాష్ రిచ్ లీగ్లో కొనసాగుతున్నాడు. కెప్టెన్గా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఐదుసార్లు టైటిల్ అందించిన ఈ దిగ్గజ సారథి.. 43 ఏళ్ల వయసులో మరోసారి పగ్గాలు చేపట్టాడు. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో ఐదు మ్యాచ్లు ముగిసిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ గాయం వల్ల దూరం కాగా.. తలా మరోసారి సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. అయితే, ఈసారి సీఎస్కే చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో తొలిసారి అట్టడుగున (పద్నాలుగు నాలుగే విజయాలు) పదో స్థానంలో నిలిచింది. అయితే, లీగ్ దశలో ఆఖరిదైన ఆదివారం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ఘన విజయం సాధించి సీజన్ను ముగించడం చెన్నై అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది.The 5⃣-time champs sign off from #TATAIPL 2025 with a convincing win 💛#CSK register a HUGE 83-run win over #GT 👏Updates ▶ https://t.co/P6Px72jm7j#GTvCSK | @ChennaiIPL pic.twitter.com/ey9uNT3IqP— IndianPremierLeague (@IPL) May 25, 2025 ఇక ఈ మ్యాచ్ ముందు నుంచే మరోసారి 43 ధోని రిటైర్మెంట్పై చర్చోపర్చలు జరిగాయి. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, ఆర్పీ సింగ్- ఆకాశ్ చోప్రా, సంజయ్ బంగర్ మధ్య వాడివేడి చర్చ జరిగింది.స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా ఈ కామెంటేటర్లు ధోని భవితవ్యంపై సంభాషణ సాగించారు. రైనా, ఆర్పీ సింగ్ తలా ఇంకొన్నాళ్లు కొనసాగాలని పేర్కొంటే.. ఆకాశ్ చోప్రా, సంజయ్ బంగర్ మాత్రం ధోని లోయర్ ఆర్డర్లో రావడాన్ని తప్పు బడుతూ ఇక అతడు తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి చర్చ సాగిందిలా..ఆకాశ్ చోప్రా: ఒకవేళ ఎంఎస్ ధోని ‘అన్క్యాప్డ్’ (ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైన్ అయిన తర్వాత ఇలా ఐపీఎల్లో అందుబాటులో ఉండవచ్చు)ప్లేయర్ కాకపోయి ఉంటే.. ఈసారి కూడా సీఎస్కే జట్టుతో కొనసాగేవాడా?సురేశ్ రైనా: కచ్చితంగా.. పద్దెమినదేళ్లుగా అతడు జట్టుతో ఉన్నాడు. ఇంకా ఫిట్గా ఉన్నాడు. ఇప్పటికీ అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో కొనసాగుతున్నాడు.ఆకాశ్ చోప్రా: మరి అతడు 7, 8, 9 స్థానాల్లో ఎందుకు బ్యాటింగ్కు వస్తున్నాడు. బ్యాటింగ్ పరంగా జట్టు చిక్కుల్లో పడిన వేళ.. కష్టాలు చుట్టుముట్టిన సమయంలోనూ టాపార్డర్లో ఆడవచ్చు కదా? అంతటి అనుభవం ఉన్న ఆటగాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? అసలు అతడు నిజంగానే ఫిట్గా ఉన్నాడా?సురేశ్ రైనా: ఆఖరి నాలుగు ఓవర్లలో ఆడటం ఎంఎస్కు సౌకర్యవంతంగా ఉంటుంది. అతడు ఫిట్గానే ఉన్నాడు. 44 ఏళ్లకు చేరువైనా.. ఇంకా వికెట్ కీపర్గా సేవలు అందిస్తున్నాడు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇంటర్వ్యూలో రానున్న టీ20 ప్రపంచకప్ జట్టు గురించి మాట్లాడాడు. శివం దూబే వంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు తనిలా చేస్తుండవచ్చు కదా!ఆర్పీ సింగ్: మోకాలి సర్జరీ తర్వాత ధోని కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. 20 ఏళ్లుగా కీపింగ్ చేస్తున్నాడు. కచ్చితంగా బ్యాటర్గానూ మరోసారి సత్తా చాటగలడు.ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్పై 83 పరుగుల తేడాతో గెలుపొందిన తర్వాత ధోని మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఆట ముగిసిపోయిందని చెప్పలేనని.. అదే విధంగా ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ విషయంలో నిర్ణయానికి ఇంకా సమయం ఉందని ధోని తెలిపాడు. కాగా ఈ సీజన్లో ధోని 14 మ్యాచ్లలో కలిపి 196 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసిందిThings get a little heated in the studio during #TheBigDebate! 🔥What's your take on #CaptainCool's batting position this season? 💬Watch him #OneLastTime 👉 GTvCSK | SUN, 25th MAY, 2:30 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/uUWwUqK69I— Star Sports (@StarSportsIndia) May 25, 2025 -
చరిత్ర సృష్టించిన క్లాసెన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా..
కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆద్యంతం ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ పొట్టి క్రికెట్లోని అసలైన మజా అందించాడు.కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్.. క్యాష్ రిచ్ లీగ్లో వేగవంతమైన శతకం (Fastest Century) బాదిన మూడో క్రికెటర్గా యూసఫ్ పఠాన్ రికార్డును సమం చేశాడు. ఇక కేకేఆర్తో మ్యాచ్లో మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న ఈ సౌతాఫ్రికా స్టార్ ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా..ఈ క్రమంలో క్లాసెన్ సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్ట్రైక్రేటు (269.23)తో సెంచరీ బాదిన తొలి విదేశీ క్రికెటర్, ఓవరాల్గా రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్ అతడి కంటే ముందున్నాడు. ఇలా కేకేఆర్తో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా క్లాసెన్ రెండు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఓవరాల్గా క్లాసెన్కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ.110 పరుగుల తేడాతో జయభేరి అంతేకాదు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గానూ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే... ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో సన్రైజర్స్ కేకేఆర్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కమిన్స్ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 278 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32), ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 76) శుభారంభం అందించగా.. క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. మిగతా వాళ్లలో ఇషాన్ కిషన్ 29, అనికేత్ వర్మ 12(నాటౌట్) పరుగులు చేశారు.ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్ 18.4 ఓవర్లలో కేవలం 168 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా సన్రైజర్స్ 110 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ సీజన్ను విజయంతో ముగించింది. రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్ (3/24), ఇషాన్ మలింగ (3/31), హర్ష్ దూబే (3/34) మూడేసి వికెట్లతో అద్భుతంగా రాణించారు.హెన్రిచ్ క్లాసెన్ సాధించిన రికార్డులుఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ వీరుల జాబితాలో చోటు1. క్రిస్ గేల్- 30 బంతుల్లో శతకం2. వైభవ్ సూర్యవంశీ- 35 బంతుల్లో శతకం3. యూసఫ్ పఠాన్- 37 బంతుల్లో శతకం4. హెన్రిచ్ క్లాసెన్- 37 బంతుల్లో శతకం5. డేవిడ్ మిల్లర్- 38 బంతుల్లో శతకంఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్రేటుతో వందకు పైగా పరుగులు సాధించింది వీరే1. యూసఫ్ పఠాన్- రాజస్తాన్ రాయల్స్ తరఫున 2010లో ముంబై ఇండియన్స్పై 270.27 స్ట్రైక్రేటుతో 100 రన్స్2. హెన్రిచ్ క్లాసెన్- సన్రైజర్స్ తరఫున 2025లో కోల్కతా నైట్ రైడర్స్పై 169.23 స్ట్రైక్రేటుతో 105 రన్స్ (నాటౌట్)3. డేవిడ్ మిల్లర్- పంజాబ్ కింగ్స్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) తరఫున 2013లో ఆర్సీబీపై 265.78 స్ట్రైక్రేటుతో 101 రన్స్ (నాటౌట్)4. వైభవ్ సూర్యవంశీ- రాజస్తాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్పై 2025లో 265.78 స్ట్రైక్రేటుతో 1015. క్రిస్ గేల్- ఆర్సీబీ తరఫున 2013లో పుణె వారియర్స్పై 265.14 స్ట్రైక్రేటుతో 175 రన్స్ (నాటౌట్).చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసిందిSky is not the limit when he's batting! 🫡🎥 Glimpse of the 𝙃𝙚𝙞𝙣𝙧𝙞𝙘𝙝 𝙆𝙡𝙖𝙖𝙨𝙚𝙣 𝙨𝙝𝙤𝙬 en route his mind-blowing 105*(39) 🚀Scorecard ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/WaOSR90wrg— IndianPremierLeague (@IPL) May 25, 2025 -
అందుకే సర్ఫరాజ్పై వేటు!.. రీఎంట్రీకి అతడు అర్హుడు: పుజారా
ఐపీఎల్-2025 తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటన (India vs England)తో బిజీకానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి సిరీస్ జరుగునుంది. ఇందుకు సంబంధించి శనివారమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించింది.వారికి గ్రీన్ సిగ్నల్పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన బృందానికి యువ ఆటగాడు శుబ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించింది. ఇంగ్లండ్తో టెస్టులతో సారథిగా అతడి ప్రయాణం మొదలుకానుంది. ఇక ఈ జట్టులో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ చోటు దక్కించుకోగా.. అర్ష్దీప్ సింగ్ కూడా తొలిసారి టెస్టు టీమ్లోకి వచ్చాడు. కరుణ్ రీ ఎంట్రీచాలా ఏళ్ల తర్వాత ‘ట్రిపుల్ సెంచూరియన్’ కరుణ్ నాయర్కు కూడా అవకాశం దక్కింది. మరోవైపు.. శార్దూల్ ఠాకూర్ కూడా పునరాగమనం చేశాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్కు మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్తో టెస్టులు ఆడే జట్టులో చోటివ్వలేదు. ఈ పరిణామాలపై టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా స్పందించాడు. అందుకే సర్ఫరాజ్పై వేటు!‘‘ఆసియా, ఉపఖండ పిచ్లపై సర్ఫరాజ్ ఖాన్ విజయవంతమైన ఆటగాడిగా ఉన్నాడు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో అతడు రాణించలేడని సెలక్టర్లు భావించి ఉండవచ్చు. అందుకే.. అతడికి ఈ జట్టులో చోటు ఇవ్వలేదనుకుంటా. అంతేకాదు.. అతడికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం సర్ఫరాజ్ ఫిట్నెస్ గురించి నాకైతే సమాచారం లేదు. ఫిట్గా ఉండేందుకు అతడు అన్ని రకాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాడని మాత్రం తెలుసు.రీఎంట్రీకి అతడు అర్హుడుఏదేమైనా దురదృష్టవశాత్తూ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, కరుణ్ నాయర్ ఎంపిక పట్ల సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్న అతడు జట్టులో చోటుకు అర్హుడు’’ అని పుజారా హిందుస్తాన్ టైమ్స్తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ టెస్టు సిరీస్కు సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా అడే అవకాశం రాలేదు.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా దేశవాళీ క్రికెట్తో పాటు కౌంటీల్లోనూ రాణిస్తున్న పుజారా సైతం టెస్టు జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, అతడి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.చదవండి: కోపంతో ఊగిపోయిన సిరాజ్.. ఇదేంటి మియా?.. అతడి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? -
ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది: కమిన్స్
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్ను అద్భుత విజయంతో ముగించామని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు విధ్వంసకర ఆటతో విరుచుకుపడుతుంటే తనకు కూడా కాస్త భయం వేసిందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తమ జట్టులో అద్బుత ఆటగాళ్లు ఉన్నారని.. ఫైనల్ చేరే సత్తా ఉన్నా ఈసారి ఆ పని చేయలేకపోయామని పేర్కొన్నాడు.రేసు నుంచి నిష్క్రమించిన తర్వాతకాగా గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్.. ఈసారి మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. తొలి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్పై వీరబాదుడు మినహా ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత మాత్రం కమిన్స్ బృందం వింటేజ్ బ్యాటింగ్తో రెచ్చిపోయింది.ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో గెలిచిన రైజర్స్.. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో రహానే సేనపై 110 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32) రాణించగా.. ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 76) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.𝙃𝙚𝙖𝙙𝙞𝙣𝙜 towards a 𝙆𝙡𝙖𝙨𝙨𝙮 show 🍿#SRH cruising along at the moment ⛵Updates ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/AMKTayK7PS— IndianPremierLeague (@IPL) May 25, 2025క్లాసెన్కు పూనకాలు ఇక హెన్రిచ్ క్లాసెన్ పూనకం వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 37 బంతుల్లో శతక్కొట్టిన క్లాసెన్.. ఐపీఎల్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 9 సిక్స్ల సాయంతో 105 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది సన్రైజర్స్.Sky is not the limit when he's batting! 🫡🎥 Glimpse of the 𝙃𝙚𝙞𝙣𝙧𝙞𝙘𝙝 𝙆𝙡𝙖𝙖𝙨𝙚𝙣 𝙨𝙝𝙤𝙬 en route his mind-blowing 105*(39) 🚀Scorecard ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/WaOSR90wrg— IndianPremierLeague (@IPL) May 25, 2025లక్ష్య ఛేదనలో కేకేఆర్ను 18.4 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది. సన్రైజర్స్ బౌలర్ల విజృంభణతో రహానే సేన 168 పరుగులకే కుప్పకూలింది. ఇలా సమిష్టి ప్రదర్శనతో జట్టు రాణించడం పట్ల రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు.‘‘అద్భుతమైన ముగింపు. ఈ సీజన్లో గత కొన్ని మ్యాచ్లలో మేము సూపర్గా ఆడాము. మా వాళ్ల బ్యాటింగ్ భయంకరంగానే ఉందని చెప్పవచ్చు (నవ్వులు). మా ఆటగాళ్ల సమర్థత దృష్ట్యా నిజానికి ఈ సీజన్లో కొన్ని మ్యాచ్లు ఇంత చెత్తగా ఆడాల్సింది కాదు.ఫైనల్ చేరాల్సిన జట్టుఫైనల్కు చేర్చగల సత్తా ఉన్న ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. కానీ ఈసారి మేము ఫైనల్ చేరలేకపోయాం. ఢిల్లీ వికెట్ మీద మా వాళ్లు అదరగొట్టారు. ఈసారి మా జట్టు బాగానే ఉంది. అయితే, కొంత మంది గాయాల వల్ల స్వదేశానికి వెళ్లిపోయారు. జట్టులోని 20 మంది ఆటగాళ్ల సేవలను మేము ఉపయోగించుకున్నాము’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2025లో సన్రైజర్స్ పద్నాలుగింట ఆరు గెలిచి.. ఏడు ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది. ఈ క్రమంలో 13 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో ఆరోస్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ తమ ఆఖరి మ్యాచ్లో గెలిస్తే గనుక ఏడో స్థానానికి పడిపోతుంది.చదవండి: IPL: రిటైర్మెంట్పై ధోని కీలక వ్యాఖ్యలు -
కోపంతో ఊగిపోయిన సిరాజ్.. ఇదేంటి మియా?.. ఇలాగేనా ప్రవర్తించేది?
గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు కోపమొచ్చింది. సహచర ఆటగాడిపై మైదానంలోనే అతడు కోపంతో ఊగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. విషయమేమిటంటే..చేదు అనుభవంఐపీఎల్-2025 (IPL 2025) లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో శుబ్మన్ సేన 83 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగాలంటే మిగిలిన మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ ఆది నుంచే గుజరాత్కు కలిసిరాలేదు. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బ్యాటింగ్కు దిగి.. 230 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34), డెవాన్ కాన్వే (35 బంతుల్లో 52) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37) దానిని కొనసాగించాడు.The word 'fear' isn't in their dictionary 🔥#CSK's young guns Ayush Mhatre and Urvil Patel added to the Ahmedabad heat with their knocks 👏Updates ▶ https://t.co/P6Px72jm7j#TATAIPL | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/KcM4XW9peg— IndianPremierLeague (@IPL) May 25, 2025 ఇక శివం దూబే (8 బంతుల్లో 17) కాసేపు మెరుపులు మెరిపించగా.. డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57) ధనాధన్ దంచికొట్టాడు. రవీంద్ర జడేజా (18 బంతుల్లో 21 నాటౌట్) కూడా ఈసారి ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.అదనపు పరుగులుకాగా సీఎస్కే ఇన్నింగ్స్లో ఐదో ఓవర్ను సిరాజ్ వేశాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న ఉర్విల్ పటేల్.. మిడాఫ్ దిశగా బాల్ను తరలించాడు. కాన్వేతో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్నాడు. అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ డైరెక్ట్ త్రో ద్వారా వికెట్లను గిరాటేయాలని చూడగా.. మిస్ ఫీల్డ్ అయింది. ఓవర్ త్రో కారణంగా చెన్నై మరో పరుగు తీయగలిగింది.ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గిల్ వేసిన ఓవర్ త్రోను అందుకునేందుకు స్క్వేర్ లెగ్ వద్ద నుంచి పరిగెత్తుకు వచ్చిన ఆర్. సాయి కిషోర్ బంతిని అందుకుని మిడ్ వికెట్ వద్ద కలెక్ట్ చేసుకున్నాడు. అనుకోకుండా బంతి అతడి నుంచి చేజారగా.. ఇంతలో సీఎస్కే బ్యాటర్లు మూడో పరుగు కూడా పూర్తి చేసుకున్నారు.ఇదేంటి మియా? ఇలాగేనా ప్రవర్తించేది?దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ కిషోర్ను ఉద్దేశించి గట్టిగానే తిట్టినట్లు కనిపించింది. అంతేకాదు.. బంతిని కూడా గ్రౌండ్కేసి కొడుతూ తన ఆగ్రహం వెళ్లగక్కాడు. ఇంతలో గిల్ వచ్చి సిరాజ్ భుజం తడుతూ నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘ఇదేంటి మియాన్’’ అంటూ ఇలాగేనా ప్రవర్తించేది? అన్నట్లుగా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కాగా లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన గుజరాత్... 18.3 ఓవర్లలో కేవలం 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది. చదవండి: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాpic.twitter.com/8UKU1ibO6o— The Game Changer (@TheGame_26) May 25, 2025 -
సబలెంకా సులువుగా...
ఎర్రమట్టి కోర్టులపై తన ఆధిపత్యం నిరూపించునే దిశగా బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా అడుగు వేసింది. తనకు అంతగా కలిసిరాని ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్ సబలెంకా శుభారంభం చేసింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ఆమె తొలి మ్యాచ్లో దుమ్మురేపింది. రష్యా ప్లేయర్ కమిల్లా రఖిమోవాతో జరిగిన పోరులో సబలెంకా కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి విజయాన్ని ఖరారు చేసుకుంది. వరుసగా ఎనిమిదో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో ఆడుతున్న సబలెంకా గత ఏడాది సెమీఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ (2 ఆస్ట్రేలియన్ ఓపెన్, 1 యూఎస్ ఓపెన్) సాధించిన సబలెంకా స్థాయికి తగ్గట్టు ఆడితే ఫ్రెంచ్ ఓపెన్లో అద్భుతం సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్లో తొలి రోజు ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. మహిళల సింగిల్స్లో ఫేవరెట్స్లో ఒకరైన నంబర్వన్ సబలెంకా గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో సబలెంకా 6–1, 6–0తో ప్రపంచ 86వ ర్యాంకర్ కమిల్లా రఖిమోవా (రష్యా)పై అలవోకగా గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఐదు ఏస్లు సంధించిన సబలెంకా ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోని ఆమె ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. 30 విన్నర్స్ కొట్టిన సబలెంకా 17 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు ఎనిమిదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), 13వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 11వ సీడ్ డయానా ష్నైడర్ (రష్యా) కూడా తొలి రౌండ్లో విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో కిన్వెన్ జెంగ్ 6–4, 6–3తో పావ్లీచెంకోవా (రష్యా)పై, స్వితోలినా 6–1, 6–1తో జెనిప్ సోన్మెజ్ (తుర్కియే)పై, డయానా 7–6 (7/3), 6–2తో క్వాలిఫయర్ సొబోలియెవా (ఉక్రెయిన్)పై గెలిచారు. ముసెట్టి ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ ముసెట్టి (ఇటలీ), 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా), 15వ సీడ్ టియాఫో(అమెరికా) శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో ముసెట్టి 7–5, 6–2, 6–0తో హాన్్ఫమన్ (జర్మనీ)పై, టామీ పాల్ 6–7 (3/7), 6–2, 6–3, 6–1తో ఎల్మెర్ మోలెర్ (డెన్మార్క్)పై, టియాఫో 6–4, 7–5, 6–4తో సఫిలిన్ (రష్యా)పై విజయం సాధించారు. నాదల్కు సన్మానం రికార్డుస్థాయిలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను 14 సార్లు గెలిచిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్కు ఆదివారం నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే హాజరై నాదల్తో ఫొటోలు దిగారు. గత ఏడాది ఆటకు గుడ్బై చెప్పిన నాదల్ తన కెరీర్లో మొత్తం 22 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. -
Shubman Gill: ‘గొప్ప గౌరవం... పెద్ద బాధ్యత’
ముంబై: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో విదేశీ గడ్డపై అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మినహా మన జట్టు రికార్డు పేలవంగానే ఉంది. సహజంగానే సిరీస్లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు కెప్టెన్సీపై కూడా అందరి దృష్టీ ఉంటుంది. ఇప్పుడు టీమిండియా టెస్టు కెప్టెన్ హోదాలో శుబ్మన్ గిల్ ఇంగ్లండ్తో సిరీస్లో తొలిసారి బరిలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో సారథిగా తనపై అనవసరపు ఒత్తిడిని పెంచుకోనని గిల్ స్పష్టం చేశాడు. కెపె్టన్గా ఎంపికైన తర్వాత అతను బీసీసీఐ మీడియాతో తన స్పందనను పంచుకున్నాడు. బ్యాటర్గా కూడా తన బాధ్యత నెరవేర్చడం ముఖ్యమని అతను అన్నాడు. ‘ఒక విషయంలో నేను చాలా స్పష్టంగా ఉండదల్చుకున్నాను. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను బ్యాటర్గానే ఆలోచిస్తాను. అదే కోణంలో నిర్ణయాలు తీసుకుంటాను తప్ప కెప్టెన్ హోదా గురించి పట్టించుకోను. బ్యాటింగ్ చేస్తూ కూడా ఇతర అంశాలపై దృష్టి పెడితే సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. అది అవసరం లేదు. నేను కెప్టెన్ను అనే భావనే రాకుండా నా బ్యాటింగ్తో ఏం చేయగలననేది ముఖ్యం’ అని గిల్ వ్యాఖ్యానించాడు. భారత కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్న గిల్... అదో పెద్ద బాధ్యత అని అభిప్రాయపడ్డాడు. ‘చిన్నప్పుడు క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు భారత్కు ఆడితే చాలనుకుంటాం. ఆ తర్వాత ఎక్కువ కాలం టెస్టులు ఆడితే బాగుంటుందని భావిస్తాం. అలాంటిది ఇప్పుడు కెప్టెన్ కావడం గొప్ప గౌరవం. ఇంత పెద్ద బాధ్యత నాకు దక్కిన గొప్ప అవకాశం. ఇంగ్లండ్తో సిరీస్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని గిల్ భావోద్వేగం ప్రదర్శించాడు.ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడంతో పాటు ఏ సమయంలో కెప్టెన్ అవసరం జట్టుకు ఉంటుందని గుర్తించడం కూడా కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవలే టెస్టుల నుంచి రిటైర్ అయిన కోహ్లి, రోహిత్, అశ్విన్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని... విదేశాల్లో ఎలా గెలవాలో వారు చూపించారని కొత్త కెప్టెన్ అన్నాడు. ‘రోహిత్, విరాట్, అశ్విన్ విదేశాల్లో టెస్టులు, సిరీస్లు ఎలా గెలవాలనే విషయంలో ఒక ‘బ్రూప్రింట్’ను అందించారు. దీనిని అమలు చేయగలగాలి. విరాట్, రోహిత్ల నాయకత్వంలో ఆడటం నా అదృష్టం. బయటకు కనిపించడంలో ఇద్దరి శైలి భిన్నమే అయినా...మైదానంలో అటాకింగ్ చేసే విషయంలో ఇద్దరూ దూకుడుగానే ఉంటారు. ఎప్పటికిప్పుడు మాట్లాడుతూ ఆటగాళ్లనుంచి తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పే రోహిత్ కెప్టెన్సీ పద్ధతిని నేను నేర్చుకున్నాను’ అని గిల్ వివరించాడు. -
MI Vs PBKS: ముంబై X పంజాబ్
జైపూర్: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే లక్ష్యంగా... సోమవారం పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ పోరుకు సిద్ధమైంది. లీగ్ దశలో 13 మ్యాచ్లు ఆడిన ముంబై 8 విజయాలు, 5 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానంలో ఉండగా... పంజాబ్ 13 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో రెండో ‘ప్లేస్’లో కొనసాగుతోంది. టాప్–2లో నిలిచిన జట్లకు ఫైనల్కు చేరేందుకు మరో అదనపు అవకాశం ఉండటంతో... ఇరు జట్లు దానిపైనే దృష్టి సారించాయి. సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై జట్టు... ఆ తర్వాత వరుస విజయాలతో విజృంభిస్తుంటే... పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు స్టార్ ఆటగాళ్లతో నిండి ఉంటే... శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్పై ఎక్కువ ఆధారపడుతోంది. చిన్న బౌండరీల మైదానంలో భారీ స్కోర్లు నమోదవడం ఖాయం కాగా... ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న బుమ్రా ఫామ్లో ఉండటంతో ముంబైకి కాస్త మొగ్గు ఉంది. సూర్యకుమార్ యాదవ్ 583 పరుగులతో ఫుల్ ఫామ్లో ఉండగా... రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్ మంచి టచ్లో ఉన్నారు. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ... ధాటిగా ఆడలేక ఇబ్బంది పడుతుండగా... హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ భారీ షాట్లతో జట్టుకు ఉపయుక్తకరమైన పరుగులు అందిస్తున్నారు. బౌలింగ్లో బుమ్రా, బౌల్ట్, దీపక్ చాహర్, సాంట్నర్ కీలకం కానున్నారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో 488 పరుగులు చేయగా... ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (486), ప్రియాన్‡్ష ఆర్య (362) దూకుడు మీదున్నారు. ఈ జంట మెరుగైన ఆరంభాలు అందిస్తుండటంతోనే ఆ జట్టు నిలకడ కొనసాగించగలుగుతోంది. జోష్ ఇన్గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, స్టొయినిస్తో పంజాబ్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్లో టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... చివర్లో స్టొయినిస్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగలిగింది. ఇలాగే ప్రతి మ్యాచ్లో ఒకరు విఫలమైనా మరొకరు బాధ్యత తీసుకుంటుండటం పంజాబ్ కింగ్స్కు కలిసి వస్తోంది. బ్యాటింగ్లో ముంబైకి దీటుగా ఉన్న పంజాబ్... బౌలింగ్లో మాత్రం కాస్త వెనుకబడ్డట్లు కనిపిస్తోంది. అర్‡్షదీప్ సింగ్, మార్కో యాన్సెన్పై అధిక భారం పడుతోంది. మరి కీలక పోరులో ముంబై విజయం సాధించి ముందంజ వేస్తుందా... లేక పంజాబ్ ప్రతాపం కనబరుస్తుందా చూడాలి! -
