LSG VS RCB: అబ్బురపరిచే ఇన్నింగ్స్‌.. ధోని రికార్డు బద్దలు కొట్టిన జితేశ్ | IPL 2025: Jitesh Sharma Shatters MS Dhoni 7 Year Old Record After RCB Heroic Run Chase Vs LSG | Sakshi
Sakshi News home page

LSG VS RCB: అబ్బురపరిచే ఇన్నింగ్స్‌.. ధోని రికార్డు బద్దలు కొట్టిన జితేశ్

May 28 2025 3:22 PM | Updated on May 28 2025 4:07 PM

IPL 2025: Jitesh Sharma Shatters MS Dhoni 7 Year Old Record After RCB Heroic Run Chase Vs LSG

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మే 27) జరిగిన ఉత్కంఠ సమరంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీని తాత్కాలిక కెప్టెన్‌ జితేశ్‌ శర్మ ఒంటిచేత్తో గెలిపించాడు. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జితేశ్‌ హీరోయిక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.

ఈ ఇన్నింగ్స్‌తో జితేశ్‌ ధోని పేరిట ఏడేళ్లు కొనసాగిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. విజయవంతమైన ఛేదనల్లో 6 అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2018 సీజన్‌లో ధోని ఆర్సీబీపై 34 బంతుల్లో అజేయమైన 70 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆర్సీబీపై విజయం సాధించింది.

విజయవంతమైన ఛేదనల్లో 6 అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాళ్లు..

85*(33) - జితేష్ శర్మ (RCB) vs LSG, లక్నో, 2025 
70* (34) - MS ధోని (CSK) vs RCB, బెంగళూరు, 2018 
70*(31) - ఆండ్రీ రస్సెల్ (KKR) vs PBKS, ముంబై WS, 2022 
70(47) - కీరన్ పొలార్డ్ (MI) vs RCB, బెంగళూరు, 2017 
68(30) - డ్వేన్ బ్రావో (CSK) vs MI, ముంబై WS, 2018

లక్నో, ఆర్సీబీ మ్యాచ్‌ పూర్తి వివరాలు..
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. రిషబ్‌ పంత్‌ (61 బంతుల్లో 118 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, మిచెల్‌ మార్ష్‌ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే (4 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. జితేశ్‌ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్‌ ఆడి ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. అతనికి మయాంక్‌ అగర్వాల్‌ (23 బంతుల్లో 41 నాటౌట్‌; 5 ఫోర్లు) సహకరించాడు.

అంతకుముందు విరాట్‌ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్‌ సాల్ట్‌ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు.

ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్‌ సెకెండ్‌ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్‌-1 బెర్త్‌ ఖరారు చేసుకుంది. మే 29న జరిగే క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ.. పంజాబ్‌తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌, ముంబై ఇండియన్స్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement