
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 30) రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది. నిన్న (మే 29) జరిగిన తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ పంజాబ్పై విజయం సాధించి, నేరుగా ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే.
కాగా, నేడు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్కే కాదు ప్లే ఆఫ్స్లో ఏ మ్యాచ్కూ రిజర్వ్ డే లేదు. ఏదైనా కారణం చేత నేడు జరగాల్సిన గుజరాత్, ముంబై మ్యాచ్ రద్దైతే.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం చేత (గుజరాత్ మూడో స్థానంలో ఉంటే, ముంబై నాలుగో స్థానంలో ఉంది) గుజరాత్ క్వాలిఫయర్-2కు చేరుతుంది. అప్పుడు ముంబై ఇండియన్స్ ఇంటిముఖం పడుతుంది. కాబట్టి నేటి మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాకూడదని ముంబై ఇండియన్స్ కోరుకుంటుంది.
వాస్తవానికి నేటి మ్యాచ్ ఏ కారణంగానూ రద్దయ్యే అవకాశం లేదు. ఈ మ్యాచ్కు వేదిక అయిన ముల్లాన్పూర్లో వాతావరణం పూర్తి మ్యాచ్ సజావుగా సాగేందుకు అనుకూలంగా ఉంది. ఎలాంటి వర్ష సూచనలు లేవు. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ కూడా ఇదే వేదికగా జరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ వాతావరణం ఇంకా సానుకూలంగా ఉంది.
ముంబై-గుజరాత్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డును పరిశీలిస్తే.. గుజరాత్ స్పష్టమైన ఆధిక్యం కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 7 మ్యాచ్ల్లో తలపడగా.. గుజరాత్ 5, ముంబై 2 గెలిచాయి. ఈ సీజన్లో లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గుజరాతే గెలిచింది.
తుది జట్లు (అంచనా)..
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో, సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్/కర్ణ్ శర్మ
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమాన్ గిల్, కుసల్ మెండిస్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, అర్షద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