స్వప్నం సాకారం
మోంటెకార్లో: టెన్నిస్లో ‘వింబుల్డన్’... బ్యాడ్మింటన్లో ‘ఆల్ ఇంగ్లండ్’... ఫార్ములావన్లో ‘మొనాకో’ గ్రాండ్ప్రి... ఆయా క్రీడాంశాల్లోని క్రీడాకారులు పై మూడింటిలో గెలిస్తే ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగాభావిస్తారు. బ్రిటన్ రేసింగ్ డ్రైవర్ లాండో నోరిస్ ఆదివారం మొనాకో వీధుల్లో తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మొనాకో గ్రాండ్ప్రిలో నోరిస్ విజేతగా అవతరించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లాండో నోరిస్ నిర్ణీత 78 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే వేగంగా 1 గంట 40 నిమిషాల 33.843 సెకన్లలో ముగించి టైటిల్ సాధించాడు. ‘ఎంతో గొప్పగా అనిపిస్తోంది. ఏనాటికైనా మొనాకో గ్రాండ్ప్రిలో విజేతగా నిలవాలని చిన్ననాటి నుంచి కలలు కన్నాను. ఇప్పుడు నా స్వప్నం సాకారమైంది’ అని ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్న నోరిస్ వ్యాఖ్యానించాడు. మొనాకో గ్రాండ్ప్రి మొత్తం వీధుల్లోనే జరుగుతుంది కాబట్టి నిర్వాహకులు ఈ రేసులో ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టారు. ఈసారి డ్రైవర్లందరూ కచ్చితంగా రెండుసార్లు పిట్ స్టాప్లోకి వెళ్లి టైర్లు మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన నోరిస్ 20వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత 20వ ల్యాప్లో నోరిస్ పిట్ స్టాప్లోకి వెళ్లడంతో రెడ్బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ ఆధిక్యంలోకి వచ్చాడు. వెర్స్టాపెన్ 29వ ల్యాప్లో తొలిసారి పిట్ స్టాప్లోకి వెళ్లాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ 77వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నా రెండోసారి పిట్ స్టాప్లోకి వెళ్లలేదు. 77వ ల్యాప్లో వెర్స్టాపెన్ పిట్ స్టాప్లోకి ప్రవేశించగా... ఇదే అదనుగా నోరిస్ దూసుకుపోయి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి చివరి ల్యాప్ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ రెండో స్థానంలో, ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్) మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతోసరిపెట్టుకున్నాడు. మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్కు ఐదో స్థానం దక్కింది. ఇద్దరు డ్రైవర్లు ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మార్టిన్), పియరీ గ్యాస్లీ (అల్పైన్) రేసును పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుత సీజన్లో ఎనిమిది రేసులు ముగిశాయి. ఆరింటిలో మెక్లారెన్ డ్రైవర్లు, రెండింటిలో రెడ్బుల్ డ్రైవర్లు విజేతలుగా నిలిచారు. డ్రైవర్స్ చాంపియన్షిప్లో 161 పాయింట్లతో ఆస్కార్ పియాస్ట్రి తొలి స్థానంలో, 158 పాయింట్లతో లాండో నోరిస్ రెండో స్థానంలో, 136 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు స్పానిష్ గ్రాండ్ప్రి జూన్ 1న జరుగుతుంది. -
రన్నరప్ శ్రీకాంత్
కౌలాలంపూర్: కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ రన్నరప్గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 11–21, 9–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ అడపాదడపా మెరిపించినా చివరకు చైనా ప్లేయర్దే పైచేయి అయింది. రన్నరప్గా నిలిచిన శ్రీకాంత్కు 18,050 డాలర్ల (రూ. 15 లక్షల 35 వేలు) ప్రైజ్మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘మళ్లీ పోడియంపైకి వచ్చి పతకం అందుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఫైనల్ ఫలితం నిరాశపరిచినా, ఓవరాల్గా ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా’ అని 32 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయాడు. 2019లో ఇండియా ఓపెన్లో, 2021 ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్ చేరిన శ్రీకాంత్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. -
ఆఖర్లో అదరహో
‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్ మ్యాచ్ల్లో దంచికొట్టాయి. గుజరాత్ టైటాన్స్తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్కతా నైట్రైడర్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్ను ముగించాయి. గుజరాత్తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో విజృంభిస్తే... నైట్ రైడర్స్ బౌలర్లను క్లాసెన్, హెడ్ చీల్చి చెండాడారు. సీజన్ ఆరంభ పోరులో రాజస్తాన్ రాయల్స్పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్ శర్మ, హెడ్ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్గా మారిన సన్రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. మొదట సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్కతా నైట్రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ తొలి ఓవర్లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్... ఫోర్లు, సిక్స్లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్లో హెడ్ సిక్స్తో ఖాతా తెరవగా... అభిషేక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో 6, 4, 2, 6 బాదిన హెడ్... నాలుగో ఓవర్లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్లో అభిషేక్ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్ప్లే ముగిసేసరికి రైజర్స్ 79 పరుగులు చేసింది. నరైన్ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన అభిషేక్... మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ కాగా... క్లాసెన్ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్ బౌలర్తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్ ఓవర్లో 4, 6, ,6తో క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్సెంచరీ అందుకున్నాడు. హెడ్ను ఔట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్ కిషన్ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన క్లాసెన్... వరుణ్కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్ ఓవర్లో 6, 4 కొట్టిన క్లాసెన్... అరోరా బౌలింగ్లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రింకూ (బి) నరైన్ 32; హెడ్ (సి) రసెల్ (బి) నరైన్ 76; క్లాసెన్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) నోర్జే (బి) వైభవ్ 29; అనికేత్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్ రాణా 3–0–40–0; నరైన్ 4–0–42–2; వరుణ్ చక్రవర్తి 3–0–54–0; రసెల్ 2–0–34–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) మనోహర్ (బి) మలింగ 9; నరైన్ (బి) ఉనాద్కట్ 31; రహానే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 15; రఘువంశీ (సి) నితీశ్ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్ (బి) హర్ష్ దూబే 9; రసెల్ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్ పాండే (సి) మనోహర్ (బి) ఉనాద్కట్ 37; రమణ్దీప్ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్ (సి అండ్ బి) మలింగ 34; వైభవ్ అరోరా (రనౌట్) 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్: కమిన్స్ 2–0–25–0; ఉనాద్కట్ 4–0–24–3; హర్షల్ 2–0–21–0; ఇషాన్ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్ రెడ్డి 1–0–6–0; అభిషేక్ 2–0–25–0. 278/3 ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్రైజర్స్ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్లో రాజస్తాన్పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్ గేల్ (30 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్లో 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. అర్షద్ ఖాన్ వెసిన రెండో ఓవర్లో ఆయుశ్ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్తో ధోని ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్ 34; కాన్వే 52; ఉర్విల్ 37; బ్రెవిస్ 57, ప్రసిధ్ కృష్ణ 2/22) గుజరాత్ టైటాన్స్: 147 ఆలౌట్ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్ 41; అర్షద్ ఖాన్ 20, అన్షుల్ కంబోజ్ 3/13, నూర్ అహ్మద్ 3/21, జడేజా 2/17).ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో