
సింగపూర్: భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో పరాజయం పాలైంది. వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీస్లో శనివారం సాత్విక్–చిరాగ్ జంట 21–19, 10–21, 18–21తో ఆరోన్ చియా–సోహ్ యిక్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడింది. 64 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ గెలిచిన భారత జోడీ... ఆ తర్వాత రెండో గేమ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
నిర్ణయాత్మక మూడో గేమ్లో చక్కటి ప్రదర్శన కనబర్చినప్పటకీ... కీలక సమయాల్లో పాయింట్లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీకి ఇది మూడో సెమీఫైనల్ ఓటమి. అంతకుముందు ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్లోనూ ఈ జంట సెమీస్లోనే పరాజయం పాలైంది. పారిస్ ఒలింపిక్స్లో మలేసియా ప్లేయర్ల చేతిలోనే ఓడి ఇంటి బాటప్టటిన భారత షట్లర్లు ఈ సారి కూడా వారిపై విజయం సాధించలేకపోయారు.